Archive Page | Sakshi
Sakshi News home page

Kurnool

  • కుక్క
    అప్పుడు
    ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుదాం
    హాస్టల్‌లో కనీస వసతులు కరువు

    ఉద్యోగ విరమణ రోజే మృతి

    గుంతకల్లు రూరల్‌: వైద్య, ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీరస్‌గా పనిచేస్తు న్న వసుంధర గురువారం తన స్వగృహంలో మృతి చెందారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఆమె విడపనకల్లు పీహెచ్‌సీ, కర్నూలు జిల్లా పగిడిరాయి పీహెచ్‌సీలో పని చేశారు. ప్రస్తుతం పత్తికొండ మండలం పుచ్చకాలమాడ పీహెచ్‌సీలో పనిచేస్తున్నారు. సర్వీసు పూర్తి కావడంతో గురువారం ఆమె ఉద్యో గ విరమణ పొందాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వసుంధర.. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఇతర సిబ్బంది ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించి వెళ్లారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1.30 గంటలకు కన్నుమూశారు.

    తాటి చెట్టు చెప్పెను.. వానల్లేవని!

    ఎందుకో.. ఏమో వరుణుడు మొహం చాటేశాడు. రోజూ ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులు వర్షిస్తాయని అనుకుంటుండగానే కాసేపటికే మాయమవుతున్నాయి. నీటి కోసం చెరువులు నోరెళ్లబెట్టాయి. వేసవిలో ఎండిన వాగులు, వంకలు కుంటలు నీళ్ల కోసం అర్రులు చాస్తున్నాయి. ఇందుకు తమ్మరాజుపల్లె గ్రామం వద్ద ఎస్‌ టర్నింగ్‌ వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న కుంటనే నిదర్శనం. గతేడాది జూలై మొదటి వారంలోనే ఈ కుంట నిండటంతో మూగజీవాల దాహార్తి తీరింది. ప్రస్తుతం ఎండిపోయిన కుంటలో ఎత్తైన తాటి చెట్టు వరుణుడు కరుణ కోసం ఆకాశం వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

    – పాణ్యం

    ఇప్పుడు

    డోన్‌ టౌన్‌: ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుదామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయు లు, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా రెండవ మహా సభలో భాగంగా రెండవ రోజు గురువారం మార్కెట్‌యార్డు సమీపంలోని క్రిష్టియన్‌ హాలులో జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది పాలనలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయన్నా రు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడదామన్నారు. పేదలకు ఇంటి స్థలాలు వంకల్లో వాగుల్లో ఇస్తూ.. బడా బాబులకు పట్టణం నడిబోడ్డున, విలువైన భూములు అప్పనంగా అప్పజెబుతున్నారని ఆరోపించారు.

    నూతన కమిటీ: సమావేశం అనంతరం నంద్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా రంగనాయుడు రెండవ సారి ఎన్నికయ్యా రు. సహాయ కార్యదర్శిగా బాబా ఫకృద్ధీన్‌తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా 15 మందిని, జిల్లా సమితి సభ్యులుగా 40 మందిని ఎన్నుకున్నారు. ఇందులో డోన్‌కు చెందిన కౌన్సిలర్‌ సుంకయ్య, రాధాకృష్ణ, రఘురామమూర్తి, ప్రసాద్‌, భాస్కర్‌, నాగరాము డు, రమేష్‌, మోటా రాముడు, నారాయణ ఎన్నికయ్యారు.

    కర్నూలు సిటీ: నగర శివారులో జి.పుల్లయ్య ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్‌ దంపతులు గాయపడ్డారు. కర్నూలు రూరల్‌ మండల పరిధిలోని పసుపుల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ టీచర్‌గా ఇందిర పని చేస్తున్నారు. గురువారం ఉదయం ఆమె భర్త భాస్కర్‌తో కలసి బైక్‌పై పాఠశాలకు బయలుదేరారు. వెంకాయపల్లె సమీపంలోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్‌ కాలేజీ దాటిన తర్వాత పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డువచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి భార్యాభర్తలు కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందిర తలకు తీవ్ర గాయాలు కావడంతో మాట్లాడలేని పరిస్థితులో ఉంది. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.శ్యామూల్‌ పాల్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన దంపతులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను కోరారు. ఇందిర పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన భర్త భాస్కర్‌ జనరల్‌ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు.

    మహిళా టీచర్‌ దంపతులకు గాయాలు

  • ఊపిరి
    పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్‌ కారకం.. అని బీడీ, సిగరెట్‌, చుట్టల పెట్టెలపై ముద్రిస్తున్నా జనం మారడం లేదు. వాటికి అలవాటుపడిన వారు వ్యసనాన్ని వదలడం లేదు. కానీ అలవాటు ఊపిరితిత్తులను పొగతో కమ్మేసి క్రమంగా క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతోంది. ధూమపానంతో వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే పొగ కాలుష్యంగా మారి మనిషి ప్రాణాలు తీస్తోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రావడానికి గల కారణాలు, తీసుకునే చికిత్సలపై అవగాహన పెంచేందుకు ఏటా ఆగస్టు ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కథనం. – కర్నూలు(హాస్పిటల్‌)

    పెరుగుతున్న ఊపిరితిత్తుల

    క్యాన్సర్‌ బాధితులు

    ధూమపానమే ప్రధాన కారణం

    వాతావరణ కాలుష్యం కూడా..

    నేడు ప్రపంచ ఊపిరితిత్తుల

    క్యాన్సర్‌ దినోత్సవం

    క్యాన్సర్‌ ఇదో భయంకర మహమ్మారి. 50 ఏళ్ల క్రితం వరకు ఎక్కువగా ధనికులకు మాత్రం వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పేద, మధ్యతరగతి వర్గాలను వదలడం లేదు. ఏటా క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వ్యాధి నిర్ధారణ అవకాశాలు సులభం కావడం కూడా సంఖ్య పెరగడానికి కారణమైంది. ఈ వ్యాధితో బాధపడిన వారు త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే మనగలుగుతున్నారు. చివరి దశలో బయటపడితే మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతిరోజూ నిర్వహించే ఓపీకి 30 మంది దాకా రోగులు వస్తున్నారు. ఇందులో 20 మంది కొత్త వారే ఉంటున్నారు. అంటే ప్రతి నెలా 500 నుంచి 600 మంది, ఏడాదికి 6వేలకు పైగా కొత్తరోగులు పుట్టుకొస్తున్నారు. వీరిలో 6 శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే వారిలో అధిక శాతం మూడవ దశ, నాల్గవ దశలలో చికిత్స కోసం వస్తుండగా ఎక్కువ మంది కోలుకోలేక మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్‌కు చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో ఇద్దరు సర్జికల్‌ ఆంకాలజిస్టులు ఉన్నారు. వీరు ఊపిరితిత్తుల్లో ఏర్పడిన క్యాన్సర్‌ కణితులను తొలగించడం, దెబ్బతిన్న ఊపిరితిత్తిలోని కొంత భాగాన్ని తీసివేయడం చేసి అనంతరం కీమోథెరపి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రితో పాటు కర్నూలు నగరంలోని ఒమెగా హాస్పిటల్‌, విశ్వభారతి క్యాన్సర్‌ హాస్పిటల్‌, అమీలియో క్యాన్సర్‌ హాస్పిటల్‌లలోనూ ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ద్వారా ఉచితంగా క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లోనూ ప్రతిరోజూ కొత్త, పాత రోగులు 150 నుంచి 200 మంది చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

    ప్రాణాలు తోడేస్తున్న పొగ

    స్నేహితులతో సరదాగా మొదలయ్యే పొగతాగే అలవాటు క్రమంగా అలవాటుగా మారి ఆ తర్వాత బానిసను చేసుకుంటుంది. దీనిని వదిలించుకుందామన్నా వదలలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. కొందరు రోజుకు ఒక ప్యాకెట్‌/కట్ట తాగుతుండగా మరికొందరు నాలుగైదు పెట్టెలు కాల్చందే మనసు ఊరుకోని పరిస్థితి. ధూమపానం చేసేవారిలో చేయని వారికంటే ఊపరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 24 నుంచి 35 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వారు వదిలిన గాలి పీల్చడం(పాసివ్‌ స్మోకింగ్‌) ద్వారా 3.5శాతం క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. దీంతో పాటు గాలి కాలుష్యం, గతంలో చేసిన రేడియేషన్‌ థెరపి, వంటచేసే సమయంలో ఉత్పత్తి అయ్యే రాడన్‌ గ్యాస్‌ పీల్చడం, ఆర్సెనిక్‌ క్రోమియం, నికెల్‌ ఆస్బెస్టాస్‌, ఇతర పదార్థాలు పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

    వ్యాధి లక్షణాలు–సంకేతాలు

    ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సాధారణంగా దాని ప్రారంభ దశలలో సంకేతాలు, లక్షణాలను కలిగించదు. వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ చికిత్సకు లొంగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. నిరంతర దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం, శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గిపోవడం, ఎముకల నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం లక్షణాలు ఉంటాయి.

    వ్యాధి నిర్ధారణ, చికిత్స

    ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశమున్న వారు ఏడాదికి ఒకసారి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలను బట్టి వైద్యుల సూచనల మేరకు ఛాతి ఎక్స్‌రే, ఛాతి సీటీ స్కాన్‌, కఫం సైటోలజీ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ రకాన్ని గుర్తించేందుకు టిష్యూ బయాప్సీ అవసరం అవుతుంది. చికిత్స ఆ క్యాన్సర్‌ దశపై ఆధారపడి ఉంటుంది. ఈ క్యాన్సర్‌కు ప్రస్తుతం శస్త్రచికిత్స, కీమోథెరపి, రేడియోథెరపి విధానాల్లో చికిత్స అందిస్తున్నారు.

    ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రకాలు

    స్మాల్‌సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌: ఇది చిన్న కణాల ఊపిరితిత్తుల క్యాన్సర్‌, దాదాపుగా ఎక్కువగా ధూమపానం చేసేవారిలో ఇది సంభవిస్తుంది.

    నాన్‌ స్మాల్‌ సెల్‌ క్యాన్సర్‌: ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌లలో వివిధ రకమైన క్యాన్సర్‌లు ఉంటాయి.(క్యామాసెల్‌ క్యాన్సర్‌, అడెనోకార్సినోమా, పెద్ద కణ క్యాన్సర్‌).

  • పత్తికొండ: నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడే ప్రమాదం మాటు వేసింది. కిందకు వేలాడుతూ భయపెడుతోంది. వెలుగులు ప్రవహించే విద్యుత్‌ తీగలు చీకట్లు నింపే ప్రమాదం నెలకొంది. అయినా విద్యుత్‌ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని కనిపిస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. పత్తికొండ పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఇరువైపుల ఏర్పాటు చేసిన సర్వీస్‌ విద్యుత్‌ తీగలు చాలా ప్రమాదకరంగా మారాయి. 

    వాహనాలకు తగిలే అంత ఎత్తులో ఉండటంతో ఏదో ఒక చోట తొగి కింద పడుతున్నాయి. త్రుటిలో ప్రజలు ప్రాణాలతో బయటపడుతున్నారు. గురువారం గుత్తిరోడ్డు సర్కిల్‌లో భారీ వాహనం తాకడంతో సర్వీస్‌ వైరు కిందికి పడిపోయింది. స్థానికులు విద్యుత్‌ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో ట్రాన్సోకో సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై ఆటోనే ఆసారాగా చేసుకుని 45 నిమిషాలు పాటు ట్రాఫిక్‌ నిలిపివేసి తీగలను సరి చేశారు. దీంతో ఇరు వైపులా వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.

    ఆర్‌సీడీఎస్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌గా మండ్ల వెంకటసుబ్బారెడ్డి

    కర్నూలు(అర్బన్‌): రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ(ఆర్‌సీడీఎస్‌) రీజినల్‌ కోఆర్డినేటర్‌(కర్నూలు, నంద్యాల, ప్రకాశం)గా బనగానపల్లెకు చెందిన డాక్టర్‌ మండ్ల వెంకటసుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రరెడ్డి గురువారం నియామక పత్రాన్ని జారీ చేశారు. రెడ్డి జాతి శ్రేయస్సు, ఐక్యతకు పాటు పాడేందుకు గత జూలై 30వ తేది నుంచి తదు పరి ఉత్తర్వులు అందే వరకు మండ్ల వెంకట సుబ్బారెడ్డి రీజినల్‌ కోఆర్డినేటర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సొసై టీ నియమ నిబంధనలను అనుసరించి క్రమ శిక్షణతో అన్ని రెడ్డి సంఘాలను సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలన్నారు.

    2న చిత్రలేఖన పోటీలు

    కర్నూలు కల్చరల్‌: జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభల సందర్భంగా ఈనెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఓల్డ్‌బస్టాండ్‌ సమీపంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. సీనియర్‌ విభాగంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ‘డార్విన్‌ జీవ పరిణామ సిద్ధ్దాంతం’, జూనియర్‌ విభాగంలో 6, 7 తరగతుల విద్యార్థులకు ’మొక్కల సంరక్షణ’ అనే అంశాలపై పోటీలు ఉంటాయని వెల్లడించారు.

    రేపు ఆట్యా–పాట్యా ఎంపిక పోటీలు

    కర్నూలు (టౌన్‌): పాణ్యం పట్టణంలోని విజయానికేతన్‌ పాఠశాల క్రీడా మైదానంలో ఆగస్టు 2న ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌–15 బాలుర విభాగంలో ఆట్యా– పాట్యా ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరత్నమయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చాటిన క్రీడాకారులు వచ్చే నెల 8 నుంచి 10 వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

  • జర్మనీ భాష శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు

    కర్నూలు(అర్బన్‌): జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగావకాశాలకు వీలుగా జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ జర్మనీ భాషపై శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎం డిగ్రీ అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 4లోగా dydir.sw.krnl@gmail.comకు పంపా లన్నారు. మరిన్ని వివరాలకు ఎం.శశికుమార్‌ (సెల్‌: 8121261727, 08518– 230790 )ను సంప్రదించాలన్నారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో మొత్తం 150 మంది మహిళలకు శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ముందుగా Naipunyam AP పోర్టల్‌లోని https://naipunyam.ap.gov.in/ user registration? pageprogaram regirtratio n, ఇందులో Traineeregistration ఎంపిక చేసి, ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ద్వారా లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి. అనంతరం అందుబాటులో ఉన్న శిక్షణా ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 6వ తేదీలోగా పూర్తి చేసుకోవాలన్నారు.

    మూత‘బడి’

    తుగ్గలి: మండలంలోని జాప్లాతండా ప్రాథమిక పాఠశాల మూతపడింది. గత విద్యా సంవత్సరం వరకు నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ముగ్గురు విద్యార్థులు పత్తికొండలో చేరగా రెండో తరగతి విద్యార్థిని ఒక్కరే మిగిలారు. దీంతో పాఠశాల మూతపడింది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు కూడా బదిలీపై వెళ్లారు. దీంతో ఉన్న ఒక్క విద్యార్థిని పక్కగ్రామమైన లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు చేర్పించారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే తిరిగి పాఠశాల తెరుచుకునే అవకాశం ఉందని ఎంఈవో–2 రామవెంకటేశ్వర్లు తెలిపారు.

  • కర్నూలులో స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్సిట్యూట్‌లో అన్ని సౌకర్యాలు, వసతులు సమకూర్చాక రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పాత క్యాన్సర్‌ భవనంలో రోజుకు 10 నుంచి 15 రాగా ఇప్పుడు 25 నుంచి 30 మంది దాకా వస్తున్నారు. అందుబాటులో ఉన్న 120 పడకలు నిత్యం రోగులతో నిండిపోతున్నాయి. 80 శాతం మంది అడ్వాన్స్‌ (చివరి దశ)లో వస్తున్నారు. ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్‌ చికిత్స సులభం అవుతుంది.

    – డాక్టర్‌ సీఎస్‌కే ప్రకాష్‌, క్యాన్సర్‌ విభాగం హెచ్‌వోడి, కర్నూలు ప్రభుత్వ

    సర్వజన వైద్యశాల

    ధూమపానం,

    కాలుష్యం కారణాలు

    ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం, వాయు కాలుష్యం ప్రధాన కారణాలు. ధూమపానం మానేస్తే చాలా వరకు ఈ క్యాన్సర్‌ నుంచి బయటపడవచ్చు. ధూమపాన నివారణ కోసం నికోటిన్‌ ఉత్పాదక స్థాపన ఉత్పత్తులు, మందులు, సహాయక సమూహాలు ఉన్నాయి. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉన్న 50 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పెద్దలు ప్రతి సంవత్సరం క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాలి.

    – డాక్టర్‌ సి. వాసురెడ్డి,

    సర్జికల్‌ ఆంకాలజిస్టు, కర్నూలు

  • ఫేక్‌ ట్రైనర్‌పై విచారణ

    ఆలూరు: అరికెర గ్రామ అంబేడ్కర్‌ గురుకుల బాలుర పాఠశాలో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ ట్రైనర్‌ పేరుతో ఇటీవల విద్యార్థులు, ఉపాధ్యాయులను మోసం చేసిన వైనంపై డీసీఓ శ్రీదేవి విచారణ చేపట్టారు. స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ ట్రైనర్‌ పేరుతో ఓ వ్యక్తి పాఠశాలలో వసూళ్లకు పాల్పడిన ఘటనపై సాక్షిలో ఈనెల 30వ తేదీన కథనం ప్రచురితమైయింది. ఈ మేరకు గురువారం ఆమె పాఠశాలను తనిఖీ చేసి ఈ విషయంపై ఆరా తీశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వారంలోగా రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ నియామకం జరుగుతుందన్నారు. విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఫేక్‌ ట్రైనర్‌ విషయంపై విచారణ జరుగుతుందన్నారు.

Sangareddy

  • అడ్డగోలు స్కానింగ్‌లు

    కనీస నిబంధనలు పాటించనిప్రైవేటు ఆస్పత్రులు

    రాష్ట్ర అధికారుల తనిఖీల్లో వెల్లడైన బాగోతం

    పీసీపీఎన్‌డీటీ నిబంధనల్ని గాలికొదిలిన వైనం

    ఎందుకు పట్టుకోలేదు?

    జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వైద్యారోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించింది. జిల్లా అధికారుల బృందాలతోపాటు, రాష్ట్ర అధికారులు కూడా ఈ ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర అధికారుల బృందాలు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ స్కానింగ్‌ల వ్యవహారం బట్టబయలైంది. కానీ, జిల్లా అధికారుల బృందాలు ఈ అక్రమ స్కానింగ్‌లను ఎందుకు పట్టించుకోలేదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా జిల్లా అధికారులు తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో రెండు ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్డగోలుగా స్కానింగ్‌ల దందా సాగుతోంది. నిబంధనల ప్రకారం గర్భిణీలకు నిర్వహించిన ప్రతీ స్కానింగ్‌ వివరాలను ప్రభుత్వానికి సంబంధించిన పీఎన్‌డీటీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. కానీ, ఈ ఆస్పత్రులు నిబంధనలను తుంగలో తొక్కాయి. వీళ్లు చేసిన స్కానింగ్‌లకు, పోర్టల్‌లో నమోదైన స్కానింగ్‌లకు భారీగా తేడాలున్నట్లు వెలుగుచూసింది. అలాగే వైద్యుడు రిఫర్‌ చేసిన స్లిప్‌ ఉంటే మాత్రమే స్కానింగ్‌ చేయాల్సి ఉండగా అటువంటి స్లిప్‌లు లేకుండానే స్కానింగ్‌ చేసేశాయి. పైగా ఈ స్కానింగ్‌లకు సంబంధించి ఈ ఆస్పత్రులు కనీసం రికార్డులను కూడా నిర్వహించలేదు. ఇటీవల రాష్ట్రస్థాయిలో అధికారుల బృందాలు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ స్కానింగ్‌ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు నామమాత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకున్నారు.

    కాసులకు కక్కుర్తి పడి

    భ్రూణ హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్కానింగ్‌ల విషయంలో పీసీ పీఎన్‌డీటీ చట్టం (ప్రీ కన్సెప్షన్‌ అండ్‌ ప్రీ నాటల్‌ డయాగ్నొస్టిక్‌ టెక్నిక్స్‌ యాక్ట్‌) కింద కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే కాసులకు కక్కుర్తి పడుతున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఈ నిబంధనలను కాలరాస్తూ స్కానింగ్‌ దందాను సాగిస్తున్నాయి. పైన పేర్కొన్న ఉదాహరణలే ఇందుకు నిదర్శనం. గ్రామాల్లో పనిచేస్తున్న పీఎంపీలు, ఆర్‌ఎంపీలను ఏజెంట్లను పెట్టుకుని తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రులు, ఇతర సంస్థలు జిల్లాలో మొత్తం 656 ఉన్నాయి. ఇందులో ఆస్పత్రులతోపాటు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, దంత వైద్యశాలలు, పాలిక్లీనిక్‌లు, ఫిజియోథెరపీ యూనిట్లు, పునరావాస కేంద్రాలు, ఆయుష్‌ ఆస్పత్రులు, క్లీనిక్‌లు ఉన్నాయి. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టు కింద వీటికి అనుమతులు జారీ అయ్యాయి. అయితే కొన్ని ఆస్పత్రులు కాసులకు కక్కుర్తిపడి ఈ నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. ఇష్టారాజ్యంగా స్కానింగ్‌ చేసి డబ్బులు దండుకుంటున్నాయి.

  • ఇంటింటా జ్వర సర్వే

    కంది(సంగారెడ్డి): వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ జ్వరాల సర్వేను నిర్వహిస్తున్నారు. జ్వర బాధితులను గుర్తించి వారికి ప్రత్యేక చికిత్సను అందజేస్తున్నారు. ఈ సర్వే కోసం ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లతో మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. బృందం సభ్యులు తమకు కేటాయించిన గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేక రిస్తున్నారు. మలేరియా, డెంగీ జ్వరాల పరీక్షలను అక్కడికక్కడ నిర్వహించి అవసరమైన చికిత్స అందజేస్తున్నారు. కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వచ్చే కలబ్గూర్‌, కలివేముల గ్రామాల్లో డెంగీ కేసులను గుర్తించి వారికి చికిత్సలు అందజేస్తున్నట్లు పీహెచ్‌సీ డాక్టర్‌ సాయి శంకర్‌ తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 9,246 మందిని సర్వే చేసి నివాస గృహాల్లోని 1,685 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న 65 మందికి వైద్య సేవలు అందజేస్తున్నారు. వీరిలో నలుగురికి డెంగ్యూ, 16 మందికి టైఫాయిడ్‌ జ్వరం వచ్చినట్లు గుర్తించారు. మండలంలో ఇప్పటి వరకు చికెన్‌ గున్యా కేసులు సర్వేలో నమోదు కాలేదని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు.

    పరిశుభ్రతపై అవగాహన

    వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇళ్ల పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. ఇళ్ల ముందు మురికి నీరు నిలవకుండా చేయడం, డ్రమ్ముల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

    పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన

    ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది

    జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ

    వర్షా కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామాల్లో సర్వేలు నిర్వహించి జ్వర బాధితులను గుర్తిస్తున్నాం. పూల కుండీలు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు అధికమై రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. వర్షాకాలంలో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి. అలాగే తాజాగా, వేడి వేడిగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

    –సాయి శంకర్‌,

    కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు

  • నిత్యం నరకమే

    రామచంద్రాపురం, ఎంఐజీ, ఎల్‌ఐజీ, విద్యుత్‌నగర్‌, బెల్‌ కాలనీలకు చెందిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు నిత్యం రాకపోకలు సాగించే తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని విద్యుత్‌నగర్‌ కాలనీ నుంచి తెల్లాపూర్‌ మార్గంలో ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతుండటంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ కొద్ది రోజుల పనిచేసి తర్వాత మొరాయించడంతో కొంతమంది వాహనదారులు ఇష్టానుసారంగా వస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. –రామచంద్రాపురం(పటాన్‌చెరు)

  • నేడు అందోల్‌కు మీనాక్షి

    జోగిపేట(అందోల్‌): ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ శుక్రవారం అందోల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ రెండు రోజులుగా జోగిపేటలోనే మకాం వేసి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కాగా, సంగుపేట నుంచి జోగిపేట వరకు మీనాక్షి నటరాజన్‌ చేపడుతున్న పాదయాత్రకు జనహిత పాదయాత్రగా నామకరణం చేశారు. అందోల్‌ మండలం సంగుపేట నుంచి జోగిపేటలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సంగుపేట వద్ద మీనాక్షి నటరాజన్‌కు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

    స్వచ్ఛందంగా పాల్గొనాలి: దామోదర

    మీనాక్షి నటరాజన్‌ చేపట్టే జనహిత పాదయాత్రలో నియోజకవర్గంలోని పార్టీకి ముఖ్యనాయకులు, కా ర్యకర్తలు, ప్రజలు స్వచ్చందంగా హజరై పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని విజయవంతం చే యాలని మంత్రి దామోదర పిలుపునిచ్చారు. ఆగస్టు 2న శ్రమదానంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు లక్ష్మిదేవీ గార్డెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు.

    సంగుపేట నుంచి జనహిత పాదయాత్ర

    తరలిరావాలని దామోదర పిలుపు

  • అనుమతులు వేగవంతం చేయండి
    పరిశ్రమల ఏర్పాటుపై కలెక్టర్‌

    సంగారెడ్డి జోన్‌/కంది(సంగారెడ్డి): జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ ప్రావీణ్య నిర్వహించిన పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమావేశానికి జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్‌ తుల్జా నాయక్‌ హాజరయ్యారు. మెటీరియల్స్‌ సరఫరా, భూ కమతాల మంజూరు, విద్యుత్‌ కనెక్షన్ల అనుమతుల కోసం దరఖాస్తు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులకు వెంటనే అనుమతులివ్వాలన్నారు.

    రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

    రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కందిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నవారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కందిలోని జెడ్పీహెచ్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు డిజిటల్‌ క్లాసుల ద్వారా అందుతున్న బోధనలను పరిశీలించారు. ఈసారి కూడా పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సూచించారు.

  • ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవించాలి
    మాజీ జడ్జి డాక్టర్‌ హేమంత కుమార్‌

    పటాన్‌చెరు: ప్రతీ పౌరుడు దేశ చట్టాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని లేదంటే కోర్టులో తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ జిల్లా సెషన్స్‌ జడ్జ్జి, తెలంగాణ ఎన్నికల సంఘం న్యాయ సలహాదారు డాక్టర్‌ హేమంత కుమార్‌ స్పష్టం చేశారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ‘చట్టపరమైన హక్కులు, బాధ్యతలు’పై గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పోక్సో, మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్‌ నిరోధక చట్టాలు, రాజ్యాంగ నిబంధనలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతలతో సహా పలు కీలక చట్టాల గురించి విద్యార్థులకు తెలిపారు. న్యాయ సలహా కోరుకునే వారెవరైనా జిల్లా న్యాయ సేవా సంఘం చైర్మన్‌ లేదా కార్యదర్శికి లేఖ రాసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని వెల్లడించారు.

  • కరవు నేలను ముద్దాడిన వరద నీరు..!

    హుస్నాబాద్‌రూరల్‌:

    భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు సాగునీరు అందక రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంటలను సరిపడా నీరందక పశువుల మేతకు వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. పెట్టుబడుల భారంతో మెట్ట రైతులు ఆర్థిక నష్టాలను సైతం భరిస్తున్నారు. అయితే.. నిత్యం వేధించే సాగునీటి సమస్యను శాశ్వతంగా దూరంగా చేయాలని ఓ రైతు ప్రయత్నం ఫలించింది. ఆర్థిక కష్ట, నష్టాలు.. కొన్ని సందర్భాల్లో నిరాశ పరిచినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు.

    హుస్నాబాద్‌ మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు మాదారపు రాంగోపాల్‌రావు తన ఆలోచనలకు పదును పెట్టి ఏకంగా ఇరవై ఎకరాలకు సాగునీరందేలా చేసిన కృషి ఇప్పుడు సత్ఫలితానిస్తోంది.

    కోర్టు కేసుల కారణంగా మొన్నటి వరకు గోదావరి జలాలతో గౌరవెల్లి ప్రాజెక్టు నింపితే పంటలకు కావాల్సిన సాగు నీరు అందుతుందన్న ఆశలను రైతులు వదులుకున్నారు. రెండేళ్లు యాసంగి పంటలకు సాగు నీరందక పంటలు ఎండిపోతే చాలా మంది రైతులు చేసేదేమిలేక పశువుల మేతకు వదిలేశారు. అయితే.. రాంగోపాల్‌రావు మాత్రం తన ముందున్న ప్రతికూల పరిస్థితులకు భయపడలేదు. మెదడుకు పదును పెట్టాడు. గతంలో ఊటబావి తవ్వించాడు. నీరు పడలేదు. సరిగా నీరందక ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేసి.. మరో బావిని తవ్వే పనులు మొదలు పెట్టాడు. రూ.5 లక్షల వ్యయంతో 25 గజాల బావి తవ్వించి సిమెంట్‌ రింగ్‌లు పోయించాడు. వేసవిలో నీరు లేకపోయినా నిరుత్సాహపడలేదు, బావి పక్కనే 10 గుంటల విస్తీర్ణంలో చిన్న కొలను తవ్వించి.. అందులోకి వరద నీటిని మళ్లించి చిన్న చెరువులా చేశాడు. దీంతో బావిలో నీటి ఊటలు రావడం ప్రారంభమైంది. చూస్తుండగానే బావిలో నీరు పుష్కలంగా ఉండటంతో పంటలకు సాగునీటి కొరత లేకుండా పోయింది. తన పదెకరాల పొలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని బీడు భూమిని చదును చేసి వరి సాగు చేస్తున్నాడు రాంగోపాల్‌రావు. నిన్నటి వరకు నీళ్లు లేని బావులు ఇప్పుడు చిన్న కొలను ఏర్పాటు చేయడం ద్వారా రెండు ఊట బావుల్లో భూగర్భ జలాలు ౖపైపెకి వచ్చి రైతులను అశ్చర్య పరుస్తున్నాయి. రెండేళ్ల రైతు శ్రమకు కావాల్సిన సాగు నీరు రావడంతో రాంగోపాల్‌రావు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

    కష్టపడితే నీళ్లరేవొచ్చింది

    గౌరవెల్లి ప్రాజెక్టు నింపితే పంటలకు సాగు నీరు వస్తుందని ఆశపడ్డాం. ఇప్పుడు కోర్టు కేసులతో గోదావరి జలాలు వచ్చే నమ్మకం లేదు. రెండేళ్లు పది ఎకరాల్లో పంట ఎండి రూ.10లక్షల నష్టం వచ్చింది. కష్టపడి బావి తవ్వితే.. ఇప్పుడు నీళ్ల రేవు వచ్చింది. నీటి కొలనుతో బావిలో ఊట నీరు పెరిగింది. పంటలకు కావాల్సిన నీళ్లు రెండు బావులు అందిస్తున్నాయి. రాంగోపాల్‌రావు, రైతు

    వరద నీరు మళ్లించి కొలను ఏర్పాటు

    బావుల్లో ఊట పెరగడంతో పాతాళ గంగ ౖపైపెకి ..

    బీళ్లకు నీరు పారించిపంటలు సాగు చేస్తున్న రైతు

    20 ఎకరాలలో వరి, మొక్కజొన్నపంటల సాగు

    సత్ఫలితాలిస్తున్న రైతు రాంగోపాల్‌రావు కృషి

    ఓ రైతు భగీరథయత్నం ఫలించింది. కరువుతో అల్లాడుతున్న ఆ నేలకు వరద నీరు ముద్దాడేలా చేశాడు. బీడు భూములను సస్యశ్యామలం చేశాడు.

  • ప్రాణ
    ● ప్రతినెల సగటున 11 మంది మృత్యువాత ● జిల్లావ్యాప్తంగా ఏడు నెలల్లో400 ప్రమాదాలు ● 179 మరణాలు.. ద్విచక్ర వాహనదారులు 118 మంది ● జరిమాన విధించినా కానరాని మార్పు

    కలెక్టర్‌ కట్టడిచేసినా..

    ద్విచక్రవాహన దారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని, లేకుంటే కలెక్టరేట్‌ ఆవరణలోకి అనుమతించ వద్దని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఫిబ్రవరిలో తన సిబ్బందిని ఆదేశించారు. దీంతో కలెక్టరేట్‌కు వెళ్లే ప్రతి వాహనదారుడు హెల్మెట్‌ ధరించే కార్యాలయానికి వెళ్లేది. ఆ నెలలో 95శాతం మంది ద్విచక్రవాహన దారులు హెల్మెట్లు ధరించారు. కొంత కాలం తర్వాత మళ్లీ యథాస్థితే. కాగా, జిల్లాలో హెల్మెట్‌ ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు కానరావడం లేదు. ఈ విషయమై అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

    మెదక్‌జోన్‌: ‘‘హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్రవాహనం నడపొద్దు.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం’’అని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వాహనదారుల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. నిత్యం జరిమానాలు విధించినా ఫలితం లేకుండా పోతుంది. ఫలితంగా జిల్లాలో ప్రతినెల సగటున 11 మంది హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు శోకం మిగుల్చుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు మాసాల్లో 400 రోడ్డు ప్రమా దాలు జరిగాయి. అందులో 179 మంది మరణించారు. వారిలో 118 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, 61 మంది ఇతర వాహనదారులు ఉన్నారు. కేవలం హెల్మెట్లు ధరించక పోవటంతోనే 76 మంది మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు.

    రోడ్ల మీదకు వస్తున్న కుటుంబాలు

    రోడ్డు ప్రమాదంలో కుటుంబపెద్ద మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డు మీదకు వస్తోంది. పిల్లల చదువులు ఆగిపోతాయి. కుటుంబ భారం మహిళపై పడుతోంది. ఒకవేళ పెళ్లికాని యువత చనిపోతే జన్మనిచ్చిన తల్లి దండ్రులకు తీరని కడుపు కోత మిగిలిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ కుటుంబమే రోడ్డుపైకి వస్తోంది. ఇంత జరుగుతున్నా ద్విచక్రవాహన దారులు హెల్మెట్లు ధరించకుండా నిర్లక్ష్యంగా నడపటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

  • చింతకుంట టు ‘చిట్కుల్‌’
    ● క్యూగట్టిన కల్లు ప్రియులు ● చింతకుంట, పోసానిపేటలలోకల్లు దుకాణాలు మూసివేత ● మొదటిసారిగా నాలుగురోజులుగా బంద్‌ ● అక్రమంగా కల్లు తెచ్చుకుంటున్నాపట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు

    వట్‌పల్లి(అందోల్‌): అందోలు మండలం పరిధిలోని చింతకుంట, పోసానిపేట గ్రామాల్లో కల్లు దుకాణాలను మూసేశారు. దీంతో కల్లు ప్రియుల బాధలు వర్ణనాతీతం. కల్లుకు బానిసైన కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో చిలప్‌చెడ్‌ మండలం చిట్కుల్‌ గ్రా మంలోని కల్లు దుకాణాలకు క్యూగట్టారు. జోగిపేట గీతా పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన కొంత మంది సభ్యులు తమకు రావాల్సిన వాటా డబ్బులు కాంట్రాక్టర్‌ ఇవ్వలేదన్న ఆరోపణలతో ఎకై ్సజ్‌ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, అందోల్‌లోని కల్లు డిపోలో కల్లును తయీరు చేసి రవా ణా చేయకుండా అడ్డుకున్నారు. దీంతో జోగిపేట, పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో కల్లు విక్రయాలు నిలిచిపోయాయి. నాలుగు రోజుల పాటు స్థానికంగా కల్లు విక్రయాలు నిలిచిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికంగా కల్లుకు బానిసై న కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఒక్క రోజు కల్లు సేవించనట్లయితే నరాలు పీక్కుపోవడం, అనారోగ్యానికి గురికావడం వంటి ఘటనలు గతంలో జరిగాయి.

    దారులన్నీ చిట్కుల్‌వైపే...

    స్థానికంగా కల్లు విక్రయాలు నిలిచిపోవడంతో మూడు గ్రామాలకు చెందిన కల్లు ప్రియులు చిట్కుల్‌ గ్రామానికి తరలివెళుతున్నారు. అక్కడ విక్రయించే కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువగా కలపడం వల్ల కూడా స్థానికులు బాగా ఆకర్షితులవుతున్నారు. ప్రతి రోజు జోగిపేటకు చెందిన వారు మహిళలే 5, 10 లీటర్ల ప్లాస్టిక్‌ డబ్బాలలో ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుంటున్నారు. మహిళలకు బస్సు ఫ్రీ కావడం కూడా వారికి కలసి వస్తుంది. ప్రభుత్వం లైసెన్స్‌లు కలిగి ఉన్న దుకాణాలు మూసి ఉంచినా ఎకై ్సజ్‌ అధికారుల్లో ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం.

    చిట్కుల్‌ కల్లు కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..

    జోగిపేటలో కల్లు అందుబాటులో ఉన్నప్పటికీ మత్తు కు అలవాటు పడిపోయి చిట్కుల్‌కు ప్రతి రోజు ద్విచక్రవాహనాలపై వెళుతున్నారు. అక్కడే కల్లు సేవించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటివరకు పది మందికిపైగా మృత్యువాతకు గురైన సంఘటనలున్నాయి. ఈ విషయం స్థానిక ఎకై ్సజ్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా అక్రమ కల్లు రవాణాను అడ్డుకున్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు.

  • గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు

    చేర్యాల(సిద్దిపేట): గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను చేర్యాల పోలీసులు, సిద్దిపేట టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. చేర్యాల సీఐ శ్రీను కథనం ప్రకారం .. గురువారం ఉదయం చేర్యాల హెచ్‌పీ పెట్రోలు పంపు వెనకాల ఉన్న చెట్లలో గంజాయి విక్రయించేందుకు పలువురు యువకులు ప్రయత్నిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, చేర్యాల పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. నీల చందు, ఆకుల హర్షవర్ధన్‌ వద్ద 180 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, వారు హైదరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద విక్రయించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఎండు గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

    180 ఎండు గంజాయి, బైకు స్వాధీనం

  • సంగారెడ్డి జోన్‌: ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ సహజమేనని జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ స్పష్టం చేశారు. జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, ఎస్సై యాదవ్‌రెడ్డి, అలీముద్దీన్‌, ఏఎస్సై అజీముద్దీన్‌ పదవీ విరమణను పురస్కరించుకుని గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. విరమణ పొందిన అధికారులను పూలమాల శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివన్నారు. పదవీ విరమణ అనంతరం వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్‌ సకాలంలో అందే విధంగా చూస్తామన్నారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్‌–1861 అమలులో ఉంటుందని తెలిపారు. ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. వర్టికల్‌ డీఎస్పీ శ్రీనివాసరావ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ఇ.కల్యాణి, ఎఆర్‌ డీఎస్పీ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

    జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

  • దశదిన కర్మ స్నానానికి వెళ్లి..

    మిరుదొడ్డి(దుబ్బాక): దశదిన కర్మలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. భూంపల్లి ఎస్‌ఐ హరీశ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏదుల పర్శరాములు (28) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ భార్య నవనీత, ఐదు నెలల కుమారుడితో పాటు, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కాగా పర్శరాములు పాలివారైన చుక్క పోచయ్య ఇటీవల చనిపోవడంతో గురువారం దశదిన కర్మ ఉండగా.. తోటి కులస్తులతో భూంపల్లి శివారులోని చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో దిగి స్నానం చేస్తుండగా పర్శరాములు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా మూడు గంటల పాటు గజ ఈతగాళ్లు శ్రమించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కేసు దర్యాప్తులో ఉంది.

    చెరువులో మునిగి యువకుడి మృతి

  • యూ టర్న్‌ తీసుకుంటుండగా..

    మనోహరాబాద్‌(తూప్రాన్‌): జాతీయ రహదారి–44పై రెండు లారీలు ఢీకొని పల్టీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వెళుతున్న లారీ మండలంలోని కాళ్లకల్‌ శివారులోకి రాగానే యూ టర్న్‌ చేస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీలు పల్టీ కొట్టాయి. లారీ డ్రైవర్‌కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాఫిక్‌ స్తంభించడంతో జీఎమ్మార్‌ సిబ్బంది క్లియర్‌ చేశారు. గాయపడిన డ్రైవర్‌ను అంబులెన్సులో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

    ఢీకొని పల్టీ కొట్టిన రెండు లారీలు

    ఒకరికి తీవ్రగాయాలు

Vikarabad

  • పింఛన్‌ హామీ నిలబెట్టుకోవాలి

    ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్‌ మాదిగ

    దోమ: కాంగ్రెస్‌ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన పింఛన్‌ హామీని నిలబెట్టుకోవాలని ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని బొంపల్లిలో ఎంఎస్‌ఎఫ్‌ ఏపీ అధ్యక్షుడు వై.కె.విశ్వనాథ్‌ మాదిగ, మండల ఉపాధ్యక్షుడు డి.వెంకటేశ్‌తో కలిసి దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 2న కొడంగల్‌ పట్టణంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పింఛన్‌ డబ్బు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్‌ మాదిగ, గ్రామ అధ్యక్షుడు టి.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌, దివ్యాంగుల సంక్షేమ సంఘం గ్రామ అధ్యక్షుడు కె.ఆంజనేయులు పాల్గొన్నారు.

  • విదేశీ వాణిజ్య ఒప్పందం ప్రమాదకరం
    తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌

    అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏఎ)పై సంతకం చేయడమంటే అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాలకు లొంగిపోవడమేనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ విమర్శించారు. గురువారం వికారాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్యామయ్య అధ్యక్షతన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు.. పరిష్కారాలు అనే అంశంపై సెమినార్‌ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, పాడి, ఆహార, మార్కెట్‌ రంగాలకు ద్వారాలు తెరవడంతో దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు. కేంద్రం తీసుకున్న చర్యలను వ్యతిరేకించాలన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌, ఉపాధ్యక్షులు మహిపాల్‌, సతీష్‌, లక్ష్మయ్య, వల్యనాయక జమాలొద్దీన్‌, అనసూయ లక్ష్మి, రాజు, బస్వరాజు, శ్రీనివాస్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

  • పాలమూరు పూర్తి చేస్తాం

    పరిగి: ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేపట్టిన జనహిత పాదయత్ర గురువారం పరిగి మండలం రంగాపూర్‌ నుంచి పరిగి పట్టణం వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేసిందన్నారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ బిల్లును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై కేంద్రంతో కొట్లాడేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పరిగి ప్రాంతం రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

    సంక్షేమంలో మనమే ఆదర్శం

    సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటుతుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. పట్టణంలో జనహిత పాదయాత్ర అట్టహాసంగా సాగింది. కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. పాదయాత్రలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్‌, పార్టీ జిల్లా, మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, మండల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం పనిచేస్తుంది

    పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటాం

    గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ‘ప్రాణహిత– చేవెళ్ల’ను రద్దు చేసింది

    జనహిత పాదయాత్రలో

    మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

  • నేటి నుంచి ఎస్‌జీఎఫ్‌ సెలక్షన్స్‌
    సెప్టెంబర్‌ 4 వరకు కొనసాగనున్న పోటీలు

    తాండూరు టౌన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు పాఠశాలల విద్యార్థులకు పలు క్రీడల్లో జోనల్‌ లెవల్‌ ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. తాండూరు, పెద్దేముల్‌, కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ జోన్ల పరిధిలో ఈ ఎంపిక ఉంటుంది. తాండూరు, బషీరాబాద్‌, యాలాల మండలాలు తాండూరు జోన్‌ పరిధిలో ఉండగా, పెద్దేముల్‌ మండలం మాత్రం వికారాబాద్‌ జోన్‌ పరిధిలో ఉంది. క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ క్రీడాంశాల్లో అండర్‌ –14, –17 విభాగాల్లో బాలబాలికలు వేర్వేరుగా పోటీ పడనున్నారు. తాండూరు జోన్‌ పరిధిలో నేటి నుంచి క్రీడాకారుల ఎంపిక బషీరాబాద్‌లో ఉంటుందని జోనల్‌ సెక్రటరీ జె.అంబదాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల ఎంపిక విషయాన్ని అన్ని పాఠశాలలకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు తమ ఆధార్‌ కార్డు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు.

    పారదర్శకత పాటించాలి

    జోనల్‌ స్థాయిలో క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతున్నప్పటికీ జిల్లా, ఆపై స్థాయిల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నైపుణ్యం గల క్రీడాకారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

  • పనుల్లో వేగం పెంచండి
    కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

    అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో హౌసింగ్‌ అధికారులతో సమావేశమయ్యారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్య మన్నారు. సొంత ఇల్లు ఉంటే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లాకు ఇప్పటివరకు 11,785 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. 5,778 గ్రౌండింగ్‌ అయ్యాయని, 882 పూర్తయినట్లు పేర్కొన్నారు.

    హౌసింగ్‌ పీడీకి ఘన వీడ్కోలు

    ఉద్యోగ విరమణ పొందుతున్న హౌసింగ్‌ శాఖ పీడీ కృష్ణయ్యకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కృష్ణయ్య సేవలను కలెక్టర్‌ కొనియాడారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటే హౌసింగ్‌ స్కీంను ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, హౌసింగ్‌ శాఖ అధికారులు ముక్రం బాబా, సయ్యద్‌ సాజిద్‌, తాండూరు మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    చేసిన సేవలే గుర్తుండిపోతాయి

    విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్న హోసింగ్‌ పీడీ కృష్ణయ్యకు తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఆధ్వర్యంలో గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సుధీర్‌, టీజీఓ సెక్రటరీ మహమ్మద్‌ సత్తార్‌, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌, సీపీఓ వెంకటేశ్వర్లు, డీటీడీఓ కమలాకర్‌ రెడ్డి, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో భవిష్యత్తు

    మర్పల్లి: నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ తెలిపారు. గురువారం మండలంలోని పట్లూర్‌ గ్రామంలో పవర్‌ మేక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధునాతన మిషనరీ, కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఆ రంగాల్లో అనుభవం ఉన్న యువతకు డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు. పవర్‌ మేక్‌ ఫౌండేషన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం డైరెక్టర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ.. తమ సెంటర్‌లో వెల్డింగ్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రిషన్‌ తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కోర్సుల ఆధారంగా 30 నుంచి 90 రోజుల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. 8వ తరగతి పాస్‌ అయి ఉండి ఐటీఐ, లేదా ఇంటర్‌ పాస్‌ అండ్‌ ఫెయిల్‌ అయిన వారు శిక్షణకు అర్హులన్నారు. కార్యక్రమంలో పవర్‌ మేక్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ ట్రస్టీ లక్ష్మి, పవర్‌ మేక్‌ ఫౌండేషన్‌ అధినేత కిషోర్‌ బాబు, ప్రిన్సిపాల్‌ విమల్‌ కుమార్‌, నందకిషోర్‌, ప్రభాకర్‌, భరత్‌ పురోహిత్‌, పట్లూర్‌ గ్రామస్తులు అశోక్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌

  • బాల కార్మికులకు విముక్తి

    తాండూరు రూరల్‌: ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా తాండూరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 54 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ వెంకటేశం తెలిపారు. గురువారం మండలంలోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై ఒకటి నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పోలీస్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌, కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామన్నారు. 54 మంది బాల కార్మికులను గుర్తించామని, ఇందులో ఏడుగురు బాలికలు, 15 మంది ఇతర రాష్ట్రాల చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. 11 మంది షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలకార్మికులను పాఠశాలల్లో చేర్పించామన్నారు. కార్యక్రమంలో చైల్డ్‌ వెలేర్‌ కమిటీ సభ్యులు ప్రకాష్‌, సంగమేశ్వర్‌, ఎస్‌ఐ గిరి, లీగల్‌ ఆఫీసర్‌ నరేష్‌కుమార్‌, కౌన్సిలర్‌ లక్ష్మణ్‌, సూపర్‌వైజర్‌ ఆనంద్‌, స్వచ్ఛంద సంస్థ నాయకురాలు అంకిత, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, కానిస్టేబుళ్లు బస్వరాజ్‌, సంతోష్‌, మమత, కార్మిక శాఖ అధికారి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    నెల రోజుల పాటు ఆపరేషన్‌ ముస్కాన్‌

    54 మంది చిన్నారుల గుర్తింపు

    జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ వెంకటేశం

  • రుణ లక్ష్యాన్ని పూర్తి చేయండి

    తాండూరు: వంద రోజుల ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు నిర్ధేశించిన రుణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని మెప్మా జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ విక్రమ్‌సింహారెడ్డి, టీఎంసీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆర్పీలు, వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని 600 మహిళా సంఘాలకు రూ.80 కోట్ల రుణాలను ఆగస్టు నెలాఖరుగా అందించాలన్నారు. అలాగే కొత్త సంఘాలు, వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తాండూరు మున్సిపాలిటీకి 44 సంఘాల ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్థేశించడం జరిగిందన్నారు. ప్రతి సంఘంలో 5 మంది వీధి వ్యాపారుల నుంచి 20 మంది వరకు సభ్యులుగా చేర్చాలన్నారు. ఇప్పటికే 5 మంది వీధి వ్యాపారులతో 20 సంఘాలను ఏర్పాటు చేయడంపై టీఎంసీ రాజేంద్రప్రసాద్‌ను అభినందించారు. మరో 24 సంఘాలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. గొల్ల చెరువు ప్రాంతంలో మొక్కలను నాటాలన్నారు. పాత మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో మహిళా సంఘాల ఉత్పత్తి మేళాను మూడు రోజుల పాటు ఏర్పాటు చేయాలన్నారు.

    మెప్మా జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌

  • బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు
    ● సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్‌ ● బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తీరుపై ఆగ్రహం

    తాండూరు టౌన్‌: బీసీ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలన్నీ డ్రామాలు ఆడుతున్నాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు పాసై, గవర్నర్‌ వద్ద ఆమోదం కోసం ఎదురు చూస్తోందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ, కేవలం 29శాతం విద్య, ఉద్యోగాల్లో, 21శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు వెనకాడిన ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శిస్తోందన్నారు. బీసీ కులగణన వివరాలను, సర్వే డాటాను ప్రజలకు అందుబాటులో పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టకుండా కాంగ్రెస్‌ తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలైతే ముస్లింలు లాభపడతారని బీజేపీ ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. ఇలా ప్రతి రాజకీయ పార్టీ వారి స్వప్రయోజనాల కోసం వ్యవహరించకుండా, ఏకతాటిపైకి వచ్చి బీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Visakhapatnam

  • పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి

    బీచ్‌రోడ్డు: బ్యాంకు ఉద్యోగుల పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సీబీపీఆర్‌వో (సెంట్రల్‌ బ్యాంక్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైరీస్‌ ఆర్గనైజేషన్‌), ఎస్‌బీఐ పెన్షనర్ల ఫోరం సంయుక్తంగా ఈ ఆందోళనను నిర్వహించాయి. ఈ సందర్భంగా పెన్షనర్లు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకింగ్‌ యాజమాన్యాల ముందుంచారు. ముఖ్యంగా, పెన్షన్‌ నవీకరణ తక్షణమే చేపట్టాలని, పెన్షన్‌, గ్రాట్యుటీ లెక్కించేటప్పుడు ప్రత్యేక భత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఎస్‌బీఐ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్‌. బాపయ్య పంతులు, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ షాహజాద్‌ బాషాతో తదితరులు పాల్గొన్నారు.

  • కలెక్టర్‌ను కలిసిన డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు

    మహారాణిపేట: జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో)గా ఎస్‌. వెంకటేశ్వరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. విజయనగరం నుంచి బదిలీపై విశాఖ వచ్చిన వెంకటేశ్వరరావు గతంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా క్రీడా అధికారిగా విధులు నిర్వహించారు. ఇక్కడ డీఎస్‌డీవోగా పనిచేసిన ఆర్‌. జూన్‌ గాలియట్‌ను ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడకు స్పోర్ట్స్‌ ఆఫీసర్‌గా పదోన్నతిపై బదిలీ చేశారు. జూన్‌ గాలియట్‌తో పాటు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • మహిళా ప్రొఫెసర్ల సంఖ్య పెరుగుతోంది

    సీ్త్ర, పురుషులకు సమాన అవకాశాలు కల్పించడంలో ఐఐఎం విశాఖపట్నం ముందు వరసలో ఉంది. ఈ ఏడాది తొలిసారిగా పీజీపీ అభ్యర్థుల ప్రవేశాల కోసం ప్రతి ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ప్రత్యేకంగా మహిళా ఫ్యాకల్టీని నియమించాం. మహిళలను ప్రోత్సహించేందుకు అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐఐఎం విశాఖపట్నంలో కోర్సులో చేరుతున్న అభ్యర్థులలోనే కాకుండా.. మహిళా ప్రొఫెసర్ల సంఖ్య కూడా పెరిగింది. గతేడాది మహిళా ఫ్యాకల్టీ 41 శాతం ఉండగా.. ఈసారి 50 శాతానికి చేరుకుంది. ఇది విద్యా విధానంలో శుభపరిణామం.

    – ప్రొ.ఎం చంద్రశేఖర్‌, ఐఐఎంవీ డైరెక్టర్‌

  • ఆ.. ట

    ఆరిలోవ: మండల విద్యాశాఖాధికారుల(ఎంఈవో) నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వం జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఝలక్‌ ఇచ్చింది. కేవలం ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(హెచ్‌ఎంలు), స్కూల్‌ అసిస్టెంట్లకు మాత్రమే ఎంఈవో–1 పోస్టులకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఉమ్మడి సర్వీస్‌ నిబంధనలను ఉల్లంఘించడం, తమకు అన్యాయం చేయడమేనని జెడ్పీ, మున్సిపల్‌ హైస్కూళ్లు, కేజీబీవీ వంటి పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌కు గండి

    గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతి మండలంలో ఎంఈవో–1, ఎంఈవో–2 పోస్టులను ఏర్పాటు చేసింది. దీని కింద ఉమ్మడి విశాఖ జిల్లాలోని 46 మండలాల్లో 92 మంది ఎంఈవోలు నియమితులయ్యారు. ప్రస్తుత విశాఖ జిల్లా పరిధిలోని 11 మండలాల్లో 22 మంది విధుల్లో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న హెచ్‌ఎంలు, సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు మాత్రమే ఎంఈవో పోస్టులకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసి, వివరాలు సేకరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల జెడ్పీ, మున్సిపల్‌, కేజీబీవీ వంటి ఇతర యాజమాన్యాల కింద పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు పదోన్నతి అవకాశాన్ని కోల్పోతారు. 2017లో అనుసరించిన విధంగానే కామన్‌ సీనియార్టీ ఆధారంగా ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

    ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

    జెడ్పీ, మున్సిపల్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) ద్వారా నియమితులైనవారే. వారందరిలో సీనియార్టీ ప్రకారం హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు ఎంఈవో పోస్టులకు అర్హులు. అయినప్పటికీ కామన్‌ రూల్స్‌ పాటించకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలల వారికే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందని ఇతర యాజమాన్య ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. కాగా.. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో పని చేస్తున్న ఎంఈవోలందరూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతల(ఎఫ్‌ఏసీ) కిందనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన 297 ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కేవలం 31 మాత్రమే. ఈ 31 పాఠశాలల్లోని కొద్ది మందికి మాత్రమే ఎంఈవోలుగా అవకాశం కల్పిస్తూ.. మిగిలిన 266 పాఠశాలల్లో పని చేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులను విస్మరించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

    ప్రభుత్వ యాజమాన్య హైస్కూల్‌ హెచ్‌ఎం,

    ఎస్‌ఏలకు మాత్రమే ఎంఈవోలుగా అవకాశం

    రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

    మిగిలిన యాజమాన్య టీచర్లపై వివక్ష

    ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

    అన్ని మేనేజ్‌మెంట్లకు అవకాశం కల్పించాలి

    అన్ని మేనేజ్‌మెంట్లకు చెందిన ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలకు, సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు ఎంఈవో–1గా అవకాశం కల్పించాలి. వారిని కూడా పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించాలి. అలాంటప్పుడే మంచి విద్యా విధానం కొనసాగుతుంది. ఎఫ్‌ఏసీ బాధ్యతల వల్ల సక్రమంగా విధులు నిర్వహించక సరైన విద్యా ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వం పునరాలోచించాలి.

    – గోపీనాథ్‌, పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా కన్వీనర్‌

    సీనియార్టీ ద్వారా భర్తీ చేయాలి

    ఎంఈవో–1 పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్ల వివరాలు మాత్రమే సేకరించడం సరికాదు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌కు సంబంధించిన జీవో అమలు చేయాల్సి ఉండగా.. దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలి.

    –టి.ఆర్‌.అంబేడ్కర్‌,

    యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా

    జెడ్పీ టీచర్లపై ఎందుకు వివక్ష?

    ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఎంఈవో–1 బాధ్యతలు అప్పగించడం సరికాదు. ఇది జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులపై వివక్ష చూపడమే అవుతుంది. సర్వీస్‌ రూల్స్‌ సమస్య కారణంగా రెండు దశాబ్దాలుగా జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులు వివక్షకు గురవుతున్నారు. ప్రస్తుతం గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని జూనియర్లు కూడా ఎంఈవోలు అవుతారు. సీనియర్లయిన జెడ్పీ హై స్కూల్‌ ఉపాధ్యాయులు మాత్రం పదోన్నతి కోల్పోతారు. – ఇమంది పైడిరాజు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి, విశాఖ

  • వనితలదే!
    వాణిజ్యం

    ఐఐఎం విశాఖ

    ఎంబీఏ కోర్సులో

    రికార్డు స్థాయిలో

    మహిళలు

    దశాబ్ది కాలంలో ఇదే అత్యధికం

    2015లో కోర్సులను ప్రారంభించిన తర్వాత ఐఐఎం విశాఖపట్నంలో పీజీపీ ఎంబీఏ కోర్సులో మహిళాధిక్యత పెరగడం ఇదే తొలిసారి. ఐఐఎంవీలో మిగిలిన అన్ని కోర్సుల్లో సీ్త్ర–పురుషుల అడ్మిషన్‌ బేధం 35 నుంచి 40 శాతం ఉండేది. 2015–16లో 10 నుంచి 15 శాతం మంది మహిళలు మాత్రమే కోర్సులో చేరారు. క్రమంగా ఈ అంతరం తగ్గుతూ వస్తోంది. మహిళల్ని ప్రోత్సహించేందుకు వుమెన్‌ స్టార్టప్స్‌, సూపర్‌ న్యూమరీ మొదలైన అవుట్‌ రీచ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. అందుకే 2025–26లో 52.16 శాతం మంది మహిళల ప్రవేశాల వెనుక ఐఐఎం అధికారుల శ్రమ ఎంతో ఉంది. ఐఐఎం కోజికోట్‌లో ఫుల్‌టైమ్‌ పీజీపీలో 51 శాతం మంది మహిళలు చేరారు. ఐఐఎం అహ్మదాబాద్‌, ఐఐఎం లక్నోలో 30 శాతం మహిళలు అడ్మిషన్లు పొందారు. బాలికా విద్యకు కుటుంబాల్లో ప్రోత్సాహం పెరుగుతుండటం, రోల్‌మోడల్స్‌ను ఎంపిక చేసుకుని.. వారి లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు వేయాలని మహిళల్లో సంకల్పం పెరగడం.. కార్పొరేట్‌ సెక్టార్‌లో పెరుగుతున్న డిమాండ్‌ వనితలను ఇటువైపుగా అడుగులు వేయిస్తోంది.

    సాక్షి, విశాఖపట్నం : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌–విశాఖపట్నం(ఐఐఎంవీ) విభిన్న ఆలోచనలతో ముందుకెళ్తోంది. మహాత్మాగాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌ పొందిన తర్వాత ఐఐఎంలో చేరేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 2015లో ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఐఐఎం విశాఖపట్నంలో ఫ్లాగ్‌షిప్‌ ఎంబీఏ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌లో నారీశక్తి పెరిగింది. 2025–27 విద్యా సంవత్సరంలో మహిళా విద్యార్థులు పైచేయి సాధించారు. ఇటీవలే కోర్సుకు సంబంధించి ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ఎంబీఏలో మొత్తం 347 సీట్లుండగా 181 సీట్లు మహిళా అభ్యర్థులు పొందగా.. 166 సీట్లు పురుషులకు దక్కాయి. అంటే 52.16 శాతం సీట్లు వనితలకే దక్కినట్లయింది. ఇందులో 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారున్నారు. వాణిజ్య, మానవ వనరులు, మార్కెటింగ్‌, తదితర రంగాల్లో రాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.

  • ఏయూలో తికమక పాలన
    ● మూడు విభాగాలకు నూతన హెచ్‌వోడీలు ● జర్నలిజం విభాగాధిపతిగా పొలిటికల్‌ సైన్స్‌ ఆచార్యుడు ● థియేటర్‌ ఆర్ట్స్‌ హెచ్‌వోడీగా ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రొఫెసర్‌ ● ఇద్దరూ సంబంధం లేని విభాగాలకు అధిపతులు

    మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలన పక్కదారి పడుతోంది. సంబంధం లేని విభాగాలకు చెందిన ఆచార్యులను హెచ్‌వోడీలుగా నియమించడం చర్చనీయాంశమైంది. జర్నలిజంలో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లను కాదని ఇతర విభాగానికి చెందిన ఆచార్యుడిని విభాగాధిపతిగా చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏయూలో తీసుకుంటున్న తికమక నిర్ణయాలు కారణంగా పాలన గాడి తప్పుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం ఏయూలో మూడు విభాగాలకు హెచ్‌వోడీలను నియమించారు. ఇందులో హిందీకి అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ను హెచ్‌వోడీగా పెట్టారు. మిగిలిన రెండు విభాగాలకు సంబంధం లేని వారిని హెచ్‌వోడీగా నియమించారు. జర్నలిజం విభాగాధిపతిగా పొలిటికల్‌ సైన్స్‌ ఆచార్యుడు పి.ప్రేమానందంకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జర్నలిజం విభాగానికి ముగ్గురు సీనియర్‌ ఫ్యాకల్టీలు ఉన్నారు. వీరిలో ఒకరిని హెచ్‌వోడీగా నియమించే అవకాశముంది. కానీ వీరిని పక్కనపెట్టి పొలిటికల్‌ సైన్స్‌కు చెందిన హెచ్‌వోడీని నియమించడం గమనార్హం. అలాగే థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగాధిపతిగా ఫైన్‌ ఆర్ట్స్‌ హెచ్‌వోడీ డి.సింహాచలంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    వీరిద్దరూ తమ సొంత విభాగాలకు హెచ్‌వోడీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక విభాగంలో విభాగాధిపతిగా పనిచేస్తున్న వారిని మరో విభాగానికి హెచ్‌వోడీగా నియమించడం కూడా వివాదాస్పదమవుతోంది. అతిథి అధ్యాపకుల నియామకాలకు ఇంటర్వ్యూలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హడావుడిగా ఈ నియామకాలు జరగడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది అనుచిత లబ్ధి చేయడానికా? లేదా అణిచివేయడానికా అని అతిథి అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రిన్సిపాల్‌ థియేటర్‌ ఆర్ట్స్‌, జర్నలిజానికి ఇన్‌చార్జ్‌ హెచ్‌వోడీగా వ్యవహరిస్తున్నారు. పనిభారం పెరిగిపోవడంతో పాటు వివిధ విభాగాలకు హెచ్‌వోడీలుగా బాధ్యతలు నిర్వహించడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది. వర్సిటీ అధికారుల నుంచి కూడా సహకారం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రిన్సిపాల్‌ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో హెచ్‌వోడీల నియామకం జరిగిందని మరో వాదన వినిపిస్తోంది.

  • అప్పన్న కొండపై రూ.10 వేలతో పెళ్లి

    సింహాచలం: సింహాచలం దేవస్థానంలో వివాహాల నిమిత్తం డెకరేషన్‌ మండపాల నిర్వహణ బహిరంగవేలం ప్రక్రియను నిలుపుదల చేసినట్టు ఈవో వి.త్రినాథరావు ప్రకటించారు. ఎవరైనా ఆలయం పరిధిలో పెళ్లి చేసుకోవాలనుకుంటూ దేవస్థానానికి రూ.10 వేలు చెల్లించి, దేవస్థానం సూచించిన ప్రదేశాల్లో వివాహాలు చేసుకోవచ్చన్నారు. బయటి వ్యక్తులు/సంస్థల ద్వారా డెకరేషన్‌ మండపాలు, విద్యుద్దీపాలంకరణ జరిపించుకోవచ్చని పేర్కొన్నారు. వివాహ బృందాల నుంచి మండపాల కాంట్రాక్టర్‌ అధిక ధరలు వసూలు చేస్తుండటంతో భక్తులకు లబ్ధి చేకూర్చేందుకు డెకరేషన్‌ మండపాల లీజ్‌ విధానాన్ని నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న డెకరేషన్‌ మండపాల నిర్వహణ కాంట్రాక్ట్‌ జూలై 31తో ముగిసిందన్నారు. కొండపై ఒకే సమ యంలో గజపతి సత్రంలో రెండు వివాహాలకు, పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల వద్ద ఉన్న పార్కింగ్‌ స్థలంలో మూడు, లోవ తోట వద్ద మూడు వివాహాలకు అనుమతి ఉంటుందన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఈవో అనుమతితో ఆయన సూచించిన ప్రదేశాల్లో కూడా వివాహాలు చేసుకోవచ్చన్నారు. వివాహం ముగిసిన మూడు గంటల్లోపు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. దేవస్థానానికి చెల్లించే రూ.10 వేలుకు అదనంగా రూ.5 వేలు అడ్వాన్స్‌ కింద చెల్లించాలని పేర్కొన్నారు. శానిటేషన్‌ నిర్వహణకు రూ.2 వేలు, విద్యుత్‌ అదనపు లోడ్‌ ఆధారంగా కొంత మొత్తం మినహాయించుకుని మిగిలిన మొత్తం వాపసు చేయనున్నట్లు వెల్లడించారు.

    డెకరేషన్‌ మండపాల

    బహిరంగ వేలం నిలుపుదల

  • పరిశ్రమల నిర్వహణకు పూర్తి సహకారం

    మహారాణిపేట: జిల్లాలో పరిశ్రమల నిర్వహణకు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్‌ మీటింగు హాలులో జరిగిన డీఐఈపీసీ (డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోర్టు అండ్‌ ప్రమోషన్‌ కమిటీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన భూముల్లో నిర్వాహకులు నిర్ణీత సమయంలోనే పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటోనగర్‌, ఐటీ హిల్స్‌ ప్రాంతాల్లో ప్రత్యేక బస్‌ స్టాప్‌లు ఏర్పాటు చేయాలని, ఆటోనగర్‌లో దుమ్ము, ధూళి రేగకుండా యజమానులు, అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐలా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు.. ఐలా పరిధిలో సోలార్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. వడ్లపూడి వద్ద ఆర్వోబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులకు వేగంగా పరిష్కారం చూపాలని, తూనికలు కొలతలు శాఖ అధికారులు వే బ్రిడ్జిలను తనిఖీ చేయాలని చెప్పారు. పీ–4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఆదిశేషు, ఫ్యాక్టరీల చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ కుమార్‌, ఏపీఐఐసీ జెడ్‌ఎం సింహాచలం, పీసీబీ ఈఈ ముకుందరావు, వివిధ విభాగాల అధికారులు, పాల్గొన్నారు.

  • తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌తో తలైవాస్‌ ఢీ

    ఈ నెల 29 నుంచి ప్రో కబడ్డీ ప్రారంభం

    విశాఖ స్పోర్ట్స్‌: ప్రో కబడ్డీ 12వ సీజన్‌ ఈ నెల 29న పోర్ట్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటలకు జరిగే ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు తమిళ తలైవాస్‌తో తలపడనుంది. ఏడేళ్ల విరామం తర్వాత విశాఖ మరోసారి ప్రో కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రస్తుత సీజన్‌లో తొలి విడత మ్యాచ్‌లు ఇక్కడే జరగనున్నాయి. తెలుగు టైటాన్స్‌ తమ రెండో మ్యాచ్‌ను ఈ నెల 30న యూపీ యోధాస్‌తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 7న బెంగాల్‌ వారియర్స్‌తో, 10న యు ముంబాతో విశాఖ వేదికగానే తలపడనుంది. ప్రో కబడ్డీ ప్రారంభ సీజన్‌ను తెలుగు టైటాన్స్‌ విశాఖపట్నం నుంచే మొదలుపెట్టింది. ఆ తర్వాత తమ హోమ్‌ గ్రౌండ్‌ను హైదరాబాద్‌కు మార్చింది. మధ్యలో మూడో, ఎనిమిదో సీజన్‌లకు విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో తలపడనున్నాయి. తొలి విడత పోటీలు విశాఖపట్నంలో జరగనుండగా, తదుపరి విడత పోటీలు జైపూర్‌, చైన్నె, ఢిల్లీల్లో నిర్వహించనున్నారు. లీగ్‌ దశ ముగిసిన తర్వాత ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

  • భూరాబ
    రాణి ఇచ్చిన స్థలంపై
    ● 1,500 గజాల స్థలం కబ్జాకు టీడీపీ కార్పొరేటర్‌ భర్త యత్నం ● షెడ్ల కూల్చివేతతో నిరాశ్రయులైన15 కుటుంబాలు ● అధికారుల ఎదుటే బాధితులపైటీడీపీ నేతల దౌర్జన్యం

    కంచరపాలెం: ‘అరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మాకు రాణి గారు బతకమని ఇచ్చిన స్థలం ఇది. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి.. మా పశువులను బయటకు గెంటేసి, షెడ్‌లను కూల్చేస్తే మేం ఎక్కడికి పోవాలి?’అంటూ జీవీఎంసీ 54వ వార్డు, బాపూజీనగర్‌కు చెందిన 15 కుటుంబాల ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. తరతరాలుగా తాము నివసిస్తున్న 1,500 గజాల స్థలాన్ని టీడీపీ కార్పొరేటర్‌ చల్లా రజినీ భర్త ఈశ్వరరావు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ వారు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన జనవాణిలో ఫిర్యాదు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు జనసేన ఉత్తర ఇన్‌చార్జి పి.ఉషాకిరణ్‌ గురువారం అధికారులతో ఇక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ‘మా పూర్వీకులకు సుమారు 60 ఏళ్ల కిందట బిల్లా చంద్రవతి అనే రాణి జీవనోపాధి కోసం సర్వే నంబర్‌ 60/1బిలో ఉన్న ఈ స్థలాన్ని రాసి ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే చిన్న చిన్న షెడ్లు వేసుకుని, పశువులను పోషించుకుంటూ జీవిస్తున్నాం.’ అని బాధితులు తెలిపారు. అయితే కొన్నేళ్లుగా ఈ స్థలంపై కన్నేసిన చల్లా ఈశ్వరరావు, ఇతర రాజకీయ నాయకులు దీన్ని ఆక్రమించుకోవాలని చూడగా, ఐక్యంగా అడ్డుకున్నట్లు చెప్పారు. కాగా.. గత సోమవారం ఎన్‌.వి.నాగేశ్వరరావు అనే వ్యక్తితో పాటు, రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది, పోలీసుల భారీ బందోబస్తుతో పాటు పలువురు బయటి వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ‘కోర్టులో కేసు గెలిచాం. ఈ స్థలం 18 ఏళ్ల కిందటే కార్పొరేటర్‌ చల్లా రజినీ పేరు మీద రిజిస్టర్‌ అయింది’అని చెబుతూ, అక్కడున్న పశువులను బలవంతంగా బయటకు తరలించారు. వాళ్లు నివసిస్తున్న షెడ్‌లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. దీంతో నిరాశ్రయులయ్యామని బాధితులు జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, పంచాయితీ పెద్దల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటుండగా.. కార్పొరేటర్‌ భర్త చల్లా ఈశ్వరరావు వారిపై దౌర్జన్యానికి దిగి, తీవ్ర వాగ్వాదం చేశారు. దీంతో బాధితులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమస్యను విన్న జనసేన ఇన్‌చార్జి తహసీల్దార్‌తో మాట్లాడి.. పూర్తి నివేదిక తెప్పించుకుని, బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అయితే.. కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ నేత దౌర్జన్యంపై.. మిత్రపక్షమైన జనసేన నాయకులు విచారణ జరిపి తీర్పు చెబుతామనడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

    అధికారుల అండతో రౌడీయిజం

    18 ఏళ్ల కిందట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని చెబుతూ.. 18 రోజులుగా 15 కుటుంబాలను అధికారులు, పోలీసుల అండతో రౌడీలను పెట్టి రోడ్డున పడేశారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం ఎంతగా పెరిగిపోతోందో మా కుటుంబాలు రోడ్డున పడటమే నిదర్శనం. గతంలో వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌గా ఎన్నికై .. ఇప్పుడు టీడీపీలో చేరి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలి.

    – బసవ అప్పలకొండ, బాధిత మహిళ

    60 ఏళ్ల స్థలంపై టీడీపీ కన్ను

    టీడీపీ కార్పొరేటర్‌ భర్త చల్లా ఈశ్వరరావు రౌడీలతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. 60 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న మా స్థలంపై టీడీపీ నాయకులు కన్నేశారు. ఈ స్థలాన్ని కోర్టులో గెలుచుకున్నామని చెబుతూ.. టీడీపీ నాయకుల పేరుతో రౌడీలను తీసుకొచ్చి, ఇక్కడ ఉన్న సామగ్రిని, పశువులను, మొక్కలను తొలగించి స్థలానికి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. పోలీసులను ఆశ్రయిస్తే కోర్టులో తేల్చుకోండి అంటూ రాజకీయ నాయకులకు మద్దతుగా వ్యవహరించారు. ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి గతంలో కూడా రౌడీలతో బెదిరించారు.

    – గుజ్జు పైడిరాజు,

    బాధితుడు, బాపూజీనగర్‌, 104 ఏరియా

  • రూ.1.

    మధురవాడ: విశాఖ రూరల్‌ మండలం మధురవాడ ప్రాంతంలో ఇప్పటివరకూ ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా విన్నాం. అయితే తాజాగా వుడా ఆమోదిత లేఅవుట్‌లో ఉన్న ఖాళీ స్థలాలను, గెడ్డలను సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొట్టేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురవాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నం. 281/పీ, 282/పీ, 284/పీ, 300/పీ, 302/పీ, 303/పీ, 305/పీ, 306/పీ, 610/పీ వంటి నంబర్లలో 1990 ప్రాంతంలో షిప్‌యార్డు ఉద్యోగుల కోసం బింద్రానగర్‌లో సుమారు 24.48 ఎకరాల్లో 268 ప్లాట్లతో ఒక లేఅవుట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో రోడ్లు, పార్కులతో పాటు కాలువలు, గెడ్డలు వంటి బహిరంగ స్థలాలు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు ఈ ఖాళీ స్థలాలకు, గెడ్డలకు ప్లాట్‌ నంబర్లకు అదనంగా పీ చేర్చి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు సమాచారం.

    211పీ ప్లాట్‌ నంబరుతో సుమారు రూ.1.75 కోట్ల విలువైన 267 గజాల స్థలాన్ని కాజేశారు. కొందరు వ్యక్తులు ఒక వృద్ధుడిని ముందు పెట్టి ఈ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడమే కాకుండా, జీవీఎంసీ నుంచి అక్రమంగా ప్లాన్‌ పొంది కొద్ది రోజులుగా చకచకా నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది ఈ పనులను నిలుపుదల చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

    అధికారుల పాత్ర : ఈ అక్రమాల్లో ఓ జీవీఎంసీ సర్వేయర్‌ సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతని సహకారంతోనే తప్పుడు సర్వే రిపోర్టులు సృష్టించి, రిజిస్ట్రేషన్‌ చేయించడమే కాకుండా, ప్లాన్‌ను కూడా పొందారని సమాచారం. ఈ తప్పుల్లో భాగస్వాములైన జీవీఎంసీ అధికారులు తాము ఎక్కడ బయటపడతామోనని ఆచుతూచి వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటకు రాకుండా వారు సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఈ స్థలంలో ఇలాంటి మరికొన్ని నిర్మాణాలు కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది.

    పనులు నిలుపుదల చేయించిన అధికారులు

    తప్పుడు పత్రాలతో గెడ్డ, ఖాళీ స్థలాల ఆక్రమణ

    బెదిరింపులకు దిగుతున్న ముఠా

    ఈ అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు కొందరు ముఠాగా ఏర్పడి, ఈ వ్యవహారాన్ని ఎవరైనా బయటపెడితే అంతు చూస్తామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. పోలీసు కేసులు పెడతామని, వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగస్వాములైన అధికారులనూ బయటకు లాగుతామంటూ ప్రచారం చేస్తున్నట్లు కూడా సమాచారం. ఈ విషయంలో ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి, తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

  • అత్యుత్తమ ఫీచర్లతో వివో సరికొత్త ఫోన్లు

    ఏయూక్యాంపస్‌: అత్యుత్తమ ఫీచర్లతో కూడిన సరికొత్త మొబైల్‌ ఫోన్‌లను వివో.. మార్కెట్లోకి విడుదల చేసింది. బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో వివో తమ కొత్త ఎక్స్‌ 200 ఎఫ్‌ఈ, ఎక్స్‌ ఫోల్డ్‌ 5 మోడళ్లను ఆవిష్కరించింది. సెల్‌ పాయింట్‌ ఎండీ మోహన్‌ ప్రసాద్‌ పాండే, డైరెక్టర్‌ బాలాజీ పాండేలతో కలిసి వివో ప్రతినిధి మీర్‌ మెహిద్‌ వీటిని లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి నటి సౌమ్య రావు, మోడల్‌ అంకిత ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివో ప్రతినిధి మీర్‌ మెహిద్‌ మాట్లాడుతూ వినియోగదారులే తమ సంస్థకు అత్యంత ప్రధానమన్నారు. సెల్‌ పాయింట్‌ తమకు కీలక భాగస్వామిగా నిలుస్తోందని వెల్లడించారు. సెల్‌ పాయింట్‌ ఎండీ మోహన్‌ ప్రసాద్‌ పాండే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా వివోతో తమ అనుబంధం కొనసాగుతోందన్నారు. వివో అత్యుత్తమ సేవలతో వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని ప్రశంసించారు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా వివిధ క్రెడిట్‌ కార్డులపై డిస్కౌంట్‌లు, నో కాస్ట్‌ ఈఎంఐ, జీరో డౌన్‌ పేమెంట్‌ వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వి డ్రీమ్‌ డీజీఎం వసంత్‌ రెడ్డి మాట్లాడుతూ సెల్‌ పాయింట్‌తో బలమైన అనుబంధం ఉందన్నారు. సీనియర్‌ ఆర్‌ఎం ఈశ్వర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివోకు 15 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని తెలిపారు. అత్యుత్తమ కెమెరా ఫీచర్లతో ఫోన్లు అందుబాటులో ఉంచామని వివరించారు. కార్యక్రమంలో ఏజీఎం సతీష్‌, ఏపీ సేల్స్‌ హెడ్‌ షేక్‌ ఆజాద్‌, సెల్‌ పాయింట్‌ ఏఎస్‌ఎంలు గోవింద్‌, వెంకటేష్‌, దినేష్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.

  • అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూలు ప్రారంభం

    మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, హెచ్‌ఆర్‌ఎం, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హెచ్‌ఆర్‌ఎం, కామర్స్‌ విభాగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు విజయనగరం ప్యాలెస్‌లో జరిగాయి. బయోటెక్నాలజీ, మ్యాథ్స్‌, బయో కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ విభాగాల ఇంటర్వ్యూలు ఇంజినీరింగ్‌ క్యాంపస్‌లోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. హెచ్‌వోడీతోపాటు, ఫ్యాకల్టీ చైర్మన్‌, ఇద్దరు సబ్జెక్ట్‌ నిపుణులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలిరోజు ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రశాంతంగా జరిగినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.

  • స్టాళ్ల కేటాయింపులో  పారదర్శకత

    విశాఖ విద్య: జిల్లాలోని రైతుబజార్లలో డ్వాక్రా, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్ల కేటాయింపును నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామని మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జి.శ్రీనివాస కిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 28న ‘రైతు బజార్లపై కూటమి గద్దలు’అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని రైతుబజార్లలో డ్వాక్రా, దివ్యాంగుల కోసం కేటాయించిన 100 స్టాళ్ల గడువు ముగియడంతో.. వాటి నిర్వహణకు కొత్త లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు శ్రీనివాస కిరణ్‌ వివరించారు. ఈ స్టాళ్ల కోసం మొత్తం 580 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలోని డీఆర్‌డీఏ, జీవీఎంసీ యూసీడీ, వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో కలెక్టర్‌ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని శ్రీనివాస కిరణ్‌ స్పష్టం చేశారు.

Vizianagaram

  • డిజిట
    కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు తయారైంది కూటమి ప్రభుత్వం తీరు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ తీసుకోవడం లేదు కానీ..ప్రజలను ఏదో రకంగా దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి డిజిటల్‌ బోర్డుల ఏర్పాటు పేరుతో చేస్తున్న కలెక్షన్లు ఉదాహరణగా నిలుస్తున్నాయి. –వీరఘట్టం

    ఈ పొటో చూశారా? వీరఘట్టంలోని తెలగవీధిలో ఓఇంటికి 5–18 నంబర్‌ వేస్తూ బోర్డు అతికించారు.అయితే ఈ ఇంటి నంబర్‌ 6–68 అని పంచాయతీ రికార్డులో ఉంది.తప్పులు తప్పులుగా బోర్డులు అతికించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని వారు చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ వారడిగిన రూ.50 ఇచ్చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.

    తప్పుల తడకగా ఇంటి నంబర్ల నమోదు

    ఒక్కో బోర్డుకు రూ.50 చొప్పున వసూలు

    ప్రతి ఇంటికి డిజిటల్‌ ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటు పేరుతో ప్రజల నుంచి దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీపై జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి ఈ ఏడాది మార్చి 23న ఉత్తర్వులు ఇచ్చినట్లు బోర్డులు అమర్చడానికి వచ్చినవారు చెబుతున్నారు. అధికారులు ఇచ్చిన జీవో కాపీ చూపిస్తున్నారు. అయితే ఈ డిజిటల్‌ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.అభ్యంతరాలుంటే బోర్డులు బిగించవద్దని,.పేద, మధ్య తరగతి వారికి ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ జీవో కాపీలో ఉంది.అయితే అవేవీ కాకుండా ప్రతి ఇంటికి బోర్డు బిగించి డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.అయితే ఈ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారే తప్ప ఈ నిలువు దోపిడీని అడ్డుకోకపోవడంపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇంటింటికీ ఏర్పాటు చేస్తున్న ఇంటి నంబర్లు తప్పుల తడకగా ఉన్నాయి.

    ఫోన్‌ కాల్స్‌ ఒత్తిడితో..

    అమరావతి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ ఒత్తిడితో ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ ముఠా నేరుగా గ్రామాల్లో ఇంటి చిరునామా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.పేరుకు వీరు ఒక్కో ఇంటి నుంచి కలెక్షన్‌ చేస్తున్నది రూ.50 గా కనిపిస్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ.2.25 కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. కొంత మంది మాత్రం ఈ బోర్డులు వద్దని తిరస్కరిస్తున్నప్పటికీ వారితో వాదిస్తూ ఈ బోర్డులు అందరి ఇళ్లకు వేయాలని మా వద్ద ఆర్డర్‌ కాపీ ఉందని బలవంతంగా ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

    ఈ ఫొటో చూశారా?

    చిన్న ఇనుప రేకును తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మన్యం జిల్లా, డిజిటల్‌ ఇంటి చిరునామా అనే అక్షరాలు ఉన్న ప్రతి ఇంటి గుమ్మానికి అతికిస్తున్నారు. ఇలా రేకు బోర్డు పెట్టినందుకు ప్రతి ఇంచి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. వీరఘట్టం మండలంలో ఇంతవరకు సుమారు 15 వేల ఇళ్లకు ఇటువంటి బోర్డులు పెట్టి గృహవాసుల నుంచి రూ.7.50 లక్షలను వసూలు చేశారు. ఇదే మాదిరి జిల్లాలో ఉన్న 4.50 లక్షల గృహాలకు ఇటువంటి బోర్డులు అమర్చి ఏకంగా రూ.2.25 కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. డిజిటల్‌ బోర్డు పేరుతో ఇంటికి అమర్చుతున్న ఈ రేకు కనీసం రూ.5 కూడా ఉండదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    మాకు సంబంధం లేదు

    జిల్లాలో చాలా చోట్ల ఇంటికి డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఆ బోర్డుల ఏర్పాటుకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నచ్చకపోతే ఎవరూ ఆ బోర్డులు ఏర్పాటు చేసుకోవద్దు. ఎక్కడైనా బోర్డులు ఏర్పాటు చేయాలనుకుంటే గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి, పంచాయతీ అంగీకారంతో పంచాయతీ రికార్డుల ప్రకారం ఇంటి నంబర్లు వేసి బోర్డులు ఏర్పాటు చేయవచ్చు. ఇష్టం లేని వారు బోర్డులు వద్దని చెప్పండి.

    – పి.కొండలరావు,

    డీపీఓ, పార్వతీపురం మన్యం జిల్లా

  • ముగిసిన హ్యాండ్‌బాల్‌ మీట్‌

    శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ జవహర్‌నవోదయ విద్యాలయలో మూడురోజులుగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ రీజియన్‌స్థాయి హ్యాండ్‌బాల్‌ మీట్‌ 2025–26 గురువారం ముగిసింది. ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌ పర్యవేక్షణలో నిర్వహించిన హ్యాండ్‌బాల్‌ మీట్‌కు దక్షిణ భారతదేశంలో ఎనిమిది క్లస్టర్లు యానాం, అదిలాబాద్‌, కన్నూర్‌, కరైకల్‌, ఎర్నాకుళం, హవేరి, హాసన్‌, కలబుర్గిల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారంతా మూడు రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఏపీ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎస్‌.రాజారావు నేతృత్వంలో నిర్వహించిన పోటీల్లో యానాం క్లస్టర్‌ అత్యుత్తమ ప్రదర్శనతో 26బహుమతులు సాధించి ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ కై వసం చేసుకుంది. గురువారం సాయంత్రం ముగింపు వేడుకల్లో ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలను దిగ్విజయంగా పూర్తిచేసిన రిఫరీలు, కోచ్‌లు, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, క్రీడాకారులకు ప్రిన్సిపాల్‌ ధన్యవాదాలు తెలిపారు.

  • మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

    పార్వతీపురం రూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో మిగులు సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌ ఎస్‌. రూపావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం వరకు ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్‌ కార్డుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్‌తో తమకు కావాల్సిన ప్రాంతంలో ఆయా పాఠశాలలను, కళాశాలను నేరుగా వెళ్లి సంప్రదించాలని కోరారు. బాలురుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో కొప్పెర్ల, బాడంగి, పాలకొండ, సాలూరు, జోగింపేటలో అదేవిధంగా బాలికలకు సంబంధించి చీపురుపల్లి, నెల్లిమర్ల, వేపాడ, వీఎంపేట, వంగర, గరుగుబిల్లి, కొమరాడ, భామిని పాఠశాలల్లో అలాగే కళాశాలల్లో ఉన్న ఖాళీల మేరకు సంబంధిత ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని సూచించారు.

    జిల్లా కన్వీనర్‌ ఎస్‌ రూపావతి

  • నాగుప

    పట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌

    విజయనగరం గంటస్తంభం: స్థానిక బాబామెట్టలోని రెండవ లైన్‌లో ఫారెస్ట్‌రేంజ్‌ ఆఫీసర్‌ అయినంపూడి శ్రీనివాసరావు ఇంటి పరిసరాల్లో ఓ నాగుపాము రెండు రోజులుగా తిరుగుతూ భయాందోళన సృష్టిస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మళ్లీ ఆ పాము కనబడడంతో ఫారెస్ట్‌ అధికారుల సమాచారం మేరకు కలెక్టరేట్‌ ప్రాంతానికి చెందిన స్నేక్‌ క్యాచర్‌ సాయికుమార్‌ వచ్చి పామును పట్టుకుని ఓ డబ్బాలో వేసి మూతవేసి పాముకు గాలి ఆడడానికి డబ్బాకు రంధ్రాలు ఏర్పాటు చేశాడు. పట్టుకున్న పామును పూల్‌భాగ్‌ ఫారెస్టులో వదిలిపెట్టనున్నట్లు సాయికుమార్‌ తెలిపాడు.

    3.33 కేజీల గంజాయి స్వాధీనం

    పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు సమీపంలో ఉన్న దుర్గ గుడి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి నుంచి 3.33 కేజీల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకట సురేష్‌ తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన అశిష్‌ పండిట్‌(23) ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి చైన్నెకి తరలిస్తుండగా పి.కోనవలస చెక్‌ పోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నాయని గమనించి ఒడిశా నుంచి వస్తున్న వాహనం దిగిపోయి దుర్గగుడి వద్ద అనుమానాస్పదంగా ఉన్నాడు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకుని తనిఖీ చేయగా 3.33 కేజీల గంజాయి బయటపడడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

    ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం

    పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని కురుపాం, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీజీటీ(తెలుగు) ఉపాధ్యాయుడి పోస్టుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ బహుదూర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీతోపాటు బీఈడీ పూర్తిచేసి ఉండి, టెట్‌లో అర్హత సాధించినవారు ఈనెల 9లోగా హెచ్‌టీటీపీఎస్‌://ఈంఆర్‌ఎస్‌.ట్రైబల్‌.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 11న ఇంటర్వ్యూ ఉంటుందని, మరిన్ని వివరాలకు పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫోన్‌ 6200335685 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

    నాలుగు క్లినిక్‌ల సీజ్‌

    భామిని: మండలంలోని సింగిడి, గురండిలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆర్‌ఎంపీలు, పీఎంపీలు నడుపుతున్న నాలుగు క్లినిక్‌లను సీజ్‌ చేసినట్లు బత్తిలి, భామిని వైద్యాధికారులు పసుపులేటి సోయల్‌, కొండపల్లి రవీంద్రలు గురువారం తెలిపారు. కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓల ఆదేశాల మేరకు భామిని తహసీల్దార్‌ శివన్నారాయణ, బత్తిలి ఎస్సై జి.అప్పారావులతో కలిసి సింగిడి, గురండి గ్రామాల్లో దాడులు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న క్లినిక్‌లను సందర్శించి సీజ్‌ చేసి నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు చెప్పారు. క్లినిక్‌లలో వాడుతున్న మందులు, సర్జికల్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బృందంలో డీటీ రమేష్‌ కుమార్‌, ఎంఆర్‌ఐ మణి ప్రభాకర్‌, వీఆర్‌ఓ ఉన్నారు.

  • లిమ్క

    లక్కవరపుకోట: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌ గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన ఎస్‌ఎస్‌ఎన్‌ రాజుకు ఆరుదైన కరెన్సీ నోట్లు సేకరించడం అలవాటు. అరుదైన కరెన్సీ నోట్లు సేకరించినందుకు గాను 2025వ సంవత్సరానికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో ఆయన స్థానం సాధించారు. అంతేకాకుండా ఒకేసారి ఆయన మూడు లిమ్కా రికార్డులు సాధించడం విశేషం. ప్రతి కరెన్సీ నోటుపై ఒక రకమైన సిరీస్‌ నంబర్‌ కలిగిన నోట్లు సుమారు 12 వందలు సేకరించినందుకు ఒక రికార్డు, అలాగే కరెన్సీ ముద్ర సమయంలో పొరపాటు జరిగితే ఆ నోటుకు బదులు వేరే నోటు ముద్రిస్తారు.ఆ విధంగా ముద్రించిన నోట్‌పై స్టార్‌ గుర్తు పెడతారు. అలాంటి స్టార్‌ నోట్లు సుమారు 11వందల నోట్లు సేకరించి మరో రికార్డును నమోదు చేశారు. ఇంకా కరెన్సీ నోట్‌పై సీరియల్‌ నంబర్‌లు ఆరు డిజిట్స్‌ మాత్రమే ఉంటాయి. ఏడో డిజిట్‌ ఉన్న నోట్లు చాలా అరుదుగా వస్తాయి. అలా ఏడు డిజిట్స్‌ ఉన్న నోట్లను సేకరించి మూడో రికార్డు సాధించారు. మొత్తంగా ఒకే సారి మూడు లిమ్కా రికార్డులను సాధించిన ఆయనను పలువురు అభినందించారు.

    అరుదైన కరెన్సీ నోట్లు సేకరించి రికార్డు

  • ఒకరి మృతి

    మరో ఆరుగురికి గాయాలు

    భామిని: మండలంలోని బండ్రసింగి ఘాట్‌ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కురుపాం మండలం ఆవిరి గ్రామానికి చెందిన కొండగొర్రి ఎల్లంగో(60) ప్రమాద స్థలంలోనే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఆవిరి గిరిజన గ్రామం నుంచి భామిని వారపు సంతకు పశువుల కొనుగోలుకు ఆటోలో వస్తున్న తరుణంలో ప్రమాదం జరిగింది. బండ్రసింగి ఘాట్‌ రోడ్డులో అతివేగంగా వస్తున్న ఆటో బోల్తా కొట్టి లోయలోకి పడిపోయి నుజ్జునుజ్జయింది. ఈ నేపథ్యంలో అటోలో ప్రయాణిస్తున్న కొండగొర్రి ఎల్లంగో(60)తో మృతి చెందడంతో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కొండగొర్రి గంగారావు, కొండగొర్రి నగేష్‌, కొండగొర్రి సుమంతోలు తీవ్ర గాయాల పాలు కావడంతో 108 అంబులెన్స్‌లో తరలించి భామిని పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం తరువాత సీతంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆటో డ్రైవర్‌ బిడ్డిక కోరాతో పాటు బిడ్డిక కర్ణలు గాయాల పాలయ్యారు. సమాచారం మేరకు ప్రమాద స్థలాన్ని పాలకొండ డీఎస్సీ రాంబాబు, బత్తిలి ఎస్సై జి.అప్పారావులు సందర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలసుకుని కేసు నమోదు చేశారు. ఎల్లంగో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తివ్వాకొండల్లోని ఘాట్‌ రోడ్లలో రక్షణగా రాతి కట్టలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదివాసీ గిరిజనులు డీఎస్పీ రాంబాబుకు ఫిర్యాదు చేశారు.

  • ఆస్తికోసమే హత్య

    శృంగవరపుకోట: మండలంలోని పల్లపుదుంగాడలో ఇటీవల సంభవించిన హత్య కేవలం ఆస్తి కోసమే జరిగినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యకేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన తండ్రి సీదిరి రాములును తన పెదనాన్న కొడుకై న నాగులు నాటుతుపాకీతో 28వ తేదీ సాయంత్రం కాల్చి చంపినట్లు హతుడి కుమార్తె పల్లపుదుంగాడకు చెందిన బడ్నాన నాగమణి ఈనెల 29న మధ్యాహ్నం ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఎస్‌కోట సీఐ నారాయణమూర్తి, ఎస్సై చంద్రశేఖర్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. మృతుడు సీదిరి రాములుకు నాగులుకు మధ్య ఆస్తి వివాదాలున్నాయి. రాములుకు మగపిల్లలు లేనందున చిట్టంపాడులో రెండెకరాల పొలం తనకు ఇచ్చేయాలని నాగులు కొంత కాలంగా పినతండ్రిని అడుగుతున్నాడు. అ భయంతో రాములు మూడేళ్లుగా పల్లపుదుంగాడలో కుమార్తె వద్ద ఉంటున్నాడు. 28న సాయంత్రం పల్లపుదుంగాడ పొలాల్లో రాములు పని చేస్తుండగా నాగులు తన వద్ద ఉన్న తపంచాతో పినతండ్రి రాములుపై కాల్పులు జరిపాడు. దీంతో రాములు పొలంలోనే చనిపోయాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడు నాగులు కోసం గాలిస్తుండగా సీఐకి అందిన సమాచారంతో గురువారం ఉదయం ఐతన్నపాలెం జంక్షన్‌లో అనుమానాస్పదంగా నడుచుకుంటూ వస్తుండగా అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిని విచారణ చేసి బొడ్డవర రైల్వేస్టేషన్‌ సమీపంలో తుప్పల్లో దాచిన తపంచా, దుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్‌.కోట సీఐ నారాయణమూర్తి, ఎస్సై చంద్రశేఖర్‌లను డీఎస్పీ అభినందించారు.

    డీఎస్పీ శ్రీనివాస రావు

  • నేర నియంత్రణే లక్ష్యంగా ‘కార్డన్‌ సెర్చ్‌‘

    విజయనగరం క్రైమ్‌: నేరాలను నియంత్రించి, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడంలో భాగంగా ఎస్‌.కోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దారపర్తి, బొడ్డవర పంచాయతీల్లో గల గిరిజన గ్రామాల్లో ’కార్టన్‌ అండ్‌ సెర్చ్‌’ ఆపరేషన్‌ గురువారం నిర్వహించినట్లు ఎస్పీ వకుల్‌ జిందల్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎటువంటి సారా, గంజాయి లభించలేదన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్‌ జిందల్‌, మాట్లాడుతూ నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా ఎస్‌.కోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దారపర్తి పంచాయతీ గిరిజన గ్రామాలైన మునుపురాయి, రాయపాలెం, చప్పనిగెడ్డ, పల్లపు దుంగాడ, రంగవలస, పాతశెనగపాడు, కొత్త సెనగపాడు, దబ్బగుంట గ్రామాల్లోను మూల బొడ్డవర పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం, బొడ్డపాడు, చిలకపాడు, చిట్టెంపాడు, గుణపాడు గ్రామాల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు ‘కార్డన్‌ అండ్‌ సెర్చ్‌’ ఆపరేషన్‌ నిర్వహించారన్నారు. ఈ బృందాలకు ఎస్‌.కోట సీఐ వి.నారాయణ మూర్తి, కొత్తవలస సీఐ షణ్ముఖరావు, విజయనగరం రూరల్‌ సీఐ బి.లక్ష్మణరావు నాయకత్వం వహించారన్నారు. ఈ ఆపరేషన్‌లో 16మంది ఎస్సైలు, 85 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి, వారికి నిర్దేశించిన గిరిజన గ్రామానికి చేరుకుని, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలు ముందుగానే దిగ్బంధం చేసినట్లు చెప్పారు.

  • రహదారి భద్రత నియమాలు పాటించాలి

    జిల్లా రవాణా శాఖాధికారి

    టి.దుర్గాప్రసాద్‌ రెడ్డి

    పార్వతీపురం రూరల్‌: వాహన దారులు కచ్చితంగా రహదారి భద్రత నియమాలు పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖాధికారి టి.దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా సహాయ రవాణా శాఖాధికారులు బి.కాశీరాం నాయక్‌, స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌ దుర్గతో కలిసి మండలంలోని నర్సిపురం గ్రామం సమీపంలో అంతర్‌రాష్ట్ర రహదారిపై గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిమితికి మించి అధిక ప్రయాణికులతో వెళ్తూ భద్రత నియమాలను అతిక్రమించిన 11 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అలాగే మూడు వాహనాలను, 12 ఆటోలతో పాటు ఒక లైట్‌ గూడ్స్‌ వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా రూ.30వేలు జరిమానాను వాహనాలకు విధించారు. అలాగే రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై వాహన దారులకు, పాదచారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న హెల్మెట్‌ విధిగా ధరించాలని జిల్లా రవాణా శాఖాధికారి దుర్గాప్రసాద్‌ రెడ్డి సూచించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేయరాదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో రవాణాశాఖ కానిస్టేబుల్స్‌, హోం గార్డులు తదితర సిబ్బంది ఉన్నారు.

  • స్కూల

    ఐదుగురు విద్యార్థులకు గాయాలు

    మద్యం మత్తులో ఆటో నడిపిన డ్రైవర్‌

    కొత్తవలస: మండలంలోని విజయనగరం–కొత్తవలస రోడ్డులో అర్ధాన్న పాలెం జంక్షన్‌ సమీపంలో గురువారం స్కూల్‌ ఆటో బోల్తాపడిన ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏపీ మోడల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు మంగళపాలెం, రాజాథియేటర్‌ సమీపంలోని వారిని రోజూ ఆటోలో స్కూల్‌కు తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. అయితే గురువారం విద్యార్థులను యథావిధిగా స్కూల్‌ వద్ద డ్రైవర్‌ దింపేశాడు. మళ్లీ స్కూల్‌ వదిలే సమయంలో తిరిగి పిల్లలను ఆటో ఎక్కించుకుని వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో జరిగిన ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు పి ల్లల్లో 7వ తరగతి చదువుతున్న కె.మహేంద్ర కాలికి తీవ్ర గాయమైంది. అలాగే 9వ తరగతి చదువుతున్న డి.నిరిషా నడుముకు గాయమైంది. స్థానికుల సహాయంతో గాయపడిన చిన్నారులను కొత్తవలసలో గల ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.కాగా ఆటో డ్రైవర్‌ పూటుగా మద్యం తాగి ఉన్నాడని, ఆటోపై ఫీట్‌లు చేశాడని అదే సమయంలో ఆటో బోల్తా పడిందని విద్యార్థులు తెలిపారు.ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

  • బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించండి

    పార్వతీపురం టౌన్‌: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌.సాయి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎన్జీవో హోంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్‌ రద్దు వంటివి అమలు చేయాలని ఆగస్టు 2న చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఇతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. పి–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు. నూతనంగా అప్‌గ్రేడ్‌ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హైస్కూల్‌ ప్లస్‌లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలని కోరారు. పంచాయతీరాజ్‌ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని కోరారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. ఈ సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాఫ్టో జనరల్‌ సెక్రటరీ ఎస్‌.చిరంజీవి, కో చైర్మన్లు కె.నరహరి, మనోజ్‌ కుమార్‌, సీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • వేధింపుల కత్తి!

    ఉద్యోగుల

    మెడపై

    సాక్షి, పార్వతీపురం మన్యం:

    కూటమి నాయకుల అధికార బలంతో చేసిన వేధింపులకు ఓ దళిత అధికారి కన్నీళ్లు పెట్టుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేశ్‌ చూస్తున్న విద్యాశాఖలోని.. ఓ మండల విద్యాశాఖాధికారికే ఈ దుస్థితి ఏర్పడింది. తనను ఇబ్బంది పెట్టవద్దంటూ ఆ అధికారి.. సదరు ప్రజాప్రతినిధి కాళ్లు మీద పడినా... కనికరం చూపలేదు. ఆ ప్రజాప్రతినిధి పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర కాగా.. ఆ అధికారి బలిజిపేట మండల ఎంఈఓ– 2 శ్రీనివాసరావు. ఎంఈఓ తన సన్నిహితుల వద్ద వాపోయిన మాటలు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందటే పార్వతీపురం తహసీల్దారుగా పని చేసిన జయలక్ష్మిని ఎమ్మెల్యే బెదిరించినట్టు ఓ ఫిర్యాదు కాపీ బయటకు వచ్చిన విషయం విదితమే.. ఇప్పుడు అదే తరహాలో మరో అధికారి బలి కావడం గమనార్హం.

    కోర్టు తీర్పును అమలుచేయొద్దంటూ....

    బలిజిపేట మండలంలోని అరసాడ మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను, వాచ్‌మన్‌ను ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌చంద్ర ప్రోత్సాహంతోనే తమను తొలగించారని ఉన్నతాధికారుల వద్ద బాధితులు మొర పెట్టుకుంటున్నా ఫలితం లేకపోయింది. దీనిపై వారు కోర్టు తలుపుతట్టారు. న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పునూ అమలు చేయనీయకుండా.. ఆ స్థానంలో తమ వారిని నియమించుకునేలా అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితుల ఆరోపణ. అందుకు సంతకం చేయాలని ఎంఈఓ–2 శ్రీనివాసరావును కోరుతున్నారు. ఈ విషయంలో ఇది వరకే కోర్టు తనకు జరిమానా విధించిందని.. ఇకపై ఆ తప్పు చేయనని ఆయన తేల్చేయడం కూటమి నాయకుల ఆగ్రహానికి కారణమైంది. రెండు రోజుల కిందట కేజీబీవీ వసతిగృహం ప్రారంభోత్సవానికి మండలానికి వచ్చిన ఎమ్మెల్యే.. ప్రజలు, అధికారులందరి ముందే ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీతో ఏం మాట్లాడినా ఎర్రజెండా వారికి సమాచారం ఇస్తావు. నీపై చర్యలు తీసుకుంటే.. రేపటి నుంచి ఎర్రజెండా పట్టుకుని వారితోపాటే ఆ రోడ్ల మీద తిరగాల్సిందే..’ అంటూ హెచ్చరించారు. అక్కడ నుంచే డీఈఓతో మాట్లాడి.. ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తనను ఇబ్బంది పెట్టవద్దని.. కాళ్లు పట్టుకుని బతిమలాడుతానని వయస్సులో పెద్ద వారైన ఎంఈఓ ప్రాథేయపడినా ఫలితం లేకపోయింది. జరిగిన పరిణామాలతో తీవ్ర భావోద్వేగానికి గురైన సదరు ఎంఈఓ.. తన సన్నిహితుల వద్ద ఈ విషయాలన్నీ వాపోతూ కన్నీటి పర్యంతమయ్యారు. డీఈఓ కూడా తన విషయంలో దుర్భాషలాడారని వాపోయారు. నేడో, రేపో తన మీద చర్యలు ఖాయమని.. తనను సస్పెండ్‌ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సన్నిహితుల వద్ద వాపోయిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కూటమి ప్రభుత్వంలో అధికారులు ధైర్యంగా పని చేసే పరిస్థితి లేదని.. మండల అధికారులకే వేధింపులు ఉంటే, ఇంక చిరు ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులపై వేధింపులు అధికమయ్యాయి. చిరుద్యోగులను తొలగించాలని, పథకాలు అందకుండా చేయాలని.. పనులు నిలిపివేయాలని.. తాము చెప్పిందే చేయాలంటూ కూటమి నేతలు ఆదేశాలిస్తున్నారు. వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. వారి మాటే శాసనం అంటున్నారు. కోర్టు ఉత్తర్వులను అమలుచేయొద్దంటూ భయపెడుతున్నారు. ఉద్యోగాలు పోతాయని కాళ్లుపట్టుకుని అధికారులు ప్రాథేయపడుతున్నా కనికరించడం లేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో వేధింపులే తప్ప క్షమించడాలు ఉండవంటూ స్పష్టంచేస్తున్నారు. ఫలితం.. అధికార, ఉద్యోగ వర్గాలు తమ బాధను సహోద్యోగుల వద్ద చెప్పుకుంటూ కన్నీరుపెడుతున్నారు. ఇన్నేళ్ల సర్వీసులో తమకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటూ నిట్టూర్చుతున్నారు.

    నిన్న తహసీల్దార్‌.. నేడు ఎంఈఓ

    దళిత విద్యాశాఖాధికారికి పార్వతీపురం ఎమ్మెల్యే బెదిరింపులు

    ఎర్రజెండా పట్టుకుని రోడ్డున పడతావంటూ హెచ్చరిక

    కన్నీళ్లు పెట్టుకున్న అధికారి

    ప్రజాప్రతినిధి వేధింపులపై సన్నిహితుల వద్ద వాపోయిన సదరు అధికారి

  • ప్రభు

    విజయనగరం ఫోర్ట్‌: విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ దేవీమాధవి నియమితులయ్యారు. ఆమె వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డాక్టర్‌ కె.పద్మలీల గురువారం ఉద్యోగ విరమణ పొందారు.

    2న రైతుల ఖాతాలకు

    పెట్టుబడి సాయం

    విజయనగరం ఫోర్ట్‌: అన్నదాత సుఖీభవ పథ కం లబ్ధి ఈ నెల 2న రైతుల బ్యాంకు ఖాతా లకు జమకానుందని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. పథకం కింద జిల్లాలో 2,19,503 మందికి లబ్ధిచేకూరనుందన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాత సుభీభవలో రాష్ట్ర వాటా కింద రైతులకు రూ.5 వేలు చొప్పున రూ.109.75 కోట్లు, కేంద్రం వాటా పీఎం కిసాన్‌ కింద రూ.2వేలు చొప్పన 1.93 లక్షల మందికి రూ. 38.60 కోట్ల పెట్టుబడి సాయం అందనుందన్నారు. సమావేశంలో కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక కలెక్టర్‌ మురిళి, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, లీడ్‌ బ్యాంక్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ రమణమూర్తి, డ్వామా పీడీ శారద, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, సీపీఓ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

    వైద్యసేవల వివరాలు

    పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి

    డీఎంహెచ్‌ఓ జీవనరాణి

    విజయనగరం ఫోర్ట్‌: పీహెచ్‌సీల్లో అందించే వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు గురువారం సర్వేలెన్స్‌ వర్క్‌షాపు నిర్వహించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికంగా ఎక్కడైనా వ్యాధులు వ్యాప్తిచెందితే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ డాక్టర్‌ అచ్యుతకుమారి, ఎన్‌సీడీ పీఓ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సర్వేలెన్స్‌ ఆఫీసర్‌ జాన్‌, తదితరులు పాల్గొన్నారు.

    జ్వరాల పంజా

    బొబ్బిలి: పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్థినులుపై జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే పలువురు జ్వరాలతో బాధపడుతూ కోలుకోగా.. కొమరాడకు చెందిన కొండగొర్రి సౌజన్యను వైద్యపరీక్ష కోసం వార్డెన్‌ రాణి బొబ్బిలి సీహెచ్‌సీకి గురువారం తీసుకెళ్లారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాలికను ఇన్‌పేషేంట్‌గా చేర్చుకుని వైద్యసేవ లు అందిస్తున్నారు. బొబ్బిలిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల భవనాన్ని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహానికి కేటాయించారు. కొన్ని గదులను ఆశ్రమ పాఠశాల స్టోర్‌ రూం, సిక్‌ రూంలకు వినియోగిస్తున్నారు. మిగిలిన గదులను విద్యార్థినులకు వినియోగిస్తున్నారు. భవనం ఇరుకుగా మారిందని విద్యార్థినులు వాపోతున్నారు. వార్డెన్‌ కార్యాలయంలోనే వంట గదిని కూడా నిర్వహిస్తున్నారు. తాగునీటికి పాఠశాల బోరును వసతి గృహ నిర్వాహకులే వినియోగిస్తున్నారు. పట్టణానికి దూరంగా వసతి గృహం ఉండడంతో పట్టణంలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలోకి వసతిగృహాన్ని మార్చాలని కోరుతున్నారు.

  • గిరిజ

    విజయనగరం అర్బన్‌: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ఇప్పటికే అందిస్తున్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) పీజీ కోర్సులతో పాటు ఈ ఏడాది నుంచి రీసెర్చ్‌ స్కాలర్‌ (పరిశోధన విద్య) కోర్సులను అందించనున్నామని యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసన్‌ తెలిపారు. కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం పాలసీలోని ప్రధాన అంశాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పటిష్ట పునాదులను ఆ ప్రభుత్వమే వేసింది. మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో ఏర్పాటైన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు ఓ వైపు సాగుతున్నాయి. స్థానిక ఆంధ్రయూనివర్సిటీ ఎక్స్‌టెంట్‌ పీజీ కేంద్రం ప్రాంగణలోని భవనాల్లో ప్రస్తుతం గిరిజన యూని వర్సిటీ తాత్కాలిక నిర్వహణలో ఉంది. గిరిజన వర్సిటీ అకడమిక్‌ పురోగతిని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసన్‌ ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే...

    నాలుగు అంశాలపై పరిశోధన

    యూనివర్సిటీలో ఇప్పటికే అందిస్తున్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సు, పీజీ కోర్సులతో పాటు ఈ ఏడాది నుంచి రీసెర్చ్‌ స్కాలర్‌ (పరిశోధన విద్య) కోర్సులను అందించనున్నాం. యూనివర్సిటీలో ప్రసుతం ఉన్న ఎనిమిది పీజీ కోర్సులతో పాటు మరో నాలుగు డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన సబ్జెక్టుల పరిశోధనా అంశాలపై కొత్త కోర్సులు నిర్వహిస్తాం. తొలిదశలో ప్రతి కోర్సులో రెండు సీట్లలో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తాం. ఈ విద్యాసంవత్సరం నుంచి నిర్వహించే పరిశోధన కోర్సుల కోసం త్వరలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాం. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కోసం 21రోజుల గడువు ఇస్తాం.

    ఈ ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభం

    ముగిసిన పీజీ ప్రవేశాలు

    మిగులు సీట్లకు ఈ నెల 8న ఓపెన్‌ కౌన్సెలింగ్‌

    కేంద్రీయ గిరిజన

    యూనివర్సిటీ

    ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసన్‌

  • వైఎస్సార్‌సీపీలోకి జనసేన నాయకుడు

    దత్తిరాజేరు: జనసేన విజయనగరం పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, గజపతినగరం నియోజకవర్గం నాయకుడు సామిరెడ్డి లక్ష్మణ్‌ ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో గురువారం చేరారు. ఆయన స్వగ్రా మం దత్తిరాజేరు మండలం పెదకాద నుంచి మరో 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ తీర్థం తీసుకున్నారు. మాజీ ఉప సర్పంచ్‌ మత్స వెంకన్న, సామిరెడ్డి తవిటినాయుడు, కూర్మినాయుడు, వైకంఠం శ్రీరాం తదితరులను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తన ఇంటివద్ద పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్షణ్‌ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలంటే ఒక్క వైఎస్సార్‌సీపీలోనే సాధ్యమని, బొత్స అప్పలనరస య్య నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రిఅప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు రాపాక కృష్ణార్జున, వైఎస్‌ ఎంపీపీలు బమ్మిడి అప్పలనాయు డు, మిత్తిరెడ్డి రమేష్‌, నాయకులు మహదేవ్‌ ఫణీంద్రుడు, మండల శ్రీను, చుక్క మురళి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

    పెదకాద నుంచి సామిరెడ్డి లక్ష్మణ్‌తో పాటు 50 కుటుంబాలు చేరిక

    పార్టీ కండువా వేసి ఆహ్వనించిన

    మాజీ ఎమ్మెల్యే బొత్స

  • రైతుబజారు స్థల రక్షణకు ప్రజా ఉద్యమం

    విజయనగరం గంటస్తంభం: విజయనరం పాత ఆస్పత్రి వద్ద ఉన్న రైతు బజారు స్థలం రక్షణ కోసం ప్రజాఉద్యమం చేపడతామని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానించినట్టు సంఘ జిల్లా కార్యదర్మి రెడ్డి శంకరరావు తెలిపారు. స్థానిక ఎల్‌బీజీ భవనంలో గురువారం ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ రైతుబజార్‌ భూమి 22ఏలో నుంచి తప్పించి రాజులకు అప్పగించిన అధికారుల తీరు అన్యాయమన్నారు. 1948లో జమిందారీ వ్యవస్థ రద్దుకావడంతో భూములన్నీ రైతువారీ పద్ధతిలోకి వచ్చాయన్నారు. 1968లో ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం, మాన్సాస్‌ ట్రస్టు ఆధీనంలో భూములు ఉన్నాయే తప్ప రాజుల ఆధీనంలో ప్రత్యేకంగా ఏమీ లేవన్నారు. చీకటి జీఓలతో భూములను కాజేయాలని రాజులు చూస్తున్నారన్నారు. అందులో భాగంగా జీఓ 124 మేరకు రైతు బజార్‌ భూమి 1.48 ఎకరాలను సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. చీకటి జీఓలు రద్దుచేసి ఆ భూమిని రైతులకు అప్పగించాలని అధికారులను డిమాండ్‌ చేశారు. జొన్నగుడ్డిలో పేదలకు పట్టాలిచ్చిన భూమిని ఎందుకు అప్పగించరని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్మి బి.రాంబాబు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌, ఎస్‌.రవికుమార్‌, వెంకటేష్‌, ఆనంద్‌, రమణ, జగన్మోహన్‌రావు, హరీష్‌, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

  • బాగుచేసేవారు లేక...

    బాడంగి మండలంముగడ గ్రామానికి చెందిన తెంటువాని చెరువు ఆయకట్టుకు సాగునీరందించే ఫీల్డ్‌, ఫీడర్‌ చానల్స్‌ తుప్పలు, పూడికలతో నిండిపోయాయి. బాగుచేయాలంటూ అధికారులు, పాలకులకు రైతులు విన్నవించారు. అదును దాటిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఉపాధిహామీ పనులతో కాలువలు అభివృద్ధిచేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఆయకట్టు రైతులందరూ ఏకమై శ్రమదానంతో కాలువలు బాగుచేసేందుకు నడుంబిగించారు. చెరువు నీరు పొలాలకు మళ్లించేందుకు వీలుగా కాలువల్లోని పూడికలను గురువారం తొలగించారు. రైతు సమస్యలను పట్టించుకునే తీరిక కూటమి నేతలకు లేదంటూ పలువురు వాపోయారు. – బాడంగి

  • ఊరికి ఉపకారి

    చిత్రంలో రోడ్డుపై ఏర్పడిన గోతులను కాంక్రీట్‌తో పూడ్చుతున్న వ్యక్తిపేరు మద్దెల జనార్దన్‌. రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి. లగేజీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రామభద్రపురం మండల కేంద్రం నుంచి సోంపురం, ఇట్లామామిడిపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా పాడవ్వడం, పెద్దపెద్ద గోతులతో దర్శనమివ్వడం, తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కలత చెందాడు. కూలిచేసిన డబ్బుల్లో రూ.30వేలు వెచ్చించి సిమెంట్‌, ఇసుక, పిక్కను తన లగేజీ ఆటోపైనే తీసుకెళ్లి.. ఆయనే స్వయంగా కాంక్రీటు మిక్స్‌చేసి రోడ్లపై ఏర్పడిన గోతులను గత రెండు రోజులుగా పూడ్చుతున్నాడు. ఆయన కృషి, చొరవను చూసిన ఈ ప్రాంతీయులు అభినందిస్తున్నారు. ఊరికి ఉపకారి అంటూ కితాబిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెపండగ పేరుతో రోడ్లు మరమ్మతులు చేస్తామంటూ హడావిడి చేసిందే తప్ప రోడ్లను బాగుచేసిన పరిస్థితి లేదంటూ విమర్శిస్తున్నారు. – రామభద్రపురం

  • ఇదెక్కడి అన్యాయం?

    రాజాం సిటీ: రాజాం బస్టాండ్‌ ఆవరణలోని నవదుర్గా ఆలయానికి ఏళ్ల తరబడి చైర్మన్‌గా కొనసాగుతున్న తనను తప్పించి వేరేవారిని నియమించడం ఎంతవరకు న్యాయమని ఫౌండర్‌ ట్రస్టీ వానపల్లి నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ధర్మకర్తను చైర్మన్‌ స్థానం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. కూటమి కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు ఆలయాల ట్రస్టుబోర్డుల నియామకాల్లో కనిపించడం శోచనీయమన్నారు. స్థానిక విలేరులతో ఆయన గురువారం మాట్లాడుతూ.. తన తండ్రి వానపల్లి సూర్యనారాయణ (తమ్మయ్య గురువు) ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి తామే వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. దేవాలయాల ట్రస్టుబోర్డు సభ్యుల నియామకంలో రాజికీయాలను ప్రోత్సహించడం దేవదాయ శాఖ అధికారులకు తగదన్నారు. ట్రస్టు బోర్డు మెంబరు ఉన్నచోట ఆయనే చైర్మన్‌గా వ్యవహరిస్తారని గతంలో దేవదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు స్పష్టంచేశారు. దేవదాయశాఖ ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు సవరించకుంటే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ పి.శ్యామలరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌గా వానపల్లి నర్సింగరావే ఉంటారని స్పష్టం చేశారు. దీనిపై గతంలో జీఓ కూడా ఇచ్చారన్నారు. ఆయన ఆధ్వర్యంలో బోర్డు మెంబర్లు ఉంటారని పేర్కొన్నారు.

NTR

  • దమ్ము

    సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. రెక్కీ నిర్వహించి మరీ చోరీలు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు. శుభకార్యాలకు బంగారు నగలు ధరించాలంటే వణికిపోతున్నారు. విజయవాడలో వరుస చోరీలకు అడ్డుకట్ట వేసి, దొంగల భరతం పట్టడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. పోలీసుల నిఘా కొరవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల ఒకే ప్రాంతానికి చెందిన 35 మందికి పైగా దొంగలు రాష్ట్రానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు, నలుగురు ఒక బృందంగా విడిపోయిన దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారని, రైల్వే లైన్‌ వెంబడి ప్రాంతాలను ఎంచుకొని, దొంగతనం చేసిన వెంటనే మరో ప్రాంతానికి చెక్కేస్తున్నారని పోలీసులు గుర్తించారని సమాచారం.

    కిటికీ గ్రిల్స్‌ తొలగించి..

    విజయవాడలోని గుణదల గేటేడ్‌ కమ్యూనిటీలో జూలై ఐదో తేదీన చోరీ జరిగింది. చోరీ చేసింది మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ధార్‌ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో చోరీ చేసే విధానం, శారీక దారుఢ్యం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ముగ్గురు సభ్యుల ముఠా రైళ్లలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలోని ప్రాంతాలను ఎంచుకొని చోరీలకు తెగబడుతోంది. ఈ ముఠా ఇటీవల ఒకే రోజు పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని గుణదల, గుంటుపల్లి, గొల్లపూడి ప్రాంతాల్లో పట్టపగలే వరుస చోరీలకు పాల్పడింది. రూ.12.98 లక్షల విలువైన ఆభరణాలు, నగదు చోరీ చేసింది. ఈ చోరీలన్నీ ప్రధాన ద్వారం గుండా కాకుండా హాలు, వాష్‌రూం ఇనుప గ్రిల్స్‌ను తొలగించి దొంగలు ఇళ్లలోకి ప్రవేశించి చేసినవే. అప్పటి నుంచి ఇప్పటి వరకు దొంగల ఆనవాళ్లను పోలీసులు గుర్తించలేదు. పెనుగంచిప్రోలులో జూలై 28వ తేదీన గ్రామానికి చెందిన తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ మాజీ చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు ఇంట్లో రూ.5 లక్షల విలువగల బంగారు ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలోనూ దొంగలు చిక్కలేదు.

    జైళ్లలో పరిచయాలు

    వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితులను రిమాండ్‌కు తరలించినప్పుడు జైళ్లలో తోటి దొంగలతో పరిచయాలు పెంచుకొని గ్రూపులుగా మారుతున్నారు. శిక్ష పూర్తయిన తరువాత బయటకు వచ్చి ఆ గ్రూపుల్లో సభ్యులంతా ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే ఇటీవల వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం, కాండ్రపాడు, లింగాలపాడు గ్రామాల్లో ఒకేరోజు ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు.

    ఎన్టీఆర్‌ జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

    పగలు రెక్కీ.. రాత్రివేళ ఇళ్లలో చోరీలు మహిళలే టార్గెట్‌గా చైన్‌ స్నాచింగ్‌లు టెక్నాలజీకి కూడా చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్న దొంగలు పోలీసుల నిఘా వైఫల్యంతోనే దొంగతనాలని విమర్శలు

    ముందే రెక్కీ

    దొంగలు చోరీకి ముందే రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. పాడైన వస్తువులను రిపేరు చేస్తామని అపార్ట్‌మెంట్లలోకి వచ్చి, ఆపై రెక్కీ నిర్వ హించి ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగల్లో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. కొందరు ప్రేమికులు సైతం తమ ఖర్చులు, విలాసాల కోసం చోరీల బాటపట్టారన్న విమర్శలు ఉన్నాయి.

  • వరద ప

    ఇబ్రహీంపట్నం: ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి పెరుగుతున్న వరద ప్రవాహంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ హెచ్చరించారు. మండలంలోని చినలంక, పెద్దలంక, ఫెర్రీ తదితర ప్రాంతాలను ఆయన గురువారం సందర్శించారు. చినలంక వద్ద అర కిలోమీటర్‌ దూరంలో నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరదనీటిని పరిశీలించారు. వరద నీటితో కలిగిన ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పులిచింతల నుంచి వరద నీరు నిలకడగా వస్తోందన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ పైకిఎత్తి నీటిని కిందకు విడుదలచేస్తూ లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్నారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీస్‌, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. గురువారం సాయంత్రం నాటికి వరద ఉధృతి మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంతాల ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లడం, పశువులు, జీవాలు వదలడం చేయొద్దని సూచించారు. వరదకు సంబంధించి ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. అవసరమైతే ట్రక్‌ టెర్మినల్‌ల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరద పరిస్థితిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్డీఓ చైతన్య, తహసీల్దార్‌ వై.వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ కమిషనర్‌ రమ్య కీర్తన తదితరులు పాల్గొన్నారు.

    అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ జరపాలి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

  • టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్‌ పోలీసింగ్‌ బలోపేతం

    లబ్బీపేట(విజయవాడతూర్పు):టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్‌ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేలా ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు వినూత్న కార్యాచరణతో ముందుకెళ్తున్నారని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా కొనియాడారు. పోలీస్‌ కమిషనరేట్‌లో గురువారం ట్రాఫిక్‌ పోలీసులకు డ్రోన్లు, 40 ట్రాఫిక్‌ పెట్రోలింగ్‌ బైకులను డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా అందజేశారు. పెట్రోలింగ్‌ బైక్‌లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడతాయన్నారు. విజయవాడ సిటీలో ట్రాఫిక్‌, నేరాలను నియంత్రించడంలో సీపీ రాజశేఖరబాబు పని తీరు బాగుందన్నారు. అస్త్రం టూల్‌ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. డ్రోన్‌ల వినియో గంలో ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. విజయవాడలో ట్రాఫిక్‌ నియంత్రణ, హెల్మెట్‌ వినియోగం, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు చర్యలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలను సీపీ ఎస్‌.వి.రాజశేఖరబాబు వివరించారు. డ్రోన్‌లు, ట్రాఫిక్‌ పరికరాలను సమకూర్చేందుకు దాతలు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ ఎ.వి.ఎల్‌.ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక శబ్దాలను వెలువరించే బైక్‌ సైలెన్సర్లను ధ్వంసం చేశారు.

    రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

  • బ్యాంకులు భద్రతా ప్రమాణాలు పాటించాలి

    కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సూచనల ప్రకారం బ్యాంకు అధికారులు బ్యాంకులతో పాటు ఏటీఎంల వద్ద నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ బ్యాంక్‌ల అధికారులతో సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం ఎస్పీ బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశపు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ గార్డుల నియామకం, సురక్షిత నగదు రవాణా, ఆన్‌లైన్‌ మోసాల నివారణ, సైబర్‌ భద్రత వంటి అంశాలపై అధికారులు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. బ్యాంకుల్లో కొత్తగా నియమించుకునే ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ముందస్తు పోలీసుల పరిశీలన తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని, వాటి పనితీరును పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. రాత్రి వేళ ఏటీఎం ప్రాంగణాలు వెలుతురుతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని, అత్యవసర పరిస్థి తుల్లో పోలీసులకు వెంటనే సమాచారం చేరేలా అలారం లేదా లింకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల డేటా కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలని స్పష్టం చేశారు. సైబర్‌ నేరాలపై ఖాతాదారులకు పూర్తి అవగాహన కలిగించే బాధ్యతను బ్యాంకులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, డీఎస్పీలు సిహెచ్‌.రాజా, శ్రీనివాసరావు, ధీరజ్‌ నీల్‌, విద్య శ్రీ పాల్గొన్నారు.

    కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు

  • గంజాయి ముఠా అరెస్టు

    ఉయ్యూరు: గంజాయి ముఠాను ఉయ్యూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ టీవీవీ రామారావు తెలిపిన కథనం మేరకు...ఉయ్యూరు పట్టణంలో గంజాయి విక్రయాల సమాచారం అందుకున్న పోలీసులు సీఐ రామారావు ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో తొమ్మిది మంది గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2.50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న పొదిలపు జగదీష్‌కుమార్‌, కొలసాని వెంకట సాయి, సానక నరేంద్ర, గుడిమెట్ల ప్రవీణ్‌కుమార్‌, మిక్కిలి సంజయ్‌కుమార్‌, దున్నాల మనోజ్‌, మహ్మద్‌ అహ్మద్‌ బాషా, ఓరుగంటి గోపయ్యస్వామి, సయ్యద్‌ మునీర్‌లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.

  • నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చిన ఎస్‌డీఆర్‌ఎ

    కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో చిక్కుకుని కేకలు వేస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కాపాడి ఒడ్డుకు చేర్చిన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నున్నకు చెందిన అంకా సెల్వరాజ్‌ బుధవారం రాత్రి కృష్ణానదిలోకి వెళ్లి వారధి 42వ పిల్లర్‌ వద్ద ఇసుక తిన్నెల్లో పడుకుని నిద్రపోయాడు. గురువారం ఉదయం లేచి చూడగా అతని చుట్టూ వరద నీరు చేరుతుండడంతో భయంతో కేకలు పెట్టాడు. వారధి పైన వెళ్తున్న ప్రయాణికులు కేకలు విని అతనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కృష్ణలంక పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పడవ ద్వారా అతని వద్దకు చేరుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అతని వివరాలను సేకరించిన పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారించారు.

  • నిబంధనలకు తూట్లు.. జేబుల్లోకి రూ. కోట్లు!

    ఉయ్యూరు: ఉయ్యూరు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అనధికార లే అవుట్‌లకు ల్యాండ్‌ మార్కు అయ్యింది. సామాజిక స్థలాలకు రెక్కలొచ్చాయి. కొందరు పచ్చ చొక్కా నేతల అండదండలతో చట్టంలో ఉన్న లొసుగులను సాకుగా చూపుతూ అక్రమ లే అవుట్‌లతో రూ.కోట్లు లూటీ చేస్తున్నారు. అమరావతి, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆశ చూపి పేద, మధ్య తరగతి వర్గాలను నిట్టనిలువునా దోచేస్తున్నారు. ఉయ్యూరు, గండిగుంట కేంద్రాలుగా సాగుతున్న రియల్‌ దందాలో రూ. 50కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ప్రజాధనం రియల్టర్లు, పచ్చనేతల జేబుల్లోకి మళ్లింది. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండటంతో ఇక్కడ అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

    ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు..

    ఉయ్యూరు మునిసిపాలిటీ, గండిగుంట, చిన ఓగిరాల, ఆకునూరు, పెద ఓగిరాల, కడవకొల్లు, కా టూరు గ్రామాల్లో విచ్చలవిడిగా లే అవుట్‌లు వెలిశాయి. కొందరు సీఆర్‌డీఏ అనుమతులు తీసుకుని వెంచర్లు వేస్తుంటే.. మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికార లే అవుట్‌లను ఇష్టానుసారంగా వేస్తున్నారు. వ్యవసాయ భూములకు నాలా చెల్లించి ఆ వెంటనే లే అవుట్‌గా మార్చి స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. సెంటు రూ. 5లక్షల నుంచి రూ. 7లక్షల వరకూ ధర నిర్ణయించి మాయమాటలతో అమ్మేస్తున్నారు. ఉయ్యూరు, గండిగుంట పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఇదే తంతు కొనసాగుతోంది. పచ్చచొక్కా నేతలు, అధికారులకు దండిగా కాసుల వర్షం కురిపిస్తుండటంతో అడిగే నాథుడే లేకుండా పోయాడు. ఇటీవలి కాలంలో 50 ఎకరాలకు పైగా అనధికార లేఅవుట్‌లు వెలిసినట్లు సమాచారం.

    మొక్కుబడి చర్యలతో సరి..

    సీఆర్‌డీఏ నిబంధనలు ఉల్లంఘించి అనధికార లేఅవుట్‌ వేస్తే సీఆర్‌డీఏ చట్టం 114(2) ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. క్షేత్రస్థాయిలో ఆయా పంచాయతీ కార్యదర్శులు, మునిసిపల్‌ కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమన్వయం చేసుకుని సీఆర్‌డీఏ టీపీఓ, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు అనధికార లేఅవుట్‌లపై ఉక్కుపాదం మోపాలి. వాస్తవంగా ఎక్కడా అలాంటి చర్యలు కానరావడం లేదు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే మొక్కుబకడిగా నోటీసులు ఇచ్చి నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. అనధికార వెంచర్లకు సంబంధించి సీఆర్‌డీఏ, ప్రభుత్వం నుంచి ఉయ్యూరు మునిసిపల్‌ కార్యాలయానికి లేఖలు అందినా మీనమేషాలు లెక్కిస్తున్నారు.

    ‘పది శాతం’ నిబంధన కనుమరుగు..

    ప్రజాప్రతినిధులు, సీఆర్డీఏ, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారుల ఉదాసీనత వైఖరి కారణంగా సామాజిక స్థలాలు కనుమరుగవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఎకరం విస్తీర్ణంలో లే అవుట్‌ వేసి స్థలం విక్రయించాలంటే పది శాతం భూమిని సామాజిక స్థలంగా మునిసిపాలిటీ, పంచాయతీలకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి. అనధికార వెంచర్ల ఫలితంగా ఒక్క సెంటు భూమి కూడా సామాజిక అవసరాలకు దక్కకుండా పోతోంది. ఉయ్యూరు, కాటూరు రోడ్డులోని సుమారు 17 ఎకరాల్లో లే అవుట్‌ నిర్మిస్తే ప్రజా సామాజిక అవసరాలకు 1.70ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. ఇవేవీ ఇవ్వకుండానే లే అవుట్‌ను సక్రమం చేసే పనిలో అధికారులు తలమునకలయ్యారు. ఆ భూమి మొత్తం రోడ్డు, ప్రహరీలు నిర్మించి సెంటు భూమి రూ. 20 లక్షల చొప్పున యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రూ. కోట్లలో సొమ్ము చేతులు మారుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు 1.70 ఎకరాల భూమి సామాజిక స్థలంగా కేటాయించాల్సి ఉంది. దాని భూమి ధర మార్కెట్‌లో రూ. 34కోట్లుగా ఉంది. మునిసిపాలిటీ పరిధిలో 1, 2, 3, 4, వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో అనధికార వెంచర్లు ఏర్పాటు చేశారు. ఉయ్యూరు, గండిగుంట సమీపంలో సరిహద్దుగా గల టీటీడీ సమీపంలో, ఆర్‌డీఓ కార్యాలయం ఎదురుగా నాన్‌ లేఅవుట్‌లు వెలిశాయి. ఈ లేఅవుట్‌లలోనూ సామాజిక స్థలం పత్తా లేకుండా పోయింది.

    ‘పచ్చ’ నేతల అండతో ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్లు

    వ్యవసాయ భూముల్లో విచ్చలవిడిగా లే అవుట్లు

    ఆయా ప్లాట్లలో సామాజిక స్థలం హాంఫట్‌

    పచ్చ చొక్కా నేతల అండతో రియల్టర్ల దందా

    రూ. 50కోట్లకు పైగా సొమ్ము లూటీ

    మామూళ్ల మత్తులో యంత్రాంగం

  • దుర్గమ్మకు కానుకగా బంగారపు సూత్రాలు

    ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు గురువారం రూ.1.68 లక్షల విలువైన బంగారపు సూత్రాలు, నానుతాడును కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన దాసరి భారత నరేంద్ర సింహ తన తల్లి రాజేశ్వరి పేరిట అమ్మవారికి 16 గ్రాముల బంగారం, ఎరుపు రంగు రాళ్లుతో తయారు చేయించిన మంగళసూత్రాలు, నానుతాడును ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

    కనులపండువగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు

    విజయవాడకల్చరల్‌: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణమండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న అష్టబంధన, మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు గురువారం ముగిశాయి. వైఖానస ఆగమ సంప్రదాయంలో మహా పూర్ణాహుతి, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశం, కుంభాబింబ సమారోహణం కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని కంకణభట్టార్‌ మురళీకృష్ణ అయ్యంగార్‌, టీటీడీ ఆస్థాన ఆగమశాస్త్ర పండితులు, అర్చక స్వాములు వేదాంతం వెంకట శశికిరణ్‌ నిర్వహించారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ లలితా రమాదేవి, భావన్నారాయణా చార్యులు, సూపరింటెండెంట్‌ మల్లికార్జునరావు, ఇంజినీరింగ్‌ అధికారులు నాగభూషణం, సురేంద్రనాథ్‌ రెడ్డి, జగన్మోహన్‌ పాల్గొన్నారు. టీటీడీ అధికారులు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో ఐదువేలమంది పాల్గొన్నారు.

    ఫొటోగ్రఫీ ఎంట్రీలకు రేపటి వరకు గడువు పొడిగింపు

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా విశేష ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేసేందుకు నిర్వహిస్తున్న ఫొటోగ్రఫీ పోటీల ఎంట్రీల గడువును ఫొటోగ్రాఫర్ల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీలకు ఎంట్రీల గడువును జూలై 31వ తేదీగా నిర్ధారించామని, ఫొటోగ్రాఫర్లు మరో రెండు రోజులు గడువుకావాలని విజ్ఞప్తి చేసిన దరిమిలా ఆగస్టు 2వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

  • నేటి నుంచి నెఫ్రాలజిస్టుల సదస్సు

    లబ్బీపేట(విజయవాడతూర్పు): మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య చికిత్సలపై చర్చించేందుకు నగరంలో మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నారు. ఇండియన్‌ నెఫ్రాలజీ సొసైటీ సదరన్‌ చాప్టర్‌ 44వ వార్షిక సదస్సు విజయవాడ లబ్బీపేటలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నెఫ్రాలజిస్టు డాక్టర్‌ నలమాటి అమ్మన్న తెలిపారు. సూర్యారావుపేటలోని తమ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అమ్మన్న మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం జరిగే ప్రారంభోత్సవ వేడుకలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి.శ్రీహరిరావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. అత్యాధునిక నెఫ్రాలజీ చికిత్సలు, ఆధునిక ఔషధాలు, నవీన ఆవిష్కరణల గురించి చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి విజ్ఞాన సర్వస్వంగా ఈ సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ రాధిక, డాక్టర్‌ శిరీష తదితరులు పాల్గొన్నారు.

  • రైల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు

    రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అరెస్టు చేసి వారి నుంచి 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా గురువారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి ముంబై వెళుతున్న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బీ4 కోచ్‌లోని 41, 44 బెర్త్‌లలో ప్రయాణం చేస్తున్న ముంబైకి చెందిన అంధురాలు జయ ఆలీముల్లా సర్దార్‌, లక్ష్మీ శంకర్‌ నాటేకర్‌ అనే ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను సోదా చేయగా అందులో 15 బండిల్స్‌లో ప్యాక్‌ చేసిన మొత్తం 30 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో ఆర్‌పీఎఫ్‌ సీఐ ఫతే ఆలీబేగ్‌, ఎస్‌ఐ మకత్‌లాల్‌, జీఆర్‌పీ సిబ్బంది పాల్గొన్నారు.

    30 కిలోల గంజాయి స్వాధీనం

  • స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తక్షణమే స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. నోటిఫికేషన్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది ప్రత్యేక బీఈడీ చేసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నారు. డీఎస్సీ సిలబస్‌ను రిలీజ్‌ చేయాలని కోరారు. ఏపీ కేబినెట్‌ ఆమోదించిన 2260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను డైరెక్టుగా డీఎస్సీ ద్వారా నియామకం చేయాలన్నారు. గతంలో మాదిరి డీఎస్సీ నోటిఫికేషన్‌లో వయో పరిమితి సడలింపు ఇవ్వాలన్నారు. నోటిఫికేషన్‌ జారీలో నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు, ప్రత్యేక బీఈడీ అభ్యర్థులు పాల్గొన్నారు.

    డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్‌

  • విశ్రాంత ఉద్యోగుల జీవన రాజధాని విజయవాడ

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంత జీవితం అధికంగా విజయవాడతోనే ముడిపడి వుంటుందని సెంట్రల్‌ జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ అతీరా ఎస్‌.కుమార్‌ అన్నారు. ఆటోనగర్‌ లోని ఒక ఫంక్షన్‌ హాలులో గురువారం జీఎస్టీ సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సభ జరిగింది. ఈ సందర్భంగా అతీరా ఎస్‌.కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ జీవితంలో ఎన్ని ప్రాంతాలు మారినా, చివరకు విశ్రాంత ఉద్యోగిగా విజయవాడలోనే అధికంగా స్థిరపడుతున్నారన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల నివాస కేంద్రంగా విజయవాడ మారిందన్నారు. సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు తన ఉద్యోగ జీవితంలో శాఖ అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. అనంతరం శ్రీనివాసరావును అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.

    సెంట్రల్‌ జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌

    అతీరా ఎస్‌.కుమార్‌

Krishna

  • దమ్ము

    సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. రెక్కీ నిర్వహించి మరీ చోరీలు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు. శుభకార్యాలకు బంగారు నగలు ధరించాలంటే వణికిపోతున్నారు. విజయవాడలో వరుస చోరీలకు అడ్డుకట్ట వేసి, దొంగల భరతం పట్టడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. పోలీసుల నిఘా కొరవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల ఒకే ప్రాంతానికి చెందిన 35 మందికి పైగా దొంగలు రాష్ట్రానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు, నలుగురు ఒక బృందంగా విడిపోయిన దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారని, రైల్వే లైన్‌ వెంబడి ప్రాంతాలను ఎంచుకొని, దొంగతనం చేసిన వెంటనే మరో ప్రాంతానికి చెక్కేస్తున్నారని పోలీసులు గుర్తించారని సమాచారం.

    కిటికీ గ్రిల్స్‌ తొలగించి..

    విజయవాడలోని గుణదల గేటేడ్‌ కమ్యూనిటీలో జూలై ఐదో తేదీన చోరీ జరిగింది. చోరీ చేసింది మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ధార్‌ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో చోరీ చేసే విధానం, శారీక దారుఢ్యం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ముగ్గురు సభ్యుల ముఠా రైళ్లలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలోని ప్రాంతాలను ఎంచుకొని చోరీలకు తెగబడుతోంది. ఈ ముఠా ఇటీవల ఒకే రోజు పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని గుణదల, గుంటుపల్లి, గొల్లపూడి ప్రాంతాల్లో పట్టపగలే వరుస చోరీలకు పాల్పడింది. రూ.12.98 లక్షల విలువైన ఆభరణాలు, నగదు చోరీ చేసింది. ఈ చోరీలన్నీ ప్రధాన ద్వారం గుండా కాకుండా హాలు, వాష్‌రూం ఇనుప గ్రిల్స్‌ను తొలగించి దొంగలు ఇళ్లలోకి ప్రవేశించి చేసినవే. అప్పటి నుంచి ఇప్పటి వరకు దొంగల ఆనవాళ్లను పోలీసులు గుర్తించలేదు. పెనుగంచిప్రోలులో జూలై 28వ తేదీన గ్రామానికి చెందిన తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ మాజీ చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు ఇంట్లో రూ.5 లక్షల విలువగల బంగారు ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలోనూ దొంగలు చిక్కలేదు.

    జైళ్లలో పరిచయాలు

    వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితులను రిమాండ్‌కు తరలించినప్పుడు జైళ్లలో తోటి దొంగలతో పరిచయాలు పెంచుకొని గ్రూపులుగా మారుతున్నారు. శిక్ష పూర్తయిన తరువాత బయటకు వచ్చి ఆ గ్రూపుల్లో సభ్యులంతా ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే ఇటీవల వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం, కాండ్రపాడు, లింగాలపాడు గ్రామాల్లో ఒకేరోజు ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు.

    పోలీసులకు సవాల్‌ విసురుతున్న దొంగలు

    పగలు రెక్కీ.. రాత్రివేళ ఇళ్లలో చోరీలు మహిళలే టార్గెట్‌గా చైన్‌ స్నాచింగ్‌లు టెక్నాలజీకి కూడా చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్న దొంగలు పోలీసుల నిఘా వైఫల్యంతోనే దొంగతనాలని విమర్శలు

    ముందే రెక్కీ

    దొంగలు చోరీకి ముందే రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. పాడైన వస్తువులను రిపేరు చేస్తామని అపార్ట్‌మెంట్లలోకి వచ్చి, ఆపై రెక్కీ నిర్వ హించి ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగల్లో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. కొందరు ప్రేమికులు సైతం తమ ఖర్చులు, విలాసాల కోసం చోరీల బాటపట్టారన్న విమర్శలు ఉన్నాయి.

  • లబ్బీపేట(విజయవాడతూర్పు): తల్లిపాలకు ఎంతో విశిష్టత ఉంది. బిడ్డకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. పుట్టిన అర్ధగంటలోపు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం లేదు. అలాంటి పిల్లల ఎదుగుదలలో లోపాలు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కృత్రిమ పాలతో పనిలేకుండా పాలు లేని, రాని తల్లుల పిల్లల కోసం ఇప్పుడు మదర్‌ మిల్క్‌ బ్యాంకులు ఏర్పాట య్యాయి. ఆ మిల్క్‌ బ్యాంక్‌ తల్లుల నుంచి పాలను సేకరించి ప్రాసెసింగ్‌ చేసి మిల్క్‌ బ్యాంకుల్లో ఉంచుతున్నారు. వాటిని అవసరమైన పిల్లలకు ఇస్తు న్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ పిల్లలకు తల్లిపాల విశిష్టతను తెలియచేసేందుకు ఏటా ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది.

    తల్లిపాలు శిశువులకు ఎంతో మేలు

    ● తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. చిన్నారులకు వ్యాధి నిరోధకశక్తి కూడా సమకూరుతుంది.

    ● తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్‌ వృద్ధి చెంది ఇన్‌ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించొచ్చు.

    ● మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.

    ● పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను వడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత పెరుగుతుంది.

    ● ముర్రుపాలు బిడ్డలో వ్యాధి నిరోధకశక్తిని పెంచు తుంది. అంతేకాదు శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు, విటమిన్‌–ఏ పుష్కలంగా ఉంటాయి.

    ● శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలూరుబిన్‌ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లును నివారిస్తాయి.

    తల్లికీ ఉపయోగం

    బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని పేర్కొంటున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావం అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.

    శిశు మరణాల నివారణ

    ఎక్కువ మంది శిశువులకు ఇన్‌ఫెక్షన్స్‌లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశవ్యాధులతో మరణాలు సంభవించడాన్ని యూనిసెఫ్‌ గుర్తించింది. అలాటి మరణాలను నివారించేందుకు పుట్టిన అర్ధగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు.

    అమ్మపాలతో బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెంపు తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువ పుట్టిన అర్ధగంటలోపు తల్లిపాలు ఇవ్వాలి తాజాగా అందుబాటులోకి మదర్‌ మిల్క్‌ బ్యాంకులు నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

  • ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు గురువారం విరాళాలు సమర్పించారు. విజయవాడ భారతీనగర్‌కు చెందిన పర్వతనేని అతిథి కుటుంబం రూ.లక్ష, పటమటకు చెందిన ఎం. నాగేశ్వరరావు కుటుంబం రూ.1,00,116, సీతారామపురానికి చెందిన పిన్నింటి దుర్గారవికిరణ్‌ కుటుంబం రూ.1,01,116 విరాళం అందజేశారు. 

    పెనమలూరు మండలం కానూరుకు చెందిన విశ్వనాథం గోవిందయ్య కుటుంబం నిత్యాన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ ఈఓ శీనానాయక్‌కు అందజేసింది. హైదరాబాద్‌ కర్మల్‌ఘాట్‌కు చెందిన ఎం.రాఘవకుమార్‌, రమాదేవి దంపతులు రూ.1,01,116 విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఈఓ శీనానాయక్‌, ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

    సరుకుల పంపిణీపై నిరంతర పర్యవేక్షణ

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా నిరాటంకంగా సరుకుల పంపిణీ జరుగుతోందని కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఇగ్నైట్‌ సెల్‌ను కలెక్టర్‌ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో 957 రేషన్‌ దుకాణాల పరిధిలో 5.90 లక్షల రైస్‌ కార్డులు ఉన్నాయని, ప్రతినెలా కార్డుదారులకు 8,400 టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీచేస్తున్నామని తెలిపారు. 52 గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోందని, దీపం 2.0 పథకాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నామని వివరించారు. 

    ఎలాంటి లోటుపాట్లు లేకుండా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు నిరంతర పర్యవేక్షణతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిన్నామని తెలిపారు. రేషన్‌ దుకాణాలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు జవాబుదారీతనంతో పనిచేసేలా చూస్తున్నట్లు వెల్లడించారు. కొత్త రైస్‌ కార్డులు, రేషన్‌ కార్డులో సభ్యుల చేరిక, అడ్రస్‌ మార్పు, ఆధార్‌ సీడింగ్‌ తదితర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

    కూచిపూడి నాట్య పరీక్షలో నూరు శాతం ఉత్తీర్ణత

    కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళా పీఠంలో 2023–25 విద్యా సంవత్సరం ఎంపీఏ (మాస్టర్‌ ఆఫ్‌ పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌) పరీక్షలలో 17 మందికి 17 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాపీఠం ప్రధాన ఆచార్యుడు డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలు విశ్వవిద్యాలయం నుంచి నాట్యకళా పీఠానికి చేరాయని పేర్కొన్నారు. 

    9.65 గ్రేడ్‌ పాయింట్లతో ఏరా భార్గవి, కె.శ్రీలత మొదటి స్థానం దక్కించుకోగా, 9.60 గ్రేడ్‌ పాయింట్లతో వసుధ, 9.20 గ్రేడ్‌ పాయింట్లతో శ్రీవత్సల రెండు మూడు స్థానాల్లో నిలిచారని వివరించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఏలేశ్వరపు శ్రీనివాసులు, టీచింగ్‌ అసిస్టెంట్‌ డాక్టర్‌ దుర్గాభవాని (సంగీతం), పసుమర్తి హరినాథశాస్త్రి (మృదంగం), లైబ్రేరియన్‌ ఏలేశ్వరపు వెంకటేశ్వర ఫణి కుమార్‌ తదితరులు అభినందించారు.

  • వరద ప

    ఇబ్రహీంపట్నం: ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి పెరుగుతున్న వరద ప్రవాహంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ హెచ్చరించారు. మండలంలోని చినలంక, పెద్దలంక, ఫెర్రీ తదితర ప్రాంతాలను ఆయన గురువారం సందర్శించారు. చినలంక వద్ద అర కిలోమీటర్‌ దూరంలో నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరదనీటిని పరిశీలించారు. వరద నీటితో కలిగిన ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పులిచింతల నుంచి వరద నీరు నిలకడగా వస్తోందన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ పైకిఎత్తి నీటిని కిందకు విడుదలచేస్తూ లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్నారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీస్‌, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. గురువారం సాయంత్రం నాటికి వరద ఉధృతి మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంతాల ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లడం, పశువులు, జీవాలు వదలడం చేయొద్దని సూచించారు. వరదకు సంబంధించి ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. అవసరమైతే ట్రక్‌ టెర్మినల్‌ల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరద పరిస్థితిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్డీఓ చైతన్య, తహసీల్దార్‌ వై.వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ కమిషనర్‌ రమ్య కీర్తన తదితరులు పాల్గొన్నారు.

    అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ జరపాలి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

  • రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయం

    మచిలీపట్నంఅర్బన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ (ఐఆర్సీఎస్‌) మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనమని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మంది రంలో సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా గీతాంజలి శర్మ మాట్లాడుతూ.. సమాజ సేవే పరమార్థంగా పని చేస్తున్న ఈ సొసైటీకి మరింత బలాన్నిచ్చేలా జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు సేవల పరంగా కలెక్టర్‌ డి.కె.బాలాజీ అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారిని గుర్తించేందుకు, రెగ్యులర్‌ కలెక్టర్‌ వచ్చేంత వరకు కొత్త కమిటీ ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు. రాష్ట్ర పరిశీలకుడు రామచంద్రరాజు మాట్లాడుతూ.. ఐఆర్సీఎస్‌ సభ్యులు స్వచ్ఛందంగా సేవ చేసే వారేనని పేర్కొన్నారు. తెనాలిలో రక్తదాన కేంద్రానికి స్థలం కేటాయించిన గీతాంజలి శర్మ స్పందనను ప్రశంసించారు. అనంతరం ఐఆర్సీఎస్‌ కార్యదర్శి బి.శంకర్‌నాథ్‌ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం రెడ్‌ క్రాస్‌ ఫౌండర్‌ హెన్రీ డోనాంట్‌ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు రామచంద్రరాజు, చైర్మన్‌ బాలాజీ, కార్యదర్శి శంకర్‌నాథ్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మను ఘనంగా సత్కరించారు. ఐఆర్సీఎస్‌ సేవలు అందించిన డీఆర్వో కె.చంద్రశేఖరరావు, చైర్మన్‌ బాలాజీతో పాటు సమాజ సేవలో చురుకుగా పాల్గొన్న సభ్యులు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్‌. వెంకట్రావు, ఆర్‌ఐఓ సాల్మన్‌ రాజు, పలువురు తహసీల్దారులు ఇన్‌చార్జి కలెక్టర్‌ చేతులమీదుగా సత్కారం అందుకున్నారు.

  • బ్యాంకులు భద్రతా ప్రమాణాలు పాటించాలి

    కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సూచనల ప్రకారం బ్యాంకు అధికారులు బ్యాంకులతో పాటు ఏటీఎంల వద్ద నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ బ్యాంక్‌ల అధికారులతో సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం ఎస్పీ బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశపు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ గార్డుల నియామకం, సురక్షిత నగదు రవాణా, ఆన్‌లైన్‌ మోసాల నివారణ, సైబర్‌ భద్రత వంటి అంశాలపై అధికారులు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. బ్యాంకుల్లో కొత్తగా నియమించుకునే ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ముందస్తు పోలీసుల పరిశీలన తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని, వాటి పనితీరును పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. రాత్రి వేళ ఏటీఎం ప్రాంగణాలు వెలుతురుతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని, అత్యవసర పరిస్థి తుల్లో పోలీసులకు వెంటనే సమాచారం చేరేలా అలారం లేదా లింకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల డేటా కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలని స్పష్టం చేశారు. సైబర్‌ నేరాలపై ఖాతాదారులకు పూర్తి అవగాహన కలిగించే బాధ్యతను బ్యాంకులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, డీఎస్పీలు సిహెచ్‌.రాజా, శ్రీనివాసరావు, ధీరజ్‌ నీల్‌, విద్య శ్రీ పాల్గొన్నారు.

    కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు

  • గంజాయి ముఠా అరెస్టు

    ఉయ్యూరు: గంజాయి ముఠాను ఉయ్యూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ టీవీవీ రామారావు తెలిపిన కథనం మేరకు...ఉయ్యూరు పట్టణంలో గంజాయి విక్రయాల సమాచారం అందుకున్న పోలీసులు సీఐ రామారావు ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో తొమ్మిది మంది గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2.50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న పొదిలపు జగదీష్‌కుమార్‌, కొలసాని వెంకట సాయి, సానక నరేంద్ర, గుడిమెట్ల ప్రవీణ్‌కుమార్‌, మిక్కిలి సంజయ్‌కుమార్‌, దున్నాల మనోజ్‌, మహ్మద్‌ అహ్మద్‌ బాషా, ఓరుగంటి గోపయ్యస్వామి, సయ్యద్‌ మునీర్‌లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.

  • పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

    పెనమలూరు: మండల పరిధిలో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఇంత కాలం ఎడారిలా తలపించిన కృష్ణా నదికి ఎగువన కురిసిన వర్షాలతో వరద వచ్చింది. మండల పరిధిలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం ఘాట్‌ల వద్దకు నదిలో వరద నీరు చేరుకుంది. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో కృష్ణానదిలో జలకళ ఏర్పడింది. అయితే నదిలో వరద 5 లక్షల క్యూసెక్కులు వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. నదిలోకి ఎవరూ దిగకుండా ఆయా గ్రామ పంచాయతీల పాలకులు, అధికారులు చర్యలు తీసుకున్నారు. గత ఏడాది వరదల కారణంగా తీర ప్రాంత వాసులు చాలా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ వరద ఉధృతి పెరిగితే చాలా ఇబ్బందులు పడతామని వారు వాపోతున్నారు. ఎంపీడీవో బండి ప్రణవి, ఆయా పంచాయతీల కార్యదర్శులు తీర ప్రాంత గ్రామాల్లో నది వద్దకు వెళ్లి తాజా పరిస్థితులు పరిశీలించారు.

  • ఫెయిల్‌ చేయించారు

    సక్సెస్‌ఫుల్‌గా

    76 మందిని

    పెడన: గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో సక్సెస్‌ఫుల్‌గా 76 మందిని ఫెయిల్‌ చేసినందుకు మీకు అభినందనలు. మీ స్కూలు అంత వరస్ట్‌ స్కూలు జిల్లాలో ఎక్కడా లేదు. మీలో మీరు పోట్లాడుకుంటే పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారు? మీ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులందరూ మధ్యాహ్న భోజనం చేయడం లేదంటూ జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు ఉపాధ్యాయులకు క్లాస్‌ పీకారు. ఆయన గురువారం పెడనలోని భట్ట జ్ఞానకోటయ్య(బీజీకే) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కలియతిరిగి ల్యాబ్‌, లైబ్రరీలను, తరగతి గదులకు తాళాలు వేసిన వాటిని పరిశీలించారు. ఆరు, పది తరగతులకు వెళ్లి విద్యార్థుల రీడింగ్‌ బుక్స్‌, వారు ఏ విధంగా పాఠాలు చదువుతున్నారో పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో స్టాఫ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు హెచ్‌ఎం ఇందిర కూడా రావడంతో ఉపాధ్యాయులకు గట్టిగా క్లాస్‌ పీకారు. సక్సెస్‌ఫుల్‌గా 76 మంది విద్యార్థులను పదో తరగతిలో తప్పించారని, మీకు అభినందనలంటూ ఉపాధ్యాయులను ఉద్దేశించి డీఈవో వ్యంగ్యంగా అన్నారు. 2024–25లో పదో తరగతి పరీక్షకు ఎందరు హాజరైంది, తప్పిన వారి వివరాలు కూడా తెలియకుండా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చామని హెచ్‌ఎం ఇందిర చెప్పడంతో డీఈవో సీరియస్‌ అయ్యారు. వచ్చి రెండు నెలలు అవుతున్నా పాఠశాల గురించి తెలుసుకోకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనాన్ని 150 మందికి పైగా ఎందుకు తినడం లేదని ప్రశ్నించారు. కుళ్లిపోయిన కూరగాయలు వస్తున్నా వాటిని మీరు పట్టించుకోకపోవడం వల్ల, విద్యాబుద్ధులు సరిగ్గా చెప్పకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య పడిపోతోందన్నారు. కేవలం మీ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు బడులకు రావడం లేదంటూ కోపడ్డారు. విద్యార్థులు అధికంగా ఉంటేనే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అదనపు తరగతులను కేటాయిస్తున్నా ఉపాధ్యాయులు తీసుకోవడం లేదని హెచ్‌ఎం డీఈవోకు ఫిర్యాదు చేశారు. పాఠశాల గేటు బయట వరకు మాత్రమే ఉపాధ్యాయ సంఘాలని, పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులేనని డీఈవో స్పష్టం చేశారు. లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలని, ఆ ఆదేశాలు పాటించని వారికి మెమోలు ఇవ్వాలని, అదే మెమో తనకు కూడా పంపించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. డీఈవో ఎదురుగానే హెచ్‌ఎం ఇందిర, యూటీఎఫ్‌ నాయకుడు, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు గొడవ పడటంతో ఇద్దర్నీ సస్పెండ్‌ చేస్తానని డీఈవో వారిని హెచ్చరించారు. బాపులపాడు కాకుండా విద్యాశాఖ కమిషనర్‌ మీ పాఠశాలను ఎంపిక చేసుకుని ఉంటే వికెట్లు పడిపోయేవని, మీ అదృష్టం బాగుందన్నారు. మీ స్కూలంత వరస్ట్‌ స్కూలు జిల్లాలో ఎక్కడా లేదని, మళ్లీ వస్తానని, పరిస్థితిలో మార్పు రాకపోతే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

    జిల్లాలో ఇంత వరస్ట్‌ స్కూలు ఇంకెక్కడా లేదు సొంత పిల్లలపై చూపించిన శ్రద్ధ బడి పిల్లలపై ఎందుకు చూపించలేకపోతున్నారు? మీరే పోట్లాడుకుంటే పిల్లలకు ఏం చదువులు చెబుతారు? మీ నిర్లక్ష్యం వల్లే మధ్యాహ్నభోజనం అందరూ చేయడం లేదు పెడన బీజీకే జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులకు క్లాస్‌ పీకిన డీఈవో

  • యోగా పోటీల్లో ఏపీ విద్యార్థుల విజయఢంకా
    ● జేఎన్‌వీ ప్రాంతీయస్థాయి యోగా క్రీడల్లో ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ సాధించిన వైఎస్సార్‌ కడప క్లస్టర్‌ ● ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్‌ ● త్వరలో జాతీయస్థాయి పోటీలకు అర్హత

    యడ్లపాడు: ఆట ఏదైనా పోటీల నిర్వహణ క్రీడాకారులకు ఒక వేదిక మాత్రమేనని.. యోగాను జీవితంలో భాగం చేసుకోవడమే అసలైన విజయమని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి పేర్కొన్నారు. చిలకలూరిపేట రూరల్‌ మండలం మద్దిరాలలోని పీఎంశ్రీ జవహర్‌ నవోదయ పాఠశాలలో హైదరాబాద్‌ జేఎన్‌వీ రీజియన్‌ పరిధిలో నిర్వహించిన ప్రాంతీయస్థాయి యోగా క్రీడా ప్రదర్శన పోటీలు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు విభాగాల్లో మూడు రోజుల పాటు కొనసాగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం గురువారం జరిగింది. విద్యాలయ ప్రిన్సిపాల్‌ నల్లూరి నరసింహారావు నవోదయ జాతీయ క్రీడలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. పోటీల నిర్వహణకు సమన్వయంతో కృషి చేసిన విద్యాలయ వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, పీఈటీలు ఆర్‌.పాండురంగారావు, జి.గోవిందమ్మ, అధ్యాపకులు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఎస్కార్ట్‌లను అభినందించారు.

    ఓవరాల్‌ చాంపియన్‌గా వైఎస్సార్‌ కడప క్లస్టర్‌

    జవహర్‌ నవోదయ విద్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రాంతీయస్థాయి యోగాక్రీడా ప్రదర్శన పోటీల్లో ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను రాష్ట్రానికి చెందిన వైఎస్సార్‌ కడప క్లస్టర్‌లోని జేఎన్‌వీ సాధించుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలోని 8 క్లస్టర్ల నుంచి కృష్ణా, వైఎస్సార్‌ కడప, బీదర్‌, షిమోగా, తుమ్మకూర్‌, పట్నంతిట్టా, వైనాడ్‌, ఖమ్మం ప్రాంతాలకు చెందిన 278 మంది క్రీడాకారులు పాల్గొని ఆసనాలు, ఆర్టిస్ట్టిక్‌, రిథమిక్‌ విభాగాల్లో యోగా విన్యాసాలు ప్రదర్శించి తమ కళాత్మక నైపుణ్యాలను చాటారు. ఆయా పోటీల్లో రాష్ట్రానికి చెందిన వైఎస్సార్‌ కడప క్లస్టర్‌ జేఎన్‌వీ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోగా, కృష్ణా క్లస్టర్‌ ద్వితీయస్థానంలో నిలిచింది. వీటితో పాటు వివిధ విభాగాల్లో వ్యక్తిగతంగా విజేతలైన 42 మంది త్వరలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు అర్హత సాధించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న 21 మంది విద్యార్థులు, 21 మంది విద్యార్థినులను మెడల్స్‌, సర్టిఫికెట్లతో సత్కరించారు. అన్ని విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి చాంపియన్‌షిప్‌గా నిలిచిన వైఎస్సార్‌ కడప క్లస్టర్‌ విద్యార్థులను, ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్‌ విద్యార్థులను, షీల్డ్‌లు, సర్టిఫికెట్లతో సత్కరించారు.

  • యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
    వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌

    తోట్లవల్లూరు(పమిడిముక్కల): రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ విమర్శించారు. ఎరువుల కృత్రిమ కొరతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పమిడిముక్కల తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌కు గురువారం ఆయన రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కై లే మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే రైతుల అవసరాలను అంచనా వేసి ఎరువులు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో రైతులకు పుష్కలంగా విత్తనాలు, ఎరువులు, సకాలంలో రైతుభరోసా అందించామని గుర్తుచేశారు. కానీ నేడు యూరియా, కాంప్లెక్స్‌ ఎరువుల కోసం పీఏసీఎస్‌ల వద్ద రైతులు మండుటెండలో గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. సొసైటీల్లో పచ్చ చొక్కాలకు, పెద్ద రైతులకు ఎక్కువ మొత్తంలో ఎరువులు ఇస్తూ చిన్న, సన్నకారు, కౌలు రైతులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా, డీఏపీ దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రైతుల అవసరాలకు అనుగుణంగా రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా ఎరువులను సరఫరా చేయాలని అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్‌, మాజీ ఎంపీపీ సొంఠి వెంకటేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ సీతారామయ్య, కోఆప్షన్‌ సభ్యుడు దియావత్‌ ఆలీ, ఎంపీటీసీ సభ్యులు మేరుగు లక్ష్మి, వంశీ, ఆదిశేషు, నాయకులు చంద్రపాల్‌, బొల్లా సాంబశివరావు, నాగార్జున, బాబూరావు, యార్లగడ్డ శివ, అనుదీప్‌, కొక్కిలిగడ్డ ఆనంద్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

  • పోలీస

    అవనిగడ్డ: పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆలయంలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఆరో వార్డుకు చెందిన చింతలపూడి నాగవర్థన్‌, బాపట్ల జిల్లా రేపల్లె ఏడవ వార్డుకు చెందిన తోట సాయి మౌనిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి మౌనిక తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో గురువారం మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమజంట స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్‌ని ఆశ్రయించడంతో ఇరువురు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ కోసం సమాచారం ఇచ్చారు. మౌనిక తల్లిదండ్రులు రాకపోవడంతో నాగవర్థన్‌ తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు.

    మహిళా జూదరులు అరెస్ట్‌

    పెడన: పట్టణంలో పేకాడుతున్న ఐదుగురు మహిళలను పెడన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పెడన ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు అందిన సమాచారంతో పైడమ్మ కాలనీలో పేకాడుతున్న ఐదుగురు మహిళలను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.12,350 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

    నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం

    కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో చిక్కుకుని కేకలు వేస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కాపాడి ఒడ్డుకు చేర్చిన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నున్నకు చెందిన అంకా సెల్వరాజ్‌ బుధవారం రాత్రి కృష్ణానదిలోకి వెళ్లి వారధి 42వ పిల్లర్‌ వద్ద ఇసుక తిన్నెల్లో పడుకుని నిద్రపోయాడు. గురువారం ఉదయం లేచి చూడగా అతని చుట్టూ వరద నీరు చేరుతుండడంతో భయంతో కేకలు పెట్టాడు. వారధి పైన వెళ్తున్న ప్రయాణికులు కేకలు విని అతనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కృష్ణలంక పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పడవ ద్వారా అతని వద్దకు చేరుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అతని వివరాలను సేకరించిన పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారించారు.

  • పాడి రైతులకు రూ.13 కోట్ల బోనస్‌

    చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): పాడి రైతులకు ఆర్థిక భరోసాతో పాటు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఎల్లవేళలా కృషి చేస్తుందని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. పాలప్రాజెక్టు ఆవరణలోని బోర్డు సమావేశ మందిరంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ 2025 ఏప్రిల్‌–జూన్‌కు సంబంధించి పాడి రైతులకు రూ.13 కోట్లు బోనస్‌గా అందిస్తున్నామన్నారు. పాడి రైతులకు అత్యధిక పాల సేకరణ ధరను సకాలంలో చెల్లిస్తూ, ఏడాదిలో మూడు పర్యాయాలు బోనస్‌ను కృష్ణా మిల్క్‌ యూనియన్‌ అందిస్తుందన్నారు. పాడి రైతుల ఆరోగ్యం కోసం తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేలా ఆశ్రం హాస్పిటల్‌తో పాటు చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఆయా హాస్పిటల్స్‌లో పాడి రైతులకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ వైద్య సేవలను ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పాడిరైతులు వినియోగించుకోవచ్చునన్నారు. పాడి పశువుల కోసం పంపిణీ చేసే సెమెన్‌ డోస్‌ రూ.150లు కాగా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పాడి రైతులకు కేవలం రూ.50కే అందించి, మిగిలిన రూ.వంద సబ్సిడీని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చెల్లిస్తుందన్నారు. కేవలం కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పాడి రైతులే కాకుండా జిల్లాలోని పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునన్నారు. సమావేశంలో ఆశ్రం హాస్పిటల్‌ సీఈవో హనుమంతరావు, పిన్నమనేని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ అనిల్‌, విజయ డెయిరీ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, జిల్లా లైవ్‌ స్టాక్‌ డెవలప్మెంట్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.

    విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని

  • శేష జీవితాన్ని సంతోషంగా గడపండి

    కోనేరుసెంటర్‌: పోలీసుశాఖకు ఉత్తమ సేవలను అందించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందుతున్న సిబ్బంది తమ శేష జీవితాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేలా భగవంతుడు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని గురువారం ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ హాలులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని, కుటుంబం కంటే వృత్తికే అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి విధులు నిర్వర్తించిన మీరంతా ఇతరులకు స్ఫూర్తి ప్రదాతలని అన్నారు.

    కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌ఐలు కె.బలరామ్‌, యు.ఎల్‌.సుబ్రహ్మణ్యం, ఎస్‌.వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐ మహమ్మద్‌ ముస్తఫాలను వారి కుటుంబసభ్యుల నడుమ ఘనంగా సత్కరించి వారి కుటుంబ నేపథ్యాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు డీఎస్పీ సీహెచ్‌ రాజా, ఏఆర్‌ డీఎస్పీ పి.వెంకటేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

    జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు

West Godavari

  • అంగన్

    సాక్షి, భీమవరం: ఆటపాటలతో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే అంగన్‌వాడీ కేంద్రాలు కూటమి సర్కారు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆట పరికరాల సరఫరా లేక పిల్లలు పాడైపోయిన బొమ్మలతోనే ఆడుకోవాల్సిన దుస్థితి. సన్నబియ్యం రాక ముతక బియ్యాన్ని పంపిణీ చేయాల్సి వస్తోందని అంగన్‌వాడీ వర్కర్లు చెబుతున్నారు.

    1,556 కేంద్రాలు.. 70 మినీ కేంద్రాలు

    జిల్లాలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 1,626 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆయాలతో నడిచే మినీ కేంద్రాలు 70 ఉండగా, వర్కర్‌, ఆయాలతో నిర్వహించే కేంద్రాలు 1,556 ఉన్నాయి. వీటి పరిధిలో 7,936 మంది గర్భిణులు, 5,686 మంది బాలింతలు, ఏడు నెలల వయసు నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 40,706 మంది, మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు బాలలు 17,687 మంది ఉన్నారు.

    ముతక బియ్యమే సరఫరా

    గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు ఆయిల్‌ ప్యాకెట్‌, ఐదు లీటర్ల పాలు, 25 గుడ్లు, కిలో అటుకులు, రెండు కిలో రాగి పిండి, పావు కిలో డ్రైఫ్రూట్స్‌ తదితర వాటిని అందజేయాలి. గర్భిణులు, బాలింతలకు పోర్టిఫైడ్‌ బియ్యం సరఫరాను గత వైఎస్సార్‌సీపీప్రభుత్వంలోనే ప్రారంభించారు. అలాగే చిన్నారులకు సోమవారం నుంచి శనివారం వరకు రోజూ అంగన్‌వాడీ కేంద్రాల వద్దనే ఆహారాన్ని అందించాలి. మెనూ ప్రకారం సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో అన్నం, కూరలతో భోజనం, మంగళవారం పులిహోరా, శనివారం వెజిటబుల్‌ రైస్‌ వడ్డించాలి. హాస్టళ్లు, పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించినట్టు చెబుతున్న కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం రేషన్‌ డిపోల్లో అందజేసే బియ్యాన్నే సరఫరా చేస్తుండటం గమనార్హం. అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్టు సివిల్‌ సప్లయీస్‌ అధికారులు చెబుతుండగా తమకు రేషన్‌ బియ్యమే వస్తున్నాయని వర్కర్లు చెబుతున్నారు. చిన్నారులకు ఆటపరికరాలతో పాటు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

    గత ప్రభుత్వ హయాంలో..

    అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా కేంద్రాల్లో వసతుల కల్పన, నూ తన భవనాల నిర్మాణం, ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్లు తదితర వసతులు కల్పించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రా ధాన్యమిస్తూ పౌష్టికాహారం మెనూలోనూ మార్పులు చేసింది. చిన్నారుల వికాసానికి క్రమం తప్పకుండా ఆటపరికరాలు సరఫరా చేస్తూ వచ్చింది.

    పాడైపోయిన బొమ్మలే దిక్కు

    చిన్నారుల శారీరక, మానసిక, సామాజిక వికాసానికి, చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ఆటపరికరాలు దోహదపడతాయి. వారు ఆరోగ్యంగా ఎదగేందుకు సాయపడతాయి. పిల్లల ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంచే బొమ్మలు, ఆట వస్తువులు, రంగురంగుల బ్లాక్లు, పజిల్స్‌, లెక్కలు నేర్చుకునేందుకు సంబంధించిన వస్తువులు, పిల్లలు కలిసి ఆడుకోవడానికి, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటానికి ఉపయోగపడే ఆట వస్తువులు తదితర వాటితో కూడిన ఆట పరికరాల కిట్లను ప్రభుత్వం సరఫరా చేసేది. గతంలో రెగ్యులర్‌గా వచ్చేవని రెండేళ్లుగా ఆట పరికరాల కిట్లు సరఫరా నిలిచిపోయినట్టు అంగన్‌వాడీ వర్కర్లు చెబుతున్నారు. కొత్తవి రాకపోవడంతో గత ప్రభుత్వంలో అందజేసిన ప్లాస్టిక్‌ బొమ్మలు, పరికరాలతోనే ప్రస్తుతం చిన్నారులు ఆడుకుంటున్నారు. వీటిలో చాలా వరకు పాడైపోయి విరిగిపోయాయి. కొన్ని సెంటర్లలో ఈ బొమ్మలు సైతం లేని పరిస్థితి ఉంది. కాగా ఆట పరికరాల కోసం ప్రతిపాదనలు పంపామని, కిట్లు రావాల్సి ఉందని ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు.

    ఆట బొమ్మలకూ దిక్కులేదు

    అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట పరికరాలు సరఫరా చేయని కూటమి సర్కారు

    పాడైపోయిన వాటితోనే పిల్లలకు ఆటలు

    సన్నబియ్యం రాక చౌక బియ్యమే పంపిణీ

    జిల్లాలో 1,626 అంగన్‌వాడీ కేంద్రాలు

    ఐదేళ్లలోపు చిన్నారులు 58,393

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీలకు పెద్దపీట

  • గీత ర

    గత ప్రభుత్వంలో ఆపన్న హస్తం

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గీత కార్మికులకు ఆపన్న హస్తం అందించింది. నాటి సీఎం వైఎస్‌ జగన్‌ నూతన ఎకై ్సజ్‌ పాలసీ తీసుకువచ్చారు. గీత పన్ను రద్దు చేశారు. కల్లు గీత కార్మిక సొసైటీలు, గీత గీచే వారికి చెట్టు పథకం అమలు చేశారు. కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం పొందితే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించారు. వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా నష్టపరిహారం చెల్లించారు. ప్రమాదాల్లో మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఎన్‌ఈఆర్‌జీఎస్‌, షెల్టర్‌ బెడ్‌ అభివృద్ధి పథకాల ద్వారా తాటి, ఈత వంటి చెట్లు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లు సమృద్ధిగా పెరిగేలా చర్యలు తీసుకున్నారని గీత కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు.

    ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కల్లు గీత కార్మికులు తమ రాత మారేనా.. కష్టాలు తీరేనా అని ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేదనను మిగిలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఊరూవాడా బెల్టు షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో గీత వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 9 వేల బెల్టుషాపులు ఉన్నాయని గీత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. కల్లుగీత వృత్తిపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారంటున్నారు.

    9 వేలకు పైగా బెల్టు షాపులు

    ఏలూరు జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేలు, పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 4 వేలు బెల్టుషాపులు ఉన్నాయి. కూటమి నాయకులు, వారి అనుచరులే బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని, దీంతో గీత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గీత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. బెల్టు షాపులపై కొరడా ఝుళిపిస్తామని ముఖ్యమంత్రి, ఎకై ్సజ్‌ మంత్రి ప్రకటనలు చేయడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సర్కిల్‌ వారీగా సభలు, సమావేశాలు నిర్వహించిన కార్మికులు ఆందోళనను ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్‌ వద్ద భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

    కల్తీ మద్యం హల్‌చల్‌!

    ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం హల్‌చల్‌ చేస్తున్నట్లు గీత కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గోవా, యానాం నుంచి అక్రమ మద్యం తీసుకు వస్తున్నారని చెబుతున్నారు. అనకాపల్లి, పరవాడ కేంద్రంగా కబళిస్తున్న కల్తీ మద్యం రాకెట్‌ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లును స్థావరంగా చేసుకుందని అంటున్నారు. పాలకొల్లులో కల్తీ మద్యం తయారుచేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. బెల్టు షాపుల్లో అధికంగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, హైదరాబాద్‌ నుంచి స్పిరిట్‌ను తీసుకువచ్చి రంగు నీళ్లు కలిపి మద్యంగా తయారు చేసి బ్రాండెడ్‌ కంపెనీల బాటిల్స్‌లో నింపి ప్రముఖ బ్రాండ్ల లేబుల్‌ అతికించి షాపుల్లో విక్రయిస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అనుచరుడే కల్తీ మద్యం దందా నడుపుతున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోందని గీత కార్మికుల నాయకులు ఆరోపిస్తున్నారు.

    కూటమి మొండిచేయి

    గీత కార్మికులకు ఇచ్చిన హామీల అమలెప్పుడు?

    ఏడాది దాటినా పట్టించుకోని కూటమి సర్కారు

    వాడవాడలా బెల్టు షాపులు

    ఉమ్మడి జిల్లాలో కల్లుగీత ఛిన్నాభిన్నం

    సుమారు 25 వేల మంది కార్మికులకు కష్టం

    బెల్టు షాపులు తొలగించాలి

    గీత వృత్తిని దెబ్బ తీస్తున్న మద్యం బెల్టు షాపులను తక్షణం తొలగించాలి. ఊరూ వాడా తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు వెలియడంతో కల్లు గీత వృత్తి మరుగున పడే ప్రమాదం ఉంది. గీత వృత్తిని కాపాడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

    –బెజవాడ వెంకటేశ్వరరావు, గీత కార్మికుడు, చొదిమెళ్ల, ఏలూరు మండలం

    పట్టించుకోని అధికారులు

    ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతున్నా ఎకై ్సజ్‌ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నాటు సారా పేరుతో గీత కార్మికులపై దాడులు చేస్తూ వేధిస్తున్నారు. ఓపక్క కల్లు వ్యాపారం లేక ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు అధికారుల వేఽధింపులతో వృత్తికి దూరమవుతున్నారు.

    – జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్లుగీత కార్మిక సంఘం, భీమవరం

  • కూటమి మోసాలను ఎండగడదాం

    భీమవరం అర్బన్‌: ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత మొహం చాటేస్తున్న చంద్రబాబు వంచన పాలనను తిప్పికొడదామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొత్తపూసలమర్రులో పార్టీ మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రసాదరాజు మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేసిన ప్రతిసారీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని, సూపర్‌సిక్స్‌ అంటూ మ రోసారి బాబు మోసం చేశాడని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి ఏడాది పాలనలో రూ.1.60 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో వలంటీర్లు, ఎండీఎం డ్రైవర్లు, మద్యం షాపుల్లో సిబ్బంది ఇలా సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు పీకేశారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 8.58 లక్షల పింఛన్లను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయలేదన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ అందకుండా రూ.4,500 కోట్ల బకాయిలు పెట్టారన్నారు.

    ఇంటింటా నిలదీత

    నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌లు సంతకాలు పెట్టి బాండ్‌ పేపర్లు ఇచ్చారని, వీటిపై కూటమి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

    కూటమి ప్రభుత్వంలో వందల కోట్లు వృథా

    ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు ధాన్యం సొమ్ములు జమచేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. యోగాంధ్ర, పేరెంట్స్‌ కమిటీ సమావేశాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ గ్రామస్థాయి వరకూ పార్టీని పటిష్టం చేస్తున్నారని, పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ఇంటింటా వివరించాలన్నారు. మాజీ సీఎం జగన్‌ పర్యటనలతో కూటమి నాయకులు ఉలిక్కి పడుతున్నారని, అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, జిల్లా సోషల్‌ మీడియా విభాగ అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా యూత్‌ విభాగ అధ్యక్షుడు చిగరుపాటి సందీప్‌, నాయకులు మేడిది జాన్సన్‌, ఏఎస్‌ రాజు, కామన నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్‌ గాదిరాజు రామరాజు, ఎంపీటీసీ తిరుమాని తులసీరావు, వైస్‌ ఎంపీపీ తిరుమాని ధనంజయరాజు తదితరులు పాల్గొన్నారు.

    వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి

  • ఆకివీడు: స్థానిక గుమ్ములూరు సెంటర్‌లో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఎస్‌ బీఐ ఏటీఎంను మద్యం మత్తులో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తాగిన మైకంలో ఏటీఎం గది అద్దాలను గుద్దుకుంటూ లోనికి వెళ్లాడు. గురువారం ఉదయం ఏటీఎం నగదు డ్రా చేసే కింది భాగంలో డోర్‌ తెరిచి ఉంది. దీంతో రూరల్‌ సీఐ జగదీశ్వరరావు సంఘటనా స్థలాన్ని, సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. ఏటీఎంలో డబ్బు భద్రంగా ఉందని తెలిపారు.

    క్లోరినేషన్‌ చేసి నీరు సరఫరా

    ఆకివీడు: మండలంలోని అప్పారావుపేట గ్రామంలో క్లోరినేషన్‌ చేసి తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నామని గ్రా మ కార్యదర్శి బి.సతీష్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘సమస్యల వలయంలో అప్పారావుపేట’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. ప్రతినెలా రక్షిత మంచినీటి పథకాన్ని శుభ్రం చేయిస్తున్నామన్నారు. అప్పారావుపేట–గుమ్ములూరు రోడ్డు కు నాబార్డు (ఆర్‌ఐడీఎఫ్‌) నిధులు మంజూరు అయ్యాయని పనులు జరగాల్సి ఉందన్నారు. 2.50 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.1.60 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

    జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల గడువు పెంపు

    భీమవరం: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 11 వరకు గడువు పొడిగించినట్టు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ అధికారి జి.ప్రభాకరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో గతేడాది 1,410 మంది చేరగా ఈ ఏడాదిలో 1,618 మంది ప్రవేశాలు పొందారన్నారు. ప్రభుత్వం ఇంటర్మీడియె ట్‌ విద్యార్థులకు తల్లికి వందనం, టెస్ట్‌, నోట్‌బు క్స్‌, మధ్యాహ్నం భోజన పథకంతోపాటు విద్యార్థులకు పోషకాహారం కోసం చిక్కీలు, రాగి జావ అందిస్తున్నట్టు చెప్పారు.

    ఉపాధ్యాయులకు అన్యాయం

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యారంగంలో ప్రభు త్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అకడమిక్‌ కమిటీ కన్వీనర్‌ గుగులోతు కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులకు మాత్రమే ఎంఈఓ, డీవైఈఓలుగా బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ యాజమాన్యాల్లో పనిచేసే ఉపాధ్యాయులపై ప్రభుత్వ ఉపాధ్యాయుల పెత్త నం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సంబంధించి 72, 73, 74 జీఓల అమలులో పక్షపాత వైఖరి సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయా లని డిమాండ్‌ చేశారు.

    రిజిస్ట్రేషన్‌ ఆదాయంలో ఫస్ట్‌

    నూజివీడు: ఏలూరు జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా రూ.548.80 కోట్ల రెవెన్యూతో రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించినట్టు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్‌ కొమ్మి నేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నూ జివీడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నూజివీడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం 80 శాతం వృద్ధి సాధించిందన్నారు. 

    రిజిస్ట్రేషన్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా కార్డ్‌ ప్రైమ్‌ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్‌ జరిగిన రోజే డాక్యుమెంట్‌ను యజమానికి అందిస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ కాపీని యజమానికి వా ట్సాప్‌ ద్వారా అందిస్తామన్నారు. ఏలూరు కా ర్పొరేషన్‌ పరిధిలో కార్డ్‌ ప్రైమ్‌ 2.0ను మున్సి పల్‌ పరిపాలన విభాగంతో అనుసంధానం చే సి, అర్బన్‌ పరిధిలో ఉన్న ఆస్తులను మ్యూటేష న్‌ చేసి యజమాని మార్పిడి జరుగుతుంద న్నారు. ఏలూరు, వట్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయాల్లో ప్రారంభిస్తామన్నారు.

  • విద్యుత్‌ సంస్థలో పదోన్నతులు

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్‌ ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలోని పలువురు సీనియర్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ అక్కౌంట్స్‌ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఎస్‌ఈ పి.సాల్మన్‌ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకొల్లు ఈఆర్‌ఓలోని ఎల్‌బీవీ సాంబశివరావును భీమవరానికి పదోన్నతిపై బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్‌ కార్యాలయంలోని వై.శ్రీనివాసరావును ఏలూరు సర్కిల్‌ కార్యాలయంలో ఎల్‌టీ విభాగానికి బదిలీ చేశారు. భీమవరం ఈఆర్‌ఓలోని పీఆర్‌కేవీ ప్రసాద్‌ను నరసాపురం డివిజన్‌ అక్కౌంట్స్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు కనస్ట్రక్షన్స్‌ విభాగంలోని వి.రాజశేఖర్‌ను ఏలూరు సర్కిల్‌ కార్యాలయంలోని సీఏఎస్‌ విభాగానికి బదిలీ చేశారు. తణుకు డీ1లోని కె.రవీంద్రనాథ్‌ను తాడేపల్లిగూడెం అక్కౌంట్స్‌ డివిజన్‌ కార్యాలయానికి, భీమవరం డివిజన్‌ కార్యాలయంలోని జి.రామకృష్ణ రాజును భీమవరం సర్కిల్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్‌ కార్యాలయంలోని కేవీఆర్‌జీ కృష్ణమూర్తిని అదే కార్యాలయానికి, నరసాపురం డివిజన్‌ కార్యాలయంలోని ఎస్‌డీ ఆశీర్వాదంను అదే కార్యాలయంలో ఏడీఎం విభాగానికి, ఏలూరు ఈఆర్‌ఓలోని ఎస్‌.వెంకటేశ్వరరావును ఏలూరు డివిజన్‌ కార్యాలయానికి, పెరవలి సెక్షన్‌ కార్యాలయంలోని ఎ.శ్రీనివాసరావును జంగారెడ్డిగూడెం అక్కౌంట్స్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. నిడదవోలు ఈఆర్‌ఓలోని ఎండీ అబ్దుల్‌ అలీంను నిడదవోలు డివిజన్‌ కార్యాలయానికి, ఉండ్రాజవరం సెక్షన్‌ కార్యాలయంలోని కేవీపీ విజయకుమార్‌ను జంగారెడ్డిగూడెం ఈఆర్‌ఓకు, తంగెళ్లమూడి ఈఆర్‌ఓలోని కె.పద్మజను అదే కార్యాలయానికి జూనియర్‌ అక్కౌంట్స్‌ అధికారిగా పదోన్నతి కల్పించారు. అలాగే తణుకు ఈఆర్‌ఓలోని కె.బాలకృష్ణకు జూనియర్‌ అక్కౌంట్స్‌ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ తాడేపల్లిగూడెం డివిజన్‌ కార్యాలయంలో పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఆయన్ను భీమవరం ఈఆర్‌ఓకు బదిలీ చేశారు.

  • 2న ఉపాధ్యాయుల ధర్నా

    భీమవరం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శనివారం భీమవరంలో కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఫ్యాప్టో చైర్మన్‌ పెన్మెత్స విజయరామరాజు, జనరల్‌ సెక్రటరీ జి.ప్రకాశం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా సన్నాహక సమావేశంలో మాట్లాడారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్‌ రద్దు, యాప్స్‌ భారం తగ్గించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, పెండింగ్‌ బకాయిలతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలనిఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా యూనిట్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ధర్నాలో జిల్లాలోని ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో కో–చైర్మన్‌ పెన్మెత్స ఆర్‌వీఎస్‌ సాయివర్మ, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ రమణారావు, కో–చైర్మన్‌ శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

    పీ4పై సమీక్ష

    భీమవరం (ప్రకాశంచౌక్‌) : పీ4 కార్యక్రమంలో మార్గదర్శకులు స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ కలెక్టర్లకు సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్షించగా భీమవరం కలెక్టరేట్‌ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు.

Medak

  • కార్డులు సరే.. షాపులేవీ?

    ప్రభుత్వం నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో దుకాణాలు కూడా పెంచాలని కోరుతున్నారు. కొన్నిచోట్ల పరిమితికి మించి కార్డుదారులు ఉండటం, మరికొన్ని చోట్ల బియ్యం తెచ్చుకోవడానికి దూర భారంతో నెల నెలా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.

    – పెద్దశంకరంపేట(మెదక్‌)

    జిల్లావ్యాప్తంగా 2,16,614 ఆహారభద్రత కార్డులు ఉండగా, ఇటీవల కొత్తగా మరో 9,964 కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 469 గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటివరకు 520 రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం అందజేస్తున్నారు. పలు మండలాల పరిధిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గోదాంలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రేషన్‌ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో 11 రేషన్‌ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఆహారభద్రత కార్డులను ప్రభుత్వం అందజేస్తుండగా, వీరికి సెప్టెంబర్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు రేషన్‌ దుకాణాల్లో సహాయకులు లేకుండానే డీలర్లు బియ్యం అందజేస్తున్నారు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ప్రజలకు రేషన్‌ సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డులకు అనుగుణంగా మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దుకాణాల సంఖ్య పెరిగితే ప్రజలకు ఇబ్బందులు దూరం కావడంతో పాటు సమయం సైతం ఆదా అవుతుంది.

    కొత్త జీపీల్లో తప్పని తిప్పలు

    జిల్లాలో నూతన పంచాయతీలను ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. కానీ ఆయా గ్రామాల్లో నూతన రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేయలేదు. పలు తండాలను పంచాయతీలుగా మార్చింది. కానీ అక్కడ సైతం నూతన షాపులకు మోక్షం కలగలేదు. దీంతో ప్రజలు కిలోమీటర్లు ప్రయాణించి రేషన్‌ దుకాణాల నుంచి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నూతన రేషన్‌ కార్డులతో పాటు ప్రతీ పంచాయతీ పరిధిలో రేషన్‌ దుకాణం ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

    ఆదేశాలు రావాల్సి ఉంది

    ప్రస్తుతం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 11 రేషన్‌ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఈ విషయం నివేదించాం. ఆర్డీఓ, ఇతరశాఖల అధికారుల సహకారంతో నూ తన రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

    – నిత్యానందం,

    జిల్లా పౌరసరఫరాల అధికారి

    జిల్లా వివరాలు

    గ్రామ పంచాయతీలు 469

    రేషన్‌ దుకాణాలు 520

    ఆహారభద్రత కార్డులు 2,16,614

    కొత్తగా మంజూరైనవి 9,964

    అంత్యోదయ 13,909

    అన్నపూర్ణ 75

    జిల్లాలో వేధిస్తున్న రేషన్‌ షాపుల కొరత

    కొత్త పంచాయతీల్లో ఏర్పాటుకు కలగని మోక్షం

    దూరభారంతో నెల నెలా అవస్థలు

    కొత్తగా 9,964 కార్డులు మంజూరు

  • పాదయాత్రను  విజయవంతం చేద్దాం

    నర్సాపూర్‌: పీసీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సంయుక్తంగా చేపడుతున్న పాదయాత్ర శుక్రవారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అందోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కాగా జిల్లాలోని అన్ని మండలాల నాయకులతో పాటు పార్టీ అనుబంధ సంస్థల నాయకులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో నర్సాపూర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి తన రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు మల్లేశ్‌, మహేశ్‌రెడ్డి, లలిత, శ్రీనివాస్‌గుప్తా, రిజ్వాన్‌, అశోక్‌, వినోద తదితరులు పాల్గొన్నారు.

  • ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి

    అల్లాదుర్గం(మెదక్‌): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌, ముస్లాపూర్‌లో నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి పిల్లర్లు అవసరం లేద న్నారు. 600 గజాలలోపు మాత్రమే కట్టుకునేలా చూడాలని హౌసింగ్‌ అధికారులను అదేశించారు. అనంతరం గడిపెద్దాపూర్‌లో ఫర్టిలైజర్‌ షాపు, ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో వసతులు, రోగు లకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఇదిలాఉండగా గ్రామంలో క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని యువకులు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని అల్లాదుర్గం తహసీల్దార్‌ను కలెక్టర్‌ అదేశించారు. అలాగే ముస్లాపూర్‌ పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. డాక్టర్‌ సక్రమంగా విధులకు రావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మురికి కాలువలు అపరిశుభ్రంగా ఉండటంపై కార్యదర్శిపై కలెక్టర్‌ అగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని అదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్‌, ఏపీఓ సుధాకర్‌, ఎంపీఓ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

    కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

  • బల్దియా బరి.. నేతల గురి

    రామాయంపేట(మెదక్‌): త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయా పార్టీల్లో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ, తమ వార్డుల్లో పట్టు సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఫలానా వార్డు నుంచి తాము పోటీలో ఉంటామని నాయకులు తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎలాగైనా బల్దియాల్లో పాగా వేయాలని అధికార కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. బీఆర్‌ఎస్‌ సైతం పట్టు నిలుపుకోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. మెదక్‌ మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌ 15, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావడంతో మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు జరిపేందుకు ఆశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత జనవరిలో పాలకవర్గాల పదవీకాలం పూర్తి కాగా, ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పాలకవర్గం ఉన్నప్పుడు, వార్డుల్లో నెలకొన్న సమస్యలు ఎంతో కొంత పరిష్కారమయ్యేవి. ప్రజలు తమ సమస్యలను కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఏ పని సరిగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి.

  • లింగ వివక్షత నిర్మూలనపై అవగాహన

    నర్సాపూర్‌ రూరల్‌: లింగ వివక్షతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం మండలంలోని చిన్నచింతకుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు (జెండర్‌) లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే లింగ వివక్షత లేకుండా పోతుందన్నారు. ప్రస్తుత పిల్లలకు కుటుంబ పెద్దలను గౌరవించడం, అన్యోన్యంగా ఉండే విధానాన్ని అలవర్చాలని సూచించారు. కార్యక్రమంలో జెండర్‌ సెంట్రల్‌ టీం సభ్యులు నసీం, అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సరస్వతి, స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్ల సరిత, లింగంగౌడ్‌, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

  • ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన బోధన

    నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి

    కౌడిపల్లి(నర్సాపూర్‌)/శివ్వంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి సూచించారు. గురువారం కౌడిపల్లికి చెందిన పోల నవీన్‌ రూ. 59 వేలతో ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో కిచెన్‌షెడ్‌ నిర్మించగా ప్రారంభించి మాట్లాడారు. యువత సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో నీటి సమస్యను తీర్చేందుకు బోర్‌ వేయిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మనఊరు– మన బడి ద్వారా పాఠశాలల్లో సమస్యలు తీర్చిందన్నా రు. ప్రస్తుత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లలితాదేవి, మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఎంపీఓ కలీముల్ల, నాయకులు మన్సూర్‌, మహిపాల్‌రెడ్డి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అనంతరం శివ్వంపేట మండల పరిధి ఉసిరికపల్లిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించిన అంబేద్కర్‌ అందరివాడని కొనియాడారు. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.

  • క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి
    డీఈఓ రాధాకిషన్‌

    వెల్దుర్తి(తూప్రాన్‌): వెల్దుర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం డీఈఓ రాధాకిషన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థనా సమయానికి ముందే పాఠశాలకు చేరుకొని పరిసరాలు పరిశీలించారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న ఎంఈఓ యాదగిరిని సత్కరించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో విద్య నభ్యసించాలని సూచించారు. పాఠ్యాంశాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే వెంటనే సంబంధిత ఉపాధ్యాయుల వద్ద నివృత్తి చేసుకోవాలన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉందన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు వస్తుందనడానికి ఎంఈఓ యాదగిరి నిదర్శనమన్నారు. అటాంటి వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని సూచించా రు. కార్యక్రమంలో హెచ్‌ఎం సాంబయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.