Archive Page | Sakshi
Sakshi News home page

National

  • న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్‌ సంస్థ భారీగా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో మహిళ టాటా గ్రూప్‌ వాళ్లకే రెండు కోట్ల రూపాయలు ఎదురిస్తానంటోంది. బదులుగా.. చనిపోయిన తన తండ్రిని ప్రాణాలతో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తోంది. నవ్వుతూ నిత్యం తమ మధ్య తిరిగిన తండ్రి.. తాజా ఘటనలో దుర్మరణం పాలై మృతదేహాం జాడ కూడా లేని స్థితిలో ఉన్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

    ‘‘నా తండ్రే పోయాక మీ పరిహారం ఎవరికి కావాలి. నేను వాళ్లకు రెండు కోట్ల రూపాయిలిస్తా. బదులుగా చనిపోయిన నా తండ్రిని బతికించి తీసుకురండి. వాళ్లు ఇచ్చే పరిహారం నా తండ్రిని వెనక్కి తెస్తుందా?.. నాకు నా తండ్రి, ఆప్యాయతలు కావాలి. వాటి కోసం వాళ్లలా ఎంతైనా నేను ప్రకటిస్తా’’ అంటూ ఫాల్గూని అనే మహిళ కన్నీరు పెట్టుకుంది. 

    ఫాల్గునితో పాటు బాధిత కుటుంబాలు అహ్మదాబాద్‌ బీజే మెడికల్‌ కాలేజీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండోరోజూ డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్‌ సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నాం. ఫలితాలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది?. . ఎప్పుడు మా వాళ్లను అప్పగించేది? అని ఫాల్గునితోపాటు మరికొందరు అధికారులను నిలదీశారు.

    మరోవైపు.. అధికారులు మాత్రం తమ బృందాలు అహర్నిశలు పని చేస్తున్నాయని చెబుతున్నారు. ‘‘దాదాపుగా బంధువుల నుంచి శాంపిల్స్‌ సేకరించాం. ఇప్పటికే 240 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాం.  డీఎన్‌ఏ మ్యాచింగ్‌ ప్రక్రియ పూర్తి కాగానే.. వీలైనంత త్వరగా మృతదేహాలు అప్పగిస్తాం’’ అని ఓ అధికారి వెల్లడించారు. 

Politics

  • సాక్షి, అన్నమయ్య: టీడీపీ అధికార కూటమిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ నేతలపై టీడీపీ సీనియర్‌ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. సంవత్సర కాలంగా పార్టీలో అవమానాలను భరిస్తున్నాం.. తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలను అని హెచ్చరించారు.

    చిన్నమండ్యంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు సంస్మరణ సభలో టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు తన ఆగ్రహం వెల్లగక్కారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సొంత గడ్డపై మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసాద్‌ బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి చనిపోయే వరకు పార్టీ కోసమే కష్టపడిన నాయకుడు పాలకొండ్రాయుడు. అలాంటి ‍వ్యక్తి కుటుంబ సభ్యులం మేము. తెలుగుదేశం పార్టీలోనే మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.

    మా అన్న సుగవాసి సుబ్రహ్మణ్యంను పార్టీలోని కొందరు వ్యక్తులు ఇబ్బంది పెట్టారు. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఏడాది పాటు పార్టీలో అవమానాలను భరించారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లో ఆదరణ లేనట్టా. పలు చోట్ల టీడీపీ ఇన​్‌ఛార్జ్‌లు ఓడిపోలేదా?. అయినప్పటికీ వారు ఇన్‌చార్జ్‌ పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఒక్క రాజంపేటలో మాత్రమే ఇన్‌ఛార్జ్‌ పదవి ఎందుకు ఇవ్వలేదు. ఓడిపోతే ఇలా అవమానిస్తారా?. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలను’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 

    టీడీపీ బాల సుబ్రహ్మణ్యం రాజీనామా..
    ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మహానాడు జరిగిన పది రోజులకే సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీలో నేను అవమానాలు ఎదుర్కొంటున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక, ఆయన 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన సంగతి విధితమే.

    మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. పాలకొండ్రాయుడు 1984 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్రహ్మణ్యం కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజంపేట నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా గ్రూప్‌‌వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి పార్టీ నేతలు మూడు గ్రూపులోగా విడిపోయారనే టాక్ ఉంది. 

International

  • న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ను పాకిస్తాన్‌కు చెందినదిగా  గుర్తిస్తూ, భారత అంతర్జాతీయ సరిహద్దుల తప్పుడు మ్యాప్‌ను ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎస్‌) కొద్దిసేపటికి తమ పొరపాటును గమనించి, భారత్‌ను క్షమాపణలు కోరాయి. ఈ మ్యాప్‌లో సరిహద్దులను ఖచ్చితంగా చిత్రీకరించలేదని అని ఐడీఎఫ్ అంగీకరించింది. కొందరు భారతీయులు చేసిన ట్వీట్‌ల దరిమిలా, ఐడీఎఫ్ ఈ విధంగా స్పందించింది.

    భారతీయుల మండిపాటు..
    పలువురు యూజర్లు మ్యాప్‌లోని లోపాన్ని ఎత్తి చూపుతూ, ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ఈ పోస్ట్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. కొందరైతే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తమ పోస్టులకు  ట్యాగ్ చేశారు. ఇండియన్ రైట్ వింగ్ కమ్యూనిటీకి చెందిన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో వచ్చిన ఒక ట్వీట్‌పై ఇజ్రాయెల్ రక్షణ దళాల స్పందించాయి. ఈ మ్యాప్ సరిహద్దులను ఖచ్చితంగా  చూపించడంలో విఫలమైంది. జరిగిన తప్పిదానికి  క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌ రక్షణ దళాల పోస్ట్  వెలువడిన 90 నిమిషాల తర్వాత  ఈ పరిణామం చోటుచేసుకుంది.
     

    భారత్‌ ఏనాడో స్పష్టం..
    ఐడీఎఫ్ పోస్ట్‌ చేసిన తప్పుడు మ్యాప్‌పై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. దశాబ్దాలుగా పాకిస్తాన్, చైనాలు  ఆక్రమించుకున్న జమ్ముకశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు దేశంలో అంతర్భాగమని  భారత్‌ ఏనాడో స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని దీనిని పునరుద్ఘాటించారు. గత కొన్నేళ్లుగా భారత్‌- ఇజ్రాయెల్ స్నేహపూర్వక సంబంధాన్ని  కొనసాగిస్తున్నాయి. 2017లో  ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. ఈ నేపధ్యంలో భారతదేశ సరిహద్దులకు సంబధించిన తప్పుడు మ్యాప్‌ను ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది.

     

    ఇజ్రాయిల్‌ క్షిపణి సామర్థ్యం పరిధిలో..
    ‘ప్రపంచానికున్న పెను ముప్పు ఇరాన్‌.. ఇదొక్కటే ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు. ఇది ప్రారంభం మాత్రమే’ అంటూ ఇజ్రాయెల్ సైన్యం పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని పలు ప్రాంతాలను చూపించే మ్యాప్‌ను జత చేసింది. దీనిలో భారత సరిహద్దులను తప్పుగా చూపింది. ఈ మ్యాప్‌లో ఇరాన్ చుట్టూ ఎరుపు రంగు  వృత్తాలు ఉన్నాయి. ఇవి టెహ్రాన్‌కున్న క్షిపణుల పరిధిని సూచిస్తాయి. సౌదీ అరేబియా, ఆఫ్రికాలో లిబియా, ఇథియోపియా, ఆసియాలో భారత్‌, చైనా, ఐరోపాలో రొమేనియా, బల్గేరియా, రష్యా, టర్కీలు ఈ వృత్తాలలో కనిపిస్తున్నాయి. ఈ మ్యాప్‌ వివాదిస్పదంగా మారింది.

     

     ఇది కూడా చదవండి: Air India Crash: నాడు ‘ఎంపరర్ అశోక’.. నేడు ‘డ్రీమ్‌ లైనర్‌’.. అదే విషాదం

     

Telangana

  • హైదరాబాద్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని మెరీడియన్‌ విద్యాసంస్థల సీఈవో బుట్టా తేజస్వి అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్‌లో మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు, సిబ్బంది, పాఠశాల ఉద్యోగులు రక్తదానం చేశారు. 

    అనంతరం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కరణం భవానీ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మంది రక్తం లేక చనిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా తమ రక్తదాన్ని బ్లడ్‌ బ్యాంకుల్లో దానం చేయాలని దీని వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 80 మందికి పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు రక్తదానం చేసినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. 

  • యాదగిరిగుట్ట: ఆలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందారు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. 

    రెండు రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను.. ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలోని ఇంట్లో ఉరివేసుకుని ఉండ వచ్చునని గ్రామస్తులు అంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రాత్రికి రాత్రి రవి మృత దేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అయిలయ్య సందర్శించారు. 

Family

  • అన్ని విజయాలను ఒకే గాటన కట్టలేము. అన్నీ అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని విజయాలు నల్లేరు మీద నడక అవుతాయి. కొన్ని విజయాలు అలా కాదు... కారుమేఘాల్లాంటి ప్రతికూల పరిస్థితులను చీల్చుకొని వెలుగు కిరణాలు అవుతాయి.  ఇందుకు సాక్ష్యం కశ్మీరి అమ్మాయి జెనిస్‌... ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధవాతావరణ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మరీ జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌)లో  విజయం సాధించింది.

    పరీక్షకు ప్రిపేర్‌ కావాలంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రతతో చదవాలి. అయితే జెనిస్‌ ప్రిపరేషన్‌కు అవేం లేవు. ‘జేఈఈ’ పరీక్షలకు కొన్నిరోజుల ముందు... పాకిస్తాన్‌ బాంబుల శబ్దం వినిపించేది. మరోవైపు విరామం ఇవ్వని సైరన్లు.  భయపెట్టేలా ఆకాశంలో డ్రోన్లు.ఎటు చూసినా భయానకమైన వాతావరణం.‘జేఈఈ పరీక్ష వాయిదా పడితే బాగుండేది’ అని మనసులో చాలాసార్లు అనుకుంది జెనిస్‌.‘ఇంత భయానక పరిస్థితుల్లో పరీక్ష రాయగలనా అనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది. ప్రిపరేషన్‌ సంగతి ఎలా ఉన్నా ‘పరీక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకోగలనా? అసలు వెళ్లగలనా?’ అనే సందేహం ఆమె మనసులో సుడులు తిరిగేది. ‘ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని పరీక్షకు పంపడం సరిౖయెనదేనా?’ అని జెనిస్‌ తల్లిదండ్రులూ ఆలోచనలో పడ్డారు.

    ఇదీ చదవండి: Air India plane crash కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!

    ‘స్కూలు రోజుల్లో నాకు జేఈఈ గురించి బొత్తిగా తెలియదు. కశ్మీర్‌లో చాలామంది తల్లిదండ్రులకు జేఈఈ గురించి తెలియదు. తమ పిల్లలను మెడిసిన్‌ చదివించా లనుకుంటారు. కశ్మీర్‌లో జేఈఈ కోచింగ్‌ సెంటర్‌లు కూడా చాలా తక్కువ. ఇంటర్మీడియెట్‌లో జేఈఈ గురించి తెలిసిన తరువాత నాలో ఆసక్తి పెరిగింది. జేఈఈ ఎగ్జామ్స్‌ రాయాలనుకున్నాను. గూగుల్‌ నాకు కోచింగ్‌ సెంటర్‌గా మారింది. జేఈఈ పరీక్షకు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్‌ చేసేదాన్ని’ అంటుంది జెనిస్‌.

    మొదటి ప్రయత్నంలో విఫలం అయినా రెండో ప్రయత్నంలో ‘జేఈఈ’లో విజయం సాధించింది. మొదటిసారితో పోల్చితే రెండోసారి ‘జేఈఈ’ కోసం ప్రిపేరవుతున్నప్పుడు బయటి పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి.
    ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌ మరో సమస్య. కరెంట్‌ కోతలు సరేసరి. ‘ఇంటర్‌నెట్‌ లేకపోతే ఆ ప్రభావం ప్రిపరేషన్‌పై పడుతుంది. ఎందుకంటే నేను కోచింగ్‌ సెంటర్‌లో చేరలేదు’ అంటుంది జెనిస్‌. అయినప్పటికీ ‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అనే గట్టి పట్టుదలతో విజయం సాధించింది పుల్వామాకు చెందిన జెనిస్‌.

    ‘మా  ప్రాంతంలో ఇంజనీరింగ్‌ అంటే అబ్బాయిలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. నా తల్లిదండ్రులకు జేఈఈ గురించి తెలియదు. నన్ను మెడిసిన్‌ చదివించాలనేది వారి కోరిక. నేను వారికి జేఈఈ గురించి వివరించాను. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్‌ అంటే ఇష్టం. జేఈఈ గురించి చెప్పినప్పుడు నువ్వు మెడిసిన్‌ చదవాల్సిందే అనకుండా నన్ను ప్రోత్సహించారు’ అని చెప్పింది జెనిస్‌. ‘జేఈఈ’ ప్రిపేర్‌ కావడానికి ముందు ఎంతోమంది బంధువులు జెనిస్‌ తల్లిదండ్రులతో.. ‘జేఈఈ అంటే అబ్బాయిలు రాసే పరీక్ష. మీరు జెనిస్‌తో మెడికల్‌ ఎంట్రెన్స్‌ రాయించండి ఇంజనీరింగ్‌ ఫీల్డ్‌లో అబ్బాయిలు మాత్రమే ఉంటారు’ అనేవాళ్లు. అయితే వారి మాటలను జెనిస్‌ తల్లిదండ్రులు పట్టించుకోలేదు.

    చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్‌​ డాక్టర్‌ సీక్రెట్‌ ఇదే!

    ‘నువ్వు సాధించగలవు’ అని కూతురికి ధైర్యాన్ని ఇచ్చారు.తల్లిదండ్రులు ఇచ్చిన ్ర΄ోత్సాహబలంతో తన ‘ఐఐటీ’ కలను నిజం చేసుకుంది జెనిస్‌.‘జేఈఈ’ ఎగ్జామ్‌ కోసం ప్రిపేరవుతున్నప్పుడు సైరన్లు, బ్లాకవుట్స్‌ వల్ల ఏకాగ్రత కుదిరేది కాదు. 

    ‘జేఈఈ’ అడ్వాన్స్‌డ్‌ ఫామ్స్‌ ఫిల్‌ చేయలేనేమో అని భయపడ్డాను. అదృష్టవశాత్తు చేయగలిగాను. ఆపరేషన్‌ సిందూర్‌ మే 7న జరిగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌ మే 18. ఈ మధ్య కాలంలో ఎంతో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎక్కడెక్కడి నుంచో బాంబుల శబ్దాలు వినిపించేవి. అంతా భయంలోనూ ఈసారి ఎలాగైనా సీటు సాధించాల్సిందేనని అనుకున్నాను. – జెనిస్‌

Sports

  • రెండో ఐసీసీ ట్రోఫీని ముద్దాడేందుకు సౌతాఫ్రికా అడుగు దూరంలో నిలిచింది. లార్డ్స్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం దిశ‌గా దూసుకెళ్తోంది. మ‌రో 69 ప‌రుగులు సాధిస్తే 27 ఏళ్ల మరో ఐసీసీ టైటిల్ స‌ఫారీల ఖాతాలో చేర‌నుంది.

    282 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ప్రోటీస్‌.. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి  రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా ఓపెన‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్ అద్బుత శత‌కంతో చెల‌రేగాడు. మార్‌క్ర‌మ్ 102 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు కెప్టెన్  టెంబా బావుమా(65 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు.

    తొలి ఆట‌గాడిగా..
    ఇక ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిసిన ఐడైన్ మార్‌క్ర‌మ్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్  నాల్గవ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా మార్‌క్ర‌మ్ రికార్డుల‌కెక్కాడు. ఇంత‌కుముందు జ‌రిగిన రెండు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ఎవ‌రూ ఫీట్ సాధించ‌లేక‌పోయారు.

    ఓవ‌రాల్‌గా మార్‌క్ర‌మ్ కంటే ముందు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ట్రావిస్ హెడ్‌, స్టీవ్ స్మిత్ మాత్ర‌మే సెంచ‌రీ సాధించారు. అయితే ఈ రెండు సెంచ‌రీలు కూడా తొలి ఇన్నింగ్స్‌లో వ‌చ్చినవే కావ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా లార్డ్స్ మైదానంలో ఒకే టెస్టులో డ‌కౌట్‌, సెంచ‌రీ నమోదు చేసిన తొమ్మిద‌వ బ్యాట‌ర్‌గా మార్‌క్ర‌మ్ నిలిచాడు.
    చదవండి: విజయం దిశగా దక్షిణాఫ్రికా

Movies

  • పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు  సామాన్యులకు ఎప్పుడూ  వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్‌ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్‌... తాజాగా పెళ్లి... అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్‌... ఇంకా కెరీర్‌ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే. 

    అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్‌ రూపుదిద్దుకోకుండానే అఖిల్‌ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్‌ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం.  అంటే అక్కినేని యంగ్‌ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే...తాజాగా అఖిల్‌ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.

    మరోవైపు అఖిల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్‌(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే... హైదరాబాద్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్, కాస్ట్యూమ్‌ మేకర్‌.  

    ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ స్కూల్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్‌ డిజైనర్‌గా  శ్రియా శరణ్, సమంతా రూత్‌ ప్రభు  కాజల్‌ అగర్వాల్‌ వంటి టాప్‌ టాలీవుడ్‌ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు.  అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్‌’ అనే దుస్తుల బ్రాండ్‌ కు  వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె  లో ప్రొఫైల్‌ మెయిన్‌ టెయిన్‌ చేస్తున్నా... తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.

    అఖిల్‌తో బ్రేకప్‌ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కుమారుడైన అనిందిత్‌ రెడ్డి ని  ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు.  సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్‌ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ  కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు. 

    హైదరాబాద్‌  నుంచి టాప్‌ క్లాస్‌ రేసింగ్‌ డ్రైవర్‌గా నిలిచాడు. గత  2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్‌లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌స్పోర్ట్స్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎమ్‌ఎస్‌సి)లో 2017లో మోటార్‌స్పోర్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్‌వ్యాగన్‌ వెంటో కప్‌ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను  వరల్డ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ఫార్మ్‌ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్‌గా ఎంపికయ్యాడు.

Parvathipuram Manyam

  • రక్తద

    స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న యువత

    నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

    రాజాం సిటీ: అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న, రక్తదానం.. మహాదానం అంటూ ఎన్ని ప్రచారాలు చేసినా, స్పందన మాత్రం కొందరిలోనే కనిపిస్తోంది. రక్తదానం చేయాలని ఉన్నా కొన్ని అపోహలు, మనకెందుకులే అన్న భావనతో చాలా మంది రక్తదానం చేసేందుకు ఇష్ట పడడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రస్తుతం సేకరిస్తున్న రక్తం ఆపదలో ఉన్నవారికి సరిపోవడంలేదు. విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ కొంతమంది రక్తదాతలు ముందుకొచ్చి దానం చేయడంతోపాటు అడపాడదపా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో పాల్గొంటూ అపాయంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇటువంటి సమయంలో స్వచ్ఛంద సంస్థలు, యువకులు చొరవచూపి రక్తదానానికి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.

    ప్రాణంతో సమానం..

    ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసర చికిత్సలు అవసరమైన వారికి రక్తం ఎంతో అవసరం. రక్తాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించాల్సిందే కానీ కృత్రిమంగా తయారుచేయలేం. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం. ఒకరి రక్తం మరొకరి ఆయుష్షు కాపాడుతుంది. రక్తానికి పేద, ధనిక భేదాలు లేవు. ఒకమనిషి రక్తం మరో మనిషికి అందిస్తేనే వారి ప్రాణాలు నిలుస్తాయన్న సంగతి తెలిసినా చాలా మంది రక్తదానం చేయడానికి భయపడుతున్నారు. కొంతమంది మాత్రం ఎప్పుడు రక్తం అవసరం వచ్చినా మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వారు కూడా రక్తదానం చేయపోతే అత్యవసరమైన వారి పరిస్థితి ఇబ్బందికరమే.

    రక్తదానానికి వీరు అర్హులు..

    అపోహలు వీడి రక్తదానం చేయాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండడంతోపాటు 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు, 50 కిలోల బరువు కలిగిఉండాలి. హిమోగ్లోబిన్‌ శాతం 12.5 ఉండాలి. చికెన్‌గున్యా, టైఫాయిడ్‌, మలేరియా, ఇతర వ్యాధులు సోకిన వారు నయమైన నాలుగు నుంచి ఆరు నెలల తరువాత రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసేవారి నుంచి కేవలం 300 మిల్లీ లీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు.

    ● రక్తాన్ని సేకరించే ముందు వైద్యులు దాత ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు.

    వీరు అనర్హులు..

    మధుమేహ వ్యాధి గ్రస్తులు, రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రక్తం ఇవ్వకుండా ఉండాలి. అలాగే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు

    క్యాన్సర్‌ శస్త్రచికిత్స చేయించుకున్నవారు, గుండెపోటుకు గురైనవారు

    మూర్ఛవ్యాధి ఉన్నవారు, కంటి జబ్బులు, కంటి కలక వంటివి ఉన్నప్పుడు రక్తదానం చేయవద్దు.

Mahabubabad

  • బస్సు సౌకర్యం కల్పించాలి

    నెహ్రూసెంటర్‌: ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, అదనపు సర్వీసులను పెంచాలని ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ డీఎం’ కార్యక్రమానికి ప్రజలు, ప్రయాణికులు ఫోన్‌ ద్వారా వినతులను సమర్పించారు. మానుకోట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి 14 వినతులు వచ్చినట్లు డీఎం ఎం.శివప్రసాద్‌ తెలిపారు. మహబూబాబాద్‌–సింగారం–మునిగలవీడు, మహబూబాబాద్‌–మట్టెవాడ–గూడూరు, మహబూబాబాద్‌–మరిపెడ–రాంపూర్‌–హైదరాబాద్‌, మరిపెడ–చిన్నగూడూరు సర్వీసులను నడిపించాలని ప్రయాణికులు కోరినట్లు తెలిపారు. మరిపెడ బస్టాండ్‌ ప్రాంగణంలో సమయపాలన సూచిక ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లు డీఎం తెలిపారు. సదరు రూట్లను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడిపిస్తామని డీఎం వెల్లడించారు.

  • నిబంధనలు పాటించాలి

    డోర్నకల్‌: విత్తన విక్రయ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీఏఓ విజయనిర్మల సూచించారు. డోర్నకల్‌, గొల్లచర్ల, చిలుకోడు గ్రామాల్లోని ఫెస్టిసైడ్స్‌ దుకాణాలతో పాటు సొసైటీ కార్యాలయాల్లో శుక్రవారం డీఏఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులతో పాటు విత్తనాల నిల్వ లను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. దుకాణదారుల పీఓఎస్‌ మిషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. దుకాణదారులు స్టాక్‌ వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మురళీమోహన్‌, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

    డీఏఓ విజయనిర్మల

Mancherial

  • అభివృద్ధి పనుల పూర్తికి కృషి

    మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ రోడ్డు విస్తరణ కోసం విశ్వనాథ ఆలయం వద్ద దుకాణాల కూల్చివేతను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలు, అధికారుల సహకారంతోనే ఆలయ అంతర్భాగంలో ఆగమ శాస్త్ర పండితుల సలహాలతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలోని రోడ్ల వెడల్పు, ఐటీ పార్కు, నిర్మాణ పనులను లక్ష్మీటాకీస్‌ నుంచి రంగంపేట వరకు ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణాలు, పట్టణంలో మాతాశిశు ఆసుపత్రి పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఐదారు నెలల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

  • ● ‘జిల్లా ఇన్‌చార్జి మంత్రి’పై సర్వత్రా చర్చ ● హాట్‌టాపిక్‌గా సీతక్క మార్పు ● గతంలోనే ఆమైపె ‘మీనాక్షి’కి ఫిర్యాదు ● అప్పట్లోనే తప్పుకుంటానన్న మినిస్టర్‌ ● తాజాగా ఆమె నిజామాబాద్‌కు.. అక్కడి నుంచి ‘జూపల్లి’ ఇక్కడికి

    సాక్షి, ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ఆ బాధ్యతల నుంచి తప్పించారా.. లేక ఆమే తప్పుకున్నారా.. అనే చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతోంది. హైదరా బాద్‌లో నిర్వహించిన పార్లమెంట్‌ నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా కొంతమంది నియోజకవర్గ ఇన్‌చార్జిలు సీతక్క తమను పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు అప్పట్లో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. అప్పుడే తాను జిల్లా ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆమె మీనాక్షి ముందే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

    అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

    ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. అక్కడి నుంచి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఇన్‌చార్జిగా కేటాయించారు. ప్రస్తుతం పార్టీలో ఈ నిర్ణయం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జూపల్లి ఇక్కడి నేతలను సమన్వయం చేస్తూ పార్టీ విజయానికి ఏ విధంగా కృషి చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    సీతక్కకు కలిసిరాని ఎన్నికలు

    ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కకు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌, పట్టభద్రుల, ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎన్నికల ప్రణాళిక సరిగా రూపొందించడంలో సీతక్క ఫెయి ల్‌ అయిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా నియోజకవర్గాల్లో సీనియర్‌ నేతల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో ఆమె సమన్వయం చేయలేకపోయారనే అపవాదు వ్యక్తమైంది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరగడం కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని చర్చ సాగింది. ఇదే విషయంలో మీనాక్షి నటరాజన్‌ పార్టీ ఓటమికి కారణాలపై ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా విశ్లేషించారు. అంతేకాకుండా ఇటీవల హైదరా బాద్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అ సెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలను ఒక్కొక్కరి నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాతనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క మార్పు ఖాయమనే ప్రచారం సాగింది. తాజాగా అదే జరిగింది.

    వీటిపై ప్రభావం పడేనా..

    పార్టీ పరంగా ప్రస్తుతం పట్టణ, మండల, బ్లాక్‌ కమిటీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. కమిటీలకు సంబంధించి ఇప్పటికే ప్రతి మండలం, పట్టణంలో సమావేశాలు నిర్వహించి ఐదేసి పేర్లను అధిష్టానానికి నివేదించారు. అది ఖరారు కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈనెల చివరిలో డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక మంచిర్యాలకు కొక్కిరాల సురేఖ, నిర్మల్‌కు శ్రీహరిరావు, కుమురంభీం ఆసిఫాబాద్‌కు విశ్వప్రసాద్‌ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ నెలలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం జరగనుండగా, కొత్త ఇన్‌చార్జి మంత్రి రానుండడంతో వీటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది పార్టీలో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

    కొత్త ఇన్‌చార్జి మంత్రికి సవాల్‌

    ఉమ్మడి జిల్లాకు కొత్త ఇన్‌చార్జి మంత్రిగా రానున్న జూపల్లికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే ఆయన ముందున్న ప్రధాన సవాలు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో నాలుగు చోట్ల బీజేపీ, రెండు చోట్ల బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేవలం ఖానాపూర్‌ నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ప్రాతి నిధ్యం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినవారు నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.

  • ● ఏటా ఉమ్మడి జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం ● పంట చేన్లలో

    జాగ్రత్త మరవద్దు

    ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప డుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ము ప్పు తప్పించుకోవచ్చు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలు వినిపిస్తే వెంటనే అక్కడ నుంచి దూరంగా వెళ్లాలి. పంట చేన్లలో ఉన్నప్పుడు వీలైనంత తొందరగా ఇళ్ల కు చేరుకోవాలి. సమీపంలో ఉన్న నివాస స్థలాలకు వెళ్లాలి. ఇళ్లలో విద్యుత్‌ పరికరాలు వినియోగించరాదు. సెల్‌ఫోన్లు, చార్జింగ్‌ చే యడం, ఐరన్‌, వాటర్‌ హీటర్లు, గీజర్లు వాడరాదు. ఇళ్లకు లైటనింగ్‌ కండక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.

    గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో పిడుగు పడిన ప్రదేశం(ఫైల్‌)

    సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏటా పిడుగుపాటుకు ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అధికంగా పంట చేన్లలో పని చేస్తుండగానే మృత్యువాత పడుతున్న ఘటనల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు చనిపోతుండడం తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. పేద, మధ్య తరగతి రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. బాధిత కుటుంబాలకు కోలుకోలేని నష్టం జరుగుతోంది. వానా కాలంలో పశువులు, జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ప్రతీ సీజన్‌లో అనేకమంది తమ జీవాలను కోల్పోతున్నారు. పిడుగుపాటుపై చాలామందికి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఎక్కువగా చేన్లలో పని చేస్తున్నసమయంలోనే నష్టం జరుగుతోంది. పంట చేన్లలో పని చేసే రైతులు మ రింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

    పిడుగు అంటే..

    ఆకాశంలో సహజసిద్ధంగా ఏర్పడే విద్యుత్‌పాతమే పిడుగుగా పేర్కొంటారు. సూర్యరశ్మి అధికంగా తాకి, తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్లి, అధిక బరువున్న రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి. ఈ రెండింటి మధ్య దూరం పెరిగితే ధనావేశం గాలి కోసం భూమి వైపు రుణావేశా మేఘాలు వచ్చే క్రమంలో శక్తివంతమైన విద్యుదుత్పాతం ఏర్పడుతుంది. దీనినే పిడుగు అంటారు. ఒక్కో పిడుగు వేల డిగ్రీల సెల్సియస్‌ శక్తిని విడుదల చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా పిడుగులు పడతాయి.

    రూ.6లక్షలు పరిహారం

    గతంలో కేవలం ఆపద్బంధు పథకం కింద నామమాత్రంగానే పరిహారం చెల్లించేవారు. ప్రస్తుతం పిడుగుపాటుకు మరణించిన వారికి రూ.6లక్షలు పరిహారంగా అందజేస్తున్నారు. పిడుగుపాటుతో మరణించినట్లు స్థానిక రెవెన్యూ, వైద్య, పోలీసు అ ధికారులు ధ్రువీకరించాలి. అయితే పరిహారం పొందడంలో కొన్నిసార్లు జాప్యం జరుగుతోంది.

    స్మార్ట్‌ఫోన్లలోనూ..

    వాతావరణ మార్పులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలోనూ తెలుసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ల్లోనూ అల ర్ట్‌ పొందవచ్చు. ఐఎండీ(ఇండియన్‌ మెటీరియలాజిక్‌ డిపార్ట్‌మెంట్‌)తోపాటు పిడుగు పడే ప్రాంతాలను ముందుగానే తెలియజేసే ‘దామిని’తోపా టు ఇతర యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా స్థానిక కేవీకే, వ్యవసాయ, ప్రణాళిక శాఖ అధికారుల వద్ద వాతావరణ పరిస్థితులు ముందస్తుగా తెలుసుకోవచ్చు. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ముందస్తుగా తెలుసుకుంటూ ప్రాణాలతోపాటు ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు.

    చెట్ల కింద ఉండొద్దు

    వర్షం పడితే చాలామంది చెట్ల కింద తడవకుండా ఉండేందుకు వెళ్తుంటారు. అయితే చెట్లు, ఎత్తయిన కొండలు, నీటి నిల్వ ప్రదేశాలు మరింతగా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. చెట్ల కింద చెరువులు, కాలువల వద్ద ఉండకూడదు. ఒకే చోట అందరూ గుంపులుగా ఉండకూడదు.

    ఒకే రోజు ఆరుగురు

    ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం పిప్పిరిలో పంట చేనులోనే నలుగురు, బేల మండలం సాంగిరిలో ఇద్దరు మొత్తం గురువారం ఒకే రోజులో ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఉట్నూరు మండలం కుమ్మరితండాలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు.

  • చెత్త

    మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో, బయట అపరిశుభ్రతతో కొత్త వ్యాధులు వచ్చే ముప్పు పొంచి ఉంది. ఆస్పత్రి వెనుకభాగాన బయోవేస్టేజ్‌ చెత్తతోపాటు ఆస్పత్రిలో వెలువడిన ఇతర చెత్త పేరుకుపోతోంది. వర్షం కురిసినప్పుడు చెత్త తడిసి దుర్వాసన వెదజల్లుతోంది. బయోవేస్టేజ్‌, సాధారణ చెత్తకు వేర్వేరు గదులున్నాయి. బయోవేస్టేజ్‌ చెత్తతో గది నిండిపోగా.. దానికి తాళం వేసి బయట పడేస్తున్నారు. సమీపంలో సాధారణ చెత్త షెడ్డు ఉన్నా అందులో వేయకుండా ఆస్పత్రి వెనుకాల ఉన్న సిమెంటు రోడ్డు, ఖాళీ ప్రదేశంలో బయెవేస్టేజ్‌, చెత్త కలిపి వేస్తున్నారు. ఆస్పత్రికి ప్రతీ రోజు 400వరకు ఓపీ ఉండగా.. వివిధ రోగాలతో వార్డుల్లో చికిత్స పొందుతున్న వారు 250మంది ఉంటారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంకుకు నిత్యం తలసేమియా, సికిల్‌సెల్‌ బాధితులు 20మంది వరకు వస్తుంటారు. చెత్త కారణంగా కొత్త వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.

  • మంత్రివర్యా సమస్యలు ఆలకించరూ..!

    చెన్నూర్‌: చెన్నూర్‌ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా శనివారం చెన్నూర్‌కు వస్తుండడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నా పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. సింగరేణి పారిశ్రామిక, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో తాగు, సాగునీరు, వైద్య సమస్యలతో సతమతం అవుతున్నారు. స్థానికంగా చిన్నతరహా పరిశ్రమలు లేక ఉపాధి కోసం యువత నగరాలకు వలస వెళ్తున్నారు. నియోజకవర్గం చుట్టూ గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నా ఎత్తిపోతల పథకాలు లేక సాగు, తాగునీటికి ప్రజలు తండ్లాడుతున్నారు. ఇంటింటికీ తాగునీటి సరఫరాకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

    మండలాల వారీగా..

    ● చెన్నూర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంటు సెంటర్‌ ఏర్పాటు చేయాలి.

    ● చెన్నూర్‌ మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయానికి పక్కా భవనం

    ● వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలి.

    ● అమృత్‌ 2.0 పనులు పూర్తి చేయించాలి.

    ● చెన్నూర్‌లోని 50 పడకల ఆస్పత్రిలో పూర్తి స్థాయి సిబ్బంది, పరికరాలు సమాకూర్చాలి.

    ● భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్ట్‌కు పిల్ల కాలువలు నిర్మిస్తే మరో 2500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

    ● కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు.

    ● పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు పూర్తి చేయాలి.

    ● మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి.

    ● పెండింగ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, కేసీ ఆర్‌ పార్క్‌, ఇతర పనులు పూర్తి చేయించాలి.

    ● మందమర్రిలో ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి.

    ● జైపూర్‌లోని పవర్‌ ప్లాంటు ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.

    ● శివ్వారం మొసళ్ల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి.

    వివేక్‌కు అమాత్య పదవితో అభివృద్ధిపై ఆశలు

    పెండింగ్‌ పనులు పూర్తయ్యేనా..!

    చెన్నూర్‌లో వంద పడకల ఆస్పత్రి

    50పడకల ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత

  • ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య
    ● జిల్లా కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ● విద్యార్థులకు అక్షరాభ్యాసం

    జైపూర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గు ణాత్మక విద్య అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠఽశాల, టేకుమట్ల, కిష్టాపూర్‌లో ప్రాథమికోన్నత పాఠశాల, అంగ న్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు పట్టికలు, రిజిష్టర్లు, తరగతి గదులు పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అక్షరా భా స్యం చేయించారు. ఆయా గ్రామాల్లో భూభార తి రెవెన్యూ సదస్సులను తహసీల్దార్‌ వనజారెడ్డితో కలిసి సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు.

    ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డు కలిగి ఉండాలి

    నస్పూర్‌: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్‌ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నా రు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో యుఐడీ అసిస్టెంట్‌ మేనేజర్‌ మహ్మద్‌ శౌభన్‌, ప్రత్యేక ఉప పాలానాధికారి డి.చంద్రకళ, ఏసీపీ ప్రకాశ్‌లతో కలిసి జిల్లా స్థాయి ఆధార్‌ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అంన్‌వాడీ కేంద్రాలు, పాఠాశాలలు, వసతిగృహాల్లో పిల్లలను చేర్పించే సమయంలో ఆధార్‌కార్డు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఏడుగురు అనాథలకు ఆధార్‌ కార్డు జారీ చేశామన్నారు. ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ ఒకసారి, పేరు రెండుసార్లు మాత్రమే సవరించుకోవడానికి వీలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీఈఓ యాద య్య, లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ తిరుపతి, ఈ డిస్ట్రిక్‌ మేనేజర్‌ సునీల్‌ పాల్గొన్నారు.

  • ఎస్టీపీపీలో కేరళ బృందం పర్యటన

    జైపూర్‌: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు(ఎస్టీపీపీ)ను కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. పవర్‌ ప్లాంటు, గనుల పనితీరు అధ్యయనంలో భాగంగా సందర్శనకు వచ్చిన వారికి ప్లాంటు జీఎం శ్రీనివాసులు స్వాగతం పలికారు. విద్యుత్‌ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అడ్మిన్‌ భవన కార్యాలయంలో విద్యుత్‌ ఉత్పత్తి, పనితీరు, ఫ్లోటింగ్‌ సోలార్‌, గ్రౌండ్‌ సోలార్‌, ఎఫ్‌జీడీ నిర్మాణ పనితీరును పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎఫ్‌జీడీ నిర్మాణాన్ని పరిశీలించగా అధికారులు పనితీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ వోఅండ్‌ఎం చీఫ్‌ జెన్‌సింగ్‌, ఏజీఎంలు శివప్రసాద్‌, మదన్‌మోహన్‌, సీఎంవోఏఐ బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ సముద్రాల శ్రీనివాస్‌, కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు చీఫ్‌ ఇంజనీర్లు ఎంపీ.రాజన్‌, వీ.లత, కే.అనిత, డీజీఎంలు కిరణ్‌బాబు, ఈఈ విష్ణువర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

Mulugu

  • యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

    ములుగు రూరల్‌: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని కలెక్టర్‌ టీఎస్‌ దివాకర అన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ముందస్తుగా యోగా దినోత్సవాన్ని గిరిజన భవన్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా తప్పనిసరిగా చేయాలన్నారు. మానవ జీవితంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ చంద్ర, సంధ్య, యోగా ఇన్‌స్ట్రక్టర్‌ గురు శివకృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

    కలెక్టర్‌ టీఎస్‌ దివాకర

  • కాళేశ్వరం బస్టాండ్‌లో  షీ, మాతాశిశు కేంద్రం

    కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్‌లో షీ రూమ్‌ (సానిటరీ హైజిన్‌ ఎంపవర్‌మెంట్‌), మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే మహిళలు, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షీ, మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశాల మేరకు శుక్రవారం కాళేశ్వరంలోని శాశ్వత బస్టాండ్‌కు మార్చినట్లు కాటారం సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం వచ్చే మహిళలకు బస్టాండ్‌లో షీ, మాతా శిశు కేంద్రం రూములు అందుబాటులో ఉంటాయని తెలిపారు. షీ రూమును, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కేంద్రాన్ని పాలిచ్చే తల్లులు వినియోగించుకోవాలని సూచించారు.

  • యూనిఫాం అందజేత

    భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలో నూతనంగా డిప్యూటేషన్‌పై వెళ్లిన మహిళా ఎస్‌అండ్‌పీసీ సిబ్బందికి శుక్రవారం ఏరియా ఇన్‌చార్జ్‌ జీఎం కవీంద్ర యూనిఫాంలు అందజేశారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా విధుల్లో చేరుతున్న మహిళా ఉద్యోగులు ఎస్‌అండ్‌పీసీకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. సింగరేణి ఉద్యోగంలో చేరే మహిళలు సంస్థలో అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్‌ పద్మజ, మారుతి, మురళీమోహన్‌, మహిళా సెక్యూరిటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

  • శనివా

    ములుగు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్నధాన్యానికి క్వింటాకు బోనస్‌ రూ.500 ప్రకటించిన విషయం విధితమే. దీంతో యాసంగి సాగులో జిల్లాలో ఎక్కువశాతం రైతులు సన్నరకం ధాన్యం సాగు చేశారు. యాసంగి పంట అమ్మకాలు చేపట్టి నెలరోజులు గడుస్తున్నా.. సన్నధాన్యానికి బోనస్‌ అందక పోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించగా ప్రభుత్వం చెల్లించాల్సిన మ ద్దతు ధర రూ.2,320 చెల్లించింది. కానీ బోనస్‌ డబ్బులు రైతుల ఖాతాలో జమ కాలేదు. వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో పెట్టుబడి ఖర్చులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

    నెల రోజులు దాటినా..అందని డబ్బులు

    జిల్లాలో కొనుగోలు చేసిన సన్నధాన్యం 39,412.180 క్వింటాళ్లు

    రావాల్సిన బకాయి రూ.19.70 కోట్లు

    రైతులకు తప్పని ఎదురుచూపులు

    త్వరగా చెల్లించాలి..

    ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్‌ ప్రకటించడంతో నాలుగున్నర ఎకరాల్లో సాగు చేశా. సన్నరకం వరి సాగుకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ కాగా దిగుబడి మాత్రం తక్కువగా వచ్చింది. వరి ధాన్యం అమ్మి నెల రోజులు గడుస్తుంది. ప్రభుత్వం బోనస్‌ డబ్బులను త్వరగా చెల్లించాలి.

    – ఇమ్మడి భిక్షపతి, రైతు ములుగు

    బడ్జెట్‌ కేటాయించలేదు

    బడ్జెట్‌ కేటాయించలేదు. రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఎంఎస్‌పీ డబ్బుల చెల్లింపులు జరిగాయి. జిల్లాలో సన్న ధాన్యం అమ్మకాలు చేపట్టిన రైతుల వివరాలు ఐఎఫ్‌ఎంఎస్‌ లాగిన్‌ నుంచి ప్రభుత్వానికి అందించాం. బడ్జెట్‌ కేటాయించిన వెంటనే బోనస్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

    – ఫైజల్‌ హుస్సేన్‌, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి

    రావాల్సిన బకాయిలు రూ.19.70 కోట్లు

    జిల్లాలోని పది మండలాల్లో యాసంగి సాగులో సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం రూ.19.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 6,182 మంది రైతులు 39,412.180 క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు.

    న్యూస్‌రీల్‌

  • కొనసాగుతున్న రేషన్‌ పంపిణీ

    ములుగు రూరల్‌: జిల్లాలో మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల మొదటి వారంలో లబ్ధిదారులకు పంపిణీని ప్రారంభించిన అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ అవకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభు త్వం ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు అందిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేయడాన్ని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీలో 80శాతం మంది లబ్ధిదారులు అమ్మకాలు చేపట్టడంతో ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టేది. కానీ సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు సద్వినియోగం అవుతుంది.

    జిల్లాలో 94,628 కార్డులు

    జిల్లాలోని పది మండలాల్లో 94,628 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతీ నెల జిల్లాలో 1,714 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంతో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా మూడు నెలల బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో మూడు నెలలకు గాను 5,157 టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్‌ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరిసాగు చేస్తున్నారు.

    మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి అందజేత

    జిల్లాలో 94,628 కార్డులు

    తూకాల్లో అవకతవకలకు

    పాల్పడితే చర్యలు

    సివిల్‌ సప్లయీస్‌ అధికారి

    ఫైజల్‌ హుస్సేన్‌

  • నెరవేరనున్న నిరుపేదల సొంతింటి కల

    ములుగు రూరల్‌: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని గ్రంథాలయ సంస్థచైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాన్ని బట్టి ప్రతీ సోమవారం బిల్లు చెల్లిస్తున్నామని, లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతనిప్పుల భిక్షపతి, భోడ రఘు, అనిల్‌, షకిల్‌, జాఫర్‌, అభినయ్‌, రాజన్న, మహేందర్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    మంజూరు పత్రాలు ఇచ్చి

    లాక్కున్నారు..

    వాజేడు: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ మంజూరు పత్రాలను ఇచ్చారని, మీరు అర్హులు కారని తిరిగి తీసుకున్నారని మండల అంగన్‌వాడీ సిబ్బంది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కర్యదర్శి కాకర్లపూడి విక్రాంత్‌, మాజీ జెడ్పీటీసీ తల్లడి పుష్పలతలతో కలిసి భద్రాచలంకు వెళ్లారు. తమకు గత నెల 7న మంత్రి పర్యటనలో భాగంగా మంజూరు పత్రాలను ఇవ్వడంతో 5 రోజులు ఆగి తాము కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి పాత ఇంటిని తొలగించినట్లు ఎమ్మెల్యేకు తెలిపారు. ఇంటిని తొలగించిన తర్వాత ఎంపీడీఓ వచ్చి మీరు అంగన్‌వాడీ ఉద్యోగులు అయినందున ఇందిరమ్మ ఇల్లు రాదని మంజూరు పత్రాలను వెనక్కి ఇవ్వాలని నోటీసులు ఇచ్చినట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

  • మత్స్యకారులకు అండగా ఉంటాం..

    ములుగు రూరల్‌: ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని గిరిజన భవన్‌లో యుఎల్‌టీ, నిర్మాణ్‌ సంస్థ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందించిన తెప్పలు, వలలను కలెక్టర్‌ టీఎస్‌ దివాకరతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు అవసరమైన తెప్పలు, వలలు అందించడం అభినందనీయమన్నారు. ములుగు మండలంలోని జీవింతరావుపల్లిని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పైలట్‌ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

    ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు

    ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్‌ క్లోరినేషన్‌ డౌసింగ్‌ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సాంకేతికతతో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

    మంత్రి సీతక్క

Nandyala

  • ● చిన

    నగు‘బాట’

    మా ప్రభుత్వంలో రోడ్లు వేస్తున్నామనిపించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 20 రోజుల్లో తారుపోసి చేతులు దులుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ‘కోట్ల’ హడావుడిగా ప్రారంభంచేసి గొప్పలు చేసుకున్నారు. తీరాచూస్తే.. ఒక్కరోజుకే ఆ రోడ్డు కాస్తా ‘తారు’లేచిపోయింది.

    ప్యాపిలి: రహదారులు గ్రామాల అభివృద్ధికి చిహ్నాలు. అలాంటి రహదారుల నిర్మాణంలో కూటమి నేతల జోక్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తునానరు. చిన్నపొదిళ్ల నుంచి గుండాల వరకు 4 కిలో మీటర్ల మేర రూ. 3.80 కోట్లు వెచ్చించి గత నవంబర్‌లో రోడ్డు పనులు ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు నిర్మాణం విషయంలో అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కేవలం 20 రోజుల వ్యవధిలో రోడ్డు నిర్మాణం పూర్తి చేశారంటే ఎంత మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్డును ఈ నెల 11న డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి ప్రారంభించారు. 12వ తేదీ తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా కోతకు గురికావడంతో పాటు ఆ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా ఛిద్రమైంది. విషయం తెలుసుకున్న అధికారులు తమ తప్పును కప్పిపుచ్చేందుకు రోడ్డుపై పడిన గుంతలను మట్టితో పూడ్చారు. రోడ్డు కోతకు గురైన ప్రదేశంలో దగ్గరలోనే కల్వర్టు ఉంది. అయితే కాంట్రాక్టర్‌తో పాటు అధికారులు ఈ కల్వర్టులోకి వర్షం నీరు వెళ్లే ఏర్పాటు చేయలేదు. దీంతో కల్వర్టులోకి వర్షం నీరు వెళ్లే మార్గం లేక ఆ నీరు ఒక్కసారిగా రోడ్డుపై ప్రవహించాయి. నాసిరకంగా వేసిన రోడ్డు ప్రవాహ వేగానికి కోతకు గురైంది. రోడ్డుపై నుంచి పారిన వర్షపు నీరు అటు వైపు ఉన్న పొలాల్లోకి చేరడంతో పొలాలు కోతకు గురయ్యాయి. వర్షం వస్తే పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధంగా ఉంచుకున్న రైతులుఆందోళన చెందుతున్నారు. కోతకు గురైన తమ పొలాలను ఎలా పూడ్చుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంలా మారిందని వాపోతున్నారు.

    వైఎస్సార్‌సీపీ హయాంలో వేసిన రోడ్లు పదిలం..

    గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నాణ్యత విషయంలో అధికారులతో తరచూ రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తూ, ఆకస్మిక తనిఖీలు చేస్తూ స్వయంగా నాణ్యతను పరిశీలించారు. నిర్మాణం నాసిరకంగా ఉన్నట్లు తన దృష్టికి వస్తే తిరిగి నాణ్యతగా నిర్మించేలా చూశారు. అందుకే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేసిన ఒక్క రోడ్డు కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ రోడ్లను అప్పట్లో టీడీపీ నాయకులు తమలపాకులా రోడ్లు వేశారని ఎద్దేవా చేశారు. ఒక్క వర్షానికే కొట్టుకుపోతున్న రోడ్లను ఏ ఆకుతో పోల్చుకుంటారో టీడీపీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు.

    కూటమి ప్రభుత్వం మాటలకు.. చేతలకు పొంతన లేకుండా పోతోంది. కోట్లాది రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని హడావుడి చేసి చివరకు నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించిన రోడ్డే మరుసటి రోజు వర్షానికి కొట్టుకుపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పూసిన తారు చెదిరిపోయి.. నాసిరకం కంకర కొట్టుకుపోయి.. రోడ్డు కోతకు గురైంది. కొత్త రోడ్డు అందుబాటులోకి వచ్చిందని ముచ్చట పడిన గ్రామస్తులకురెండు రోజుల్లో గుంతల రోడ్డు దర్శనమిచ్చింది.

  • వైఎస్
    ● ఉద్దేశపూర్వకంగా వాహనాల స్వాధీనం ● 25 రోజులైనా ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు ● మైనింగ్‌ అధికారులపై జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి ఆగ్రహం ● హంద్రీ–నీవా పనులపై అసహనం ● హుందాగా సాగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

    కర్నూలు(అర్బన్‌): ‘ ఏడాది కాలంగా వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారు .. అక్రమ మైనింగ్‌ జరు గుతుంటే కేసులు నమోదు చేయండి, కానీ ... రాజకీ య ఒత్తిళ్లతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదు’ అంటూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో శుక్రవారం జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్‌పై జరిగిన చర్చలో చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ ... బెలుం శింగవరం గ్రామ శివారుల్లో గత నెల 20న మైనింగ్‌ అధికారులు స్థానిక పోలీసుల తో కలిసి దాడులు నిర్వహించి, గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పేరం రాంశంకర్‌రెడ్డికి చెందిన ప్రొక్లెయినర్‌, టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇతరులకు చెందిన గని వద్ద నిలిచి ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడం, నోటీసు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

    పల్లెల్లో బెల్ట్‌ షాపులతో అనేక అనర్థాలు ...

    గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్‌ షాపులతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని జెడ్పీ చైర్మన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కంటితుడుపు చర్యగా కాకుండా ఎకై ్సజ్‌ అధికారులు స్థానిక పోలీసుల సహకారాన్ని కూడా తీసుకొని గ్రామాల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిర్మూలించాలన్నారు. ఎక్కడబడితే అక్కడ మద్యం లభిస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యక్రమాలు అధికమవుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిపై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జరిమానాలను విధించడంతో పాటు స్లైడ్ల రూపంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

    అభాసుపాలైన విద్యా శాఖ

    10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యా శాఖ పూర్తి స్థాయిలో అభాసుపాలైందని జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు అనేక మందికి రీవ్యాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫెయిల్‌ అయిన, మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు? దరఖాస్తు చేసుకున్న వారిలో మంది ఉత్తీర్ణులయ్యారు? ఎంత మందికి మార్కులు పెరిగాయనే అంశాలపై పూర్తి సమాచారాన్ని వచ్చే సమావేశాల నాటికి అందించాలని ఆయన విద్యాశాఖ అధికారులను కోరారు.

    బిల్లులను వెంటనే పంపించండి

    వేసవిని దృష్టిలో ఉంచుకొని జెడ్పీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వారంలోగా పంపించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆదేశించారు. ఇయర్‌ మార్క్‌డ్‌ నిధులతో ఎస్సీ, ఎస్టీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల పరిధిలో పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను కూడా జూలై నాటికి పంపించాలన్నారు. ఇంకా ఈ పనులు 129 పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోందని, వీటిని కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందేలా చర్యలు చేపట్టాని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. కోర్టు ఆదేశాల మేరకు జెడ్పీ ప్రాంగణంలోని చైర్మన్‌ బంగ్లా నిర్మాణానికి గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి రూ.1.25 కోట్లను డిపాజిట్‌ చేసిన వెంటనే టెండర్లను పిలిచి పీఆర్‌ ఆధ్వర్యంలో బంగ్లాను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్‌ చెప్పారు. సమావేశాల్లో జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.

    హంద్రీనీవా పనులపై అసహనం

    జిల్లాలో 88 నుంచి 216వ కిలోమీటర్‌ వరకు జరుగుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వైడనింగ్‌, లైనింగ్‌ పనులపై జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి అస హనం వ్యక్తం చేశారు. దాదాపు రూ.439 కోట్లతో ఈ పనులను చేపడుతున్నారని, అయితే ఇటీవల కురిసిన వర్షాలకే పత్తికొండ మండలం పందికోన సమీపంలో (108.1 కిలోమీటర్‌ ) కాలువ లైనింగ్‌ దెబ్బతినడం చూస్తే ఈ పనులను ఎంతమేరకు నాణ్యతతో చేపట్టారో అర్థమవుతున్నదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సెల్‌ఫోన్‌లో దెబ్బతిన్న లైనింగ్‌ పనుల ఫొటోలను చూపించారు. జిల్లాలోని వివిధ కెనాల్స్‌ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, ఆయా ప్రాంతాల్లో మట్టిని తరలిస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని బోర్డులు పెట్టాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు.

  • కూటమి
    ● అక్రమ నిర్మాణమంటూ వైఎస్సార్‌సీపీ నేత బంధువు స్థల ప్రహరీ కూల్చివేత ● 20 ఏళ్ల క్రితం నిర్మించిన షెడ్డును కమర్షియల్‌గా మార్చలేదని..

    బేతంచెర్ల: రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుకు కూటమి నేతలు అటు పోలీసులు, ఇటు అధికారులను ప్రయోగిస్తూ జనాన్ని భయ పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. వారి బరితెగింపునకు తాజాగా నగర పంచాయతీ బేతంచెర్లలో చోటు చేసుకున్న ఘటన మరో నిదర్శనంగా నిలుస్తోంది. పట్టణంలో నిబంధనలు పాటించని ఎన్నో నిర్మాణాలు ఉన్నా.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో నగర పంచాయతీ కమిషనర్‌ హరి ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీ నేత సమీప బంధువుకు చెందిన స్థలం ప్రహరీని కూల్చివేయడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణ సమీపంలో కర్నూలు రహదారిలోని షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో రామచంద్రారెడ్డికి 10 సెంట్ల స్థలం ఉంది. అందులో రెండు సెంట్లలో చిన్నపాటి గది నిర్మాణం చేసి, తన స్థలానికి చుట్టూ గోడ కట్టుకొని షెడ్డును ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చాడు. సుమారు 20 ఏళ్లకు పైగా ఉన్న ఈ నిర్మాణాన్ని టీడీపీ నాయకులు అక్రమం అంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో కమిషనర్‌ ఆ వ్యక్తికి నోటీసు ఇచ్చారు. అయితే ఆ స్థలానికి ఈనెల 2వ తేదీన నగర పంచాయతీ అధికారులు వెకెట్‌ ల్యాంట్‌ ట్యాక్స్‌ కూడా రూ.9,100 కట్టించుకున్నారు. అధికార పార్టీ నాయకులు ఒత్తిడి ఎక్కువ కావడంతో సక్రమంగా ఉన్న రామచంద్రారెడ్డి స్థలం చుట్టూ ఉన్న ప్రహరీని నగర పంచాయతీ కమిషనర్‌ హరి ప్రసాద్‌, ఎస్‌ఐ రమేష్‌ బాబు పోలీస్‌ సిబ్బందితో వెళ్లి శుక్రవారం కూల్చి వేయించారు. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా వెకెట్‌ ల్యాండ్‌ కింద ట్యాక్స్‌ చెల్లించారని, ఇది కమర్షియల్‌గా మార్చుకోవాలని సూచించామన్నారు. అయితే కమర్షియల్‌ స్థలం కాకపోయినా మార్చుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్న వాటిని వదిలేసి.. సక్రమంగా ఉన్న నిర్మాణాలను కూల్చడం వెనక అధికార పార్టీ నాయకులకు కమిషనర్‌ వత్తాసు పలుకుతున్నారని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.

  • సజావుగా డీఎస్సీ పరీక్షలు

    నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో డీఎస్సీ – 2025 పరీక్షలు సజావుగా జరుతున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం సెషన్‌–1లో ఇంగ్లిష్‌, ఎస్‌జీటీ పరీక్షలు జరిగాయన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు 870 మందికి గాను 811 మంది హాజరు కాగా 59 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 871 మందికి గాను 855 మంది హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

    పాండురంగాపురం సందర్శన

    నంద్యాల(అర్బన్‌): జాతీయ నిర్మల్‌ గ్రామ పురస్కార్‌, శుభ్రం అవార్డు, టూరిజం ఎక్సలెంట్‌ అవార్డులను పొందిన నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామాన్ని బీహార్‌ రాష్ట్రం సర్పంచ్‌ల బృందం శుక్రవారం సందర్శించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) కోచ్‌ అంజన్‌కుమార్‌ బంజ్యా ఆధ్వర్యంలో సర్పంచ్‌ల బృందం గ్రామంలోని తాగునీటి వసతి, ఎస్‌హెచ్‌సీ గ్రూప్‌, రైతు సంఘాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, తదితరాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పాండురంగస్వామి దేవాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను కొనియాడారు. గ్రామంలో ఏర్పాటు అయిన విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లు, ప్రజలకు అవసరమైన సదుపాయాలపై సర్పంచ్‌లు అభివృద్ధిని ప్రశంసించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపు ద్వారా పచ్చళ్లతో పలువురికి ఉపాధి కల్పించడాన్ని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ డోలావతమ్మ, ఎంపీటీసీ లక్ష్మి, మాజీ సర్పంచ్‌ ఉమామహేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పురుషోత్తమరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ సుగుణశ్రీ, ఈఓఆర్‌డీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

    బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ లింకు తప్పనిసరి

    కర్నూలు(అర్బన్‌): తల్లికి వందనం నిధులు విడుదల కాని ఎస్సీ విద్యార్థులు పోస్టల్‌/బ్యాంకు ఖతాలకు ఎన్‌పీసీఐ లింకు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమం సాధికారత అధికారిణి కె.తులసీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకు 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి 930 మంది తల్లుల ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌ పెండింగ్‌లో ఉందన్నారు. అలాగే 2,129 మంది ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల ఎన్‌పీసీఐ కూడా పెండింగ్‌లో ఉందన్నారు. ఎస్సీ విద్యార్థులకు సింగిల్‌ బ్యాంకు అకౌంట్‌ మాత్రమే ఉండాలని, అది కూడా విద్యార్థి ఆధార్‌ లింకు ఉన్న బ్యాంకు అకౌంట్‌కే తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 16లోగా పూర్తి చేయాలన్నారు.

  • ● విద్యుదాఘాతంతో కాడెద్దు అక్కడికక్కడే మృతి ● ఓ రైతు, మరో కాడెద్దుకు గాయాలు

    కోడుమూరు రూరల్‌: ఏరువాక గడిచి వారమైనా కాలేదు. ఎద్దుల సంబరం కళ్లలోనే ఉంది. పిలిస్తే పలికే నేస్తం కళ్లెదుటే కాలమైంది. తోబుట్టువుగా మెలిగి.. సాగులో భాగమైన మూగజీవం ఆ మట్టిలోనే మాయమైంది. పొలం పనులు చేస్తుండగా చోటు చేసుకున్న విద్యుత్‌ ప్రమాదం ఓ కాడెద్దును బలిగొంది. ఈ ఘటన కోడుమూరు మండలం కొత్తపల్లె గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కొత్తపల్లెకు చెందిన కంచి భాస్కర్‌కు ఐదెకరాల పొలం ఉంది. మూడేళ్ల క్రితం గోరంట్ల జాతరలో రూ.లక్ష పెట్టి కోడెదూడలను కొనుగోలు చేశాడు. వీటిని ఆ కుటుంబం ఎంతో అపురూపంగా చూసుకుంటోంది. వీరి పొలం పనులతో పాటు గ్రామంలో ఇతర రైతులు పిలిచినా కాడెద్దులను కూలీకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతు మేకలగిడ్డయ్య పత్తి పంట సాగు చేయగా.. శుక్రవారం పత్తిలో కలుపు పాసేందుకు భాస్కర్‌కు చెందిన కాడెద్దులను మాట్లాడుకున్నాడు. అతని కుమారుడు రవి కాడెద్దులతో పత్తి పొలంలో గొర్రు తోలుతుండగా బోరు కనెక్షన్‌కు ఇచ్చిన కరెంటు వైర్ల సపోర్టు కట్టె తగిలింది. కాడెద్దుల తాకిడికి కట్టె విరిగిపోయి విద్యుత్‌ తీగలు వాటిపై తెగిపడ్డాయి. రవికి కూడా స్వల్పంగా విద్యుత్‌షాక్‌ తగలడంతో వెంటనే అప్రమత్తమై ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ సరఫరా నిలిపేయాలని కేకలు వేయడంతో సమీపంలోని రైతులు స్పందించారు. అప్పటికే ఓ ఎద్దు మృతి చెందగా, మరో ఎద్దుకు విద్యుత్‌ షాక్‌కు గురైంది. స్వల్ప గాయాలైన రవిని కోడుమూరులోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. గాయపడిన ఎద్దును పశువైద్య శాలకు తీసుకెళ్లగా సత్వర వైద్యంతో కళ్లు తెరిచింది. అయితే కళ్లెదుటే ఓ ఎద్దు మృత్యువాత పడటాన్ని ఆ రైతు కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న రైతులను కూడా కంటతడి పెట్టించింది.

  • బెలుం గుహలకు ప్రపంచ స్థాయి గుర్తింపు
    ● భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు ● జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడి

    కొలిమిగుండ్ల: భూమి అంతర్భాగంలో సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుత బెలుం గుహలకు ఎట్టకేలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించనుంది. దేశంలో మేఘాలయలోని క్రైమ్‌ లియాట్‌ ప్రాహ్‌ గుహల తర్వాత రెండవ అతి పెద్ద గుహలుగా నిలిచాయి. ప్రపంచంలో రెండో గుహగా బెలుం గుహలను గుర్తించారు. కొలిమిగుండ్ల–బెలుం ప్రధాన రహదారిలో ఇవి విస్తరించాయి. భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇటీవల వెల్లడించింది. గుహల అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకోవడంతో బెలుం గుహలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. విదేశీ పర్యాటకులు ఆకట్టుకునేలా ప్రచారం కల్పించేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. పదివేల సంవత్సరాల క్రితం చిత్రా వతి నది ప్రవాహంతో ఈ గుహలుగా ఏర్పడ్డాయి. 3,229 మీటర్ల మేర గుహలు విస్తరించి ఉన్నాయి.

  • వైభవం

    బేతంచెర్ల: మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామి వారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, నైవేద్య సమర్పణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఉప కమిషనర్‌ రామాంజనేయు లు, వేదపండితుడు జ్వాలా చక్రవర్తి ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఊరేగింపు నిర్వహించారు.

    జీడీపీలోకి వరద నీరు

    గోనెగండ్ల: మండలంలో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నా యి.అలాగే గాజులదిన్నె ప్రాజెక్ట్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు ఏఈ మహమ్మద్‌ అలి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దాదాపు 600 క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి చేరిందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండగా, శుక్రవారం 600 క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి చేరిందని ప్రాజెక్టు ఏఈ వెల్లడించారు. గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు.

  • అడిగిన వెంటనే రక్తం ఇస్తున్నారు

    ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కర్నూలు రక్తనిధిలో ప్రతి సంవత్సరం 7వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నాం. ఇలా సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు, 20 శాతం తలసీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా అందజేస్తున్నాం. పేదవారెవ్వరైనా వస్తే వారికి ఉచితంగా రక్తం ఇస్తున్నాం. ఈ మేరకు వీరు పేదవారని సంబంధిత ఆసుపత్రి వైద్యులచే రాయించుకుని రావాల్సి ఉంటుంది. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని 14వ తేదీ రక్తనిధి ప్రాంగణంలో రక్తదాతలు, ఎన్‌జీవోలు, సహకరించిన వారికి జిల్లా కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓ, అడిషనల్‌ డీఎంహెచ్‌వో చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఇచ్చి సన్మానించనున్నాం.

    –డాక్టర్‌ కేజీ. గోవిందరెడ్డి, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌, కర్నూలు

Nizamabad

  • నూతన కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

    జిల్లా నూతన కలెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వినయ్‌ కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనను జిల్లా ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, బొకెలు అందజేశారు. బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణ్‌రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్‌కుమార్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు శ్రీనివాసరావు, భాస్కర్‌, రెవెన్యూ అధికారులు విజయకాంత్‌రావు తదితరులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కలెక్టర్‌ను కలిశారు.

    – నిజామాబాద్‌ అర్బన్‌

  • నాణ్యమైన విద్య అందించేందుకు కృషి

    బోధన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ అన్నారు. పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పి స్తోందని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.

    11 ఏళ్లుగా మూతపడి ఉన్న బోధన్‌ మండలంలోని భవానీపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను గ్రామ యువత, ప్రజల సహకారంతో మండల విద్యాశాఖ అధికారులు తెరిపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ పాఠశాలను సందర్శించి పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల ఆవరణలో తరగతి గదులు, మరుగుదొడ్డి నిర్మింపజేసిన రుద్ర షౌండేషన్‌ ప్రతినిధులను, పాఠశాల పునరుద్ధరణకు సహకరించిన గ్రామ యువకులను డీఈవో అభినందించారు. ఎంపీడీవో బాలగంగాధర్‌ తిలక్‌, టీచర్‌ కార్తీక్‌, సీఆర్‌పీ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • పాముకాటుతో..

    నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామానికి చెందిన బాల్‌లింగం కిష్టయ్య(67) అనే వ్యక్తి పాముకాటుతో మృతిచెందాడు. కిష్టయ్య గురువారంరాత్రి భోజనంచేసి తన ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం వేకువజామున నాలుగు గంటలప్రాంతంలో తనను పాము కరిచిందని భార్య సిద్ధవ్వకు తెలిపాడు. వెంటనే ఆమె కుమారులతో కలిసి కిష్టయ్యను మెదక్‌ ఆస్పత్రికి తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కిష్టయ్య మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • అంతర్

    నవీపేట: మండలంలోని ఫతేనగర్‌ ఫస్ట్‌ ప్లాట్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ అలీఖాన్‌ ఉషు(మార్షల్‌ ఆర్ట్స్‌లో కత్తితో విన్యాసం)లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు. సర్వర్‌ అలీఖాన్‌, నసీమ్‌ సుల్తానాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. క్రీడాకారుడైన సర్వర్‌ఖాన్‌ తన కుమారుల్లో ఒక్కరినైనా ఉత్తమ క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలని కలలుగన్నాడు. కుమారుల్లో ఒకరైనా మహమ్మద్‌ ఇమ్రాన్‌ అలీఖాన్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌లో ఉన్న ఉత్సాహాన్ని పసిగట్టి ఉషు వైపు పరుగులు పెట్టించాడు. అప్పు చేసి పంజాబ్‌లోని పాటియాల ఎన్‌ఐఎస్‌లో బీపీఈడీ(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)లో చేర్పించాడు. అక్కడి నుంచి డిప్లొమా సాధించిన ఇమ్రాన్‌ అలీఖాన్‌ ఉషు క్రీడపై మరింత దృష్టి సారించి, మెళకువలు నేర్చుకున్నాడు.

    అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్‌

    రష్యా రాజధాని మాస్కోలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు 10వ ఇంటర్నేషనల్‌ ఉషు స్టార్స్‌ టోర్నమెంట్‌(2025)ను నిర్వహించారు. ఈ వేడుకలో 17 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మన దేశం నుంచి 58 మంది క్రీడాకారులు పాల్గొనగా తెలంగాణ నుంచి ఇద్దరు పాల్గొన్నారు. ఆ ఇద్దరిలో ఒకరైన మహ్మద్‌ ఇమ్రాన్‌ అలీఖాన్‌ ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించాడు.

    ఆటో ఇంటి వద్ద ఉంటే పస్తులే!

    అంతర్జాతీయ స్థాయి ఉషులో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన మహమ్మద్‌ అలీఖాన్‌ జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నాడు. భార్య, నాలుగేళ్ల కుమారుడిని పోషించేందుకు ప్రతిరోజూ ఆటో నడపాల్సిందే. ఏ ఒక్కరోజూ ఆటో ఇంటి వద్ద ఉన్నా ఆ కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా టోర్నీమెంట్‌లకు వెళ్లేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నాడు. ఆయన ఉత్సాహాన్ని చూసి కుటుంబ సభ్యులు సైతం అడ్డుకోలేకపోతున్నారు. ఓ వైపు టోర్నమెంట్‌లలో పాల్గొంటూ.. మరో వైపు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇమ్రాన్‌ అలీఖాన్‌ నిజామాబాద్‌లో ప్రతి రోజూ కొంత మంది పేద చిన్నారులకు ఉచితంగా ఉషు శిక్షణ ఇస్తున్నాడు.

    ఉషు క్రీడలో ఇమ్రాన్‌ అలీఖాన్‌ ప్రతిభ

    చిన్నారులకు ఉచిత శిక్షణ

    గోల్డ్‌మెడల్‌ సాధించినా

    మారని పరిస్థితులు

    ప్రభుత్వం ఆదుకోవాలి

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తా. నన్ను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నా. జీవనోపాధి కోసం ఆటో తోలుకునే నాకు స్పోర్ట్స్‌ కోటాలో ఎక్కడైనా ఉద్యోగం కల్పించాలని కోరుతున్నా. మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగంలోని ఉషులో రాణించేందుకు ప్రోత్సహించాలి.

    – మహ్మద్‌ ఇమ్రాన్‌ అలీఖాన్‌, ఉషు

    ఇంటర్నేషనల్‌ క్రీడాకారుడు

Orissa

  • నాగేశ్వరి గుహల్లో గేటు చోరీ

    కొరాపుట్‌: వివాదాస్పద నాగేశ్వరి గుహల ప్రవేశ మార్గం గేటు చోరీకి గురయ్యింది. నందపూర్‌ సమితి నుంచి వెళ్లే ఈ మార్గంలో ప్రధాన గేటు చోరీ జరిగినట్లు స్థానికులు శుక్రవారం గుర్తించారు. సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో బల్దా నాగేశ్వరి గుహల పైభాగన విశాలమైన మైదానం ఉంది. అక్కడే పెద్ద సరస్సు, కింది వైపు నాగేశ్వరి గుహలు ఉన్నాయి. వీటిని తిలకించడానికి నిత్యం పర్యాటకులు తరలి వస్తుంటారు. మరోవైపు గుహల్లోని బాకై ్సట్‌ను తవ్వేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వీటిని వ్యతిరేకిస్తూ గిరిజనులు పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి ప్రవేశాలు నిషేధిస్తూ 2 నెలలు క్రితం స్థానికులు పెద్ద గేటు బిగించారు. దీనివల్ల గంజాయి స్మగ్లర్లకు కూడా ఇబ్బందిగా మారింది. ఈ నేపధ్యంలో గేటు చోరీ కావడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  •  రాష్
    శనివారం శ్రీ 14 శ్రీ జూన్‌ శ్రీ 2025
    మహిళా సాధికారతలో..

    భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వం సాధికారతతో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలపరిచేందుకు కట్టుబడి ఉందని సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ అన్నారు. మహిళల స్వావలంబన కోసం సంకల్పించిన సుభద్ర యోజన విజయవంతం కావడం ఒక ప్రధాన ఉదాహరణ అని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ పాలన ఏడాది పూర్తి పురస్కరించుకుని కటక్‌ నగరం బలియాత్ర గ్రౌండులో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నారీ శక్తి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మహిళలను గౌరవించడం రాజకీయ శిక్షణలో తొలి అంశంగా పేర్కొన్నారు. ఒడిశా నారీ శక్తిని అత్యుత్తమ శక్తిగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. లక్షాధికారి సోదరి (లఖ్యపతి దీదీ) ఆవిష్కరణలో ఒడిశా ప్రస్తుతం భారత దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 16 లక్షలకు పైగా లక్షాధికారి సోదరిలను సృష్టించడం మహిళా సాధికారతకు నిలువెత్తు తార్కాణంగా అభివర్ణించారు.

    సుభద్ర యోజన ఒడిశా చరిత్రలో అతిపెద్ద మహిళా సంక్షేమ కార్యక్రమమని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి కుటుంబంతో ప్రభుత్వం ప్రత్యక్షంగా సంప్రదించి సమగ్ర సమాచారంతో వాస్తవ లబ్ధిదారుల్ని పరిగణనలోకి తీసుకుని పథకం ప్రయోజనం చేరదీయడం విశేషమన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ మహిళల్ని చైతన్యపరచి పథకంలో చేర్చడం ప్రభుత్వం దృఢ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు.

    ఏడాది పాలనలో అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా స్వయం సహాయక బృందాలకు రూ. 3 వేల 695 కోట్ల విలువైన వ్యాపార అవకాశాలను కల్పించాయని. రాష్ట్ర చరిత్రలో ఇది ఆల్‌ టైమ్‌ రికార్డ్‌గా పేర్కొన్నారు. 3.07 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు రుణాలపై రూ. 300 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించి వారి ఆర్థిక కలలను సాకారం చేయడంలో ప్రభుత్వం వారధిగా నిలిచిందన్నారు. ఈ ఏడాది మహిళల కోసం రూ. 89,861 కోట్ల నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించి మహిళలకు పట్ట ప్రభుత్వ నిబద్ధత చాటుకుందని, మహిళా సాధికారతలో ఆదర్శ రాష్ట్రంగా ఒడిశా ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌ తన ప్రసంగంలో, మహిళా శక్తి అభివృద్ధి చెందిన, సంపన్నమైన, గర్వించదగిన ఒడిశా ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మాట్లాడుతూ సమానత్వం, శ్రేయస్సు, పురోగతి రాష్ట్రంగా ఒడిశాను నిర్మించాలనే సంకల్పానికి ఈ కార్యక్రమం తొలి వేదికగా నిలుస్తుందన్నారు. వచ్చే ఏడాది సరికి రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో లక్షాధికారి సోదరి, ప్రతి పంచాయతీలో కోటీశ్వర మహిళల్ని ఆవిష్కరించడం తథ్యమని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ అమలు చేసిన పోషణ్‌ అభియాన్‌లో అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రంలోని వివిధ లిఖిత, ఫొటో చిత్రాలతో కూడిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ముఖ్యమంత్రి, ఇతర అతిథులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత శాఖ ఆధ్వర్యంలో విశేష కృషి చేసిన మహిళలను ముఖ్యమంత్రి సత్కరించారు.

    కటక్‌ లోక్‌ సభ సభ్యుడు భర్తృహరి మహతాబ్‌, జగత్‌సింగ్‌పూర్‌ లోక్‌ సభ సభ్యుడు బిభు ప్రసాద్‌ తొరై, కటక్‌ నియోజక వర్గం శాసన సభ సభ్యుడు ప్రకాష్‌ సెఠి, బొడొంబ నియోజక వర్గం శాసన సభ సభ్యుడు విజయ్‌ డాల్‌బెహెరా, నియాలి నియోజక వర్గం శాసన సభ సభ్యుడు అభిషేక్‌ మల్లిక్‌, మహాంగా నియోజక వర్గం శాసన సభ సభ్యుడు శారద ప్రసాద్‌ ప్రధాన్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ దత్తాత్రేయ భౌసాహెబ్‌ షిండే, మహిళా సాధికారత శాఖ ప్రముఖ కార్యదర్శి శుభ శర్మ, డైరెక్టర్‌ మోనిషా బెనర్జీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    న్యూస్‌రీల్‌

  • పతిత

    భువనేశ్వర్‌: పూరీ శ్రీమందిరం సింహద్వారం ఆవరణలో కుడ్య ప్రతిమ పతిత పావనుడిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాడు. రత్నవేదికపై కొలువుదీరిన మూల విరాటు అస్వస్థతతో తెరమరుగు కావడంతో జగన్నాథుని స్థానంలో అనంత నారాయణ్‌ చిత్రపటం నిత్య పూజలు అందుకుంటున్నాడు. మూల విరాటుల సహజ దర్శనం పునరుద్ధరించేంత వరకు పతిత పావనుని ఇలా దర్శించుకోవడం నిరవధికంగా కొనసాగుతుంది.

    పేదలకు నిత్యావసరాల పంపిణీ

    రాయగడ: స్థానిక రైతుల కాలనీలో గల నవజీవన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ మహిళలకు ఉచితంగా నిత్యావసరాల వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. అన్నలక్ష్మీ పథకం కింద ప్రతి నెల బియ్యం, నూనె, బంగాళాదుంపలు, కందిపప్పు తదితర వస్తువులను పంపిణీ చేస్తున్నామని ట్రస్టు నిర్వాహకులు ఎం.నళిని తెలియజేశారు. ఇదిలాఉండగా ఈ సారి నిత్యవసరాల వస్తువులతో పాటు మామిడి పళ్లు, బిస్కెట్‌, రొట్టెలను పంపిణీ చేశామని ఆమె తెలిపారు. తిరుపతిలో గల నవజీవన్‌ ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్రీధర్‌ ఆచార్య ప్రతి నెల నిరుపేదలకు అన్న లక్ష్మీ పేరిట నిత్యావసరాల పంపిణీ చేస్తున్నారని, అదేవిధంగా రాయగడలో గల ట్రస్టు ఆధ్వర్యంలో ఎందరినో చదివిస్తున్నారని తెలిపారు.

    చంద్రపూర్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ

    రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో 35 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను శుక్రవారం పంపిణీ చేశారు. అదనపు తహసీల్దార్‌ ఆశీష్‌ కుమార్‌ ప్రధాన్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రహి, సిబ్బంది మోతీలాల్‌ సామల్‌ తదితరులు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన వారిలో ఉన్నారు. లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    లారీ బోల్తా

    రాయగడ: కలహండి జిల్లా భవానీపట్నం నుంచి రాయగడకు అల్యూమిన పైపులతో వస్తున్న లారీ జిల్లాలోని అంబొదల సమీపంలో శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలోని పైపులు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న అంబొదల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌, హెల్పరు సురక్షితంగా బయటపడ్డారు.

    తమ్ముడిపై దాడి ఘటనలోఅన్న అరెస్టు

    మల్కన్‌గిరి: కోరుకొండ సమితి బలిమెల పోలీసుస్టేషన్‌ పరిధిలో రాస్స్‌బేఢ పంచాయతీ పల్లంగూడలో ఈ నెల 8న భూమి విషయమై తమ్ముడు తిరుపతి ముదిలిని బాణంతో గాయపరిచిన అన్నహరి ముదిలిని బలిమెల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ ధీరజ్‌ పట్నాయిక్‌ తెలిపారు. తిరుపతి ప్రస్తుతం బరంపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • 40 మందికి శిరోముండనం
    కులాంతర వివాహం..

    రాయగడ: నేటి ఆధునిక ప్రపంచంలోనూ ఇంకా అనేక చోట్ల మూఢ నమ్మకాలు కొనసాగుతునఆనయి. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో యువతి కుటుంబీకులు 40 మంది శిరోముండనం చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా కాసీపూర్‌ సమితి గొరక్‌పూర్‌ పంచాయతీలో ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, వేరే షెడ్యూల్‌ తెగకు చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి యువతి తరఫు బంధువులు, కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న యువ జంట తమ బంధువులు, కుటుంబీకులను కలసి ఆశీర్వాదం తీసుకునేందుకు గురువారం స్వగ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఊరికట్టుబాట్లను కాదని కులాంతర వివాహం చేసుకున్నందుకు శిక్ష విధించారు. గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబీకులను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే యువతి బంధువులు, కుటుంబీకులు శిరోముండనం చేసుకోవడంతో కర్మకాండలను నిర్వహించి మూగజీవాలను బలి ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు యువతి కుటుంబీకులు అంగీకరించారు. 40 మంది శిరోముండనం చేసుకుని మూగజీవాలను బలిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించగా వారిని తిరిగి కులంలో కలుపుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వద్ద ఎటువంటి సమాచారం లేదు.

  • మూడు

    కొరాపుట్‌: ప్రమాదం జరిగిన ట్రక్‌లో ఇరుక్కుని డ్రైవర్‌ మూడు గంటలు నరక యాతన పడ్డాడు. శుక్ర వారం వేకువ జామున 2.30 గంటల సమయంలో జయపూర్‌–నబరంగ్‌పూర్‌ మార్గంలో హరడాపుట్‌ గ్రామం వద్ద 26వ నంబర్‌ జాతీయ రహదారిపె నిలిపి ఉన్న ట్రక్‌ని పాల ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఉమ్మర్‌కోట్‌ నుంచి విశాఖపట్నానికి పాల లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్యాంకర్‌ డ్రైవర్‌ గురునాం సింగ్‌ తన సీటులో చిక్కుకు పోయాడు. పోలీసుల సమాచారంతో జయపూర్‌ ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హైడ్రాలిక్‌ కుంబి టూల్స్‌ వినియోగించి సుమారు మూడు గంటల ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా డ్రైవర్‌ని బయటకు తీసి జయపూర్‌లోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఫైర్‌ స్టేషన్‌ అధికారి సురేష్‌ బారిక్‌ వెల్లడించారు.

  • జాజ్‌పుర్‌ జిల్లాలో ప్రబలిన డయేరియా

    భువనేశ్వర్‌: జాజ్‌పూర్‌ జిల్లాలో అతిసార పంజా విసిరింది. వ్యాధిలక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధాన ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిని క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు కేంద్ర రెవెన్యూ అధికారి (ఆర్‌డీసీ) వి.దీన్‌ జాజ్‌పూర్‌ జిల్లాలోని ధర్మశాల, వ్యాసనగర్‌ ఆస్పత్రులతోపాటు జిల్లా ప్రధాన ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. చికిత్సపొందుతున్న రోగులతోపాటు బంధువులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అతిసార వ్యాప్తి చెందడానికి కారణాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌, ఆహార భద్రత శాఖ ప్రత్యేక కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌, జిల్లా ముఖ్య వైద్య అధికారి, మండల అధికారి, వైద్యులతో మాట్లాడిసి పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత ప్రజలకు తగిన వైద్య సేవలను అందించాలని ఆర్‌డీసీ ఆదేశించారు.

    వ్యాధిపై ఆర్‌డీసీ సమీక్ష

  • మంచిన

    కొరాపుట్‌: ప్రజారోగ్య శాఖ పంపీణీ చేస్తున్న మంచినీటికి బదులు మురుగు నీరు (ఎర్రటినీరు) వస్తుంది. నబరంగ్‌పూర్‌ జిల్లా పపడాహండి సమితి తుంబర్ల గ్రామ పంచాయతీ దన్సులి గ్రామంలో మంచినీటికి బదులు మురుగు నీరు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. గత కొద్ది రోజులుగా ఈవిధంగా దుర్గంధంతో కూడిన నీరు సరఫరా అవుతున్నటుట స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని సర్పంచ్‌ దృష్టికి తెచ్చారు. సర్పంచ్‌ ఉన్నతాధికారులకు నివేదించినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయం గురువారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో అధికారులు గ్రామానికి పరుగులు తీసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

  • ఇద్దర

    మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో శుక్రవారం ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వినోద్‌ పటేల్‌ తెలిపారు. మత్తిలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని సోడిగూడ వద్ద వీరిని పట్టుకున్నట్లు చెప్పారు. కొరాపుట్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తుండగా డీవీఎఫ్‌ జవాన్లకు పట్టుబడ్డారని తెలిపారు. వీరిద్దరూ ఆంధ్రా–ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా గాంగులూర్‌కు చెందిన రాకేష్‌ కుంజం అలియాస్‌ మున్న కుంజం, కేశు కబాసిగా గుర్తించారు. సుక్మా జిల్లా కాంగేర్‌ఘాటి ఏరియా కమిటీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వీరిపై రూ.4లక్షలు చొప్పున మొత్తం రూ.8లక్షలు రివార్డు ఉంది. వీరి వద్ద నుంచి రెండు రివాల్వర్లు, సాహిత్యం, వాకీటాకీ బ్యాటరీ, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  • కొరాపుట్‌: ఆధునిక సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో గిరిజనులు మూఢ విశ్వాసాలు, నిబంధనలు వీడటం లేదు. శుక్రవారం నబరంగ్‌పూర్‌ జిల్లా కొడింగా పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని బంకులి గ్రామానికి చెందిన 15 కుటుంబాల పెద్దలు నబరంగ్‌పూర్‌ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చట్టపరంగా ఉన్న తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, దీనిపై న్యాయ పోరాటానికి దిగడంతో కక్ష కట్టి తమ 15 కుటుంబాలకు చెందిన 75 మందిని సామాజిక బహిష్కరణ చేశారని వాపోయారు. గ్రామంలో ఎవరూ తమతో మాట్లాడరని, దుకాణాలలో వస్తువులు విక్రయాలు చేయడం లేదని, బోర్ల వద్ద నీరు పట్టుకోనివ్వడం లేదని, కనీసం పశువులను కూడా చెరువుల వద్దకు రానివ్వకపోవడంతో నాలుగు రోజులుగా పశువులు ఆకలితో అలమటిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. తమ పిల్లలను కూడా ఇతర పిల్లలతో ఆడనివ్వడం లేదన్నారు. గ్రామస్తులు ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రు.500 జరిమానా విధిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కొడింగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదన్నా రు. సమాచారం అందుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మన్నా త్రిపాఠి బాధితులను జిల్లా కేంద్రానికి రప్పించి ఎస్పీ ఫిర్యాదు చేయించారు. దీంతో ఎస్పీ సందీప్‌ సంపత్‌ తీవ్రంగా పరిగణించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, మున్నా త్రిపాఠి మీడియాతో మాట్లాడు తూ ఇటువంటి సంస్కృతిని ఆదిలోనే నిలిపి వేయాలన్నారు. లేదంటే ప్రతి గ్రామంలో బలవంతులు చట్టం తమ చేతిలోకి తీసుకొని పేదలను పీడిస్తారన్నారు. తక్షణం పోలీసు బలగాలు గ్రామానికి చేరుకొని నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశా రు. త్వరలోనే ఆ గ్రామాన్ని సందర్శిస్తామని త్రిపాఠి పేర్కొన్నారు.

Peddapalli

  • ‘గులా

    సాక్షి, పెద్దపల్లి/ఎలిగేడు: పింక్‌షర్ట్‌ వేసుకున్నా అర్హులైతే చాలు.. పార్టీలకతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఐటీ పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఎలిగేడు లో కొత్త పోలీసుస్టేషన్‌, కలెక్టరేట్‌ సమీపంలో ట్రాఫి క్‌, రూరల్‌, వ్యవసాయ మార్కెట్‌లో మహిళా పోలీ స్‌ స్టేషన్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో సమీకృతమార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చందపల్లి, రాంపల్లిలో నిర్మించిన 466 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎలిగేడు, చందపల్లిలో జరిగిన సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అని అభినందించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గురుకులాల్లో డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ చార్జీలు 200 శాతం పెంచామని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు పంచామని తెలిపారు. మిగిలిన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో మరో 1,000 ఇళ్ల కోసం బఫర్‌ కింద అదనంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్‌కు సూచించారు

    నేరస్తులను శిక్షించాలి : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

    నేరస్తులు ఎంతటివారైనా శిక్ష పడితే ఇంకొకరు నేరం చేయరని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్‌ పేరిట ఆ పార్టీ నాయకులకే ఫ్రెండ్లీగా ఉన్నారని విమర్శించారు. రో డ్డుపై న్యాయవాద దంపతులను హత్య చేస్తే ఆనాటి ప్రభుత్వం అసలైన నిందితులను కేసు నుంచి తప్పించిందని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్మిస్తే ఆ ప్రాంతవాసులకు మెరుగైన చికిత్స అందాలని కోరుకుంటామని, అలాగే పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన పరిస్థితి ఎవరికీ రావొద్దని సూ చించారు. ఎలిగేడు మండలవాసుల కోసం వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజయరమణరావు విజ్ఞప్తి చేశారు. రూ.82 కోట్లతో బైపాస్‌ రోడ్డు పనులకు టెండర్లు పూర్తయ్యాయని, రూ.52 కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నామని, వచ్చే సంక్రాంతి నాటికి ఆర్టీసీ బస్‌ డిపో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మాట్లాడుతూ, రామగుండం పట్టణంలో మరో తహసీల్దార్‌ కా ర్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్‌ సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా, డీసీపీ కరుణాకర్‌, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

    అర్హులైతేచాలు పింక్‌షర్ట్‌ వేసుకున్నా మంజూరు చేస్తాం

    పార్టీలకతీతంగా ఇళ్ల కేటాయింపు

    జిల్లాకు అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు

    రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

    లబ్ధిదారులకు డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు పంపిణీ

    ఎలిగేడులో కొత్త పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

    జిల్లా కేంద్రంలో రూరల్‌, ట్రాఫిక్‌, మహిళా ఠాణాల ప్రారంభోత్సవం

    తొలి ఎస్సైగా సత్యనారాయణ

    మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు సమక్షంలో ఎలిగేడు పోలీస్‌స్టేషన్‌ తొలి ఎస్సైగా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా సేవలు అందిస్తానని ఎస్సై తెలిపారు.

  • విద్య
    ● ‘సీబీఎస్‌ఈ’ ప్రారంభం వాయిదా ● హాజరుకాని మంత్రులు, ప్రజాప్రతినిధులు ● ఖరారుకాని ప్రవేశాలు ● ఆందోళనలో సింగరేణి ఉద్యోగులు

    గోదావరిఖని: సింగరేణిలోని సీబీఎస్‌ఈ స్కూల్‌ ప్రారంభం వాయిదాపడింది. అధికారులు, సింగరేణి సంస్థ సీఎండీ యైటింక్లయిన్‌కాలనీలోని సీబీఎస్‌ఈ స్కూల్‌ ప్రారంభానికి శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. అయితే, సాయంత్రం వరకూ మంత్రుల రాకకోసం వేచిచూసినా.. పెద్దపల్లిలోనే అభివృద్ధి పనులు పూర్తిచేసుకుని అటే వెళ్లిపోయారు. దీంతో చివరి నిమిషంలో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ స్కూల్‌లో 408 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. ఇందుకోసం 1,600 మంది దరఖాస్తు చేశారు. ఈనెల 12 న తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది.

    విద్యార్థుల ఎదురు చూపులు

    సింగరేణి చరిత్రలోనే తొలిసారి సీబీఎస్‌ఈ విద్యావిధానం ప్రారంభం కానుండడంతో రామగుండం రీజియన్‌లోని కార్మికుల పిల్లలను చదివించేందుకు పోటీపడ్డారు. ఇతర స్కూళ్లలో చదువుతున్న వారికోసం కూడా ఇందులో దరఖాస్తు చేశారు. ఇక్కడ సీటు కన్ఫర్మ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సీట్ల కేటాయింపులో జాప్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సీటు రాకపోతే విద్యాసంవత్సరం మధ్యలో వేరే పాఠశాలలో దొర కడం కష్టంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి సీట్లు ఖరారు చేయాలని వారు కోరుతున్నారు.

    మంత్రుల పేరిట ఆహ్వానపత్రిక

    సింగరేణి ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్పొరేట్‌ స్థా యిలో తీర్చిదిద్దిన సీబీఎస్‌ఈ పాఠశాల ప్రారంభంవాయిదా పడింది. రూ.3కోట్లు వెచ్చించి స్కూల్‌కు ఆధునిక హంగులు దిద్దారు. ప్రారంభ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్‌వెంకటస్వా మి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరవుతారని ఆహ్వానపత్రికపై పేర్లు ముద్రించారు. అయితే, ప్రొటోకాల్‌ సమస్యతో స్కూల్‌ ప్రా రంభోత్సవం వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు టూర్‌ షెడ్యూల్‌లో సింగరేణి సీబీఎస్‌ఈ స్కూల్‌ ప్రారంభోత్సవం లేదని, ఎలిగేడు, పెద్దపల్లిలోని కార్యక్రమాల షెడ్యూలే ఉందని సమాచారం.

    సొమ్ము సింగరేణిది.. పెత్తనం ప్రభుత్వానిది

    సింగరేణి సొమ్ముతో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన సీబీఎస్‌ఈ స్కూల్‌ ప్రారంభంపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య ప్రశ్నించారు. స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆహ్వాన పత్రికలో సంస్థ సీఎండీ బలరాం, సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులకు అవమానం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను పెద్ద అక్షరాలతో వేసి సింగరేణి సీఎండీ, యూనియన్‌ నాయకుల పేర్లను కింద చిన్నగా ముద్రించడం ఏమిటని ప్రశ్నించారు. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి అధికార పార్టీకి అధికారులు తాబేదారులుగా మారారని ఆయన ఆరోపించారు. జీఎంలు సిగ్గు లేకుండా ఫైళ్లు పట్టుకుని ఎమ్మెల్యేల వద్దకు పరుగులు తీస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంతకుముందు సింగరేణి అధికారులతో పనిపడితే ఎమ్మెల్యేలే జీఎంల వద్దకు వచ్చి మాట్లాడేవారని ఆయన గుర్తుచేశారు.

  • పకడ్బందీగా పాలన

    గోదావరిఖని: సుమారు దశాబ్ద కాలం తర్వాత సింగరేణి బొగ్గు గనుల సంస్థలో అత్యంత కీలక పోస్టులో ఐఏఎస్‌ అధికారిని కేటాయించింది. 2014లో సింగరేణి డైరెక్టర్‌(పా– పర్సనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌)గా ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ సేవలు అందించారు. ఆ తర్వాత మళ్లీ ఈ పోస్టుకు ఐఏఎస్‌ అధికారిని నియమించలేదు. అదనపు బాధ్యతలతోనే సింగరేణి యాజమాన్యం ఇప్పటిదాకా నెట్టుకుంటూ వస్తోంది.

    గత డైరెక్టర్‌ (పా) తీరు

    వివాదాస్పదం కావడంతో..

    సింగరేణి సంస్థలో కీలకంగా ఉండే పర్సనల్‌, అడ్మినిస్ట్రేటివ్‌, వెల్పేర్‌(పీఏడబ్ల్యూ) విభాగాలకు అధిపతిగా డైరెక్టర్‌(పా) వ్యవహరిస్తారు. ఈపోస్టు సింగరేణిలో చాలా కీలకం. అయితే గతంలో పనిచేసిన డైరెక్టర్‌(పా) వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో ఆ తర్వాత ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించలేదు. అప్పటి నుంచి ఇప్పటి దాకా సింగరేణిలోని వివిధ విభాగాల డైరెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. నెట్టుకుంటూ వస్తోంది. డైరెక్టర్‌ పీపీ, డైరెక్టర్‌ ఓపీ ఈ విభాగాన్ని చూస్తూ వస్తున్నారు. దీంతో సంస్థ ఉద్యోగులు, యాజమాన్యానికి, కార్మికుల సంక్షేమం, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన అనేక పనుల్లో జాప్యం కావడం, సమస్యలు అపరిష్కృతంగాఉండడం అవుతూ వస్తున్నాయి. వాస్తవానికి రెండు కీలక డైరెక్టర్లు గనుల యజమానులుగా వ్యవహరించడం, వాటి పర్యావరణ అనుమతులు, ఉత్పత్తి, ఉత్పాదతక మిగతా వ్యవహారాలతోనే ఎక్కువగా ఉండటంతో అదనపు బాధ్యతలు నిర్వర్తించడం వారికి ఇబ్బందిగా మారింది. ఈక్రమంలో అనేక ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యం ఏర్పడుతూ వస్తోంది.

    సంస్థలో కీలకం డైరెక్టర్‌(పా)

    తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనుల సంస్థలో సుమారు 40 వేల మంది పర్మినెంట్‌ కార్మికులు, దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే సంస్థలోని మొత్తం 11 ఏరియాల్లో సంస్థ ఉద్యోగుల వ్యవహారాలు, పరిపాలన, సంక్షేమం డైరెక్టర్‌(పా) పర్యవేక్షిస్తారు. పర్సనల్‌ విభాగం, నియామకాలు, సంక్షేమ విభాగం, మానవ వనరుల విభాగం, ఎడ్యుకేషనల్‌ సొసైటీ పారిశ్రామిక సంబంధాలు, ఎస్టేట్‌, ఎగ్జిక్యూటివ్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్‌) విభాగాలు డైరెక్టర్‌(పా) పరిధిలో ఉంటాయి. ఈక్రమంలో సంస్థ లో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐ ఏఎస్‌ స్థాయి అధికారి నియామకంతో కార్మికుల సమస్యలను మానవతా దృక్పథంతో ఆలోచించి న్యాయం చేస్తారని కార్మికులు ఎంతోఆశగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో దాదాపు దశాబ్దం తర్వాత ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియ మించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పనుల్లో వేగవంతం పెరిగి సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.

    సింగరేణి డైరెక్టర్‌(పా)గా ఐఏఎస్‌ ఆఫీసర్‌

    దశాబ్దకాలం తర్వాత సివిల్స్‌ అధికారి నియామకం

    ఇప్పటి వరకు అదనపు బాధ్యతలతోనే సరిపెట్టిన వైనం

    దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంటున్న కార్మికలోకం

Rajanna

  • నేతకా

    సిరిసిల్ల: వస్త్రోత్పత్తికి నైపుణ్యం గల నేతకార్మికుల కొరత వేధిస్తోంది. తరచూ వస్త్రవ్యాపారంలో సంక్షోభం తలెత్తుతుండడంతో వస్త్రోత్పత్తి నిలిచిపోతుంది. దీంతో కార్మికులకు పని దొరక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే చాలా మంది నైపుణ్యం గల కార్మికులు ఇతర రంగాల వైపు మళ్లిపోయారు. ఒకప్పుడు పుష్కలమైన ఉపాధి దొరకడంతో ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన నేతకార్మికులు ఇక్కడికి వలస వచ్చారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు లేక.. వచ్చినా నూలు అందుబాటులో లేక తరచూ సాంచాలు బంద్‌ పడుతుండడంతో సరిగ్గా పనిలేక స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక నేతకార్మికులు సైతం నమ్మకం లేని వస్త్రోత్పత్తిపై ఆధారపడకుండా కొందరు ఆటోలు కొనుక్కోగా.. మరికొందరు ఊరూరా తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇలా వస్త్రోత్పత్తి రంగానికి ఒక్కొక్కరుగా దూరమయ్యారు.

    ఉత్తరాది కార్మికులపైనే ఆధారం

    స్థానికంగా నైపుణ్యం గల నేతకార్మికుల కొరత ఏర్పడడంతో కొందరు ఆసాములు బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పిస్తున్నారు. భీవండీ, ముంబయి వంటి పట్టణాల్లో పవర్‌లూమ్స్‌ నడిపిన అనుభవం ఉన్న ఉత్తరాది కార్మికులను సిరిసిల్లకు రప్పిస్తున్నారు. అయినా వస్త్రపరిశ్రమ అవసరాల మేరకు ఉత్తరాధి కార్మికులు పూర్తి స్థాయిలో రావడం లేదు.

    మహిళాశక్తి చీరల ఉత్పత్తికి విఘాతం

    రాష్ట్రంలోని మహిళలకు ఏటా రెండు చీరలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందించింది. ప్రస్తుతం రెండు విడతల్లో 4.24 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను 130 మ్యాక్స్‌ సంఘాలకు అందించారు. ఒక్కో మీటరుకు రూ.34 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. బట్టను నేసే కార్మికుడికి రూ.5.25 చొప్పున చెల్లించాలని ఒప్పందం చేశారు. సొంతంగా వస్త్రోత్పత్తి చేయలేని మ్యాక్స్‌ సంఘాలకు ప్రభుత్వమే నూలు డిపో ద్వారా యారన్‌(నూలు)ను సరఫరా చేస్తుంది. దీంతో వస్త్రోత్పత్తిదారులపై నూలు కొనుగోలు భారం తప్పింది. ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్రంలోని సుమారు 66 లక్షల మంది మహిళలకు ఒక్కో చీరను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. పని నిదానంగా సాగుతోంది. సిరిసిల్లలో డాబీ, జకార్డ్‌ పరికరాలను అమర్చిన సాంచాలు 17 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం 4,230 సాంచాలపై మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. రోజుకు 1.25లక్షల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 32వేల మీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అనేక మంది ఆసాములకు సాంచాలు ఉన్నా.. బట్ట నేసేందుకు కార్మికులు లేక ఖాళీగా ఉంటున్నాయి. కార్మికుల కొరతతో పొద్దాంత మాత్రమే వస్త్రోత్పత్తి సాగుతుంది. రాత్రి వేళల్లో సాంచాలు బంద్‌ ఉంటున్నాయి.

    సిరిసిల్లలో పవర్‌లూమ్‌ వర్కర్ల కొరత ఇతర పనుల్లో స్థిరపడిన నేతకార్మికులు ఉత్తరాది రాష్ట్రాల కార్మికులతో వస్త్రోత్పత్తి మహిళాశక్తి చీరల ఆర్డర్లు.. దొరకని కార్మికులు

    విచిత్ర పరిస్థితి

    పనులు లేక నేతకార్మికులు రోడ్డున పడే పరిస్థితులు ఒకప్పుడు ఉండగా.. ఇప్పుడు కార్మికులు లేక సాంచాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా యువకులు ఈ పని చేసేందుకు ముందుకు రావడం లేదు. పొరుగు రాష్ట్రాల కార్మికులను తెచ్చుకునే పరిస్థితులు రావడంతో వారు గంటల తరబడి రెస్ట్‌ లేకుండా పని చేయడంతో వారితో స్థానిక కార్మికులు పోటీ పడలేక, వస్త్రోత్పత్తి పనికి దూరమవుతున్నారు.

    కార్మికులు దొరకడం లేదు

    ఇతను చందా రాజమౌళి. గణేశ్‌నగర్‌కు చెందిన రాజమౌళి వద్ద 48 సాంచాలు ఉన్నాయి. కానీ పవర్‌లూమ్‌ వర్కర్లు లేక రాజమౌళితోపాటు మరొకరు మాత్రమే మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంకా ఏడుగురు నేతకార్మికులు అవసరం. కానీ నైపుణ్యం గల కార్మికులు దొరక్క సాంచాలు నడవడం లేదు. ఇలాంటి పరిస్థితి సర్ధార్‌నగర్‌కు చెందిన వస్త్రోత్పత్తిదారులు మండల సత్యం, బూట్ల సతీశ్‌కుమార్‌లు నేతకార్మికుల కోసం నిరీక్షిస్తున్నారు.

    ఇతను బిహార్‌ రాష్ట్రం మధుబని జిల్లా పూర్‌సోలియాకు చెందిన జమీర్‌. స్థానికంగా ఓ కార్ఖానాలో పనిచేస్తున్నాడు. నిత్యం 12 గంటలపాటు పనిచేస్తూ పాలిస్టర్‌ బట్టను ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.14వేలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మహిళా శక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.26వేలు సంపాదిస్తున్నాడు. జమీర్‌ లాగే ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌లకు చెందిన 200 మంది కార్మికులు సిరిసిల్లలో పనిచేస్తున్నారు.

    ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు వచ్చాయి. బట్ట నేసేందుకు కార్మికులు లేరు. చాలా మంది ఆసాములు, వస్త్రోత్పత్తిదారులు కార్మికుల కోసం వెతుకుతున్నారు. మా కార్ఖానాలోనే నలుగురు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క పూటనే పనిచేయిస్తూ.. సాంచాలు బందుపెట్టుకుంటున్నారు. పొరుగు జిల్లాలకు వెళ్లిపోయిన వారు తిరిగి రావడం లేదు. కార్మికుల కొరత తీవ్రంగా ఉంది.

    – ఆడెపు భాస్కర్‌, పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సిరిసిల్ల

  • నేడు

    సిరిసిల్లకల్చరల్‌: పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం శనివారం మెగా జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోదగిన కేసులను అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని న్యాయవాదులకు సూచించారు.

    ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్య

    ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

    వేములవాడఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అంగన్‌వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. రుద్రంగిలో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏఎంసీ చైర్మన్‌ రొండి రాజు, కనికరపు రాకేశ్‌, మండల విద్యాధికారి బన్నాజీ తదితరులు పాల్గొన్నారు.

    నాణ్యమైన సేవలందించాలి

    జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం

    గంభీరావుపేట(సిరిసిల్ల): అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారంతోపాటు ఆట పాటలతో కూడిన విద్యనందించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. మండలంలోని లింగన్నపేట ఐసీడీఎస్‌ సెక్టార్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించేందుకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. డీహబ్‌ కో–ఆర్డినేటర్‌ రోజా, డీసీపీయూ ప్రొటెక్షన్‌ అధికారి శ్రీనివాస్‌, టీచర్లు గీతబాల, వనజ, రజని, ఉమారాణి, సునీత పాల్గొన్నారు.

    మహిళలు పరీక్షలు చేయించుకోవాలి

    జిల్లా వైద్యాధికారి రజిత

    సిరిసిల్ల: జిల్లాలో స్వశక్తి సంఘాల మహిళలు, మున్సిపల్‌లో పనిచేసే మహిళా సిబ్బంది విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌.రజిత కోరారు. సుందరయ్యనగర్‌, అంబేడ్కర్‌నగర్‌, వేములవాడలోని ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్‌ హెల్త్‌క్యాంప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, దీర్ఘకాల వ్యాధుల(మధుమేహం, రక్తపోటు) పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ రామకృష్ణ, డీపీవో రాజేందర్‌, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

    మున్సిపల్‌ ఉద్యోగులకు గుండె వైద్యశిబిరం

    సిరిసిల్లటౌన్‌: మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి శుక్రవారం ఉచిత గుండె వైద్యశిబిరం నిర్వహించారు. స్థానిక సినారె కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఇన్‌చార్జి కమిషనర్‌ పోసు వాణి ప్రారంభించారు. కరీంనగర్‌ మెడికవర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో 220 మంది ఉద్యోగులు, కార్మికులకు ఉచితంగా టూడీ ఈకో, షుగర్‌, బీపీ పరీక్షలు చేశారు. ఆస్పత్రి సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించడానికి వైద్యుల సలహాలు పాటించాలన్నారు. మున్సిపల్‌ ఈఈ రఘు, మెప్మా కోఆర్డినేటర్‌ మహాలక్ష్మి, ఆస్పత్రి మార్కెటింగ్‌ మేనేజర్‌ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Siddipet

  • మార్ప
    ముప్పును ముందే చెబుతాయి వాతావరణానికి సంబంధించిన వివరాలు అందించే ప్రత్యేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వివరాలు 8లో u

    విద్యార్థులకు రక్షణ కరువు

    పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో పాములు ప్రత్యక్షమవుతున్నాయి.

    వివరాలు 9లో u

    శనివారం శ్రీ 14 శ్రీ జూన్‌ శ్రీ 2025

    సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మార్పుపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ్యతల నుంచి కొండా సురేఖను తప్పించి కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్‌ వెంకటస్వామిని ఇన్‌చార్జి మంత్రిగా నియమిస్తూ గురువారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే కొండా సురేఖ ఉమ్మడి మెదక్‌ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు, ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో ఇన్‌చార్జి మంత్రిది కీలక బాధ్యత ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన ఏడు చోట్ల ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్న జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పాత్ర మరింత కీలకం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలను, కేడర్‌ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో కీలకమైన ఇన్‌చార్జి మంత్రిగా కొండా సురేఖను మార్చడం వెనుక కారణమేమై ఉంటుందోననే దానిపై చర్చ జరుగుతోంది.

    కలకలం రేపిన వేర్వేరు సమీక్షలు

    జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖలు ఒకే అంశాలపై ఒక్క రోజు వ్యవధిలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్‌ పనుల సమాయత్తం వంటి అంశాలపై ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాల మేరకు పక్షం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సంగారెడ్డిలో జరిగింది. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరైనప్పటికీ.. కేవలం కొండా సురేఖ మాత్రమే సమీక్షలో మాట్లాడారని తెలిసింది. ఈ సమీక్ష జరిగిన 24 గంటలు గడవకముందే దామోదర రాజనర్సింహ ఇవే అంశాలపై జిల్లా పరిషత్‌లో మరోసారి సమీక్షలు నిర్వహించారు. ఇలా కొండా సురేఖ సమీక్షించిన అంశాలనే ఒక్క రోజు కూడా గడవక ముందే దామోదర సమీక్షించడం అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇలా జిల్లా మంత్రితో పొసగక పోవడంతోనే ఇన్‌చార్జి మంత్రి మారారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కై వసం చేసుకోవాలంటే పకడ్బందీగా కార్యాచరణ అవసరం ఉంటుంది. ఇన్‌చార్జిగా బాధ్యతల్లో ఉంటే ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కుదరకపోవచ్చనే కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

    న్యూస్‌రీల్‌

    ఆ నియోజకవర్గాల్లో కీలకం

    ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన వివేక్‌కు ఒకవిధంగా ఈ బాధ్యతలు సవాలుగానే కనిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండడంతో పార్టీ కేడర్‌ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమన్వయం కీలకం.

    చర్చనీయాంశంగా మారిన

    ఇన్‌చార్జి మంత్రి మార్పు నిర్ణయం

    కొండా సురేఖను తప్పించి వివేక్‌ నియామకం

    ఆ నియోజకవర్గాల్లో కేడర్‌ సమన్వయంవివేక్‌కు సవాలే

  • బలి్ద

    సిద్దిపేటజోన్‌: జిల్లాలో సైబర్‌ మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ఒక్కొక్క రీతిలో మోసగాళ్ల వలలో అమాయకులు చిక్కుకుంటున్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నా నేరాలు ఆగడం లేదు. సైబర్‌ కేటుగాళ్లు ప్రస్తుతం సిద్దిపేట బల్దియాపై కన్నేశారు. ట్రేడ్‌ లైసెన్స్‌ బకాయిలు, రెన్యువల్‌ పేరిట ఫేక్‌ స్కానర్‌తో నయా దందాకు తెర తీశారు. జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న కేటుగాళ్ల మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట ఫేక్‌ కాల్స్‌ రావడం, అనుమానం వచ్చి బల్దియాలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది.

    కమిషనర్‌ పేరిట ఫేక్‌ కాల్స్‌..

    సైబర్‌ కేటుగాళ్ల దృష్టి బల్దియాలోని పన్నుల చెల్లింపు మీద పడింది. బడా వ్యాపార సంస్థలు ప్రతి ఏటా ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు రూపంలో మున్సిపాలిటీకి డబ్బులు చెల్లించడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు అనుగుణంగా మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట ఫోన్‌ చేసి మీ దుకాణం.. వ్యాపార సంస్థలకు సంబంధించిన ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు బకాయిలు ఉన్నాయని.. రిన్యూవల్‌ ఫీజు చెల్లించాలంటూ.. లేని పక్షంలో జరిమానా పడుతుందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకదశలో స్కానర్‌ను పంపించి దాన్ని స్కాన్‌ చేసి డబ్బులు కట్టాలని బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రైతుబజార్‌ పరిసరాల్లోని ఒక ఆస్పత్రికి చెందిన మెడికల్‌ షాప్‌నకు సంబంధించి ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని 7780110865 నంబర్‌ ద్వారా కాల్‌ వచ్చింది. మున్సిపల్‌ కమిషనర్‌ అంటూ కాల్‌ రావడంతో అనుమానం వచ్చి ఆయన నేరుగా బల్దియా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదే తరహాలో పట్టణంలోని ఒక ఆయిల్‌ మిల్లు వ్యాపారితో పాటు పలువురు వ్యాపారులకు స్కానర్‌తో మోసం చేసే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. ఇటీవల ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు సైబర్‌ మోసగాళ్లు మున్సిపల్‌ పేరిట ఫోన్‌ చేసి రూ. 2,500 వసూలు చేసినట్లు వెలుగుచూసింది. ప్రస్తుతం పట్టణంలో మున్సిపల్‌ అధికారుల పేరిట ఫేక్‌ కాల్స్‌ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    నయా సైబర్‌ దందా

    ట్రేడ్‌ లైసెన్స్‌ బకాయిలంటూ కాల్స్‌

    మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట బురిడీ!

    సైబర్‌ మోసగాళ్ల వలలో పలువురు

    అప్రమత్తంగా ఉండాలంటున్నఅధికారులు

    అప్రమత్తంగా ఉండాలి

    సైబర్‌ మోసగాళ్ల ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో వస్తున్న ఫోన్‌ కాల్స్‌ తన దృష్టికి వచ్చింది. మున్సిపల్‌ కార్యాలయంలో, అధికారులకు మాత్రమే ట్రెడ్‌ లైసెన్స్‌, ఇతర పన్నులకు సంబంధించి డబ్బులు చెల్లించి రశీదు పొందాలి. ఫేక్‌ కాల్స్‌పై సైబర్‌ క్రైమ్‌, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నాం. ప్రజలకు ఫేక్‌ కాల్స్‌ వస్తే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

    – ఆశ్రిత్‌ మున్సిపల్‌ కమిషనర్‌, సిద్దిపేట

    పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు

    జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలున్నాయి. మున్సిపల్‌ నిబంధనల మేరకు ప్రతి ఏటా వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోవాలి. అందుకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు కొన్ని రోజులుగా పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. ప్రతి వ్యాపార, వాణిజ్య సంస్థ నిబంధనల మేరకు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలని, సకాలంలో రెన్యువల్‌ చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్‌ రికార్డుల ప్రకారం పట్టణంలో సుమారు ఐదు వేలపై చిలుకు వ్యాపార సంస్థలు ట్రేడ్‌ లైసెన్స్‌ పొందినట్లు తెలుస్తోంది.

  • మనుచౌ

    బాధ్యతలు చేపట్టనున్న

    నూతన కలెక్టర్‌ హైమావతి

    సిద్దిపేటరూరల్‌: జిల్లాకు నూతన కలెక్టర్‌గా హైమావతి రానుండటంతో.. ఇప్పటివరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన మిక్కిలినేని మనుచౌదరి శుక్రవారం రిలీవ్‌ అయ్యారు. ఈ మేరకు శనివారం నూతన కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

    రక్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    సిద్దిపేటజోన్‌: ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడాశాఖాధికారి (డీవైఎస్‌ఓ)వెంకట్‌ నర్సయ్య తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హకీంపేట్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లోని క్రీడా పాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి గాను నాల్గో తరగతిలో విద్యార్థిని, విద్యార్థులకు అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారన్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మండల స్థాయిలో ఎంపికలు నిర్వహిస్తారన్నారు. ఎంపికై న వారికి ఈనెల 24న జిల్లా స్థాయిలో ఎంపిక ఉంటుందన్నారు. ఆయా క్రీడా పాఠశాలల్లో మొత్తంగా 40 చొప్పున 120 సీట్లు ఉన్నాయని, వీటిలో 60 బాలికలకు, 60 బాలురులకు కేటాయించారన్నారు. ఆసక్తిగల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    ప్రభుత్వ బడుల్లోనే

    అత్యుత్తమ బోధన

    డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

    చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ విద్యా బోధన అందుతుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అల్లీపూర్‌ కేజీబీవీలో విద్యార్థినులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, రెండు జతల స్కూల్‌ డ్రెస్‌లు, మధ్యాహ్న భోజనం, అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. అనంతరం కమ్మర్లపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి, కేజీబీవీ స్పెషలాఫీసర్‌ నీలిమ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

    కేసీఆర్‌ను కలిసిన ప్రతాప్‌రెడ్డి

    గజ్వేల్‌రూరల్‌: ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావును కలవగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు గజ్వేల్‌లో అన్నదాన కార్యక్రమంతో పాటు కేక్‌ను కట్‌చేసి వేడుకలను నిర్వహించి ప్రతాప్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

    యోగా సాధనతో

    సంపూర్ణ ఆరోగ్యం

    సిద్దిపేటకమాన్‌: యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్‌ రేవతి తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలుష్యాల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచానికి భారతీయ యోగా ఆదర్శంగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో నర్సింగ్‌ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

  • దూల్మిట్ట మండలం జాలపల్లిలో రైతుకు తెలియకుండానే పొలం నుం

    మోయతుమ్మెద వాగు పరిసర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అన్నరీతిలో ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు ట్రాక్టర్లు పోటాపోటీగా వెళ్తున్నాయి. అక్రమార్కులకు ఇసుక దందా కాసుల పంట పండిస్తోంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ఇసుక తవ్వు తున్నారు. అధికారులకు తెలిసినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.

    జోరుగా దందా

    కోహెడ మండలంలోని మోయతుమ్మెద వాగులో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. వాగు పరిసర గ్రామాలైన తంగళ్లపల్లి, బస్వాపూర్‌, వింజపల్లి, రాంచంద్రాపూర్‌, వరికోలు.. అలాగే ఎల్లమ్మవాగు నకిరేకొమ్ముల, నారాయణపూర్‌, నంగనూరు మండలం ఖాతా, అక్కెనపల్లి, ఘన్‌పూర్‌, దూల్మిట్ట మండలం అర్జునపట్ల, జాలపల్లిలో ఈ దందా జోరుగా సాగుతోంది. రోజూ టన్నుల కొద్దీ ఇసుక హుస్నాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట, హైదరాబాద్‌కు ట్రాక్టర్లు, బొలెరో, లారీల్లో తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ.4,500 నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తున్నారు. స్థానిక వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు దృష్టి సారించడంలేదు. మామూళ్లకు అలవాటుపడి అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకేవరూ అడ్డు అన్నట్లుగా ఇసుక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత అధికారుల నుంచి సమాచారం వస్తే తప్ప ఇసుక డంప్‌లను సీజ్‌ చేయడం లేదని విశ్వసనీయ సమాచారం.

    పలు చోట్ల వేలం పాట

    పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు పలు మార్లు ఇసుక డంపులను సీజ్‌ చేస్తున్నారు. పలు చోట్ల వేలం పాట నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల వదిలేస్తుండటంతో అక్రమార్కులు అధికారుల కళ్లుగప్పి తరలిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక వాగుల సమీపంలో ఉన్న భూములలో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    తనిఖీలు నిర్వహిస్తున్నాం

    లోకల్‌ ఇసుకపై జీఓ 3 ప్రకారం స్థానిక తహసీల్దార్‌, పోలీస్‌లకు అధికారం ఉంటుంది. వాహనాల్లో తరలిస్తుంటే సీజ్‌ చేసే అధికారం మైనింగ్‌ శాఖకు ఉంది. ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేస్తున్నాం.

    – లింగుస్వామి, ఏడీ, మైన్స్‌

    దూల్మిట్ట మండలం జాలపల్లిలో ఇసుకను తవ్వుతూ ట్రాక్టర్లలో లోడ్‌ చేస్తున్న కార్మికులు

    సీజ్‌ చేసిన వివరాలిలా..

    కోహెడ పోలీసులు తంగళ్లపల్లి, అరేపల్లి గ్రామాల్లో ఏప్రిల్‌ నెలలో 95టన్నుల ఇసుక డంప్‌ను సీజ్‌ చేశారు. దీనిని తహసీల్దార్‌కు అప్పగించారు. మే 20న దూల్మిట్టలో 100ట్రాక్టర్ల ఇసుకను పట్టుకున్నారు. అలాగే జాలపల్లి, వీరబైరాన్‌పల్లిలలో ఇసుక డంప్‌లను ఇటీవల అధికారులు సీజ్‌ చేశారు. ఇలా పట్టుబడుతున్నా.. కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇసుకాసురులకు అవకాశంగా తీసుకుని ఇసుక దందాను కొనసాగిస్తున్నారు.

  • 800 ఏళ్ల పురాతన విగ్రహాన్ని కాపాడుదాం

    సిద్దిపేటఅర్బన్‌: గ్రామ చరిత్రకు లిఖిత పూర్వక ఆధారమైన పురాతన విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్‌ అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం వెల్కటూరులో 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన మారకమ్మ విగ్రహం ఎలాంటి రక్షణ లేకుండా ఉండటంతో శుక్రవారం పరిశీలించారు. కాకతీయుల కాలంలో 1225 జూన్‌ 14న వెల్కటూరు గ్రామంలో మారకమ్మ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు విగ్రహం పీఠంపై చెక్కి ఉందన్నారు. గతంలో రోడ్డు పక్కన భూమిలో కూరుకొని ఉండేదని, గుడి కట్టడం కోసం బయటకు తీసిన విగ్రహం ముక్కు భాగంలో ధ్వంసం కావడంతో ప్రతిష్ఠించకుండా అలాగే వదిలేశారని, ఇప్పటికై నా విగ్రహానికి నీడ కల్పించాలని కోరారు.

  • ఎమ్మెల్యే పల్లా త్వరగా కోలుకోవాలని..

    చేర్యాల(సిద్దిపేట): మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఇటీవల ప్రమాదవశాత్తు జారిపడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు పాదయాత్ర చేపట్టారు. స్థానిక 3వ వార్డు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు భూమిగారి రాజేందర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు చేర్యాల నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పాదయాత్రను బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య ప్రారంభించారు. శనివారం ఉదయం లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు. పాదయాత్రగా వెళ్లిన వారిలో భూమిగారి విజయ్‌, పుట్ట యశ్వంత్‌, కల్లాటి విశ్వతేజ ఉన్నారు. ప్రారంభ కార్యక్రమంలో పార్టీ చేర్యాల మండల అద్యక్షుడు అనంతుల మల్లేశం, నాయకులు నాచగొని వెంకటేష్‌, ఎర్రోళ్ల రామచంద్రం, పుర్మ వెంకట్‌రెడ్డి, మంచాల కొండయ్య. ఏర్పుల మహేష్‌ పాల్గొన్నారు.

    చేర్యాల నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర

  • జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కలిసిన నర్సారెడ్డి

    గజ్వేల్‌రూరల్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నూతనంగా నియమితులైన గడ్డం వివేక్‌ వెంకటస్వామిని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఇన్‌చార్జి మంత్రి వివేక్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో సత్తా చాటేలా కృషి చేయాలని, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని వివేక్‌ వెంకటస్వామి సూచించినట్లు నర్సారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sangareddy

  • ప్రాణ
    ఆపదలో ఆదుకుంటున్న రక్తదాతలు

    ఇప్పటివరకు 500 మందికి రక్తదానం

    సంగారెడ్డి బ్లడ్‌ డోనార్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 500 మందికి రక్తదానం చేశాం. 2019లో ఈ గ్రూప్‌ ప్రారంభించాం. ఈ గ్రూపులో 300 మంది వరకు సభ్యులున్నారు. రక్తం అవసరం ఉందని గ్రూపులో మెస్సేజ్‌ వస్తే స్పందించి రక్తదానం చేయడానికి మా గ్రూప్‌ సభ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. –బంగారు క్రిష్ణ, సంగారెడ్డి

    22 సార్లు ఇచ్చాను

    నాది ఏబీ–పాజిటివ్‌ గ్రూప్‌. ఇప్పటివరకు 22 సార్లు రక్తదానం చేశాను. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అనేక శిబిరాల్లోనే కాకుండా నేరుగా ఆస్పత్రులకు వెళ్లి రక్తదానం చేశాను.

    –సయ్యాద్‌ సజీద్‌ సుహన్‌,

    ప్రభుత్వ ఉద్యోగి

    అపోహలు వీడాలి..

    క్తదానం చాలా విలువైనది. ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదాతలమవుదాం. ఆరోగ్యవంతమైన ప్రతీ ఒక్కరూ వైద్యుల సలహాలు, సూచనలతో ఏడాదిలో 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు.

    –డాక్టర్‌ సతీశ్‌ ,జనరల్‌ ఫిజీషియన్‌, సంగారెడ్డి

    సంగారెడ్డి క్రైమ్‌: రక్తదానం చేయడమంటే మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని వైద్యులు చెబుతుంటారు. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం అవసరమైన సందర్భాల్లో రోగి కుటుంబసభ్యులు రక్తం కోసం పడే పాట్లు వర్ణనాతీతం. చేతిలో డబ్బులుండి వైద్యం చేయించే అవకాశం ఉన్నా కూడా ఆ సమయంలో రోగికి రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకురాకపోతే ఇక ఆ రోగి పరిస్థితి చెప్పనవసరం లేదు. అప్పటివరకూ రక్తదానం గురించి ఎవరూ కనీసం అవగాహన లేని ఆలోచించని స్థితిలో ఉన్నవారు సైతం అప్పటికప్పుడు బ్లడ్‌ బ్యాంకుల వెంట లేదా తెలిసిన బంధువులు, స్నేహితుల్ని రక్తదానం చేయమని వేడుకుంటూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విషయం తెలుసుకుని ఇదిగో మేమున్నామంటూ ముందుకొస్తోంది సంగారెడ్డి పట్టణ యువత. ఈ యువతకు ఎవరూ ఎవరికీ తెలియనవసరం లేదు. రక్తసంబంధమే ఉండనక్కర్లేదు. రక్తం కావాలని సమాచారం తెలిస్తే చాలు రక్తమిచ్చి వెళ్తారు.

    అపోహలు వీడి...

    ఒకప్పుడు రక్తదానంపై అనుకున్నంత స్థాయిలో అవగాహన పెరగలేదు. కొంతమంది యువత ఏవో లేనిపోని అపోహలతో రక్తదానానికి దూరంగా ఉండేవారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లోగానీ, రక్తనిధి కేంద్రాల్లో దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే మారుతున్న కాలంలో వాట్సప్‌ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెరిగి యువత అపోహలు వీడి రక్తదానానికి ముందుకు వస్తోంది. ఎవరికై నా రక్తం అవసరమైన విషయాన్ని సోషల్‌మీడియాలోగానీ, వాట్సాప్‌లోగానీ తెలుసుకుంటున్న యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం ఇప్పుడొక శుభపరిణామం.

    రక్తదాతల దినోత్సవం..

    జూన్‌ 14వ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ప్రతీ నెల ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తూ బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇటీవలే పట్టణంలో రక్తదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో రక్తదాతల సంఖ్య కూడా పెరుగుతోంది.

    వీరు చేయవచ్చు..

    రక్తదాత వయస్సు 18 నుంచి 60లోపు ఉండాలి. తమ శరీర బరువు కనీసం 45 కిలోలు పైబడి ఉండాలి. రక్తదాత నుంచి సేకరించే రక్తం (300 ఎంఎల్‌) ఒక యూనిట్‌ మాత్రమే. యువతీ,యువకుల్లో టాటు వేయించుకున్నవారు రక్తదానం చేయడం ప్రమాదకరం. రక్తదాతలు రక్తం ఇచ్చిన 24 గంటల వరకు ధూమపానంగానీ, మద్యం తాగడం గానీ చేయకూడదు.

    ప్రముఖ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు కారల్‌ల్యాండ్‌ స్టీనర్‌ 19వ శతాబ్దంలో మానవ రక్తకణాలు కనుగొన్నందుకు గాను 1930లో నోబెల్‌ బహుమతి లభించింది. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా జూన్‌ 14న రక్తదాతల దినోత్సవాన్ని

    జరుపుతున్నారు.

    రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పట్టణ యువత

    నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

  • మతలబే
    మార్పు వెనుక
    కొండా సురేఖను తప్పించి వివేక్‌ నియామకం ఆ నియోజకవర్గాల్లో కేడర్‌ సమన్వయం వివేక్‌కు సవాలే

    చర్చనీయాంశంగా మారిన ఇన్‌చార్జి మంత్రి మార్పు నిర్ణయం

    సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మార్పుపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ్యతల నుంచి కొండా సురేఖను తప్పించి కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్‌ వెంకటస్వామిని ఇన్‌చార్జి మంత్రిగా నియమిస్తూ గురువారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే కొండా సురేఖ ఉమ్మడి మెదక్‌ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు, ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో ఇన్‌చార్జి మంత్రిది కీలక బాధ్యత ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో 4 చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన 7 చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పాత్ర మరింత కీలకం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలను, కేడర్‌ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో కీలకమైన ఇన్‌చార్జి మంత్రిగా కొండా సురేఖను మార్చడం వెనుక కారణమేమై ఉంటుందోననే దానిపై చర్చ జరుగుతోంది.

    కలకలం రేపిన వేర్వేరు సమీక్షలు..

    జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖలు ఒకే అంశాలపై ఒక్క రోజు వ్యవధిలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్‌ పనుల సమాయత్తం వంటి అంశాలపై ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాల మేరకు పక్షం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సంగారెడ్డిలో జరిగింది. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరైనప్పటికీ.. కేవలం కొండా సురేఖ మాత్రమే సమీక్షలో మాట్లాడారని తెలిసింది. ఈ సమీక్ష జరిగిన 24 గంటలు గడవకముందే దామోదర రాజనర్సింహ ఇవే అంశాలపై జిల్లా పరిషత్‌లో మరోసారి సమీక్షలు నిర్వహించారు. ఇలా కొండా సురేఖ సమీక్షించిన అంశాలనే ఒక్క రోజు కూడా గడవక ముందే దామోదర సమీక్షించడం అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇలా జిల్లా మంత్రితో పొసగక పోవడంతోనే ఇన్‌చార్జి మంత్రి మారారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కై వసం చేసుకోవాలంటే పకడ్బందీగా కార్యాచరణ అవసరం ఉంటుంది. ఇన్‌చార్జిగా బాధ్యతల్లో ఉంటే ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కుదరకపోవచ్చనే కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

    ఆ నియోజకవర్గాల్లో కీలకం..

    ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన వివేక్‌వెంకటస్వామికి ఒకవిధంగా ఈ బాధ్యతలు సవాలుగానే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్‌ కంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నా జిల్లాలో పార్టీ కేడర్‌ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కేడర్‌ను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఇన్‌చార్జి మంత్రి మార్పు అనేది సంబంధిత వర్గాల్లో చర్చకు దారితీసింది.

  • కలెక్

    సంగారెడ్డి జోన్‌: జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ముందుగా ఐబీ గెస్ట్‌ హౌస్‌కు వచ్చిన కలెక్టరుకు అదనపు కలెక్టరు చంద్రశేఖర్‌, సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్‌రెడ్డి పూల మొక్కలను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని తన చాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పద్మజారాణి, సాయిబాబా, జ్యోతి, అఖిలేశ్‌రెడ్డి, ఐనేశ్‌, వెంకటేశ్వర్లు, లలితకుమారి పాల్గొన్నారు.

    మంత్రి వాకిటికి

    ఎంపీ షెట్కార్‌ సన్మానం

    నారాయణఖేడ్‌: రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీహరిని శుక్రవారం జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా మంత్రి ఎంపీని సత్కరించారు. మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలపాత్ర పోషించాలని, జహీరాబాద్‌ పార్లమెంట్‌, ఖేడ్‌ అసెంబ్లీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ ఆకాంక్షించారు. ఎంపీ షెట్కార్‌ వెంట జిల్లా దిశ కమిటీ సభ్యులు ప్రకాశ్‌ రాథోడ్‌, నాయకులు హన్మంత్‌రావు, పీకే రావు, రవి ఉన్నారు.

    అదనపు డీఆర్డీఓ బదిలీ

    సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డిలో జిల్లాలో అదనపు డీఆర్డిఓగా విధులు నిర్వహించిన జంగారెడ్డి శుక్రవారం బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అదనపు డీఆర్డీఓ సూర్యారావు రానున్నారు.

    పెట్టుబడిదారుల కోసమే

    లేబర్‌ కోడ్‌లు

    సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు

    పటాన్‌చెరు టౌన్‌: శ్రామికుల శ్రమను దోచుకునేందుకే కేంద్రం లేబర్‌ కోడ్‌లను పెట్టుబడిదారుల కోసం అమలు చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక భవన్‌లో శుక్రవారం జరిగిన సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో చుక్కా రాములు మాట్లాడుతూ....జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ లేబర్‌ కోడ్స్‌లో పొందు పరిచారని, కనీస వేతనాలు, పీఎఫ్‌ ఈఎస్‌ఐ, బోనస్‌ వంటి సదుపాయాలు అందని ద్రాక్షగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

    సార్వత్రిక సమ్మెను

    జయప్రదం చేయాలి

    సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్‌ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జూలై 9 న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌ సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్‌ కోడ్‌లను తెచ్చిందన్నారు. పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ కోడ్స్‌ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, కార్మిక వర్గానికి నష్టం చేసే నాలుగు లేబర్‌ కోడ్స్‌ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

  • ముందు

    న్యాల్‌కల్‌ (జహీరాబాద్‌): పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు (యూనిఫామ్‌)లు సకాలంలో విద్యార్థులకు అందకపోవడం వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పాత పుస్తకాలు, చిరిగిన పాత బట్టలతో పాఠశాలలకు వచ్చేవారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పాఠశాలల ప్రారంభానికి ముందే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు అందించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    చురుగ్గా పంపిణీ

    జిల్లాలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం దాదాపు పూర్తి కావడంతో అధికారులు యూనిఫామ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలతో కలిపి మొత్తం 1,249 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 1,09,319 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ యూనిఫామ్స్‌ పంపిణీ చేసే కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. ఒక్కో విద్యార్థికి ఒక జత చొప్పున జిల్లా నుంచి ఆయా మండలాల్లోని పాఠశాలలకు యూనిఫామ్‌లు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమ య్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్స్‌ ఏకకాలంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే పాఠ్య పుస్తకాలు పంపిణీ ముందే చేపట్టి దాదాపు పూర్తి చేసిన అధికారులు యూనిఫామ్స్‌ను కూడా త్వరగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    తరగతుల వారీగా..

    ఒకటి నుంచి 5వ తరగతి చదువుతున్న బాలురకు చొక్కా, నిక్కర్‌, ఒకటి నుంచి 3వ తరగతి చదువుతున్న బాలికలకు చొక్కా, లాంగ్‌ఫ్రాక్‌, 4,5 తరగతులకు బాలికలకు షర్ట్‌, స్కర్ట్‌, 6 నుంచి 10వ తరగతి వరకు (బాలురు)చొక్కా, ప్యాంట్‌, బాలికలకు పంజాబీ డ్రెస్స్‌లను పంపిణీ చేస్తున్నారు. జత డ్రెస్స్‌లను దాదాపు అన్ని పాఠశాలలకు పంపిణీ చేసి విద్యార్థులకు అందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన జత కూడా త్వరలో విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా న్యాల్‌కల్‌ మండలంలోని పలు పాఠశాలలకు శుక్రవారం యూనిఫామ్‌లు వచ్చాయి. వాటిని ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు.

    విద్యార్థులకు అందజేస్తున్న వైనం

    తొలగనున్న విద్యార్థుల ఇబ్బందులు

    సంతోషంగా ఉంది

    గతేడాది స్కూల్‌ డ్రెస్స్‌లు ఆలస్యంగా అందించారు. దీంతో ఉన్న పాత డ్రెస్స్‌లనే వేసుకొని స్కూల్‌కు వెళ్తూ ఇబ్బంది పడ్డాం. ఈసారి ముందే పుస్తకాలు, యూనిఫామ్స్‌ అందించడం చాలా సంతోషంగా ఉంది.

    – అక్షిత, 7వ తరగతి, విద్యార్థినీ–మిర్జాపూర్‌(బి)

    అన్ని పాఠశాలలకు పంపిణీ చేశాం

    అన్ని పాఠశాలలకు యూనిఫామ్‌ల పంపిణీ అనుకున్న సమయానికే పంపించాం. ఒకటి రెండు పాఠశాలలు మినహా దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఒక జత యూనిఫామ్స్‌ అందించగలిగాం. మిగిలిన జతను కూడా త్వరలో అందిస్తాం.

    –వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి

  • ఆదర్శ

    వట్‌పల్లి(అందోల్‌): మోడల్‌ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే పేద విద్యార్థులకు ఉచిత భోజనం, వసతిని కల్పించడం కోసం ప్రభుత్వం ఆదర్శ వసతి గృహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వట్‌పల్లి మండల పరిధిలోని పోతులబోగుడా మోడల్‌ పాఠశాల విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టల్‌ భవనం రెండేళ్లు కూడా గడవకముందే శ్లాబ్‌ పెచ్చులూడుతూ నీటి లీకేజీలు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి, అధికారుల అలసత్వం వెరసి ఈ భవనం మళ్లీ మరమ్మతుల కోసం ఎదురుచూస్తోంది.

    రూ.1.28కోట్ల నిధులతో...

    ఈ హాస్టల్‌ నిర్మాణం కోసం 2016లో ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా రూ.1.28 కోట్ల నిధులను మంజూరు చేసింది. 2018లో వసతి గృహ నిర్మాణం ప్రారంభించగా దాదాపుగా ఆరేళ్ల తర్వాత హాస్టల్‌ నిర్మాణ పనులను పూర్తి చేసి 2023 అక్టోబర్‌ నెలలో వసతి గృహాన్ని ప్రారంభించారు. భవనం నిర్మించి రెండేళ్లు గడవకముందే భవనం పైకప్పు నుండి గోడలపై నీటి లీకేజీలు దర్శనమిస్తున్నాయి. భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో కాంట్రాక్టరు తన ఇష్టానుసారంగా పనులు చేసి చేతులు దులుపుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల నిర్మాణం కోసం రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు నిదర్శనమని విమర్శిస్తున్నారు.

    మరమ్మతు పనులు చేపట్టేనా..?

    2023లో మోడల్‌ పాఠశాల హాస్టల్‌ను ప్రారంభించినప్పటికీ వసతిగృహ నిర్వహణ సిబ్బందిని నియమించకపోవడంతో రెండేళ్ల పాటు నిరుపయోగంగా ఉండటంతో పక్షులకు ఆవాసంగా మారి గదులు పక్షుల వ్యర్థాలతో నిండిపోయింది. ఈ ఏడాది నుంచి హాస్టల్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఇటీవల వసతి గృహ సిబ్బందిని నియమించారు. దీంతో హాస్టల్‌ సిబ్బంది గదులను శుభ్రం చేయించడం, నీటి సరఫరా, విద్యుత్‌ మరమ్మతులు వంటి పనులను చేయిస్తున్న క్రమంలో భవనంపై చెరువులను తలపించేలా నిలిచిన వర్షపునీటితో పైకప్పు లీకేజీలు అవుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు వసతి గృహం నీటి అవసరాలను తీర్చేందుకు బోరుమోటారును కూడా ఏర్పాటు చేయలేదు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులు హాస్టల్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ప్రారంభంలోనే సమస్యలతో స్వాగతం పలికేలా ఉంది. అధికారులు వెంటనే మరమ్మతులతోపాటు ఇతర మౌలిక వసతులను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

    రెండేళ్లక్రితం నిర్మించిన

    హాస్టల్‌ భవనం

    పూర్తిస్థాయిలో ప్రారంభించకముందే

    నీటి లీకేజీలు

  • గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

    కల్హేర్‌(నారాయణఖేడ్‌)/కంగ్టి(నారాయణఖేడ్‌)/నారాయణఖేడ్‌: ఇందిరమ్మ ఇళ్లతో గూడు లేని పేదలకు సొంతింటి కల నేరవేరుస్తామని ఖేడ్‌ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. నిజాంపేట్‌ మండలం రాంరెడ్డిపేట్‌లో, కంగ్టి మండల కేంద్రంలోని తడ్కల్‌, ఎడ్లరేగడి తండాలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కంగ్టి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పేట్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో బడిబాటలో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. మండలానికి 464 మందికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ఇళ్లు నిర్మాణానికి రూ.5 లక్షలు నాలుగు విడతల్లో చెల్లింపు చేయనున్నట్లు తెలిపారు. 45 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. పేద చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా కొన్ని సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను మొదలుపెట్టామని దశలవారీగా అన్ని స్కూళ్లలోనూ వీటిని ప్రారంభిస్తామని తెలిపారు.

    నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి

  • ఖేడ్‌ డీఎంకు ప్రజలు వినతి

    న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని న్యాల్‌కల్‌, అత్నూర్‌, డప్పూర్‌, వడ్డి, శంశల్లా పూర్‌ మీదుగా బీదర్‌కు బస్సు సర్వీస్‌ను నడిపించాలని వడ్డి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివేకానంద సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆనందేశ్వర్‌ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఖేడ్‌కు తరలి వెళ్లి డిపో మేనేజర్‌ మల్లేశయ్యకు వినతి పత్రం అందజేశారు.

    సామూహిక అక్షరాభ్యాసం

    న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని హద్నూర్‌, న్యామతాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. బాడి బాట కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల్లో ఎంఈఓ మారుతి రాథోడ్‌, ఉపాధ్యాయులు 1వ తరగతిలో చేరిన చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ...ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్యతోపాటు పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం తదితరాలు అందిస్తున్నందున పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు.

  • వియత్నాం విద్యార్థులకు శిక్షణ

    పటాన్‌చెరు: గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని సీఎస్‌ఈ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నిరంజన్‌ అప్పస్వామి వియత్నం విద్యార్థులకు సైబర్‌ సెక్యూరిటీపై శిక్షణ ఇవ్వనున్నారు. హోచిమిన్‌ సిటీలోని విఝెన్‌ డాంగ్‌ కళాశాల సైబర్‌ సెక్యూరిటీపై రెండు వారాల వర్క్‌షాప్‌ నిర్వహించడానికి ఆయనను అధికారికంగా ఆహ్వానించింది. ఈనెల 16 నుంచి జూలై 1 మధ్య నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌లో సైబర్‌ సెక్యూరిటీలో పలు అంశాలను బోధించనున్నారు.

    వర్క్‌షాప్‌కు వెళ్లనున్న డా. నిరంజన్‌

  • ఈత సరదా.. నిండు ప్రాణం బలి

    జిన్నారం (పటాన్‌చెరు): ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఈ ఘటన గుమ్మడిదల పరిధిలోని అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన గులాం హుస్సేన్‌ (35) స్థానికంగా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్విమ్మింగ్‌ శిక్షకులు లేకపోవడంతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు, బాధితులు వాపోయారు. మండలంలో అనధికారికంగా కొనసాగుతున్న స్విమ్మింగ్‌ పూల్స్‌ను గుర్తించి యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

  • అత్యుత్తమ ప్రమాణాలతోనే న్యాక్‌ గుర్తింపు

    దుబ్బాకటౌన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధన, సౌకర్యాల కల్పన, సాంకేతికత వినియోగం లాంటి ప్రమాణాలను మెరుగు పరచుకోవడం ద్వారా న్యాక్‌ గుర్తింపు సాధించవచ్చని ప్రొ.ఎస్‌వీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చెక్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికై న 22 కళాశాలల్లో, 11 కళాశాలలకు తాను మెంటార్‌గా ఉన్నానని, వాటిలో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటని తెలిపారు. నైపుణ్య శిక్షణ తరగతులు, సర్టిఫికెట్‌ కోర్సుల నిర్వహణ, డిజిటల్‌ లైబ్రరీ వినియోగం, బోధనలో ఐటీసీ వనరుల వినియోగం, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను అధ్యాపకుల బోధనలతో అనుసంధానించడం వల్ల న్యాక్‌ గుర్తింపులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా.భవాని, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్యాంసుందర్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ వెంకట్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

  • సముద్రంలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
    ముంబైలో ఘటన

    రామాయంపేట(మెదక్‌): పట్టణానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు ముంబైలోని సముద్రం అలల్లో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన టంకరి రాము (34)కు భార్య సరితతోపాటు ఎనిమిదేళ్లలోపు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ముంబైలో ఉంటున్న తన సోదరి ఇటీవల రామాయంపేటకు వచ్చారు. సోదరితో పాటు రెండు రోజుల క్రితం రాము కూడా ముంబై వెళ్లాడు. ఆదివారం సాయంత్రం అక్క, పిల్లలతో కలిసి సముద్రంలో బోటు షికారు చేశాడు. రాము బోటు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా వచ్చిన అలల్లో సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సమీపంలో ఉన్న పోలీసులు అతన్ని బయటకు తీసేలోగా మృతి చెందాడు. ఈ విషయంపై ఉదయం రామాయంపేటకు సమాచారం రాగా అతని తల్లి భార్యాపిల్లలు బోరున విలపించారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

  • మానవత్వం చాటుకున్న ఎస్పీ

    మెదక్‌ మున్సిపాలిటీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించి జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం కొల్చారం పోలీస్‌ స్టేషన్‌ పర్యటన ముగించుకొని ఎస్పీ వస్తున్న క్రమంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని తన వెంట ఉన్న క్యూఆర్టీ సిబ్బందితో పోలీస్‌ వాహనంలో చికిత్స నిమిత్తం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

    26 మందికి జరిమానా

    సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 26మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.40వేల జరిమానా విధించారు.

    పాఠశాలలో

    కంప్యూటర్లు మాయం

    హుస్నాబాద్‌: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు కంప్యూటర్లు మాయమయ్యాయి. పాఠశాలకు మంజూరైన 10 కంప్యూటర్లను పైఅంతస్తులో ల్యాబ్‌ గదిలో ఉంచారు. వీటిని ఇంకా ప్రారంభించలేదు. వేసవి సెలవులు కావడంతో పాఠశాలకు తాళం వేసి ఉంచారు. పాఠశాలల పునఃప్రారంభం గురువారం రెండు కంప్యూటర్లు మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య మాట్లాడుతూ పాఠశాల కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై డీఈఓకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    కోళ్ల ఫారంలో అగ్నిప్రమాదం

    ఝరాసంగం(జహీరాబాద్‌): ప్రమాదవశాత్తు కోళ్ల ఫారంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాధితుడు శ్రీశైలం కథనం ప్రకారం... మండల పరిధిలోని పార్యవరం గ్రామానికి చెందిన శ్రీశైలం మూడు కొన్నేళ్లుగా గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలం వద్ద పౌల్ట్రీ పామ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్తు వైర్లు, కోళ్ల దాణా, డ్రింకర్లు, ఫీడర్లు, కాలిపోయాయి. సుమారు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపాడు. షెడ్డు తగులబెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు.

    వ్యక్తి ఆత్మహత్య

    మనోహరాబాద్‌(తూప్రాన్‌): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ వివరాల ప్రకారం... మండలంలోని వెంకటాపూర్‌ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నబత్తుల ఆంజనేయులు(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పొలానికి వెళ్లిన ఆంజనేయులు సాయంత్రమైన ఇంటికి రాలేదు. కాగా శుక్రవారం ఉదయం గ్రామ శివారులో అడవి పక్కన ఓ చెట్టుకు ఊరి వేసుకుని కనిపించాడు. కాగా మృతుని భార్య నవనీత భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. ఇంటి వద్ద కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తుందని పోలీసుల ఫిర్యాదులో తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది.

  • పాఠశాల భవనం ప్రారంభం

    చిన్నశంకరంపేట(మెదక్‌): మండల పరిధిలోని సూరారంలో శుక్రవారం పాఠశాల భవనాన్ని వీఎస్‌టీ ప్రతినిధులు అనిష్‌గుప్తా, అమిత్‌ ఆరోర, శాంతి, కార్తీక్‌లు ప్రారంభించారు. వీఎస్‌టీ యాజమాన్యం రూ.70లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించింది. సూరారం జెడ్పీపాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి శిథిలమైన పాఠశాల భవనం గురించి రౌండ్‌ టేబుల్‌ స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి విషయం తెలుసుకున్న వీఎస్‌టీ యాజమాన్యం ముందుకు వచ్చింది. రూ.60 లక్షలు వెచ్చించి మూడు తరగతి గదులు, రూ.10 లక్షల నిధులతో టాయిలెట్స్‌ను నిర్మించింది. గ్రామస్తుల సమక్షంలో పాఠశాల భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం వీఎస్‌టీ సంస్థ ప్రతినిధులు, రౌండ్‌టేబుల్‌ స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధులను సత్కరించింది.

    రూ.70లక్షల వ్యయంతో వీఎస్‌టీ సంస్థ నిర్మాణం

    సత్కరించిన ఉపాధ్యాయ బృందం

  • పిడుగ

    మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

    శివ్వంపేట(నర్సాపూర్‌): పిడుగుపాటుకు మహిళా కౌలు రైతు మృతి చెందింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని గూడూర్‌లో శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొత్తకుమ్మరి బాలమణి,శివరాజు దంపతులు, వీరి కొడుకు శ్రీకాంత్‌, తమ్ముడు శంకరయ్య అతడి భార్య సత్తమ్మ(45) కలిసి కౌలు భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. పిడుగు పడిన శబ్దాలు వస్తుండటంతో సత్తమ్మ, శ్రీకాంత్‌ చింత చెట్టు కిందికి వెళ్లారు. వారిపై పిడుగు పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న బాలమణికి సైతం స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. సత్తమ్మ ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది సీపీఆర్‌ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అంబులెన్స్‌లో నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండంగా మార్గమధ్యలో మృతి చెందింది. శ్రీకాంత్‌ కాళ్లు కదపలేక షాక్‌లో ఉండగా అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    11 మేకలు మృతి...

    నంగునూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు గురై 11 మేకలు మృతి చెందిన ఘటన శుక్రవారం ఘణపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు ఏలేటి లక్ష్మారెడ్డి, లింగంపల్లి కొ మురయ్య తన వ్యవసాయ బావి వద్ద మేకలు మేపుతున్నారు. సాయంత్రం ఒక్కసా రిగా వర్షం కురవడంతో మేకలు సమీపంలోని చెట్ల కిందికి వెళ్లాయి. ఈ క్రమంలో చెట్టుపై పిడుగు పడటంతో లక్ష్మారెడ్డికి చెందిన ఏడు, సంపత్‌కు చెందిన నాలుగు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతులు మరో చెట్టు కింద ఉండటంతో వారికి ప్రాణాపాయం తప్పింది.

    చర్చిపై...

    నారాయణఖేడ్‌: ఖేడ్‌ మండలం హుక్రాన (జి) గ్రామ చర్చి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం పిడుగు పడింది. దీంతో చర్చి జెండా కాలిపోవడంతో పాటు సౌండ్‌ సిస్టానికి సంబంధించిన లౌడ్‌ స్పీకర్లు కింద పడ్డాయి. పరిసరాల్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

  • నాడు

    శివ్వంపేట(నర్సాపూర్‌): ఆత్మహత్యకు యత్నించిన దంపతులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పదిరోజుల క్రితం పాపన్నపేట మండలం ఏడుపాయల్లో పురుగుల మందు తాగి ఆత్మహ త్యకు యత్నించిన విషయం విధితమే. మండల పరిధిలోని పోతులబోగూడ గ్రామానికి చెందిన పందుల శివకుమార్‌(40) అతని భార్య శోభ (35) ఆత్మహత్యకు యత్నించారు. గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా మరుసటి రోజు శివకుమార్‌ మృతిచెందాడు. భార్య శోభ గురువారం మృతి చెందడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.

    భూ సమస్యలతో మనస్తాపానికి గురై..

    పెద్దశంకరంపేట(మెదక్‌): భూ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం... ఝరాసంఘం మండలం కక్కెరవాడకు చెందిన రాజు(26)తో కొత్తపేటకు చెందిన బాలమణికి గతంలో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం అతడు కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. రాజు తన సొంత గ్రామానికి భూ సమస్యల విషయంపై వెళ్లి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    ఆత్మహత్యకు యత్నించిన దంపతులు మృతి

  • ప్రభు
    అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

    సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు , సమగ్ర శిక్ష సీఎంవో వెంకటేశం, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్‌, ప్రధానోపాధ్యాయురాలు సునీతతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

    కోంటూర్‌ ప్రాథమిక పాఠశాలలో..

    హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ మండల పరిధిలోని కోంటూర్‌ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించినట్లు ప్రధానోపాధ్యాయురాలు సంగీత తెలిపారు. అలాగే నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు అందించారు. ఉపాధ్యాయులు ప్రవళిక, రేవతి పాల్గొన్నారు.

  • పేదలకోసం రాజీలేని పోరాటం
    సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి

    హుస్నాబాద్‌: ప్రజల కోసం అలుపెరుగని, రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర గల ఏకై క పార్టీ సీపీఐ పార్టీ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని అనబేరి, సింగిరెడ్డి అమరుల భవన్‌లో ఈ నెల 27న నిర్వహించే సీపీఐ 4వ మహాసభల విజయవంతం కోసం శుక్రవారం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలన మతోన్మాదం, పెచ్చరిల్లి పోతుందన్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో అడవులను జల్లెడ పడుతూ ఆదివాసీలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న మావోయిస్టులను చంపడం ఏమిటని ప్రశ్నించారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపి వేయాలని, లేకుంటే ప్రజలతో దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

    ఆహ్వాన సంఘం నూతన కమిటీ

    సీపీఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, ప్రధాన కార్యదర్శిగా హుస్నాబాద్‌ మండల కార్యదర్శి గడిపె మల్లేశ్‌, ఉపాధ్యక్షులుగా జాగీర్‌ సత్యనారాయణ, పోతిరెడ్డి వెంకట్‌ రెడ్డి, లక్ష్మణ్‌, శంకర్‌, వనేష్‌, అశోక్‌, దయానంద్‌ రెడ్డి, కోశాధికారిగా సుదర్శన చారిని ఎన్నుకున్నారు.

  • ప్రాణం తీసిన చేపల వేట

    చెరువులో మునిగి బాలుడు మృతి

    అల్లాదుర్గం(మెదక్‌): చేపల వేటకు వెళ్లిన బాలుడు కాలు జారి చెరువులో మునిగి మృతి చెందాడు.ఈ ఘటన అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సాయిలు, సంతోష దంపతులు హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. మూడు రోజుల క్రితం గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహించడంతో సాయిలు కుటుంబం ఉత్సవాలకు వచ్చారు. ఈ క్రమంలో సాయిలు కొడుకు సతీశ్‌రావ్‌ (14)తో పాటు మరో ఇద్దరు కలిసి గ్రామ శివారులోని రెలకుంట చెరువులో సరదాగా చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో సతీశ్‌రావ్‌ ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగిపోయాడు. వెంట వచ్చిన ఇద్దరు గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పారు. స్థానికులు చెరువు వద్దకు వచ్చి వెతకగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

Tirupati

  • వైఎస్సార్‌సీపీ హయాంలో వైద్య రంగానికి మహర్ధశ

    గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారు. వైద్యరంగ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పులు తీసుకొచ్చారు. వైద్యులు, సిబ్బంది, వైద్య సదుపాయాలను సమకూర్చడంలో రాజీలేని నిర్ణయాలను అమలు చేశారు. ఉన్నత కుటుంబాలకే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పేదలకు వర్తింపజేశారు. అలానే ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటి వద్దకే వైద్య సేవలను అందించిన ప్రభుత్వంగా దేశంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలన చరిత్ర కెక్కింది. హెల్త్‌ సెంటర్లలో ఆధునిక వైద్య పరికరాలు, 200కు పైగా మందులు, ల్యాబ్‌లను సమకూర్చారు. అలానే 108 సేవలను బలోపేతం చేసి విస్తరించారు. వేతనాలను డిమాండ్‌ మేరకు నాడు పెంచి ప్రోత్సహించారు. వాహనాలు మరమ్మతులకు గురైన వెంటనే రిపేర్లు చేయించి పటిష్టమైన వ్యవస్థను అమలు చేశారు. ఇదే స్థాయిలో 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను మరింత మెరుగ్గా అమలు చేసి ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలను అందించారు.

  • సుప్రీం తీర్పు కూటమికి చెంపపెట్టు

    నాయుడుపేటటౌన్‌ : సీనియర్‌ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంజీవయ్య మాట్లాడారు. ప్రశ్నించే గొంతును నొక్కే విధంగా కక్ష పూరిత రాజకీయ నిర్ణయాలను సమాజం కాని న్యాయస్థానాలు హర్షించవన్నారు. పత్రికాస్వేచ్ఛను కాలరాసే విధంగా చేస్తున్న దాడులు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి సుప్రీం తీర్పు కనువిప్పు కావాలని సంజీవయ్య హితవు పలికారు.

Suryapet

  • జూన్‌
    అంగన్‌వాడీల్లో ఎగ్‌ బిర్యానీ

    శనివారం శ్రీ 14 శ్రీ జూన్‌ శ్రీ 2025

    రాజీమార్గమే రాజమార్గం

    చివ్వెంల(సూర్యాపేట) : రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడారు. శనివారం జిల్లా కేంద్రంతో పాటు, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌ కోర్టుల్లో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీతో ఇరు పక్షాల వారు గెలిచిన వారవుతారన్నారు. సమయం, ధనం వృథా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు. సివిల్‌, క్రిమినల్‌, వెహికల్‌ యాక్ట్‌, గృహహింస, విద్యుత్‌, చెక్‌ బౌన్స్‌, బ్యాంకు కేసులకు సంబంధించి, పరిష్కారమయ్యే కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    సీజనల్‌ వ్యాధులపై

    అప్రమత్తంగా ఉండాలి

    అర్వపల్లి: సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు తగిన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలుషిత నీరు, ఆహారంతో వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు ఎక్కువగా జరిగేలా గర్భిణులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ నగేష్‌నాయక్‌, సీహెచ్‌ఓ ఎం.బిచ్చునాయక్‌, సూపర్‌వైజర్‌ లలిత, ఎంఎల్‌హెచ్‌పీలు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    శిక్షణ తరగతులను

    జయప్రదం చేయాలి

    సూర్యాపేట అర్బన్‌ : జిల్లా కేంద్రంలో జూలై 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న కేవీపీఎస్‌ రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేటలో కేవీపీఎస్‌ రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణ తరగతుల కరపత్రాలు ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలనలో దళితుల జీవితాలు మరింత దుర్భరంలోకి నెట్టబడ్డాయని ఆరోపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేయబడిన 300 మంది కేవీపీఎస్‌ నాయకులు, కార్యకర్తలు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి పిండిగ నాగమణి, టేకుల సుధాకర్‌, రవి, తక్కెళ్లపల్లి శ్యామ్‌, ఇరుగు రమణ, సుంచు నరసింహ తదితరులు పాల్గొన్నారు.

    శ్రీలక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం

    మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు పాల్గొన్నారు.

    తాళ్లగడ్డ (సూర్యాపేట) : పేద, మధ్య తరగతికి చెందిన రైతుల కుటుంబాలకు ఖర్చుల గుబులు మొదలైంది. మిగతా సమయంలో నెట్టుకొచ్చిన అన్నదాతలు జూన్‌ మాసంలో మాత్రం ఆందోళన చెందున్నారు. ఓ వైపు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నారు. మరో వైపు వ్యవసాయ పనులు మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు కావాల్సి ఉంటుంది. దీనికితోడు తమ పిల్లల స్కూల్‌ ఫీజులు చెల్లించాలి. రెండు ఖర్చులు ఒకేసారి రావడంతో సతమతమవుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

    పంట పెట్టుబడుల సమయం

    రోహిణి కార్తె ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగుపనులకు సమాయత్తమయ్యారు. జిల్లాలో సుమారుగా 6,13,000 ఎకరాల సాగుభూమి ఉంది. 3,03,767 మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంతో కాడెద్దుల వ్యవసాయంతో పెద్దగా ఖర్చు ఉండేది కాదు. ప్రస్తుతం ట్రాక్టర్ల వాడకం వల్ల ఎకరాకు సుమారుగా రూ.13 వేల వరకు ఖర్చు వస్తుంది. విత్తనాలు, ఎరువులు కలుపుకొని రైతుకు తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వం ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అది అమలుకాకపోవడంతోపాటు, ఇచ్చిన పది వేలు కూడా అంతంత మాత్రంగా కొంతమందికే పరిమిత మవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

    భారంగా మారిన స్కూల్‌ ఫీజులు

    పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు ఉంటే స్కూల్‌ ఫీజులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఫీజులతో పాటుగా యూనిఫాం, షూస్‌, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, బ్యాగులు పాఠశాలల్లోనే యాజమాన్యాలు నిర్ణయించిన ధరలకు కొనాల్సి వస్తోంది. దీనికి తోడు రవాణా చార్జీలు అన్నీ కలుపుకొని సుమారు ఎల్‌కేజీ విద్యార్థికి రూ.40వేల పైచిలుకు ఖర్చు వస్తుంది. 10వ తరగతి అయితే రూ.లక్ష దాటాల్సిందే.

    ఇంటర్‌ బోర్డు డిప్యూటీ

    సెక్రటరీ హేమచందర్‌

    నాగారం : అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. చిన్నారులకు మరింత పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎగ్‌ బిర్యానీ అందించేందులా కొత్త మెనూ తీసుకొచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలతో బుధవారం జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎక్స్‌ బిర్యానీ అందజేశారు. బుధవారం ఎలాగూ గుడ్డు అందించాల్సి ఉన్నందున బిర్యానీ చేసి ప్రతి చిన్నారికి ఒక గుడ్డు అందేలా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు పరిధిలో 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని మొత్తం 1209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 45,117 మంది చిన్నారులున్నారు.

    సాధ్యపడేనా..

    ఎగ్‌ బిర్యానీ వారానికి రెండు సార్లు అందించాలని ఇటీవల ప్రతిపాదించారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది సాధ్యపడేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆహారం పంపిణీకి సంబంధించిన నిధులు పెంచకుండా నాణ్యమైన ఆహారంతో పాటు ప్రత్యేకంగా ఎగ్‌ బిర్యానీ ఏర్పాటు ఎలా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. క్షేత్రస్థాయిలో కేంద్రాల నిర్వాహకులు దీనిని అంగీకరిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారానికి రెండు సార్లు పెడతారా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    వర్షాకాలంలో కలుషిత నీటితో

    పొంచిఉన్న ముప్పు

    డయేరియా, టైఫాయిడ్‌,

    కామెర్ల బారిన పడే ప్రమాదం

    విమాన ప్రమాద ఘటనపై

    సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

    సూర్యాపేట అర్బన్‌ : గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో విమానం కుప్పకూలిపోయిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.

    న్యూస్‌రీల్‌

    ఫ ఇదే నెలలో వ్యవసాయ పెట్టుబడులు.. పిల్లల స్కూల్‌ ఫీజులు

    ఫ రెండు ఖర్చులు ఒకేసారి రావడంతో సతమతమవుతున్న రైతులు

    ఫ రుణాల కోసం బ్యాంకుల

    చుట్టూ ప్రదక్షిణలు

    ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది

    అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వారానికి రెండు సార్లు ఎగ్‌ బిర్యానీ అందించాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న కేందాల్లో గుడ్డు బిర్యానీ పెట్టాలని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఆదేశాలిచ్చాం. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

    – నర్సింహారావు,

    జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట

    ఫ చిన్నారులకు మరింత పౌష్టికాహారం

    అందించాలని నిర్ణయం

    ఫ వారానికి రెండు రోజులు పంపిణీ

    ఫ 45,117 మంది చిన్నారులకు ప్రయోజనం

    జిల్లాలో ఇలా...

    ప్రాజెక్టులు 05

    అంగన్‌వాడీ

    కేంద్రాలు 1209

    చిన్నారులు 45,177

    గర్భిణులు 5220

    బాలింతలు 4236

  • నీరు

    సూర్యాపేట అర్బన్‌: ఏటా వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుంటాయి. అందుకు ప్రధాన కారణం కలుషిత నీరు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీటి నాణ్యతపై తప్పక దృష్టి సారించాలి. సూర్యాపేట పట్టణంలో మిషన్‌ భగీరథ పథకంతో పాటు శివారు ప్రాంతాలైన వార్డుల్లో స్థానిక బోర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు పడుతుండడంతో అధికార యంత్రాంగం నీరు కలుషితం కాకుండా, అంటువ్యాధులు, విష జ్వరా లు ప్రబలకుండా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ట్యాంకులు, నల్లాల వద్ద నీటి నమూనాలను సేకరించి తప్పనిసరిగా పరీక్షలు చేసి నాణ్యమైన నీటినే ప్రజలకు అందించాలి.

    ప్రజా కుళాయిల దగ్గర జాగ్రత్త

    సూర్యాపేట పట్టణంలోని వార్డుల్లో అనేక చోట్ల ప్రజా కుళాయిలను గాలికి వదిలేస్తున్నారు. పట్టణంలోని చాలా చోట్ల మిషన్‌ భగీరథ పైపులైన్లు లీకేజీకి గురై మురుగు నీటితో కలుషితమవుతున్నాయి. మున్సిపల్‌ ట్యాంక్‌లు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. నాణ్యత, పర్యవేక్షణ విషయాన్ని అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. మురికి వాడలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఇవి ఉన్నాయి. వీటి నుంచి సరఫరా అయ్యే నీటికి నాణ్యత పరీక్షలు చేయడం లేదు.

    లీకేజీల సమస్య

    మురుగు కాలువల నుంచి పైప్‌ లైన్లు వేసినప్పుడు, కాలువల్లో సీల్డ్‌ తీసినప్పుడు పైప్‌లైన్‌ దగ్గర లీకేజీలు ఏర్పడి నీరు కలుషితమవుతుంటుంది. అధిక లోతులో ఉండే డ్రెయినేజీల్లో లోపల వేసిన పైపులు లీకేజీకి గురైతే గుర్తించే అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో నీరు కలుషితమై రోగాలకు దారితీస్తుంది. వర్షాకాలంలో కలుషితమయ్యే నీటి వల్ల డయేరియా, టైఫాయిడ్‌, కామెర్లు, వాంతులు, విరేచనాలు వస్తుంటాయి.

    నీటి పరీక్షలు చేస్తున్నాం

    100 రోజుల ప్రణాళికలో భాగంగా నీటి పరీక్షలను ప్రత్యేకంగా చేస్తున్నాం. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. పట్టణంలోని వార్డుల్లో ట్యాంకులను ప్రతినెల 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేయాలని ఆదేశించాం. నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేసే విధానంపై వార్డ్‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో అంగన్‌వాడీ ఆయాలు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చాం. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నాం.

    – శ్రీనివాస్‌,

    సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌

  • ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి అడుగులు

    అనుముల మండలం యాచారం గ్రామంలో 30 ఎకరాల్లో నిర్మాణం

    ఇన్నాళ్లూ విజయవాడ

    అంభాపురం ఫ్యాక్టరీనే దిక్కు

    మంత్రి తుమ్మల చర్యలతో

    దిగొచ్చిన పతంజలి సంస్థ

    నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో

    15 వేల ఎకరాల్లో పంటసాగు

    తీరనున్న ఆయిల్‌పామ్‌ రైతుల కష్టాలు

  • ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచాలి

    ఆత్మకూర్‌(ఎస్‌)(సూర్యాపేట) : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని ఇంటర్‌ బోర్డు డిప్యూటీ సెక్రటరీ, సూర్యాపేట జిల్లా ప్రత్యేకాధికారి హేమచందర్‌ అన్నారు. శుక్రవారం నెమ్మికల్లు ప్రభుత్వ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గతేడాది కన్నా ఈ ఏడాది 30శాతం అడ్మిషన్లను పెంచే బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలని సూచించారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేర్పించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయని, వాటిల్లో ప్రవేశాల శాతం పెంచేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పాఠశాలకు ఒక ఇన్‌చార్జ్‌ చొప్పున ఏర్పాటు చేసి ఒక్కొక్కరు 20 అడ్మిషన్లు చేయాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి భాను నాయక్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రతి కళాశాలను ఒకసారి సందర్శించి అధ్యాపకులకు సూచనలు చేశామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ గుణగంటి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

  • దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లో నిర్మితమవుతుంది

    చివ్వెంల(సూర్యాపేట) : దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లో నిర్మితమవుతుందని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని సూచించారు. పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చూడాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులను జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆరో తరగతిలో చేర్పించాలన్నారు. పాఠశాలలో 13 మంది నూతనంగా చేరినట్లు ఉపాధ్యాయులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం రెండవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందజేశారు. ఆయన వెంట హెచ్‌ఎంలు కవిత, శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు వెంకటనర్సమ్మ, ప్రతాఫ్‌కుమార్‌, రాజు, విజయలక్ష్మీ, అనురాధ, సత్తయ్య, కోటయ్య, రవిందర్‌, బాలచందర్‌ తదితరులున్నారు.

    ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

  • సర్కి
    యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండ కింద ఉన్న సర్కిల్స్‌కు అధికారులు దేవుళ్ల పేర్లను పెట్టారు.

    - 8లో

    ఇప్పుడు అన్నీ ఖర్చులే

    వ్యవసాయ పనులు మొదలైతే దుక్కులు, విత్తనాలు, ఎరువులు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. వరి సాగు చేస్తాను. కారుకు సుమారు రూ.60 వేల ఖర్చు వస్తుంది. అయితే నేను కొన్ని పనులు సొంతంగా చేసుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు. వారి చదువులకు రూ.రెండున్నర లక్షల వరకు ఖర్చు వస్తుంది. ప్రభుత్వం పంట పెట్టుబడికి సాయం అందిస్తే కొంతైనా ఉపశమనం ఉంటుంది.

    – అరవపల్లి తిరపతయ్య, రైతు, సూర్యాపేట

    పెట్టుబడి సాయం కోసం

    ఎదురుచూస్తున్నాం

    నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. వరి పంట సాగు చేస్తున్నా. రూ.లక్ష ఖర్చు వస్తుంది. కానీ పంట చేతికి వచ్చే వరకు ఆందోళన తప్పదు. కనీసం విత్తనాలు కొనుగోలు సమయానికై నా రైతు భరోసా సాయం అందించాలి.

    తొండల పుల్లయ్య, రైతు, చేదెళ్ల గ్రామం

  • భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం

    ఆత్మకూర్‌(ఎస్‌)(సూర్యాపేట): మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్‌ రాంబాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏపూరు, దాచారం గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల్లో బియ్యం, రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాదవ్‌ రావు, తహసీల్దార్‌ అమీన్‌ సింగ్‌, ఆర్‌ఐ ప్రదీప్‌, స్వప్న ఉన్నారు.

    రెవెన్యూ సదస్సుల పరిశీలన

    మోతె: మోతె మండల పరిధిలోని గోపాలపురం, విభళాపురం గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అదనపు కలెక్టర్‌ రాంబాబు పాల్గొన్నారు. తహసీల్దార్‌ వెంకన్న మాట్లాడుతూ.. మోతె మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో 2,077 మంది రైతుల దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు.

    ఫ అదనపు కలెక్టర్‌ రాంబాబు

Srikakulam

  • ఇన్ని ఆంక్షలా..?

    ఖాతాలో రూ.15 వేలు వేస్తామని, ఇప్పుడు రూ.13 వేలు వేయడం అన్యాయం. నిబంధనలు పెట్టి తల్లుల ఖాతాలో నగదు వేయకపోవడం, భూములు, విద్యుత్‌ బిల్లులతో అనేక కొర్రీ లు పెట్టాలనుకోవడం దారుణం. ఇప్పటికై నా చదువుకునే విద్యార్థులందరికి తల్లికి వందనం వర్తింపు చేయాలి.

    – దాంపురం రాజ్యలక్ష్మి, రంకిణి గ్రామం, పాతపట్నం

    తల్లికి వందనం అందలేదు

    నా పిల్లలు ఇంటర్‌ చదువుతున్నారు. నా భర్త మదన్‌ సర్పంచ్‌ కావడంతో మాకు తల్లికి వందనం ఇవ్వలేదు. మాకు భూములు లేవు, పెద్దగా ఇతర ఆస్తులు లేవు. అయినా ఎందుకో మా మీద కక్ష గట్టి ఆపినట్టు ఉంది.

    – తామాడ జ్యోత్స్న,

    గృహిణి, బొడ్డపాడు, పలాస మండలం

    గతంలో ఈ నిబంధన లేదు

    కూటమి ప్రభుత్వం సర్పంచ్‌ ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించి తల్లికి వందనం అనర్హత జాబితాలో సర్పంచ్‌ల పేర్లు పెట్టింది. గత ప్రభుత్వంలో ఇలాంటి నిబంధన లేదు. – సంది సోనియా, రుషికుడ్డ సర్పంచ్‌

    ● తల్లికి వందనం ఆంక్షలపై లబ్ధిదారుల్లో వ్యతిరేకత

    ● సర్పంచ్‌లుగా ఉన్న తల్లులను సైతం అనర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం

    ● మొదటి ఏడాది బకాయిలపై లేని స్పష్టత

    శ్రీకాకుళం న్యూకాలనీ:

    కూటమి సర్కారు సంక్షేమానికి ఆంక్షల సంకెళ్లు విధించింది. ఎలాగోలా లబ్ధిదారుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా తల్లికి వందనంపై సవాలక్ష ఆంక్షలు పెట్టింది. ఒక చేత్తో డబ్బులు ఇస్తూ.. రెండో చేత్తో లబ్ధిదారుల సంఖ్యను కుదించేస్తోంది. ఎన్నికల సమయంలో నీకు రూ.15వేలు నీకు రూ.15వేలు అని ప్రచారం చేసి ఇప్పుడు రూ.13వేలకు పరిమితం చేశారు. వైఎస్‌ జగన్‌ హయాంలో స్కూలు బాగోగుల కోసం అమ్మ ఒడి నిధులు కేటాయిస్తే మైకు పట్టుకుని విమర్శించిన నాయకులు ఇప్పుడు మౌనంగా అదే పనిచేస్తూ దొరికిపోయారు.

    కోతల కోసం ఎన్నో కుయుక్తులు..

    జిల్లాలో గత ఏడాది ఒకటి నుంచి ఇంటర్‌(+2) వరకు 3.05లక్షల మంది చదువుకున్నారు. వీరిందరికి కలిపి మొదటి ఏడాది రూ.457 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం బాకీ పడి ఉంది. ప్రస్తుతం యూ–డైస్‌ లెక్కల ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,76,593 మంది, అలాగే ఇంటర్మీడియెట్‌ 46,761 మంది చదువుతున్నారు. ఒకటి నుంచి ఇంటర్‌ మొత్తం కలిపి 3,02460 మంది ఉన్నా రు. వీరిలో బాలురు 1,54,966 మంది, బాలికలు 1,47,494 మంది ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరిలో ఎంత మందికి డబ్బులు పడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనల చిట్టా విడుదల చేయడంతో డబ్బులు పడని అర్హులంతా ఆందోళన చెందుతున్నారు.

    ని‘బంధనాలు’

    ● కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచిపోయింది. తాజాగా రెండో ఏడాదికి సంబంధించి తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి జీఓ మాత్రమే విడుదల చేశారు. అంటే మొదటి ఏడాదికి ఇక లేనట్టే.

    ● వింతగా గత విద్యా సంవత్సరం డేటా తీసుకున్నప్పటికీ.. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని మాత్ర మే పరిగణనలోకి తీసుకున్నారు.

    ● ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే ఇటీవల టెన్త్‌ పరీక్షలు రాసి ఇంటర్‌లో చేరిన విద్యార్థులకు మాత్ర మే లబ్ధి చేకూరనుంది. పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సుల్లో చేరినవారు అనర్హులు కానున్నారు. అలాగే ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులను కూడా అనర్హులుగా పరిగణించారు.

    ● వేసవిలో కాసింత ఎక్కువ కరెంటు వాడి ఉంటే ఇక అంతే సంగతి. 300 యూనిట్లు దాటిన వారిని అనర్హులుగా ప్రకటించారు.

    ● ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచ్‌లను సైతం అనర్హులుగా ప్రకటించారు.

    ● వారికి నెలవారీ జీతాలు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో వారిందరినీ అనర్హులుగా ప్రకటించారు. గతంలో వైఎస్‌ జగన్‌ హయాంలో ఇలాంటి కోతలు లేవు.

    శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎన్నికల సమయంలో తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తానని చెప్పిన నాయకులు పాఠశాల అభివృద్ధి పేరుతో రూ.2వేలు కోత పెట్టడం దుర్మార్గమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి డి.చందు అన్నారు. దీనిపై నిరసన తెలుపుతూ శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్‌ జంక్షన్‌ నుంచి సెవెన్‌ రోడ్‌ జంక్షన్‌ వరకు 200 మంది విద్యార్థులతో శుక్రవారం భారీర్యాలీ నిర్వహించారు. కుటుంబఆదాయం గ్రామాల్లో నెలకు రూ. 10వేలు, పట్టణాల్లో రూ.12వేల లోపు ఉండాలని, రైస్‌ కార్డు ఉండాలని, ఫ్యామిలీకి 3 ఎకరాల్లోపు మాగాణి, లేదా 10 ఎకరాల్లోపు పొడి భూమి, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలని, ఫోర్‌ వీలర్స్‌ ఉండకూడదని నిబంధనలు పెట్టడం అన్యాయమన్నారు. చాలా మందికి సాంకేతిక సమస్యలంటూ ఎగ్గొట్టే ప్రయ త్నం చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

  • టీసీల
    షాపు తొలగిస్తారా..

    ఇచ్ఛాపురం రూరల్‌: 280 మందికి పైగా విద్యా ర్థులు, 15 మంది ఉపాధ్యాయులు ఉన్న ఈదుపురం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఒక్క విద్యార్థి కూడా కనిపించలేదు. ఒక్కరు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు నుంచి మండల విద్యాశాఖాధికారి వరకు అంతా ఆందోళన చెందారు. ఒకే సారి వందలాది మంది విద్యార్థులు బడికి రాకుండా బాయ్‌కాట్‌ చేయడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు పరుగులు తీసి ఆరా తీశారు. అందరి తల్లిదండ్రులదీ ఒకటే మాట... ‘మా పిల్లలు బడిలోకి అడుగు పెట్టాలంటే.. బడికి ఆనుకొని ఉన్న మద్యం షాపును తొలగించాలి. అంత వరకు సాక్షాత్తు కలెక్టర్‌ మా దగ్గరికి వచ్చినా పిల్లల్ని బడికి పంపించేది లేదు’. అంటూ తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయులు బడికి తిరుగు ముఖం పట్టారు.

    ఈదుపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ఆమడ దూరంలో నాలుగు రోజుల కిందట ఎకై ్సజ్‌ అధికారులు అనుమతులు ఇచ్చి కొత్త ప్రభుత్వ మద్యం షాపును తెరిచారు. దీంతో ఈదుపురం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు నీలాపుట్టుగ, కేశుపురం, ఈదుపురం, సన్యాసిపుట్టుగ గ్రామ ప్రజలు అభ్యంతరం తెలిపారు. పోలీసులతో పాటు ఎకై ్సజ్‌ సిబ్బంది సైతం మద్యం షాపు నిర్వాహకులకే వత్తాసు పలకడంతో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు మద్యం షాపును తొలగించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ప్రజా ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించకుండా బాయ్‌కాట్‌ చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి–2 ఎస్‌.విశ్వనాథం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడగా.. మద్యం షాపును తొలగించే వరకు తమ పిల్లల్ని బడికి పంపించేది లేదని, సోమవారం నుంచి బడి నుంచి టీసీలు తీసుకువెళ్లిపోతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.

    బడికి రాని ఈదుపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు

    మద్యం షాపు తొలగిస్తేనే స్కూలుకు

    పంపిస్తామన్న తల్లిదండ్రులు

    ఉన్నతాధికారులకు నివే దించా..

    మద్యం షాపును తొలగించే వరకు విద్యార్థులను బడికి పంపించేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాను.

    – తమ్మయ్య, హెచ్‌ఎం

  • ఎన్‌ప

    శ్రీకాకుళం పాతబస్టాండ్‌: తల్లికి వందనం పథకం ప్రయోజనాలను విద్యార్థులు సకాలంలో పొందాలంటే తమ బ్యాంకు ఖాతాలను జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ)తో అనుసంధానం చేయించుకోవడం అత్యవసరమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. షెడ్యూల్డు కులాల 9వ, 10వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు అందే నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అంతేకాక, ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిధులు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ కానున్నాయి. తల్లులు, విద్యార్థులు తమ ఖాతాలను వెంటనే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేయించుకోవాలని ఆయన సూచించారు. ఖాతా లేకపోతే తపాలా కార్యాలయంలో పోస్ట్‌ కార్యా లయ ఖాతా తెరిచి, దాన్ని కూడా తగిన విధంగా అనుసంధానం చేయించుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికీ 1360 మంది విద్యార్థులు ఖాతాలను అనుసంధానం చేయించుకోలేదని కలెక్టర్‌ తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖాతా అనుసంధానం తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

    కూటమికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు

    నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు సుప్రీం కోర్టు తీర్పు చెంప పెట్టు వంటిదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్‌ మంజూరుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొమ్మినేనిని అకార ణంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిందని మండిపడ్డారు.ఎల్లో మీడియా గ్యాంగుతో కలిసి కొమ్మినేనిపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారం చేశారని అన్నారు. కొమ్మినేనికి బెయి ల్‌ ఇచ్చి సుప్రీం కోర్టు తగిన బుద్ధి చెప్పిందన్నా రు. ‘సాక్షి’ మీడియా ఆస్తులను కూటమి నాయ కులు ధ్వంసంపై చేయడాన్ని ఖండించారు.

    కూటమి హామీలన్నీ ఏమయ్యాయి..?

    శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయ ని వైఎస్సార్‌సీపీ కళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల రామారావు (లక్ష్మణరావు) ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లికి వందనంలో కోత పెట్టడం సరికాదన్నారు. పేద విద్యార్థుల చదువు కోసం దివంగత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభు త్వం పంగనామం పెట్టిందని ఆరోపించారు. ఉచిత బస్సు లేదు, అన్నదాత సుఖీభవ లేదు, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ లేదని మండిపడ్డారు. చేసిన తప్పులు ఎత్తిచూపే సాక్షి మీడియా, సాక్షి కార్యాలయాలపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం దారుణమన్నారు.

    ‘ఏడాది పాలనంతా మోసం’

    శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా మోసమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 5.32లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పేరు మార్చినా నగదు రాలేదన్నారు. ఇప్పటికే ఒక ఏడాది ఎగ్గొట్టేశారని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా ఈ ఏడాది తొలి విడత డబ్బులు కూడా ఇవ్వకపోవడం అన్యాయయమన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మరే ఇతర సంక్షేమానికి ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వెన్నుపోటు చంద్రబాబుకి కొత్తేమీ కాదని అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇలానే మోసం చేయడం, ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.

  • ఆటో గ్యాంగ్‌ ఆటకట్టు

    శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలో ఇటీవల రెచ్చిపోయిన ఆటో గ్యాంగ్‌ ఆటను పోలీసులు కట్టించారు. ఈ గ్యాంగ్‌కు సంబంధించి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

    వృద్ధదంపతులను ఏమార్చి..

    ఈ నెల 5న ఎచ్చెర్ల మండలం కొత్తపేట పంచాయ తీ సాకివానిపేటకు చెందిన వృద్ధ దంపతులు కోరా డ రమణ, రామలక్ష్మిలు శ్రీకాకుళంలో ఆటోలో ప్రయాణిస్తుండగా పుస్తెలతాడు దొంగిలించారు. అదే రోజు వృద్ధ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్‌ఐ రామారావు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా తోటపాలెం జంక్షన్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ రామారావు, సిబ్బందికి సరిగ్గా ఉద యం పది గంటల సమయంలో ఏపీ 30విడి440 నంబరు గల బజాజ్‌ మాక్సిమా ఆటో మీద వస్తున్న మహిళలపై అనుమానం కలగడంతో వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణలో విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెట్టాడ గ్రామానికి చెందిన గొర్లె మౌనిక, గొర్లె పెద్దింట్లమ్మ, అదే జిల్లా కొత్తవలస మండలం చీడివలసకు చెందిన ఆటో డ్రైవర్‌ మేకల హరిలుగా పోలీసులు గుర్తించారు. పెద్దింట్లమ్మ, మౌనికలు తల్లీ కూతుళ్లు కాగా, హరి పెద్దింట్లమ్మకు మేనల్లుడు అవుతాడు.

    లెక్కకు మించి కేసులు..

    వీరిపై ఇతర జిల్లాల్లో, మన జిల్లాలోని రూరల్‌తో కలిపి పదికి మించి కేసులున్నాయని ఎస్‌ఐ రామారావు తెలిపారు. వీరిదో గ్యాంగు అని, ఈ కేసుకు సంబంధించి వీరే నిందితులని, గ్యాంగులో మరికొందరు ఉండొచ్చని ఎస్‌ఐ పేర్కొన్నారు. నిందితు ల నుంచి ఆటోను, బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరించామన్నారు.

    పోలీసులకు దొరికిన ఆటో గ్యాంగ్‌

    నిందితులు విజయనగరం వాసులు

  • బంగారం కోసమే వృద్ధురాలి హత్య

    టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఈ నెల 9వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి మెడలో ఉన్న బంగారం కోసమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. దుంపల దాలమ్మ తన ఇంటిలో మోటార్‌ పాడైపోవడంతో ఈ నెల 8న దా న్ని బాగుచేసేందుకు అదే గ్రామానికి చెందిన బల్లి రాము అనే వ్యక్తిని పిలిచింది. రిపేర్‌ చేసేందుకు వచ్చిన రాము వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించి, ఆమె మెడలో విలువైన బంగారు తాడు ఉండటం గుర్తించి మరుసటి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు రాత్రి 8గంటల సమయంలో మోటార్‌ మరమ్మతులు చేసేందుకు వృద్ధురాలి ఇంటికి వచ్చి ఆమెను టీ పెట్టమని చె ప్పాడు. ఆమె టీ పెడుతుండగా వెనుక నుంచి వచ్చి న రాము తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టి మెడలో ఉన్న రెండున్నర తు లాల బంగారం గొలుసుతో అక్కడ నుంచి పారిపోయాడు. వృద్ధురాలి కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం హరిశ్చంద్రపురం బస్టాప్‌ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి బంగారం గొలుసు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.