ఇది జైలా.. రిసార్టా.. డేంజర్ ఖైదీలకు VIP సుఖాలు..
75 ఏళ్లు వచ్చాయి అయిన సిగ్గు లేదు.. చంద్రబాబుపై రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్
మరో ప్రమాదం.. బస్సును ఢీకొన్న వ్యాన్
100 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన ఘనత వైఎస్ జగన్ దే..
పవన్ పబ్లిసిటీ డ్రామాపై నాన్ స్టాప్ సెటైర్లు
టీడీపీ నేత గోడౌన్ లో గోమాంసం
అందెశ్రీ మృతిపై లైవ్ లో భావోద్వేగానికి లోనైన సింగర్స్..
తిరుమలలో ఘోర అపచారం.. మాంసం తింటూ పట్టుబడ్డ టీటీడీ సిబ్బంది
అందెశ్రీ మరణంపై వైద్యుల కామెంట్స్
అడ్డంగా దొరికిన తరువాత తిరుపతి కల్తీ లడ్డుపై మరో కాంట్రవర్సీ
అక్షరాలు దిద్దలేదు.. బడికి వెళ్ళలేదు.. అందెశ్రీ గొప్పతనం ఇదే..
జోరుగా రచ్చబండ.. కోటి సంతకాల సేకరణ
బాహుబలి: ది ఎటర్నల్ వార్..! బాహుబలి - 3 కి ఇంకా టైముందా..!
తిరుమల లడ్డుపై తప్పుడు వార్తలతో అడ్డంగా దొరికిన ఎల్లో మీడియా..
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ
Politics
సాక్షి, విజయవాడ: అధికార టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని, వారికి అనవసరంగా సీటు ఇచ్చామని ఇటీవల చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, ఎమ్మెల్యేల దోపిడీపై తాజా సర్వే ఒకటి చంద్రబాబును టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కొందరు మంత్రులపై చంద్రబాబు మండినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని చంద్రబాబు, లోకేష్లు అంగీకరించారు. ఎమ్మెల్యేల దోపిడీపై ఎస్-9 సంస్థ సర్వేలో(టీడీపీ సొంత సర్వే) తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలిసింది. సర్వే రిపోర్టులు, కార్యకర్తల ఫిర్యాదులతో చంద్రబాబు, లోకేష్ గగ్గోలు పెట్టినట్టు తెలిసింది. అంతకుముందు.. కొంత మందికి టికెట్లు అనవసరంగా ఇచ్చానని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, యువకులను ఎంకరేజ్చేసే పనిలో భాగంగా టికెట్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నప్పటికీ కొందరు నేతలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసినట్టు తెలిసింది. మరోవైపు.. తాజాగా తొలిసారి ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియడం లేదన్న లోకేష్ వ్యాఖ్యలు చేయడం ఈ ఎపిసోడ్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా తండ్రి, కొడుకుల వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్యేల దోపిడీ బండారం బట్టబయలైంది. ఇక, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.
సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకురాలు సుధా మాధవి మరోసారి తమ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం తాము ఎంతో కష్టపడామని.. తన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేనూ ఆడబిడ్డనే.. పవన్ కల్యాణ్, నారా లోకేష్ నా ఆవేదన వినండి. మాకు న్యాయం చేయకపోతే చావే శరణ్యం అని కన్నీరుపెట్టుకున్నారు.
టీడీపీ నాయకురాలు సుధా మాధవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ కోసం చాలా కష్ట పడ్డాను. టీడీపీ నుండి టికెట్ ఇప్పిస్తామని నా నుండి ఏడు కోట్లు తీసుకున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మా డబ్బులతో ఆస్తులు కొన్నాడు. టీడీపీకి నేను చాలా చేశాను.. నా సేవలను గుర్తించండి. వేమన సతీష్ ఒక్కడే కార్యకర్త కాదు.. మేము కూడా కార్యకర్తలమే. నాకు అన్యాయం జరిగింది కాబట్టే నేను జై భీమ్ రావ్ పార్టీ నుండి పోటీ చేశాను. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నారు. మీ ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇలాగే స్పందిస్తారా?.
వేమన సతీష్ ఏడు కోట్లు తీసుకొన్నారు.. 43 లక్షలు చెక్ ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఆరు కోట్లు కూడా వేయాలి. మాకు అన్యాయం జరిగింది అని వీడియో తీసి పంపించాము. మా సమస్య చంద్రబాబుకి చెప్పుకుందామని విజయవాడ వస్తే పోలీసులు తీసుకొని వెళ్లారు. వేమన సతీష్కి మేము డబ్బులు ఇవ్వలేదని వీడియో తీయించారు. ఒక పోలీస్ అధికారి కులం పేరుతో బూతులు తిట్టారు. మా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారని నమ్మించారు.. అలాగే భయపెట్టి వీడియో తీయించారు. మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నది విచారణ చేసి న్యాయం చేయాలి. మేము ఇచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కొన్నారు. ఎలక్షన్ సమయంలో డబ్బులు ఎలా వచ్చాయి.
రాజేష్ మహాసేన , యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు మాకు న్యాయం చేపించండి. జడ శ్రావణ్ కోర్టులో కేసు వేసిన తర్వాత మాత్రమే.. మమ్మల్ని పోలీసులు విడుదల చేశారు. లేదంటే మమ్మల్ని అక్కడే చంపేసేవాళ్లు. నేను ఆడబిడ్దని.. నాకు న్యాయం చేయండి. డబ్బులు ఇచ్చిన వీడియోలు అన్ని ఉన్నాయి. మాకు అంత సీన్ లేదు అని ప్రచారం చేస్తున్నారు. మహా టీవీలో డిబేట్ పెట్టండి.. సతీష్ని పిలవండి.. నేను వస్తాను. నా కుటుంబానికి రక్షణ కల్పించి.. మా ఆస్తులు మాకు ఇప్పించండి. చనిపోదాం అనిపిస్తుంది.. అలా వేధిస్తున్నారు. పవన్, లోకేష్ నా ఆవేదన వినండి. ఆస్తులు పోగొట్టుకొని నడి రోడ్డు మీద నిలబడ్డాను. మాకు బుద్ధి వచ్చింది రాజకీయాల వైపు ఇంకెప్పుడు చూడను. మాకు న్యాయం చేయకపోతే మాకు చావే శరణ్యం. చంద్రబాబు, లోకేష్కి కూడా మా సమస్య తెలియజేశాం. కిడ్నాప్ చేశారు కాబట్టే మేము మీడియా ముందుకు వచ్చాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Movies
తెలుగులో 'అమిగోస్', 'నా సామి రంగ' సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆషికా రంగనాథ్.. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఓ కథానాయికగా చేసింది. ఈమె నటించిన ఓ కన్నడ మూవీ ఇప్పుడు తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. అదే 'గత వైభవం'. మూడు వేర్వేరు కాలాల్లో జరిగే ఫాంటసీ కథతో దీన్ని తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)
నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. ట్రైలర్ చూస్తుంటే కాన్సెప్ట్ పరంగా బాగానే ఉంది గానీ విజువల్స్, కంటెంట్ మాత్రం ఓకే ఓకే అనిపించేలా ఉన్నాయి. ఇదే రోజున దుల్కర్ సల్మాన్ 'కాంత'తో పాటు సంతాన ప్రాప్తిరస్తుతో పాటు పలు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. మరి వీటితో పాటు పోటీలో నిలిచి 'గత వైభవం' ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: బింధుమాధవి వేశ్య పాత్రలో.. 'దండోరా' రిలీజ్ డేట్ ఫిక్స్)
తమిళ హీరో అభినయ్ కింగర్ (44) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం (నవంబర్ 10న) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన మరణాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. కేవలం ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారంటూ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడారు. అందులో అతడు బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియో బయటకు వచ్చిన మూడు నెలలకే అభినయ్ మరణించడం విషాదకరం!
ఎవరీ అభినయ్?
ప్రముఖ మలయాళ నటి టి.పి.రాధామణి కుమారుడే అభినయ్ కింగర్ (Abhinay Kinger). తుళ్లువదో ఇళమై అనే తమిళ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమ్యారు. తమిళ చిత్రం 'జంక్షన్'తో హీరోగా మారారు. కానీ తర్వాత హీరోగా కంటిన్యూ కాలేకపోయారు. సక్సెస్, పొన్ మేఘలై, ఆరుముగం, సింగారా చెన్నై, ఆరోహణం వంటి పలు కోలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో కేవలం మూడే మూడు మూవీస్ చేశారు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లం ఆయుధం సినిమాలో బిజినెస్మెన్గా కనిపించారు. అంతేకాకుండా మిలింద్ సోమన్, బాబు ఆంటోని, విద్యుత్ జమ్వాల్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పారు.చదవండి: 'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్లో ఎవరంటే?
కలర్ ఫోటో, బెదురులంక 2012 సినిమాలని నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా 'దండోరా'. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న మూవీ థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని 'దండోరా' సినిమా తీశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ దీన్ని తెరకెక్కించారు. శివాజీతో పాటు నవదీప్, బిందు మాధవి తదితరులు నటించారు. బిందుమాధవి ఇందులో వేశ్య పాత్రలో కనిపించనుంది.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్లో ఎవరంటే?)
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి దుల్కర్ సల్మాన్ 'కాంత'తో పాటు సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రీస్, స్కూల్ లైఫ్, సీమంతం, ఆటకదరా శివ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అలానే నాగ్ కల్ట్ క్లాసిక్ 'శివ' రీ రిలీజ్ కానుంది. 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా ఇదే వీకెండ్లో థియేటర్లలోకి విడుదల కానుంది.
(ఇదీ చదవండి: 'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్లో ఎవరంటే?)
మరోవైపు ఓటీటీల్లో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ హిట్ చిత్రాలు ఇదే వారం స్ట్రీమింగ్ కానుండటం విశేషం. గత నెలలో దీపావళి రిలీజై ఆకట్టుకున్న డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్.. ఆయా ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు అవిహితం, జూరాసిక్ రీ బర్త్ అనే డబ్బింగ్ మూవీస్, ఢిల్లీ క్రైమ్ మూడో సీజన్ కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 10 నుంచి 16 వరకు)
నెట్ఫ్లిక్స్
- మెరైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 10
- ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 12
- ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (హిందీ సిరీస్) - నవంబరు 13
- తెలుసు కదా (తెలుగు మూవీ) - నవంబరు 14
- డ్యూడ్ (తెలుగు సినిమా) - నవంబరు 14
- ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 14
- జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14
- నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ మూవీ) - నవంబరు 14
అమెజాన్ ప్రైమ్
- ప్లే డేట్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 12
హాట్స్టార్
- జాలీ ఎల్ఎల్బీ 3 (హిందీ మూవీ) - నవంబరు 14
- అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 14
- జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 14
జీ5
- దశావతార్ (మరాఠీ సినిమా) - నవంబరు 14
- ఇన్స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) - నవంబరు 14
ఆహా
- కె ర్యాంప్ (తెలుగు సినిమా) - నవంబరు 15
సన్ నెక్స్ట్
- ఎక్క (కన్నడ మూవీ) - నవంబరు 13
ఆపిల్ టీవీ ప్లస్
- పాన్ రాయల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 12
- కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 14
మనోరమ మ్యాక్స్
- కప్లింగ్ (మలయాళ సిరీస్) - నవంబరు 14
సింప్లీ సౌత్
- పొయ్యమొళి (మలయాళ సినిమా) - నవంబరు 14
- యోలో (తమిళ మూవీ) - నవంబరు 14
(ఇదీ చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో నామినేషన్స్కు వచ్చినా కష్టమే, రాకున్నా కష్టమే! ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే, అందులోనూ పర్ఫామెన్స్ బాలేకపోతే ఓవరూ ఓట్లేయరు. అలాంటప్పుడు నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, బాగా గేమ్స్ ఆడుతున్నప్పటికీ నామినేషన్స్లోకి రాకపోతే అభిమానులందరూ ఎవరో ఒక కంటెస్టెంట్ వైపు మళ్లే అవకాశముంది. సదరు వ్యక్తికి ఓట్లేయడం మర్చిపోయే ఛాన్సుంది.
భరణిని నామినేట్ చేసిన ఇమ్మూ
అయితే తెలుగు బిగ్బాస్ చరిత్రలో తొమ్మిదివారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. చూస్తుంటే ఈ వారం కూడా నామినేషన్స్కు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఇమ్మాన్యుయేల్ భరణిని నామినేట్ చేస్తూ.. మీరు చాలా విషయాల్లో వెనకాడుతున్నారు. ఫైర్ తగ్గిపోతోందని కారణం చెప్పాడు.ఎమోషనల్ డ్రామా ఎక్కువైంది
రీతూ.. దివ్యను నామినేట్ చేస్తూ.. నువ్వొక గ్యాంగ్ను పెట్టుకుని వారిని బాణాల్లా వదులుతావ్.. అంది. వాళ్లేమైనా చిన్నపిల్లలా? అని దివ్య కౌంటరిచ్చింది. పర్ఫామెన్స్ లేదు కానీ ఎమోషనల్ డ్రామా ఎక్కువైందని సంజనాను నామినేట్ చేశాడు గౌరవ్. కల్యాణ్.. నిఖిల్ను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది.చదవండి: బిగ్బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్
ప్రముఖ రచయిత అందెశ్రీ (Ande Sri) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. అందెశ్రీ మరణంపై దర్శకనటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) స్పందించారు.
తీరని లోటు
ప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు, యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలైన ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కలకు అమోఘమైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు అందెశ్రీ ఎంతో దోహదం చేశారు. ఎర్ర సముద్రంలో మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. అది ఆ పాట గొప్పతనం..జన్మ ధన్యం
ఊరు మనదిరా మూవీలోని చూడా చక్కని తల్లి.. చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించడమే కాదు నాటికి, నేటికి, ఏ నాటికైనా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా అంతే బాగుంటుంది. అన్నింటినీ మించి జయ జయహే తెలంగాణ.. పాటతో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి, గౌరవించి తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఇలాంటి గొప్ప పాటలు అందించిన ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి అని ప్రార్థిస్తున్నాను అని నారాయణమూర్తి పేర్కొన్నారు.చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ముద్దుబిడ్డ తనూజ అంటున్నారు కానీ ఆమెకంటే ఎక్కువ హింట్లు, సూచనలు ఇమ్మాన్యుయేల్కు ఇస్తున్నారు. తన ఆట ఎలా ఉందో ప్రతిసారి ఆడియన్స్తో చెప్పిస్తున్నారు. ఈసారేకంగా నామినేషన్స్లోకి రావడం లేదు, ఇలాగైతే కష్టమని ఏకంగా నాగార్జునే అనడం గమనార్హం. ఇంతకూ హౌస్లో ఏం జరిగిందో నవంబర్ 9వ ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..
ఇద్దరికీ సమాన ఓట్లు
ట్రోఫీకి ఎవరు దగ్గర్లో ఉన్నారు? ఎగ్జిట్కు ఎవరు దగ్గర్లో ఉన్నారో చెప్పాలన్నాడు నాగ్ (Nagarjuna Akkineni). ఐదురు హౌస్మేట్స్ తనూజను, మరో ఐదుగురు ఇమ్మాన్యుయేల్ను ట్రోఫీకి దగ్గర్లో పెట్టారు. సంజన.. డిమాన్ పవన్కి ట్రోఫీ గెలిచే అర్హత ఉందని చెప్పింది. ఇమ్మూ.. కల్యాణ్కు గెలిచే అర్హత ఉందన్నాడు. ఎగ్జిట్ విషయంలో అయితే మెజారిటీగా ఎనిమిది మంది సాయి వెళ్లిపోతాడని ముందే గెస్ చేశారు.
దివ్యకు వాయింపులు
ఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు నాగ్. దివ్య స్ట్రాటజీ కరెక్ట్.. కానీ, ఒకరి గెలుపు కోసం కష్టపడాలి తప్ప ఒకరి ఓటమి కోసం కాదని చెప్పాడు. తనూజను తీయను అని తనకు, కల్యాణ్కు మాటిచ్చి దాన్ని తప్పితే నీ క్రెడిటిబులిటీ పోతుందని హెచ్చరించాడు. రెబల్గా దివ్య.. తనను ఆటలో నుంచి తీసేస్తే కల్యాణ్ ఫైట్ చేయడం మానేసి పకపక నవ్వడం.. అది కరెక్టే అని నాగార్జున చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.ఇమ్మూని హెచ్చరించిన నాగ్
ఇక బిగ్బాస్ చరిత్రలో ఇన్నివారాలు (తొమ్మిది వారాలు) నామినేషన్స్లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే.. అని ఇమ్మాన్యుయేల్తో అన్నాడు. అదే నాకూ భయమేస్తుంది సార్, నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తోంది. ఎవరికో ఒకరికి షిఫ్ట్ అయిపోయుంటారేమో, త్వరలోనే వస్తా.. నాకోసం వెయిట్ చేయండి అని ఇమ్మూ వేడుకున్నాడు. 10 వారాలు నామినేషన్స్లోకి రాకుండా సడన్గా వస్తే.. అప్పటికే ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా.. అంటూ నామినేషన్స్లోకి రమ్మని వార్నింగ్ ఇస్తూనే డైరెక్ట్గా హింటిచ్చాడు.
పవర్ వాడేందుకు ఒప్పుకోని తనూజ
ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో భరణి, సాయి మిగిలారు. వీరిలో సాయి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నీ దగ్గరున్న పవర్ ఉపయోగించి సాయిని సేవ్ చేయొచ్చు, అప్పుడు భరణి ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పాడు. అందుకు తనూజ ఒప్పుకోకపోవడంతో సాయి ఎలిమినేట్ అయ్యాడు. అతడు స్టేజీపైకి వచ్చి హౌస్లో ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సుమన్ కరెక్ట్ అని, భరణి, రీతూ, దివ్య రాంగ్ అని పేర్కొన్నాడు.
దీపావళికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీ డేట్ ఇచ్చేశాయి. కిరణ్ అబ్బవరం 'కె-ర్యాంప్' నవంబర్ 15న ఆహాలో రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' మూవీ నవంబర్ 14న నెట్ఫ్లిక్స్లో విడుదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక దీపావళి రేసులో బ్లాక్బస్టర్గా నిలిచిన 'డ్యూడ్' సినిమా ఓటీటీ డేట్ మాత్రం అనౌన్స్ చేయకుండా అభిమానులను సస్పెన్స్లో ఉంచారు.
ఈ వారమే ఓటీటీలో
ఈ సస్పెన్స్కు తెర దించుతూ ఎట్టకేలకు డ్యూడ్ ఓటీటీ రిలీజ్ డేట్ (Dude Movie OTT Reelase Date) ప్రకటించారు. నవంబర్ 14న నెట్ఫ్లిక్స్లో రానుందంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. డ్యూడ్ విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. శరత్కుమార్ కీలక పాత్రలో నటించగా కీర్తి శ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా ఈజీగా రూ.100 కోట్లు రాబట్టింది.కథ
డ్యూడ్ కథేంటంటే.. గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఆముద (నేహా శెట్టి)ని ప్రేమిస్తాడు. కానీ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. గగన్ను అతడి మేనమామ (శరత్ కుమార్) కూతురు కుందన (మమిత బైజు) ప్రేమిస్తుంది. కానీ, ఆమె పెళ్లి ప్రపోజల్ను గగన్ రిజెక్ట్ చేస్తాడు. కొంతకాలానికి ఆమెనే పెళ్లాడాలనుకున్న టైమ్కు కుందన పార్దు (హృదయ్)తో ప్రేమలో ఉంటుంది. అయినప్పటికీ గగన్-కుందనకే పెళ్లి జరుగుతుంది. వీళ్ల పెళ్లికి కారణమేంటి? తర్వాత కలిసున్నారా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి..Orey oru Dude, oraayiram problems, zero solutions 🤭😭 pic.twitter.com/ShfAo36IJz
— Netflix India South (@Netflix_INSouth) November 10, 2025
చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం
ఆయన పదాలు కడితే పాటతల్లి పులకరిస్తుంది. ఆ పాట వింటుంటే హృదయాలు పరవశిస్తాయి. ఆయన పాటలెప్పుడూ ప్రకృతి, జనంతో మమేకమై ఉంటాయి. ఉత్తేజం, ఉక్రోషం, ఆవేదన, నిరసన.. ఇలా అన్నీ ఆయన పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో పాటనే ఆయుధంగా చేసుకున్నారు. ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ముందుకు నడిపించారు. ఆయనే తెలంగాణ రాష్ట్ర గీతకర్త, పాటల రచయిత అందెశ్రీ. సోమవారం (నవంబర్ 10) నాడు అందెశ్రీ ఇక సెలవంటూ వీడ్కోలు తీసుకున్నారు. ఆయన గురించి ఈ ప్రత్యేక కథనం..
అందెశ్రీ పేరెలా వచ్చింది?
అందెశ్రీ (Ande Sri).. 1961 జూలై 18న జన్మించారు. ఈయన అసలు పేరు ఎల్లయ్య. అతడి 16వ ఏట శృంగేరీ పీఠానికి చెందిన స్వాములు శంకర్ మహారాజ్.. ‘బిడ్డా.. కాళిదాసు, తెనాలి రామకృష్ణను కనికరించిన అమ్మవారు నీలో ఉంది. నీ సాహిత్యంలో ఆమె అందె విన్పిస్తోంది. నీవు నేటి నుంచి అందె శ్రీవి' అని ఆశీర్వదించారు. అలా ఆయనకు ఈ పేరు వచ్చింది.పుస్తకాల్లోకెక్కిన పాట
పేరుకు తగ్గట్లుగానే ఆయన కలం నుంచి వచ్చే కవిత్వం, పాటలు కూడా ఎంతో గొప్పగా ఉండేవి. బడి ముఖం చూడకపోయినా సమాజాన్ని, ప్రకృతిని అందరికంటే ఎక్కువ చదివేశారు. ఎర్ర సముద్రం సినిమాలో 'మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు..' పాటతో హృదయాలు మెలిపెట్టేశారు. తర్వాత ఈ పాట పాఠ్యాంశంగానూ మారడం విశేషం! గంగ సినిమాలో 'వెళ్లిపోతున్నావా..' పాటకుగానూ ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు తీసుకున్నారు.మనకంటూ పాట లేదా?
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అందెశ్రీకి ఓసారి స్టేజీ ఎక్కినప్పుడు మొదట ఏ పాట పాడాలో అర్థం కాలేదు. అప్పుడే మనకంటూ ఓ పాట లేదా? అన్న ప్రశ్న మనసును తొలిచేసింది. అలా 'జయ జయహే తెలంగాణ పాట' పురుడు పోసుకుంది. ఈ పాట స్టేజీపై పాడిన తొలిసారే.. వెనకనుంచి ఎవరో ఇది తెలంగాణ జాతీయగీతం అన్నారు. వెక్కిరిస్తున్నారేమో అని అందెశ్రీ భయపడ్డారు. కానీ, తర్వాత అదే తెలంగాణ రాష్ట్ర గీతంగా కీర్తికెక్కింది.పాటకు ప్రాణం
'పల్లె నీకు వందనాలమ్మో..', 'కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా' అంటూ ప్రకృతికి, మన జీవన విధానానికి చేతులెత్తి మొక్కుతారాయన. 'జన జాతరలో మన గీతం.. జయకేతనమై ఎగరాలి.. ఝంఝా మారుత జననినాదమై జేగంటలు మోగించాలి..' అంటూ జైబోలో తెలంగాణలో రాసిన పాట అందరు పిడికిలి బిగించి మరింత గట్టిగా, ధైర్యంగా జై తెలంగాణ అనేలా చేసింది. ఒకటే జననం, ఒకటే మరణం.. ఈ మధ్యలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా తెలంగాణ సాధించడం ఒక్కటే మన కర్తవ్యం అంటూ పాటతోనే జనాన్ని ముందుకు నడిపించారు. ఎవరు రాయగలరు ఇంతకంటే గొప్ప గీతం అనిపించేలా పాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి!చదవండి: అందెశ్రీ కన్నుమూత
Business
భారతదేశం ఇన్బౌండ్ టూరిజం (దేశంలోకి వచ్చే పర్యాటకులు) సమీప భవిష్యత్తులో బలంగా పుంజుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల విదేశీ పర్యాటకుల రాక కొవిడ్ పూర్వ స్థాయికి చేరుకుంటుండడం మాత్రమే కాకుండా ప్రయాణ అనుభవాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. క్రమబద్ధీకరించిన వీసా ప్రక్రియలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక పరిస్థితులు విదేశీ సందర్శకులను ఆకర్షిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన పర్యాటకులు
భారతదేశం పర్యాటక రంగం 2024లో ఆశించిన వృద్ధిని సాధించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం 2024లో 9.95 మిలియన్ల విదేశీ పర్యాటకులు భారత్ వచ్చారు. ఇది 2023 కంటే 4.5% పెరుగుదలను సూచిస్తుంది. 2019 నాటి కొవిడ్ పూర్వ స్థాయి 10.9 మిలియన్ల మార్కుకు దగ్గరగా ఉంది. 2025లో ఈ మార్కు చేరుకుంటుందని పరిశ్రమ నిపుణులు విశ్వసిస్తున్నారు. చాలా మంది టూర్ ఆపరేటర్లు ప్రస్తుత పీక్ సీజన్లో 10-15% అధిక బుకింగ్లు వస్తున్నట్లు చెబుతున్నారు. విదేశీ పర్యాటకుల రాక కోసం భారత్ ఇటీవల కాలంలో తీసుకున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి.
ఈ-వీసా (e-Visa) యాక్సెస్, వేగవంతమైన అనుమతులు 160 కంటే ఎక్కువ దేశాల నుంచి పర్యాటకుల ప్రయాణాన్ని సులభతరం చేశాయి.
కొత్త అంతర్జాతీయ విమాన మార్గాలను ప్రారంభించింది.
పర్యాటక ప్రదేశాలకు రోడ్డు, రైలు, వాయు మార్గాలను అప్గ్రేడ్ చేసింది.
హోటల్ ఆక్యుపెన్సీ పెరిగేందుకు చర్యలు తీసుకుంది.
పర్యాటకుల డిమాండ్కు అనుగుణంగా టూర్ ఆపరేటర్లు మరింత పర్సనలైజ్ ప్రయాణాలను అందిస్తున్నారు.
ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్ తగ్గుతుందా?
ఉద్యోగులకు యాజమాన్యాలు బహుమతులు ఇవ్వడం కార్పొరేట్ రంగంలో సర్వసాధారణం. మంచి పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులను వివిధ రకాల కానుకలిచ్చి ప్రోత్సహిస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చిన బహుమతులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ ఆ కంపెనీ ఏం కానుకలు ఇచ్చింది.. ఆశ్చర్యం ఎందుకు అన్నది మనమూ చూద్దామా..
ప్రపంచవ్యాప్తంగా కన్స్యూమర్ 360 డిగ్రీల కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘ఇన్స్టా 360’ అనే సంస్థ ఇటీవల అక్టోబర్ 24న చైనాలో ప్రోగ్రామర్స్ డేను పురస్కరించుకుని ఉద్యోగులకు వినూత్న బహుమతులు ప్రదానం చేసింది. కంప్యూటర్ కీ బోర్డులో అమర్చుకునేలా స్వచ్ఛమైన బంగారంతో చేసిన కీక్యాప్స్ను కానుకలుగా ఇచ్చింది.
కంపెనీ ఈ సంవత్సరం 21 గోల్డ్ కీక్యాప్లను బహుమతిగా ఇచ్చింది. వీటిలో అత్యంత విలువైనది స్పేస్ బార్ కీ క్యాప్. దీని బరువు 35.02 గ్రాములు కాగా విలువ సుమారు 320,000 యువాన్లు. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 39 లక్షలు. ఇన్స్టా360 సంస్థ ఉద్యోగులకు గోల్డ్ కీ క్యాప్లను బహుమతులుగా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. కంపెనీ గత నాలుగేళ్లలో మొత్తం 55 గోల్డ్ కీక్యాప్లను ప్రదానం చేసింది.
బంగారం లాంటి కంపెనీ
ఇన్స్టా360 ప్రదానం చేస్తున్న కానుకల కారణంగా చైనా టెక్ పరిశ్రమ వర్గాల్లో ఆ కంపెనీకి "గోల్డ్ ఫ్యాక్టరీ" అనే మారుపేరు వచ్చింది. ఈ కంపెనీ ఇలా బంగారు వస్తువులు కానుకలుగా ఇవ్వడం ఏదో ఏడాదికొక్కసారి మాత్రమే అనుకునేరు.. ఇన్స్టా360కి సంబంధించిన ఏ విశేష సందర్భం వచ్చినా ఏదో రూపంలో పసిడి కానుకలు ఇవ్వడమే పరిపాటి.
కంపెనీ పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత జూలైలో ఉద్యోగులు, ఇంటర్న్లందరికీ "గోల్డ్ బ్లైండ్ బాక్స్" ను అందించింది. ఇందులో 0.36 గ్రాముల స్వచ్ఛమైన బంగారుతో రూపొందించిన స్టిక్కర్లున్నాయి. ఇక కంపెనీలో ఉద్యోగులెవరైనా కొత్తగా వివాహం చేసుకున్నా లేదా పిల్లలకు జన్మనిచ్చినా వాళ్లకు ఒక గ్రాము స్వచ్ఛమైన బంగారు నాణెం బహూకరిస్తారు. ఇటీవలి సంవత్సరం ముగింపు వేడుకలో 50 గ్రాముల బంగారు బార్ను గ్రాండ్ ప్రైజ్గా అందించడం విశేషం.
బంగారాన్నే ఉద్యోగులకు కానుకగా ఇవ్వడం వెనుక ఉద్దేశాన్ని ఇన్స్టా360 వ్యవస్థాపకుడు లియు జింగ్కాంగ్ వివరించారు. సంస్థ బంగారాన్ని దాని నగదు విలువ కోసం కాకుండా దాని "స్థిరత్వం" కోసం ఎంచుకుంటుందని పేర్కొన్నారు. ఒక సంస్థ స్థిరత్వం ప్రతిభావంతులైన వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. ప్రతి కీస్ట్రోక్ "రాయిని బంగారంగా మార్చే స్పర్శ" అని గోల్డ్ కీక్యాప్స్ రిమైండర్గా పనిచేస్తాయని అన్నారు.
ఇదీ చదవండి: బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి
భారతదేశ దీర్ఘకాలిక వృద్ధికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఇండియా డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫండ్ (IDSF)ను స్థాపించాలని ప్రతిపాదించింది. ఇది దేశ వృద్ధిని, ప్రపంచ ఆర్థిక ప్రభావాన్ని లక్ష్యంగా చేసుకుని స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం (2047) నాటికి 1.3 నుంచి 2.6 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.108 నుంచి రూ.216 లక్షల కోట్ల కార్పస్ను ఏర్పాటు చేయాలని ఈ ఫండ్ లక్ష్యంగా పెట్టుకుంది.
జాతీయ అవసరాలకు అనుగుణంగా IDSFను ఏర్పాటు చేయాలని సీఐఐ భావిస్తోంది. దీనిద్వారా మౌలిక సదుపాయాలు, తయారీ, ఆవిష్కరణలకు మూలధనాన్ని అందించనున్నారు. ఇంధనం, ఖనిజాలు, సాంకేతిక విజ్ఞానం వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ద్వారా విదేశాల్లో భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించనున్నారు. ఇప్పటికే ఉన్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF)ను బేస్గా ఉపయోగించుకుని ప్రతిపాదిత ఐడీఎస్ఎఫ్ను మెరుగైన పాలనకు వెచ్చించనున్నారు.
నిధుల సమీకరణ యంత్రాంగాలు
లక్ష్యాన్ని చేరుకోవడానికి సీఐఐ వినూత్న నిధుల వనరులను ప్రతిపాదించింది.
రోడ్లు, ఓడరేవులు, స్పెక్ట్రమ్ వంటి ప్రజా మౌలిక సదుపాయాల ఆస్తుల విక్రయం ద్వారా నిధులను సమీకరించనున్నారు.
ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఈక్విటీని ఫండ్కు బదిలీ చేస్తారు.
దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ప్రపంచ పెట్టుబడిని ఆకర్షించనున్నారు.
ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్ తగ్గుతుందా?
దేశంలో బంగారం, వెండి ధరలు తుపానులా పెరిగాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్న పసిడి ధరలు (Today Gold Rate) ఆదివారంతో పోలిస్తే సోమవారం భారీగా ఎగిశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలని ఆలోచిస్తున్నారా? చాలా మందికి సాధారణంగా ‘కొత్త కార్డు కోసం అప్లై చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందేమో?’ అనే అనుమానం ఉంటుంది. ఈ భయం సహజమే, ఎందుకంటే మంచి సిబిల్ స్కోర్ ఆర్థిక భవిష్యత్తుకు చాలా కీలకం. క్రెడిట్ కార్డు దరఖాస్తు సిబిల్ స్కోర్ను ఎలా ప్రభావితం చేస్తుందో, తక్కువ సమయంలో ఎక్కువ కార్డుల కోసం దరఖాస్తు చేయడం వల్ల కలిగే పర్యవసానాలు, సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకుందాం.
కొత్త క్రెడిట్ కార్డు
కొత్త క్రెడిట్ కార్డు (లేదా లోన్) కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ అది మీ సిబిల్ స్కోర్పై తాత్కాలికంగా కొద్దిపాటి ప్రభావాన్ని చూసే అవకాశం ఉంది. దీనికి కారణం ‘హార్డ్ ఎంక్వైరీ’. అంటే ఒక లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత (బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ) మీ క్రెడిట్ అర్హతను అంచనా వేయడానికి సిబిల్ (CIBIL) వంటి క్రెడిట్ బ్యూరోల నుంచి క్రెడిట్ రిపోర్టును అడుగుతారు. హార్డ్ ఎంక్వైరీ మీ క్రెడిట్ ప్రొఫైల్పై ఒక నోట్ను ఉంచుతుంది. రుణదాతల దృష్టిలో ఇది మీరు కొత్త రుణం కోసం చేస్తున్నారని సూచిస్తుంది. ఇది సాధారణంగా స్కోర్ను కొద్దిగా (5 నుంచి 10 పాయింట్లు) తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించడం కొనసాగిస్తే ఈ ప్రభావం కొన్ని నెలల్లో తగ్గిపోతుంది.
మీ సిబిల్ స్కోర్ను మీరే చెక్ చేసుకుంటే అది సాఫ్ట్ ఎంక్వైరీ అవుతుంది. సాఫ్ట్ ఎంక్వైరీ మీ స్కోర్పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు.
తక్కువ సమయంలో ఎక్కువ కార్డుల కోసం..
కొంతమంది తక్కువ సమయంలో ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా లోన్ల కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఈ అలవాటు సిబిల్ స్కోర్కు చాలా ప్రమాదకరం. మీరు కొద్ది కాలంలో (ఉదాహరణకు, 6 నెలల్లో) 3-4 కార్డుల కోసం దరఖాస్తు చేస్తే మీ రిపోర్ట్పై అదే సంఖ్యలో హార్డ్ ఎంక్వైరీలు రికార్డ్ అవుతాయి. ఎక్కువ ఎంక్వైరీలు ఉన్నప్పుడు రుణదాతలు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, అత్యవసరంగా క్రెడిట్ అవసరమని భావిస్తారు. మీరు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారనుకుంటారు. రుణాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవచ్చని అంచనా వేస్తారు. ఇది మీ క్రెడిట్ రిస్క్ను పెంచుతుంది. తద్వారా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. భవిష్యత్తులో దరఖాస్తు చేసే లోన్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.
కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు నిజంగా అవసరమైన వాటికి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒక దరఖాస్తు రెజెక్ట్ అయితే వెంటనే వేరే కార్డుకు అప్లై చేయకుండా కనీసం 6 నెలలు వేచి ఉండటం ఉత్తమం.
సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి జాగ్రత్తలు
మంచి సిబిల్ స్కోర్ (సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ) తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన లోన్ ఆఫర్లు అందిస్తుంది.
క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలను ఎల్లప్పుడూ గడువు తేదీ కంటే ముందే చెల్లించాలి.
ఆలస్య చెల్లింపులు స్కోర్ను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
క్రెడిట్ కార్డు బిల్లులను మినిమమ్ డ్యూ కాకుండా, పూర్తి మొత్తాన్ని చెల్లించడం అలవాటు చేసుకోవాలి.
మొత్తం క్రెడిట్ పరిమితిలో మీరు ఎంత ఉపయోగిస్తున్నారు అనేదాన్ని క్రెడిట్ వినియోగ నిష్పత్తి(సీయూఆర్) అంటారు. ఉదాహరణకు మొత్తం క్రెడిట్ లిమిట్ రూ.1 లక్ష అయితే, మీరు రూ.30,000 కంటే ఎక్కువ ఉపయోగించకుండా చూసుకోవాలి.
సెక్యూర్డ్ లోన్లు (హోమ్ లోన్, కారు లోన్..), అన్సెక్యూర్డ్ లోన్లు (పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు) మధ్య తేడా తెలుసుకోవాలి. అన్సెక్యూర్డ్ లోన్లపై ఆధారపడటం సిబిల్ స్కోర్కు మంచిది కాదు.
ఇదీ చదవండి: రూ.9,169 కోట్ల లాండరింగ్ రాకెట్ను గుర్తించిన సీబీడీటీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు పెరిగి 25,564కు చేరింది. సెన్సెక్స్(Sensex) 221 పాయింట్లు లాభపడి 83,421 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Sports
భారత మహిళల జట్టుకు తొలి వన్డే వరల్డ్కప్ టైటిల్ను అందించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను ఘనంగా సత్కరించేందుకు పంజాబ్ ప్రభుత్వం సిద్దమైంది. వరల్డ్కప్ గెలిచిన జట్టులో పంజాబ్ రాష్ట్రం నుంచి హర్మన్తో పాటు హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్ ఉన్నారు.
వీరి ముగ్గరికి తలా రూ.1.5 కోట్లు చొప్పున నగదు బహుమతి ఇవ్వాలని భగవంత్ మాన్ సర్కార్ నిర్ణయించున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ సర్కార్ త్వరలోనే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
హర్మన్కు నో ప్రమోషన్
ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) ఉన్న హర్మన్ను ఎస్పీగా ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సర్వీస్ నిబంధనల ప్రకారం ఎస్పీగా పదోన్నతి పొందాలంటే ఆమె కనీసం 12 నుంచి 15 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. ఈ క్రమంలోనే హర్మన్ ప్రమోషన్కు బదులగా క్యాష్ ప్రైజ్ అందుకోనుంది. కాగా 2017 వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత హర్మన్ను పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది.కానీ ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చౌదరి చరణ్ యూనివర్సిటీ యూజీసీ గుర్తింపు లేకపోవడంతో వివాదస్పదమైంది. దీంతో హర్మన్ను డీఎస్పీ నుండి కానిస్టేబుల్గా డిమోట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆమె లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తన డిగ్రీని పూర్తి చేసి తిరిగి డీఎస్పీగా నియమించబడింది. అయితే భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్లకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశముంది.
చదవండి: ఓడినా.. గెలిచినా ఒకటే పాట? ఇదెక్కడి న్యాయం?: భారత మాజీ కెప్టెన్
పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టుకు బుమ్రా కంటే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎక్కువ విలువైనవాడని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డాడు. చక్రవర్తి గత కొంత కాలంగా అద్బుతంగా రాణిస్తున్నాడని, అందుకే టీ20ల్లో వరల్డ్ నంబర్ బౌలరయ్యాడని అతడు కొనియాడాడు.
కాగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్ అంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది బుమ్రానే. అయితే బుమ్రా గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యల వైట్ బాల్ క్రికెట్కు అంతగా ప్రాధన్యం ఇవ్వడం లేదు. అతడు ఎక్కువగా టెస్టు ఫార్మాట్పై దృష్టిసారించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు దూరమైన బుమ్రా, టీ20 సిరీస్లో ఆడాడు. ఇప్పుడు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు సిద్దంకానున్నాడు.
అయితే ఆ తర్వాత జరిగే వన్డే, టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత లేదు. పొట్టి ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నందున సఫారీలతో టీ20లు బుమ్రా ఆడే అవకాశముంది. బుమ్రా ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. టీ20ల్లో అయితే బుమ్రా 29 ర్యాంక్లో ఉన్నాడు.
"వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బౌలర్ ఎందుకు అయ్యాడో అతడి గణాంకాలే చెబుతున్నాయి. అతడు బుమ్రా కంటే ఎక్కువ విలువైనవాడు. పవర్ ప్లేలో కావచ్చు, డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయాలన్న కెప్టెన్కు గుర్తు వచ్చేది చక్రవర్తినే. అతడు ఇప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్గా కొనసాగుతున్నాడు.
తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో పెద్దగా రాణించకపోయినా.. తన పునరాగమనంలో మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో అతడు భారత జట్టుకు కీలకం కానున్నాడు. వరుణ్ బంతితో మ్యాజిక్ చేస్తే భారత్కు తిరుగుండదు" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ పేర్కొన్నాడు. కాగా వరుణ్, బద్రీనాథ్ ఇద్దరూ తమిళనాడుకు చెందిన క్రికెటర్లే.
ఐసీసీ మహిళ ప్రపంచకప్-2025 విజేతగా హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన మన అమ్మాయిల జట్టు.. తొలి వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడింది.
స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఈ ప్రతిష్టత్మక ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని యావత్ దేశం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్వయంగా భారత క్రికెటర్లను కలిసి అభినందించారు.
ఈ గెలుపు సంబరాల మధ్య మాజీ భారత కెప్టెన్ శాంత రంగస్వామి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి. హర్మన్ప్రీత్ కెప్టెన్సీ నుంచి వైదొలగి బ్యాటింగ్, ఫీల్డింగ్పై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. దీర్ఘకాలిక భవిష్యత్తు దృష్ట్యా కెప్టెన్సీ మార్పు అనివార్యమని శాంత రంగస్వామి అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై మాజీ భారత కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
"ప్రతీ ప్రపంచకప్ తర్వాత ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి. గత నాలుగైదు ప్రపంచకప్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా ఆర్దమవుతోంది. భారత్ ఓడిపోతే హర్మన్ను కెప్టెన్సీ తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గెలిచినా కూడా అదే పాట పడుతున్నారు.
ఇదెక్కడి న్యాయం. ఈ తొలి ప్రపంచకప్ గెలిచిన క్షణాలను అస్వాదిస్తున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకారం. కాబట్టి దీనిపై ఎక్కువగా మాట్లాడాలనుకోవడంలేదు. హర్మన్తో నాకు మంచి అనుబంధం ఉంది. దేశవాళీ క్రికెట్లో ఆమె మాతో కలిసి ఆడింది.
అప్పుడే తనలోని టాలెంట్ను గమనించాను. అండర్-19 ప్లేయర్గా ఉన్నప్పుడే ఆమె భారీ షాట్లు ఆడేది. ఆమె ఒక మ్యాచ్ విన్నర్. అందుకే హర్మన్ కెప్టెన్గా కొనసాగాలని నేను చెబుతా ఉంటా అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.
చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా?
దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్లను సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో పాక్ జట్టు తలపడనుంది. నవంబర్ 11న రావాల్పిండి వేదకగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
అనంతరం శ్రీలంక-అఫ్గానిస్తాన్తో పాక్ ట్రై సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సిరీస్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. దాదాపుగా సౌతాఫ్రికాతో ఆడిన వన్డే జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. గత సిరీస్తో పోలిస్తే సెలక్టర్లు ఒకే ఒక మార్పు చేశారు.
జట్టు నుంచి మిడిలార్డర్ బ్యాటర్ హసన్ నవాజ్ను రిలీజ్ చేశారు. పాక్ దేశవాళీ టోర్నీ కైద్-ఎ-ఆజం ట్రోఫీలో నవాజ్ ఆడనున్నాడు. దీంతో అతడికి టీ20 జట్టులో కూడా చోటు దక్కలేదు. టీ20ల్లో అతడి స్ధానాన్ని స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్తో భర్తీ చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు జమాన్ను పక్కన పెట్టారు.
అయితే సఫారీలతో వన్డే సిరీస్లో ఆడిన జమాన్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. అయినప్పటికి ఇప్పుడు వన్డే, టీ20 జట్టు రెండింటిలోనూ అతడికి చోటు దక్కడం గమనార్హం. సౌతాఫ్రికాతో కానీ వన్డే జట్టులోకి నవాజ్ స్ధానంలో ఎవరిని ఎంపిక చేయలేదు. మరోసారి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్కు టీ20 జట్టులో చోటు దక్కలేదు.
శ్రీలంకతో వన్డేలకు పాక్ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్, వసీమ్ అగౌబ్, సలీమ్, సల్మాన్, సల్మాన్.
టీ20 ముక్కోణపు సిరీస్కు పాక్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్,ఉస్మాన్ తారిఖ్
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య సంచలన ట్రేడ్ డీల్ జరగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ సంజూ శాంస్న్ను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్కే సిద్దమైనట్లు సమాచారం.
ఐపీఎల్-2025 నుంచి శాంసన్, రాయల్స్ మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో రాజస్తాన్ ఫ్రాంచైజీని వీడాలని సంజూ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి తీసుకోవాలని భావించింది. కానీ రాజస్తాన్, ఢిల్లీ మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోయినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పుడు సీఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సంజూ శాంసన్కు బదులుగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఇచ్చేందుకు సీఎస్కే ప్రాంఛైజీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందుకు రాజస్తాన్ ఒప్పుకోలేదంట. జడేజాతో పాటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ను కూడా ఇవ్వాలని రాయల్స్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
అందుకు సీఎస్కే కూడా అంగీకరించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే రాజస్తాన్ తమ మనసు మార్చుకుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. రాజస్తాన్ ఇప్పుడు బ్రెవిస్ను కాకుండా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ను జడేజాతో పాటు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
రాజస్తాన్ మాస్టర్ ప్లాన్..
ఒకే దెబ్బకు ఇద్దరు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్లను సొంతం చేసుకోవాలని రాజస్తాన్ ప్లాన్ చేసింది. అయితే అందుకోసం సీఎస్కే రూ. 2.40 కోట్లు చెల్లాంచాల్సి ఉంటుంది. శాంసన్, జడేజా ఇద్దరూ జీతం కూడా రూ. 18 కోట్లే. కాబట్టి ఇది సరిసమాన ట్రేడ్(స్వాప్ డీల్) అవుతోంది.కానీ కుర్రాన్ సీఎస్కే నుంచి రూ. 2.40 కోట్లు అందుకుంటున్నాడు. దీంతో ఆ మొత్తాన్ని రాజస్తాన్ సీఎస్కే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎస్కే-రాజస్తాన్ మధ్య డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అంతేకాకుండా సీఎస్కే యాజమాన్యం తమ జట్టు పగ్గాలను శాంసన్కు అప్పగించే యోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ ఆఖరిలో జరిగే ఛాన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీలు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐ సమర్పించాల్సి ఉంది.
ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..
కామెరూన్ గ్రీన్-2024 సీజన్- ముంబై ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ. 17.5 కోట్లుహార్దిక్ పాండ్యా- 2024 సీజన్- గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ (MI)-రూ. 17.5 కోట్లు
శిఖర్ ధావన్- 2019 సీజన్- సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- రూ. 12.5 కోట్లు
చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా?
Andhra Pradesh
రాజకీయాల్లో నిర్ణయాలు ప్రజావసరాలకు తగ్గట్టుగా ఉండాలి కానీ ద్వేషంతోనో... ప్రత్యర్థికి ప్రయోజనం కలుగుతుందన్న సంశయంతోనో చేయకూడదు. చేస్తున్నది మంచి పనా? కాదా? అన్నది ఆలోచిస్తే రాజకీయాలలో పెడధోరణులు తగ్గుతాయి. అయితే సమకాలీన రాజకీయాలలో ప్రజోపయోగాల కంటే ద్వేషానికే పెద్దపీట పడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ జనసేన, బీజేపీల కూటమి సర్కార్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈర్ష్యా, అక్కసులతో చేస్తున్న కొన్ని పనులు వారికే చేటు తెచ్చిపెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలతోపాటు ఆయన చేసిన అభివృద్దిని కూడా విధ్వంసం చేసే రీతిలో సాగుతోంది.
నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి, సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడు సంకుచిత ధోరణితో ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు అందరిని విస్మయపరుస్తోంది. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించింది. నగరం నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ గా పేరొందిన స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఒక పెద్ద లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, స్వాతంత్ర చరిత్రకు సంబంధించిన విజ్ఞాన వేదిక, రిక్రియేషన్ సెంటర్.. వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుకు సంకల్పించింది. కొన్నిటి నిర్మాణం దాదాపు పూర్తి అయింది. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. దీంతో అంబేద్కర్ మహా శిల్ప కేంద్రానికి గ్రహణం పట్టింది. అధికారంలోకి రావడంతోనే కూటమి పార్టీ నేతలు కొందరు ఈ కేంద్రంపై దాడి చేసి, జగన్, అంబేద్కర్ పేర్లను తొలగించారు.
విమర్శలు రావడంతో అంబేద్కర్ పేరును మాత్రం తిరిగి పెట్టారట. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని పూర్తిగా విస్మరించింది. చివరికి అక్కడ పనిచేసే పనివారికి జీతాలు ఇవ్వడం లేదు. దాంతో వారు పనులు చేయకపోవడంతో ఆ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారైంది. ప్రజా సంఘాలు, దళిత సంఘాలవారు నిరసన తెలిపారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ అక్కడకు వెళ్లి పరిస్థితి చూసి ఒక ప్రశ్న వేశారు. ‘‘నెలకు రూ.పది లక్షలు ఖర్చు చేసి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని పరిరక్షించలేని చంద్రబాబు ప్రభుత్వం రెండు లక్షల కోట్లు వెచ్చించి రాజధానిని ఎలా నిర్మించగలుగుతుంది?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
టీడీపీ అంబేద్కర్ను అగౌరవ పరిచిందంటూ నెటిజన్లు చంద్రబాబు గతంలో చేసిన కొన్ని ప్రసంగాల వీడియోలను బయటకు తీసి ఏకి పారేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం అంతంతమాత్రంగానే ఉంది. 2014 టర్మ్లో టీడీపీ ప్రభుత్వం ఈ మైదానాన్ని చైనా మాల్కు ఇవ్వడానికి ప్రయత్నించిందని, సృ్మతివనం పేరుతో అమరావతిలో ఓ మారుమూల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్లాన్ చేసినా జనాగ్రహం కారణంగా వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అంటారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ మహాశిల్పాన్ని, కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీని నిర్వహణ, పర్యవేక్షణలపై చేతులెత్తేసింది. ఈ తప్పును తొందరగా దిద్దుకోకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో ఏదో తూతూ మంత్రంగా చేసి, ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారట. అంబేద్కర్ కేంద్రమే కాదు... విశాఖలో రిషికొండ మీద జగన్ నిర్మించిన భవనాలను కూడా కూటమి సర్కారు ఏడాదిన్నరగా పాడు పెడుతోంది. బహుశా వీటిని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించవచ్చని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాల నిర్మాణానికి పూనుకుని, కొన్నిటిని పూర్తి చేసి, మిగిలిన వాటిని కొనసాగిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పది కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది. ప్రైవేటీకరణలో భాగంగా ఇంకా మొదలుకాని కొన్ని కాలేజీల టీచింగ్ ఆస్పత్రులకు సంబంధించి విలువైన యంత్ర పరికరాలను ఇతర చోట్లకు తరలిస్తున్నారు. అందులో పులివెందుల కాలేజీ ఎక్విప్ మెంట్ కూడా ఉంది. పులివెందుల అంటే చంద్రబాబు అండ్ కో కి ఉన్న ద్వేషం అలాంటిదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది.
వైఎస్ జగన్ గతంలో కుప్పంలో ప్రభుత్వ స్కూల్ను నాడు-నేడు కింద బాగు చేయించడం, కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వడానికి కృషి చేయడం, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అదే చంద్రబాబు మాత్రం జగన్ నియోజకవర్గమైన పులివెందుల పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. పులివెందులతోపాటు రాయలసీమలోని మదనపల్లె, ఆదోని, ప్రకాశం జిల్లా మార్కుపురం కాలేజీల నుంచి కూడా పరికరాలను తరలించారని వార్తలు వచ్చాయి. ఇది ఆ ప్రాంత ప్రజలలో ఆవేదన మిగుల్చుతుందని చెప్పాలి.
టూరిజం రంగానికి చెందిన హోటళ్లు, భవనాలను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుగా ఆసక్తి కలిగిన కంపెనీలను ఆహ్వానించారు.ఇలా ఒక్కొక్క రంగాన్ని ప్రైవేటువారికి అప్పగించేస్తే ప్రభుత్వం ఇక చేసేది ఏముంటుందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలతో పాటు, ఆయా నిర్మాణాలను నిర్లక్ష్యం చేయడం, ప్రైవేటువారిపరం చేయడం వంటి చర్యల ద్వారా కూటమి సర్కార్ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది.దీనికంతటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న ద్వేషమే కారణంగా కనిపించడం లేదా!

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
సాక్షి, తాడేపల్లి: నేడు సీపీ బ్రౌన్ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీపీ బ్రౌన్కు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సీపీ బ్రౌన్. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సి.పి. బ్రౌన్ గారు. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/8kBc2udUnO
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అధికార టీడీపీ నాయకుడికి చెందిన గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం లభ్యమైంది. ఇంత పెద్ద మొత్తంలో గో మాంసం పట్టుబడటంతో ధార్మిక సంఘాలు.. కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నాయి.
వివరాల ప్రకారం.. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా కోల్డ్ స్టోరేజ్లో పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు సోమవారం ఉదయం గోమాంసం వ్యవహారాన్ని గుట్టు రట్టు చేశారు. అయితే, గోడౌన్లో లక్షా 89వేల కేజీల గోమాంసం పట్టుబడితే అసలు సూత్రధారులను మాత్రం పోలీసులు పట్టుకోకపోవడం గమనార్హం. అధికార టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసులు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. టన్నుల కొద్దీ గోమాంసం ఉండటంతో స్థానికులు షాకవుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని నెటిజన్లు నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్ను సైతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి, తిరుమల: కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో మరో అపచారం జరిగింది. తిరుమల నడకదారిలో మరోసారి మహాపచార ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల ప్రకారం.. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తిన్నారు. ఈ సందర్బంగా కాలినడకన వెళ్తున్న భక్తులు వారిని ఈ అపచారంపై ప్రశ్నించగా.. సదరు సిబ్బంది భక్తులని బెదిరింపులకు గురిచేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో ఘటన జరగడంతో భక్తులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

ఎట్టకేలకు ఈ ఘటనపై టీటీడీ స్పందిస్తూ..‘టీటీడీ ఔట్సోర్సింగ్లో పనిచేసే రామస్వామి, సరసమ్మ అనే ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రామస్వామి, సరసమ్మ అనే ఇద్దరు ఉద్యోగులపై తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించినట్టు తెలిపింది.
నంద్యాల జిల్లా: మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని గాజులపల్లె సమీపంలో ఉన్న వజ్రాలవంకలో వజ్రాన్వేషణ కోసం జనం పోటెత్తుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివస్తున్నారు. వజ్రాలు దొరకకపోయినా వజ్రాలు దొరుకుతున్నాయి.. రూ. లక్షల విలువైనవంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
వజ్రాలు దొరకడం దేవుడెరుగు...వజ్రాన్వేషణ మాటున అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అప్రమత్తమయ్యారు. వజ్రాల కోసం అంటూ కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్ప డం గుర్తించినట్లు తెలిసింది. వంక వెంట కంపచెట్లు, పొదలు ఉండటం కొందరికి కలిసొస్తుంది. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వారు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే కొన్ని ప్రేమ జంటలు సైతం అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం. వజ్రాల వంక దగ్గర జరుగుతున్న వ్యవహారాలపై ఇంటలిజెన్స్ విభాగం, ఎస్బీ పోలీసుల ద్వారా అన్ని వివరాలు సేకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వజ్రాల వంక వద్దకు ఎవరిని రానివ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం రంగంలోకి దిగి ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని, రంగురాళ్లు, సూదిముక్కు రాళ్ల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ హితవు చెబుతూ అక్కడి నుంచి పంపించేస్తున్నారు.
కోనసీమ జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి పంచాయతీ లచ్చురాజు చెరువు గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందిన తండ్రికి కుమార్తె ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కదిలించింది. లచ్చురాజు చెరువుకు చెందిన బడుగు వెంకటరమణ (48) బ్రెయిన్ స్ట్రోక్కు చికిత్స పొందుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు.
ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య అనారోగ్యంతో బాధ పడుతోంది. పెద్ద కుమార్తెకు వివాహమైంది. దీంతో, తండ్రికి చిన్న కుమార్తె శ్రావణి తలకొరివి పెట్టి, దహన సంస్కారాలు నిర్వహించింది. తల్లి అనారోగ్యంతో మంచాన పడటం, తండ్రి మృతి చెందడం, ఇంట్లో మగ పిల్లలు లేకపోవడం, చిన్న కుమార్తె శ్రావణి అంత్యక్రియలు నిర్వహించడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
National
ఢిల్లీ: జాతీయ రహదారులలో రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని దాబాలు, రోడ్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలోని జాతీయ రహదారులపై ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఏఐ, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని, రోడ్డు కండీషన్స్ పైన నివేదిక ఇవ్వాలని కోరింది.
మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయీ ధర్మాసనం ఆదేశించింది. జాతీయ రహదారుల పక్కన దాబాల ఏర్పాటు ప్రమాదాలకు కారణం అవుతున్నదని, ట్రక్కులను రోడ్డుపై ఆపేసి, దాబాలకు వెళ్తున్నారని తెలిపింది. ఆగిన వాహనాలను ఢీకొన్న కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. దీనిని నిరోధించడం అవసరమని సూచించింది. టోల్ చార్జీలు వసూలు చేస్తున్నా రోడ్లు సరిగా ఉండడం లేదని పేర్కొంది. కాగా రాజస్థాన్లోని ఫాలోడీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 18 మంది, శ్రీకాకుళంలో ఈమధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు భారతదేశంపై దాడులకు కుట్ర పన్నుతున్నారని, ఇందుకు బంగ్లాదేశ్ను కొత్త వేదికగా ఎంచుకున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా నిఘావర్తాలకు అందిందని ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.
అక్టోబర్ 30న పాకిస్తాన్లోని ఖైర్పూర్ తమేవాలిలో జరిగిన ర్యాలీలో సీనియర్ ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా సైఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ వీడియోలో ‘హఫీజ్ సయీద్ ఖాళీగా కూర్చోలేదు.. అతను బంగ్లాదేశ్ మార్గంలో భారతదేశంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు’ అని సైఫుల్లా సైఫ్ స్పష్టంగా చెప్పాడు. లష్కర్ ఎ తోయిబా సభ్యులు ఇప్పటికే తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)లో చురుకుగా ఉన్నారని, భారతదేశానికి (ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా) సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
కాగా సయీద్ ‘జిహాద్’ నెపంతో బంగ్లాదేశ్ యువతకు ఉగ్రవాద శిక్షణ అందించేందుకు ఆ దేశానికి సైఫుల్లా సైఫ్ను పంపాడు. ఈ శిక్షణ కార్యక్రమానికి పిల్లలు హాజరుకావడం విశేషం. కాగా ఒక వీడియోలో సైఫ్ పాకిస్తాన్ సైన్యాన్ని ప్రశంసించాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, ఇప్పుడు, అమెరికా మనతో ఉందని, బంగ్లాదేశ్ కూడా మళ్లీ పాకిస్తాన్కు దగ్గరవుతోందని వ్యాఖ్యానించాడు. ఈ వాదనలు కార్యక్రమానికి హాజరైన ధైర్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. కాగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ దోస్తీతో ఏర్పడబోయే ముప్పుపై భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న చొరబాట్లపై నిఘాను తీవ్రతరం చేశాయి.
ఇది కూడా చదవండి: కాశ్మీర్లో కలకలం.. ఉగ్రవాదులతో వైద్యుల దోస్తీ?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పోలీసులు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కశ్మీర్ లోయలో ఒక వైద్యుని నుంచి పోలీసులు ఏకే-47 రైఫిల్తో పాటు కొంత మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న దరిమిలా అతనిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
అరెస్టు అయిన వైద్యుడు వెల్లడించిన వివరాల ఆధారంగా జమ్ముకశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్లో 300 కిలోల ఆర్డీఎక్స్, ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ చేయడంలో, రవాణా చేయడంలో అతని ప్రమేయంపై ఉన్నతాధికారులు ప్రశ్నించారు. పోలీసులు ఆ వైద్యుడిని పుల్వామా జిల్లాలోని కోయిల్ నివాసి ముజామిల్ షకీల్గా గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో వైద్యుని ప్రమేయం ఉన్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేయడంలో షకీల్ సహాయం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారని ‘ఇండియా టుడే’ తన కథనంలో పేర్కొంది.
ఈ కేసులో ఇద్దరు వైద్యుల ప్రమేయం ఉండటంతో జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ ప్రాంతానికి చెందిన అందరు వైద్యులపై దృష్టి సారించారు. వారికి జైష్ ఎ మొహమ్మద్, ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని జేకే పోలీసులతో పాటు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వైద్యులపై ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7/25, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్లు 13, 28, 38, 39 కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కోల్కతా: కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి స్పైస్జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యిదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన స్పైస్జెట్ విమానం కోల్కతాకు చేరుకుంటుండగా, విమానం ఇంజిన్లలో ఒకటి పనిచేయకపోవడాన్ని పైలట్ గుర్తించి, విమానాశ్రయంలో ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానంలో తలెత్తిన సమస్యను గుర్తించిన పైలట్ తక్షణం కోల్కతా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. తరువాత ముంబై నుండి కోల్కతాకు ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎస్జీ 670 విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. రాత్రి 11:38 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లు, వైద్య సిబ్బందితో కూడిన విమానాశ్రయ అత్యవసర ప్రతిస్పందన బృందాన్ని వెంటనే మోహరించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
A Spice Jet flight SG670, from Bombay to Kolkata made an emergency landing as it reported failure in one of the engines. The flight landed safely, and the full emergency has been withdrawn at 23.38: Kolkata Airport Officials
— ANI (@ANI) November 9, 2025
గత నెలలో కోల్కతా నుండి శ్రీనగర్కు వెళ్లే ఇండిగో విమానం ఇంధన లీక్ కారణంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఆ ఇండిగో విమానం 6ఈ-6961లో 166 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారికి విమానయాన అధికారులు వసతి సౌకర్యం కల్పించారు. అవసరమైన మరమ్మతుల అనంతరం విమానం తిరిగి దాని గమ్యస్థానానికి చేరుకుంది.
ఇది కూడా చదవండి: ‘హజ్’ కోటా నిర్థారణ.. ఎందరు వెళ్లొచ్చంటే..
తిరువనంతపురం: ఇకపై కేరళ టూరిస్ట్ బస్సులు కర్ణాటక, తమిళనాడుకు వెళ్లవు. ఆ రెండు రాష్ట్రాలకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేరళ రాష్ట్ర కమిటీ లగ్జరీ బస్సు యజమానుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. దీని వెనుకగల కారణం ఏమిటి? ఆయా రాష్ట్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా? అనే విషయంలోకి వెళితే..
కేరళ నుండి తమిళనాడు, కర్ణాటకకు అంతర్రాష్ట్ర పర్యాటక బస్సు సర్వీసులను (నేడు)సోమవారం సాయంత్రం 6 గంటల నుండి నిలిపివేస్తున్నట్లు లగ్జరీ బస్సుల యజమానుల సంఘం, కేరళ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు రాష్ట్రాలు భారీ జరిమానాలు విధించడం, చట్టవిరుద్ధమైన రాష్ట్ర స్థాయి పన్నులు విధించడం, దీనికితోడు కేరళ ఆపరేటర్లకు చెందిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (ఏఐటీపీ) బస్సులను సీజ్ చేయడం తరచూ జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏజే రిజాస్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం కింద జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఏఐటీపీలు ఉన్నప్పటికీ, కేరళ నుండి వచ్చే పర్యాటక వాహనాలను తమిళనాడు, కర్ణాటకలో ఆపడం, జరిమానా విధించడం, నిర్బంధించడం జరుగుతున్నదని ప్రధాన కార్యదర్శి మనీష్ శశిధరన్ మీడియాకు తెలిపారు. ‘ఏడాదిగా తమిళనాడు అధికారులు కేరళలో రిజిస్టర్ అయిన వాహనాల నుండి ఇష్టారాజ్యంగా పన్ను వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఆపరేటర్లకు, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేరళ ప్రభుత్వం కూడా తమకు సహకరించడంలేదని అన్నారు.
వాహనాలను స్వాధీనం చేసుకుంటున్న కారణంగా చాలా మంది ఆపరేటర్లు అంతర్రాష్ట్ర సేవలను నిర్వహించేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు. ఈ సర్వీస్ సస్పెన్షన్ స్వచ్ఛంద నిరసన కాదని, వాహనాలు, డ్రైవర్లు, ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న చర్య అని అసోసియేషన్ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు సమావేశం కావాలని అసోసియేషన్ అభ్యర్థించింది. అలాగే ఈ సమస్య పరిష్కారానికి అసోసియేషన్ కేరళ రవాణా మంత్రి కేబీ గణేష్ కుమార్కు కూడా ఒక లేఖ రాసింది.
ఇది కూడా చదవండి: ‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు
Family
అయ్యప్ప దీక్షలో అతి ముఖ్యమైన ఘట్టం వనయాత్ర. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ హరిహరసుతుని సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైనది. ఇరుముడిని తలపై పెట్టుకుని..
ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామి
అండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా….'పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియేపళ్లికట్టు శబరిమళైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే'అంటూ ఉత్సాహంగా సాగుతుంది ఈ వనయాత్ర. అయ్యప్ప దీక్షలో ముఖ్యంగా వనయాత్ర సమయంలో, "స్వామియే శరణం అయ్యప్ప" అని భక్తులు చెప్పే ఒక నినాదమే ఈ "కల్లుం ముల్లుం కాలికి మెత్తై". దీని అర్థం ఈ కఠినమైన వనయాత్ర మార్గంలో ఉన్న రాళ్ళు, ముళ్ళు కూడా అయ్యప్ప దీక్షలోని భక్తి, శ్రద్ధ వల్ల వారికి మెత్తగా అనిపిస్తాయని భక్తుల విశ్వాసం.
ఇక ఈ యాత్రలో భాగంగా పుణ్య నదుల్లో స్నానం ఆచరించి...దట్టమైన వృక్షాల మీదుగా వచ్చే ఔషధ గాలులను పీల్చుకుంటూ ఏదో తెలియని భక్తిపారవశ్యంతో ముందుకు సాగిపోతారు. ఇది సాక్షాత్తూ అయ్యప్పస్వామి నడిచివెళ్లిన మార్గం అని చెబుతుంటారు..
వాస్తవానికి మాలధారులు అయ్యప్ప దర్శనంకోసం పెద్దపాదం మార్గంలో కొందరు..చిన్నపాదం మార్గంలో మరికొందరు వెళతారు. అయితే ఈ పెద్దపాదం మార్గం భక్తులకు పలు సవాళ్లును విసురుతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది భక్తి, ఓర్పు, ఆత్మనిర్భరత ప్రాముఖ్యతలను తెలియజేసే గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా పేర్కొనవచ్చు. మరి పెద్దపాదంగా పిలిచే ఈ వనయాత్ర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!
నిజానికి అయ్యప్ప భక్తులు జీవితకాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని అంటుంటారు. పెద్దపాదం అంటేనే వనయాత్ర. ఇది ఎరుమేలి దగ్గర ప్రారంభమయ్యే యాత్ర.. సుమారు 58 కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు స్వామివారి సన్నిధి చేరుకుంటారు. అడవి గుండా సాగే పెద్దపాదం యాత్ర... రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది..ఎక్కడా రోడ్డు కనిపించదు. మధ్య మధ్యలో పక్షులు, జంతువులు, సెలయేర్లు, లోయలు కనిపిస్తాయి. ఈ దారి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లితే ఆ ఫీల్ వేరేలెవెల్.
ఎందుకు వనయాత్ర చేయాలంటే..
ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామిని ( అయ్యప్ప స్నేహితుడు..అనంతరకాలంలో భక్తుడు) ముందుగా దర్శించుకుని అక్కడ పేటతుళ్లై అనే నత్యం ఆడతారు. పేటతుళ్లై తర్వాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్భాణధారియై అయ్యప్పను దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి భక్తుల వనయాత్ర మొదలవుతుంది.అప్పటి రోజుల్లో శబరిమల చేరుకునేందుకు వనయాత్రనే అనుసరించేవారు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చినపాదం యాత్రను ప్రారంభించింది దేవస్థానం. అనంతరం కేరళ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించింది.ఈ ప్రాంతం మొత్తం ఎన్నో వన మూలికలు ఉంటాయి. నడక మార్గంలో ఆ మూలికల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఒక్కసారైనా వనయాత్ర చేయాలంటారు.
రాళ్లు విసరడానికి రీజన్..
పెదపాదం మార్గంలో భాగంగా అళుదా నదినుంచి రెండు రాళ్లు తీసుకుని..ఆ రాళ్లను కళిద ముకుండ అనే ప్రదేశంలో వేస్తారు. పురాణాల ప్రకారం..నిజానికి ఈ మార్గంలో భక్తులు పెరూర్తోడు, కాలైకట్టి వంటి ప్రదేశాలను దాటుతారు. మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తున్నప్పుడు శివకేశవులు కాలైకట్టి వద్ద నిలబడి చూశారని ఇతిహాసం. ఆ నేపథ్యంలోనే భక్తులు అళుదా నదిలో స్నానం చేసి, అక్కడ లభించిన ఒక రాయిని తమతో తీసుకువెళ్లి, మహిషి కళేబరాన్ని పూడ్చిన "కళిడం కుండ్రు"లో వేస్తారుఈ మార్గంలో అన్నిటికన్నా కష్టమైన శిఖరాలంటే కరిమల, నీలిమల. అత్యంత కష్టమైన ఈ మార్గాన్ని దాటేందుకు స్వయంగా స్వామివారు సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం..ఈ వనయాత్ర చేసే భక్తులు, ముఖ్యంగా తొలిసారి వెళ్లే కన్నిస్వాములు, తలపై ఇరుముడి ధరించి మాత్రమే వెళ్లాలి. శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారీ పెదపాదం మార్గం ఓపెన్ చేయరు. కేవలం మకరవిళక్కు సమయంలో ఓపెన్ చేసి...తిరిగి సంక్రాంతి మకర జ్యోతి తర్వాత పెదపాదం మార్గం మూసివేస్తారు.
ఈసారి గట్టి భద్రతతోపాటు అసౌకర్యానికి ఆస్కారం లేకుండా..
ఇక ఈ ఏడాది మండల కాలం ఈ నెల నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. కేరళ ప్రభుత్వం ఈ అటవీ మార్గం గుండా భద్రతా ఏర్పాట్లు కోసం పది లక్షల టెండర్ని కేటాయించింది. ఈసారి మాత్రం రాత్రిపూట నిషేధం, పగటిపూట కొన్ని ఆంక్షలతో ఈ యాత్రకు కావల్సిన సన్నహాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలినడకన వచ్చే భక్తులకు ఈ అటవీ మార్గాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.అడవి జంతువుల బెడద రీత్యా రహదారిపై రాత్రి ప్రయాణం, పగటిపూట ప్రవేశ పరిమితులు కొనసాగుతాయని ఎరుమేలి అటవీ రేంజ్ ఆఫీసర్ హరిలాల్ తెలిపారు. అంతేగాదు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటaల వరకు ప్రయాణానికి అనుమతి ఉంది. అలాగే అడవి జంతువులు ఉనికిని ముందుగా తెలియజేసేలా హెచ్చరికలు, జాగ్రత్తలు వంటి భద్రతా చర్యలు తీసుకునేలా ప్రత్యేకంగా అటవీశాఖకు చెందిన స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే అటవీ సంరక్షణ కమిటీ (VSS, పర్యావరణ అభివృద్ధి కమిటీ(EDC) నేతృత్వంలో అటవీ శాఖ పర్యవేక్షణలో వ్యాపారులకు భద్రత కల్పిస్తామని పేర్కొంది. ఈసారి దారిలో ఆక్సిజన్ పార్లర్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే కలయకెట్టులో ఆరోగ్య శాఖ చికిత్సా కేంద్రం ప్రారంభిస్తామని తెలిపింది. గత సీజన్లలో పాములు, సరీసృపాల దాడుల కారణంగా చాలామంది ప్రమాదాల బారిన పడ్డారు.
ఈసారి అలాంటివి తలెత్తకుండా తక్షణ వైద్య సాయం అందేలా పర్యవేక్షించనున్నారు అధికారులు. కలయకెట్టూ, అలుదాలో ఆస్పత్రి అందుబాటులో లేకపోవడం వల్ల సత్వర చికిత్స అందక భక్తులు ప్రమాదాల బారినపడుతున్నారనేది వాదన. అదీగాకుండా ఎరుమేలి ఆసుపత్రికి తరలించడానికి సత్వరమే వాహనం అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చింది.
(చదవండి: శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!)
ప్రస్తుతం ఆన్లైన్ యూజర్స్, సోషల్ యాప్స్ వాడుతున్న వారు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది సమాజానికి ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలని, ఫాలోవర్స్ని పెంచుకోవాలని, రీల్స్ వైరల్ కావాలని యువతలో ఉన్న తపన వారిని ‘ఏఐ ఫేక్ వీడియో’ వైపు పురిగొల్పుతోంది. ఈ రూపంలో యువతను టెక్నాలజీ కొత్త దారిలోకి నెడుతోంది. సాంకేతికత ద్వారా వచి్చన స్వేచ్ఛను సృజనాత్మకత పేరుతో మాయచిత్రాలుగా మలుస్తున్న ఈ కొత్త ట్రెండ్ నగరంలోని సైబర్ నేర విభాగాలను ఆందోళనకు గురిచేస్తోంది.
సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ టెక్నాలజీ ఎటు దారితీస్తుందోనని విశ్లేషకులు, టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పులి వీడియో వైరల్గా మారింది. ఒక యువకుడు ఏఐ టూల్స్ సహాయంతో తమ కాలనీలో ఒక చిరుత పులి తిరుగుతున్నట్లు వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో సహాజంగా, వాస్తవంగా కనిపించడం వల్ల చాలా మంది భయంతో పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అది వీడియో ఫేక్ అని తెలిసినా.. ఆ క్షణం వరకూ నెటిజన్లను అది నిజమైనదిలా భ్రమింపజేసింది.
ఇదే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ శక్తి. ఇలాంటి ప్రభావాలు రానున్న రోజుల్లో విస్తృతం అవుతాయని నిపుణులు చెబుతున్న మాట. ఇలాంటి ఫేక్ వీడియోలు ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాదు, ప్రధానంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నవీ పెరుగుతున్నాయి. ప్రఖ్యాత నటులు, యూట్యూబర్లు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా ఎవరి వీడియోలైనా ఏఐ సహాయంతో మార్ఫ్ చేసి ‘వైరల్’ కంటెంట్గా మార్చేస్తున్నారు.
సైబర్ చట్టాలు చెప్పేదేంటి?..
భారత చట్టప్రకారం.. ఎవరినైనా తప్పుదోవ పట్టించే, లేదా వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఫేక్ కంటెంట్ సృష్టించడం, షేర్ చేయడం సైబర్ నేరంగా పరిగణించబడుతుంది. ఐటీ యాక్ట్ 2000, ఐపీసీ సెక్షన్ 66డీ, 67, 468, 469, 500 వంటి నిబంధనల కింద ఇటువంటి చర్యలు శిక్షార్హం.దీనికి సంబంధించి దోషిగా తేలితే మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు వేలల్లో, లక్షల్లో జరిమానా విధించవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఫేక్ వీడియోలు తయారు చేయడం ఒక రకమైన నేరం (ఫ్రాడ్)గా పరిగణించబడుతుంది. ఇది ప్రజల్లో భయం లేదా ద్వేషం.. వంటి వాటిని ప్రేరేపిస్తే అది మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని, దీనికి మరింత కఠినమైన శిక్షలు ఉంటాయని చట్టం చెబుతోంది.
యువతలో పెరుగుతోన్న ‘వైరల్’ పిచ్చి..
హైదరాబాద్ యువతలో చాలామంది ఇప్పుడు రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పేరు సంపాదించాలనే ఆరాటంలో ఉన్నారు. ఏఐ యాప్స్ సులభంగా అందుబాటులో ఉండటం, వాటిని వాడటానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకపోవడం వల్ల ఈ ఫేక్ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తోంది. లైక్స్, షేర్స్, కామెంట్స్ రూపంలో వచ్చే డోపమైన్ రష్ వల్ల యువతలో వాస్తవం, నైతిక అంశాల మధ్య సున్నితమైన పరిపక్వత మసకబారుతోందని సైకాలజిస్టులు చెబుతున్నారు.సైబర్ నేర విభాగం ప్రకారం.. 18–28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఈ తరహా కంటెంట్ ఎక్కువగా రూపొందిస్తున్నారు. టెక్ సావీ స్టూడెంట్స్, డిజిటల్ క్రియేటర్స్ పేరుతో ఉండే ఇన్స్టా లేదా యూట్యూబ్ యూజర్లు ఫేక్ కంటెంట్ను ‘ఫన్’గా తీసుకుంటున్నారు. కానీ ఫలితాలు మాత్రం తీవ్రమైనవేనని నిపుణులు చెబుతున్నారు. వైరల్ పేరుతో వాస్తవాన్ని మర్చిపోవద్దు, నేటి ఫేక్ వీడియోస్ రేపటి రోజున నేరం అవుతుందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.
సోషల్ ప్లాట్ఫారమ్ల బాధ్యత..
మెటా, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫారŠమ్స్ కూడా ఇప్పుడు డీప్ఫేక్ డిటెక్షన్ టూల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. అయితే యూజర్లు కంటెంట్ షేర్ చేయడానికి ముందు దాని వాస్తవికతను నిర్ధారించుకోవడం వారి బాధ్యత. ‘షేర్ చేసేముందు చెక్ చేయండి’ అనే కొత్త డిజిటల్ ప్రచారం అవసరం. హైదరాబాద్ వంటి టెక్ సిటీకి ‘ఏఐ ఫేక్ వీడియోలు’ సాంకేతిక అభివృద్ధి కాదు, విలువల సంక్షోభ సూచిక. సాంకేతికత మన చేతిలో ఉన్న అస్త్రం.. దాన్ని వినియోగించే విధానమే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా.. లేక గందరగోళంలో పడేస్తుందా అన్నది నిర్ణయిస్తుంది.డిజిటల్ ఎథిక్స్..
ఇలాంటి వీడియోలు ప్రజల్లో అపోహలు, భయాలు, అనవసర వివాదాలు రేపుతున్నాయి. ఉదాహరణకు చిరుతపులి వీడియో వల్ల ఒక ప్రాంతంలో పిల్లలను బయటకు పంపకూడదని తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం, ఫేక్ సెలబ్రిటీ వీడియోల వల్ల ఫ్యాన్స్ మధ్య ద్వేషం పెరిగి ఘర్షణలకు దారితీసిన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరికి ఇది సమాజంలో తీవ్ర ప్రభావం చూపి.. ‘వాస్తవం’, ‘అవాస్తవం’ అనే అంశాలపై నమ్మకం కోల్పోయే దిశకు చేరే ప్రమాదం ఉంది.ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు, సోషల్ మీడియా కంపెనీలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ‘డిజిటల్ ఎథిక్స్’ అనే అంశాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టడం ద్వారా యువతకు వాస్తవం–వైరల్ మధ్య తేడాను తెలియజెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని నిపుణులు సూచిస్తున్నారు.
నగరాలలో చారిత్రక సౌందర్యం. కోటలలో నిర్మాణ నైపుణ్యం. రాజమందిరాల్లో శిల్పచాతుర్యం. థార్ ఎడారిలో రాజస లాంఛనం. రాజస్థాన్కు మణిమకుటాలు. చిత్రమైన పిచ్వాయ్ కృష్ణుడు. నాథ్ద్వారా స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్. గోల్డెన్ సాండ్స్ టూర్ ఆకర్షణలు. పర్యటనలో మెరుపు వీచికలు.
హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయ్పూర్ చేరడం. ఉదయ్పూర్లో హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం. లంచ్ తర్వాత సిటీప్యాలెస్, లేక్ పిచోలా సందర్శనం. బస ఉదయ్పూర్లో. లేక్ సిటీ విహారం ఉదయ్పూర్లో అడుగుపెట్టినప్పటి నుంచి నగర చారిత్రక సౌందర్యం మెరుపు వీచికలుగా కనువిందు చేస్తుంటుంది. సిటీ ఆఫ్ లేక్స్ అని ఎందుకంటారో నగరంలో ఓ అరగంట ప్రయాణంలోనే తెలుస్తుంది. ఫతే సాగర్, పిచోలా, స్వరూప్ సాగర్, రంగ్ సాగర్, దూద్ తలాయ్ సరస్సులు ప్రధానమైనవి. ఈ సరస్సుల్లో కనీసం రెండయినా అరగంట ప్రయాణంలో కనిపిస్తాయి. వాటి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది.
ఇక చారిత్రక కట్టడాల్లో ఆరు కిలోమీటర్ల సిటీ వాల్, నగరంలో ప్రవేశించడానికి సూర్జా΄ోల్, చాంద్΄ోల్, ఉదయ్΄ోల్, హాథీ΄ోల్, అంబా΄ోల్, బ్రహ్మపోల్, దిల్లీ గేట్, కిషన్పోల్ పేర్లతో ద్వారాలున్నాయి. ఇవి కూడా తారసపడతాయి. ఎయిర్పోర్ట్ నుంచి నగరంలో హోటల్ గదికి చేరే లోపే రెండు లేక్లు, రెండు ద్వారాలు, చేతక్ సర్కిల్ పర్యాటకులను చరిత్రయుగంలోకి తీసుకెళ్తాయి. పిచోలా సరస్సు ఒడ్డున సిటీ ప్యాలెస్. సరస్సు మధ్యలో లేక్ ప్యాలెస్, ఒక వైపుగా జగ్మందిర్, జగ్మోహన్ ప్యాలెస్లను పడవలో విహరిస్తూ చుట్టిరావచ్చు.
కొంతకాలంగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాషన్ ఐకాన్ గోమాత ప్రింట్. ఫ్యాషన్ డిజైనర్లు చీరలు, చుడీదార్ల మీద గోమాత బొమ్మను డిజిటల్ ప్రింట్ చేస్తున్నారు. ఈ గోమాత చిత్రలేఖనం జగ్మందిర్ గోడల మీద కనిపిస్తుంది. లేక్కు మరొక ఒడ్డున దర్బార్హాల్ ఉంది. బొమ్మలతో కొలువు దీరిన దర్బార్హాల్ నాటి రాజకొలువును తలపిస్తుంది.
2వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత సజ్జన్గఢ్ ఫోర్ట్ విజిట్. ఆ తర్వాత హల్దీఘాటీకి ప్రయాణం. మహారాణా ప్రతాప్ మ్యూజియం సందర్శనం తర్వాత నాథ్ద్వారాకు ప్రయాణం. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ విజిట్ తర్వాత హోటల్ గదికి చేరడం. బస ఉదయ్పూర్లోనే.సినీ ప్యాలెస్
సజ్జన్గఢ్ ప్యాలెస్కు ప్రయాణం మొదలైన తరవాత ఉదయ్పూర్ నగర శివారు నుంచి మలుపు తిరగ్గానే జనసమ్మర్దం కొరవడుతుంది. దూరంగా కొండ మీద మూడు వేల అడుగుల ఎత్తులో చిన్న నిర్మాణం కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే అక్కడ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించడానికి జరిగిన ఏర్పాట్లు అర్థమవుతాయి. అటవీ ప్రదేశం మధ్యలో వాహనం వెళ్లడానికి మార్గం ఉంది. వెకేషన్కి వచ్చిన వాళ్లు ఒకరోజు ఈ ట్రెకింగ్కు కేటాయించవచ్చు.మేవార్ రాజు సజ్జన్సింగ్ ఖగోళ పరిశోధన, అధ్యయన కేంద్రం ఏర్పాటు కోసం నిర్మించిన ప్యాలెస్ ఇది. సజ్జన్సింగ్ మరణం తర్వాత ఆ ఉద్దేశం నెరవేరలేదు. అటవీ ప్రదేశం నేపథ్యంలో ఒక కోట కేంద్రంగా కథ నడిచే సినిమాల్లో ఈ ప్యాలెస్ కనిపిస్తుంది. జేమ్స్ బాండ్ సినిమా అక్టోపసీ సినిమాలో రోజర్మూర్ ఈ కోట నుంచి పారిపోయే సన్నివేశం చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ద చీటా గర్ల్స్ వంటి మరికొన్ని సినిమాలకు కూడా ఈ ప్యాలెస్... విజువల్ రిచ్నెస్నిచ్చింది.
రాణాప్రతాప్ పోరుగడ్డ
మేవార్ రాజ్యానికి మొఘల్ పాలకులకు మధ్య యుద్ధం జరిగిన పోరుగడ్డ హల్దీఘాటీ. మేవార్ రాజ్యం తరఫున రాణా ప్రతాప్, మొఘల్ సామ్రాజ్యం తరఫున మాన్సింగ్ యుద్ధంలో పాల్గొన్నారు. ఉదయ్పూర్ నుంచి ఈ ప్రదేశానికి వెళ్లే మార్గం ఒక అడ్వెంచరస్ టూర్ని తలపిస్తుంది. కొండల నడుమ కనుమ గుండా దట్టమైన అడవి మధ్యలో సాగుతుంది ప్రయాణం. దాదాపుగా 30 కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిలో ఎర్రదనం తగ్గుతూ పసుపు చారలు మొదలవుతాయి. కొంతదూరం వెళ్లేసరికి నేల గోరంత పసుపురాసుకున్నట్లు ఉంటుంది.యుద్ధభూమికి చేరే లోపు చేతక్ స్మారకం పాలరాతి నిర్మాణం కనిపిస్తుంది. రాణాప్రతాప్కు ఇష్టమైన గుర్రం, ఎన్నో విజయాలను సాధించి పెట్టిన గుర్రం ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. అక్కడి నుంచి బరువెక్కిన గుండెతో హల్దీఘాటీకి చేరతాం.
యుద్ధక్షేత్రానికి చేరే లోపే ఆకాశమంత ఎత్తులో ఠీవిగా సింహాసనం మీద ఆసీనుడైన రాణాప్రతాప్ కంచు విగ్రహం కనిపిస్తుంది. అక్కడ నిర్మించిన భారీ మ్యూజియాన్ని చూస్తే రాణాప్రతాప్ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. హల్దీఘాటీలో జరిగిన యుద్ధంలో రాణాప్రతాప్ తన రాజ్యాన్ని మొఘలుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు.
రాజస్థాన్ కృష్ణుడు
ఇక్కడ శ్రీకృష్ణుడిని శ్రీనాథ్గా పిలుచుకుంటారు. వల్లభాచార్యుడి సంప్రదాయం శుద్ధ అద్వైతాన్ని ఆచరిస్తారు. స్థానికులు గోవర్ధన గిరిధారి రూపంలో ఉన్న కృష్ణుడిని కొలవడమే కాదు, ఇక్కడ చిత్రకారులు కూడా ఈ రూపంలో కృష్ణుడి బొమ్మలో వేయడంలో నిష్ణాతులు. వీరిది ప్రత్యేకమైన శైలి. ఈ చిత్రాలను పిచ్వాయ్ పెయింటింగ్స్ అంటారు.మేవార్లో విస్తరించిన చిత్రలేఖనాల శైలి ఇది. ఈ టూర్ గుర్తుగా ఒక పెయింటింగ్ కొనుక్కోవడం మరువద్దు. నాథ్ద్వారాకు మరొక టూరిస్ట్ అట్రాక్షన్ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ శివుడి విగ్రహం. విశ్వాస స్వరూపం పేరుతో 369 అడుగుల శివుడి విగ్రహాన్ని 2022లో ప్రతిష్ఠించారు. ప్రపంచంలోని శివుడి విగ్రహాలన్నింటిలోకి ఎత్తైన రూపం ఇదే.
3వ రోజు
బ్రేక్ఫాస్ట్ త్వరగా ముగించుకుని గది చెక్ అవుట్ చేసి జయ్ సల్మేర్కు బయలుదేరాలి. జయ్సల్మేర్లో డెసర్ట్ క్యాంప్లో చెక్ ఇన్. రాత్రి భోజనం, బస అక్కడే.జీవిస్తున్న కోట
జయ్సల్మేర్ కోట ఒక ఊరంత... కాదు, పట్టణమూ కాదు, ఓ మోస్తరు నగరమంత ఉంటుంది. ఈ కోటను క్రీ.శ 12వ శతాబ్దంలో రాజపుత్ర పాలకుడు రావల్ జయ్సల్ నిర్మించాడు. అందుకే ఈ కోటకు జయ్సల్మేర్ అని పేరు. ఇది మన వరంగల్లోని వేయి స్తంభాల గుడి కాలానిది. యునెస్కో ఈ రెండింటినీ వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించింది.జయ్సల్మేర్ కోట లివింగ్ ఫోర్ట్. అంటే ఈ కోటలో జనజీవనం కొనసాగుతోంది. జనజీవితం కొనసాగుతున్న ప్రాచీన కోటలు అరుదుగా ఉంటాయి. జయ్ సల్మేర్ కోట గోడలు పసుపురంగు రాతితో నిర్మించడంతో దీనిని గోల్డెన్ ఫోర్ట్రెస్ అంటారు. ఈ కోటలోని పాలరాతి ఆలయాలు, రాజమందిరాల గోడలకు చెక్కిన గవాక్షాల డిజైన్లను ఎంత సేపు చూసినా ఇంక చాలు అనే సంతృప్తి కలగదు.
ఇంకా ఇంకా చూడాలనే ఉంటుంది. కలంకారీ అద్దకాలు, స్క్రీన్ ప్రింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్లో కనిపించే ట్రెండింగ్ డిజైన్లు ఈ గోడల మీదవే. బాలీవుడ్ ఇండస్ట్రీకి గొప్ప లొకేషన్ ఇది. హమ్ దిల్ దే చుకే సనమ్, షోలే, ద ఫాల్, భజరంగ్ భాయీ జాన్తోపాటు తెలుగు సినిమా కొండపల్లి రాజాలో ఒక పాట చిత్రీకరణ జయ్సల్మేర్ కోటలో జరిగింది.
ఎడారిలో ఓ రాత్రి
రాజపుత్రుల రిచ్ లైఫ్స్టైల్ని ఎక్స్పీరియెన్స్ చేయాలంటే థార్ ఎడారి డెసర్జ్ క్యాంప్లో గడపాలి. సాయంత్రం నీరెండలో బంగారు రజను రాశిపోసినట్లున్న ఎడారి ఇసుకలో జీప్ సఫారీ ఒక రకమైన సంతోషం. ఒంటె మీద విహారం లయబద్ధంగా కదులుతూ ముందుకు సాగుతుంటే మరో లెవెల్ ఎంజాయ్మెంట్. ఇక ఎడారిలో ఆధునిక సౌకర్యాలతో గుడారాలు, చలిమంట, నాటలు, డాన్సులు, రాజస్థానీ రుచులతో చక్కటి భోజనాలు పూర్తయిన తర్వాత గుడారంలో నిద్ర. తెల్లవారే సరికి అంతా కలలోలాగ గడిచిపోతుంది.4వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత డెసర్ట్ క్యాంప్ బస నుంచి చెక్ అవుట్ అయి జయ్ సల్మేర్ కోటకు ప్రయాణమవ్వాలి. కోట తర్వాత పట్వోన్ కీ హవేలీ, గాడిసర్ లేక్ విహారం తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, డిన్నర్, బస జయ్సల్మేర్ సిటీలో.శిలకు పూచిన పూలు
జయ్ సల్మేర్ కోటలో ఒక ఆర్కిటెక్చురల్ అద్భుతం ఈ హవేలీ. దూరం నుంచి చూస్తే గోడల నిండుగా పెయింటింగ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి చూస్తే అవన్నీ గోడకు పూసిన పూలే. కొన్ని శిలకు చెక్కిన విరిశిల్పాలు, మరికొన్ని కట్టడంలో గోడకు పూలతీగలు, విరిసిన పూలను నిర్మించారు. వాటికి రంగులద్దారు. భవనంలో విరిసిన ఉద్యానవనం విరిసినట్లుంది. ఈ హవేలీ క్రీ.శ 18వ శతాబ్దం నాటి నిర్మాణకౌశలానికి నిలువెత్తు నిదర్శనం.
5వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత జో«ద్పూర్కు ప్రయాణం. మెహరాన్గఢ్ కోట వీక్షణం తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, డిన్నర్, రాత్రి బస జోద్పూర్లో.విజయద్వారాల కోటఉదయ్పూర్ నగరంలో ద్వారాలున్నట్లే ఇక్కడ కూడా ద్వారాలున్నాయి. అయితే ఇవి కోట నిర్మాణ సమయంలో కట్టినవి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో నిర్మించినవి.జయ్΄ోల్ను జయ్పూర్, బికనీర్ రాజ్యాలతో యుద్ధం చేసి గెలిచిన సందర్భంలో మహారాజా మాన్సింగ్ కట్టాడు. మొఘలుల మీద గెలిచినప్పుడు ఫతేపోల్ నిర్మాణం జరిగింది. లోహ΄ోల్ దగ్గర గోడ మీద మహిళల చేతి ముద్రలను చూడగానే మనసు బరువెక్కుతుంది, స్త్రీలకు జరిగిన అన్యాయానికి సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన నేపథ్యం అది. భర్తను కోల్పోయిన రాణులు, యువరాణులు సతిలో పాల్గొనే ముందు తమ చేతిముద్రలను గోడకు అద్దేవారు.
నాటి దురాచానికి నిదర్శనంగా ఆ ఆనవాళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. మెహరాన్గఢ్ కోటలోపల మోతీమహల్, ఫూల్ మహల్, శీష్ మహల్లు అందమైన నిర్మాణాలు. ఇక్కడ మ్యూజయంలో బంగారు పల్లకి ఉంది. కోట పై భాగంలో పెద్ద ఫిరంగిని చూడగానే కొద్దిగా భయం వేస్తుంది. మనసు కుదుటపరుచుకున్న తర్వాత అక్కడి నుంచి చూస్తే నగరం వ్యూ అందంగా ఉంటుంది.
6వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ఉమైద్ భవన్ ΄్యాలెస్ మ్యూజయం వీక్షణం తర్వాత మధ్యాహ్నం జో«ద్పూర్ ఎయిర్΄ోర్టులో డ్రాప్ చేస్తారు. విమానం సాయంత్రం ఐదున్నరకు బయలుదేరి ఏడున్నరకు హైదరబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఉపాధి హామీ భవనం
రాజపుత్రుల కోటలు, ప్యాలెస్లలో ఉమైద్ భవన్ ప్యాలెస్ కొత్తదనే చెప్పాలి. ఇది 20వ శతాబ్దపు నిర్మాణం. ఇది అత్యంత ఆధునికమైన నిర్మాణం. క్రీ.శ 1929లో మొదలై, 1943లో పూర్తయింది. అప్పటికే దేశంలో బ్రిటిష్ వలస పాలన వేళ్లూనుకుని ఉంది. వలస పాలకులు వద్దంటూ స్వాతంత్య్రం కోసం పోరాటం కూడా ఊపందుకుని ఉంది. అలాంటి సమయంలో ఇంత పెద్ద నిర్మాణం చేపట్టడానికి కారణం అనావృష్టి. అవును వరుసగా మూడేళ్లుగా వర్షాలు లేక పంటలు వేసే అవకాశం లేక పొలాలు బీళ్లుగా మారాయి.రైతులకు పని లేదు. అలాంటి సమయంలో ఉపాధి కల్పన కోసం మహారాజా ఉమైద్ సింగ్ ఈ నిర్మాణాన్ని తలపెట్టాడు. రోజూ రెండు నుంచి మూడు వేల మంది పని చేసేవారు. మఖరానా మార్బుల్, బర్మా టేకుతో నిర్మాణపరంగా ప్రత్యేకమైనదే. ప్రస్తుతం ఇది తాజ్ హోటల్స్ నిర్వహణలో ఉంది. కోటలో కొంత భాగం, మ్యూజియంలోకి పర్యాటకులను అనుమతిస్తారు.
ప్యాకేజ్ పేరు: గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్థాన్.
ప్యాకేజ్ కోడ్: ఎస్హెచ్ఏ 20. ఇందులో ప్రధానంగా ఉదయ్పూర్, జై సల్మీర్, జోద్పూర్ కవర్ అవుతాయి.టారిఫ్ ఇలా: సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 49,650 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 38 వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 36,550 రూపాయలు.
ప్రయాణం ఎప్పుడు?
ఆరు రోజుల ఈ పర్యటన నవంబర్ 22వ తేదీన మొదలయ్యి 27వ తేదీతో ముగుస్తుంది. ఇదే టూర్ 23 నుంచి మరొక ట్రిప్ మొదలవుతుంది. అది 28వ తేదీ పూర్తవుతుంది.22వ తేదీ ఉదయం 8.45 గంటలకు 6ఈ 846 విమానం హైదరాబాద్లో మొదలవుతుంది. 10. 25 గంటలకు ఉదయ్పూర్కి చేరుతుంది (23వ తేదీ ట్రిప్కి కూడా ఇదే నంబరు విమానం, ఇదే టైమ్)
తిరుగుప్రయాణం 27వ తేదీన జో«ద్పూర్ నుంచి 6ఈ 6816 విమానం సాయంత్రం 17. 30 గంటలకు బయలుదేరి, 19.25 గంటలకు హైదరాబాద్కు చేరుతుంది.
ప్యాకేజ్లో ఏమేమి వర్తిస్తాయి?
విమానం టికెట్లు (హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్, జోద్పూర్ నుంచి హైదరాబాద్)హోటల్ బస(4 రోజులు), డెసర్ట్ క్యాంప్ బస (ఒకరోజు)
బ్రేక్ఫాస్ట్లు 5, లంచ్ 1, డిన్నర్లు 5 n సైట్ సీయింగ్కి (ఐటెనరీలో ప్రకటించిన ప్రదేశాలకు మాత్రమే) ఏసీ బస్సు
ట్రావెల్ ఇన్సూరెన్స్
ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్
ప్యాకేజ్లో ఇవి వర్తించవు!
భోజనంలో మెనూలో లేకుండా అదనంగా ఆర్డర్ చేసుకున్న పదార్థాలు, పానీయాలుఫ్లయిట్లో ఆర్డర్ చేసుకున్న ఆహారం
సైట్ సీయింగ్లో ఇతర ప్రదేశాల వీక్షణం వంటివి (ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆలయాలు, ప్రార్థనమందిరాలు, ఆసక్తి కలిగించే ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి రవాణా, ఎంట్రీ టికెట్లు, దర్శనం టికెట్ల వంటివి ప్యాకేజ్లో వర్తించవు)
టిప్లు, గైడ్, లాండ్రీ ఖర్చులు
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలై హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో ముగుస్తుంది. కాబట్టి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి చేరడానికి, ఎయిర్పోర్ట్ నుంచి రవాణా ఇందులో వర్తించవు.
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: ఈ కార్తీకంలో ఉసిరితో పసందైన వంటకాలు చేసేద్దాం ఇలా..!)
Telangana
ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ను బీఆర్ఎస్ దాఖలు చేసింది. దీనిని విచారణకు త్వరగా స్వీకరించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో న్యాయవాదులు అభ్యర్థించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని, దీంతో వారు ఇంకా ఎమ్మెల్యేలు గానే కొనసాగుతున్నారని దానిలో పేర్కొన్నారు.
ఈ విషయంలో ప్రొసీడింగ్స్ ఆలస్యం చేస్తే, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ ఇంకా ప్రొసీడింగ్స్ ఎవిడెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయని న్యాయవాదులు పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి రిటైర్ అయ్యేంతవరకు ప్రక్రియను సాగదీయాలని చూస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి..నవంబర్ 24 తో సుప్రీంకోర్టు ముగిసినట్టు కాదని అన్నారు. వచ్చే సోమవారం కేసు విచారణ చేస్తామని తెలిపారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడగా, పంపకాల పర్వానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఉప ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. గెలవడం వాటికి ప్రతిష్టాత్మకంగా మారింది. గత మూడు రోజుల నుంచి బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా అంతటా యథేచ్ఛగా ‘ఓటుకు నోటు’ బేరం సాగుతోంది. ఓటర్లకు ఏ పార్టీ ఎంత పంపిణీ చేస్తోందన్న విషయాన్ని ఒకదానికొకటి ఆరా తీస్తున్నాయి. తామే ఎక్కువ డబ్బులను పంచాలనే ప్రణాళికలు రూపొందించుకుని గడపగడపనూ టచ్ చేస్తున్నాయి.
కొన్ని పార్టీలైతే అపార్ట్మెంట్లో రూ.2,500, బస్తీల్లో రూ.3,000 చొప్పున పంచుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఏ పార్టీవారైనా ఓటర్లకు డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేస్తే.. ప్రత్యర్థి పార్టీ వారు పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసేవారు. ఇప్పుడు ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదు. ‘డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం మాకు వేయండి..’ అంటూ బహిరంగంగానే ఓటర్లకు పిలుపు ఇస్తున్నారు. తాము ఫలానా పార్టీవాళ్లమని కొందరు ఓటర్లు చెప్పినా ‘ఫర్వాలేదు. ఉంచుకోండి’ అంటూ బొట్టుపెట్టి అప్పగింతలు చేసినట్లే చెప్పేస్తున్నారు. ఆయా బస్తీల్లో మహిళా నేతలకు ఈ పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
మధ్యవర్తులకు పండుగే పండుగ..
గత కొద్దిరోజుల నుంచి వివిధ పార్టీల ప్రచారాలకు జనాన్ని తీసుకువెళ్లడంలో కొందరు మధ్యవర్తులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన జనాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రోజువారీగా ఇస్తున్నారు. అయితే కొందరు మధ్యవర్తులు రూ.300 నొక్కేసి రూ.200 చొప్పున మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా పారామౌంట్ కాలనీలో తమకు రూ.500 ఇవ్వాల్సిందేనంటూ ప్రచారానికి హాజరైన మహిళలు మధ్యవర్తి ముందు బైఠాయించారు. ‘రూ.200 ఇస్తాను తీసుకోండి.. లేదంటే వెళ్లండి’ అంటూ సదరు మధ్యవర్తి తెగేసి చెప్పడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇటు మధ్యవర్తులు, అటు కిందిస్థాయి నేతలు అందినంత జేబులో వేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కాస్ట్లీగా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా అడుగు తీసి అడుగు వేస్తే పరిస్థితి డబ్బులు మయమైపోయిందని నేతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బుల ప్రవాహానికి అంతులేకుండా పోయిందని గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికల తీరును చూస్తున్న కొందరు ఓటర్లు పెదవి విరుస్తున్నారు.మూగబోయిన మైకులు
బంజారాహిల్స్: గడిచిన 18 రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వంలో హోరెత్తిన ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. ప్రచార రథాలకు ఏర్పాటుచేసిన మైక్లను సరిగ్గా 6 గంటల సమయంలో నిర్వాహకులు తొలగించడంతో ప్రచారంలో మైకులు మూగబోయాయి. గల్లీ గల్లీలో 58 మంది అభ్యర్ధులు తమ ప్రచార రథాలకు మైకులు ఏర్పాటుచేసుకుని వారి సందేశాలు వినిపించారు. స్వతంత్ర అభ్యర్ధులు కూడా తమ స్థాయికి తగ్గ ప్రచార రథాన్ని తయారుచేసుకుని ఒక మైక్ తగిలించి గెలిస్తే తాము ఏమి చేస్తామో పాటల రూపంలో, ప్రసంగం రూపంలో వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మూడు ప్రధాన పారీ్టలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార రథాలు గల్లీగల్లీలో కదం తొక్కాయి.పాటలు, ప్రసంగాలు తమ పార్టీ మేనిఫెస్టోను తెలియజేస్తూ మైక్ల్లో ఊదరగొట్టారు. ప్రచార రథాలకు ఉన్న మైకులు తొలగిపోవడంతో ప్రచారం కాస్తా ఆకర్షణ కోల్పోయిందనే చెప్పారు. రథానికి మైక్ ఉంటేనే ఉర్రూతలూగించి పార్టీ పాటలతో వచ్చిన జనం ఎక్కువ సేపు ఉండేవారు. కాగా ప్రచార పర్వం ముగియడంతో ఆయా పారీ్టల అభ్యర్థులు పోలింగ్పై దృష్టిపెట్టారు. మంగళవారం ఎన్నికల పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అనుచరులు, ఇతర నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మనీ, మద్యం పంపకాలపైనా తెరచాటు వ్యవహారాలు ప్రారంభించినట్లు గుసగుసలు విని్పస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే తలంపుతో ప్రధాన పారీ్టల నేతలంతా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. చివరికి విజయం ఎవరిని వరిస్తుందో ఈ నెల 14న ఫలితాల వెల్లడి రోజు తెలియనుంది.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి అందెశ్రీ మరణంపై గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ట్ స్ట్రోక్తో అందేశ్రీ చనిపోయారని తెలిపారు. నెల రోజులుగా ఆయన బీపీ మందులు వాడటం లేదు. మూడు రోజలుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైద్యులను సంప్రదించలేదని వెల్లడించారు.
గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ హెచ్వోడీ సునీల్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని ఉదయం 6:20 గంటలకు నేలపై పడిపోయి ఉండగా కుటుంబ సభ్యులు ఆయనను చూశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. 7:20 గంటలకి ఆయన చనిపోయారు. గాంధీ ఆసుపత్రిలో బ్రాట్ డెడ్గా డిక్లేర్ చేశారు. హార్ట్ స్ట్రోక్తో అందేశ్రీ చనిపోయారు. ఛాతిలో అసౌకర్యంతో రెండు రోజులుగా బాధపడుతున్నారు. కానీ వైద్యులను సంప్రదించలేదు. (Ande Sri Death)
గత 5 ఏళ్లుగా ఆయనకు హైపర్ టెన్షన్ ఉంది. ఒక నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదు. ఆరోగ్యం విషయంలో అందెశ్రీ నిర్లక్క్ష్యంగా ఉన్నారు. రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారు. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఉదయమే ఆయనను కుటుంబ సభ్యులు గమనించారు. ఆయన చనిపోయి ఐదు గంటలు అయి ఉండవచ్చు’ అని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని నసురుల్లాబాద్ సమీపంలో పొలం వద్ద రైతు కావలి యాదయ్య ఇల్లు ఉంది. శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర్లో పాము కనిపించడంతో సర్పరక్షకుడు సదాశివయ్యకు సమాచారమిచ్చారు. ఆయన తన శిష్యులైన రవీందర్, భరత్ను పంపగా వారు బండకింద ఉన్న పామును బయటకు తీసేందుకు యత్నిస్తుండగా.. ఒకటి తర్వాత మరొకటి మొత్తం 7 పాములు బయటపడ్డాయి.
బయటపడ్డ పాములు వాన కోయిల (బాండెడ్ రేసర్)లని.. ఆర్ఘోరోజైస్ ఫెసియోలేట శాస్త్రీయనామం గల ఈ పాములు కొలుబ్రిడే కుటుంబానికి చెందినవని, విష రహితమని సర్పరక్షకుడు తెలిపారు. ఈ జాతి పాములు సాధారణంగా ఒకటి, రెండు మాత్రమే కలిసి ఉంటాయని.. అంతకంటే ఎక్కువ ఉండటం అరుదన్నారు. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఒకే ప్రదేశంలో ఉండే అవకాశం ఉందని చెప్పారు.
ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం, ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్లూమ్ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు, పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా : రాజాపేట మండలంలోని రఘునాథపురం అనగానే మదిలో మెదిలేది పవర్లూమ్(మరమగ్గం) పరిశ్రమ. వీటిపై తయారైన కడలుంగీలు జిల్లా పేరును దేశ, విదేశాలకు తీసుకెళ్లాయి. ఇంత ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత ఇక్కడి కార్మికులకే దక్కుతుంది. అర్ధ శతాబ్దానికి పైగా కడలుంగీలు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. గ్రామంలో 800 వరకు పవర్లూమ్స్ ఉండగా అందులో 400 మరమగ్గాలపై కడలుంగీలు తయారు చేస్తున్నారు. ఒక మరమగ్గంపై పది చొప్పున రోజుకు 3వేల వరకు కడలుంగీలు ఉత్పత్తి అవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు.

పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం
సంస్థాన్నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్ సిల్క్ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు.తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి
రఘునాథపురంలో పవర్లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బైపిక్ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ తదితర అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్ మెటీరియల్గా వినియోగిస్తుంటారు.
International
న్యూఢిల్లీ: హజ్ యాత్ర-2026కు సంబంధించి భారత్ కొటా ఎంతనేది నిర్ణారణ అయ్యింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సౌదీ అరేబియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా జెడ్డాలో ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. 2026 హజ్ యాత్రకు భారత యాత్రికుల కోటా ఇప్పుడు 1,75,025గా నిర్ధారణ అయ్యింది.
మంత్రి రిజిజు నవంబర్ 7 నుండి 9 వరకు సౌదీ అరేబియాలో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా సౌదీ హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరుదేశాల సమన్వయం, లాజిస్టిక్స్ ఏర్పాట్లు మొదలైన అంశాలపై దీనిలో చర్చించారు. భారత యాత్రికుల కోసం అవసరమైన ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
A significant step in deepening the India–Saudi Arabia ties 🇮🇳🤝🇸🇦
Held a Bilateral Meeting & signed the Bilateral Haj Agreement with H.E. Dr. Tawfiq bin Fawzan Al-Rabiah, Minister of Hajj & Umrah, Kingdom of Saudi Arabia. Haj Quota of 175,025 has been secured for Indian Pilgrims… pic.twitter.com/Yonkj8U0LT— Kiren Rijiju (@KirenRijiju) November 9, 2025
ఈ సమావేశం తర్వాత, రెండు దేశాల ప్రతినిధులు హజ్- 2026 కోసం ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. హజ్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను, టెర్మినల్ వన్, హరమైన్ స్టేషన్తో సహా జెడ్డా, తైఫ్లోని హజ్, ఉమ్రా తదితర ప్రదేశాలను మంత్రి సందర్శించారు. భారత్-సౌదీ అరేబియా సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని రిజిజు ‘ఎక్స్’ లో రాశారు.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో కేరళ బస్సులు బంద్
Warangal
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025
రంగుల సొబగులుఆనందంగా చుట్టొద్దాం!
వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో పర్యాటకులు, నగరవాసుల అవసరం మేరకు అద్దె కార్లు అందుబాటులో ఉన్నాయి.
వాతావరణం
జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం మంచుకురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి ఎక్కువగా ఉంటుంది.
ఇండియన్
జెజెబెల్
బారోనెట్
టానీ రాజు రకం
కెమెరాలో సీతాకోక చిలుకను బంధిస్తున్న అధ్యయన బృందం
రెక్కలు విప్పిన
80 రకాల జాతులు గుర్తించాం..
ములుగు జిల్లా అడవుల్లో జరిగిన సర్వేలో 80 రకాల సీతాకోక చిలుకల జాతులను గుర్తించాం. అత్యాధునిక కెమెరాల సాయంతో వాటి సంఖ్య, అరుదైన జాతులను గుర్తించాం. వీటితోపాటు రాత్రి పూట సంచరించే చిమ్మటలు (మాత్) గుర్తించడం, వాటికి కావాల్సిన నివాసం, రక్షణ చర్యలపై అటవీశాఖ అధికారులకు వివరించాం.
భవిష్యత్ తరాల కోసమే..
భవిష్యత్ తరాలకు జీవరాశులు, కీటకాల గురించి తెలియజేసేందుకే తెలంగాణలో మొదటిసారి అధ్యయనం చేశాం. ప్రకృతితో మమేకమై మా పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది.
– చిత్రశంకర్,
సైంటిస్ట్,ఎంటమాలజిస్ట్
ఏటూరునాగారం: పూల గనిపై మధుబనిని పీల్చుకునే సప్తవర్ణాల సొగసులు. పట్టుకునేలోపే జారిపోయే పగడాల జీవులు.. ఇంద్రధనస్సు ఇలపై విహరిస్తోందా అన్నట్లుండే సీతాకోక చిలుకలు. పచ్చని వనాల నడుమ మకరందాలు ఆరగిస్తుండగా.. ప్రకృతితో మమేకమైన పరిశోధకులు కెమెరాల్లో క్లిక్మనిపించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ములుగు జిల్లా లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో చేసిన అధ్యయనం ఆదివారంతో ముగిసింది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్తోపాటు మరికొంత మంది అధ్యయన బృందం సభ్యులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సర్వే చేశారు. 80 రకాల నూతన జాతుల సీతాకోక చిలుకలు ఉన్నట్లు ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్కు నివేదిక అందజేశారు. సీతాకోక చిలుకలు మనుగడ కొనసాగించేందుకు పూల మొక్కలు సైతం పెంచాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
– ఇందారం నాగేశ్వర్రావు,
ఓరుగల్లు వైల్డ్ లైఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు
ములుగు జిల్లాలో 80 నూతన జాతుల గుర్తింపు
లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో మూడు రోజులు సర్వే
సెలయేర్ల చాటున దాగి ఉన్న సీతాకోక చిలుకలు
తెలంగాణలో మొట్టమొదటి అధ్యయనం
గీసుకొండ: వలసలు నివారించి సొంత ఊరిలోనే ఉపాధి పనులు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. కాలానుగుణంగా పలు నూతన పనులను ఈ పఽథకంలో చేరుస్తూ కూలీలకు ఉపాధి కల్పిస్తూ రైతులకు ప్రయోజనం కలిగేలా చూస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 2026–2027 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనుల గుర్తింపు ప్రారంభమైంది. ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు ఊరూరా చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు.
శాశ్వత పనులకు ప్రాధాన్యం
ఉపాధి హామీలో 266 రకాల పనులను చేపట్టే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా వ్యవసాయ అనుబంధ, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల అక్టోబర్ 2వ తేదీ నుంచి జిల్లాలో పనుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 30వ తేదీ వరకు కార్యక్రమం పూర్తి కానుంది. నిర్ధేశించిన తేదీల్లో ఆయా గ్రామాల్లో ఒక రోజు ముందు ఉపాధి హామీ కింద ఏఏ పనులు చేపట్టాల్సి ఉందో తెలియజేయాలని రైతులు, కూలీలు, గ్రామస్తులకు సూచిస్తారు. వారు సూచించిన పనులు, స్థలాలను ఉపాధి సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు. దాదాపు ఒక్కో గ్రామంలో పనుల గుర్తింపు కోసం మూడు నాలుగు రోజులు పడుతుందని అంటున్నారు. పనులను గుర్తించిన అనంతరం ప్రాధాన్య క్రమంలో గ్రామాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. శాశ్వత పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు.
గ్రామసభలు, తీర్మానాలు..
గుర్తించిన పనుల వివరాలతో ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో చేపట్టాల్సిన పనులపై గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ, ఉపాధి హామీ అధికారులు ప్రజలతో చర్చిస్తున్నారు. గుర్తించిన పనులను చదివి వినిపిస్తున్నారు. అందరి అభిప్రాయం మేరకు ఆయా గ్రామాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు చేస్తున్నారు. అనంతరం ఆయా మండలాల్లో ఎంపీడీఓతో పాటు ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది గుర్తించిన పనులకు అవసరమయ్యే పనిదినాల సంఖ్య, బడ్జెట్ (కూలీల వేతనాలు, మెటీరియల్కు అయ్యే ఖర్చు)ను పంచాయతీల వారీగా అంచనావేసి రికార్డుల్లో నమోదు చేస్తారు. వివరాలను మండలాల వారీగా క్రోడీకరించి డీఆర్డీఏ కార్యాలయాని కి నివేదించనున్నారు. దీని ఆధారంగానే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులను ఖరారు చేస్తారు.
గ్రామాల్లో ‘ఉపాధి’ పనుల గుర్తింపు
పనుల ఎంపికపై గ్రామసభలు, తీర్మానాలు
నీటి సంరక్షణ, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం
ఈ నెల 30లోపు పూర్తికానున్న ప్రక్రియ
షెడ్ల నిర్మాణాలకు ఆర్థికాసాయం
ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల మేరకు పౌల్ట్రీ షెడ్లను ఉపాధి హామీ కింద నిర్మించనున్నారు. రైతుకు ఒక్కో షెడ్కు యూనిట్కు రూ.85 వేలు అందిస్తారు. దీని ద్వారా రైతు షెడ్ను నిర్మించుకుని 100 నాటుకోడి పిల్లలను పెంచుకోవాల్సి ఉంటుంది. పశువుల పాక యూనిట్కు రూ.96 వేలు ఇస్తారు. ఖచ్చితంగా 3 పశువులు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తారు. మేకలు, గొర్రెల షెడ్ల నిర్మాణానికి యూనిట్కు రూ.98 వేలు అందిస్తారు.
ఉపాధి హామీలో చేపట్టనున్న ముఖ్యమైన పనులు ఇవే..
రైతుల భూముల్లో ఫారం పాండ్ల నిర్మాణం
కొత్తగా ఫీడర్, ఫీల్డ్ చానళ్ల నిర్మాణం, కందకాల తవ్వకాలు
రైతుల భూములకు, ప్రభుత్వ కార్యాలయాలు, శ్మశాన వాటికలకు మట్టి, మొరం రోడ్ల నిర్మాణం
పండ్లు, ఆయిల్ ఫామ్ తోటల పెంపకం
కంపోస్టు పిట్లు, అజొల్లా తొట్ల నిర్మాణాలు
నీటి నిల్వ కోసం ఇంకుడు గుంతలు, రూప్ టాప్ హార్వెస్టింగ్ నిర్మాణాలు
రహదారుల వెంబడి, కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ భవనాల స్థలాల్లో మొక్కల పెంపకం
రైతుల భూముల్లో కొత్తగా బావుల తవ్వకం, చేపల పెంపకం పాండ్ల నిర్మాణం
పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకానికి షెడ్ల నిర్మాణం
సాక్షిప్రతినిధి, వరంగల్:
కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతులను నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్ సప్లయీస్ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.
ఏసీకేల వారీగా వసూళ్లు..
31 మంది రైస్మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లకు వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్కు చెందిన ఇద్దరు రైస్మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్ఓలపై ఏసీబీ అడిషనల్ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సీఎంఆర్లో అక్రమాలపై ఓ వైపు ఏసీబీ మరో వైపు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి ఆరా తీస్తుండడం ఆ శాఖ అధికారుల్లో చర్చనీయాంశమవుతోంది.
పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎస్ఓల తీరు
సీఎంఆర్ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనకేసుకొస్తూ భారీగా నజరానాలు
ఒక్కో ఏసీకేకు రూ.25 వేలకు పైనే.. మిల్లర్ల వద్దే 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
ప్రభుత్వానికి చేరని కస్టమ్ మిల్లింగ్ రైస్.. నాలుగేళ్లుగా పెండింగ్
ఏసీబీ అడిషనల్ డీజీ వరకు ఫిర్యాదులు.. కమిషనర్ పేషీకి సీఎంఆర్ దందా
రంగంలోకి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్.. అక్రమార్కులపై ఏసీబీ ఆరా
ఏళ్లు గడుస్తున్నా ఉదాసీనతే..
ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇదే క్రమంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టారు. ఇదే సమయంలో ఇంకా రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యం 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్న్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నెక్కొండ: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని దీక్షకుంట గ్రామంలో డీఆర్డీఏ, ఎస్బీఐ ఆధ్వర్యంలో మహిళలకు జూట్ బ్యాగుల తయారీ శిక్షణ శిబిరం నిర్వహించారు. గణేష్ పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి అండ్ మార్కెటింగ్ సంఘం భవనంలో ఆదివారం శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జ్యూట్ బ్యాగులను వాడాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ సహకారంతో కుటీర పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు అందుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని 14 మహిళా సంఘాలకు రూ.2.70 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను ఎమ్మెల్యే అందించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ పీడీ రాంరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ పీడీ రేణుకాదేవి, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, నెక్కొండ, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు రావుల హరీశ్రెడ్డి, పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, జిల్లా సమాక్య అధ్యక్షురాలు గుండెబోయిన రజిత, జీడీఎం శ్రీనివాస్, ఏపీఎం రాపాక కిరణ్కుమార్, సీసీ మోహన్బాబు, శిక్షకురాలు అనిత, వీఓఏలు ఏకాంబ్రం, మధుకర్, లత, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పేదలకు గూడు కల్పించడమే లక్ష్యం
నర్సంపేట రూరల్: పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని భానోజీపేట గ్రామంలో మొట్టమొదటి ఇంటిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Vizianagaram
● రూ.50వేలు అందజేసిన మజ్జి సిరిసహస్ర
పార్వతీపురం రూరల్: ఇటీవల పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్శిల్ కౌంటర్ వద్ద జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన రెడ్డి రమేష్కు చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ అపన్నహస్తం అందించింది. ఆ సంస్థ అధినేత ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరిసహస్ర జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు రమేష్ను పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ద్వారా విషయాన్ని తెలుసుకుని తన తండ్రి సూచన మేరకు పరామర్శించినట్లు ఆమె తెలిపారు. చిన్న శ్రీను సోల్జర్స్ తరఫున ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పరామర్శకు ముందు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి ముచ్చటించారు. కార్యక్రమంలో ఆమెతోపాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, బీసీ సెల్ అధ్యక్షుడు గొర్లి మాధవరావు, కౌన్సిల్ సభ్యులు సంగం రెడ్డి లక్ష్మీపార్వతి, సువ్వాడ లావణ్య, యడ్ల త్రినాథ, నాయకులు చింతాడ శైలజ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దొరజమ్ము గ్రామంలో ఆదివారం ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ) ఆవిర్భావ దినోత్సవంతో పాటు బిర్సా ముండా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాడంగి సత్యనారాయణ మాట్లాడుతూ బిర్సా ముండా స్ఫూర్తితో తమ సంఘం పోరాటాలు చేస్తుందన్నారు. ఈనెల 15వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో బిర్సా ముండా జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. రద్దయిన జీవో నంబర్ 3 స్థానంలో ఏజెన్సీలో ఉద్యోగ నియామక చట్టం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న టీచర్స్, సీఆర్టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా సభ్యురాలు భారతి, గోవింద్, ముత్యాలు, వెంకటేశ్వర్లు, భగవాన్, రవి, యోగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం: జిల్లా వేదికగా రెండవ రోజు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆదివారం కొనసాగాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. సోమవారం ఫైనల్స్ నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అంతేకాకుండా జాతీయస్థాయి స్కూల్గేమ్స్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ జిల్లాల నుంచి పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక కస్పా ఉన్నత పాఠశాలలో వసతి కల్పించిన క్రీడాకారులకు స్నానాలు చేసేందుకు అనువైన సదుపాయాలు లేకపోవడంతో పాఠశాల ఆవరణలో ఆరుబయట స్నానాలు చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం బురదమయంగా మారడంతో రోజువారీ శిక్షణకు వచ్చే క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు.
● బాధితుల నరకయాతన
● ఆర్టీసీ పేలుడు బాధితుడు చేతి నుంచి రాయి బయటకు తీసిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు
పార్వతీపురం రూరల్: జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేస్తూ కుదిపేసిన ఆర్టీసీ పార్శిల్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన బాధితులకు నరకయాతన తప్పడం లేదు. తమకేమీ సంబంధం లేని ఓ ఘటన వారిని ఆస్పత్రి పాలు చేసి వారికి, కుటుంబసభ్యులకు తీవ్రమైన బాధను మిగిల్చింది. అయితే బాధితులకు పెద్ద ఆస్పత్రిలో సైతం భరోసా కరువైంది. బాధితుల్లో ఒకరైన రెడ్డి రమేష్ (కలాసీ) వైద్య సేవల్లో ఎదురైన పరాభవం పభుత్వ వైద్య సేవల తీరుకు అద్దం పడుతోంది. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్ను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించగా సుమారు వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అక్కడి వైద్యుల నుంచి కనీస స్పందన కరువైంది. సరైన చికిత్స అందించకుండానే కంటి తుడుపుగా సేవలందించి తమకేమీ పట్టనట్లు డిశ్చార్జ్ చేశారని రమేష్ చెల్లి వాపోయింది. గత నెల 27న ప్రైవేట్ అంబులెన్స్లో చేసేది ఏమీ లేక అర్ధరాత్రి పార్వతీపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. దేవుడిపై భారం వేసి జిల్లా కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో వెలికితీసిన రాళ్లు
సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు రమేష్ రెండు కాళ్లను పరిశీలించి శరీరంలో కాలిన గాయాలకు మెరుగైన చికిత్స అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. అలాగే రెండు కాళ్లకు శస్త్ర చికిత్స చేసి పేలుడు సమయంలో శరీరంలోకి వెళ్లిన రాళ్లను బయటకు తీశారు. దీంతో కేజీహెచ్లో చేసిన కంటి తుడుపు వైద్యం తేటతెల్లమైంది. తాజాగా ఆదివారం రమేష్ చేతికి చేసిన శస్త్రచికిత్సలో అంగుళం పరిమాణంలో ఉన్న మరో రాయిని బయటకు తీయడం గమనార్హం. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు అందించిన సేవలు చూస్తుంటే ప్రభుత్వ వైద్యసేవలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయని, దానికి ఉదాహరణ బాధితుడు రమేష్కు చేసిన శస్త్రచికిత్స అని పలువురు విమర్శిస్తున్నారు.
విజయనగరం: రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో జరగనున్న సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరుకాగా పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది క్రీడాకారులను అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయిపోటీలకు అర్హత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చీఫ్ కోచ్ డీవీ చారిప్రసాద్, పలువురు శిక్షకులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం
సత్తెనపల్లి: 12వ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ చాంపియన్ షిప్ 2025 విజేతగా గుంటూరు నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో నిర్వహించిన 12వ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ చాంపియన్ షిప్ 2025 పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరు టీమ్ చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని విజయనగరం టీమ్, తృతీయ స్థానం అనంతపురం టీమ్ కై వసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు హాజరై మాట్లాడారు. క్రీడలతోపాటు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 415 పోస్టుల్లో 49 పోస్టులు సాఫ్ట్బాల్ క్రీడాకారులకు దక్కడం అభినందనీయమన్నారు.
ట్రాక్టర్ బీభత్సం..
తప్పిన ప్రమాదం
రాజాం సిటీ: మండల పరిధి ఒమ్మి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన చెరుకూరి గణేష్ ద్విచక్రవాహనం నిలుపుదల చేసి ఒమ్మి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో రాజాం నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి మోటార్సైకిల్తో పాటు గణేష్ను, రోడ్డు పక్కన ఉన్న బోనంగి శ్రీహరినాయుడిని ఢీకొని పక్కనున్న బట్టీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గణేష్, శ్రీహరినాయుడు, కూరగాయలు విక్రయిస్తున్న పల్లా నర్సమ్మకు గాయాలయ్యాయి. ఇది గమనించిన మరికొంతమంది స్థానికులు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అప్రమత్తమైన బాధితులను 108 సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
బస్సు, లారీ డీ: ఇద్దరికి స్వల్పగాయాలు
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి, మరడాం మధ్యలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామభద్రపురం నుంచి రెండు వాహనాలు గజపతినగరం వెళ్తుండగా కోమటిపల్లి మరడాం మధ్యలో వెనుక నుంచి లారీని బస్సు ఢీకొనడంతో బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా తోటి ప్రయాణికులు వారిని మరో బస్సు ఎక్కించి పంపించారు. ఈ విషయమై ఎస్ బూర్జవలస ఎస్సై వద్ద ప్రస్తావించగా తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.
● పర్యాటకులను ఆకర్షిస్తున్న బుచ్చి
అప్పారావుజలాశయం
● ప్రత్యేక ఆకర్షణగా కాటేజీ అందాలు
● కార్తీకమాసంలో పెరుగుతున్న పర్యాటకులు
గంట్యాడ: జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో తాటిపూడి ఒకటి. ఇక్కడ ఉన్న ఆహ్లాదకర అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో పర్యాటకులు వనభోజనాల (పిక్నిక్) కోసం వస్తారు. తాటిపూడిలో ఉన్న గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం అందాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. పచ్చని కొండ కోనల మధ్య జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం అందాలు పాపికొండలను తలపించేలా ఉన్నాయి. బోటుషికారు కూడా ఉండడంతో పర్యాటకులు ఆసక్తిగా వస్తున్నారు.
ముచ్చట గొల్పుతున్న కాటేజీ అందాలు
బుచ్చి అప్పారావు జలాశయం అవతల పర్యాటకులు విడిది చేసేందుకు కాటేజీ కూడా ఉంది. పర్యాటకులు ఉండేందుకు రూమ్లు కూడా అందంగా తీర్చిదిద్దారు. ఏసీ, నాన్ ఏసీ రూమ్లు ఉన్నాయి. అంతేకాకుండా కాటేజీ ప్రాంతాన్ని అందమైన పెయింటింగ్స్తో తీర్చిదిద్దడంతో ఆహ్లాదకరంగా అప్రాంతం ఉంది. దీంతో పర్యాటకులు కాటేజీని సందర్శించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ ఉన్న గిరివినాయక విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కాటేజీ ప్రాంతం అరకులో ఉండే అనుభూతిని కల్గిస్తోందని పర్యాటకులు ప్రశంసిస్తున్నారు.
అన్ని సౌకర్యాలు ఉన్నాయి
కార్తీక మాసంలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకుల కోసం కాటేజీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. ఏసీ, నాన్ ఏసీ రూమ్లు కూడా ఉన్నాయి. పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. భోజన వసతి కూడా ఉంది.
సీహెచ్.శేషు, కాటేజీ మేనేజర్
సీతానగరం: మండలంలోని జోగింపేట ఎస్ఓఈ విద్యాలయంలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మూడురోజులు జరిగిన చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. శుక్ర, శని.ఆదివారాల్లో జరిగిన 79వ రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి 398 మంది క్రీడాకారులు 70 మంది అఫీయల్స్ పాల్గొన్నారు.
జాతీయ స్థాయికి ఎంపికై న ప్రతిభావంతులు..
అండర్ 17, అండర్ 19 వ్యక్తిగత, టీం విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి నేషనల్ టీమ్కు ఎంపికై న క్రీడాకారులు వీరే..
అండర్ 19 బాలికలు ఎస్జీఎఫ్ ఏపీటీం–2025
ఆత్మకూరి టింపుల్ ప్రియ–నెల్లూరు. లలిత వై–అనంతపురం.
వేముల ప్రద్యుమ్న లక్ష్మి–నెల్లూరు. రెడ్డి నవ్యసాహితి–కృష్ణా.
అండర్ 19 బాలురు ఎస్జీఎఫ్ ఏపీటీం
మజ్జిరామ్చరణ్తేజ–ఈస్ట్గోదావరి. అల్లుభాస్కరపద్మశార్ముఖ్ రెడ్డి చిత్తూరు. స్వప్న నిహాల్–చిత్తూరు
అండర్ 17 బాలికలు ఎస్జీఎఫ్ 2025....
సెల్వారావు దేవి దీప్తి యాస్వి–ఈస్ట్ గోదావరి. అస్మితా అనిమి–అనంతపురం
లక్ష్మీప్రియా బత్తా–విశాఖపట్నం. జలాది నందిక–కృష్ణా
మధుపాడ మనస్వి–విశాఖ పట్నం
అండర్ 17 బాలురు ఎస్జీఎఫ్ 2025..
భార్గవ్ సునీత్ సాకేత్ ఎం–ఈస్ట్గోదావరి
గండవరపు కార్తీక్– విశాఖపట్నం
కర్రి ఓంకార్– వెస్ట్గోదావరి
(తానీష్ చొప్ప–విశాఖపట్నం
క్రీడాకారులకు అభినందనలు
రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో విజయం సాధించి జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులందరినీ ఎస్జీఎఫ్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు అంబినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె ప్రసన్నకుమార్, ఇన్చార్జి ఎంపీడీఓ వెంకటరావు, వ్యాయామ అధ్యాపక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రామభద్రపురం: మద్యం మత్తు, మితిమీరిన వేగం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు రామభద్రపురం పోలీస్ స్టేషన్ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆవరణంతా కలియదిరిగి పరిశీలించారు. అలాగే వివిధ కేసులకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తక్కువ సిబ్బంది ఉండడంతో పారాది కాజ్వే పాడవడం వల్ల భారీ లారీలు మళ్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ యువత మద్యానికి బానిసవడంతోనే అత్యాచారాలు, తల్లిదండ్రులపై హత్యలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామాలలో బెల్ట్ దుకాణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీస్స్టేషన్కు పనుల నిమిత్తమో, లేక ఫిర్యాదులు చేయడం కోసమో వచ్చిన వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అలాగే రౌడీషీటర్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల లాఠీ పోలీసింగ్ ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది కొరత వాస్తవమేనని, కొద్ది రోజుల్లో కొత్త సిబ్బంది వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ భవ్యారెడ్డి, సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలపై స్పందించాలి
బాడంగి: పోలీస్స్టేషన్లో తమసమస్యల గురించి చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి సమస్యగురించి సావధానంగా విని పరిష్కారానికి కృషిచేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఎస్పీ ఏఆర్.దామోదర్ చెప్పారు. ఈ మేరకు బాడంగి పోలీస్స్ట్షేన్ను ఆయన ఆదివారం సందర్శించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సమస్యలలో లీగల్ పొజిషన్ ఉంటే వారికి స్పష్టంగా చెప్పాలన్నారు. రౌడీషీటర్లు, చైన్స్నాచర్స్, దొంగతనాలు జరగకుండా మరింతగా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్
● విద్యాహక్కు చట్టంలో వెంటనే సవరణలు చేయాలి
● సుప్రీం తీర్పుతో ఉపాధ్యాయుల్లో తీవ్ర
ఆందోళన
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్–1938) విజయనగరం జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశం స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం.బలరాం నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి ఎన్వి.పైడిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ, 2010వ సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టీఈటీ పరీక్ష తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఈ ఏడాది సెప్టెంబరు ఒకటో తేదీన ఇచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో తీవ్రమైన ఆందోళన సృష్టంచిందని తెలిపారు. ఈ తీర్పుపై పునఃపరిశీలన కోసం..ఉపాధ్యాయుల సమాఖ్య తరఫున ఇప్పటికే తిరిగి విచారణ చేయాలని విజ్ఞప్తి పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరిగి విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టానికి వెంటనే సవరణలు చేయాలని, ఎన్సీఈఆర్టీ నిబంధనల్లో మార్పులు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుల సమాఖ్య డిమాండ్ చేసింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్మి ఎన్వీ.పైడిరాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని, పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ ఆర్.కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.వెంకటనాయుడు, జిల్లా సహాధ్యక్షురాలు ఎన్.శ్రీదేవి, అదనపు కార్యదర్మి ఏవీ.శ్రీను, ఉపాధ్యక్షులు మూర్తి, రామారావు, సత్యనారాయణ, విజయనగరం మండలం అధ్యక్షుడు సీహెచ్.పైడితల్లి, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: గురజాడ కళాభారతిలో మూడురోజుల పాటు నిర్వహించిన నాటికపోటీల విజేతల వివరాలను సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు అభినయ శ్రీనివాస్, గెద్ద వరప్రసాద్లు ఆదివారం వెల్లడించారు. జ్యూరీ బహుమతులు మంజునాథ(గేమ్), కుమారి హర్షిణి (అమ్మ చెక్కిన బొమ్మ), మణికంఠ (కిడ్నాప్), ఉత్తమ లైటింగ్ శ్రీకాంత్, ఉత్తమ ఆహార్యం నాగు, ఉత్తమ సంగీతం నాగరాజు, ఉత్తమ రంగాలంకరణ ఎం.సత్తిబాబు, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ పి.బాలాజీ నాయక్ (అసత్యం), ఉత్తమ సహాయనటుడు పి.రామారావు (అసత్యం), ఉత్తమ ప్రతినాయకుడు వై.అనిల్ కుమార్ (అసత్యం), ఉత్తమ ద్వితీయ నటి ఎస్.జ్యోతి (స్వప్నం రాల్చిన అమృతం), ఉత్తమ నటి జ్యోతిరాజ్ భీశెట్టి, ఉత్తమ నటుడు భానుప్రకాష్, ఉత్తమ దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన (అమ్మ చెక్కిన బొమ్మ), ఉత్తమ ద్వితీయప్రదర్శన (స్వప్నం రాల్చిన అమృతం)లకు బహుమతులు లభించాయి. పరిషత్ న్యాయనిర్ణేతలుగా పిటి.మాధవ్ (విశాఖ), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు), చిన్నారావు (శ్రీకాకుళం)లు వ్యవహరించారు.
అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం
గరుగుబిల్లి: గత నెల 27న మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన నల్ల గంగునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి దైవదర్శనం నిమిత్తం వెళ్లగా 28న తిరుమలలోని విష్ణు నివాసం వద్ద తప్పిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేయగా సుంకి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తిరుమలలో పోలీస్శాఖలో పనిచేస్తున్న క్రమంలో వారి కి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తప్పిపోయిన గంగునాయుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానిస్టేబుల్స్ రఘు, తిరుమల శేషులను గ్రామస్తులు అభినందించారు.
విజయనగరం: విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు, ప్రతిభ పాటవాలను మెరుగుపరిచేందుకు బాలలకు నాటిక పోటీలు దోహదపడతాయని హైకోర్టు న్యాయవాది, అంజని ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పువ్వల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఏర్పాటుచేసిన బాలల ఆహ్వాన నాటిక పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటిక పోటీలు నైతిక విలువలు పెంపొందించేందుకు సందేశాత్మకంగా రూపొందించినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గేట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గురాన రాధిక అయ్యలు, ఖాదర్ బాబా దర్గా, దర్బార్ నిర్వాహకుడు, ఏటీకే వెలుగు ఓల్డేజ్ హోమ్ ప్రతినిధి మహమ్మద్ అహమ్మద్ బాబు, జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రా దేవి, కుసుమంచి సుబ్బారావులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వారిలో ఉన్న ప్రజ్ఞాపాటవాలు మిగిలిన వారికి పరిచయం చేసేందుకు, మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. నాటిక పోటీలకు సమన్వయకర్తగా ఈపు విజయ్ కుమార్ వ్యవహరించగా, న్యాయ నిర్ణేతలుగా పసుమర్తి సన్యాసిరావు, గెద్ద వరప్రసాద్, ఆదెయ్య మాస్టారు వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.స్వరూప, గిరిజా ప్రసన్న, డిమ్స్ రాజు, డీవీ సత్యనారాయణ ,గ్రంధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
West Godavari
భీమవరం(ప్రకాశం చౌక్): యువగళంలో పనిచేసిన వారికి, తమ విధేయులుగా ఉన్నవారికి విద్యుత్ స్పాట్ మీటర్ రీడింగ్ కాంట్రాక్టులు అప్పగించేందుకు తెలుగుదేశం నాయకులు తెరదీశారు. దీంతో 20 ఏళ్లుగా ఉన్న సుమారు 450 మంది ఉపాధికి గండి పడనుందని మీటర్ రీడర్లు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని వారి ద్వారా డివిజన్ స్థాయిలోని సూపరింటెండెంట్ ఇంజినీర్కు ఆదేశాలు జారీ చేయించి తమ అనుయాయులకే టెండర్లు దక్కేలా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని పాత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మీటర్ రీడింగ్ లో పూర్తిస్థాయిలో వారి అనుచరులు ఉండాలనే లక్ష్యంతో టెండర్ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారని, విద్యుత్ శాఖ అధికారులు కూడా వారికి వంత పాడుతున్నారని అంటున్నారు.
నిబంధనలు కాలరాసి..
సాధారణంగా ప్రభుత్వ పనులు, సర్వీసులకు సంబంధించిన టెండర్లలో తక్కువ కోట్ చేసిన వారికి టెండర్లు ఖరారు చేస్తారు. అయితే మీటర్ రీడింగ్ టెండర్లలో మాత్రం ఎక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్లు ఖరారు చేసే పనిలో ఉన్నారని తెలిసింది. పాత కాంట్రాక్టర్లు తక్కువ ధరకు టెండర్లు వేయగా టీడీపీ నేతల ఆశీస్సులతో ఎక్కువ ధరకు టెండర్లు వేసిన వారికి ఖరారు కానున్నట్టు కొందరు పాత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అదే జరిగితే టెండర్ నిబంధనలను విద్యుత్ శాఖ అధికారులు కాలరాసినట్టేనని అంటున్నారు.
భీమవరం సర్కిల్లో ఆలస్యం
భీమవరం సర్కిల్ పరిధిలో తాడేపల్లిగూడెం, భీ మవరం, నరసాపురం డివిజన్లు, 9 సబ్ డివిజన్లు (తాడేపల్లిగూడెం టౌన్, పాలకొల్లు టౌన్, ఆచంట, తణుకు, భీమవరం టౌన్, పాలకొడేరు, గణపవరం, ఆకివీడు, నరసాపురం టౌన్) ఉన్నాయి. మొత్తం 20 లక్షల సర్వీసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31తో మీటర్ రీడింగ్ రెండేళ్ల కాంట్రాక్ట్ సమయం ముగిసింది. అప్పటి నుంచి సెప్టెంబర్ వరకు కొత్త టెండర్లు పిలవలేదు. దాంతో పాత కాంట్రాక్టర్లు ఒక కాంట్రాక్ట్కు నెలకి రూ.30 వేల చొప్పున రూ.1.50 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇప్పటివరకూ చెల్లించారు. ఈ సొమ్ము ఏడాది తర్వాత గానీ తిరిగి రాదు. ఇదిలా ఉండగా సెప్టెంబర్లో ఒకసారి టెండర్లు ప్రక్రియ పూర్తికాగా ఎటువంటి కారణాలు తెలపకుండా రద్దు చేశారు. మళ్లీ అక్టోబరు మొదటి వారంలో టెండర్లు పిలిచా రు. టెండర్లు వేసి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఎస్ఏఓ, డీఈ టెక్నికల్, డీఈ ఆపరేషన్ కమిటీ పరిశీలన చేసినా ఇప్పటికీ భీమవరం సర్కిల్ ఎస్ఈ అదేశాలు ఇవ్వలేదు. ఇతర సర్కిళ్లలో టెండర్లు వేసిన 10 రోజులకే వాటిని ఖరారు చేశారు.
ఖరారు కాకుంటే బిల్లింగ్కు నిరాకరణ
టెండర్లు ఖరారు కాకుంటే డిసెంబర్ 1 నుంచి బిల్లింగ్కు నిరాకరించేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు. ఒక్కో కాంట్రాక్టర్ సబ్ డివిజన్కు రూ.5 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించామని, తమ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని టెండర్లను పారదర్శకంగా ఖరారు చేయాలని కోరుతున్నారు.
టెండర్లు ఖరారు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. కూటమి నాయకుల సిఫార్సుతో టెండర్లు వేసిన వారికి కాంట్రాక్ట్ అప్పగించడం, ఇప్పటికే కమిటీకి ఎవరు టెండరు ఎంతకు వేశారో తెలియడంతో కాంట్రాక్టర్ల నుంచి ‘మామూళ్ల’ బేరం కుదరకపోవడం వంటి కారణాలతో ఆలస్యమవుతున్నట్టు ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు ఆలస్యం చేయడంతో పాత కాంట్రాక్టర్లకు సెక్యూరిటీ డిపాజిట్ భారంగా మారింది.
‘పచ్చ’పాతం
అధికార పార్టీ వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు
ఆందోళనలో పాత కాంట్రాక్టర్లు
భీమవరం సర్కిల్లో ఖరారు కాని టెండర్లు
మార్చి 31తో ముగిసిన కాంట్రాక్ట్ గడువు
450 మంది మీటర్ రీడర్ల ఉపాధికి ముప్పు
భీమవరం సర్కిల్లో 20 మంది పాత కాంట్రాక్టర్ల పరిధిలో 450 మంది స్పాట్ రీడర్లు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.18 వేల జీతం అందుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మీటర్ రీడింగ్ కాంట్రాక్ట్లపై టీడీపీ నాయకుల కళ్లు పడ్డాయి. ఏదోరకంగా కాంట్రాక్ట్లను దక్కించుకుని, తమ వారిని మీటర్ రీడర్లుగా పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే 20 ఏళ్లుగా ఇదే పనిని నమ్ముకున్న తాము రోడ్డున పడతామని మీటర్ రీడర్లు ఆందోళన చెందుతున్నారు. చివరకు స్పాట్ మీటర్ రీడర్ పోస్టులను అమ్ముకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
● ప్రమాదకరంగా బేడా మండపం ప్రహరీ గోడ
● వర్షాలతో అండలుగా పడిపోతున్న వైనం
● కర్రలను అడ్డుపెట్టిన ఆలయ అధికారులు
పాలకొల్లు సెంట్రల్ : పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ఆలయానికి పడమర వైపు ప్రహరీ గోడ బేడా మండపం వెనుక భాగంలో సుమారు 15 అడుగుల మేర అండలుగా పడిపోయింది. దీంతో ఆలయం వైపు సరస్వతీ దేవి, కుమారస్వామి, మహిషాసురమర్ధినీ విగ్రహాలు ఉండే ప్రాంతంలో బీటలు తీసినట్టుగా కనిపిస్తుంది. ఆలయ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో భక్తులు ప్రదక్షిణలు చేయకుండా కర్రలు అడ్డుగా కట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పడమర గోడకు వెలుపల వైపు (గోళి గుంట) పురావస్తు శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని ఆనుకుని ఉన్న ఈ గోడ అండలుగా పడిపోయింది. సుమారు ఆరు నెలల క్రితం పురావస్తు శాఖ అధికారులు ఈ గోళీ గుంటను శుభ్రం చేయించారు. స్థలం ఖాళీగా ఉండడంతో వర్షానికి నీరు ఇంకి గోడ పడిపోయిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం చుట్టూ ఉండే ఈ బేడా మండ పం ప్రహరీ గోడతో కలిసి ఉంటుంది. మండపానికి లీకేజీలతో పలుచోట్ల వర్షం నీరు కారుతోంది. అలా గే స్వామివారి సోమసూక్తం వద్ద (జనార్దనస్వామి ఆలయం పక్కన ఉన్న) మండపం పరిధిలో మూడు స్తంభాలు పక్కకు ఒరిగిపోయాయి. మండపం లీకేజీలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పురావస్తు, దేవదాయశాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి పర్వాలేదనడం గమనార్హం. కార్తీకమాసం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆలయ అధికారులు ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలో కర్రలు కట్టారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తే నియంత్రించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.
గతంలో ఉత్తరం వైపు..
గతంలో ఆలయం ఉత్తరం వైపు దక్షిణామూర్తి, నటరాజస్వామి, బాణాసురుడు, దత్తాత్రేయులు, కాలభైరవుడు, నాగేంద్రుడు విగ్రహాలు ఉన్న ప్రహరీ గోడ వెలుపల వైపు (గోశాల వైపు) పడిపోయింది. దానికి మరమ్మతులు చేసి ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. గోడ మొత్తం అడుసుతో కట్టినట్టుగా ఉంది. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పంచారామ క్షేత్రానికి రద్దీ ఎక్కువగా ఉంటుందని, బేడా మండపం ప్రహరీ గోడను పునఃనిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
కార్తీకమాసం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వర్షాలకు ఆలయంలో పడమర వైపు ఉన్న ప్రహరీ గోడ పడిపోవడం దుదృష్టకరం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. భక్తులు తోపులాట లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశాం.
– మీసాల రామచంద్రరావు, ఆలయ చైర్మన్, పాలకొల్లు
ఆలయం బేడా మండపంలో పడమర వైపు ఉన్న ప్రహరీకి వెలుపల వైపు గోడ వర్షాలకు నాని పడిపోయింది. పూర్వం సున్నంతో కట్టిన గోడ కావడమే కారణం. పురావస్తు, దేవదాయ శాఖ అధికారులకు తెలియజేశాం. సోమవారం అధికారులు వచ్చి పరిశీలన చేయనున్నారు. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం.
– ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ ఈఓ, పాలకొల్లు
భీమవరం: ప్రజల హక్కుల పరిరక్షణకు చట్టా లు రూపొందించబడ్డాయని, చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్), జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ జి.సురేష్బాబు అన్నారు. ఆదివారం జాతీయ న్యా య సేవా దినోత్సవం సందర్బంగా సంస్థ ఆ ధ్వర్యంలో స్థానిక ప్రత్యేక ఉపకారాగారంలో ఏర్పాటుచేసిన న్యాయ అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముద్దాయిలతో మాట్లాడి కేసు వివరాలు, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేకపోతే మండల న్యాయ సేవా సంస్థ ద్వా రా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నా రు. జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి జై లులో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. న్యాయమూర్తి మధ్యాహ్న భోజనాన్ని, బియ్యం, పప్పుదినుసులను పరిశీలించారు. బార్ అసో సియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాను ప్యాన ల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని కలెక్టరేట్, డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్న ట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అలాగే మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భీమవరం: మోంథా తుపానుకు పంట నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం నమోదు చేయడంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు ఆదివారం ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో 24 వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా 80 శాతం మంది కౌలు రైతులు పంట కోల్పోయారన్నా రు. 21,236 మంది రైతుల పేర్లు నమోదు చే యగా వీటిలో కేవలం 11,283 మంది కౌలు రైతుల పేర్లు మాత్రమే ఉన్నాయన్నారు. పంట నమోదులో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి కౌలురైతుల పేరున పంట నష్టం నమోదు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసకెళ్లామన్నారు. ఈనెల 18 వరకు పంట న మోదు సమయం పొడిగించాలని, ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి.రామారావు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా సబ్ కమిటీ సమావేశం ఆదివారం నగరంలో నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 3 డీఏలు, సంపాదిత సెలవుల నగదును మంజూరు చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రెడ్డిదొర మాట్లాడుతూ హైస్కూల్ ప్లస్లో ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. పలు సమస్యలపై మాట్లాడారు. నాయకులు యూవీ నరసింహారాజు, జేఎస్ శాస్త్రి, ఎస్.దొరబాబు, జేపీ నారాయణ, కేఎన్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో మోంథా తుపాను నష్టాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం సోమవారం పర్యటించనుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఉంగుటూరు చేరుకుంటారన్నారు. ఉంగుటూరులో ఫొటో ఎగ్జిబిషన్, క్షేత్రస్థాయిలో పంట న ష్టాలను పరిశీలిస్తారన్నారు. అనంతరం తూ ర్పుగోదావరి జిల్లా గోపాలపురం వెళతారన్నారు.
11న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల శంకుస్థాపన ఏలూరు జిల్లాలోని రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈనెల 11న సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన, ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభం నిర్వహించనున్నారని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ద్వారకాతిరుమల మండలంలో రూ.208 కోట్లతో గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, నూజివీడు మండలంలో రూ.110 కోట్లతో రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ల శంకుస్థాపన, చింతలపూడి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్కు ను కూడా ప్రారంభిస్తారన్నారు.
Srikakulam
● ఈ ఏడాది సెప్టెంబరు 27న శ్రీకాకుళం పెదపాడు హైవేపై రెండు వ్యాన్లతో తరలిస్తున్న పశువులను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. జలుమూరు మండలం నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదుచేశారు.
● ఏప్రిల్ 16న కొత్తూరు మండలం బలద సంత నుంచి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను సరుబుజ్జిలి పోలీసులు పట్టుకున్నారు. రెండు వ్యాన్లలో తరలిస్తుండగా భజరంగదళ్ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదుచేశారు.
● మే 25న ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్ వద్ద రెండు వ్యాన్లలో 18 పశువులు పోలీసులకు పట్టుబడ్డాయి. తిలారు సంత నుంచి విజయనగరం జిల్లా అలమండకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదుచేశారు.
హిరమండలం: జిల్లా నుంచి పశువులు అక్రమంగా తరలిపోతున్నాయి. ప్రధానంగా వారపు సంతలను లక్ష్యంగా చేసుకొని మూగజీవాలను తరలిస్తున్నారు. రైతుల ముసుగులో దళారులు ఈ దందాకు పాల్పడుతున్నారు. వయసుపైబడిన పశువులు, ఎక్కువ ఈతలు అయిపోయిన పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో పశువుల అవసరం తగ్గింది. అందుకే ఖరీఫ్, రబీలో అతి ముఖ్యమైన సమయంలో పశువులను వినియోగిస్తున్నారు. ఆ సమయంలో కొనుగోలు చేసి మిగతా సమయాల్లో విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా దళారులు, వ్యాపారులు రంగప్రవేశం చేసి పశువులను తరలించుకుపోతున్నారు.
వారపు సంతల్లో..
జిల్లాలో వారపు సంతలు అధికం. అందునా పశువుల క్రయ విక్రయాలు జరిగే సంతలే ఎక్కువ. ఆమదాలవలస మండలంచింతాడ, కోటబొమ్మాళి మండలం తిలారు–నారాయణవలస, లావేరు మండలం బుడుమూరు, బూర్జ మండలం కొల్లివలస, కంచిలి మండలం అంపురం, మఖరాంపురం, ఒడిశాలోని బరంపూర్, పర్లాకిమిడి, చీకటిలో వారపు సంతలు ఉన్నాయి. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. కొంతమంది దళారులను ఏర్పాటుచేసుకొని పశువులను సేకరిస్తున్నారు. వాటి రవాణాకు మరికొంతమందితో మాట్లాడుకొని వారి సహకారంతో వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీటిలో కబేళాలకే ఎక్కువగా తరలిపోతున్నాయి. సాగు అవసరాలకు తక్కువగానే ఉంటున్నాయి.
నేతల చేతుల్లోనే..
జిల్లాలో వారపు సంతలు ఎక్కువగా రాజకీయ పార్టీల నేతల చేతుల్లో ఉంటున్నాయి. ఒక్కో సంతలో వారానికి కోట్ల రూపాయల పశు క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ప్రధానంగా ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే, జూన్.. సంక్రాంతి, దసరా సమయాల్లో వీటి క్రయ విక్రయాలు అధికం. గత రెండేళ్లలో 2,683కుపైగా పశువులను పట్టుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అంతకు మించి తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలో సంతల నుంచి వారానికి 2 వేల వరకూ పశువులు అక్రమంగా తరలిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసే అధికారం పశుసంవర్థక, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖకు ఉన్నప్పటికీ తూతూమంత్రపు చర్యలకు పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో పర్యవేక్షణ లేక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది.
జాడలేని గోశాలలు..
పోలీసులతో పాటు ఇతర శాఖల తనిఖీల్లో పట్టుబడుతున్న పశువులను సంరక్షించేందుకు జిల్లాలో గోశాల లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో మెళియాపుట్టి మండలంలో ఓ గోశాల నిర్వహించారు. దాని నిర్వహణపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే గోశాల లేకపోవడం కూడా పశువుల తరలింపునకు అడ్డుకట్ట పడకపోవడానికి కారణమనే వాదన ఉంది. ఎందుకంటే పట్టుకుంటే పశువులను ఎక్కడ సంరక్షించాలన్నది ఒక ప్రశ్న. ఆరేళ్ల కిందట సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో ప్రభుత్వం గోశాల నిర్మాణానికి నిర్ణయించింది. అయినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గోవులను పట్టుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస, గుర్జింగివలస ప్రాంతాల్లో ఉన్న గోశాలలకు తరలించాల్సి వస్తోంది. ఇప్పటికై నా జిల్లాలో ఉన్న వారపు సంతలపై దృష్టి సారించడంతో పాటు గోశాలల ఏర్పాటుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
తరలింపు
పశువులను అక్రమంగా తరలిస్తే నేరం. నిబంధనలను అనుసరించి, అన్నిరకాల అనుమతులు తీసుకున్న తర్వాతే పశువులను తరలించాలి. పోలీస్ శాఖపరంగా ప్రత్యేకంగా దృష్టిసారించాం. అక్రమంగా తరలిస్తే కేసులు నమోదుచేస్తాం.
– సీహెచ్ ప్రసాద్, సీఐ, కొత్తూరు
కొండను..టెక్కలి : మంత్రి అచ్చెన్నాయుడి ఇలాఖాలో కంకర అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మైనింగ్ తవ్వకాలకు పంచాయతీ, రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్ తదితర శాఖల నుంచి..ముఖ్యంగా పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉన్నా కోటబొమ్మాళి మండలం కొత్తపేట కొండపై అవేమీ అవసరం లేకుండానే అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ కొండను కొల్లగొట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ, రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రమాదకర రీతిలో..
దే కొండపై ప్రభుత్వ నిధులు వెచ్చించి ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే.. దిగువ భాగంలో అక్రమంగా కంకర తవ్వకాలు చేస్తూ ప్రమాదకరంగా మార్చేస్తున్నారు. ఫలితంగా కొండపై భారీగా గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. పగలు, రాత్రి తేడా లేకుండా భారీ వాహనాలతో కంకర తవ్వకాలు చేస్తున్నారు. పోర్టుకు కంకర తరలింపు నెపంతో జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే కంకర తరలింపు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీస చర్యలు చేపట్టకపోవడంతో తవ్వకాల వెనుక మంత్రి కుటుంబ సభ్యుల బినామీలు ఉన్నారంటూ కొంత మంది బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికై నా అక్రమ తవ్వకాలు ఆపకపోతే ఓవైపు కొండ కనుమరుగైపోవడమే కాకుండా పర్యావరణానికి తీవ్రమైన విఘాతం తప్పదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ చేస్తున్న మైనింగ్ దోపిడీకి అడ్డులేకుండా పోతోంది. మైనింగ్ దోపిడీ కోసమే సోదరుడు ప్రభాకర్ను జిల్లాకు ఇన్చార్జి విజిలెన్స్ ఎస్పీగా నియమించుకున్నారు. రెవెన్యూ పరంగా సొంత సామాజిక వర్గానికి చెందిన ఆర్డీఓ, మైనింగ్ పరంగా టెక్కలి మైన్స్ ఏడీ, పోలీస్ శాఖా పరంగా సొంత సామాజిక వర్గం అధికారులతో పెద్ద ఎత్తున తప్పులు చేయిస్తున్నారు. కొత్తపేట కొండతో పాటు మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, కంకర తవ్వకాల్లో సూత్రధారులు, బినామీల వివరాలను సేకరించాం.
– పేరాడ తిలక్,
వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి
కొత్తపేట కొండతో పాటు ఇతర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులే సూత్రధారులు. అడ్డగోలుగా మైనింగ్ దోపిడీ చేస్తూ ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని దోచుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడం, అక్రమంగా కేసులు నమోదు చేయించడం చేస్తున్నారు.
– సంపతిరావు హేమసుందర్రాజు,
వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, కోటబొమ్మాళి
కొత్తపేట కొండపై కంకర తవ్వకాల విషయంలో ఎటువంటి అనుమతులు లేవు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. భారీగా గోతులు తవ్వేసి ప్రమాదకరంగా మార్చేశారు. రెవెన్యూ, మైన్స్, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు ఇస్తున్నామంటూ తవ్వకందారులు చెబుతున్నారు. మా గ్రామంలో సహజంగా ప్రత్యేకతను సంతరించుకున్న కొండ ఇలా అక్రమార్కులకు బలైపోవడం బాధాకరం.
– దుక్క రామకృష్ణారెడ్డి, కొత్తపేట,
కోటబొమ్మాళి మండలం
వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం పూండి– గోవిందపురంలో రెండు రోజులుగా నిర్వహించిన 69వ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్షిప్ను విశాఖపట్నం కై వశం చేసుకుంది. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఈశ్వరారవు చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీ, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి 13 జిల్లాల నుంచి హాజరైన 600 మంది క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఓటమి చెందిన వారు కుంగిపోకుండా మరింత రాటుదేలి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర స్థాయి విజేతలు వీరే..
అథ్లెటిక్స్ క్రీడల్లో బాలబాలికల చాంపియన్ షిఫ్తో పాటు ఓవరాల్ చాంపియన్షిప్ను విశాఖపట్నం సాధించింది.
●డిస్కస్ త్రో బాలురు విభాగంలో గుంటూరుకు చెందిన మల్లికార్జునరావు ప్రథమ, విశాఖకు చెందిన రాజేష్, రాజు ద్వితీయ తృతీయ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో విశాఖకు చెందిన కె.నందిత, శ్రీకాకుళంకు చెందిన కావ్య, చిత్తూరుకు చెందిన యమున సాయి తొలిమూడు స్థానాల్లో నిలిచారు.
● 200 మీటర్లు బాలుర పరుగు పందెంలో శ్రీకాకుళంకు చెందిన రంజిత్ ప్రథమ, కృష్ణా జిల్లాకు చెందిన చెందిన అశ్వత్ ద్వితీయ, గుంటూరుకు చెందిన ఎఫ్కే మహమ్మద్ తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో గుంటూరుకు చెందిన హాసిని, తూర్పు గోదావరికి చెందిన నిత్యసంతోషి, ఎఫ్.ఉషశ్రీసాయిదుర్గ తొలి మూడు స్థానాలు సాధించారు.
● 600 మీటర్ల బాలికల పరుగులో కర్నూలుకు చెందిన అవతారం, శ్రీకాకుళంకు చెందిన పవిత్ర, అనంతపురం జిల్లాకు చెందిన రిధి తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
● లాంగ్ జంప్ బాలికల విభాగంలో విశాఖకు చెందిన విశాల బొమ్మ రెడ్డి ప్రథమ, ప్రకాశంకు చెందిన చంద్రకళ, వైష్ణవి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
● 100 మీటర్ల బాలికల రిలేలో శ్రీకాకుళం, విశాఖపట్నం, వైఎస్సార్ కడప జిల్లాలు తొలిమూడు స్థానాల్లో నిలవగా, బాలుర విభాగంలో విశాఖ, కర్నూల్, కడప నిలిచాయి. స్థానిక పాఠశాల హెచ్ఎం, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కన్వీనర్ కె.హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కె.తవిటయ్య, ఉపాధ్యక్షుడు రామారావు, ప్రత్యేక ఆహ్వానితులు మెట్ట మోహనరావు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి లక్ష్మణరావు, అథ్లెటిక్స్ పరిశీలకుడు లీలాకృష్ణ, నాగరాజు, పైల గజేంద్ర, పద్యలోచన, చందరశేఖర్, పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అరసవల్లి సూర్యదేవాలయంలో ఆదివారం సాయంత్రం 108 మంది యోగ సాధకులు 108 సార్లు సూర్యనమస్కారాలు చేశారు. విశాఖపట్నానికి చెందిన ఓం ఫ్రీ యోగా సంస్థ ప్రతినిధి డాక్టర్ చిలకా వెంకట రమేష్ ఆధ్వర్యంలో స్థానిక అనివెట్టి మండపంలో యోగా ప్రక్రియలో భాగంగా సూర్యనమస్కారాల సాధన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, యోగా సంస్థ ప్రతినిధులు పి. శాంతారావు, లెండి కళాశాల చైర్మన్ మధుసూదనరావు, చైతన్యప్రసాద్, భాను కుమార్, సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. – అరసవల్లి
వజ్రపుకొత్తూరు: ఆస్తి తగాదాల నేపథ్యంలో సుంకర జగన్నాథపురం గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ వంకల లోహిదాసు తన మరదలు వంకల దానమ్మపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సుంకర జగన్నాథపురంలో మాజీ వీఆర్ఓ వంకల లోహిదాసుడు, అతని తమ్ముడు తవిటినాయుడు (లేటు) భార్య వంకల దానమ్మకు పక్కపక్కనే వారసత్వంగా వచ్చి జీడి తోట ఉంది. ఆస్థి విషయంలో తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తమ భాగంలో ఎందుకు దుక్కి దున్నుతున్నారని దానమ్మ ప్రశ్నించడంతో లోహిదాసు, కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలతో బాధితురాలు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా లోహిదాసు తనకు శ్రీకాకుళంలో బంధువైన టీడీపీకి చెందిన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుసునని, ఏ కేసు పెట్టుకున్నా తనకు ఏమీ కాదని బెదిరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు దానమ్మ ఫిర్యాదు మేరకు వంకల లోహిదాసు, సరస్వతి, ప్రసాద్లపై వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గార: వెలమ కులస్తులందరూ కలిసికట్టుగా అభివృద్ధి పథంలో పయనిస్తూ, మిగిలిన కమ్యూనిటీల పురోగతికి కూడా సహకరిద్దామని వెలమ ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు పిలుపునిచ్చారు. ఆదివారం గార మండలం అంపోలు జిల్లా జైలు సమీపంలోని జిల్లా వెలమ సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు తదితరులు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, యువత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. వెలమల్లో పేద విద్యార్థుల చదువుల కోసం వివరాలు తెలియజేస్తే విద్యాసంస్థల్లో చేర్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం టెన్త్, ఇంటర్మీడియెట్, జేఈఈ మెయిన్స్, డీఎస్సీ, నీట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గొండు స్వాతి, విశ్రాంత ఏసీపీ చింతు మురళీనాయుడు, రీజనల్ ఎన్ఫోర్సుమెంట్ అధికారి కింజరాపు ప్రభాకరరావు, కింజరాపు హరిప్రసాదరావు, ఎంపీపీ గొండు రఘురామ్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అంబటి రంగారావు, బింగి చిట్టిబాబు, దుంగ సుధాకరరావు, చీడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కవిటి : జమేదారుపుట్టుగ గ్రామానికి ఇటుకల లోడుతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ఆదివారం కొజ్జీరియా జంక్షన్ సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటనలో కార్తీక్దాస్ (16) అనే యువకుడు తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. కవిటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం మండలం రత్తకన్న నుంచి కవిటి మండలం జమేదారుపుట్టుగకు ట్రాక్టర్తో ఇటుకల లోడును తీసుకువచ్చే ప్రయాణంలో కొజ్జిరీయా జంక్షన్ వద్ద ట్రాక్టర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కార్తీక్దాస్ ట్రాక్టర్ కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రయత్నం చేశారు. అప్పటికే కార్తీక్దాస్ మృతిచెందాడు. ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హింజలిఘాట్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కార్తీక్దాస్ వ్యక్తిగత పని కోసం వచ్చాడా.. ట్రాక్టర్పై పనిచేసేందుకు వచ్చాడా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు.
Tirupati
మాకు ఇప్పటికే వయసు మీదపడింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాం. పూరింట్లో జీవనం సాగిస్తున్నాం. ఇటీవల జరిగిన రాయలచెరువు ఘటనలో నీటి ప్రవాహానికి మా పూరిల్లు కూలిపోయింది. మేము ప్రాణంతో బతక గలిగాం అంటే దేవుడి దయే. ప్రస్తుత పరిస్థితిల్లో ఈ ఇంటిని బాగు చేసుకునేందుకు మాకు స్తోమత లేదు. ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అలాగూ నెల తం రూ.40 వేలతో పాలిచ్చే ఆవును కొన్నాం. అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడింది. దీనికి నష్టపరిహారం చెల్లిస్తే మా జీవనోపాధికి ఉపయోగపడుతుంది. – మునివేలు, సూర్యపుత్రి
ఇల్లు గడవడమే కష్టంగా మారింది
నేను టమాటా వ్యాపారం చేస్తుంటా. నా భార్య పశుపోషణతో చేదోడుగా ఉంటుంది. రోజూ మదనపల్లె నుంచి టమాటాలను తీసుకువచ్చి పలు దుకాణలు సరఫరా చేస్తుంటా. రాయలచెరువు కట్ట తెగిన రోజు ఇంటి వద్ద 80 బాక్సుల టమాటా ఉంది. నీటి ప్రవాహానికి మొత్తం పోయింది. టమాటా రవాణాకు వినియోగించే వాహనానికి వాయిదాలు కట్టేందుకు ఇంట్లో ఉంచిన రూ.50వేలు కొట్టుకుపోయాయి.అలాగే ఆరు గేదెలు మృతి చెందాయి. పైసా పైసా కూడబెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మాకు ఈ విపత్తు కారణంగా రూ.5లక్షల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం టమాటా వ్యాపారం చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రస్తుతం ఇల్లు గడవడమే కష్టంగా మారింది. – సౌందరరాజ్, అముద, కళత్తూరు దళితవాడ
ఉపాధి పోయింది
నాతో పాటు గ్రామంలో మరో పదిమందికి బీడీలు చుట్టడం ద్వారా ఉపాధి కల్పిస్తున్నా. రాయలచెరువు తెగి మా గ్రామాన్ని నీటి ప్రవాహం ముంచెత్తింది. దీంతో మా ఇంటి వద్ద నిల్వ చేసిన 15 బస్తాల బీడీ ఆకు, 8 బస్తాల పొగాకు, 53 వేల బీడీలు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇంట్లోని వస్తువులు సైతం ప్రవాహంలో వెళ్లిపోయాయి. ఈ విపత్తు కారణంగా మాకు సుమారు రూ.2.5లక్షల వరకు నష్టం వాటిల్లింది. నాకు ఉపాధి పోయింది. ప్రస్తుతం పెట్టుబడికి చేతిలో పైసా లేని పరిస్థితి. నేను గుండె జబ్బుతో బాధపడుతున్నా. ఇటీవలే యాంజియోగ్రామ్ కూడా చేశారు. వయసు మీద పడింది. ఇప్పుడు ప్రభుత్వం చేయూతనందించాలి. – ఎన్.విజయ్ కుమార్
కోలుకోలేని నష్టం
రాయలచెరువు తెగిన ఘటనలో నీటి ప్రవాహం కారణంగా మా కుటుంబానికి రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. మాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి చెందిన 10 పశువులు, చిన్నవాడికి చెందిన 9 పశువులు ఉప్పెన ఉధృతికి మృత్యువాత పడ్డాయి. రెండు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు వాటి ఆచూకీ తెలియలేదు. 20 బస్తాలు బియ్యం నీటి పాలైంది. మా పశువుల కొట్టంలో మూడు లేగదూడలు మాత్రమే మిగిలాయి. వాటికి పాలిచ్చే గేదెలు మృతి చెందడంతో బయటి నుంచి పాలు కొనుగోలు చేసుకుని ఆకలి తీరుస్తున్నాం. ఈ విపత్తు కారణంగా కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సాయం చేస్తే కానీ, కుదుటపడలేం. – నగరం మురగయ్య, సుశీలమ్మ
అంతా పోయింది
రాయలచెరువుల ఘటనలో మాకు అంతా పోయింది. ఏమీ మిగలలేదు. ఇంట్లోని వస్తువులు, పిల్లల సర్టిఫికెట్లు, పాసు పుస్తకాలు, గుర్తింపు కార్డులు గల్లంతయ్యాయి. నాకున్న పది ఆవుల్లో ఏడు మృత్యువాత పడ్డాయి. పంట సాగుకు తెచ్చిపెట్టుకున్న వరి విత్తనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దాదాపు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాలాంటి బాధితులను ఆదుకోవాలి. మా కళత్తూరు దళితవాడ లోతట్టు ప్రాంతంలో ఉంది. మాకు మిట్ట ప్రాంతంలో ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. – కె.సుబ్రమణ్యం
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని కంచనపుత్తూరులో ఎంపీ గురుమూర్తి మంజూరు చేసిననిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆదివారం ఈ మేరకు సర్పంచ్ స్వప్న, మాజీ సర్పంచ్ గురవయ్య పనులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని గంగమ్మగుడికి సిమెంట్ రోడ్డు నిర్మించేందుకు ఎంపీ గురుమూర్తి రూ. 10 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ డాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 80,560 మంది స్వామివారిని దర్శించుకోగా 35,195 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం గ్రీనెన్స్ నిర్వహించనున్నారు. గత సోమవారం కొంత గందరగోళం నెలకొంది. తమ సమస్యకు పరిష్కారం ఉంటుందని వచ్చే వాళ్లకు అధికారులు భరోసా కల్పించాల్సి ఉంది. అలాగే కనీస వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
నేడు డయల్ యువర్ సీఎండీ
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఏపీఎస్సీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తేవాలని ఆయన కోరారు.
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుద్ధి నిర్వహించనున్నారు. ఆనంతరం ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. భక్తులను ఉదయం 9.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 11న, నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
పుంగనూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలల రూపంలో రాష్ట్ర ప్రజలకు రూ.లక్ష కోట్ల ఆస్తి సృష్టించారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న ర్యాలీ పోస్టర్లను ఆదివారం పుంగనూరులో పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏడు కాలేజీలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని కాలేజీలు వినియోగంలోకి వస్తాయన్నారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఆస్తి విలువ రూ.లక్ష కోట్లు అవుతుందని, ఇది ప్రజలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఆస్తి అన్నారు. వీటి పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. పేదలకు వైద్యం, వైద్య విద్య దూరమవుతాయని ఆగ్రహంవ్యక్తంచేశారు. ధనవంతులు, విదేశాల్లో ఉన్నవారు, పొరుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలల్లో సీట్లు పొంది చదువుకుంటారని, విద్య పూర్తయిన తర్వాత వారి స్వస్థలాలకు లేదా విదేశాలకు వెళ్లిపోతారని, దీనివల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమీలేదన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యం, విద్య ఉండాలని వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే, ఇప్పుడు వాటిని చంద్రబాబు పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న నియోజకవర్గ స్థాయి ర్యాలీని విజయవంతం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
నేను పదేళ్లుగా కళత్తూరు పరిసర గ్రామాల్లో చీరలు అమ్ముకుంటూ ఆ వ్యాపారంతో కుటుంబ పోషణ చేసుకుంటున్నా. పది రోజుల క్రితం రూ.70 వేలకు వెంకటగిరిలో చీరలు కొని ఇంట్లో ఉంచా. అందులో రూ.10 వేల విలువైన చీరలను విక్రయించా. అయితే చెరువు తెగి ఒక్క సారిగా వచ్చిన నీటి ప్రవాహానికి ఇంట్లోని చీరలు మొత్తం కొట్టుకుపోయాయి. ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం ఆదుకుంటే గాని వ్యాపారం చేసుకోలేం.
–సీహెచ్ జ్యోతి మణి
బురదలో నిలబడిపోయాం
నాకు ఓ ప్రమాదంలో చేయి పోయింది. ఇక ఏ పని చేసుకోలేక మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యుల సహకారంతో మా కాలనీలోనే మళిగంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయితే రాయలచెరువు తెగిన ఘటనలో ఉప్పెనలా వచ్చిన నీటి ప్రవాహానికి దుకాణం మునిగిపోయింది. అంలోని పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. చివరకు దుకాణం, ఇంటిలో నిండిపోయిన బురదలో నిలబడిపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.రాజా
ప్రశ్నార్థకంగా జీవనం
నేను రోజువారీ నిర్మాణ పనులకు వెళుతుంటా. కాంక్రీట్ మిల్లరు ద్వారా ఉపాధి పొందుతుంటా. ఇళ్లకు శ్లాబు కాంక్రీట్ పనులకు కూలీలను తీసుకుని వెళతా. పని ఉన్న రోజు మిల్లరుకు రూ.1000 అద్దె వస్తుంది. దాంతో పాటు నాకు కూలి కింద మరో రూ.600 ముట్టుతుంది. అయితే రాయలచెరువు ఘటనతో నీటి ప్రవాహానికి నా ఇంటి ముంగిట పెట్టిన కాంక్రీటు మిల్లర్ కొట్టుకుపోయింది. దీంతో మా కుటుంబ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. కాంక్రీటు మిల్లర్ కొత్తది కొనాలంటే రూ.లక్ష కావాలి. రోజు వారీ కూలీగా కుటుంబ పోషణ చేసుకునే నేను ఒక్క సారిగా అంత పెట్టుబడి పెట్టలేని దుస్థితి. ప్రభుత్వం ఆదుకుంటే కానీ, మా బతుకు ముందుకు సాగదు. – కోళ్ల విజయరత్నం
జలప్రళయం అన్నదాతకు గుండెకోత మిగిల్చింది. రాయలచెరువు ఆయకట్టు పరిధిలోని రెండు వేల ఎకరాల మేర ధ్వంసమైంది. పాతపాళెం, పాతపా ళెం దళితవాడ, అరుంధతి వాడ, ఎస్.ఎల్.పురం, కళత్తూరు, ఎం.ఏ రాజులకండ్రిగ గ్రామాల్లో పొలా లన్నీ కోతకు గురయ్యాయి. కోతకు గురై రూపురేఖలే మారిపోయాయి. ఇసుక మేటలు వేశాయి. రాళ్లుతేలిపోయాయి. వీటిని బాగు చేయడానికి భారీగా ఖర్చుచేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆదుకుంటేనే రైతులను గట్టున పడే అవకాశం ఉంది.
పాతపాళెం ప్రాంతంలో
రాళ్లు తేలిన పంట పొలాలు
పాకాల: వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తామని మాజీ వలంటీర్లు స్పష్టం చేశారు. ఆదివారం పాకాలలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పుట్టినరోజుల వేడుకలను పురస్కరించుకుని పది మంది మాజీ వలంటీర్లు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ వలంటీర్లు మాట్లాడుతూ చెవిరెడ్డి పుట్టినరోజే మంచి రోజుగా భావిస్తున్నామన్నారు. జగనన్న పాలనలో తమకు ఎంతో గౌరవం దక్కేదని, సకాలంలో వేతనాలు చెల్లించేవారని వెల్లడించారు. అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి సైతం తమను బిడ్డల్లా చూసుకున్నారని కొనియాడారు. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ఆంక్షల కారణంగా మోహిత్రెడ్డి వెంట నడవలేకపోయామని, జెండాను చేతపట్టుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బహిరంగంగానే పార్టీ జెండాలు పట్టుకుని ప్రజల్లోకి వెళతామని స్పష్టం చేశారు. వలంటీర్లను కూటమి నేతలు దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ఇకపై పార్టీలో కార్యకర్తలుగా క్రియాశీలకంగా పనిచేస్తామని తెలిపారు. మోహిత్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్లను మాత్రమే కాదని, అన్ని రంగాల్లోని ఉద్యోగులను మోసం చేసిందన్నారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నడ్డివిరుస్తోందని చెప్పారు. వలంటీర్లు ఎప్పుడు పార్టీలోకి వస్తామన్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో హేమ, మౌనిక, రేవతి, పూజ, జె.జోషపిన్, కె.జోషపిన్, యువరాణి, ఉన్నామాలీలై, శోభ, అర్చన ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నంగా నరేష్రెడ్డి, విక్రమ్ రెడ్డి, మున్నీర్బాయ్, కపిలేశ్వర్రెడ్డి, సురేష్, రహీమ్భాయ్, హసీనా, రూకేష్ రెడ్డీ, రమేష్, యుగంధర్ చౌదరి, యస్వంత్రెడ్డి, అశోక్, నవీన్, అల్తాఫ్, పవన్కుమార్ పాల్గొన్నారు.
తిరుపతి రూరల్: ‘కూటమి ప్రభుత్వం వచ్చింది.. ప్రతిపక్షంపై నిఘా పెట్టడమే పనిగా పెట్టుకుంది.. ఇంత కాలం నేరాల నియంత్రణ, కీలకమైన కేసుల్లో నిజాలు వెలికి తీయడానికి మాత్రమే ఉపయోగించే ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఇప్పుడు అన్నింటికీ వాడుకుంటోంది. ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్సీపీలో యాక్టివిస్టులను టార్గెట్గా చేసుకుని వరుసగా సిట్ బృందాలను పంపించి కేసులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగానే చెవిరెడ్డిని అక్రమంగా మద్యం కేసులో ఇరికించి 145 రోజులుగా జైలులో పెట్టారు.. మూడేళ్లు గడిస్తే జగనన్న మళ్లీ వస్తారు.. రాజన్న పాలనను తీసుకువస్తారు’అని చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. పాకాలలో జరిగిన చెవిరెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సిట్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చెవిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ప్రజలకు దూరం చేసినా పార్టీ తమకు అండా నిలబడిందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు చెవిరెడ్డి కుటుంబానికి అనుక్షణం రక్షణ కవచంలా నిలబడడం చూస్తుంటే ఎన్నిజన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేమన్న భావన కలుగుతోందన్నారు. సిట్ అధికారులను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు.
జగనన్న వస్తారు.. రాజన్న పాలన మళ్లీ తెస్తారు!
తిరుమల : కార్తీకమాసం సందర్భంగా ఆదివారం తిరుమలలోని పార్వేట మండపంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. శ్రీమలయప్పస్వామిని బంగారు తిరుచ్చిపై వాహన మండపానికి వేంచేపు చేశారు. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం స్వామివారిని చిన్న గజవాహనంపై పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మరో పల్లకిపై ఉభయనాంచారులను రంగనాయక మండపం నుంచి పార్వేట మండపానికి వేంచేపు చేశారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు.
ఐదేళ్ల అనంతరం..
కార్తీక మాసంలో వర్షాల కారణంగా 2020 నుంచి పార్వేట మండపంలో కార్తీక వన భోజనాలు నిర్వహించేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత మహోత్సవం చేపట్టడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠనాథుని సమక్షంలో సహపంక్తి భోజనం చేశారు. టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్యప్రాజెక్టు వారు భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
తిరుపతి సిటీ: జిల్లాలోని వర్సిటీలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు ఈ సారి ఉండవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏపీపీజీసెట్–2025 ద్వారా 45 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రధానంగా ఎస్వీయూలో 51 విభాగాలలోని పీజీ కోర్సులలో రెండు వేల సీట్లకు పైగా సీట్లు ఉండగా ఇప్పటి వరకు 759 మాత్రమే భర్తీ అయ్యాయి. అలాగే పద్మావతి మహిళా వర్సిటీలోనూ 50శాతం సీట్లు భర్తీకి నోచుకోలేదు. ఇది ఇలాఉండగా ఉన్నత విద్యామండలి అకడమిక్ ఇయర్ ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం చేయడం ఇందుకు ప్రధాన కారణమని అధ్యాపకులు, వర్సిటీ అధికారులు ఆరోపిస్తున్నారు.
నిర్వీర్యమే ప్రభుత్వ లక్ష్యమా?
ఏపీపీజీసెట్ కన్వీనర్ కోటా నియామకాలు పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా వర్సిటీలలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి చేపట్ట లేదు. ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఉన్నత విద్యామండలి కవ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు, వర్సిటీలలోని బోధన, బోదనేతర సిబ్బంది మండిపడుతున్నారు. ఈ ఏడాది స్పాట్ అడ్మిషన్లు ఉండవనే సంకేతాలు ఇప్పటికే వర్సిటీ అధికారులకు ఉన్నత విద్యామండలి సూచనా ప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం.
ర్యాగింగ్ భూతంతో అడ్మిషన్లపై ప్రభావం
ఎస్వీయూ ఇటీవల సాక్షాత్తు అధ్యాపకులే సీనియర్లను ప్రొత్సహించి నూతనంగా పీజీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ర్యాగింగ్ చేయమని ప్రోత్సహించారు. ఇప్పటికే ఎస్వీయూలో పలు పీజీ కోర్సులలో అడ్మిషన్లు పొందిన జూనియర్ విద్యార్థులు వర్సిటీలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అలాగే వర్సిటీ స్పాట్ అడ్మిషన్లు చేపట్టినా కనీసం ఐదు శాతం మంది కూడా వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లపై మొగ్గు చూపుతారా అనే అనుమానం ఉంది. దీంతో ఎస్వీయూలో ఈ ఏడాది అన్ని పీజీ కోర్సులలోనూ కనీసం 50 శాతం అడ్మిషన్లు జరుగుతాయనే నమ్మకం లేదని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, సాక్షాత్తు వర్సిటీలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎస్వీయూ పరిపాలనా భవనం
Wanaparthy
●
అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రహదారి మరమ్మతులకు పీజేపీ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నందిమళ్ల క్యాంపు నుంచి ప్రాజెక్టు మీదుగా గద్వాల, రాయచూర్ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది తమ వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. వీటితోపాటు జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల పర్యాటకులు సైతం వస్తుంటారు. 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాజెక్టు ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు రహదారిపై గద్వాలకు వెళ్తుండటంతో అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన పీజేపీ అధికారులు.. నేటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులకు పూనుకోకపోవడంతో రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడం.. మరమ్మతుకు నోచుకోవడంతో రాకపోకల కష్టాలు తొలగిపోనున్నాయి.
అడుగుకో గుంత..
పీజేపీ నందిమళ్ల క్యాంపు నుంచి రేవులపల్లి వరకు జూరాల జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. అడుగడుకో గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల చిన్న గుంతలు, మరికొన్ని చోట్ల రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకల సమయంలో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని భారీ వాహన డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు ఎదురుగా వస్తున్న ద్విచక్ర, ఆటోలను తప్పించబోయి ప్రమాదాల బారినపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టు రూపురేఖలు మారుతాయని ఈ ప్రాంత ప్రజల ఆశలు నేటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతున్నాయి. ప్రస్తుతం రహదారి మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతుకు
రూ.30 లక్షలు మంజూరు
బాగుపడనున్న 4.50 కిలోమీటర్ల రోడ్డు
టెండర్ల ఆహ్వానానికి సిద్ధమవుతున్న అధికారులు
తీరనున్న ప్రయాణికుల కష్టాలు
కుడి, ఎడమ కాల్వల పరిధిలో..
ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు సైతం వ్యయ ప్రయాసాలకోర్చి రాకపోకలు సాగించే దుస్థితి నెలకొంది. దీనికితోడు ఎడమ కాల్వ వద్ద చేప వంటకాల విక్రయ కేంద్రాలు ఉండటంతో పర్యాటకులతో పాటు చేప వంటకాలు ఆరగించేందుకు ప్రజలు రోజు వేలాదిగా సొంత వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. వాహనాలన్నీ కాల్వ సమీపంలోని ప్రధాన రహదారిపై నిలుపుతుండటంతో వచ్చి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాక్టర్ల కొనుగోళ్లలో పుర అధికారుల లీలలు● ప్రతిపాదనలు ఒకలా..వచ్చినవి మరోలా...
● స్వీపింగ్ మిషన్ బాగోతం మరువకముందే మరో ఉదంతం
● అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు
● హడావుడిగా షోరూంకు తిప్పిపంపిన వైనం
రూ.రెండు లక్షల తేడా..
విషయం బయటకు తెలియడంతో అధికారులు గుట్టుగా సదరు కంపెనీకి ట్రాక్టర్లను తిప్పి పంపించే ప్రయత్నం చేశారు. అధికారుల చర్యలు పుర సిబ్బంది, ప్రజల్లో నవ్వుల పాలయ్యేలా చేసిందని చెప్పవచ్చు. ఒక్కో ట్రాక్టర్ ధరలో రూ.2 లక్షల మేర తేడాతో ఉ న్న పాత సాంకేతికత కలిగిన ట్రాక్టర్లను తె ప్పించి కమీషన్లు దండుకునేందుకు ప్రయత్నా లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వనపర్తి: స్థానిక పురపాలికలో 2021లో సుమారు రూ.65 లక్షలు వెచ్చించి స్వీపింగ్ మిషన్ కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతి బాగోతం నాలుగేళ్లు గడిచినా కొలిక్కిరాలేదు. కనీసం నెలరోజులు కూడా వినియోగించని ఈ యంత్రాన్ని మరమ్మతుల పేరిట కొంతకాలంగా ఇతర ప్రాంతానికి తరలించారు. కమీషన్ల కోసం పాత యంత్రానికి రంగులద్ది కొత్తదిగా పేర్కొంటూ అధికార, పాలకవర్గం ప్రజాధనాన్ని వృథా చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం మరువకముందే పుర అఽధికారులు ట్రాక్టర్ల కొనుగోళ్లలో మరో కమీషన్ల వ్యవహారానికి తెరతీయడం జిల్లాకేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
● విస్తరిస్తున్న పట్టణానికి అనుగుణంగా చెత్త సేకరణ, ఇతర అవసరాల కోసం కలెక్టర్ అనుమతితో మూడు ట్రాక్టర్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించారు. ఆధునిక సాంకేతికత కలిగిన ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. కానీ దశాబ్దా కాలానికి ముందున్న ట్రాక్టర్లను తీసుకొచ్చి ఇవే కొత్తవి అంటూ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో అధికారికంగా ప్రారంభింపజేశారు. తీరా పుర డ్రైవర్లు పరిశీలించగా.. ట్రాక్టర్లలోని డొల్లాతనం బయటపడింది. నెలరోజుల తర్వాత అంచనాల్లో పేర్కొన్న సాంకేతికత వేరు.. సదరు కంపెనీ నుంచి అధికారులు తెప్పించిన ట్రాక్టర్లు వేరు అన్న విషయం బయటకు పొక్కింది. పదేళ్ల కిందట కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు పవర్ స్టీరింగ్ ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు పంపిన ట్రాక్టర్లకు పవర్ స్టీరింగ్ లేకుండా ఎలా కొనుగోలు చేస్తారనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు.
విచారణ చేపడతాం..
ట్రాక్టర్ల కొనుగోలులో జరిగిన ఉదంతంపై పుర కమిషనర్తో చర్చించా.. పవర్ స్టీరింగ్ ట్రాక్టర్ల కొనుగోలుకే ప్రతిపాదనలు ఇచ్చాం. సాధారణ స్టీరింగ్తో వచ్చిన ట్రాక్టర్లని ఆలస్యంగా గుర్తించాం. ఇంకా చెల్లింపులు జరగలేదు. ఆయా ట్రాక్టర్లను తిరిగి షోరూంకు పంపించామని చెప్పారు. స్వీపింగ్ మిషన్ విషయంపై విచారణ చేపడతాం. – యాదయ్య,
స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్
అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు.
అతిపెద్ద టైగర్ రిజర్వు..
దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్ జోన్. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూర్, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్ రేంజ్లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్ ద్వారా సేకరించిన ప్లగ్ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం
జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ
ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం
స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 22తోముగియనున్న స్వీకరణ గడువు
పెద్ద పులులకు పుట్టినిల్లు..
నల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్–6 ఆడపులి, ఫరాహా ఎఫ్–6, తారా ఎఫ్–7, భౌరమ్మ ఎఫ్–18, ఎఫ్–26, ఎఫ్–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి.
అమరచింత: మండల కేంద్రంలోని దుంపాయికుంటలో పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఐజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేష్రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్థలానికి సంబంధించిన పత్రాలను చూశారు. ప్రస్తుతం టెలిఫోన్ ఎక్స్ఛేంజీ భవనంలో కొనసాగుతుందని ఎస్ఐ స్వాతి ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. భవన నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యేలా తనవంతు కృషి చేస్తామన్నారు. అనంతరం పీజేపీ నందిమళ్ల క్యాంపు కాలనీలో నిర్మిస్తున్న పోలీస్ ఔట్పోస్టు పనులను పరిశీలించారు.
నేడు అప్రెంటీస్షిప్ మేళా
వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట శివారులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం అప్రెంటీస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మే ళాను సద్వినియోగం చేసుకోవాలని.. నిజ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.
వరికి గిట్టుబాటు ధర
కల్పించాలి
కొత్తకోట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించే వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోడ్లపై ఆరబోసి ఐదు రోజులైనా కాంటాలు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కొందరు మిల్లర్లు రైతుల దగ్గర నుంచి తరుగు తీస్తామని చెబుతున్నారని, కొన్న ధాన్యానికి కచ్చితంగా పట్టి ఇవ్వాలని, నష్టం కలగకుండా చూడాలన్నారు. గతంలో ప్రభుత్వం కొన్న సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ నేటి వరకు రైతుల ఖాతాలో జమ చేయలేదని, జిల్లాలోని 18 వేల మంది రైతులకు రూ.48 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. తక్షణమే విడుదల చేయకుంటే పెద్దఎత్తున రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, హమాలీలు నారాయణ, శ్రీనివాస్రెడ్డి, నర్సింహ, వెంకటయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి: పేదలకు ఉచిత న్యాయసాయం అందించడం, ప్రతి పౌరుడికి న్యాయ అవగాహన పెంపొందించడమే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్రెడ్డి అన్నారు. న్యాయ సేవాధికార చట్టం 1987 అమలును స్మరించుకుంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని సూచన మేరకు ఆదివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ న్యాయసేవల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజీయే రాజమార్గమంటూ కోర్టు ప్రాంగణం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రజలకు ఉచిత న్యాయసాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్, ఉచిత న్యాయ సలహా కేంద్రాలు, మధ్యవర్తిత్వం విధానాలతో తక్షణ పరిష్కారం పొందవచ్చని వివరించారు. జిల్లా ప్రజలు న్యాయసేవల ప్రయోజనాలను వినియోగించుకోవాలని, హక్కుల రక్షణ కోసం చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం, న్యాయం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని.. ప్రతి ఒకరికి ఉచిత న్యాయసేవలు, న్యాయ సలహాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్అదాలత్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం న్యాయసేవలపై తమ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, ఆర్డీఎస్ స్వచ్ఛందసంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, సఖి కేంద్రం ప్రతినిధి కవిత, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నందిమళ్ల క్యాంపుకాలనీ నుంచి రేవులపల్లి వరకు కొత్తగా బీటీ రహదారి ని ర్మించాలి. రహదారికి తా త్కాలిక మరమ్మతు చేస్తే చిన్నప ాటి వర్షాలకే మ రోమారు దెబ్బతినే అవకాశం ఉంది. అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మ తు పక్కాగా చేపట్టాలి. – వెంకటేష్, నందిమళ్ల
త్వరగా చేపట్టాలి..
ప్రాజెక్టు రహదారిపై నిత్యం వేల మంది ప్రయాణం చేస్తుంటారు. రూ.30 లక్షలతో చేపట్టే మరమ్మతు నాణ్యతగా పూర్తిచేసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు కృషిచేయాలి. పీజేపీ ప్రాజెక్టు రహదారి మరమ్మతు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. – రాజు, మస్తీపురం
రూ.30 లక్షలతో మరమ్మతు..
జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ పరిధిలోని మొత్తం 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారి మరమ్మతుకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధులు మంజూరవుతాయి. వెంటనే టెండర్లు ఆహ్వానించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
– ఖాజా జుబేర్ అహ్మద్, ఈఈ, గద్వాల


