Archive Page | Sakshi
Sakshi News home page

Business

  • భారత్‌లో బంగరానికి ఉన్న విలువ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తరాలుగా పసిడి సంపదకు గుర్తుగా ఉంటోంది. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఆరోజు పసిడి కొంటే ఆ ఏడాదంతా సంపద సొంతం అవుతుందని అనుకుంటారు. రేపు అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. అయితే బంగారాన్ని కేవలం నగల రూపంలోనే కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ మార్కెట్‌లో వివిధ మార్గాల ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

    గోల్డ్‌ ఈటీఎఫ్ (Gold ETF)‌

    ఫిజికల్ గోల్డ్ సొంతం చేసుకోవాలనే ఇబ్బంది లేకుండా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మంచి ఎంపిక. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్ ధరను ట్రాక్ చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్. షేర్ల మాదిరిగానే వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారం లేదా దానిలో కొంత భాగాన్ని సూచిస్తుంది. వీటివల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనడం, విక్రయించడం చేయవచ్చు. 

    ఫిజికల్‌ గోల్డ్‌ మాదిరిగా కాకుండా మేకింగ్ ఛార్జీలు లేదా నిల్వ ఖర్చులు ఉండవు. ధరలు నేరుగా బంగారం రేట్లతో ముడిపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా పెట్టుబడికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది. మార్కెట్‌లో చాలా స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

    డిజిటల్‌ గోల్డ్‌ (Digital Gold)

    డిజిటల్ గోల్డ్ అనేది భౌతికంగా బంగారాన్ని సొంతం చేసుకోకుండా అందులో పెట్టుబడి పెట్టడానికి ఒక ఆధునిక మార్గం. ఇది ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనడానికి, విక్రయించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసే బంగారానికి సురక్షితమైన వాల్ట్‌ల్లో నిల్వ చేసిన భౌతిక బంగారం మద్దతుగా నిలుస్తుంది. కనీసం రూ.10 నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారం నాణ్యతకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ డిజిటల్‌ గోల్ట్‌కు బీమా చేసిన వాల్ట్‌ల ద్వారా భద్రత కల్పిస్తారు. దాంతో దొంగతనం జరుగుతుందేమోనని ఆందోళన చెందనవసరం లేదు. 

    అవసరమైనప్పుడల్లా డిజిటల్ బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ లేదా క్యాష్‌గా మార్చుకోవచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్‌ఫామ్‌లతోపాటు ప్రముఖ బ్యాంకులు ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్‌గోల్డ్‌ ఆగ్మాంట్ గోల్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ పెట్టుబడులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ గోల్డ్ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు లోబడి ఉంటుంది.

    ఇదీ చదవండి: భగ్గుమంటున్న పసిడి ధరలు! తులం ఎంతంటే..

    చివరగా.. అప్పు చేసి వద్దు!

    అక్షయ తృతీయ మంచి రోజు.. ఏది కొన్నా కలిసి వస్తుందని భావించి అప్పులు చేసి మరీ బంగారం కొనేవారూ ఉన్నారు. కానీ అప్పు చేసి కొంటే రుణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనకపోయినా పర్లేదు.. ఉన్నంతలో ఆ రోజున నలుగురికి సాయపడితే.. అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు! అప్పు మాత్రం చేయకండి.

  • స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

    హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవార ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.

    చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

    దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.98,120 వద్దకు చేరింది.

    వెండి ధరలు

    బంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నిన్నటి ధరలతో వెండి ధర స్థిరంగా ఉంది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్ద నిలిచింది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • ప్రజలకు రూ.100, రూ.200 నోట్లు మరింతగా అందుబాటులో ఉండేలా ఏటీఎంలలో ఆయా డినామినేషన్‌ నోట్ల లభ్యతను మరింతగా పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. దశలవారీగా ఈ ఆదేశాలను అమలు చేయాలని బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లకు ఒక సర్క్యులర్‌లో సూచించింది. 2025 సెప్టెంబర్‌ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో కనీసం ఒక్క క్యాసెట్‌(ఏటీఎంలో డబ్బు స్టోర్‌ చేసే కంటైనర్‌)లోనైనా రూ.100 లేదా రూ.200 నోట్లు ఉండేలా చూడాలని తెలిపింది. 2026 మార్చి 31 నాటికి దీన్ని 90 శాతం ఏటీఎంలకు పెంచాలని పేర్కొంది.

    డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఫిజికల్‌ క్యాష్‌ వినియోగం తగ్గుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ నిత్యం ఫిజికల్‌ క్యాష్‌ అవసరాలు ప్రత్యేకంగా ఉంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు లభ్యతకు పెద్దపీట వేయాలని ఆర్‌బీఐ ఇటీవల బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఏటీఎంల్లో నగదు లభ్యత తగ్గడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    ఇదీ చదవండి: ప్రముఖ ఆర్థిక సంస్థల పనితీరు ఇలా..

    దేశంలో ప్రధాన ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్ అయిన  ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ పతనం అనేక బ్యాంకులకు నగదు రీఫిల్లింగ్ సేవలకు అంతరాయం కలిగించింది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఎక్కువగా అవలంబించడం వల్ల నగదుకు డిమాండ్ తగ్గింది. ఇది బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను ఆప్టిమైజ్ చేయడానికి దారితీసింది. కొత్త ఆర్‌బీఐ నిబంధనలు, ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు స్ట్రక్చర్లు ఏటీఎం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. నగదు భర్తీలో లాజిస్టిక్ సమస్యలు కూడా తాత్కాలిక కొరతకు కారణం అవుతున్నాయి.

Sports

  • ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్‌ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.

    వైభవ్‌ సాధించిన రికార్డులు..
    ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)
    ఐపీఎల్‌లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) తర్వాత)
    ఐపీఎల్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
    ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్‌తో కలిసి)
    టీ20 క్రికెట్‌ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
    ఐపీఎల్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
    ఐపీఎల్‌ 2025లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (17 బంతుల్లో)
    ఐపీఎల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడు

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

    అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. వైభవ్‌ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్‌ గెలుపులో వైభవ్‌తో పాటు మరో ఓపెనర్‌  యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.

    మ్యాచ్‌ అనంతరం వైభవ్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్‌లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్‌లోనే సాకారం చేసుకున్నాను. సీజన్‌ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్‌లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్‌ చేస్తాడు.  ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.

    కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్‌ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్‌ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

     

  • ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో వైభవ్‌ చాలా రికార్డులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది. 

    రాయల్స్‌ గెలుపులో వైభవ్‌లో పాటు (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) మరో ఓపెనర్‌  యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.

    అంతకుముందు  శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

    ఈ మ్యాచ్‌లో వైభవ్‌ సృష్టించిన బీభత్సం పొట్టి క్రికెట్‌ బ్రతికున్నంతవరకు గుర్తుంటుంది. వైభవ్‌ కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ చేసిన విలయ తాండవాన్ని క్రికెట్‌ అభిమానులు ఎన్నటికి మర్చిపోరు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత వైభవ్‌పై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాల బుగ్గల కుర్రాడు ఇలాంటి విలయాన్ని సృష్టించడమేంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

    నిన్నటి మ్యాచ్‌ తర్వాత అందరి లాగే రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ కూడా వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్‌ మాటల్లో.. ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము వైభవ్‌తో 2 నెలలు గడిపాము. అతను ఏమి చేయగలడో చూశాము. మాకందరికీ తెలుసు వైభవ్‌ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ వస్తుందని. ప్రపంచ స్థాయి బౌలర్లైన గుజరాత్‌ బౌలర్లపై వైభవ్‌ సృష్టించిన బీభత్సకాండను మాటల్లో వర్ణించలేను.

    గత మూడు మ్యాచ్‌ల్లో స్వయంకృతాపరాధాల చేత చివరి నిమిషంలో మ్యాచ్‌లు కోల్పోయాము. ఈ మ్యాచ్‌లో అలా జరగకూడదనే మా ఆటతీరును మార్చాము. వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాము. ఈ ఫలితం కోసం మేము చాలా కష్టపడ్డాము. మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలిగాము. 

    ఐపీఎల్‌లో ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రయాణం. సూర్య భాయ్ ఆటతీరు. ఇలా చాలా విషయాలను గమనిస్తున్నాము. ఈ విజయం చాలా పెద్దది. ఇలాంటి విజయాల కోసమే మేము అన్వేషిస్తున్నాము. ఈ విజయం ఏకపక్షంగా వచ్చింది. ఇది చాలా సంతోషాన్నిస్తుంది. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వికెట్‌ లభిస్తుందో చూడాలి. 
     

  • ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్‌ మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ రికార్డుల్లోకెక్కాడు.

    ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్‌.. రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా, రాజస్థాన్‌ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.  

    ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్‌ రాయల్స్‌కే ఆడుతున్న జైస్వాల్‌.. 62 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ముందు రాయల్స్‌ తరఫున సంజూ శాంసన్‌ (3966), జోస్‌ బట్లర్‌ (3055), అజింక్య రహానే (2810), షేన్‌ వాట్సన్‌ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.

    ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు
    క్రిస్‌ గేల్‌- 48 ఇన్నింగ్స్‌ల్లో
    షాన్‌ మార్ష్‌- 52
    రుతురాజ్‌ గైక్వాడ్‌- 57
    కేఎల్‌ రాహుల్‌- 60
    యశస్వి జైస్వాల్‌- 62

    మ్యాచ్‌ విషయానికొస్తే.. గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్‌ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్‌ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్‌ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

    అంతకుముందు  శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

     

Guest Columns

  • మనిషన్నాక బాధ్యత ఉండాలి.. సిగ్గుండాలి.. పిల్లలు పెరుగుతున్నారు.. ఒక గూడు ఉండాలన్న భయం... ఒక అది.. ఒక ఇది లేదు.. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేలా ఉంటే ఎలా.. చుట్టూ ఉన్నోళ్లు ఎలా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం.. వాళ్ళ కుటుంబాలు చూడు ఎంత కంఫర్ట్ ఉన్నాయి.. నువ్వూ ఉన్నావు.. సిగ్గులేని మనిషి... సిగ్గులేని జన్మ అంటూ భార్య నోరాపకుండా తిడుతూనే ఉంది. 

    ఒసేయ్.. నేను మనిషిని అని ఎవరన్నారు.. కాదు.. ఐన ఒకరితో నన్ను పోల్చకు.. ఇన్నేళ్ళకాపురంలో నిన్ను బిడ్డల్ని సరిగా చూశానా లేదా.. మీ అమ్మానాన్నను కాదని నన్ను నువ్వు ప్రేమించి ఎగిరిపోయి వచ్చినపుడే నిన్ను గుండెల్లో గూడు కట్టి చూసుకున్నాను అన్నాడు భర్త. ఓరి నా తింగరి మొగుడా.. గుండెల్లో కాదురా.. బయట కట్టాలి గూడు.. ముందు ఆ పని చూడు అని మళ్ళీ మురిపెంగా కసిరింది ముద్దులుపెళ్ళాం.. సరే రెండ్రోజుల్లో సైట్ చూసి మెటీరియల్ డంప్ చేసేద్దాం.. వారంలో ఇల్లు రెడీ అన్నాడు.. మొత్తానికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్లాట్ ఫిక్స్ చేసారు..

    గూటి కోసం ప్లాట్ ఫిక్స్ చేస్తామని చెప్పిన మొగుడుగారు.. ఏకంగా మా స్కూటీని తీసుకొచ్చి పెళ్ళానికి చూపించినట్లున్నాడు.. బయటెక్కడినా ఐతే ఎండ. పైగా శత్రుభయం .. ఈ స్కూటీ డిక్కీ ఐతే నీడ.. పైగా సేఫ్.. అందుకే ఇక్కడకు ఇద్దరూ ఫిక్షయారు .. అయ్యో.. పనికిమాలిన మొగుడు అనుకున్నాను కానీ తెలివైనవాడే.. మంచి సైట్ చూసాడు అని కిచకిచలాడింది.. పెళ్ళాం పిచ్చుక.. మొత్తానికి రెండ్రోజుల్లో కొన్ని చిన్న పుల్లలు. ఎండుగడ్డివంటిది తెచ్చి పెట్టారు.. ఇదేంటి అనుకుంటి తీసేసి పక్కన పడేసినా మళ్ళీ రెండ్రోజుల్లో ఇద్దరూ కలిపి మొత్తం డిక్కీ సగం నింపేశారు. పోన్లే ఏమవుతుందో అని జాలితో డిక్కీని. బండికి ముట్టుకోకుండా వదిలేశాం. నెలరోజులు బండి ముట్టుకోకపోతే బ్యాటరీ పోతుందేమో. మళ్ళా స్టార్ట్ అవ్వదేమో అనే చర్చ వచ్చినా.. పోన్లే ఒక పక్షి కుటుంబానికి ఆసరాగా నిలిచాం చాలు అనే భావనతో బండి అలాగే వదిలేశాం...

    నాలుగు రోజుల్లో దానిలో రెండు గుడ్లు పెట్టింది.. దానికి కాపలాగా తల్లి అక్కడే స్కూటీ దగ్గర్లో ఉంటే తండ్రి ఎక్కడెక్కడికో తిరిగి ఏదేదో తెచ్చిపెట్టేవాడు.  అన్యోన్య దాంపత్యం.. ఒక్కోరోజు రెండూ ఆ స్కూటీ దగ్గర్లోనే కూర్చు బహుశా పిల్లల భవిష్యత్ గురించి కావచ్చు కిచకిచలతో చర్చలు పెట్టేవి.. అరుదైన నల్ల పిచ్చుకలు. కంఠం వద్ద ఎర్రని జీర.. చూస్తుంటే ముచ్చటేస్తుంది.. అపురూపమైన కాపురాన్ని చూడాలనిపించి నెలరోజులు స్కూటీ కదపలేదు..  నాలుగురోజుల తరువాత డిక్కీ చూస్తే కళ్ళు తెరవని రెండు చిన్న జీవులు వచ్చి చేరాయి.. ఆ చిన్న దంపతుల ఆనందానికి అంతులేదు.. రోజూ ఆ స్కూటీ దారిలోనే తిరుగుతూ ఎవరైనా అక్కడికి వస్తే చాలు  భయంతో అరిచేవి.. జీవి చిన్నదే కావచ్చు..  

    తల్లిదండ్రుల ప్రేమ అనంతం కదా.. అందుకే బిడ్డల కోసం వాటి ఆరాటం.. రోజూ తిరిగి ఏదేదో పురుగులు. నీళ్లు తెచ్చి బిడ్డలకు పోస్తుండేది తల్లి.. అలా పదిరోజులు గడిచాక చిన్నగా రెక్కలొచ్చి పిచ్చుకలు ఎగిరిపోయాయి.. తల్లి పిచ్చుక మళ్ళీ అక్కడే తిరుగుతోంది... ఇక మీ గెస్ట్ హౌస్ వదలండి.. అన్నట్లుగా నేను బండి తీసి స్టార్ట్ చేయబోతే ..ఉహు.. మొరాయించింది..  షెడ్డుకు తీసుకెళ్తే వెయ్యి వదిలింది.. పొతే పోనీ.. ఒక గువ్వల జంటకు నెలకు ఫ్రీగా ఆశ్రయం ఇచ్చాను అనిపించింది. 

    :::సిమ్మాదిరప్పన్న

Family

  • వినసొంపైన సంగీతం వినబడితే శరీరం అప్రయత్నంగా లయ బద్ధంగా కదులుతుంది. దానినే ‘నృత్యం’ అంటారు. 1760లో రచయిత, ఆధునిక ఫ్రెంచ్‌ నృత్య నాటికల సృష్టికర్త అయిన జీన్‌ జార్జెస్‌ నోవెర్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని యునెస్కో ఏప్రిల్‌ 29ని ‘అంత ర్జాతీయ నృత్య దినోత్సవం’గా ప్రకటించింది. నృత్య కళారూపాలను నివేదించడానికీ; ప్రపంచీకరణను, రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులను అధిగమించడానికీ... నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికీ కృషి చేయడం ఈ దినోత్సవ లక్ష్యం. ఇంట ర్నేషనల్‌ డ్యాన్స్‌ కమిటీ ప్రవేశపత్రం ఆధారంగా ప్రతీ ఏటా ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడిని ఎంపిక చేసి ఆ రోజు వారి సందేశాన్ని అందించడానికి ఆహ్వానిస్తారు. 

    ఆదిమ సంస్కృతికి చిహ్నం
    నృత్యం. అదివాసీలు ప్రకృతిని, సూర్యుని, చంద్రుని దేవుళ్ళుగా భావించేవారు. కొన్ని తెగల వారు ప్రత్యేకించి (గోత్రం పరంగా) కొన్ని జంతువులను మాత్రమే దేవుళ్ళుగా పూజిస్తూ వాటి మాంసాన్ని ముట్టరు. రాతి యుగం నాటి ఫ్రాన్స్, స్పెయిన్, ఇండియా వంటి దేశాలలోని కొండ గుహలలో ఆదిమ మానవుల వేట, నాట్యం, దృశ్యాలు కన్పిస్తున్నాయి. వీటిని బట్టి ఆదిమ కాలం నుండి నాట్యం అనేది ప్రస్తుత మానవునికి వారసత్వంగా లభించిందని చెప్పవచ్చు.  

    నృత్యం లేకుండా ఆదివాసీలలో ఏ సంబురాలూ జరుగవు. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆదిమ తెగలలో థింసా, గుస్సాడీ, రేలా, దండారీ, కొమ్ము నృత్యాలు ప్రసిద్ధి. అయితే భరతనాట్యం, కూపూడి, ఒడిస్సీ, మణిపురి, మోహినీ ఆట్టం వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలుగా పిలిచేవాటికే ప్రపంచవ్యాప్తంగా మం గుర్తింపు ఉంది. భారతీయ నాట్య ప్రపంచంలో చిందు బాగోతుల వారు ఆడే ఆట, పులినృత్యం వంటి ఎన్నో జానపద నృత్యాలూ ఉన్నాయి. అయితే అనేక నృత్య రీతులు ఇప్పుడు కనుమరుగవ్వడం విచారకరం. భారతీయ
    సంస్కృతి -సంప్రదాయాలలో భాగమైన నృత్యకళను రక్షించుకోవా లంటే సంబంధిత నృత్య కళాకారులకు ప్రభుత్వం సరైన జీవనభృతి కల్పించాలి.

    – గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత 
    (నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం)

  • వెర్రి వెయ్యి రకాలు, పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి వంటి సామెతలు తామరతంపరగా గుర్తుకొస్తాయి ఈ మహిళను చూస్తే. ఇదేం పిచ్చి ఈమెకు అనే ఫీలింగ్‌ వచ్చేస్తుంటుంది. అరే అందంగానే ఉంది కదా..మళ్లీ ఇదేం ఆలోచన అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు ఆమె చేసిన ఘనకార్యం చూసి. డబ్బులు ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయేమో కాబోలు అంటున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే.. 

    పిల్లిలా కనిపించాలనే అనే పబ్లిసిటీ స్టంట్‌కి శ్రీకారం చుట్టింది ఆస్ట్రేలియాలోని గోల్‌కోస్ట్‌కు చెందిన జోలీన్ డాసన్(29). సాధ్యాసాధ్యాలు గురించి ఆలోచించకుండా కాస్మెటిక్ సర్జరీకి రెడీ అయిపోయింది. ఆ సర్జరీ ఆమెకు చుక్కలు చూపించింది. ఆ ప్రచార స్టంట్‌ తెచ్చిన తంట అంత ఇంత కాదు..!. ఏకంగా ఆరు లక్షలు పైనే ఖర్చు చేసి మరీ కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకుంది డాసిన్‌. 

    ఏదైనా తేడా కొడుతుందేమోనని అనుమానపడింది. ఆ అనుమానమే నిజమై పడరాని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ సర్జరీ వికటించి దుష్ప్రభావాలు చూపించడం ప్రారంభించింది. పిల్లిలా కనిపించేందుకు చెంపలను తొలగించే సర్జరీ ఆమెకు తీవ్రమైన నొప్పిని, బాధని కలిగించింది. అంతలా బాధ భరించిన సర్జరీ సక్సెస్‌ అవ్వకపోగా..శరీరం దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. 

    అలానే ఆమె ఆకృతి పిల్లిలా మారలేదు కదా..కింది ముఖం రూపురేఖలు దారుణంగా మారిపోయాయి. అయ్యిందేదో అయ్యిందేలా అని ఆ రూపాన్నే కొనసాగిద్దామని చికిత్సలు తీసుకున్నా..యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఊహించని దుష్ప్రభావాలకు తలెత్తాయి. దీంతో ఆమె పిల్లి ఆకృతి కోసం అమర్చిన  ఫిల్లర్లు, ఇంప్లాంట్‌లను తొలగించుకుంది. 

    కనీసం ఇప్పుడైనా.. తన పరిస్థితి మెరుగ్గా ఉంటుందేమోనని ఆశిస్తున్నా..అని బాధగా చెప్పుకొచ్చింది. తన చేయాలనుకున్న స్టంట్‌ ఎంత మతిలేని పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేగాదు తనలా ఎవరూ ఇలాంటి చెత్త ప్రయోగాల జోలికి అస్సలు వెళ్లొద్దని సూచిస్తోంది కూడా. పెద్దలు చెబుతుంటారే..సవరం అయ్యాక గానీ వివరం రాదంటే ఇదేనేమో..!. లోతు పాతులు..కష్టనష్టాలు బేరీజు వేసుకుని ఏ స్టంట్‌కైనా లేదా ఏ పనికైనా.. పూనుకోవాలి లేదంటే అంతే సంగతులు..

    (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్‌ స్టోరీ ఇదే..!)

     

  • వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్‌ 2025 (Indian Premier League 2025)  సీజన్‌లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్.  రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు  కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్‌ తో స్టార్‌గా మారిపోయాడు వైభవ.   తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది.   వైభవ్‌ సక్సెస్‌ జన్నీ ఎలా సాగింది,  దేశంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు  వైభవ్‌ కుటుంబం చేసిన త్యాగం,  కృషి ఏంటి అనేది నెట్టింట  చర్చకు దారి తీసింది.

    వైభవ్‌  తండ్రి త్యాగం, పట్టుదల
    14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.  దీంతో  యువ క్రికెటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి.

     కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్‌, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడు
    వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్‌లోని తాజ్‌పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ.  నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్‌ అయిన  సంజీవ్ సూర్యవంశీ ‌ గుర్తించాడు. అంతే  తనకున్న కొద్దిపాటి  స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు.  స్వయంగా  ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్‌ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్‌కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్‌. 

    అంతేకాదు  కొడుకును  క్రికెటర్‌గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్‌.  అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా  శిక్షణలో మరింత రాటు దేలాడు.  అలా గత  ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్  అతి పిన్న వయస్కుడైన క్రికెటర్  ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్‌ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్‌కు కొడుకునని  సంతోషంగా ప్రకటించారు  తండ్రి సంజీవ్‌.

     

    చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్‌

    డోరేమాన్  నుంచి 13  ఏళ్లకే కోటీశ్వరుడుగా
    తాను కష్టపడి పనిచేసి వైభవ్‌కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్‌. చిన్నపుడు డోరేమాన్‌ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్‌ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్‌లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్‌కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ  భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్‌ను క్రికెటర్‌గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.

     IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్  వైభవ్‌ను రూ. 1.10 కోట్లు  వెచ్చింది.   ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌ నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ట్రయల్స్‌ క్యాంప్‌లో సత్తా చాటుకున్నాడు.  చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్‌ అప్పుడే  బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును  లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్‌ సిక్స్‌కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ.  ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు.  అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు.  అందుకే యావత్‌ క్రికెట్‌  అభిమానులు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ అభినందిస్తున్నారు.

     

  • ,

    గ్లోరియస్‌ మిస్‌ అండ్‌ మిసెస్‌ ఇండియా, రాయల్‌ మిస్టర్‌ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ సోమాజీగూడలోని ది పార్కు హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ బిల్డింగ్స్‌లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్స్‌ స్నేహల్‌తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. 

    జేసీఐ సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ మద్దతులో ఎస్‌ఎస్‌కే క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో గ్లోరియస్‌ మిస్‌ అండ్‌ మిసెస్‌ ఇండియా, రాయల్‌ మిస్టర్‌ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్‌ అని పేర్కొన్నారు. 

    ఉమంగ్‌ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్‌వ్యాక్‌ చేసి ఆకట్టుకున్నారు.   

    (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్‌ స్టోరీ ఇదే..!)

  • ఆభరణం అంటే మగువల అందాన్ని పెంచడానికి విభిన్న సృజనాత్మక రూపాల్లో తయారు చేయడమే. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో ఆభరణాల ప్రపంచంలో ఒక కొత్త ధోరణి చెలామణి అవుతోంది. ‘థీమ్‌ ఆధారిత ఆభరణాలు’ అనే ఈ ట్రెండ్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. హైదరాబాద్‌ నగరంలో కూడా ఇది విస్తృతంగా ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ప్రకృతి, ఋతువుల సౌందర్యానికి ప్రతిగా రూపొందించిన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ప్రముఖ ఆభరణ బ్రాండ్లు ఈ కొత్త ధోరణిని స్వీకరించి, ప్రతి ఆభరణంలోనూ ప్రకృతి సౌందర్యాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని బ్రాండ్‌లు ప్రత్యేకంగా రూపొందించిన కళాఖండాలు, కశ్మీర్‌ ఋతువుల మాయాజాలాన్ని ప్రతిబింబిస్తూ మార్కెట్‌లోకి వస్తున్నాయి. అది బంగారమా, వజ్రమా అనే తేడా లేకుండా వ్యాపార విలువతో పాటు ఆభరణంలోని థీమ్‌ను, వైవిధ్యాన్ని, వినూతనత్వాన్ని ఆస్వాదిస్తున్నారు నగరవాసులు.  

    ఆభరణాల తయారీలోని హస్తకళ వైవిధ్యానికి థీమ్‌ ఆధారిత జ్యువెలరీ మరింత హంగులను అద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని ఆభరణ సౌందర్యాలు. ఋతువుల కవిత్వం తాకిన కళ.. ‘ఈ లోయ గుండా నడిచిన ప్రతిసారీ, ఋతువులు తమ పాటలు పాడతాయి’ అనే భావనతో ఒక కవిత్వ సృష్టిలాంటి ఆభరణాలు అలరిస్తున్నాయి. 

    చినార్‌ ఆకుల నృత్యం నుంచి మంచుతో కప్పబడిన పైన్‌ చెట్ల పరవశం వరకూ ప్రతి ఆభరణం ప్రకృతి గాథను చెబుతోంది. శరదృతువులో చినార్‌ ఆకులు గాలిలో ఊగే తీరు, తెల్లటి మంచుతో అలంకరించిన దృశ్యాలను ప్రతిబింబించే చెవిపోగులు, లాకెట్లు, రౌండ్‌ కట్‌లో తెల్ల వజ్రాలతో తయారైన కశీ్మర్‌ శీతాకాలపు నిర్మలత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.  

    ప్రకృతిని ధరించే సోయగాలు.. 
    ఈ కొత్త థీమ్‌ ఆధారిత ఆభరణాలు ప్రకృతిని మించిన అందాలుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఋతువుల స్వభావాన్ని, కశీ్మర్‌ వంటి సుందర ప్రదేశాలను ప్రతిబింబించేలా తయారు చేస్తున్న ఆభరణాలు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. అధునాతన సంప్రదాయానికి వినూతనత్వాన్ని జోడిస్తున్న ఈ కళాఖండాలు ప్రస్తుత జీవన శైలి, ఫ్యాషన్‌ ప్రపంచానికి ప్రకృతితో కూడిన కొత్త పంథాను పరిచయం చేస్తున్నాయి. 

    శీతాకాలపు అందాల్లో మునిగిపోయిన పైన్‌ చెట్లు, కిరణాలపై మెరిసే వజ్రాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన నెక్లెస్‌లు, చెవిపోగులు శీతాకాలపు సౌందర్యానికి నిదర్శనంగా తయారు చేస్తున్నారు. నెమ్మదిగా వెలిసే శీతాకాలం మొదలు వికసించే వసంతానికి మధ్య మార్పును చూపించే ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

    వసంతపు వర్ణ విహారం.. 
    వసంత ఋతువులో కశీ్మర్‌ లోయను అలంకరించే తులిప్‌ పువ్వుల కాంతిని పసుపు వజ్రాలు, గులాబీ క్వార్‌ట్ట్జ రత్నాలతో తయారు చేసినట్టుగా ప్రతిబింబిస్తున్నాయి. తులిప్‌ పువ్వుల వర్ణాలను దృశ్యాన్ని చేస్తున్నట్లుగా చెవిపోగులు, నెక్లెస్‌లు ప్రతి రూపంలో ప్రకృతి ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. 

    సృష్టి కథను ఆభరణాల్లో వర్ణిస్తూ.. 
    ‘ఇప్పటికీ మిగిలి ఉన్న స్వర్గం’ అనే భావన ఆధారంగా రూపొందించిన ఈ కొన్ని కలెక్షన్‌ కశీ్మర్‌ లోయల శాశ్వత అందాన్ని మిళితం చేస్తూ అందమైన కథగా చెబుతున్నాయి. బంగారం పై తయారు చేసిన చినార్‌ ఆకులు, వజ్రాల కాంతిలో మెరిసే తులిప్‌ పువ్వులు, కాలానికి అర్థం చెప్పకనే చెబుతున్నాయి. 

    మై ఎంబ్రేస్‌.. మగువల ఆలోచనలు.. 
    ప్రస్తుత తరుణంలో ఆభరణాలను అందం కోసమే కాకుండా ఒక కళాత్మక జీవనానికి నిదర్శనంగా ధరిస్తున్నారు మగువలు. దీనికి అనుగుణంగానే ఆభరణాల తయారీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే జోయా ఆధ్వర్యంలో మై ఎంబ్రేస్‌ అనే థీమ్‌తో.. సాధారణంగా మహిళలు జీవితంలో ఎన్ని పాత్రలు పోషించినా, వారి జీవితానికి పరమార్థంగా ‘తనను తాను ఆలింగనం చేసుకునేలా’ అందమైన జ్యువెలరీ రూపొందించాం. 

    మగువ ఆలోచనలు, ఆనందాలు సార్థకం అయ్యేలా తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకునేలా సృష్టించిన ఈ ఆభరణాలు నగరంలోని జ్యువెల్‌ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి.  – అమన్‌ప్రీత్‌ అహ్లువాలియా, జోయా బిజినెస్‌ హెడ్‌ 

    (చదవండి: ఖాదీ కమ్‌ బ్యాక్‌)

International

  • టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్‌ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్‌ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.

    ‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం  తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్‌ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.

    అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్‌లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్‌ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

    ఈ ఏడాది జనవరిలో జస్టిన్‌ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్‌ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్‌ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

    ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్‌ కార్నీ?

  • ,

    ఇస్లామాబాద్‌: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్‌ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్‌ వణికిపోతోంది. తమపై భారత్‌ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన​్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్‌కోట్‌ ప్రాంతానికి పాక్‌ సైన్యం తన రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.

    ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్‌ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్‌కు టెన్షన్‌ మొదలైంది. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్‌’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్‌ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.

    కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు..  సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.

    ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్‌ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

    మునీర్‌ ఎక్కడ?
    మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ అసిమ్‌ మునీర్‌ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్‌ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్‌ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్‌ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్‌ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్‌ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి

  • ఒట్టావా:  కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక సైనీ(Vanshika Saini) మిస్సింగ్‌ కేసు విషాదాంతంగా ముగిసింది. స్థానికంగా ఓ బీచ్‌లో ఆమె శవమై కనిపించింది. ఆమె మృతదేహాన్ని రికవరీ చేసుకున్న స్థానిక పోలీసులు.. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషన్‌ ధ్రువీకరిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించింది.

    వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌ ఆప్‌ నేత దేవిందర్‌ సింగ్‌ కుమార్తె వంశిక. ఆమె రెండున్నరేళ్ల కిందట డిప్లోమా కోర్సు కోసం కెనడా  వెళ్లింది. ఏప్రిల్‌ 25వ తేదీన అద్దె ఇంటిని వెతికేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఆమె నుంచి రెండు రోజులు ఫోన్‌ కాల్‌ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులకు కాల్‌ చేశారు. వాళ్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 28వ తేదీన ఆమె మృతదేహం ఒట్టావా  బీచ్‌ వద్ద లభ్యమైంది.

    ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే అంశంతో పాటు ఈ కేసులో స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.

    ఇదిలా ఉంటే.. ఇటీవల కెనడాలో భారతీయ విద్యార్థుల మరణాలు పెరిగిపోయాయి. తాజాగా.. గ్యాంగ్‌ వార్‌లో భాగంగా జరిగిన కాల్పుల్లో.. బస్టాప్‌లో వేచి చూస్తున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని హర్‌ సిమ్రత్‌ రంధావా బుల్లెట్‌ తగిలి అనూహ్యంగా చనిపోయింది. కొన్నాళ్ల కిందట.. రాక్‌లాండ్‌ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh

  • తిరుపతి: నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్న హెచ్‌ఐజీ భవనం పైనుంచి కిందపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. 

  • విజయవాడ, సాక్షి: వైఎస్సార్‌సీపీ హయాంలో పని చేసిన అధికారులపై కూటమి సర్కార్‌ రెడ్‌బుక్‌ ప్రయోగం మామూలుగా జరగడం లేదు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముంబై నటి జత్వానీ కేసులో ఆయనకు బెయిల్‌ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఆయన బయటకు రాకుండా ఉండేందుకు మరో కేసు నమోదు చేయించింది. 

    గతంలో.. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్షలలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కొత్త అభియోగాలను తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో విజయవాడ సూర్యారావు పేట పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యింది.  సీఎస్‌తో ఆదేశాలు జారీ చేయించి మరీ విచారణ జరిపిస్తోంది. 

    PSRపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు

    ఆంజనేయులిపై కూటమి కుట్రలను వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ హయాంలో పని చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని.. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ మరీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఇతర నేతలు ఖండిస్తూ వస్తున్నారు. 

    ఇదీ చదవండి: ఫేక్‌న్యూస్‌ ఫ్యాక్టరీలతో చంద్రబాబు చేస్తోంది ఇదే!

Telangana

  • పెద్దపల్లిరూరల్‌: అక్రమసంబంధం నేపథ్యంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని జీర్ణించుకోలేక.. ఈ విషయమై కొంతకాలంగా సదరు యువకుడితో గొడవ జరుగుతున్నా.. అతడిలో మార్పు రాకపోవడం.. తను కాదంటున్న వెంట పడుతున్నాడంటూ భార్య చెప్పడంతో రగిలిపోయిన భర్త.. మాట్లాడుకుందాం రా.. అని పిలిచి కిరాతకంగా చంపేశాడు. 

    పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్‌(35) తన భార్య అనిత, ముగ్గురు పిల్లలతో పెద్దపల్లిలోనే నివాసముంటూ ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్‌కుమార్‌కు కుమార్‌ భార్య అనిత పినతల్లి కూతురు శైలజతో పెళ్లయింది. వరసకు మరదలు అయ్యే శైలజతో కుమార్‌ చనువుగా మెదలుతుండడాన్ని సంతోష్‌ తట్టుకోలేక పోయాడు. 

    ఈ విషయమై కుమార్‌తో గొడవకు దిగాడు. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కుమార్‌ ప్రవర్తనలో తేడా కనిపించలేదు. తన భార్య శైలజను నిలదీయడంతో తను కాదంటున్న వెంటపడుతూ వేధిస్తున్నాడంటూ చెప్పడంతో సంతోష్‌లో కోపం ఉగ్రస్థాయికి చేరింది. ఈక్రమంలో సోమవారం సంతోష్‌ ‘మాట్లాడుకుందాం రా’ అని కుమార్‌ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు పిలిచాడు. మార్కెట్‌ యార్డు ఆవరణలో తన భార్య, అక్కడున్నవారు చూస్తుండగానే కుమార్‌ను సంతోష్‌ కత్తితో నరికిచంపాడు. ఘటన స్థలాన్ని డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్‌ పరిశీలించారు.

    రమ్మని పిలిచి చంపేశారు..
    పొలం కుమార్‌ ఇంట్లో ఉండగా సంతోష్‌కుమార్, శైలజ నుంచి ఫోన్‌ వచ్చిందని మృతుడి భార్య అనిత తెలిపింది. వెంటనే బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని అడిగితే ‘సంతోష్, శైలజ తనతో మాట్లాడుతారట. వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రమ్మంటున్నారు’. అని బయటకు వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోయాడని రోదించింది. శైలజ తన భర్తతో చనువుగా ఉంటూ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు వెంట పడుతున్నాడంటూ చెప్పి కోపం పెరిగేలా చేసిందని పేర్కొంది. అక్రమసంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను దారుణంగా చంపారని విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
     

  • అబ్దుల్లాపూర్‌మెట్‌(రంగారెడ్డి జిల్లా): ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయింది. పోలీసులు, బాధి త కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడకు చెందిన బండారి శ్యామ్‌సుందర్, మహేశ్వరి దంపతుల కూతురు తన్విక (4) ఆదివారం సాయంత్రం వేరుశనగ కాయలు తింటుండగా.. ప్రమాదవశాత్తు ఓ కాయ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. దీంతో శ్వాస తీసుకునేందుకు చిన్నారి ఆయాస పడింది.

     వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయించిన వైద్యులు తని్వక ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్‌ ద్వారా తొలగించాలని సూచించడంతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. సోమవారం శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం 7.55 గంటల సమయంలో బాలిక మృతిచెందింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Movies

  • ఇది వేసవి సూర్యుడు ప్రచండ భానుడై ప్రతాపం చూపే సమయం. దాంతో జనమంతా చల్లని పానీయాలకు జై కొట్టే సమయం. సాధారణంగానే కూల్‌ డ్రింక్స్‌ అమ్మకాలు పీక్స్‌లో ఉండే ఈ టైమ్‌లో అత్యధిక వ్యాపారాన్ని దక్కించుకోవాలని కోలా బ్రాండ్స్‌ తహతహలాడుతాయి.  రకరకాల ప్రకటనల ద్వారా దాహార్తి నిండిన గొంతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. దాంతో ఈ సీజన్‌ ఆసాంతం ప్రకటనల ‘కోలా’హలంతో నిండిపోతుంది.

    వేసవి వచ్చినప్పుడల్లా కూల్‌ డ్రింక్స్‌ బ్రాండ్స్‌ మధ్య ఆధిపత్య పోరు ఆటోమేటిక్‌గా వేడెక్కడం కోలా కంపెనీల్లో రివాజు. అది ఈ సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సారి ఆధిపత్య పోరు బ్రాండ్స్‌తో ఆగేటట్టుగా లేదు. ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్‌ అగ్రనటుల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు దీనికి జతయ్యేట్టుగా ఉంది. దానికి కారణం పుష్ప, పెద్దిలే...అదేనండీ.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లే.

    పుష్ప తో ఆల్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని ఎన్నో కంపెనీలు ఉవ్విళ్లూరాయి. అదే క్రమంలో ప్రముఖ కూల్‌ డ్రింక్‌ బ్రాండ్‌ థమ్స్‌ అప్‌ తన దక్షిణాది బ్రాండ్‌ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌ ని ఎంచుకుంది. పుష్పరాజ్‌తో... చాలా ఉత్తేజకరమైన ఎనర్జిటిక్‌ వీడియోలను తయారు చేసి విడుదల చేసింది. అవి బాగా జనంలోకి దూసుకెళ్లాయి కూడా. అయితే ఇప్పుడు థమ్స్‌ అప్‌కి ప్రత్యర్ధిగా ఉన్న క్యాంపా కోలా...బన్నీకి ధీటైన మరో నటుడి గురించి సాగించిన అన్వేషణ  మరో టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ దగ్గర ఆగింది. తాజా ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఈ కోలా బ్రాండ్‌ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది.

    ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్‌ స్టార్‌ అనిపించుకున్న రామ్‌చరణ్‌ (Ram Charan) ను క్యాంపాకోలా తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం కూల్‌గా మాట్లాడుకోవాల్సిన కూల్‌ టాపిక్‌ను వేడి వేడిచర్చలకు కేంద్ర బిందువైన హాట్‌ టాపిక్‌గా మార్చింది.

    ప్రస్తుతం మెగా , అల్లు కుటుంబాల బంధం మధ్య బన్నీ, చెర్రీలనే అడ్డుగీతలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌ పరస్పరం ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనడం చాలా చిన్నమాట. బయటకు చెప్పకున్నా, సోషల్‌ మీడియాలో అన్‌ఫాలోల దగ్గర నుంచి ఫాలోయర్స్, ఫ్యాన్స్‌ మధ్య సాగుతున్న మాటల యుద్ధం వరకూ బన్నీ, చెర్రీల వార్‌... గట్టిగా నడుస్తూనే ఉంది. 

    ఈ నేపధ్యంలో రెండు బలమైన కూల్‌ డ్రింక్‌ బ్రాండ్స్‌ కాంపా కోలా, థమ్స్‌ అప్‌ లకు  వారు అంబాసిడర్‌లుగా ఎంపిక కావడంతో ఈ వైరం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ రెండు బ్రాండ్స్‌ భవిష్యత్తులో రూపొందించే ప్రకటనలు ఫ్యాన్స్‌ మధ్య ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాయో.. ఎంత హీట్‌ తెస్తాయో.....చూడాలి.

    మరోవైపు క్యాంపా కోలా ప్రకటనలు రామ్‌ చరణ్‌ స్టార్‌ స్టేటస్‌పై ఎక్కువగా ఆధారపడి రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మగధీర, ఆర్‌ఆర్‌ఆర్‌  లలోని ప్రసిద్ధ సినిమా సన్నివేశాలను ఇవి వాడుకుంటున్నాయి.

  • ,

    తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌పై డీఎంకే నేత‌, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డీఎంకే పార్టీ మాత్రమేనని విజయ్‌ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేస్తున్నారు కూడా..  అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్‌ పలు వేదికలపై చెబుతున్నారు. దీంతో డీఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్‌ పార్టీ గురించి మంత్రి పన్నీర్‌ సెల్వం కామెంట్స్‌ చేశారు. 'బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు (రెమ్యునరేషన్‌) అంతా  బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే.' అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్‌ పార్టీ (TVK) అంటే ఏంటి..?  దానికి సమాధానం చెప్పాలని జ‌న‌స‌మూహాన్ని  పన్నీర్‌ సెల్వం కోరారు. వెంటనే వారు (T-త్రిష, V- విజయ్‌, K- కీర్తి సురేష్‌) అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.

    రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అంత సులభం అనుకుంటున్నారా.? అని మంత్రి ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే పార్టీతో స్టాలిన్‌ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లీడర్‌గా స్టాలిన్‌ ఉన్నారని జాతీయ స్థాయి సర్వేలు కూడా తేల్చేశాయి. తర్వాతి రెండో స్థానంలో విజయ్‌ పార్టీ ఉందని ఆ సర్వేలు చెప్పాయి. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2026 ఎన్నికల్లో విజయ్‌తో స్టాలిన్‌కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది.

National

  • కర్ణాటక: మొబైల్‌ ఫోన్‌ ఎక్కువ వాడొద్దని చెప్పిన భర్తపై భార్య కత్తితో దాడిచేసింది.  ఈ ఘటన విజయపురలోని హాలకుంటె నగరంలో చోటు చేసుకుంది. గ్రామంలో అజిత్‌ రాథోడ్, తేజు రాథోడ్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. తేజు రాథోడ్‌ నిత్యం సెల్‌ఫోన్‌ చూస్తుండేది. గమనించిన భర్త మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకుంది.

     ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భర్త గాఢ నిద్రలో ఉండగా మెడ భాగంలో కత్తితో దాడి చేసింది. బాధితుడి కేకలు విన్న  కుటుంబ సభ్యులు ఆయన్ను బీఎల్‌డీఈ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదర్శనగర్‌ పోలీసులు తేజు రాథోడ్‌ను అదుపులోకి తీసుకొని  విచారణ చేపట్టారు.   

    చోరీ సొత్తు అప్పగింత 
    రాయచూరు రూరల్‌:   ఆటోలో మరచిపోయిన నగలను పోలసులు రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. శక్తినగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 22 న బస్టాండ్‌ నుంచి తీన్‌కందిల్‌ వరకు ఓ మహిళ అటోలో ప్రయాణించిన సమయంలో సంచి మరచిపోయింది. అందులో బంగారు నగలు ఉన్నాయి. దీంతో బాధితురాలు సదర బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి ఆటోను గుర్తించి రూ.2 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలను రికవరీ చేశారు. ఆ సొత్తును  ఎస్పీ సొంతదారుకు అప్పగించారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్‌ నారాయణ కాంబ్లే, ఎస్‌ఐ నరమమ్మ పాల్గొన్నారు.    

  • యశవంతపుర(కర్ణాటక): కొందరు పెడదారి పడుతూ పిల్లలను కూడా పాడు చేస్తున్నారు. తీసుకున్న అప్పును ఎగ్గొట్టడం కోసం ఏకంగా ఓ మహిళను హత్య చేసింది మరో మహిళ. ఇందుకు కొడుకు, కూతురు సహకారం కూడా తీసుకుంది. ఫలితంగా ముగ్గురూ కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ దారుణం బెళగావి నగరంలో చోటుచేసుకుంది.  

    దృశ్యం తరహాలో  
    వివరాలు.. బెళగావి నగరంలోని లక్ష్మీనగరలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 21న రాత్రి అంజనా దడ్డీకర్‌ (49) అనే మహిళను గొంతు పిసికి హత్య చేశారు. మంగళసూత్రం, బంగారు నగలను కూడా హంతకులు ఎత్తుకెళ్లారు. అంజన కూతురు అక్షత ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన క్యాంప్‌ ఏరియా పోలీసులు జ్యోతి బాందేకర్, ఆమె కూతురు సుహాని (19), మైనర్‌ కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. దృశ్యం సినిమాలో మాదిరిగా నిందితులు కుట్ర పన్నారు. హత్య జరిగిన రోజున తాము ఊళ్లోనే లేమని పోలీసులతో బుకాయించారు. అయితే ఫోన్‌ కాల్స్, సీసీ కెమెరా దృశ్యాలు, వేలిముద్రలతో నేరం బయటపడింది.  

    తలపై బాది..  
    అంజనా దడ్డీకర్, జ్యోతి స్నేహితులు. ఆమె నుంచి జ్యోతి రూ.15 వేలు అప్పు తీసుకుంది. డబ్బులు వాపస్‌ ఇవ్వాలని అంజనా అడుగుతోంది. డబ్బు ఇవ్వడం ఇష్టం లేని జ్యోతి, కూతురు హత్యకు కుట్ర పన్నారు. 

    కొడుకుతో కలిసి ఆ రోజు ఆమె ఫ్లాటుకు వెళ్లారు. ఆమెతో మాట్లాడుతూ తలపై బాది, గొంతు పిసికి చంపి మంగళసూత్రం, దొరికిన బంగారు నగలతో ఉడాయించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బంగారు నగలు, బైక్, మొబైల్‌ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.    

  • శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం దాడి ఘటనతో అక్కడ భారత ఆర్మీ హైఅలర్ట్‌లో ఉంది. మరోవైపు.. కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 48 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం మూసివేసింది.

    వివరాల ప్రకారం.. పహల్గాం దాడి అనంతరం కశ్మీర​్‌ లోయలో స్లీపర్‌సెల్స్‌ యాక్టివేట్‌ అయినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో, కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. అనంతరం, కశ్మీర్‌లో ఉన్న 48 టూరిస్టు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. కశ్మీర్‌ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో వీటిని మూసివేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు వెల్లడించారు.

    ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను పాశవికంగా హతమార్చిన ఘటనపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్‌ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి మృతులకు సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. పాశవికదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

    కశ్మీర్లో 48 టూరిస్ట్ 4 ప్రాంతాల మూసివేత

    దానికి ముందు సీఎం ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ..‘బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్‌ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు.

  • న్యూఢిల్లీ: పహల్గాం దాడి నేపథ్యంతో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వేర్వేరు ఈ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)కి లేఖలు రాశారు.

    2025 ఏప్రిల్ 22న పహల్గాం ఘటన(Pahalgam Incident)లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్‌ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే(Kharge) తన లేఖలో ప్రస్తావించారు.

    ఇక తన లేఖలో రాహుల్‌ గాంధీ.. ప్రియమైన ప్రధానిగారూ.. పహల్గాం ఉగ్రదాడితో ప్రతీ భారతీయుడు రగిలిపోతున్నాడు. ఇలాంటి క్లిష్టతరుణంలో ఉగ్రవాదానికి మనమెంత వ్యతిరేకమో చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఐక్యత ప్రదర్శించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. అది పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల మాత్రమే సాధ్యపడుతుందని ప్రతిపక్షంగా మేం భావిస్తున్నాం. ఇక్కడే ప్రజాప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలరు. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అని రాహుల్‌ గాంధీ(Rahul gandhi) రాశారు.  

    ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం  ఎలా స్పందిస్తుందో చూడాలి.

    పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

NRI

  • ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం  ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.

    సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

     మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

    వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.

    అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

    ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు  ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.

    డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని,  సదస్సు  ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా  ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు

    ఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు.  ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

  • న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని  శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు,  తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు.  మేళంతో ఊరేగింపుగా  పట్ట వస్త్రాలను తీసువచ్చారు.  

    సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ  చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. 

     మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

    అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి.   వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.

    ఈ సీతారాముల కాళ్యానికి  పార్సిప్పనీకి మేయర్  జేమ్స్  బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి.  ఈ కల్యాణాన్ని  ప్రవాసులు  కన్నులారా వీక్షిం చి తరించారు.  ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు.  భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.

Yadadri

  • నిస్స
    బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మంజూరైనా చేతికిరాని చెక్కులు

    రూ.2.77 కోట్లు రావాలి

    జిల్లాలో తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన, గాయపడిన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషి యా రూ. 2.77 కోట్లు రా వాల్సి ఉంది. పరిహా రం మంజూరైనా బాధితుల చేతికి అందలేదు. అధికారులను సంప్రదిస్తే బడ్జెట్‌ లేదని చెబుతున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, ఉన్నతాధికారులను కలిసి విన్నవించాం. బాధితులకు ఎక్స్‌గ్రేషియా డబ్బులు ఇవ్వనట్లయితే అందోళన కార్యక్రమాలు చేపడుతాం.

    –బోలగాని జయరాములు,

    కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

    బడ్జెట్‌ లేకపోవడంతో ఆలస్యం

    గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా మంజూరైంది వాస్తవమే. బడ్జెట్‌ లేకపోవడంతో చెక్కులు అందచేయలేకపోయాం. జిల్లాలో 79 మంది బాధితులున్నారు. ప్రస్తుతం ముగ్గురికి రూ.5 లక్షల చొప్పున, ఇద్దరికి రూ.10 వేల చొప్పున చెక్కులు అందజేస్తాం. మూడు నెలలకు ఒకసారి బడ్జెట్‌ వస్తుంది. వచ్చె నెల అందరికీ చెక్కులు ఇవ్వడానికి సిద్ధం చేశాం. బడ్జెట్‌ వస్తేనే అందజేస్తాం.

    –విష్ణుమూర్తి, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌

    ఆత్మకూరు(ఎం) మండలం తుర్కల రేపాకకు చెందిన మూల ఆదినారాయణగౌడ్‌ వృత్తిలో భాగంగా 2023 నవంబర్‌ 3న కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ఏడాది క్రితం అతని భార్య శోభ అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు. రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా నిధులు మంజూరైనా చేతికి చెక్కు రాలేదు.

    మోదుబావిగూడేనికి చెందిన వంగాల రమేష్‌ 20 ఏళ్లకు పైగా గీత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. 2017లో భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరి వివాహం అయింది. వృత్తిలో భాగంగా 2023 నవంబర్‌ 28న కల్లు తీయడానికి తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం రూ.10లక్షల వరకు ఖర్చు చేశాడు. కొంత అప్పు తెచ్చాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బంగారు నగలు కూడా అమ్మాడు. కుటుంబం గడవడం కోసం చిరువ్యాపారం నిర్వహిస్తున్నాడు. రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరైనా చేతికి రాలేదని రమేష్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

    ఆత్మకూరు(ఎం) : తాటిచెట్లపై నుంచి పడి మృతిచెందిన, గాయపడి వైకల్యం చెందిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకును వెళ్లదీస్తున్న గీత కార్మికులు ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలతో వృత్తిని కొనసాగించలేకపోతున్నారు. కుటుంబ పెద్ద మరణించడం, గాయపడి మంచం పట్టడంతో ఆ కుటుంబం ఉపాధి కోల్పోతుంది. ఇటువంటి సందర్భాల్లో గీత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎకై ్సజ్‌శాఖ ద్వారా ఎక్స్‌గ్రేషియా అందజేస్తుంది. కానీ, జిల్లాలో రెండేళ్లుగా ఎక్స్‌గ్రేషియా అందక బాధిత కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

    మృతులు, గాయపడిన కార్మికులు..

    జిల్లాలో 14,262 మంది గీత కార్మికులు ఉన్నారు. వృత్తిలో భాగంగా గడిచిన రెండేళ్లలో 13 మంది చనిపోయారు. 42 మంది శాశ్వత, 24 మంది తాత్కాలిక వైకల్యం చెందారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు, శాశ్వత వైకల్యం చెందితే రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా, తాత్కాలిక అంగవైకల్యం చెంది వానికి ప్రభుత్వ రూ.10వేలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంది. రూ. 2.77 కోట్లు మంజూరైనా బాధిత కుటుంబాలకు అందలేదు. గీతకార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా, సీఎం రేవంత్‌రెడ్డికి, ఉన్నతాధికారులకు విన్నపాలు అందజేసినా ఫలితం లేకపోయింది.

  • నష్టం
    అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు

    సాక్షి, యాదాద్రి : వరుస వర్షాలు అన్నదాతను కోలుకోకుండా చేస్తున్నాయి. ఏప్రిల్‌ ఒక్క నెలలోనే ఎనిమిది పర్యాయాలు కురిసిన వర్షాలకు వరి, ఉద్యాన తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. మామిడి రాలి పోయాయి. జిల్లా వ్యాప్తంగా 2,050 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,525 మంది రైతులు అకాల వర్షాలతో నష్టపోయారు. మొత్తం రూ.10కోట్లకు పైనే నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

    ఏటా ఇవే కష్టాలు

    జిల్లాలో ఏటా ఇదే సమయంలో అకాల వర్షాలు కురువడం పరపాటిగా మారింది. ఈ ఏడు కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ ఒక్క నెలలోనే 3, 10,15, 18,19, 20,21,27 తేదీల్లో వర్షాలు కురిశాయి. వర్షాలకు తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, రామన్నపేట, మోటకొండూరు, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, అడ్డగూడూరు, అత్మకూర్‌(ఎం), గుండాల మండలాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లింది.

    నష్టంపై ప్రాథమిక అంచనా

    వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా నష్టాన్ని అంచనా వేశారు. అత్యధికంగా వరి 2,050 ఎకరాల్లో రూ.8.50 కోట్లు, ఆ తరువాత మామిడికి 250 ఎకరాల్లో రూ.2.52 కోట్ల మేర నష్టం జరిగినట్లు లెక్కక ట్టారు. నష్టంపై నివేదిక రూపొందించి పరిహారం కోసం ప్రభుత్వానికి పంపించారు.

    ప్రాణ, ఆస్తినష్టం

    పిడుగు పాటుకు మూగజీవాలు మృత్యువాత పడి యజమానులు నష్టపోయారు. రాజాపేట మండలం రేణికుంటలో బండిమల్లయ్యకు చెందిన 40 మేకలు, 10 గొర్రెలు, చల్లూరులో ఎర్ర నర్సయ్యకు చెందిన పాడిగేదె, పాడి ఆవు, బీబీనగర్‌ మండలం పడమటి సోమారంలో రెండు పాడి అవులు మృత్యువాత పడ్డాయి.

    మోటకొండూరు మండల తేర్యాలకు బాలగాని రాజు 18 ఎకరాల వరి సాగు చేశాడు. ఇదులో 12 ఎకరాలు సొత భూమి కాగా, ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సుమారు రూ.4లక్షలు పెట్టుబడి పెట్టాడు. మూడు రోజుల్లో కోతకు సిద్ధం అవుతుండగా వడగండ్ల వాన కురిసింది. దీంతో వరి కంకులు పెద్దెత్తున నేలరాలాయి. ఉన్న పంటను కోయగా ఎకరాకు 20 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు వాపోయాడు.

    ఫ 2,050 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడికి నష్టం

    ఫ నష్టాన్ని అంచనా వేసిన అధికారులు

    ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేత

    ట్రాక్టర్‌ వడ్లు రాలాయి

    ఏడు ఎకరాల్లో వరి వేశాను. మూడెకరాలు నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రంలో పోశాను. స్థలం లేదని మిగిలిన పొలం కోయలేదు. ఈనెల 15వ తేదీన కురిసిన వడగండ్ల వానకు కోయని పొలంలో దాదాపు ట్రాక్టర్‌ వడ్లు రాలిపోయాయి. ప్రభుత్వపరంగా ఆదుకోవాలి.

    –ఆవుల లక్ష్మీనారాయణ, నీర్నెముల

  • ఉమ్మడ

    నల్లగొండ : ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ఉమ్మడి నల్లగొండను సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. నల్లగొండ జిల్లాలోని బక్కతాయికుంట (రూ.20.22 కోట్లు), మునుగోడు (రూ.6.08కోట్లు), నర్సింగ్‌బట్ల (రూ.19.95 కోట్లు) ఎత్తిపోతల పథకాలకు, కలెక్టరేట్‌లో రూ.36 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి డిండి లిప్టు ఇరిగేషన్‌కు ఎదుల ద్వారా నీరందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. పిల్లాయిపల్లి, శివన్నగూడెం నుంచి నారాయణపురం, చౌటుప్పల్‌ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్టు నిర్మాణం చేపడతామన్నారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్షించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వానాకాలం, యాసంగి కలుపుకుని 2.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృస్టించామన్నారు. రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, జిల్లా నుంచి పిలిిప్పిన్స్‌కు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు.

    ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి.. వెంకట్‌రెడ్డి

    రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రూ.36 కోట్లతో కలెక్టరేట్‌ అదనపు బ్లాక్‌, రూ.50 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టరేట్‌ నిర్మించారని.. ఇప్పుడు పథకాలు పెరగడం, కార్యాలయాల పెంపు వల్ల కలెక్టరేట్‌ సరిపోవడం లేదన్నారు. అదనపు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి డీఈఓ, డీఎంహెచ్‌ఓ కార్యాలయాలను కూడా కలెక్టరేట్‌కు తీసుకొస్తామన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రణాళికా బద్ధంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంట్లో కంటే కార్యాలయాల్లో ఎక్కువ సమయం ఉంటారని, సౌ కర్యవంతంగా ఉండేలా భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్‌, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలునాయక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం మాట్లాడారు. అనంతరం ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తొలి విడత రూ.లక్ష చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్‌, డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్‌, రాజ్‌కుమార్‌, నీటిపారుదల సీఈ అజయ్‌కుమార్‌, డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి, ఉదయసముద్రం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈఈ సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

    ఫ సాగునీటి ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్ష

    ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

    ఫ రూ.1,600 కోట్లతో రోడ్ల నిర్మాణం

    సాగుతోంది : మంత్రి కోమటిరెడ్డి

    ఫ నల్లగొండ కలెక్టరేట్‌లో అదనపు భవన

    సముదాయం, లిఫ్టు పనులకు శంకుస్థాపన

  • బాల్య

    భువనగిరిటౌన్‌ : బాల్యవివాహాలు నేరమని, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నిఘా ఉంటుందని జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారి నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈనెల 30న సామూహిక వివాహాలు జరిపే సంప్రదాయం ఉంటుందని, మైనర్ల వివాహాలు చేస్తే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098 కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పురోహితులు, మత పెద్దలు, టెంట్‌ హౌస్‌లు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు జాగ్రత్త వహించి బాల్యవివాహాలు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. బాల్యవివాహాలు చేస్తే తల్లిదండ్రులతో పాటు పెళ్లికి హాజరయ్యే అతిథులు కూడా శిక్షార్హులన్నారు.

    సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలి

    భువనగిరి : ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా సహకార అధికారి(డీసీఓ) మురళీరమణ రైతులకు సూచించారు. సోమవారం భువనగిరిలోని హుస్నేబాద్‌లోని కోనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు, హమాలీలతో మాట్లాడారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు ఉండాలని సెంటర్‌ నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

    శివపార్వతులకు సంప్రదాయ పూజలు

    యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు.

    ఆశతో వచ్చి.. నిరాశగా వెనుదిరిగి

    భువనగిరిటౌన్‌ : కలెక్టర్‌లో సోమవారం జరగాల్సిన ప్రజవాణి కార్యక్రమాన్ని భూ భారతి అవగాహన సదస్సుల వల్ల రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రజావాణి రద్దయిన విషయం చాలా మందికి తెలియక ఎప్పటి మాదిరిగానే తరలివచ్చారు. ఎండకు అవస్థలు పడుతూ సుదూర ప్రాంతాల నుంచి నిరీక్షించారు. అధికారుల సూచన మేరకు అర్జీలను ఇన్‌వార్డులో అందజేసి వెళ్లారు. మొత్తం 43 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన

    భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం ఉదయం సహస్రనామార్చన వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించారు.

  • భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

    సంస్థాన్‌ నారాయణపురం : రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్‌ ద్వారా భూ సమస్యలు తీరనున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం సంస్థాన్‌నారాయణపురంలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్‌ హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ తన కుంటుంబసభ్యుల కొసం ధరణి చట్టం తీసుకొస్తే, పేద రైతుల భూములు పోవద్దని, భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. రాచకొండ ప్రాంతంలో ఎన్నో రకాల భూ సమస్యలు ఉన్నాయన్నారు.గతంలో ఇక్కడ పనిచేసిన ఆధికారులు జలగల్లా రైతులను పీక్కుతున్నారని, అవినీతికి తావుండరాదన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం మండలాలను సస్యశ్యామలం చేస్తానన్నారు. కేసీఆర్‌ తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని 33 ముక్కలుగా విభజించాని విమర్శించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాచకొండలో ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు చేస్తున్నారని అరో పించారు. కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ మే 1నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్యే అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీని వాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదవరెడ్డి, మాజీ ఎంపీపీలు గుత్త ఉమాదేవిప్రేమ్‌చందర్‌రెడ్డి, బుజ్జి, ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ డైరక్టర్లు లోడే రఘు, మెగావత్‌ బిచ్చానాయక్‌, బచ్చనగోని గాలయ్య, గౌసొద్దిన్‌ ఖురేషి తదితరలు పాల్గొన్నారు.

    ఫ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

  • భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ

    చౌటుప్పల్‌ : పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రమదాలను నివారించవచ్చని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ బి.రాజగోపాల్‌రావు, జాయింట్‌ చీఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ వై.మోహన్‌బాబు పేర్కొన్నారు. వరల్డ్‌ డే ఫర్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ ఎట్‌ వర్క్‌–2025ను పురస్కరించుకొని నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భద్రత అంశంపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చౌటుప్పల్‌పట్టణ పరిధిలోని లింగోజిగూడెంలోని దివీస్‌ పరిశ్రమ ఉద్యోగులు సేఫ్రీ డ్రాయింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి, సేఫ్టీ పద్య పోటీల్లో ద్వితీయ బహుమతి కై వసం చేసుకున్నారు. బహుమతుల ప్రదానోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. భద్రత విషయంలో రాజీపడద్దన్నారు. భద్రత ప్రమాణాలు పాటించడం వల్ల కంపెనీ ఉత్పత్తులు పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. బహుమతులు సాధించిన దివీస్‌ ఉద్యోగులను వారు అభినందించారు.

  • మఠంపల్లిలో పందెం గిత్తల జోరు

    కొనసాగుతున్న ఎద్దుల పందేలు

    మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా స్థానిక మాంట్‌ఫోర్డ్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు సోమవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ఒంగోలు జాతి గిత్తలతో బండలాడే పోటీలను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించిన ఆరు పండ్ల విభాగంలో ఏపీలోని బెస్తవారిపేటకు చెందిన గిత్తలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. రెండో బహుమతిని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన శివక్రిష్ణచౌదరి, మోహన్‌రావుకు చెందిన గిత్తలు, మూడో బహుమతిని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన గొట్టిపాటి రవికుమార్‌ గిత్తలు గెలుపొందాయి. ప్రతి విభాగంలో 10 జతల గిత్తలకు నగదు బహుమతులు, షీల్డులు దాతల సహయంతో అందజేస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆదూరి స్రవంతి కిషోర్‌రెడ్డి, గ్రేగోల్డ్‌ సిమెంట్స్‌ పీఎం శ్రీనివాసరెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, ఆంథోనిరెడ్డి, థామస్‌రెడ్డి, లూర్ధురెడ్డి, సునీల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, లూర్ధుమారెడ్డి, విక్టర్‌రెడ్డి, బాలరెడ్డి, జార్జిరెడ్డి, సక్రునాయక్‌, ఎల్లారెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.

  • వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

    చిట్యాల: చిట్యాల మండలం ఆరెగూడెం శివారులో, చిట్యాల పట్టణంలో సోమవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో బస్టాండ్‌కు వెళ్లే దారిలో సోమవారం రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని యువకుడిని భువనగిరి నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుండగా.. ప్రమాదం జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. అర్ధగంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు యువకుడిని అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    బైక్‌ అదుపుతప్పి..

    చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన తాటిపల్లి శంకర్‌, దొడ్డి మనోజ్‌ ద్విచక్ర వాహనంపై పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి నుంచి ఆరెగూడెం వెపు వెళ్తూ.. ప్రగతి కాటన్‌ మిల్లు ఎదురుగా అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. శంకర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

  • రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం

    సూర్యాపేట టౌన్‌: బైక్‌పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం తొగర్రాయికి చెందిన లిక్కి రామారావు(46) దురాజ్‌పల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రి బైక్‌పై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ సమీపంలో గల అండర్‌ పాస్‌ నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది. రామారావుకు తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు.

    గుండెపోటుతో చేనేత కార్మికుడు మృతి

    రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు పున్న నర్సింహ (47) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. పున్న నర్సింహ మధ్యాహ్నం అస్వస్థతకు గురై ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

  • సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం

    రామన్నపేట, శాలిగౌరారం: కాలువల ఆధునీకరణ, మరమ్మతులు చేయడం ద్వారా సాగునీటి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం రామన్నపేట మండలం పల్లివాడ గ్రామ శివారులో మూసీ నదిపై గల శాలిగౌరారం ప్రాజెక్టు కాలువ హెడ్‌ రెగ్యూలేటరీని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న కత్వ, హెడ్‌ రెగ్యులేటరీ గేట్లను, బాచుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాల వెంట శాలిగౌరారం ప్రాజెక్టు కాలువను పరిశీలించారు. మూసీలో హెడ్‌ రెగ్యులేటరీకి అడ్డుగా ఉన్నటువంటి గుర్రపుడెక్కను నిరంతరాయంగా తొలగించుటకు, దెబ్బతిన్న కత్వ మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెగ్యులేటరీ తలుపులను ఆపరేట్‌ చేయడానికి వారం రోజుల వ్యవధిలో గేర్‌ బాక్స్‌లను బిగించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. 27కి.మీ. పొడవైన కాలువలో ఇప్పటి వరకు 14కి.మీ. వరకే షీల్ట్‌ను తీశారని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి మంజూరైన నిధులు, జరిగిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరైనప్పటికీ ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌పై ఎంపీ, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. హెడ్‌రెగ్యూలేటర్‌ షట్టర్లు బిగించడం, రాచకాల్వలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించే పనులను పదిరోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. పనులు పూర్తిచేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్‌ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తుర్కపల్లి దగ్గర రాచకాల్వపై ఉన్న షట్టర్లను, శాలిగౌరారం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. వారి వెంట తిరుమలగిరి నీటిపారుదలశాఖ ఈఈ జె. సత్యనారాయణ, డీఈఈ సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నంద్యాల భిక్షంరెడ్డి, మాజీ సర్పంచులు గంగుల వెంకటరాజిరెడ్డి, కడారి సత్తయ్య, గుత్తా నర్సింహారెడ్డి, కడమంచి సంధ్యస్వామి, ఎండీ రెహాన్‌, నాయకులు అక్రం, గోదాసు పృథ్వీరాజ్‌, గాదె శోభారాణి, మేకల మల్లేశం, నాగులంచె నరేష్‌, దూదిమెట్ల లింగస్వామి, మేడి మల్లయ్య, అయ్యాడపు నర్సిరెడ్డి, ఎండీ జమీరొద్దీన్‌, గడ్డం యాదగిరి, ఏఈలు విక్రమ్‌, అమర్‌, వర్క్‌ ఇన్‌స్పెపెక్టర్‌ రజినీకాంత్‌, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాదూరి శంకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ చామల మహేందర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్‌, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు చామల వెంకటరమణారెడ్డి, జయపాల్‌రెడ్డి, చాడ రమేశ్‌చందర్‌రెడ్డి, దండ అశోక్‌రెడ్డి, చింత ధనుంజయ్య, షేక్‌ ఇంతియాజ్‌, రైతులు తదితరులు ఉన్నారు.

    భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

  • వరి క

    గరిడేపల్లి: వరి పంట కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చడం వలన పొలంలో చేరిన కీటకాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయని రైతుల అభిప్రాయపడుతుంటారని, కానీ అలా చేయడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు నాశనవుతాయని గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగపు శాస్త్రవేత్త డి. నరేష్‌ అంటున్నారు. వరి కొయ్యలను నేలలో కలియ దున్నితే ఎన్నో లాభాలు ఉంటాయని ఆయన పేర్కొంటున్నారు. వరి కొయ్యలను కాల్చడం వలన జరిగే నష్టాలు ఆయన మాటల్లోనే..

    ● రైతులు వరి కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ వరికోత యంత్రాలు వరి కంకి మొదలు భాగాన కాకుండా 30సెం.మీ. ఎత్తులో కోయడం వలన 50శాతం గడ్డి కొయ్యల రూపంలో పొలంలోనే మిగిలిపోతుంది. వరి కొయ్యలను రైతులు తగలబెట్టడం వలన ఒక టన్నుకు 60కిలోల మోనాకై ్సడ్‌తో పాటు 1400 కిలోల కార్బన్‌డైయాకై ్సడ్‌ గాలిలోకి విడుదల అవుతుంది. ఇదే కాకుండా సూక్ష్మధూళి కణాలు, బూడిద గాలిలో కదలడం వలన వాయు కాలుష్యం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. నేల పొరల్లో తేమ శాతం ఆవిరై దిగుబడులపై ప్రభావం చూపుతుంది.

    ● ప్రతి టన్ను వరిగడ్డి పెరగడానికి భూమి నుంచి 6.2కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరం, 18.9కిలోల పొటాష్‌ కొద్ది మోతాదులో సూక్ష్మపోషకాలను కూడా తీసుకుంటుంది. అందువలన వరి కొయ్యలను భూమిలో కలియదున్నడం వలన ఈ పోషకాలన్నీ తిరిగి నేలను చేరుతాయి. లేదంటే ఈ పంట వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్‌ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. వరిని కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకొని దున్నడం వల్ల వరి కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల నేలలో వ్యర్ధపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50కిలోల సూపర్‌ పాస్పేట్‌ వేయడం వలన వరి కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి. వరి కొయ్యలను నేలలో కలియదున్నటం ద్వారా సేంద్రియ కార్బన్‌ శాతం పెరగడమే కాకుండా దిగుబడి సైతం 8–10 శాతం పెరిగినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి వేసిన పోషకాల లభ్యత పెరుగుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్‌డైయాక్సెడ్‌ సాంద్రత తగ్గించాలన్నా నేలలో కార్బన్‌ శాతం పెరగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకి చేర్చడం ఉత్తమైన పద్ధతి.

    నేలలో కలియ దున్నితే అధిక లాభాలు

    గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేష్‌

  • కోతుల దాడిలో  వృద్ధుడికి గాయాలు

    అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన సండ్ర అవిలయ్య కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం అవిలయ్య తన ఇంటి బయట మంచంపై కూర్చొని ఉండగా కోతుల గుంపు ఒక్కసారిగా వచ్చి అతడిపై దాడి చేయడంతో శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం అవిలయ్యను సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారని, ఇప్పటికై నా అధికారులు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

    కోదాడలో పిచ్చి కుక్క

    స్వైర విహారం

    10 మందిపై దాడి

    ఓ బాలుడికి తీవ్రగాయాలు

    కోదాడరూరల్‌ : కోదాడ పట్టణంలో సోమవారం ఓ పిచ్చి కుక్క పది మందిపై దాడి చేసి గాయపర్చింది. పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌ 18వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవికుమార్‌ కుమారుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే కుక్క గణేష్‌నగర్‌, తిలక్‌నగర్‌, ఖమ్మం క్రాస్‌రోడ్‌ ఏరియాల్లో 10 మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్‌ అధికారులు వెంటనే కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

    అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

    మునుగోడు: మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామానికి చెందిన పత్తిపాటి హజరత్‌(40) ఇరవై ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అదే గ్రామానికి చెందిన కంభంపాటి లక్ష్మమ్మని 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని స్థానికంగానే నివాసం ఉంటూ తాపీ మేసీ్త్ర పని చేస్తున్నాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన హజరత్‌ తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం కల్వలపల్లి గ్రామ శివారులోని ముత్మాలమ్మ దేవాలయ సమీపంలో హజరత్‌ విగతజీవిగా కనిపించాడు. హజరత్‌ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పత్తిపాటి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాధు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.

  • కేసీఆర్‌ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు

    నకిరేకల్‌: వరంగల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ ప్రభంజనం చూసి తట్టుకోలేక ఆయనపై కాంగ్రెస్‌ మంత్రులు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజతోత్సవ సభ అయిపోయిన వెంటనే కేసీఆర్‌పై కాంగ్రెస్‌ మంత్రులు పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయలేదని కేసీఆర్‌ సభలో ఎండగట్టారన్నారు. ప్రజలను దగా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీపై, కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ఇచ్చిన హమీలను అమలుచేయలేక గ్రామాల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు వణుకు పుడుతుందన్నారు. ఈ వణుకు చూసే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక కాంగ్రెస్‌ పార్టీ చేతులేత్తింసిందన్నారు. రజతోత్సవ సభను అడ్డుకోవడం కోసం పోలీస్‌ యంత్రాంగం ప్రయత్నించిందన్నారు. సభకు వెళ్లిన వాహనాలకు ట్రాఫిక్‌ క్లియర్‌ చేయకుండా పోలీసులు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ రెండెళ్లలో తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం రాబోతుందన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన నకిరేకల్‌ నియోజకర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు చిరుమర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్‌, రాచకొండ వెంకన్నగౌడ్‌, నాయకులు పెండెం సదానందం, పల్లె విజయ్‌, వంటల చేతన్‌, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, సామ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

    చిరుమర్తి లింగయ్య

  • ధాన్యం కొనాలని రైతుల ఆందోళన

    వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం వలిగొండ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులు గడిచినా కాంటా ప్రారంభించడం లేదన్నారు. హమాలీల కొరతను కేంద్రాల నిర్వాహకులు సాకుగా చూపుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నామని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రేపటిలోగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైతులకు బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లోతుకుంట ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో పాటు బీజేపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్‌, నాయకులు రాచకొండ కృష్ణ, శీల పాండు, అనిల్‌మార్‌, దోగిపర్తి సంతోష్‌, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి పాల్గొన్నారు.

  • కిష్టాపురంలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

    హుజూర్‌నగర్‌ (చింతలపాలెం): చింతలపాలెం మండలం కిష్టాపురంలో సోమవారం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని 210 ఇళ్లలో సోదాలు చేసి సరైన ధ్రువపత్రాలు, నంబర్‌ ప్లేట్లు లేని 58 బైక్‌లు, ఒక ఆటోను సీజ్‌ చేశారు. అనంతరం సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గంజాయి, డ్రగ్స్‌, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోదాడ రూరల్‌ సీఐ రజిత మాట్లాడుతూ.. గ్రామంలో వర్గాలుగా ఏర్పడి గొడవలు పడుతూ ఉంటే గ్రామం ఎప్పటికీ అభివృద్ధి చెందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు అనిల్‌ రెడ్డి, పరమేష్‌, నవీన్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకన్న, కళాబృందం ఇన్‌చార్జి ఎల్లయ్య, గోపయ్య, గురులింగం, నాగార్జున, కృష్ణ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

    సరైన ధ్రువపత్రాలు, నంబర్‌ ప్లేట్లు లేని

    58 బైక్‌లు, ఆటో సీజ్‌

West Godavari

  • కేసులు పెట్టినా.. తగ్గేదేలే

    సాక్షి, భీమవరం: మద్యం బెల్టు షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. షరామామూలే అన్నట్టు నిర్వాహకుల తీరుంది. గత ఐదు నెలల్లో బెల్టు విక్రయాలుపై జిల్లాలో 356 కేసులు నమోదు చేసిన ఎకై ్సజ్‌శాఖ 715 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. అయినా తగ్గేదే లేదన్నట్టుగా జిల్లాలోని సిండికేట్‌ వర్గాలు గుట్టుచప్పుడు కాకుండా బెల్టు అమ్మకాలు సాగిస్తున్నాయి. జిల్లాలో 193 మద్యం దుకాణాలకు సుమారు 71 షాపులు పట్టణ ప్రాంతాల్లో, పంచాయతీల పరిధిలో మిగిలిన 122 షాపులు ఏర్పాటుచేశారు. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్‌ సిండికేట్లు బెల్టులు పెట్టి అమ్మకాలు చేయిస్తున్నారు. ఒక్కో లైసెన్స్‌డ్‌ షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు ఉన్నట్టు సమాచారం. తీరప్రాంతం, మెట్ట గ్రామాల్లో కొన్ని చోట్ల వేలం పాటల ద్వారా బెల్టులు అప్పగించారు. మొగల్తూరు మండలానికి చెందిన కూటమి నాయకుడు బెల్టు షాపు కోసం బేరసారాలు సాగించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కూడా అయ్యాయి. కొన్ని చోట్ల రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్లు చెల్లించిన వారికి, కూటమి కార్యకర్తలకు బెల్టులు అప్పగించారు. చిన్న చిన్న దుకాణాలు, కిళ్లీ బడ్డీల్లో బాటిళ్లు ఉంచి క్వార్టర్‌, బీర్‌ బాటిల్‌పై అదనంగా రూ.30 నుంచి రూ.40 వరకు అమ్మకాలు చేస్తున్నారు. కొందరు నిర్వాహకులు వాహనాల్లో మద్యం బాటిల్స్‌ పెట్టుకుని మందుబాబుల చెంతకు చేరవేస్తూ మొబైల్‌ సర్వీస్‌ అందిస్తున్నారు.

    358 మందిపై కేసులు

    కూటమి ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేట్‌ పరం చేసిన నాటి నుంచి ఆరు నెలల్లో బెల్టు అమ్మకాలపై జిల్లాలో 356 కేసులు నమోదుచేసిన ఎకై ్సజ్‌ అధికారులు 358 మందిని అరెస్టు చేసి 715 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా తాడేపల్లిగూడెం స్టేషన్‌ పరిధిలో 85 కేసులు నమోదు కాగా నరసాపురం పరిధిలో 70 నమోదయ్యాయి. తక్కువగా ఆకివీడు పరిధిలో 40 కేసులు నమోదయ్యాయి. పదికి పైగా బాటిళ్లతో దొరికితే కోర్టులో హాజరుపర్చాలి. పది బాటిల్స్‌ లోపు ఉంటే సెక్షన్‌ 34 (ఏ) కింద కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వదిలేయవచ్చని న్యాయవాది ఒకరు తెలిపారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా పడే అవకాశముందని, అయితే నేరం రుజువై శిక్ష పడిన ఘటనలు చాలా అరుదని చెబుతున్నారు. బెల్టులు లేకుండా చేస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎకై ్సజ్‌ అధికారులతో తూతూమంత్రంగా సెక్షన్‌ 34 (ఏ) కేసులతో తంతు నడిపిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెల్టు అమ్మకాలు చేస్తే ఉపేక్షించేది లేదని, నిబంధనల మేరకు దాడులు నిర్వహించి బెల్టు అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఎకై ్సజ్‌ అధికారులు చెబుతున్నారు.

    బెల్టు షాపులపై నమోదైన కేసుల వివరాలు

    ఎకై ్సజ్‌ స్టేషన్‌ కేసులు పట్టుబడిన స్వాధీనం

    వారు చేసుకున్న మద్యం (లీటర్లలో)

    ఆకివీడు 40 40 59.94

    భీమవరం 55 56 246.24

    నర్సాపురం 70 70 102.42

    పాలకొల్లు 43 43 53.64

    తాడేపల్లిగూడెం 85 85 160.06

    తణుకు 63 64 93.10

    బెల్టు షాపులపై 358 కేసులు

    715 లీటర్ల మద్యం స్వాధీనం

    అయినా షరామామూలుగానే బెల్టు అమ్మకాలు

    స్టేషన్‌ బెయిలిచ్చి పంపేస్తున్న అధికారులు

    మాటలకే పరిమితం

    ఎమ్మార్పీకి మించి అమ్మకాలు చేసినా, బెల్టులు ఏర్పాటు చేసినా మొదటిసారి రూ. 5 లక్షల జరిమానా విధించాలని, రెండోసారి తప్పు చేస్తే షాపు లైసెన్స్‌ రద్దుచేయాలని ఇటీవల ఒక సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ హెచ్చరికలను సిండికేట్‌ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నట్టు లేదు. జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం తదితర చోట్ల పలు దుకాణాల్లో బాటిల్‌పై రూ.10 అదనంగా విక్రయిస్తున్నారు. పర్మిట్‌ రూంల మాదిరి సదుపాయాలతో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నా సీఎం ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు.

  • రెడ్‌క్రాస్‌కు గోల్డ్‌ మెడల్‌

    భీమవరం(ప్రకాశం చౌక్‌): భీమవరం రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంక్‌లో త్వరలో తలసేమియా పిల్లలకు సెంటర్‌ ఏర్పాటు చేసి చికిత్స ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీ అందించిన మెరుగైన సేవలకు గుర్తింపుగా 2024–25 సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో గోల్డ్‌ మెడల్‌కు ఎంపికై ందన్నారు. దీనికి కృషి చేసిన జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌ఓ, జిల్లా, డివిజన్‌ మండల స్థాయి అధికారులు, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సిబ్బంది అభినందనీయులన్నారు. మే 8న రెడ్‌ క్రాస్‌ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. మే 28న భీమవరం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సెంటర్‌లో తలసేమియా పిల్లలకు సెంటర్‌ ఏర్పాటును గవర్నర్‌ ప్రకటించనున్నట్లు తెలిపారు.

  • చేపల

    కై కలూరు: కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, చనిపోయిన కోడి పిల్లలు, పాడైన కోడిగుడ్లు ఇవి కొల్లేరు ప్రాంతమైన చటాకాయి గ్రామంలో ఫంగస్‌ చేపలకు వేస్తున్న ఆహారం. వీటిని తిన్న చేపలను మనం తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం. అయినా కొందరు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపల సాగు, 1.10 ఎకరాల్లో రొయ్యల సాగు వెరసి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో 84,852.4 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 30,972 మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో ఫంగసీస్‌ సాగు సుమారు 8 వేల ఎకరాల్లో జరుగుతుందని అంచనా. ఫంగసిస్‌ చేపలు వ్యాధులను తట్టుకుని, ఎలాంటి మేతనైన జీర్ణం చేసుకునే గుణం కలిగి ఉంటాయి. దీంతో వీటికి కోడి వ్యర్థాలు ఆహారంగా వేస్తున్నారు.

    కేరాఫ్‌గా చటాకాయి: కై కలూరు మండలం చటాకాయి గ్రామం వ్యర్థాల సాగునకు కేరాఫ్‌గా మారుతోంది. గతంలో నిషేధిత క్యాట్‌ ఫిష్‌ సాగుకు అడ్డాగా గ్రామం ఉండేది. అనేక సందర్భాల్లో కోడి వ్యర్థాల వ్యాన్‌లు పట్టుబడ్డాయి. తాజాగా ఆదివారం రాత్రి గ్రామ పెద్దగా చాలామణి అవుతున్న వ్యక్తి చెరువులో కోడి వ్యర్థాలు విడిచిపెట్టారు. పోలీసులు ఆలస్యంగా రావడంతో అప్పటికే చెరువులో కోడి వ్యర్థాలు చల్లాడు. ఇదే గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో ఫంగసీస్‌ సాగులో కోడి వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు సమాచారం. మచిలీపట్నం, విజయవాడ నుంచి ఈ వ్యర్థాలు వస్తున్నాయి. హైదరాబాదు, విజయవాడ నుంచి కుళ్ళిన కోడిగుడ్లను ఆమ్లెట్‌ రూపంలో ట్రేలలో తీసు కొచ్చి వినియోగిస్తున్నారు. కోడి వ్యర్థాలు కేజీ రూ. 15కి విక్రయిస్తోండగా, కోడి గుడ్ల ఆమ్లెట్‌ కేజీ రూ. 20కి కొనుగోలు చేస్తున్నారు. చేపల మేత ఫిల్లెట్‌ ధరలు కేజీ రూ.40కి చేరడంతో మేత ధరలను తగ్గించుకోడానికి వ్యర్థాల వైపు మళ్ళుతున్నారు.

    జీవో 56 అమలులో విఫలం : కోడి వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో చేపల సాగు చేసి పర్యావరణానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో 56ను తీసుకొచ్చింది. వీటిని నియంత్రించడానికి చైర్‌పర్సన్‌గా తహసీల్దారు, సభ్యులుగా వీఆర్వో, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌, ఎస్సై, మెంబరు కన్వీనర్‌గా ఫిషరీస్‌ డెవలప్‌మెంటు ఆఫీసర్‌ను నియమించారు. చటాకాయిలో వ్యర్థాల సాగుపై కై కలూరు రూరల్‌ ఎస్సైను వివరణ కోరగా వాహనాన్ని సీజ్‌ చేశామని, లక్ష పూచికత్తుతో తహసీల్దారుకు బైండోవర్‌ చేశామన్నారు.

    ఆరోగ్యానికి ముప్పు

    వ్యర్థాలతో సాగు చేసిన చేపలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రధానంగా ఇన్‌ఫెక్షన్‌ సమస్యలు తలెత్తుతాయి. నరాల బలహీనతలు, కడుపునొప్పి, వాంతులతో పాటు ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి.

    – డాక్టర్‌ అల్లాడ శ్రీనివాసరావు,

    సూపరింటెండెంటు, ఏరియా ఆస్పత్రి, కై కలూరు.

    ఆక్వా రంగానికి చెడ్డ పేరు

    కొందరు చేసే తప్పు వల్ల మొత్తం ఆక్వా రంగానికి చెడ్డ పేరు వస్తుంది. పలు సమావేశాల్లో వ్యర్థాలతో సాగు చేయవద్దని హెచ్చరిస్తున్నాం. కొందరు పెడచెవిన పెడుతున్నారు. కలెక్టరు, ఎస్పీలకు వ్యర్థాల సాగుపై ఫిర్యాదు చేస్తాం.

    – నంబూరి వెంకటరామరాజు, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, తాడినాడ

    ఆరోగ్యానికి ప్రమాదమంటున్న వైద్యులు

    చటాకాయి గ్రామంలో ఫంగస్‌ చేపలకు మేతగా కోడి వ్యర్థాలు

    జీవో 56 అమలులో అధికారుల విఫలం

  • కలెక్

    భీమవరం(ప్రకాశం చౌక్‌): భూ సమస్య పరిష్కరం కావడం లేదని ఒక వ్యక్తి ఆత్మ హత్యాయత్నం చేసిన ఘటన భీమరం కలెక్టరేట్‌లో జరిగింది. మొగల్తూరు దయాల్‌ దాస్‌ పేటకు చెందిన పాలా వీర వెంకట సత్యనారాయణ (64) కొంతకాలంగా భీమవరంలోని కిషోర్‌ థియేటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. పాలకొల్లు సమీపంలోని కొంతేరులో సత్యనారాయణకు 16 సెంట్ల స్థలం ఉండగా దానిపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో పలుసార్లు కలెక్టరేట్‌ స్పందనలో ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం కావడం లేదని సోమవారం ఉదయం భీమవరం కలెక్టరేట్‌ స్పందనకు విషం తాగి వచ్చిన సత్యనారాయణ స్పందన హాల్లో పడిపోయాడు. సత్యనారాయణను పోలీసులు అంబులెన్‌న్స్‌లో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

    సెక్టోరల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

    భీమవరం: సమగ్ర శిక్ష భీమవరం జిల్లా ప్రాజెక్ట్‌ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్‌, అసిస్టెంట్‌ సెక్టోరల్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ పి.శ్యామ్‌సుందర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు మే 2 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 79890 02168 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.

    పంపిణీకి సిద్ధంగా పుస్తకాలు

    భీమవరం: జిల్లాలో నూతన విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫాం, బ్యాగ్‌, బెల్ట్‌, షూ, డిక్షనరీలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ పి.శ్యామ్‌సుందర్‌, ఎస్‌ఎస్‌ఏ సీఎంఓ యండమూరి చంద్రశేఖర్‌ చెప్పారు. పుస్తకాల పంపిణీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి మండలంలో స్టాక్‌ పాయింట్‌కు చేర్చేలా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 8 మండలాలకు పాఠ్యపుస్తకాలు 65 శాతం చేరాయన్నారు. ఒక్కో విద్యార్ధికి మూడు జతల యూనిఫాం, ఒక జత షూ, రెండు జతల సాక్స్‌లు, బ్యాగ్‌, బెల్ట్‌ అందించనున్నట్లు చెప్పారు.

    గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించాలి

    భీమవరం: పోలీసుస్టేషన్ల నుంచి వచ్చే ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించి అనంతరం ఆయా పోలీసుస్టేషన్ల అధికారులతో మాట్లాడారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారానికి కృషిచేయనున్నట్లు భరోసా ఇచ్చారు.

    ద్వారకాతిరుమలలో గణేష్‌ శర్మకు శిక్షణ

    ద్వారకాతిరుమల: కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సుబ్రహ్మణ్య గణేష్‌ శర్మ ద్వారకాతిరుమలలో రుగ్వేదాన్ని అభ్యసించారు. 2009లో వేసవి సెలవుల్లో తిరుపతిలోని మేనమావ ఇంటికి వెళ్లిన గణేష్‌ శర్మను ఆదే సమయంలో తిరుపతి వచ్చిన కంచికామకోటి పీఠం శంకరాచార్యస్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. ద్వారకాతిరుమల దేవస్థానం రుగ్వేద సలక్షణ ఘనాపాటి, సకల జ్ఞాన సంపన్నుడైన రత్నాకర్‌ శర్మ వద్ద చేర్పించాలని ఆదేశించారు. దాంతో ఆయన రత్నాకర శర్మ ఇంటి వద్ద ఉండి 2009 నుంచి దాదాపు 12 ఏళ్లపాటు వేద విద్యను పట్టుదలతో నేర్చుకున్నారు. ఆయన వద్ద రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణ అరణ్యకం, ఉపనిషత్తులు వంటి వాటిలో నిష్ణాతులయ్యారు. సప్తమంజరి, ధాతురూపావళి, సమస కుసుమావళి వంటి ఎన్నో పుస్తకాలను అవపోసన పట్టారు. 12 ఏళ్ల పాటు ద్వారకాతిరుమలలో శిక్షణ పొందిన గణేష శర్మ కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులవడం పట్ల ఇక్కడ వేద పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • ప్రభుత్వాసుపత్రి మార్చురీలో కొత్త దందా

    ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో మృతదేహాలతో అక్రమ వ్యాపారం సాగించిన సిబ్బంది.. తాజాగా మరో వ్యాపారానికి తెరదీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్చు రీలోని ఫ్రీజర్‌ బాక్సులు పనిచేయటం లేదు. రెండ్రోజుల క్రితం దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన లింగాల పరశురాం విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్‌లో మార్చురీకి తరలించగా ఫ్రీజర్‌ బాక్సులో పెట్టారు. సాయంత్రానికి మృతదేహం దుర్వాసన రావడంతో బంధువులు నిలదీశారు. మార్చురీ సిబ్బంది వారిపై ఎదురుదాడికి దిగారు. మీకు అవసరమైతే వెళ్ళి ఫ్రీజర్‌ బాక్సు తెచ్చుకుని పెట్టుకోండి? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

    ఇంత జరుగుతున్నా స్పందించని అధికారులు

    ఏలూరు జీజీహెచ్‌లో మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్‌ బాక్సులు పనిచేయకపోవటంతో సిబ్బంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారంటున్నారు. వారే ప్రైవేటు ఫ్రీజర్‌ బాక్సులు పురమాయిస్తారు. రోజుకి రూ.3 వేల నుంచి రూ.3,500 చెల్లిస్తే ఫ్రీజర్‌ బాక్సు తీసుకొచ్చి దానిలో మృతదేహాన్ని భద్రపరుస్తారు. ఇంత జరుగుతున్నా మెడికల్‌ కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ఈ తరహాలో వ్యాపారం చేస్తుంటే అధికారులకు తెలియదా? లేక వారికీ దీనిలో వాటాలు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా అక్రమ వ్యాపారం సాగిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? అని మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

    పనిచేయని ఫ్రీజర్‌ బాక్సులు

    రూ. 3 వేలు ఇస్తే ఫ్రీజర్‌ బాక్సు పురమాయింపు

  • సీహెచ్‌ఓల నిరసన గళం

    భీమవరం(ప్రకాశం చౌక్‌): గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న విలేజ్‌ క్లినిక్‌ సీహెచ్‌ఓలు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు జిల్లాలోని 364 మంది సీహెచ్‌ఓలు కలెక్టరేట్‌ ముందు టెంట్‌ వేసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారి సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గత 6 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాలు పెంచడం లేదని, ఉద్యోగ భద్రత లేదని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీహెచ్‌ఓలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించడం ఆవేదన వెలిబుచ్చారు. ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను రెగ్యులర్‌ చేయాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాకహాలు ఇవ్వాలని, ఈపీఎఫ్‌ పుననుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. క్లినిక్‌ అద్దె బకాయిలు చెల్లించాలని, ఇంక్రిమెంట్‌, ట్రాన్స్‌ఫర్‌, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయాలని కోరుతున్నారు.

  • అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించాలి
    ఆన్‌లైన్‌లో చాటింగ్‌.. ఆపై మోసం
    భీమడోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక మహిళకు ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి నమ్మించి బాధితురాలి నుంచి దఫాదఫాలుగా రూ.1,60,900లు స్వాహా చేశాడు. 8లో u
    కలెక్టర్‌ సి. నాగరాణి

    భీమవరం(ప్రకాశం చౌక్‌): అర్జీదారుల సమస్యలను క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి 246 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలు క్షుణ్నంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కాకపోతే మండల స్థాయి అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, కెఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ, వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్‌ కె.సి.హెచ్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్‌ పెంపు కోసం కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగుల వద్దకు జాయింట్‌ కలెక్టర్‌ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

  • వృద్ధుడిని అనాథగా వదిలేసిన కొడుకు

    తణుకు అర్బన్‌: వృద్ధుడిని అతని కుటుంబ సభ్యులు తణుకు రైల్వేస్టేషన్‌లో వదిలి వెళ్లిన ఘటన సోమ వారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన్‌లో మూలుగుతూ ఇబ్బందిపడుతున్న వృద్ధుడిని ప్రయాణికులు ప్రశ్నించగా.. తన పేరు ముత్యాల పల్లపరాజు అని తణుకు ముత్యాలవారి వీధిలో ఉంటున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధుడిని రైల్వే స్టేషన్‌లో వదలివెళ్లినట్లుగా రైల్వే పోలీసులు చెప్పారు. వృద్ధుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని, కాలుపై పుండు పడి దుర్వాసన వస్తుండడంతోపాటు రాత్రి నుంచి ఆహారం కూడా తీసుకోకపోవడంతో బాగా నీరసించిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు వదిలించుకోవాలని చూడడం బాధాకరమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వృద్ధుడి వ్యవహారం వైరల్‌ కావడంతో చివరకు మధ్యా హ్నం 2 గంటల సమయంలో అతని కుమారుడు వచ్చి తీసుకువెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు.

  • 3.01 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

    భీమవరం: జిల్లాలో 263 రైతు సేవ కేంద్రాల ద్వారా 1.14 కోట్ల గోనె సంచులు రైతులకు పంపిణీ చేశామని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి రబీ ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 263 రైతు సేవ కేంద్రాల ద్వారా 3,01,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, నగదు రైతుల ఖాతాలలో 48 గంటల లోగా జమ చేస్తున్నామన్నారు. 1.14 కోట్ల గోనె సంచులు పంపిణీ చేశామన్నారు. రైతుల తమ ఫిర్యాదులపై 81216 76653 నెంబరులో సంప్రదించి పరిష్కరించుకోవచ్చన్నారు.

Krishna

  • మంగళవ

    చిలకలపూడి(మచిలీపట్నం): రైతులకు సేవలు అందించాల్సిన రైతు సేవా కేంద్రాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరుతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా వైఎస్సార్‌ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సేవలు అందు బాటులో ఉండాలనే ఉద్దేశంతో పలు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రైతుల ముంగిటకే సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చిన ప్రభుత్వం, ఆ తరువాత వాటి ద్వారా రైతులకు సేవలు అందించకుండా నిర్వీర్యం చేస్తోంది.

    కొనుగోలు కేంద్రాలకే పరిమితం

    గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలను నేటి కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసింది. రైతు సేవలు అందించకుండా కేవలం రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి మాత్రమే పరిమితం చేసింది. కూటమి ప్రభుత్వంలో విద్యుత్‌, ఇంటర్‌నెట్‌ బిల్లులతో పాటు రావాల్సిన బకాయిల కోసం సిబ్బంది అడిగితే ఉన్నతాధికారులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి చేస్తే ఇతర పనులు అప్పగిస్తూ వేధింపు లకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. మరో వైపు పాడిపంటల మ్యాగ్‌జైన్‌కు కూడా లక్ష్యాలను నిర్దేశించటంతో వాటి చందా లను తామే వసూలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    పది నెలలుగా నిర్లక్ష్యం

    గతంలో మేలు

    సేవలు నిల్‌

    ఎరువుల బుకింగ్‌ లేదు

    గతంలో ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగు మందులు బుకింగ్‌ చేసుకునేవాళ్లం. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల ద్వారా ఆ అవకాశం లేదు. గతంలో కియోస్క్‌ మిషన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు బుక్‌చేస్తే నాణ్యమైన సరుకు వచ్చేది. వాతావ రణ మార్పులు, మద్దతు ధరలు ఎప్పటికప్పుడు తెలిసేవి.

    – పి.విశ్వేశ్వరరావు, రైతు, యండపల్లి,

    కృత్తివెన్ను మండలం

    పండిన పంట విక్రయించేందుకు ఖాళీ సంచుల కోసం రైస్‌ మిల్లర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ధాన్యం విక్రయించేందుకు ఖాళీ సంచులను రైతుభరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిల్లర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా పాత పద్ధతిలోనే ఖాళీ సంచులను సేవా కేంద్రాల వద్ద రైతులకు ఇవ్వాలి.

    – పెన్నేరు ప్రభాకరరావు, రైతుక్లబ్‌ కన్వీనర్‌,

    వడ్లమన్నాడు, గుడ్లవల్లేరు

    ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి సేవలు అందటం లేదు. గతంలో రైతులు రైతుభరోసా కేంద్రాలకు వెళ్తే వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండి ఏ విధమైన విత్తనాలు వేస్తే లాభసాటిగా ఉంటుందో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు.

    – ఎం.ఎం.నాంచారయ్య, మాజీ సర్పంచ్‌,

    ఎస్‌.ఎన్‌.గొల్లపాలెం, బందరు మండలం

    న్యూస్‌రీల్‌

    నిరుపయోగంగా కియోస్క్‌ యంత్రాలు

    గత ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామ పరిధి లోని రైతు భరోసా కేంద్రంలో కియోస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు అందేలా చర్యలు చేపట్టింది. అయితే ఈ యంత్రాల ద్వారా రైతులు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుమందులు బుకింగ్‌ చేసుకునే సౌకర్యంతో పాటు వాతావరణంలో మార్పులు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలో అంచనావేసే వారు. ఎప్పటికప్పుడు మద్దతు ధరలు కూడా ఈ యంత్రాల ద్వారా తెలుసుకునే వారు. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందులు బుకింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని ఆపే శారు. ఈ యంత్రాల ద్వారా రైతులకు అందే సేవలను అర్ధాంతరంగా నిలిపివేశారు.

    అలంకార ప్రాయంగా రైతు సేవా కేంద్రాలు గతంలో ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా సేవలు 363 రైతుసేవా కేంద్రాలకు 107 చోట్లే సొంత భవనాలు మరో 27 భవనాలు పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోని వైనం ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూలకుచేరిన కియోస్క్‌ యంత్రాలు

    జిల్లాలో వైఎస్సార్‌ సీపీ పాలనలో 363 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటయ్యాయి. 107 గ్రామాల్లో పక్కా భవనాలు నిర్మించారు. మరో 27 భవనాల నిర్మాణం పూర్తయింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రతి ఆర్బీకేలో గ్రామ ఉద్యాన అధికారి, గ్రామ వ్యవసాయాధికారి ఎవరో ఒకరు, సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉంటారు. రైతులకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఈ సిబ్బందిని రైతుల సేవలకు ఉపయోగించకుండా పలు సర్వేలు, పింఛన్ల పంపిణీ వంటి విధులకు వినియోగిస్తోంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, అద్దె చెల్లింపులు ఇతర అంశాలకు నిధులు ఇచ్చేవారు. విద్యుత్‌, ఇంటర్‌నెట్‌ బిల్లులు కూడా చెల్లించేవారు. గత ప్రభుత్వ పాలన ముగిసే సమయం వరకు ఎటువంటి పెండింగ్‌ లేకుండా బిల్లులు చెల్లించారు. విద్యుత్‌ బిల్లులకు అవసరమైన బడ్జెట్‌ను విద్యుత్‌శాఖకు కేటాయించేలా ఉత్తర్వులు ఇచ్చారు. హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సదుపాయం సమకూర్చేందుకు సైతం నిధులు కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నా ఇటువంటి వాటికి ఏ మాత్రం బిల్లులు కేటాయించకుండా పక్కదారి పట్టిస్తున్నా రని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • దుర్గ

    ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భద్రతా చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆలయానికి నిత్యం వేల మంది భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం తరలివస్తుంటారు. వారాంతాల్లో అయితే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో దుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయంలో కనీస తనిఖీలు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా ఉత్సవాల సమయంలో దేవస్థానం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మెటల్‌ డిటెక్టర్లు పని చేయడం లేదు. మహామండపం మొదలు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించే వరకు ఎక్కడా కూడా మెటల్‌ డిటెక్టర్లు పని చేస్తున్న దాఖలాలు లేవు. ఘాట్‌రోడ్డు మార్గంలో ఉన్న మెటల్‌ డిటెక్టర్లను లక్ష్మీగణపతి మందిరం పక్కనే ఉన్న గోశాలలో భద్రపరిచారు. లక్ష్మీగణపతి ప్రాంగణంలో షెడ్డు నిర్మాణం కోసం వాటిని తొలగించామని సిబ్బంది చెబుతున్నారు. కనీసం అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించే కీలక మార్గాల్లో వాటిని ఏర్పాటు చేయలేదు. మహామండపం దిగువన ఎటువంటి తనిఖీలు లేకుండానే భక్తుల బ్యాగులను భద్రపరుస్తున్నారు. క్యూలైన్‌లో ప్రవేశించే వారిని కనీస తనిఖీలు చేయడంలేదు. కొంత మంది భక్తులు బ్యాగులు, సంచులతోనే క్యూలైన్‌ ద్వారా అమ్మ వారి ఆలయ ముఖ మండపం వరకు వచ్చేస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది చేతిలో హ్యాండ్‌ డిటెక్టర్లు కనిపించడం లేదు. అధికారులు తక్షణం స్పందించి ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.

    క్యూలైన్లలో పనిచేయని మెటల్‌ డిటెక్టర్లు సెక్యూరిటీ చేతిలో కనిపించని హ్యాండ్‌ డిటెక్టర్లు ఆలయ ప్రాంగణంలో మచ్చుకై నా కనిపించని తనిఖీలు ఆలయంలోకి బ్యాగులు, సంచులతో వస్తున్న భక్తులు

  • కృష్ణ

    చిలకలపూడి

    (మచిలీపట్నం): కృష్ణా జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా జాహిద్‌ ఫర్హీన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఆమె సోమ వారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన జాహిద్‌ ఫర్హీన్‌ 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో పాల్గొన్నారు. అర్జీల స్వీకరణ, పరిష్కార కార్యక్రమాలను జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మతో కలిసి పరిశీలించారు.

    డీసీసీబీ చైర్మన్‌గా

    నెట్టెం రఘురాం

    చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా నెట్టెం రఘురాంను ప్రభుత్వం సోమవారం నియమించింది. ఇప్పటి వరకు డీసీసీబీ ప్రత్యేకాధికారిగా కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ వ్యవహరించారు. రఘురాం జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన నాయకుడు. గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

    డీసీఎంఎస్‌ చైర్మన్‌గా బండి రామకృష్ణ

    జిల్లా కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌గా బండి రామకృష్ణను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు డీసీఎంఎస్‌ ప్రత్యేకాధికారిగా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ వ్యవహరించారు. రామకృష్ణ మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

    ఏపీ ట్రెజరీ, అకౌంట్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

    భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ తొలి కౌన్సిల్‌ సమావేశం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జి.రవికుమార్‌, సహ అధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కె.రాజ్‌కుమార్‌, కార్యనిర్వాహక కార్యద ర్శిగా బి.శ్రీనివాసరావు, కార్యదర్శిగా జి.శ్రీనివాస్‌, కోశాధికారిగా ఎల్‌.వి.యుగంధర్‌ ఎన్నిక య్యారు. ఇద్దరు మహిళలతోపాటు ఏడుగురు సహాయ కార్యదర్శులకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు. ఎన్నికల అధికారిగా డివిజనల్‌ కో ఆపరేటివ్‌ అధికారి పి.కిరణ్‌కుమార్‌, సహాయ ఎన్నికల అధికారిగా గుంటూరు కలెక్టర్‌ కార్యాలయ తహసిల్దార్‌ రవికుమార్‌, ఎన్నికల పరిశీలకులుగా ఒంగోలు రిటైర్డ్‌ డెప్యూటీ డైరెక్టర్‌ పి.హనుమంతరావు వ్యవహరించారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు పాల్గొన్నారు.

    డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి

    మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించనందున అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వా లని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, కార్య దర్శి జి.రామన్న కోరారు. స్థానిక సున్నపు బట్టీల సెంటర్‌ సమీపంలో ఉన్న పూలే, అంబేడ్కర్‌ భవన్‌లో సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులతో సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కోరారు. ఏడేళ్లుగా డీఎస్సీ రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించనందున అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పరీక్షకు 45 రోజుల సమయమే ఉండటం వల్ల డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురతున్నారని, చదువుకోవడానికి 90 రోజుల సమయం ఇవ్వాలని, ఒక జిల్లాకు ఒకే పేపర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రామన్న మాట్లాడుతూ.. అభ్యర్థుల ఇబ్బందులు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాఖ్య నాయకులు శివ, కృష్ణ, డీఎస్సీ అభ్యర్థులు కరుణాకర్‌, బాబురావు, వీర్రాజు, ప్రసాద్‌, మోహన్‌ పాల్గొన్నారు.

  • పోర్టు పనులు సకాలంలో పూర్తి చేస్తాం
    మంత్రి జనార్దనరెడ్డి

    చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ అయిన పోర్టు నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బి.సి.జనార్దనరెడ్డి అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పోర్టు నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. పోర్టు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోర్టు మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి జనార్దనరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 30 శాతం పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. సకాలంలో పోర్టు నిర్మాణం పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. అమరావతికి అతిసమీపంలో ఉన్నందున మచిలీపట్నం పోర్టు కీలకంగా మారనుందన్నారు.

    త్వరితగతిన ఫిషింగ్‌ హార్బర్‌ పనులు

    త్వరితగతిన గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌ పనులను పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని మంత్రి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్‌, వంగలపూడి అనితతో కలిసి హార్బర్‌ పనులను జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జనార్దనరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు 57 శాతం హార్బర్‌ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 2026 మార్చి నాటికి ఈ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండోసారి కాలపరిమితి పొడి గించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.3,500 కోట్లతో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను పూర్తి చేస్తున్నామన్నారు. గిలకలదిండి హార్బర్‌ నిర్మాణం పూర్తయ్యాక ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారన్నారు. జూన్‌ 15 నాటికి బోట్లు జెట్టీకి వచ్చేలా చర్యలు చేపడ్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె. బాలాజీ, ఎస్పీ జి.గంగాధరరావు, మారి టైం బోర్డు సీఈఓ ప్రవీణ్‌ఆదిత్య, ఆర్డీఓ కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు.

    మైరెన్‌ పోలీస్‌స్టేషన్ల ద్వారా నిఘా

    మైరెన్‌ పోలీస్‌స్టేషన్‌ ద్వారా తీరప్రాంతాల్లో నిఘా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హార్బర్‌ పనులను పరిశీలించిన అనంతరం ఆమె మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 21 మైరెన్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే మూడు మైరెన్‌ పోలీస్‌స్టేషన్లు ఉండటం ఎంతో ఉపయోగకరమని వివరించారు.

  • అర్జీలను సత్వరం పరిష్కరించాలి

    చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా న్యాయమైన పరిష్కారం చూపాలని సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, ట్రైనీ కలెక్టర్‌ జాహిద్‌ ఫర్హీన్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తుంటారని, వారి సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆ సమస్యకు తగిన సమాధానాన్ని అర్జీదారునికి తెలపాలని స్పష్టంచేశారు. కోర్టు కేసులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాధానం పంపుతూ పెండింగ్‌లో లేకుండా క్లోజ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 168 అర్జీలను అధికారులు స్వీకరించారు.

    జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ పీజీఆర్‌ఎస్‌లో 168 అర్జీలు స్వీకరణ

  • ఏపీ ఎన్జీఓ నేతల కొవ్వొత్తుల ర్యాలీ

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రతిఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి పి. రమేష్‌ కోరారు. అమాయకులైన పర్యాటకులపై దాడిచేసి ప్రాణాలు తీయడం అమానుషమన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడి దేశ ప్రజల హృదయాలను తీవ్రంగా కలచివేసిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకయిన భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి దాడులను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిదని, ఈ కష్టకాలంలో వారికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలిచి మనోధైర్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి అమానవీయ చర్య అని, ముష్కరులు దాడికి తెగబడిన తీరును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహిస్తున్నవారిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ఏపీ ఎన్జీఓ నేతలు పలువురు పాల్గొన్నారు.

  • ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన

    విమానాశ్రయం(గన్నవరం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను సాధరణ పరిపాలన శాఖ జీఏడీ ప్రధాన కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. విమానాశ్రయంలో జరుగుతున్న ప్రధాన మంత్రి పర్యటన ఏర్పాట్లను శాంతి భద్రతల ఏడీజీపీ మధుసూదన్‌రెడ్డి, ఐజీ అశోక్‌కుమార్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. అంతర్జాతీయ టెర్మినల్‌లోని వీఐపీ లాంజ్‌రూమ్‌, ప్రధాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటైనర్‌ విరామశాల, హెలికాప్టర్లు దిగే ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు మీనా దిశానిర్దేశం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్‌.గంగాధరరావు, సహాయ కలెక్టర్‌ జాహిద్‌ ఫర్హీన్‌ తదితరులు పాల్గొన్నారు.

    కలెక్టర్‌ సమీక్ష

    అనంతరం ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జేసీ, ఎస్పీతో కలిసి కలెక్టర్‌ బాలాజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ అధికారులు మంగళవారం సాయంత్రం ఏఎస్‌ఎల్‌ సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్‌ తెలిపారు. విమానాశ్రయంలో అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించాలని సూచించారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటైనర్‌ విరామశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఎయిర్‌పోర్ట్‌లో దెబ్బతిన్న టైల్స్‌ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం.ఎల్‌.కె.రెడ్డి, ఆర్డీఓలు బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్‌, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్‌బాబు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఆర్టీఓ శ్రీనివాసరావు, ప్రొటోకాల్‌ అధికారి మోహన్‌రావు, డ్వామా పీడీ శివప్రసాద్‌ పాల్గొన్నారు.

  •  ● ఆపరేటర్లకు భద్రత కల్పించాలి  ● ఫైబర్‌నెట్‌ ఆపరేటర్స్

    ఫైబర్‌నెట్‌ను ఆర్థికంగా ఆదుకుని నిలబెట్టాలి

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ ఫైబర్‌ నెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి నిలబెట్టాలని ఫైబర్‌నెట్‌ ఆపరేటర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండారు కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం ఏపీ ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవానికి అతి తక్కువ ధరలో ఇంటర్నెట్‌ సర్వీసులను అందించే సత్తా ఒక్క ఏపీ ఫైబర్‌ నెట్‌కు మాత్రమే ఉందన్నారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ వ్యవస్థను నమ్ముకుని వేలాది మంది ఆపరేటర్లు స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. ఫైబర్‌ నెట్‌ను ఒకే మంత్రిత్వ శాఖ కింద నిర్వహించాలని, ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆర్థిక భరోసా, వ్యాపార భద్రత, జీవిత బీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంస్థకు రెగ్యులర్‌ ఎండీని నియమించాలని కోరారు. ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి సంస్థను కాపాడాలని, ఆపరేటర్లకు భరోసా కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మైపాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి బోయపాటి శివ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు అహ్మద్‌ ఆలీ, కోశాధికారి శ్రీనివాస్‌, వివిధ ప్రాంతాలకు చెందిన ఆపరేటర్లు పాల్గొన్నారు.

  • నాడు
    ● ఒకప్పుడు 72 షాపులతో వంద కోట్ల మేరకు వ్యాపారం ● నేడు సగం షాపుల్లోనే వ్యాపార లావాదేవీలు ● స్థానికంగా ఎక్కడికక్కడ ప్రైవేటు దుకాణాలు వెలవడమే కారణం

    విజయవాడరూరల్‌: ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన నున్న మ్యాంగో మార్కెట్‌ నేడు వ్యాపారాలు లేక వెలవెలబోతోంది. 1999 వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి కోటగిరి విద్యాధరరావు చేతుల మీదుగా ప్రారంభమైన నున్న మ్యాంగో మార్కెట్‌ దాదాపు 15 ఏళ్ల పాటు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. గత పది సంవత్సరాల నుంచి క్రమేపీ వ్యాపార లావాదేవీలు తగ్గుముఖం పట్టి తిరోగమనం దిశగా ఉంది. ఆసియాలోనే అతి పెద్ద మ్యాంగో మార్కెట్‌ గా పేరొందిన ఈ మ్యాంగో మార్కెట్‌ నుంచి సుమారు వంద కోట్ల రూపాయల వ్యాపారం ప్రతి మామిడి సీజన్లో జరిగేది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు విస్తృతంగా జరిగేవి. కాలక్రమంలో మండల స్థాయిలో ప్రైవేటుగా వ్యాపార దుకాణాలు ఈదర, నూజివీడు, ఎ. కొండూరు, విస్సన్నపేట, చనుబండ, జి.కొండూ రు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల నున్న మ్యాంగో మార్కెట్‌ దాని ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే మామిడి రైతులకు రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని, గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 72 షాపులకు గాను ఈ ఏడాది మామిడి సీజన్లో మార్కెట్లో 40 షాపుల్లో మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల నుంచి మామిడి పూత దశలో కోడిపేను అనే వ్యాధి సోకడంతో ఆశించిన మేర దిగుబడులు లేక జిల్లాలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది ఈ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా భూమిలో తేమశాతం అధికంగా ఉండి మంగు వ్యాధి ఎక్కువగా వచ్చింది. ఆ వ్యాధి ప్రభావంతో మామిడిలో నాణ్యత లోపించడం వలన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది 10 మంది బయ్యర్లు మాత్రమే రంగ ప్రవేశం చేశారు. దీంతో మామిడి కొనుగోళ్లు మందగించాయి. దీని ప్రభావంతో రోజుకు 20 లారీలు కూడా ఎగుమతులు జరగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మామిడి రైతుల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మామిడి పంట, మామిడి రైతులపై సానుకూల దృక్పథంతో ఆలోచించి ఇతర దేశాలకు కూడా మన మామిడి ఎగుమతులు జరిగేందుకు సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు.

    గత ప్రాభవం కోల్పోయిన నున్న మ్యాంగో మార్కెట్‌

    మామిడి దిగుబడులు తగ్గాయి

    నున్న గ్రామంలో నాకు నాలుగు ఎకరాల మామిడి తోటలున్నాయి. గత సంవత్సరం 30 టన్నుల మామిడి కాయల దిగుబడులు వచ్చి లక్ష రూపాయల ఆదాయం లభించింది. ఈ ఏడాది దిగుబడులు బాగా తగ్గిపోయాయి. వ్యాధులను నివారించడానికి మందులు వాడటంతో ఖర్చు పెరిగింది. ఖర్చులు పోను రూ.20వేల ఆదాయం కూడా వస్తుందనే ఆశ లేదు.

    –భీమవరపు శివశేషిరెడ్డి,

    మామిడి రైతు, నున్న

    అవగాహన సదస్సులు నిర్వహించాం

    మామిడి తోటలను ఆశించిన కోడిపేను, మంగు వ్యాధులను నివారించేందుకు రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించాం. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడి దిగుబడులు తగ్గాయి.

    –బాలాజీ జిల్లా ఉద్యానశాఖ అధికారి

  • ప్రతి సమస్యకు పరిష్కారం

    మీకోసంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు

    కోనేరుసెంటర్‌: మీకోసం కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల పోలీసులు సానుకూలంగా స్పందించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మసలుకోవాలని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, బాలింతలు న్యాయం కోసం వస్తే వారి సమస్యలను సామరస్యంగా ఆలకించటంతో పాటు సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.

    అర్జీలు...

    ● మచిలీపట్నంకు చెందిన ఓ వివాహిత ఎనిమిది నెలల క్రితం తనకు వివాహం జరిగిందని, వివాహ సమయంలో అత్తింటి వారు అడిగినంత కట్న కానుకలను తన పుట్టింటి వాళ్లు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్త తనను మానసికంగా వేధిస్తున్నారంటూ వాపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ వారిలో ఏ మార్పు లేదని, న్యాయం చేయమని ప్రాధేయపడింది.

    ● పామర్రు నుంచి రోహిత్‌ అనే యువకుడు తాను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా, తన సమీప బంధువు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని, ఉద్యోగం విషయంపై మాట్లాడుతుంటే రెండు సంవత్సరాలుగా ఎలాంటి సమాధానం చెప్పకపోగా తమపై దూషణకు పాల్పడుతూ బెదిరిస్తున్నాడని, న్యాయం చేయమని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

    ● గన్నవరం నుంచి 70 సంవత్సరాల వృద్ధుడు తనకు ఇద్దరు కుమారులు ఉండగా, ఇరువురికీ వివాహం జరిగిందని, తన భార్య మరణించినప్పటి నుంచి కొడుకులెవరూ భోజనం కూడా పెట్టటం లేదని కన్నీరు పెట్టుకున్నాడు. ఆస్తి మొత్తం వాళ్ల పేరిట రాసి తాను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, శారీరక దాడికి పాల్పడుతున్నారని, న్యాయం చేయమని ప్రాధేయపడ్డాడు. బాధితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

  • రాజధాని నిర్మాణం గర్వకారణం
    ● మే 2న ప్రధాని మోదీతో పునఃనిర్మాణ పనులు ప్రారంభం ● అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రులు, శాసనసభ్యులు

    చిలకలపూడి(మచిలీపట్నం): రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణంగా మిగలనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో సోమవారం మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్‌, వంగలపూడి అనిత, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మే2న ప్రధాని మోదీ రాక సందర్భంగా సభా ప్రాంగణం సమీపంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణాజిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ జి.గంగాధరరావు, శాసనసభ్యులు బోడే ప్రసాద్‌, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్‌, మారిటోరియం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, మాజీ మంత్రి పీతల సుజాత, అధికారులు పాల్గొన్నారు.

  • హైవేపై సినీఫక్కీలో చైన్‌స్నాచింగ్‌

    హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై ఓ కిలాడీ జంట బైక్‌పై వెళుతూనే సినీఫక్కీలో మరో స్కూటర్‌పై వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసులను చాకచాక్యంగా తెంచుకుని రెప్పపాటులో మాయమయ్యారు. బాపులపాడు మండలంలోని అంపాపురం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరుకు చెందిన కర్రె పోతురాజు, కనకరత్నం దంపతులు స్కూటర్‌పై గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా అంపాపురం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద వెనుకనుంచి వేగంగా బైక్‌పై వచ్చిన ఓ కిలాడీ జంట క్షణాల్లో మహిళ మెడలోని రెండు బంగారు గొలుసులను లాక్కుని పరారయ్యారు. భర్త పోతురాజు స్కూటర్‌ నడుపుతుండగా వెనుక సీటులో కూర్చున్న కనకరత్నం మెడలోని 32 గ్రాముల విలువైన రెండు బంగారు గొలుసులను దుండగులు బైక్‌ నడుపుతూనే దొంగిలించటం గమనార్హం. ఓ వ్యక్తి బైక్‌ నడుపుతుండగా వెనుక సీట్‌లో కూర్చున మహిళ చాకచక్యంగా కనకరత్నం మెడలోని బంగారు గొలుసులను లాక్కుంది. ఊహించని ఈ ఘటనతో అవాకై ్కన కనకరత్నం వెంటనే తేరుకుని కేకల వేయటంతో భర్త స్కూటర్‌ ఆపాడు. ఆ తర్వాత చోరీ జరిగిన విషయాన్ని భార్య చెప్పటంతో దుండగుల బైక్‌ను వెంబడించినప్పటికీ వారు మెరుపువేగంతో పరారయ్యారు. ఈ చోరీపై వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు కనకరత్నం ఫిర్యాదు ఇవ్వగా ఎస్‌ఐ శ్రీనివాస్‌ దర్యాప్తు చేపట్టారు. ఆత్కూర్‌ టోల్‌గేట్‌ సహా హైవేపై పలుచోట్ల సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, దుండగుల చిత్రాలను సేకరిస్తున్నారు.

  • క్షిపణి ప్రయోగ కేంద్రంకు పచ్చజెండా

    మే 2న ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవం

    అవనిగడ్డ: కృష్ణాజిల్లాకు మణిహారం కానున్న నాగాయలంక మండలంలోని గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రంకు ఎట్టకేలకు మోక్షం లబించింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 2వ తేదీన వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు.

    డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని 2011లో నిర్ణయించగా, 2012లో నాగాయలంక మండలం గుల్లలమోద అనుకూలమైనదిగా గుర్తించారు. ఈ ప్రాజెక్టు కోసం 386 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. 2017లో కొంత రెవెన్యూ భూమిని అటవీశాఖకు కేటాయించి ఆ మేరకు అటవీభూమిని ఈ ప్రాజెక్టుకు బదిలీచేశారు. ఇందుకోసం రూ.35కోట్లు చెల్లించారు. అదే సంవత్సరం తొలిదశ అనుమతులు లభించాయి. 2018లో ఈ ప్రాంతాన్ని సీఆర్‌జెడ్‌ పరిధి నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొలివిడతగా రూ.1800 కోట్లు నిధులు కేటాయించగా ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రహరీ, కొన్ని భవనాలు నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నారు.

    14 ఏళ్లకు మోక్షం

    మచిలీపట్నం ఆర్డీవో స్వాతి ఆదివారం గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్య క్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. గత 14 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంకు అడ్డంకులు తొలగి ప్రారంభోత్సవం కానుండటంతో దివిసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

NTR

  • ● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ● 173 మందికి రూ

    అవరోధాలను అధిగమించాలి

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సూచించారు. పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు సోమవారం ఉపకరణాల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అధికారులు, పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకు రూ.18.70 లక్షల విలువైన 273 పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. బ్యాటరీ ఆపరేటెడ్‌ మోటరైజ్డ్‌ ట్రైసైకిళ్లు, బ్రెయిలీ కిట్లు, క్రచ్‌ ఎల్బోలు, టీఎల్‌ఎం కిట్లు, వీల్‌ చెయిర్లు, వాకింగ్‌ స్టిక్‌లు, రోలటార్లు వంటి ఉపకరణాలు అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని కెరీర్‌ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందన్నారు. సదరం సర్టిఫికెట్లతో కొత్త పెన్షన్లు కూడా అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈవో యూవీ సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ జి.మహేశ్వరరావు, సమగ్ర శిక్ష అధికారి ఎల్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  • నాడు
    ● ఒకప్పుడు 72 షాపులతో వంద కోట్ల మేరకు వ్యాపారం ● నేడు సగం షాపుల్లోనే వ్యాపార లావాదేవీలు ● స్థానికంగా ఎక్కడికక్కడ ప్రైవేటు దుకాణాలు వెలవడమే కారణం

    విజయవాడరూరల్‌: ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన నున్న మ్యాంగో మార్కెట్‌ నేడు వ్యాపారాలు లేక వెలవెలబోతోంది. 1999 వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి కోటగిరి విద్యాధరరావు చేతుల మీదుగా ప్రారంభమైన నున్న మ్యాంగో మార్కెట్‌ దాదాపు 15 ఏళ్ల పాటు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. గత పది సంవత్సరాల నుంచి క్రమేపీ వ్యాపార లావాదేవీలు తగ్గుముఖం పట్టి తిరోగమనం దిశగా ఉంది. ఆసియాలోనే అతి పెద్ద మ్యాంగో మార్కెట్‌ గా పేరొందిన ఈ మ్యాంగో మార్కెట్‌ నుంచి సుమారు వంద కోట్ల రూపాయల వ్యాపారం ప్రతి మామిడి సీజన్లో జరిగేది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు విస్తృతంగా జరిగేవి. కాలక్రమంలో మండల స్థాయిలో ప్రైవేటుగా వ్యాపార దుకాణాలు ఈదర, నూజివీడు, ఎ. కొండూరు, విస్సన్నపేట, చనుబండ, జి.కొండూ రు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల నున్న మ్యాంగో మార్కెట్‌ దాని ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే మామిడి రైతులకు రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని, గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 72 షాపులకు గాను ఈ ఏడాది మామిడి సీజన్లో మార్కెట్లో 40 షాపుల్లో మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల నుంచి మామిడి పూత దశలో కోడిపేను అనే వ్యాధి సోకడంతో ఆశించిన మేర దిగుబడులు లేక జిల్లాలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది ఈ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా భూమిలో తేమశాతం అధికంగా ఉండి మంగు వ్యాధి ఎక్కువగా వచ్చింది. ఆ వ్యాధి ప్రభావంతో మామిడిలో నాణ్యత లోపించడం వలన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది 10 మంది బయ్యర్లు మాత్రమే రంగ ప్రవేశం చేశారు. దీంతో మామిడి కొనుగోళ్లు మందగించాయి. దీని ప్రభావంతో రోజుకు 20 లారీలు కూడా ఎగుమతులు జరగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మామిడి రైతుల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మామిడి పంట, మామిడి రైతులపై సానుకూల దృక్పథంతో ఆలోచించి ఇతర దేశాలకు కూడా మన మామిడి ఎగుమతులు జరిగేందుకు సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు.

    గత ప్రాభవం కోల్పోయిన నున్న మ్యాంగో మార్కెట్‌

    మామిడి దిగుబడులు తగ్గాయి

    నున్న గ్రామంలో నాకు నాలుగు ఎకరాల మామిడి తోటలున్నాయి. గత సంవత్సరం 30 టన్నుల మామిడి కాయల దిగుబడులు వచ్చి లక్ష రూపాయల ఆదాయం లభించింది. ఈ ఏడాది దిగుబడులు బాగా తగ్గిపోయాయి. వ్యాధులను నివారించడానికి మందులు వాడటంతో ఖర్చు పెరిగింది. ఖర్చులు పోను రూ.20వేల ఆదాయం కూడా వస్తుందనే ఆశ లేదు.

    –భీమవరపు శివశేషిరెడ్డి,

    మామిడి రైతు, నున్న

    అవగాహన సదస్సులు నిర్వహించాం

    మామిడి తోటలను ఆశించిన కోడిపేను, మంగు వ్యాధులను నివారించేందుకు రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించాం. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడి దిగుబడులు తగ్గాయి.

    –బాలాజీ జిల్లా ఉద్యానశాఖ అధికారి

  • పోలీస

    విజయవాడస్పోర్ట్స్‌: శనగరంలోని పోలీస్‌ కమిషనరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 78 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెఫ్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(డీసీపీ) ఎ.బి.టి.ఎస్‌.ఉదయరాణి తెలిపారు. ఆస్తి, నగదు వివాదాలపై 49, కుటుంబ కలహాలపై మూడు, మహిలళా సంబంధిత నేరాలపై నాలుగు, చోరీలపై ఐదు, కొట్లాటలపై ఎనిమిది, ఇతర సంఘటనలపై తొమ్మిది మంది ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన అనంతరం సదరు ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను ఆమె ఆదేశించారు.

    కెనాయింగ్‌ జాతీయ పోటీల్లో వర్షిత సత్తా

    విజయవాడస్పోర్ట్స్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 35వ కెనాయింగ్‌ కయాకింగ్‌ స్ప్రింట్‌ చాంపియన్‌షిప్‌లో విజయవాడ క్రీడాకారిణి గోగులూరి వర్షిత సత్తా చాటింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో సబ్‌ జూనియర్‌ 500 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు వర్షిత ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకాన్ని సాధించింది. వర్షిత పటమటలోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాయ్‌) శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. ప్రతిష్టాత్మకమైన జాతీయ పోటీల్లో పతకం సాధించిన క్రీడాకారిణి వర్షితను ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బ్రదర్‌ రాయప్పరెడ్డి, ఏపీ కెనాయింగ్‌ కయాకింగ్‌ సంఘం కార్యదర్శి శివారెడ్డి అభినందించారు.

    ఐటీఐల్లో ప్రవేశానికి అడ్మిషన్లు

    మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించామని ఐటీఐ కౌన్సెలింగ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ ఎం.కనకరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 24వ తేదీలోగా ఐటీఐ. ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు 8వ తరగతి పాస్‌ అయిన వారికి కూడా కొన్ని ట్రేడ్‌ల్లో అడ్మిషన్లు ఇస్తున్నామని ఆయన వివరించారు. విజయవాడ రమేష్‌ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలకు 94906 39639 నంబర్‌లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

  • ఫైబర్‌నెట్‌ను ఆర్థికంగా ఆదుకుని నిలబెట్టాలి
    ● ఆపరేటర్లకు భద్రత కల్పించాలి ● ఫైబర్‌నెట్‌ ఆపరేటర్స్‌ ఫెడరేషన్‌

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ ఫైబర్‌ నెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి నిలబెట్టాలని ఫైబర్‌నెట్‌ ఆపరేటర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండారు కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం ఏపీ ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవానికి అతి తక్కువ ధరలో ఇంటర్నెట్‌ సర్వీసులను అందించే సత్తా ఒక్క ఏపీ ఫైబర్‌ నెట్‌కు మాత్రమే ఉందన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్‌ విప్లవంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచగలిగే కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఫైబర్‌ నెట్‌కు ఉందన్నారు. అటువంటి ఫైబర్‌నెట్‌ ఒడు దొడుకులను ఎదుర్కొంటూ 10లక్షల కనెక్షన్ల నుంచి 5లక్షలకు దిగజారిందన్నారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ వ్యవస్థను నమ్ముకుని వేలాది మంది ఆపరేటర్లు స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. తాము లక్షలాది రూపాయలను పెట్టుబడులుగా పెట్టడమే కాకుండా వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి ప్రతి ఇంటికీ ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలను తీసుకువెళ్లడంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు. ఫైబర్‌ నెట్‌ను ఒకే మంత్రిత్వ శాఖ కింద నిర్వహించాలని, ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆర్థిక భరోసా, వ్యాపార భద్రత, జీవిత బీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంస్థకు రెగ్యులర్‌ ఎండీని నియమించాలని కోరారు. ఆర్థికంగా సహాయ, సహకారాలు అందించి సంస్థను కాపాడాలని, ఆపరేటర్లకు భరోసా కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మైపాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి బోయపాటి శివ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు అహ్మద్‌ ఆలీ, కోశాధికారి శ్రీనివాస్‌, వివిధ ప్రాంతాలకు చెందిన ఆపరేటర్లు పాల్గొన్నారు.

  • హైవేపై సినీఫక్కీలో చైన్‌స్నాచింగ్‌

    హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై ఓ కిలాడీ జంట బైక్‌పై వెళుతూనే సినీఫక్కీలో మరో స్కూటర్‌పై వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసులను చాకచాక్యంగా తెంచుకుని రెప్పపాటులో మాయమయ్యారు. బాపులపాడు మండలంలోని అంపాపురం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరుకు చెందిన కర్రె పోతురాజు, కనకరత్నం దంపతులు స్కూటర్‌పై గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా అంపాపురం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద వెనుకనుంచి వేగంగా బైక్‌పై వచ్చిన ఓ కిలాడీ జంట క్షణాల్లో మహిళ మెడలోని రెండు బంగారు గొలుసులను లాక్కుని పరారయ్యారు. భర్త పోతురాజు స్కూటర్‌ నడుపుతుండగా వెనుక సీటులో కూర్చున్న కనకరత్నం మెడలోని 32 గ్రాముల విలువైన రెండు బంగారు గొలుసులను దుండగులు బైక్‌ నడుపుతూనే దొంగిలించటం గమనార్హం. ఓ వ్యక్తి బైక్‌ నడుపుతుండగా వెనుక సీట్‌లో కూర్చున మహిళ చాకచక్యంగా కనకరత్నం మెడలోని బంగారు గొలుసులను లాక్కుంది. ఊహించని ఈ ఘటనతో అవాకై ్కన కనకరత్నం వెంటనే తేరుకుని కేకల వేయటంతో భర్త స్కూటర్‌ ఆపాడు. ఆ తర్వాత చోరీ జరిగిన విషయాన్ని భార్య చెప్పటంతో దుండగుల బైక్‌ను వెంబడించినప్పటికీ వారు మెరుపువేగంతో పరారయ్యారు. ఈ చోరీపై వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు కనకరత్నం ఫిర్యాదు ఇవ్వగా ఎస్‌ఐ శ్రీనివాస్‌ దర్యాప్తు చేపట్టారు. ఆత్కూర్‌ టోల్‌గేట్‌ సహా హైవేపై పలుచోట్ల సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, దుండగుల చిత్రాలను సేకరిస్తున్నారు.

  • రాజధాని నిర్మాణం గర్వకారణం
    ● మే 2న ప్రధాని మోదీతో పునఃనిర్మాణ పనులు ప్రారంభం ● అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రులు, శాసనసభ్యులు

    చిలకలపూడి(మచిలీపట్నం): రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణంగా మిగలనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో సోమవారం మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్‌, వంగలపూడి అనిత, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మే2న ప్రధాని మోదీ రాక సందర్భంగా సభా ప్రాంగణం సమీపంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణాజిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ జి.గంగాధరరావు, శాసనసభ్యులు బోడే ప్రసాద్‌, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్‌, మారిటోరియం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, మాజీ మంత్రి పీతల సుజాత, అధికారులు పాల్గొన్నారు.

  • క్షిపణి ప్రయోగ కేంద్రంకు పచ్చజెండా

    మే 2న ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవం

    అవనిగడ్డ: కృష్ణాజిల్లాకు మణిహారం కానున్న నాగాయలంక మండలంలోని గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రంకు ఎట్టకేలకు మోక్షం లబించింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 2వ తేదీన వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు.

    డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని 2011లో నిర్ణయించగా, 2012లో నాగాయలంక మండలం గుల్లలమోద అనుకూలమైనదిగా గుర్తించారు. ఈ ప్రాజెక్టు కోసం 386 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. 2017లో కొంత రెవెన్యూ భూమిని అటవీశాఖకు కేటాయించి ఆ మేరకు అటవీభూమిని ఈ ప్రాజెక్టుకు బదిలీచేశారు. ఇందుకోసం రూ.35కోట్లు చెల్లించారు. అదే సంవత్సరం తొలిదశ అనుమతులు లభించాయి. 2018లో ఈ ప్రాంతాన్ని సీఆర్‌జెడ్‌ పరిధి నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొలివిడతగా రూ.1800 కోట్లు నిధులు కేటాయించగా ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రహరీ, కొన్ని భవనాలు నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నారు.

    14 ఏళ్లకు మోక్షం

    మచిలీపట్నం ఆర్డీవో స్వాతి ఆదివారం గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్య క్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. గత 14 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంకు అడ్డంకులు తొలగి ప్రారంభోత్సవం కానుండటంతో దివిసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Nizamabad

  • నిజామాబాద్‌

    కమిటీ నిర్ణయమే కీలకం

    రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో

    కమిటీల నిర్ణయమే కీలకంగా మారింది.

    మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

    – 8లో u

    సీపీని కలిసిన ఆదర్శ రైతు

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ప్రకృతి వ్యవసాయ చేస్తున్న ఎడపల్లి మండలం జైతాపూర్‌ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కరు టూరి పాపారావు పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన వ్యవసాయం క్షేత్రంలో పండి న వివిధ రకాల పండ్లను సీపీకి అందించా రు. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు మహోత్సవంలో పాపారావు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించిన సీపీ.. పాపారా వు చేస్తున్న సుభాష్‌ పాలేకర్‌ వ్యవసాయ విధానంపై ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో తాజాగా కలిసి పండ్లను అందించినట్లు పాపారావు తెలిపారు.

    నేడు జిల్లా కాంగ్రెస్‌

    విస్తృతస్థాయి సమావేశం

    నిజామాబాద్‌ సిటీ: డిచ్‌పల్లి మండలంలోని కేఎన్‌ఆర్‌ గార్డెన్‌లో కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాన్సువాడ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్‌ భూపతిరెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు, ఆర్మూర్‌, బాల్కొండ ఇన్‌చార్జీలు వినయ్‌ రెడ్డి, సునీల్‌ రెడ్డి, బాన్సువాడ బాధ్యులు రవీందర్‌ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు.

    లండన్‌లో తప్పిపోయిన జిల్లా విద్యార్థి

    బాల్కొండ: నిజామా బాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రా మానికి చెందిన వి ద్యార్థి నల్ల అనురాగ్‌రెడ్డి ఈనెల 25న లండన్‌లో తప్పిపోయా డు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనురాగ్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం ఏడాదిన్నర క్రితం స్టూడెంట్‌ వీసాపై లండన్‌ వెళ్లాడు. ఈనెల 25న సాయంత్రం స్నేహితులతో కలిసి కార్డిప్‌ ప్రాంతానికి వెళ్లాడు. కొంత సమయం తర్వాత స్నేహితులకు కనిపించలేదు. దీంతో వారు అతడి తల్లి హరితారెడ్డికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. అనురాగ్‌రెడ్డికి ఫోన్‌ చేస్తున్నా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లి హరితారెడ్డి ఈ విషయాన్ని సోమవారం టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తన కుమారుడిని వెతికించి, స్వదేశానికి రప్పించాలని కోరారు. ఈరవత్రి అనిల్‌ స్పందించి సీఎంవో కార్యాలయ అధికారులతో మాట్లాడారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్‌లోని ఇండియా హైకమిషన్‌కు లేఖలు రాసినట్లు అనిల్‌ కుమార్‌ తెలిపారు.

    సుభాష్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని కూరగాయల హో ల్‌సేల్‌ మార్కెట్‌ విస్తరణ ఎప్పుడెప్పుడాని వ్యాపారులు, వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 12వేల క్వింటాళ్ల కూరగాయలు, ఆకుకూరల క్రయావిక్రయాలు మార్కెట్‌లో జరుగుతుంటాయి. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వ్యాపారులు, రైతులు కూరగాయలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్‌ ఇరుకుగా మారడంతో వ్యాపారులతోపాటు కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

    గాంధీగంజ్‌లో దశాబ్దాలపాటు కూరగాయల మార్కెట్‌ కొనసాగగా, నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో శ్రద్ధానంద్‌ గంజ్‌లో 2017లో కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ను 60 మడిగెలతో ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్‌లో 95 మంది వరకు వ్యాపారులు లైసెన్సులను కలిగి ఉండగా, 60 మందికి మడిగెలు కేటాయించారు. రైతులు సైతం తాము సాగు చేసి తీసుకొచ్చిన కూరగాయలను అక్కడే విక్రయిస్తుంటారు. ప్రతిరోజూ ఉదయం 4 నుంచి 9 గంటల వరకు హోల్‌సేల్‌ మార్కెట్‌ కొనసాగుతోంది.

    కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌లో ప్రతిరో జు సగటున 12వేల క్వింటాళ్ల కూరగాయలు, ఆకుకూరల క్రయవిక్రయాలు జరుగుతాయి. మార్కె ట్‌కు జూలై నుంచి ఫిబ్రవరి వరకు సరుకు ఎక్కువ మొత్తంలో, మార్చి నుంచి జూన్‌ వరకు వేసవి దృష్ట్యా కూరగాయలు తక్కువగా వస్తాయి. మహారా ష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌, రంగారెడ్డితోపాటు జిల్లాలోని వివిధ మండలాల నుంచి రైతులు, వ్యా పారులు కూరగాయలు ఇక్కడ విక్రయించేందుకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి కామారెడ్డి, బాన్సువాడ, నిర్మల్‌, జగిత్యాల, ఆర్మూర్‌, ఎల్లారెడ్డి డివిజన్‌లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ మండలాలు, గ్రామాలకు రిటైల్‌ వ్యాపారులు కూరగాయలు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు.

    సభ విజయవంతం

    చేసిన వారికి ధన్యవాదాలు

    ప్రకటనలో మాజీ మంత్రి,

    ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

    న్యూస్‌రీల్‌

    ఇరుకిరుకుగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌

    రోజూ 12వేల క్వింటాళ్ల

    హోల్‌సేల్‌ వ్యాపారం

    మహారాష్ట్ర, ఏపీ సహా జిల్లాల నుంచి కూరగాయలు తీసుకొస్తున్న వ్యాపారులు

    వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు

    తీవ్ర అంతరాయం

    ఇబ్బందులు పడుతున్న

    వ్యాపారులు, వినియోగదారులు

    ప్రతిపాదనలు పంపించాం

    నిజామాబాద్‌ కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ విస్తరణ కు ప్రతిపాదనలు పంపించాం. మార్కెట్‌ ఇరుకుగా మారడంతో నిత్యం ఫిర్యాదు లు వస్తున్నాయి. వినియోగదారులు, వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టు కుని రూ.కోటితో 40 మడిగెలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాం. మార్కెటింగ్‌శాఖ ఉ న్నతాధికారుల పరిశీలన కూడా పూర్తయ్యింది. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.

    – ముప్ప గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌, నిజామాబాద్‌

    నడవడమే కష్టం

    హోల్‌సేల్‌ మార్కెట్‌ హోల్‌ సేల్‌, రిటైల్‌ వ్యాపారులు, వినియోగదారులతో ప్రతిరోజూ కిటకిటలాడుతుంది. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల వరకు నడవ డం కూడా కష్టంగా ఉంటుంది. ఇదే అదను గా భావించి కొందరు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటనలు కూడా ఉన్నా యి. మార్కెట్‌లో నడవ డం కష్టం అనుకుంటే.. రి టైల్‌ వ్యాపారుల ఆటోలు, తోపుడు బండ్లు, వ్యాన్లు, మినీ డీసీఎంలతో మరింత ఇబ్బందికరంగా మారుతోంది. వినియోగదారులు, వ్యాపారులు పలుమార్లు ఈ విషయాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

  • ముగిసిన పశుగణన
    కేంద్రమే చెప్పాలి

    జిల్లాలో ఆరు నెలల పాటు

    కొనసాగిన సర్వే

    కేంద్ర ప్రభుత్వానికి చేరిన నివేదికలు

    త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం

    జిల్లాలో పశు గణన సర్వే పూర్తయి దాదా పు వారం రోజులవుతోంది. జిల్లాలో ఏ పశువులు ఎన్ని ఉన్నాయో పశుసంవర్ధక శాఖ వద్ద లెక్కలు ఉన్నాయి. కానీ, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ మే లెక్కలను ఆమోదించి బయటకు చెప్పాలి. దేశ వ్యాప్తంగా చేపట్టిన సర్వే కావడంతో ఒకేసారి పశు గణాంకాలు వెల్లడిస్తారు. 2018–19 గణంకాల ప్రకా రం జిల్లాలో ఆవులు, ఎడ్లు కలిపి 1,0,1252, గేదెలు 2,06,898, గొర్రెలు 7,06,898, మేకలు 1,05,089 ఉన్నాయి. అయితే ఈ సంఖ్యలో భారీ హెచ్చుతగ్గులు ఉండొచ్చు.

    డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 21వ అఖిల భారత పశు గణన జిల్లాలో ముగిసింది. పశువైద్య సిబ్బంది ఆరు నెలల పాటు శ్రమించి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ‘పశుధన్‌’ యా ప్‌ ద్వారా మొత్తం పదహారు జంతు జా తుల వివరాలను సేకరించగా, నివేదికలు ఆన్‌లైన్‌లో కేంద్రానికి చేరాయి. ఏ జాతి పశువులు ఎన్ని ఉన్నాయ నే గణంకాలు చె ప్పేందుకు సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే లెక్కలను త్వర లో విడుదల చేస్తుందని చెబుతున్నారు. నవంబర్‌లో మొదలైన పశు గణన కోసం పశుసంవర్ధక శాఖ 109మంది ఎన్యుమరేటర్లను, సర్వేను పర్యవేక్షించేందుకు 28మంది పర్యవేక్షకులను నియమించారు. సర్వే ప్రారంభమై మొదట్లో సిబ్బందికి ఇ బ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాలతో యాప్‌ పని చేయలేదు. దీంతో ఫిబ్రవరిలోనే పూర్తి కావాల్సిన సర్వే ఏప్రిల్‌ వరకు సాగింది. మొత్తం 31 మండలాల్లోని 545 గ్రామ పంచాయతీలతోపాటు పట్టణాల్లో కూడా పశు గణన చేపట్టారు. సుమారు 4లక్షల నివాస గృహాలకు వెళ్లి ఆయా ఇళ్లల్లో పశు సంపద వివరాలను యాప్‌లో నమోదు చేశారు. ఐ దేళ్ల క్రితం, ప్రస్తుతం చేపట్టిన సర్వే వివరాలను అనధికారికంగా చూస్తే చాలా వరకు పశు సంపద తగ్గినట్లు కనిపించిందని సర్వే చేసిన కొందరు సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రధానంగా గేదెలు, ఆవులు, ఎడ్లు, మేకలు, గొర్రెలు తగ్గే అవకాశం ఉందని, గేదెలు, ఆవులు తక్కువగా కనిపించాయంటున్నారు. నానాటికి పశు సంపద తగ్గిపోతున్న విషయాన్ని రైతులు సైతం అంగీకరించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ కొన్ని చోట్ల గేదెల పెంపకం పెరిగిందని, వ్యవసాయ క్షేత్రాలు, ఇళ్ల వద్ద డైయిరీలను ఏర్పాటు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.

    ఒకేసారి వివరాలు వెల్లడవుతాయి

    జిల్లాలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకేసారి పశుగణన వి వరాలను వెల్లడిస్తుంది. విడుదల చేసిన వెంటనే జి ల్లాలో ఏ పశువులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు చె ప్పేందుకు వీలుంటుంది. అప్పటి వరకు సర్వే వివరాలను బయటకు చెప్పలేము. బహుశా ఒకటి రెండు నెలల్లో లెక్కలు విడుదలయ్యే అవకాశం ఉంది.

    – రోహిత్‌ రెడ్డి, పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జేడీ

  • కాంగ్రెస్‌ వాళ్లు కళ్లుండి చూడలేకపోతున్నారు

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: బీఆర్‌ఎస్‌ సభకు అనుకున్నదానికన్నా ఎక్కువ మంది తరలివచ్చారని, స భ సక్సెస్‌ అయ్యిందని మీడియా మొత్తం చెబుతుండగా కాంగ్రెస్‌ వాళ్లు కళ్లుండి చూడలేకపోతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలు పుతున్నామని అన్నారు. నిజామాబాద్‌, కామా రెడ్డి జిల్లాల నుంచి సుమారు 40వేలకు మందికిపైగా సభకు హాజరైనట్లు తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపా రు. సభ సక్సెస్‌ కావడాన్ని కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అడ్డగోలుగా వాగుతున్నారని విమర్శించారు. 17 నెలల పాలనలో కాంగ్రెస్‌పై, సీఎం రేవంత్‌రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత సభకు వచ్చిన లక్షలాది ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఇతర యంత్రాంగాన్ని వాడుకుని సభ విజయవంతం కాకుండా కుట్రలు చేసినప్పటికీ ప్రజలు భారీగా తరలివచ్చారని, కాంగ్రెస్‌ కుట్ర కారణంగా సభకు చేరుకోలేకపోయిన వారు రోడ్లపై నే కిలోమీటర్ల కొద్దీ వేచి ఉన్నారని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్‌ ప్రజల నుంచి తప్పించుకోలేదని, ఆ పార్టీ వైఫల్యాలను బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ప్రజల పక్షాన ఎక్కడికక్కడ నిలదీస్తాయని స్పష్టం చేశారు.

    ఎండను లెక్కచేయకుండా..

    నిజామాబాద్‌అర్బన్‌: మండుటెండను లెక్కచేయకుండా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారని, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సభ సక్సెస్‌లో కీలక పాత్ర వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అభినందనీయులని పేర్కొన్నారు.

  • రికార్డులు తారుమారు చేస్తే పట్టాలు రద్దు

    ఎడపల్లి / రెంజల్‌ : మోసపూరితంగా హక్కుల రికా ర్డులను తారుమారు చేసి ప్రభుత్వ, భూదాన్‌, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేసే అధికారం భూ భారతి చట్టం కల్పించిందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. కొత్త చట్టంలో సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. ఎడపల్లి, రెంజల్‌ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో సోమవా రం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా మ్యుటేషన్‌ అధికారాలను స్థానిక అధికారు లకు కల్పించారని పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరగని పక్షంలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని, అవసరమైతే రైతులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. భూభారతితో భూ వివాదాలకు చెల్లు చీటి పెట్టవచ్చన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 17 రాష్ట్రాల్లో అమలవుతున్న తీరు ను అధ్యయనం చేసి తర్వాతే ఆర్‌వోఆర్‌ చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. 2014 జూన్‌ 2 కంటే ముందు తెల్ల కాగితాలపై రాసుకొని భూములు కొనుగోలు చేసి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఆర్డీవో విచారణ చేపట్టి అన్నీ సవ్యంగా ఉంటే రిజిస్ట్రేషన్‌, స్టాంపు డ్యూటీ ఫీజులు తీసుకొని పట్టా జారీ చేస్తారని తెలిపారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పు లుంటే సవరించుకునే వెసులుబాటును భూ భారతి కల్పిస్తోందన్నారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే అధికారులు గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, తహసీల్దార్లు శ్రావణ్‌కుమార్‌, ధన్వాల్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో రఫీయోద్దీన్‌, వ్యవసాయాధికారులు ప్రదీప్‌, శ్రీనివాస్‌రావ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.

    భూ భారతి చట్టంతో అధికారాలు

    కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

  • పొట్ట

    పొట్టకూటి కోసం పగటివేషం వేసిన కళాకారులు సోమవారం నిజామాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించారు. నలుగురు కళాకారులు వివిధ వేషధారణతో పాటలు పాడుతూ, డోలు, హార్మోనియం వాయిస్తూ వ్యాపార సముదాయాలు, దుకాణాల ఎదుట తమ కళను ప్రదర్శించారు. వ్యాపారులు ఇచ్చిన డబ్బును పోగు చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తాము ఎన్నో ఏళ్ల క్రితం తెలంగాణలో స్థిరపడ్డామని, తమ

    పూర్వీకుల నుంచి వస్తున్న కళను ప్రదర్శిస్తూ పొట్టపోసుకుంటున్నామని వారు తెలిపారు.

    – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌–నిజామాబాద్‌

  • గంజాయిపై ఉక్కుపాదం

    మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): గంజాయి రవాణా, సాగుపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లావ్యాప్తంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. మోపాల్‌ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సాయంత్రం సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో కేసుల వివరాలను ఎస్సై యాదగిరి గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ మొత్తం కలియతిరిగి సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ మత్తుపదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ చేపట్టాలని సూచించారు. సైబర్‌ మోసాలు, గేమింగ్‌ యాప్‌లతో నష్టపోకుండా అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు మంచిప్ప కొండెం చెరువు, పెద్ద చెరువు వద్ద చేపడుతున్న ప్రాజెక్టు ను సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సౌత్‌ రూరల్‌ సీఐ సతీశ్‌కుమార్‌, ఎస్సై యా దగిరి గౌడ్‌, ఏఎస్సై రమేశ్‌ బాబు ఉన్నారు.

    సీపీ సాయి చైతన్య

  • సిద్ధులగుట్టపై చిరుత

    చిల్డ్రన్స్‌ పార్క్‌ సమీపంలో

    సంచారం

    వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన భక్తులు

    ఆర్మూర్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని నవనాథ సి ద్ధులగుట్టపై సోమవారం చిరుత సంచరించింది. నవనాథ సిద్ధేశ్వరాలయంలో ప్రతి సోమ వారం ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. గుట్టపై ఉన్న చిల్డ్రన్స్‌ పార్క్‌ సమీపంలో రాళ్ల మధ్య చిరుతను చూసిన కొందరు భక్తులు వీడియోతీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమా చారం అందించారు. ఏడేళ్ల క్రితం ఇదే గుట్టపై చిరుత పులి కనిపించడంతో అటవీ శాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు బోను ఏర్పా టు చేసినప్పటికీ చిక్కలేదు. తాజాగా మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు, పట్టణ ప్రజ లు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించాలని కోరుతున్నారు.

  • ప్రజావాణికి 114 ఫిర్యాదులు

    నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అదనపు కలెక్టర్‌తోపాటు నిజామాబాద్‌ ఇన్‌చార్జి ఆర్డీవో స్రవంతి, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌కు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  • మామను చంపిన అల్లుడు

    నవీపేట: మండలంలోని అనంతగిరి గ్రామంలో మామ అల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణలో మామ హతమయ్యాడు. నిజామాబాద్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై వినయ్‌లు సోమవారం వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని కచర్‌దాం జిల్లా చిర్పాలి గ్రామానికి చెందిన బిలంసింగ్‌ మరవి(48) కూతురు గోమతి దుర్వే, అల్లుడు రాజేష్‌ దుర్వేలతో కలిసి మండలంలోని గోదాం నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. రాజేష్‌ దుర్వే తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈవిషయమై ఆదివారం రాత్రి మద్యం సేవించాక మామ, అల్లుడు గొడవపడ్డారు. ఆగ్రహానికి లోనైన అల్లుడు ఇటుకను తీసుకొని మామ తలపై విచక్షణరహితంగా బాదాడు. దీంతో మామ బిలం సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Siddipet

  • మున్స

    సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్‌తో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పౌర సేవలు, నూతన ఇంటి అనుమతులు, వివిధ రకాల పన్నుల చెల్లింపు, మ్యుటేషన్‌ తదితర అంశాలపై అనుమానాలు, సందేహాలు, ఫిర్యా దులను నేరుగా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

    ఫోన్‌ చేయాల్సిన నంబర్లు :

    98668 98692, 98665 53321

  • సోలార

    ముందుకు రాని రైతులు

    ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 363 మంది దరఖాస్తు

    ఇప్పటి వరకు ఈఎండీ చెల్లించింది 94 మందే

    సబ్సిడీ అందించాలంటున్న అన్నదాతలు

    ‘పీఎం కుసుమ్‌’లో 0.5 నుంచి 2 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం

    జిల్లా పేరు దరఖాస్తులు ఈఎండీ

    చెల్లించిన వారు

    సిద్దిపేట 179 37

    మెదక్‌ 74 24

    సంగారెడ్డి 110 33

    దరఖాస్తు చేసిన రైతు భూమిని

    పరిశీలిస్తున్న రెడ్కో అధికారులు

    ‘సౌర’ పంటకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. పీఎం– కుసుమ్‌ పథకం కింద పంట పొలాల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో దరఖాస్తులను గత ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్వీకరించారు. రైతు కనీసం 0.5 నుంచి 2 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్న రైతులు ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

    సాక్షి, సిద్దిపేట: సాగు, బీడు భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులు ఆదాయం పొందాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. పీఎం – కుసుమ్‌లో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 430 విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రాంతాలను ఎంపిక చేశారు. వీటి పరిధిలో 363 మంది రైతులు దరఖాస్తు చేయగా అందులో ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌)ను 94 మంది రైతులు మాత్రమే చెల్లించారు. ఈ ఈఎండీలు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుంది.

    మెగావాట్‌కు రూ.3 కోట్లు

    ఒక్క మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి కోసం సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఏదైన బ్యాంక్‌ రుణం పొందితే మెగావాట్‌కు 30శాతం లెక్కన రైతులు దాదాపు రూ.85లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్లాంటు నుంచి విద్యుత్తు సబ్‌స్టేషన్‌ వరకు వేసే విద్యుత్తు లైన్‌ కోసం కిలో మీటరుకు రూ. 5లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ముందుకు రావడం లేదని దరఖాస్తు చేసిన రైతులు అంటున్నారు. కొంత ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందజేయాలని రైతులు కోరుతున్నారు.

    భూముల్లో కరెంట్‌ ఉత్పత్తి

    ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగా వాట్ల సామర్థ్యం వరకు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషనర్‌ (టీజీఈఆర్సీ) ఒక్కో యూనిట్‌కు రూ.3.13లను నిర్ణయించిన టారిఫ్‌ ప్రకారం కొనుగోలు చేయనున్నారు. దీంతో రైతులకు ఆదాయం రానుంది. ఒక్క మెగావాట్‌ ప్లాంట్‌లో రోజుకు 4600 నుంచి 5వేల యూనిట్ల వరకు సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈలెక్కన యేడాదికి సుమారు రూ.60 లక్షల వరకు పొందవచ్చు.

    జనవరి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి

    దరఖాస్తు చేసి ఈఎండీ చెల్లించిన వారిచే డిసెంబర్‌ వరకు సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం. అలాగే ఈ ప్లాంట్‌ జనవరి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఈ నెలాఖరు వరకు ఈఎండీ చెల్లించే గడువు ఉండటంతో మరి కొందరు చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి.

    –రవీందర్‌ చౌహాన్‌, డీఎం, రెడ్కో

  • ఇంటి పెరట్లో.. మేడపైన మొక్కలు పెంచడం సహజం. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆటోపై మట్టికుండీలు అమర్చి వాటిలో మొక్కలు పెంచుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు ఓ ఆటోవాలా. అంతే కాదండోయ్‌ పర్యావరణం పట్ల తన ఆటోలో ప్రయాణించేవారికి అవగాహన కల్పిస్తున్నారు. మండుతున్న వేసవిలోనూ ఈ ఆటోలో ప్రయాణిస్తే చాలా కూల్‌కూల్‌గా ఉంటోంది. వినూత్న పద్ధతిలో ఆటోను డిజైన్‌ చేసి నడుపుతున్న డ్రైవర్‌ అంజిని ‘సాక్షి’ సోమవారం పలకరించింది. మహబుబాబాద్‌ జిల్లా పూసపల్లికి చెందిన అంజి తన ఆటోకు పచ్చిగడ్డి, పూలమొక్కలను ఏర్పాటు చేసి ప్రకృతిని కాపాడాలంటూ వందల కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులు ఉపశమనం పొందేలా కూలర్‌ లాంటి ఫ్యాన్‌ను, చల్లని మంచినీటిని ఏర్పాటు చేశారు. వికలాంగులు, కంటి చూపు లేని వారిని ఉచితంగా తన ఆటోలో తమ తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నట్లు అంజి తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని కాపాడాలని, ప్రకృతిని ప్రేమించాలని కోరుతున్నారు అంజి. – సిద్దిపేటకమాన్‌

  • భూభార

    రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    వర్గల్‌ మండలం శాకారంలో చట్టంపై అవగాహన సదస్సు

    పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌

    వర్గల్‌(గజ్వేల్‌): దేశంలోనే చరిత్రాత్మకంగా, రోల్‌మోడల్‌గా భూభారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్‌ మనుచౌదరి అధ్యక్షతన వర్గల్‌ మండలం శాకారంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిలతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతులు ఆత్మగౌరవంతో జీవించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం ఒక వరమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా నిలిచిన భూ సమస్యలు పరిష్కారం కానున్నాయని వివరించారు. మనిషికి ఆధార్‌ మాదిరిగా, భూమి ఉన్న ప్రతి రైతుకు హక్కులు కల్పిస్తూ భూధార్‌ సంఖ్య కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ధరణి పోర్టల్‌తో అనేక ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు, వక్ఫ్‌, దేవాదాయ తదితర భూములు పక్కదారి పట్టాయన్నారు. వేలాది ఎకరాలు పార్ట్‌బీలో చేరాయని, సాదాబైనామాలు పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌ దరఖాస్తులకే పరమితమయ్యాయన్నారు. రికార్డులో తప్పుల నమోదుతో అత్యవసర పరిస్థితులలో అర ఎకరం భూమి అమ్ముకుందామంటే అమ్మలేని దయనీయ స్థితిని ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారంగా భూభారతి చట్టం తీసుకువచ్చామన్నారు. దీనిని చట్టబద్ధం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే తమ ఉనికికే ప్రమాదమని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ నానా ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌ నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడికి అండగా నిలుస్తూ సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా ప్రజల్లోనే ఉంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, గజ్వేల్‌ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రికార్డుల పరంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న భూసంబంధ సమస్యలను వేదికపై మంత్రికి నివేదించారు. వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా ఇదే వేదికపై పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.

  • అర్జీ

    అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌

    సిద్దిపేటరూరల్‌: ప్రజలు అందజేసిన అర్జీలను సత్వర పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి గరిమా అగర్వాల్‌ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూ సంబంధిత, హౌసింగ్‌, ఆసరా పింఛన్ల, వివిధ సమస్యలపై మొత్తంగా 59 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

    ధాన్యం కొనుగోళ్లలో

    అలసత్వం తగదు

    మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి

    దుబ్బాక: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం తగదని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ పాతూరి శ్రీనివాస్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు. సోమవారం మున్సిపల్‌ పరధిలోని చెల్లాపూర్‌ 2, 3 వార్డులలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ, తూకం విషయంలో ఏ మాత్రం పొరపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. మండుతున్న ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తున్నందునా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఇంటి పన్ను చెల్లించే వారికి అందించే ఎర్లీబర్డ్‌ పథకం మరో రెండు రోజుల్లో ముగుస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెప్మా సీఈఓ సరిత, ఆర్పీలు, రైతులు తదితరులు ఉన్నారు.

    చేర్యాల మహిళకు

    సీ్త్ర శక్తి అవార్డు

    చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రానికి చెందిన పి.మంగ రాష్ట్ర స్థాయి సీ్త్ర శక్తి అవార్డు అందుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా డీఆర్డీఓ సిద్దిపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల ఆధ్వర్యంలో అవార్డులు వరించాయి. జిల్లా తరఫున చేర్యాలకు చెందిన నకాషి కళాకారిని పి.మంగ రూపొందించిన చేర్యాల మాస్క్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డును మంత్రి సీతక్క, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీపీఎం కరుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.