Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన బయోపిక్‌ని ప్రకటించారు. 'మా వందే' పేరుతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దక్షిణాదికి చెందిన టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం విశేషం.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)

    మలయాళ హీరో ఉన్ని ముకుందన్.. ఈ సినిమాలో మోదీగా పాత్రలో కనిపించనున్నాడు. అలానే తెలుగు దర్శకుడు సీహెచ్.క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్నారు. 'కేజీఎఫ్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయనున్నారు.

    ప్రస్తుతానికైతే ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో 'ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది' అని రాసుకొచ్చారు. అంటే మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ బయోపిక్ తీయబోతున్నారా అనిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ చిత్రాన్ని బహుశా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అయితే 2019లోనే 'పీఎం నరేంద్ర మోదీ' పేరుతో ఓ బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఇది రెండో బయోపిక్ అనమాట.

    (ఇదీ చదవండి: పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లేదు: మంచు లక్ష్మీ)

  • ‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాలోని ప్రతి పాత్ర పురాణాల నుంచి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. మనుషుల వ్యక్తిత్వాలు, ఇతర ఆలోచనలన్నింటినీ మా చిత్రంలోని పాత్రలు ప్రతిబింబిస్తాయి. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాం. నాకు చాన్స్‌ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని డైరెక్టర్‌ నరసింహా నంది చెప్పారు. సదన్‌ హాసన్, విక్రమ్‌ జిత్, నరేశ్‌ రాజు, వినయ్‌ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితీ మైకేల్, మోహనా సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. జాతీయ అవార్డుగ్రహీత నరసింహా నంది రచన, దర్శకత్వంలో ఎస్‌వీఎస్‌ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్‌ బ్యానర్స్‌పై దైవ నరేశ్‌ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. 

    ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నరసింహా నంది మాట్లాడుతూ– ‘‘గ్రామీణ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో మా చిత్రంలో సరికొత్తగా చూపించాం’’ అని తెలిపారు. ‘‘తొలి ప్రాజెక్ట్‌గా ఇటువంటి మంచి సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా బ్యానర్లో మరో మూడు సినిమాలు రానున్నాయి’’ అన్నారు దైవ నరేశ్‌ గౌడ. 

    ‘‘ఒక గ్రామంలో జరిగే వాస్తవ ఘటనలకు మహిళా శక్తిని జోడించి, తీసిన సినిమా ఇది’’ అని పరిగి స్రవంతి మల్లిక్‌ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ లాంటి మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సిద్ధార్థ్, నటీనటులు శ్రీలు, మోహనా సిద్ధి, విక్రమ్‌ జిత్‌ పేర్కొన్నారు.  

  • 'కోర్ట్‌' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్‌ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్‌మేళం (Band Melam Movie). సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రోషన్‌.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్‌ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్‌ వినిపించాడు. 

    మాస్‌ డైలాగ్స్‌
    అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్‌ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్‌ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా రోషన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్‌ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్‌ ఇచ్చాడు. 

    సినిమా
    అరవింద సమేత, వెంకీ మామ, సలార్‌, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్‌, సరిపోదా శనివారం, మిషన్‌ ఇంపాజిబుల్‌.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్‌ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్‌ మీడియాలో ఆమె రీల్స్‌ చూసి తనను కోర్ట్‌ మూవీకి సెలక్ట్‌ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్‌తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది.

     

    చదవండి: 4 రోజులుగా మాస్క్‌ మ్యాన్‌ నిరాహార దీక్ష! నామినేషన్స్‌లో ఏడుగురు

  • సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ప్రాధాన్యం లేదని, ఇక్కడివారికి పెద్దగా అవకాశాలివ్వరనేది ఎప్పటినుంచో ఉన్న వాదన! అయితే అదే నిజమంటోంది ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ప్రసన్న (Manchu Lakshmi Prasanna). ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను నటిస్తానంటే తెలుగులో బోలెడుమంది దర్శకనిర్మాతలు నాకు ఛాన్సిచ్చేందుకు రెడీగా ఉన్నారని అందరూ అనుకుంటారు. 

    తెలుగువారిని తీసుకోరెందుకో?
    కానీ, అది నిజం కాదు. చాలామంది కన్నడ, తమిళ, మలయాళ భాషల నుంచి నటీమణుల్ని సెలక్ట్‌ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ సినిమాలు చూసినప్పుడు ఆ క్యారెక్టర్‌లో నేనైతే బాగుండేదాన్నేమో అనిపించేది. వెంటనే దర్శకనిర్మాతలకు ఫోన్‌ చేసి నన్నెందుకు పెట్టుకోలేదు? అని తిట్టేదాన్ని. తెలుగువాళ్లతో పని చేయించుకోవడం తెలుగువాళ్లకే ఇష్టం లేదు. ఇక్కడివారిని సెలక్ట్‌ చేసుకోవడానికి తెగ బాధపడుతుంటారు. అదెందుకో నాకూ అర్థం కావడం లేదు. నేను సమయానికి సెట్‌కి వచ్చి బుద్ధిగా పని చేస్తాను. ఎవరినీ, ఏమీ ఇబ్బంది పెట్టను.

    చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది
    పైగా ఇప్పటివరకు ప్రతి నిర్మాత నాకు డబ్బులెగ్గొట్టాడే తప్ప నేనెవరికీ డబ్బులెగ్గొట్టలేదు. నా చివరి సినిమా డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వనేలేదు. అడిగితే సినిమా కష్టాలు చెప్తారు. సరేలే, పాపం.. సినిమా ముందుకెళ్లాలి కదా అని షూటింగ్‌ పూర్తి చేస్తాం. తీరా చూస్తే పిల్లలపై ఒట్లు వేస్తారు, కానీ, డబ్బు మాత్రం ఇవ్వరు. ఇవన్నీ చూసి నిరాశచెందాను. మరో విషయం నాకు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఈ విషయం చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఎప్పుడూ దీని గురించి అంతగా ఆలోచించలేదు. నేను సంపాదించిందంతా టీచ్‌ ఫర్‌ చేంజ్‌ వంటి సామాజిక సేవకే ఉపయోగించాను.

    చెప్పుడుమాటలు విని బతికా
    కానీ, నాకంటూ కొంత బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండాలని ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాను. మనల్ని మనమే చూసుకోవాలి.. ఎవరూ వచ్చి ఏదీ చేయరు. నా జీవితమంతా చెప్పుడుమాటలు విని బతికేశాను. ఇందులో ఎవర్నీ తప్పుపెట్టడం లేదు. సినిమాల్లేనప్పుడు నేనూ ఇంకో దారి చూసుకోవాలి. అందుకే చీరల బిజినెస్‌ ప్రారంభించాను. దక్షిణాది స్పెషల్‌ చీరలను నార్త్‌కు పరిచయం చేస్తున్నాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.

    చదవండి: రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్‌ ఠాకూర్‌

Business

  • నేపాల్‌లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జెన్‌జీ యువతకు కమ్యునికేషన్‌ సాధనంగా ‘డిస్‌కార్డ్‌’ యాప్‌ ఎంతో తోడ్పడినట్లు తెలుస్తుంది. యువతను కట్టడి చేసేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు నేపాల్‌ గత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడంతో గేమింగ్‌ యాప్‌లో ఇంటర్నల్‌ కమ్యునికేషన్‌ టూల్‌గా వాడే డిస్‌కార్డ్‌ ఎంతో ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు.

    శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యవస్థాపకులు జాసన్ సిట్రాన్, స్టాన్ విస్‌నేవిస్క్‌ 2015లో డిస్‌కార్డ్‌ను ఆవిష్కరించారు. ఇది వాయిస్, వీడియో, చాట్ ప్లాట్‌ఫామ్‌. గేమింగ్ సాధనాల్లో గేమర్లు ఇంటర్నల్‌ కమ్యునికేషన్‌ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల నేపాల్ జెన్‌జీ యువత రాజకీయ మార్పును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి పెద్దమొత్తంగా ర్యాలీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న సమయంలో ఇంతలా యువత ఒకేసారి అసంత​ృప్తితో కూడబలుక్కొని వీధుల్లోకి రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చ సాగింది. అందుకు గేమింగ్‌ టూల్స్‌లో ఉన్న డిస్‌కార్డ్‌ యాప్‌ ద్వారా యువత పరస్పరం కమ్యునికేట్‌ అయి ఇలా మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలుస్తుంది.

    ఇదిలాఉండగా, భారతదేశంలో 2025లో డౌన్‌లోడ్‌ల పరంగా డిస్‌కార్డ్‌ నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇది మొత్తం ఇన్‌స్టాల్స్‌లో 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియాలో ఈ ఒక్క ఏడాదే 5 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదు అయ్యాయి. 2024 కంటే 2 శాతం పెరిగింది. ఇలాంటి మరిన్ని యాప్స్ గురించి యువత సెర్చ్‌ చేస్తోంది. వాటిలో కొన్నింటి వివరాలు కింద చూద్దాం.

    యాప్‌ముఖ్య లక్షణాలుఎవరి కోసం అంటే..
    గిల్డెడ్వాయిస్, వీడియో, బాట్గేమింగ్ కమ్యూనిటీలు
    టీమ్ స్పీక్అల్ట్రా-లో లేటెన్సీ వాయిస్, మిలిటరీ-గ్రేడ్ ఎన్ క్రిప్షన్ఈస్పోర్ట్స్‌, ఎఫ్‌పీఎస్‌ పోటీ దారులకు..
    మంబుల్‌ఓపెన్ సోర్స్, ఎన్ క్రిప్టెడ్ వాయిస్ చాట్గోప్యంగా ఉండాలనుకునే గేమర్లు
    టాక్స్పీర్-టు-పీర్ మెసేజింగ్గేమింగ్ సమూహాలు

     

    ఇదీ  చదవండి: బిగ్‌ రిలీఫ్‌! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే

  • ప్రముఖ ఐటీ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు ఇన్ఫోసిస్‌-కాగ్నిజెంట్‌ మధ్య నెలకొన్న యాంటీట్రస్ట్‌ వివాదాన్ని యూఎస్ ఫెడరల్ కోర్టు అధికారికంగా ఫిబ్రవరి 1, 2027న ఉన్నత స్థాయి జ్యూరీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. టెక్సాస్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ (డల్లాస్ డివిజన్) కోర్టు ఇటీవల ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ ప్రారంభానికి ముందు జనవరి 25, 2027న ప్రీ-ట్రయల్ కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్ చేసినట్లు కోర్టు పేర్కొంది.

    అసలు వివాదం ఏంటి?

    బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ట్రైజెట్టోకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. హెల్త్‌కేర్‌ ఐటీ స్పేస్‌లో పోటీని బలహీనపరుస్తూ, ప్రత్యర్థి ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ ఈ సమాచారాన్ని ఉపయోగించిందని దావాలో పేర్కొంది.

    ఇన్ఫోసిస్ వాదన..

    ఇన్ఫోసిస్ దీనిపై స్పందిస్తూ ఈ వాదనలను ఖండించింది. హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌ మార్కెట్‌లోకి ఇతర కంపెనీలు ప్రవేశించకుండా నిరోధించడానికి కాగ్నిజెంట్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుందని ఆరోపించింది. మేధో సంపత్తిని రక్షించడం కంటే పోటీని అణచివేసే లక్ష్యంతోనే కాగ్నిజెంట్ ముందుకెళ్లిందని కౌంటర్ క్లెయిమ్‌లో పేర్కొంది. 2024లో ప్రారంభమైన ఈ చట్టపరమైన వివాదంపై 2027లో విచారణ జరగనుంది.

    మధ్యవర్తిత్వం అవసరం..

    యాంటీట్రస్ట్ చట్టాలు, ధరల వ్యూహాలు, క్లయింట్ కాంట్రాక్ట్ నిర్మాణాలు, పోటీ మార్కెట్ డైనమిక్స్ సంక్లిష్ట స్వభావాన్ని బట్టి ఈ కేసు నిపుణుల సాక్ష్యంపై ఎక్కువగా ఆధారపడుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసు విచారణకు చేరుకునే ముందే ఇరు వర్గాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అందుకు జులై 9, 2026 నాటికి మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసింది. రెండు పార్టీలు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాలని లేదా జులై 16, 2026 నాటికి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పింది.

    ఇదీ  చదవండి: బిగ్‌ రిలీఫ్‌! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే

  • ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

     

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్‌) తన ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 30న జరిగిన సైబర్‌దాడితో దాని ప్రపంచ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ అటాక్‌తో తయారీని తక్షణమే రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికీ దానిపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ఉత్పత్తి నిలిపివేత గడువును కొంతకాలంపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.  

    ఈ సందర్భంగా కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ‘మేము మా ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 బుధవారం వరకు పొడిగించాం. సైబర్ అటాక్‌ సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది. దాంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం. కంపెనీ ప్రపంచ కార్యకలాపాల నియంత్రిత వ్యవస్థలపై వివిధ దశలను పరిశీలిస్తున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ నిరంతర అంతరాయానికి చింతిస్తున్నాం. దర్యాప్తు పురోగతి వివరాలను అప్‌డేట్‌ చేస్తాం’ అని కంపెనీ తెలిపింది.

    మూడు ప్లాంట్లపై ప్రభావం..

    టాటా మోటార్స్ యాజమాన్యంలోని కంపెనీ మూడు ప్రధాన యూకే ప్లాంట్లు - సోలిహల్, హేల్‌వుడ్‌, వోల్వర్ హాంప్టన్ ఈ సైబర్‌ అటాక్‌ వల్ల ఉత్పత్తిని నిలిపేశారు. ఇప్పటికే రెండు వారాలకు పైగా ఇవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా సాధారణంగా రోజుకు దాదాపు 1,000 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ మూసివేత జేఎల్‌ఆర్‌, టాటా మోటార్స్ త్రైమాసిక ఆర్థిక పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

    33 వేల మంది ఉద్యోగులు..

    ఈ ప్లాంట్లలో 33,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ షట్‌డౌన్ సమయంలో సిబ్బంది విధులకు రాకూడదని ఆదేశించారు. ఇప్పటివరకు సైబర్ దాడి మూలాలు లేదా దాని స్వభావం గురించి బహిరంగంగా వివరాలు వెల్లడికాలేదు. రాన్సమ్‌వేర్‌ లేదా ఇతర రకాల మాల్వేర్ దాడి జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది.

    ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’

  • ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లింక్డ్ఇన్ 2025 టాప్ ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్‌ల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇది గత సంవత్సరం ఆరో స్థానం నుంచి పుంజుకుంది. టాప్ 100 గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ల జాబితాలో ప్రతిష్టాత్మకంగా టాప్ 20లో మూడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు చోటు సంపాదించాయి. అందులో ఐఐఎం-కలకత్తా (16వ స్థానం), ఐఐఎం-అహ్మదాబాద్ (17), ఐఐఎం-బెంగళూరు (20) ఉన్నాయి.

    ఈ సందర్భంగా లింక్డ్ఇన్ ఇండియా, సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ నిపుణులు నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ..‘విద్యార్థులు ఎంబీఏను ఎంచుకోవడం తమ కెరియర్‌లో కీలకంగా ఉంటుంది. ఎంబీఏ ద్వారా వచ్చే విశ్వాసం, అవకాశాలు దశాబ్దాలపాటు తమ కెరియర్‌ వృద్ధికి ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, ప్రొఫెసర్ మదన్ పిలుట్ల మాట్లాడుతూ..‘ఐఎస్‌బీలో పీజీపీ నైపుణ్యాలను అందించడమే కాకుండా, మారుతున్న ప్రపంచంలో వృద్ధి చెందడానికి అవసరమైన మెలకువలు నేర్పుతున్నాం’ అన్నారు.

    ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’

    లింక్డ్ఇన్ టాప్ ఎంబీఏ 2025 ర్యాంకింగ్స్‌ జాబితా కింది విధంగా ఉంది.

    1. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం

    2. హార్వర్డ్ విశ్వవిద్యాలయం

    3. ఇన్ సీడ్

    4. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం

    5. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

    6. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం

    7. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (MIT)

    8. డార్ట్ మౌత్ కాలేజ్‌

    9. కొలంబియా విశ్వవిద్యాలయం

    10. లండన్ విశ్వవిద్యాలయం

    11. చికాగో విశ్వవిద్యాలయం

    12. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం

    13. డ్యూక్ విశ్వవిద్యాలయం

    14. యేల్ విశ్వవిద్యాలయం

    15. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ

    16. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - కలకత్తా

    17. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - అహ్మదాబాద్

    18. వర్జీనియా విశ్వవిద్యాలయం

    19. కార్నెల్ విశ్వవిద్యాలయం

    20. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - బెంగళూరు

International

  • కన్జర్వేటివ్‌ పార్టీ యాక్టివిస్ట్‌ చార్లీ కిర్క్‌ (31) హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టైలర్‌ రాబిన్‌సన్‌(22).. ఎందుకు చంపాడన్నదానిపై దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే కిర్క్‌ భావజాలమే ఆయన హత్యకు కారణమైందన్న చర్చ ఇప్పుడు అక్కడ నడుస్తోంది. 

    చార్లీ కిర్క్ హత్య కేసులో నిందితుడు టైలర్‌ రాబిన్సన్‌(Tyler Rabinson)ను తాజాగా కోర్టులో ప్రవేశపెట్టారు. మాసిన గడ్డంతో.. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌తో అతను విచారణకు హాజరయ్యాడు. నేర తీవ్రత దృష్ట్యా అతనికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తన భాగస్వామికి చేసిన సందేశాలను నేరాంగీకరంగా పరిగణించాలని కోరుతున్నారు. 

    కోర్టు పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం.. టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ వ్యవస్థాపకుడైన కిర్క్‌ సెప్టెంబర్‌ 10వ తేదీన ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన అమెరికన్‌ కమ్‌బ్యాక్‌ కార్యక్రమంలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్న క్రమంలో.. ఓ తూటా దూసుకొచ్చి ఆయన గొంతులో దిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. 

    ఈ ఘటనకు సంబంధించి.. కాల్పుల తర్వాత గనతో ఓ వ్యక్తి ఓ భవనం మీద నుంచి దూకి పారిపోతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఏజెన్సీలు ఆ మరుసటి రోజే 22 ఏళ్ల రాబిన్‌సన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఆ సమయంలో తన రూమ్‌మేట్‌.. ట్రాన్స్‌జెండర్‌ భాగస్వామితో అతను జరిపిన చాటింగ్‌లో హత్యకు కారణాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. 

    అతనిపై(చార్లీ కిర్క్‌) ద్వేషాన్ని ఇంక భరించలేకపోతున్నా. కొన్ని ద్వేషాలు ఏరకంగానూ తొలగిపోలేవు అని ఓ సందేశాన్ని తన భాగస్వామికి పంపాడతను. అంతేకాదు.. ఘటనకు సరిగ్గా వారం కిందటి నుంచి ప్రణాళిక వేసుకున్నాడని, కిర్కీని ఎందుకు చంపాలనుకునే విషయాలను గతన గదిలో ఓ పేపర్‌పై రాసుకున్నాడు. అంతేకాదు.. గదిలోని కంప్యూటర్‌ కీ బోర్డు కింద‘‘ అవకాశం దొరికితే చార్లీ కిర్క్‌ను అంతమొందిస్తా’’ అంటూ రాసిన ఓ నోట్‌ కూడా దొరికింది. అయితే ఆ నోట్‌ను అతని భాగస్వామి తొలుత ప్రాంక్‌గా భావించిందట.

    కానీ కాల్పుల ఘటన తర్వాత తన పార్ట్‌నర్‌కు మెసేజ్‌ పంపి.. అది జోక్‌ కాదనే విషయాన్ని రాబిన్‌సన్‌ ధృవీకరించాడు. ‘‘ఈ విషయాన్ని ఎప్పటికీ నీకు చెప్పకూడదనుకన్నా. నేను ఇప్పటివరకైతే బాగానే ఉన్నా. హత్య జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయా. దాచిన నా రైఫిల్‌ను తీసుకోవాలసి ఉంది. త్వరలో ఇంటికి వస్తానేమో. ఇందులోకి నిన్ను ఇందులో లాగినందుకు నన్ను క్షమించు. నీ కోసమే నా బాధంతా’’ అంటూ మెసేజ్‌లు పెట్టాడు. ఒకవేళ తాను దొరికిపోతే.. అధికారులు నీ దాకా వస్తారని, ఆ సమయంలో నోరు మెదపొద్దని ఆ భాగస్వామికి సూచించాడు. ఆ తర్వాత ఆ మెసేజ్‌లను డిలీట్‌ చేశాడు. 

    ఇక.. ఘటన తర్వాత దొరికిన క్లూస్‌ ఆధారంగా పోలీసులు సెయింట్‌ జార్జ్‌లోని రాబిన్‌సన్‌ నివాసంలో సోదాలు జరిపారు(ఈ ప్రాంతం కిర్క్‌ హత్య జరిగిన ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది). ఆ తనిఖీల్లో దొరికిన ఆధారాలతో చార్లీ కిర్క్‌కు చంపింది అతనేనని నిర్ధారించుకున్నారు. అరెస్ట్‌ చేసి వాషింగ్టన్ కౌంటీ జైలుకు తరలించారు. హత్యకు ఉపయోగించిన రైఫిల్‌ను ఘటనా స్థలంలోని పొదల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో విచారణకు అతను సహకరించకపోయినా.. అతని కుటుంబ, స్నేహితులు కీలక విషయాలనే వెల్లడించారు. 

    తన కొడుకు కొంతకాలంగా ఓ ట్రాన్స్‌జెండర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, అప్పటి నుంచి అతని ఆలోచన ధోరణి మారిందని, రాజకీయంగానూ వామపక్ష భావజాలం వైపు అడుగులేశాడని రాబినసన్‌ తల్లి అంటోంది. ప్రస్తుతానికి రాబిన్‌సన్‌పై ఏడు కేసులు నమోదు అయ్యాయి. దోషిగా తేలితే మరణశిక్ష పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. 

    మరోవైపు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ ఈ కేసు దర్యాప్తుపై స్పందించారు. డిస్‌కార్డ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో రాబిన్‌సన్‌తో కొందరు చాటింగులు చేశారని, వాళ్ల వివరాలు సేకరించి విచారణ జరపుతామని ప్రకటించారాయన. కన్జర్వేటివ్‌ భావజాలం, దీనికి తోడు ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీపై చార్లీ కిర్క్‌ వెల్లగక్కిన ద్వేషమే.. అతని పాలిట శాపమైంది.  ఈ ధోరణిని భరించలేకనే టేలర్‌ రాబిన్సన్‌ ఇంతటి ఘాతుకానికి తెగబడ్డాడనే విషయం కోర్టు డాక్యుమెంట్ల ద్వారా ఇప్పుడు బయటకొచ్చింది.

  • ముంబై: బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరిన ముంబై కంటెంట్‌ సృష్టికర్త యోగేశ్ అలెకరికి యూకేలో చేదు అనుభవం ఎదురైంది. నాటింగ్ హామ్ లోని ఓ పార్క్ లో పెట్టిన అతని బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై యోగేష్‌ ఒ​క వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. దీనికి స్పందిస్తూ ఒక బైక్‌ కంపెనీ యోగేశ్ అలెకరికి ఊహించని కానుక ఇచ్చింది. దీంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

    తన బైక్‌ చోరీకి గురైన సందర్భంలో యోగేష్‌.. తాను స్థానికంగా ఉంటున్న ఓ స్నేహితుడిని కలిసి, బ్రేక్ ఫాస్ట్ చేసి, తిరిగొచ్చేసరికి బైక్ మాయమైందని తెలిపాడు. నలుగురు యువకులు తన బైక్ ను ఎత్తుకెళ్లారన్నాడు. పాస్ పోర్ట్, వీసా తదితర డాక్యుమెంట్లతో పాటు డబ్బు కూడా అందులోనే ఉందన్నాడు. తాను కట్టుబట్టలతో మిగిలానని ఆవేదన వ్యక్తం చేశాడు. 2025 మే 1న ముంబై నుంచి బైక్ పై ప్రపంచయాత్రకు బయలుదేరినట్లు యోగేశ్ చెప్పారు. యోగేష్‌ ఇప్పటి వరకు.. 118 రోజుల్లో 17 దేశాలను చుట్టాడు. మొత్తంగా 24 వేల కిలోమీటర్లు తిరిగానని యోగేశ్ తెలిపాడు. బైక్ చోరీ కారణంగా యాత్ర కొనసాగించడం సాధ్యం కాదని యోగేష్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

    ఈ వీడియోను చూసిన యూకేకి చెందిన ది ఆఫ్ రోడ్ సెంటర్ అనే మాన్స్‌ఫీల్డ్ వుడ్‌హౌస్ మోటార్‌సైకిల్ డీలర్‌షిప్.. కంటెట్‌ సృష్టికర్త యోగేష్‌ అలెకరికి తమ సంస్థ అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ బైక్‌ను కానుకగా ఇచ్చింది. దీని సాయంతో అలెకరి ఆఫ్రికాలో తన చివరి దశ పర్యటనను కొనసాగించాడు. ఊహించని విధంగా బైక్‌ను కానుకగా అందుకున్న అలెకరి మాట్లాడుతూ 10 రోజుల తర్వాత, తాను ఆనందంగా నవ్వగలుగుతున్నానని, తాను ఇలాంటి మద్దతును ఎప్పుడూ ఊహించలేదన్నాడు. ది ఆఫ్ రోడ్ సెంటర్ యజమాని డేనియల్ వాట్స్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో యోగేష్‌ అలెకరి పోస్ట్‌లను చూసి, అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.
     

Family

  • తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ వీణా కుమారి డెర్మల్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన ఆమె పదోన్నతితో తెలంగాణ సర్కిల్‌కు బదిలీ అయ్యారు. ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ 1998 బ్యాచ్‌ అధికారి అయిన వీణాకుమారి ఆ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 

    తపాలా శాఖ ఇటీవలే ప్రారంభించిన అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ 2.0 తయారీలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర గనుల శాఖ జాయింట్‌ సెక్రటరీగా కూడా పనిచేసి ఆ శాఖలో పలు సంస్కరణలు ప్రారంభించటంలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు సెంట్రల్‌ రీజియన్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌గా, ఢిల్లీ ఢాక్‌ భవన్‌ పీఎంయూ డైరెక్టర్‌గా, మైసూరు పోస్టల్‌ శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా, ధార్వాడ్‌ రీజియన్‌ డైరెక్టర్‌గా కూడా ఆమె విధులు నిర్వర్తించారు.  

    (చదవండి: ‘రండి.. ఫొటో దిగుదాం’)

  • అది తెలంగాణ రాష్ట్రంలోని ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లోని మొదటి అంతస్తు.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతం.. అమీర్‌పేట నుంచి అక్కడకు రీలోకేట్‌ అయిన పాస్‌పోర్టు సేవా కేంద్రం (పీఎస్‌కే) ప్రారంభమైంది. కేంద్ర విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖలో (ఎంఈఏ) సంయుక్త  కార్యదర్శి హోదాలో ఉన్న చీఫ్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ డాక్టర్‌ కేజే శ్రీనివాస ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఫొటో సెషన్‌ నడిచింది. పాస్‌పోర్టు కార్యాలయం, పీఎస్‌కే ఉద్యోగులు, అతిథులు ఆయనతో ఫొటోలు దిగారు. 

    టోలిచౌకి నుంచి రాయదుర్గానికి రీలోకేట్‌ అయిన పీఎస్‌కేను ప్రారంభించాల్సి ఉంది. అందరూ అక్కడకు వెళ్లే హడావుడిలో ఉండగా.. ‘రండి ఫొటో దిగుదాం’ అనే మాట శ్రీనివాస నోటి వెంట వచి్చంది. అక్కడ ఉన్న నాల్గో తరగతి ఉద్యోగులను ప్రత్యేకంగా ఆహా్వనించిన ఆయన రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ స్నేహజ జోన్నలగడ్డతో కలిసి ఫొటోలు దిగారు. ‘మా కేంద్రాలు సజావుగా నిర్వహించడానికి మీరూ కీలకమే’ అంటూ ఆ పారిశుద్ధ్య, సెక్యూరిటీ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని చూసి అక్కడి వాళ్లంతా అవాక్కయ్యారు.

    ఎవరీ శ్రీనివాస? 
    బెంగళూరుకు చెందిన కోటేహాల్‌ జయదేవప్ప శ్రీనివాస మైసూర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యనభ్యసించారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి. బెంగళూరులోని రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టు పొందడానికి శ్రీనివాస 1997లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో దాని కోసం ఉదయం 5 గంటలకే ఆర్‌పీఓ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. అన్ని వెరిఫికేషన్లు పూర్తయి, పాస్‌పోర్టు పొందడానికి 60 రోజులు వేచి ఉన్నారు.

    ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న శ్రీనివాస తాను ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన తర్వాత పాస్‌పోర్టు జారీలో సంస్కరణలపై దృష్టి పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకీ మొబైల్‌ పాస్‌పోర్టు సేవా వ్యాన్లు మొదలు చిఫ్‌ బేస్ట్‌ ఈ–పాస్‌పోర్టుకు రూపం ఇవ్వడంలోనూ పాత్ర కీలక పాత్ర వహించారు..  

    (చదవండి: ఓవైపు అసిస్టెంట్‌ కమిషనర్‌గా..మరోవైపు కళాకారిణిగా..)

  • మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమని ఎప్పుడో చెప్పేశాడు ఓ సినీకవి. నిజం. ఒంటరితనం కొంతసేపు బాగుంటుందేమో కానీ.. సమయం గడుస్తున్న కొద్దీ బాధిస్తుంది. పీడిస్తుంది. మనోవేదనకు గురి చేస్తుంది. పాపం.. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్‌ ఉద్యోగి ఒకరికి ఈ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసింది. అయితే.. 

    మనోడు ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లో కూరుకుపోలేదు. ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు కానీ... ఎవరూ ఊహించనట్టు ర్యాపిడో డ్రైవర్‌ అయ్యాడు!!. హవ్వా.. అంత బతుకూ బతికి ఇంటి వెనుక చచ్చినట్టు ఒరాకిల్‌లో లక్షలు సంపాదించే ఉద్యోగం చేస్తూ ఇదేం పని అనుకోవద్దు. పాపం ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తనకు తోచిన మార్గమిదే మరి! వివరాలు ఏమిటంటే...

    నిజానికి ఈ స్టోరీని సాద్‌ అనే వ్యక్తి తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నాడు. రెండు లక్షల రూపాయల విలువైన టీవీఎస్‌ రోనిన్‌ మోటర్‌ సైకిల్‌ను ఒక వ్యక్తి ర్యాపిడో రైడ్ల కోసం వాడుతూంటే సాద్‌కు కుతూహలం ఎక్కువైంది. ర్యాపిడోను నడుపుతున్న వ్యక్తితో మాట మాట కలిపాడు. అప్పుడు తెలిసింది. అతడు ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అని. సంవత్సరానికి 32 లక్షల రూపాయల జీతం వస్తోంది అని. అంత జీతమొస్తూంటే.. ఈ ర్యాపిడో ఏంటి భయ్యా అని అడిగితే... ‘‘వీకెండ్స్‌లో ఒంటరి తనాన్ని తట్టుకునేందుకు ఈ పని చేస్తున్నా’’ అన్న సమాధానం వచ్చింది. ర్యాపిడో నడిపేటప్పుడు అపరిచితులు బైక్‌ ఎక్కుతారు. వారితో మాట్లాడవచ్చు. కొత్త వారి పరిచయాలు పెరుగుతాయి. తద్వారా నా ఒంటరితనం బాధ తగ్గుతుందని ఆ ఇంజినీర్‌ చెప్పడంతో ఇలాక్కూడా జరుగుతుందా? అని అనిపించిందని సాద్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఆశ్చర్యపోయారు. 

    ఈ ఉదంతం కాస్తా ఆధునిక జీవితంలో ఉరుకులు, పరుగుల జీవితంపై మరోసారి ఫోకస్‌ను పెట్టందని చెప్పాలి. ఒంటరితనంతో ఎన్నో రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాట్సప్‌, ట్విట్టర్‌, ఎఫ్‌బీ వంటి బోలడన్నీ కమ్యూనికేషన్‌ సౌకర్యాలు ఉన్నా.. నోరు విప్పి మనసారా మాట్లాడుకునేందుకు ఒక వ్యక్తి తోడు లేకపోతే మాత్రం వేస్ట్‌ అనేది అందుకే మరి!. 

    టెక్‌ ప్రపంచంలో రోజుకు పది పన్నెండు గంటల ప్రయాణం.. బెంగళూరు లాంటి నగరాల్లోనైతే ఆఫీసులకు వచ్చిపోయేందుకు మూడు నాలుగు గంటల సమయం పడుతూండటాన్ని పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత సమయం అంటూ ఏదీ లేకుండా పోతుంది. సొంతూళ్లకు, కుటుంబానికి దూరంగా ఉన్న వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఏది ఏమైనప్పటికీ సామాజిక హోదా, సంపాదనలే విజయానికి కొలమానాలుగా మారుతున్న ఈ తరుణంలో భేషజాలు వదిలి తన సమస్యకు తాను ఒక అందమైన పరిష్కారాన్ని కనుక్కున్న ఆ అజ్ఞాత ఇంజినీర్‌కు జై అనాల్సిందే!

  • నృత్యం ఓ తపస్సు.. ఇందులో రాణించాలంటే.. ఏదో నేర్చుకున్నామంటే సరిపోదు.. ఓ యజ్ఞంలా నిత్యం సాధన చేయాలి.. అలాంటి ఓ గొప్ప కళపై ఆమె ప్రాణం పెట్టేశారు. ఎంతలా అంటే.. ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించి అభ్యసించేంతలా. ఆమె ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇన్‌చార్జ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంట్రప్రగడ వాణి భవాని. ఓ వైపు అధికారిగా, మరోవైపు కళాకారిణిగా, గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తన అడుగుజాడలనే అనుసరిస్తూ చిన్న వయసులోనే నృత్యంలో ప్రతిభ చూపుతున్న తన కుమార్తెకు కూడా మార్గదర్శిగా నిలుస్తున్నారు.. 

    వివిధ కళారూపాల సమాహారం నృత్యం. సంగీతం, సాహిత్యం, మానసిక శాస్త్రం ఇలా అనేక కళలు కలిస్తేనే నృత్యం. అలాంటి కళతో నాకు బాల్యంలోనే పరిచయం ఏర్పడింది. క్రమంగా నా జీవితంతో పెనవేసుకుపోయింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విద్యాభ్యాసం సమయంలో డాన్స్‌ క్లాస్‌ ఉండేది. టీచర్లు కూడా ప్రోత్సహించేవారు. అప్పటినుంచే నృత్యం పట్ల మక్కువ ఏర్పడింది. భక్తి శ్రద్ధలతో ఎలాగైనా ఈ కళలో మాస్టర్‌ కావాలని సంకల్పించా. దీనికి కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ‘స్వర్ణ కమలం’ మరింత స్ఫూర్తినిచ్చింది. చివరికి ఆయన సమక్షంలోనే అరంగేట్రం పూర్తిచేశా.

    ఆరంభం ఇలా.. 
    ఇంటర్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాం. నల్లకుంటలోని అమ్మమ్మ ఇంట్లో ఉండే వాళ్లం. అక్కడ సుప్రసిద్ధ నాట్య గురువు మద్దాలి ఉషా గాయత్రి దగ్గర చేరాను. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న నాన్నగారు హఠాత్తుగా మరణించారు. దీంతో కారుణ్య నియామకంలో ఆయన ఉద్యోగం ఇచ్చారు. కరీంనగర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 

    దీంతో నృత్యాభ్యాసం ఆగిపోయే పరిస్థితి. ఎలాగైనా కొనసాగించాలన్న నా సంకల్పానికి అమ్మ, సోదరి అండగా నిలిచారు. నాట్య గురువు ప్రోత్సాహంతో వారంతాల్లో 160 కిలోమీటర్లు ప్రయాణించి అభ్యాసం పూర్తిచేశా. ఇప్పటి వరకూ 75 కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందా. నా భర్త భరణి, అత్తగారింటి సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. నా కుమార్తె అనన్య సైతం నాట్య గురువు మద్దాలి ఉషా గాయత్రి దగ్గరే శిక్షణ పొందుతోంది.

    ఏకాగ్రత పెరుగుతుంది..
    ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. పర్యావరణ పరిరక్షణ, నాట్యం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నా. నృత్యం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి.. ఇది కదలికల ద్వారా చేసే ధ్యానం లాంటిది. అర్థంతో, లయతో కదలికలను సమన్వయం చేసుకోవాలి. అదే సమయంలో భంగిమలను సరిగ్గా ప్రదర్శించగలగాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. సంప్రదాయ నృత్యం రూపకల్పనలో కుడివైపు, ఎడమవైపు కదలికలు ఉంటాయి. 

    దీనివల్ల మెదడులోని ఇరు భాగాలనూ సమానంగా ఉపయోగించే సామర్థ్యం కలుగుతుంది. దుస్తులు, ఆభరణాలు, మేకప్, రంగాలంకరణతో సహా నృత్యంలో అనేక అంశాలుంటాయి. దీనికి ఎంతో ఓపిక అవకసం. నేటి తరం పిలల్లోని అసహనాన్ని నృత్యాభ్యాసం నివారిస్తుంది. గురువులకు ఇచ్చే గౌరవం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని, పక్షులను కాపాడటం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నా.  

    (చదవండి: మాన్సున్‌ ఎండ్‌..ట్రెక్కింగ్‌ ట్రెండ్‌..! సై అంటున్న యువత..)

  • ఓ మైపు మాన్సూన్‌ సీజన్‌ ముగింపు దశకు చేరుకొంది. దీంతో పాటు ట్రెక్కింగ్‌ సీజన్‌ మొదలవుతోంది.. ప్రస్తుత వాతావరణం ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉండడంతో నగరంలోని ఔత్సాహికుల్లో జోష్‌ నెలకొంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో యువత ట్రెక్‌ పాయింట్లలో, పలు పర్యాటక ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో కనువిందు చేసే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్వతాలు, లోయలు, జలపాతాలకు బ్యాక్‌ప్యాక్‌తో పయనమవుతున్నారు. రుతుపవనాలు ముగింపు సీజన్‌లో ట్రెక్కింగ్‌ ట్రెండ్‌ పీక్స్‌కు చేరుతుంది. దీంతో నగరం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని ట్రెక్‌ పాయింట్లకు నగర పర్యాటకుల సందడి మొదలైంది. 

    వర్షాలు పర్వతాలపై అద్భుతమైన పచ్చదనాన్ని పరుస్తాయి. మరోవైపు పర్వతాలపై నుంచి ఎగసిపడే జలపాతాలు ప్రకృతి సోయగాన్ని రెట్టింపు చేస్తాయి. పచ్చని లోయలు, కొండ ఉపరితలాలపై పొగమంచు దృశ్యాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయి. పచి్చకబయళ్ళు, పూలతో నిండిన గుట్టలు ట్రెక్కింగ్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. వీటన్నింటి మధ్య నడుస్తూ చిరు చినుకుల్లో తడుస్తూ మధురానుభూతులను పోగు చేసుకోడానికి ట్రెక్కర్స్‌ ఉత్సాహం చూపుతుంటారు. 

    మన సిటీకి.. ‘మహా’ ఇష్టం.. 
    మహారాష్ట్రలోని పలు ట్రెక్‌ పాయింట్స్‌ నగరవాసులకు ఇష్టమైన జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా లోనావాలాలోని రాజ్మాచీ ట్రెక్‌ ఒకటి. మబ్బులు, లోయలు, జలపాతాలతో ఈ ట్రెక్‌ ఆద్యంతం అలరిస్తుంది.  అలాగే అహ్మద్‌నగర్‌ జిల్లాలోని హరిశ్చంద్ర ఘడ్‌ ట్రెక్‌ కూడా నగర ట్రెక్‌ కమ్యూనిటీలో బాగా పాపులర్‌. పశ్చిమ కనుమల్లోని పురాతన కొండపై కోటకు నడకమార్గం ప్రకృతి ప్రేమికులతో పాటు సాహసికులకు కూడా ఇష్టమైన రూట్‌. గుహలు, కోట అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యం కూడా దీని సొంతం.  ప్రారంభకులకు అనుకూలమైనది. 

    అదే విధంగా టోర్నా.. ఫోర్ట్‌ ట్రెక్‌ కూడా మరో క్రేజీ ట్రెక్‌. టోర్నా ఫోర్ట్‌ ట్రెక్‌ లేదా ప్రచండగడ్, పుణె సమీపంలో ఒక రోజు ట్రెక్, ఇది 4,603 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరానికి 2–3 కి.మీ (ఒక వైపు) ట్రైల్‌తో సవాలుతో కూడుకున్న ట్రెక్‌. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ మొదటి కోటగా చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకూ సీజన్‌లో ఫ్లవర్‌ బెడ్స్‌తో చక్కని దృశ్యాలను అందిస్తుంది. 

    ట్రెక్‌ చకచకా..గో కర్ణాటక.. 
    ట్రెక్కర్స్‌కు కలల ప్రదేశం కర్నాటకలోని చిక్‌ మగళూరులోని కుద్రేముఖ్‌ ట్రెక్‌. సుమారుగా 19–21 కి.మీ (రౌండ్‌ ట్రిప్‌) దూరం ఉండే ఈ ట్రెక్, కాస్తంత అనుభవం ఉన్న ట్రెక్కర్స్‌కు బెస్ట్‌. ఈ ట్రెక్‌ 1,892 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతం దట్టమైన గడ్డి భూములు, షోలా అడవులకు ప్రసిద్ధి. 

    ఈ ట్రెక్‌లో ప్రవాహాలను దాటుతూ, ‘ఒంటరి చెట్టు‘ (ఒంటిమార) వంటి ప్రదేశాల గుండా ప్రయాణించి, శిఖరాన్ని చేరుకోవాలి. ఈ ట్రెక్‌కు రోజూ పరిమిత సంఖ్యలో మాత్రమే ట్రెక్కర్స్‌కు అనుమతిస్తారు. సాధారణంగా జూలై నుంచి నవంబర్‌ వరకు సీజన్‌. దీనికి సమీపంలోనే నేత్రావతి ట్రెక్‌ కూడా ఉంది. 

    స్కందగిరి హిల్స్‌ : బెంగళూరు నుంచి 60–65 కి.మీ దూరంలో ఉన్న స్కందగిరి హిల్స్‌ కూడా కాసింత కఠినమైన సవాలుతో కూడిన ట్రెక్‌ పాయింట్‌. కర్ణాటక అటవీ శాఖ పోర్టల్‌ ద్వారా ట్రెక్‌ను ముందస్తు బుక్‌ చేసుకోవాలి. ముల్లయనగిరి ట్రెక్‌ కర్ణాటకలోని ఎత్తయిన శిఖరం వరకూ హైకింగ్‌. ఇది కూడా కాస్తంత కఠినమైనదే. 

    ఈ కాలిబాట సర్పధారి నుంచి ప్రారంభమవుతుంది. ఒక వైపు ట్రెక్‌కి దాదాపు గంటన్నర నుంచి రెండున్నర గంటలు పడుతుంది. ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు, చిన్న గుహలను కలిగి ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం సందర్శకులు సెపె్టంబర్‌ నుంచి మార్చి వరకు ఎంచుకోవచ్చు. ఇవే కాక మిగతా రాష్ట్రాల్లోని ప్రాంతాలైన కూర్గ్, మున్నార్, వాయనాడ్‌ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా ట్రెక్స్‌ నిర్వహిస్తున్నారు. 

    తమిళనాట.. ట్రెక్‌ బాట.. 
    అందరికీ తెలిసిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన కోడైకెనాల్, ఊటీ ట్రెక్కింగ్‌కు పేరొందాయి. ముఖ్యంగా ఊటీలోని దొడ్డబెట్ట పీక్స్‌ ట్రెక్‌ బాగా ఫేమస్‌. అలాగే యెలగిరి హిల్స్‌లోని స్వామి మలాయ్‌ హిల్స్‌ ట్రెక్‌ సైతం మాన్సూన్‌లో సిటీ ట్రెక్కర్స్‌ను ఆకట్టుకుంటోంది.

    మార్గదర్శకాలు తప్పనిసరి.. 
    మాన్సూన్‌ ట్రెక్కింగ్‌ అనేది సాహసాలను ఇష్టపడుతూ.. ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించే అరుదైన అవకాశం. వర్షపు వాతావరణంలో ఇది మరిచిపోలేని అనుభవంగా నిలుస్తుంది. ట్రెక్కింగ్‌లో సాధారణంగా రాత్రిపూట బసలు ఉంటాయి. స్థానిక నిర్వాహకుల ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. లేదా స్వతంత్రంగానూ నిర్వహించవచ్చు. నగరం నుంచి అనేక సంస్థలు ఈ ట్రెక్స్‌ నిర్వహిస్తున్నాయి. రూ.3వేల నుంచి మొదలుకుని ట్రెక్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. సరైన సంస్థను, పర్యవేక్షణలో నిపుణులైన ట్రెక్కర్స్‌ మార్గదర్శకత్వంలో మాత్రమే ట్రెక్కింగ్‌ సురక్షితం. 

  • శ్రీకాళహస్తికి చెందిన ఓ జంటకు గతేడాది వివాహం జరిగింది. గర్భం దాల్చడంతో  కుటుంబ పెద్దల  లింగ నిర్ధారణ పరీక్షల కోసం స్థాకంగా ఉన్న ఓ డాక్టర్‌ను సంప్రదించారు. తమకు తొలి సంతానం పురుషుడు కావాలని చెప్పారు. వెంటనే ఆ వైద్యుడు ఆమెకు పరీక్షలు నిర్వహించి కడుపులో పెరుగుతోంది బాలిక ఆనవాళ్లు అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో లింగ నిర్ధారణకు రూ. 45 వేలు, గర్భస్రావానికి సుమారు రూ. 35 వేలు దండుకున్నారు.  ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.   

    నాయుడు పేటకు చెందిన ఓ జంటకు ఇప్పటికే ఇద్దరు బాలికలు పుట్టారు. తమకు వంశోద్ధారకుడు కావలంటూ మూడవసారి ప్రెగ్నెన్సీ కావడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దీంతో మూడవ సారి సైతం బాలిక పుట్టే ఆనవాళ్లు ఉన్నాయంటూ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చెందిన డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు గర్భస్రావం చేయాలని బంధువులు కోరారు. దీంతో పరీక్షించి డాక్టర్లు ఆ మాతృమూర్తి బంధువుల నుంచి వేలకు వేలు దండుకుని పని పూర్తి చేశారు.

    అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..అర్ధాంగిగా.. చెయ్యిపట్టి నడిపించే ఆడబిడ్డకు కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ఆడపిల్ల  భారమనుకునే రోజుల నుంచి ఆడబిడ్డ కోసం ఎదురుచూసే రోజులు వచ్చినా జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆడపిల్లల లింగ నిష్పత్తి  గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భ్రూణ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లింగ నిర్ధారణ మాఫియా రెచ్చిపోతున్నా వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులోనే జోగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది.

    సాక్షి ప్రతినిధి తిరుపతి :  అయ్యో.. మాతృమూర్తుల కడుపులు చిదిమేస్తున్నారే... ప్రెగ్నెస్సీ అయిన నవ వధువులను సైతం వదలకుండా తొలి ప్రసవంలోనే మగబిడ్డ పుట్టాలంటూ స్కానింగ్‌ చేయించి  రక్త ముద్దలపై దాడిచేసి హత్య చేస్తున్నారు. జిల్లాలో రోజు రోజుకు విచ్చలవిడిగా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నా మామూళ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వాధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు, దేశంలోనే పేరొందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో సైతం బాలికల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. లింగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విచ్చల విడిగా ఏర్పాటు చేసుకుని కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ముట్టచెప్పి లింగనిర్ధారణ పరీక్షల మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో బ్రూణ హత్యలు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంపై వైద్య శాఖలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సైతం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు,  

    జిల్లాలో పడిపోతున్న బాలికల జనన రేటు  
    జనగణన 2018 ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెయ్యి మంది బాలురకు 922 మంది బాలికలు ఉన్నారు. అదే 2021 లెక్కలకొచ్చేసరికి ఈ సంఖ్య 901కి పడిపోయింది. జిల్లాల విభజన అనంతరం 2024లో జరిగిన జనగణన లెక్కల ప్రకారం తిరుపతి జిల్లాలో బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగి  916కు చేరింది. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం జిల్లా నిష్పత్తికి వ్యతిరేకంగా నానాటికీ బాలికల నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. బాలురు – బాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తేనే బాలికల నిష్పత్తి పడిపోకుండా ఆపగలమని మేధావులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో తొలి సంతానం మగబిడ్డ పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. లేకుంటే పిండ దశలోనే చిదిమేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 

    మొద్దునిద్రలో వైద్యాధికారులు 
    జిల్లాలో బాలురు– బాలికల నిష్ఫత్తి దారుణంగా ఉందన్న విషయాన్ని  కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఈ అంశాన్ని బహిర్గతం చేయడం గమనార్హం. ఆరేళ్లలోపు బాలల్లో బాలికలు అతి తక్కువగా ఉన్న మండలాల్లో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు ఉన్నట్లు సమాచారం. మూడు నెలల కిందట స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సైతం ఆర్డీవో భాను ప్రకాష్‌ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయినా వైద్యాధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో పెద్ద ఎత్తున బ్రూణ హత్యలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.  గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న నిబంధనను అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టకపోవడంతో ఆడ నలుసు అమ్మ గర్భంలోనే అంతమైపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆడ–మగ నిష్పత్తి వెయ్యికి తొమ్మిది వందలు ఉండగా శ్రీకాళహస్తిలో మాత్రం వెయ్యికి 629 మందే ఆడ బిడ్డలే ఉండటం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.

    వంశోద్ధారకుడు కావాలనే మూఢ నమ్మకం.. 
    ముందు మగబిడ్డ పుడితే చాలు.. ఆ తర్వాత ఎవరూ పుట్టినా పర్వాలేదు. మళ్లీ మగ బిడ్డ పుడితే ఇంకా మేలే..  ఒకవేళ ఆడ బిడ్డ పుట్టినా.. కొడుకూ, కూతురు పుట్టిందని సంబర పడిపోతాం.. ఇదీ ప్రస్తుత సమాజంలో పిల్లలు కావాలంకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి. ముందు కొడుకు పుట్టి మరో సంతానంగా కూతురు పుడితే అక్కడితో ఆపేస్తున్నారు. అలా కాకుండా ముందు ఎంత మంది కూతుళ్లు పుట్టినా కొడుకు కోసం కొందరు ఆరాటపడుతున్నారు. ఇంకొందరు కొడుకుల కోసం ఆడ నలుసులను గర్భంలోనే నులిమేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాళహస్తి ప్రాంతంలో వీధికో గాథ బయటపడుతోంది. ఇలా ఆడ నలుసు పురిటిలో కళ్లు కూడా తెరవకముందే బ్రూణ హత్యలకు గురవుతుంటే మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత అంటూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా వైద్య శాఖ నిద్ర మేల్కొని లింగ నిర్ధారణ, గర్భ స్రావాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    గర్భస్రావాలకు ప్రత్యేక ధర 
    లింగ నిర్ధారణ స్కానింగ్‌ కోసం సుమారు రూ.25 నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తుండగా గర్భస్రావం చేయించేందుకు మరో రేటు తీసుకుంటున్నారు. తిరుపతిలో అయితే రూ.25 వేలు, గూడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ఇతర ఆసుపత్రుల్లో రూ.20 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ఆసుపత్రులు ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నాయి. గర్భం దాలి్చన 20 వారాల తర్వాత గర్భ విచ్ఛిత్తి చేయడం అత్యంత ప్రమాదకరం. అందుకే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, చట్టాలు తీసుకొచ్చాయి. కొందరు ధనార్జన కోసం ఇష్టారీతిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలతో గర్భస్రావాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ ప్రభావం లింగ నిష్పత్తిపై పడుతోంది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి నగరాల్లో   ప్రసూతి ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.  

    కేసులు నమోదు చేస్తాం 
    జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో దీనిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో స్పెషలిస్ట్‌ డాక్టర్లు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి వైద్యాధికారి ఈ కమిటీలో ఉంటారు. సమగ్రంగా దీనిపైన విచారించి ఒక నెల రోజుల్లో కలెక్టర్‌ కు నివేదిక సమరి్పస్తాం. గతంలో ఈ విధంగా స్కానింగ్‌ చేస్తూ దొరికిన ఓ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్‌ చేసి మిషన్లు కూడా స్వా«దీనం చేసుకున్నాం. వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తప్పు చేసినట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లింగనిర్ధార ణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తాం.     
    – డాక్టర్‌ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్‌ఓ, తిరుపతి

    రూ.కోట్లలో వ్యాపారం  
    లింగ నిర్ధారణ పరీక్షలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. దళారులు గర్భిణులను, సంబం«దీకులను గుట్టుగా తిరుపతి, గూడూరు  తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లాక ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. గర్భిణితో ఎక్కువ మంది రాకుండా, ఆమెతో పాటు మరొకరిని వెంటబెట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలిస్తారు. ఆస్పత్రి పేరుగానీ, చిరునామాగానీ ఎలాంటివి చెప్పకుండానే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడ.. మగ చెప్పి రిపోర్టులు చేతికి ఇవ్వకుండా పంపేస్తున్నారు.  

    విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు  
    పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని స్కానింగ్‌ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15 నుంచి రూ. 20 వేలు ఫీజులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరు కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. 

    గూడూరు పట్టణంలోని పేరుగాంచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, స్కానింగ్‌ కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో కోట్లు గడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఫలితమే బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ప్రైవేటు నర్సింగు హోముల్లో, స్కానింగ్‌ సెంటర్లలో విరివిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

  • మొన్నటి వరకు...‘జితాంక్‌ సింగ్‌ గుర్జార్‌ పేరు విన్నారా?’ అనే ప్రశ్నకు వెంటనే వచ్చే జవాబు... ‘సారీ... తెలియదు’ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పరిచయం అయింది. ‘ఎవరీ జితాంక్‌ సింగ్‌ గుజ్జార్‌?’ అని సెర్చ్‌ ఇంజిన్‌లను అడిగేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సింగ్‌. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (టిఐఎఫ్‌ఎఫ్‌)లో జితాంక్‌ సింగ్‌ గుర్జార్‌ తీసిన విముక్త్‌ (ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ది స్కై) ప్రతిష్ఠాత్మమైన నెట్‌పాక్‌ (నెట్‌వర్క్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆఫ్‌ ఏషియా సినిమా) అవార్డ్‌ గెలుచుకుంది.

    పక్కా పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల జితాంక్‌ ప్రకృతి ప్రపంచానికి చేరువయ్యే అవకాశం దొరికింది. రణగొణ ధ్వనులు లేని ఆ ప్రశాంతత బాగా ఇష్టంగా ఉండేది. తనకు ఆశ్చర్యంగా అనిపించేవాటిని, అద్భుతంగా అనిపించేవాటిని అందమైన కథలుగా చెబుతుండేవాడు. ఆ కథలు చెప్పే అలవాటే జితాంక్‌సింగ్‌ను సినిమా ప్రపంచంలోకి తీసుకువచ్చింది.

    గ్రామీణ ప్రపంచం... కథల చలమ
    గ్రామీణ ప్రపంచంలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని ప్రపంచానికి చెప్పడం అంటే జితాంక్‌కు ఇష్టం.
    ‘ది మోస్ట్‌ పర్సనల్‌ ఈజ్‌ ది మోస్ట్‌ క్రియేటివ్‌’ అనే విలువైన మాట అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘విముక్త్‌’ కథకు స్క్రీన్‌ప్లే సమకూర్చి సినిమాగా మలిచాడు. ఇది నిర్మాత పూజా విశాల్‌ శర్మ రాసిన కథ. నటులు, సాంకేతిక వర్గం ఫైనల్‌ అయ్యాక... ‘ఇదీ కథ’ అని వారికి చె΄్పాడు. ప్రతి క్యారెక్టర్‌ గురించి విశ్లేషించి వివరంగా చె΄్పాడు. నటులు తమ క్యారెక్టర్‌లలో పూర్తిగా మమేకం కావడానికి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాడు.

    కుంభమేళాలో షూటింగ్‌
    జనసముద్రంలో మహా కుంభమేళాలో షూటింగ్‌ అంటే మాటలు కాదు. తమది చిన్న యూనిట్‌ కావడంతో ప్రతి సీన్‌ గురించి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నాడు. ఏ దృశ్యాన్ని ఎక్కడ చిత్రించాలనేదాని కోసం ఎన్నో స్థలాలను పరిశీలించాడు. సరిౖయెన లొకేషన్‌లను ఎంపిక చేసుకోవడం ఒక సవాలు అయితే, జనమూహాలలో సహజ చిత్రీకరణ అనేది మరో సవాలు. ఎలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా షూటింగ్‌ పూర్తిచేశాడు జితాంక్‌.

    ‘మహాకుంభమేళా సన్నివేశాలు లేక΄ోతే ఈ సినిమాయే లేదు. కాబట్టి కుంభమేళాలోని సన్నివేశాలనే మొదట చిత్రీకరించాం. ఆ తరువాత మధ్యప్రదేశ్‌లోని బరై, పద్వా గ్రామాలలో షూటింగ్‌ చేశాం’ అంటాడు జితాంగ్‌ సింగ్‌. ‘గ్రామీణ ప్రాంత కథలు మాత్రమే కాదు పట్ణణాలలోని ఎన్నో సంక్లిష్ట జీవితాలకు చిత్రరూపం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటున్నాడు జితాంక్‌ సింగ్‌ గుర్జార్‌.

    ప్రాంతీయ భాషలో తీసిన చిత్రాన్ని ప్రపంచం మెచ్చింది
    ఆ దంపతులకు వయసు పైబడుతోంది. జీవనాధారమైన తమ పొలాన్ని కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. ఒక్కగానొక్క కొడుకు నారన్‌కు మేథో సామర్థ్యాలు లేవు. మానసికంగా అస్థిరంగా ఉంటాడు. ఒకవైపు నారన్‌ను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. మరో వైపు ఆర్థిక కష్టాలు. ఎన్నో సమస్యల మధ్య ఒక పరిష్కారాన్ని ఆశిస్తూ మహాకుంభమేళాకు వారి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. 

    గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే తమ కష్టాలు తీరుతాయని వారు ఆశిస్తారు. గ్రామీణ భారత జీవితం, నమ్మకాలు, అపనమ్మకాలకు, అదృష్ట దురదృష్టాలకు అద్దం పట్టిన  సినిమాగా ‘విముక్త్‌’ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బ్రజ్‌ భాషలో తీశారు. కేవలం పదకొండురోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. టొరంటో ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సెంటర్‌ పీస్‌ సెక్షన్‌లో ప్రదర్శించారు. 

    (చదవండి: Weight Loss Story: బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్‌గా..! జస్ట్‌ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..)

Telangana

  • హైదరాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనిక అమరవీరుల స్తూపానికి  ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. ఇదే సందర్భంలో కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని కూడా రాజ్‌నాథ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఈ రోజు మూడు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటున్న శుభదినమన్నారు. ఈ రోజున మోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదినం జరుపుకుంటున్నామన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించారని, తెలంగాణలో ఎన్నో జలియన్ వాలా బాగ్ లు జరిగాయన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతానికి విముక్తి కల్పించడంతోనే మనం భారత్ లో ఏకమయ్యామన్నారు. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ కు స్వేచ్ఛను ఇచ్చిన మహనీయునిగా గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం  విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. తెలంగాణ వీరులను రాష్ట్ర ప్రభుత్వం అవమనిస్తున్నదని బండి సంజయ్‌ ఆరోపించారు.

    బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రను తొక్కి పెట్టాలని ఇక్కడి రాష్ట్ర పాలకులు చూస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా,  ఇక్కడి ప్రభుత్వానికి ఎం వచ్చిందని నిలదీశారు. హైదరాబాద్ లిబరేషన్ డే జరగకుండా ఉండటానికి కారణం ఎంఐఎం పార్టీ  అని, ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాడవాడలా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు  చెబుతూ, మోదీ నేతృత్వంలో దేశం మరింత పురోగమిస్తున్నదన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: బుద్ధా భవన్‌ హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా, డీఆర్‌ఎఫ్ సిబ్బంది నిరసనలకు దిగారు. తమ జీతం కట్‌ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం తగ్గించిన కారణంగా ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు.

    వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బుద్ధా భవన్‌ వద్ద డీఆర్‌ఎఫ్‌, హైడ్రా సిబ్బంది ఆందోళనలకు దిగారు. రాత్రి, పగలు తమతో పనులు చేయించుకుని.. జీతంలో ఐదు వేలు కట్‌ చేశారని నిరసన చేపట్టారు. అయితే, గతంలో జీహెచ్‌ఎంసీ అండర్‌లోని ఈవీడీఎంలో పనిచేసిన 1100 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది.. ప్రస్తుతం హైడ్రాలోని డీఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తెచ్చింది.

    ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం.. అందరికీ ఒకేలా జీతాలు అందాల్సి ఉన్నప్పటికీ తమకు మాత్రం 5000 కట్‌ చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో దాదాపు సగం మందికి జీతం కట్‌ అయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు జీతంలో కోత విధించారో చెప్పాలని సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. తమకు రావాల్సిన జీతం ఇచ్చే వరకు ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనల్లో పాల్గొంటామన్నారు. 

  • మూసాపేట: నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూసాపేట యాదవ బస్తీలో నివాసముండే సూరవరపు రమ్య (18)కు మూడు నెలల క్రితం అశోక్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూతురు, అల్లుడు అత్తింట్లోనే ఉంటున్నారు. సోమవారం రాత్రి అందరు కలిసి భోజనం చేసిన అనంతరం..రమ్య ముందుగా తన రూమ్‌కు వెళ్లి ఫ్యాన్‌ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త భోజనం ముగించి రూముకు వెళ్లగా డోర్‌ తెరుచుకోలేదు. దీంతో అందరూ కలిసి తలుపులు తెరవగా రమ్య ఫ్యాన్‌కు వేలాడుతూ కని్పంచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

     

  • సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు అని స్పష్టం చేశారు.

    హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం, రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది. ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ లక్ష్యం.

    బతెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులను చేయబోతున్నాం. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తాం. స్వేచ్చ, సమానత్వంలో తెలంగాణ రోల్‌ మోడల్‌గా ఉంది. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు అందుకోవడానికి విద్య ఒక్కటే మార్గం. భవిష్యత్‌ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నాం. విద్యతో పాటు క్రీడలకు అ‍త్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్‌ ఇండియా స్కూల్‌ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి తొలగించాలి.

    అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటున్నాం. వరి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. ఆ బిల్లులకు చట్టబద్దత కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సామాజికన్యాయ సాధన ప్రక్రియకు మీరు అడ్డుపడొద్దు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు. మన వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం.

    హైదరాబాదే మన బలం.. హైదరాబాద్‌ను గేట్‌ ఆఫ్ వరల్డ్‌గా తీర్చి దిద్దుతాం. 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా మార్చుతాం. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దుతాం. వందేళ్ల వరకు నీటి సమస్య లేకుండా హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు. మూసీ నదిని ప్రక్షాళన చేసి.. హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం. మూసీ చుట్టూ బ్రతుకుతున్న ప్రజలకు మెరుగైన జీవితం కల్పిస్తాం. మూసీ పరివాహక ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తాం. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మార్చుతాం. మూసీకి ఇరువైపులా ప్రపంచ స్థాయి కట్టడాలు నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటాం. ఈ ఏడాది డిసెంబర్‌లో మూసీ అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ నిర్మించబోతున్నాం. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఫోర్తు సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి’ అని కోరారు. 

Andhra Pradesh

  • ప్రకాశం జిల్లా: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించడంతో స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచూ తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలను వదిలేసి వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. శనివారం రాత్రి కలుజువ్వలపాడు గ్రామానికి వచ్చిన బాలాజీ.. స్థానికంగా ఉండే బేకరీలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న భార్య భాగ్యలక్ష్మిని అటకాయించాడు.

    మద్యానికి డబ్బులు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో బాలాజీలోని రాక్షసుడు నిద్ర లేచాడు. తన అక్క రమణ, మేనల్లుడు విష్ణు, బాలాజీ మరో భార్య కలిసి భాగ్యలక్ష్మిని బైకుపై బలవంతంగా ఎక్కించుకొని.. అక్క ఇంటికి తీసుకువెళ్లి తాళ్లతో నిర్బంధించాడు. రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు చిత్రహింసలకు గురిచేసి విడిచిపెట్టారు. మళ్లీ సోమవారం రాత్రి చిత్రహింసలు పెట్టేందుకు బాలాజీ యత్నించగా ఆమె తప్పించుకొని ఎస్సీ కాలనీలోకి పరుగెత్తింది. స్థానిక చర్చి వద్ద ఉన్న కొందరు యువకులు బాలాజీని, అతని మేనల్లుడిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. 

    అనంతరం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక యువకులు 112కు ఫోన్‌ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన పోలీసులు బాధిత మహిళను ఫొటో తీసుకుని బాలాజీ మేనల్లుడు విష్ణును బైక్‌పై ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వదిలేసినట్లు సమాచారం. శనివారం చేసిన చిత్రహింసను బాలాజీ రెండో భార్య వీడియో తీయగా అది మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కాగా మహిళను చిత్రహింసలకు గురిచేయడంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై విలేకరులతో తెలిపారు. సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వీడియో ప్రచురితం కావడంతో దర్శి సీఐ, తర్లపాడు ఎస్సై కలుజువ్వలపాడు గ్రామానికి చేరుకున్నారు. బాధిత మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

     

     

  • లక్ష్మీపురం: నేపాల్‌కు చెందిన బాలిక అదృశ్యమైన ఘటనపై అరండల్‌పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌ దేశానికి చెందిన గోవింద్‌ తాప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడ హోటల్‌లో పని చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల రెండు నెలల క్రితం గోవింద్‌ తాప కుమార్తె సరిత కుమారి మరి కొంత మందితో కలిసి గుంటూరుకు వచ్చి, గుంటూరులోని రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. 

    అయితే ఈనెల 14వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. విషయం తెలుసుకున్న తండ్రి గోవింద్‌ తాప గుంటూరు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలలో, బంధుమిత్రుల వద్ద ఎంత వెతుకులాడినా ఆచూకీ తెలియక పోవడంతో దిక్కు తోచక అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌ 0863–2231955, సీఐ ఆరోగ్య రాజు 8688831332, ఎస్‌ఐ రోజాలత, 8688831334, నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా సూచించారు.

  • తూర్పు గోదావరి జిల్లా: జనసేన నాయకుల ప్రచార ఆర్భాటానికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. మమ్మల్ని ఎవర్రా అడిగేది అంటూ నిసిగ్గుగా ప్రభుత్వం అమలు చేయని పథకాన్ని కూడా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 17న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని నిడదవోలులోని ఓవర్‌ బ్రిడ్జిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ, రాష్ట్ర మంత్రి దుర్గేష్‌ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలలో ప్రభుత్వ అమలు చేయని పథకాన్ని కూడా ముద్రించారు. 

    సూపర్‌ సిక్స్‌, సూపర్‌ హిట్‌ అంటూ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.1500 అంటూ ఫ్లెక్సీలో ప్రచారం చేసుకుంటున్నారు. వీటిని చూసి పట్టణ ప్రజలు, ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని కూటమి నాయకులు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. కానీ ఈ పథకం అమలు చేస్తున్నట్టు ఫ్లెక్సీలో ముద్రించడం హాస్యాస్పదంగా మారింది. మున్సిపల్‌ కమిషనర్‌ టి.కృష్ణవేణి ఆదేశాల మేరకు మున్సిపల్‌ సిబ్బంది ఈ వీటిని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

  • శ్రీ సత్యసాయి జిల్లా: రెండు వేర్వేరు కీలక హత్య కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో పోలీసులు చతికిల పడ్డారు. ఆ రెండు కేసులను లోతుగా దర్యాప్తు చేస్తే ఒకరిద్దరు పోలీసు అధికారులు సైతం జైలుకెళ్లాల్సి వస్తుందనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హత్యలు జరిగి మూడు, నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌.సతీష్‌ కుమార్‌ ఈ రెండు కేసుల దర్యాప్తు సవాల్‌గా నిలిచాయి. ప్రత్యేక చొరవ చూపి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.

    గదిలోనే కిరణ్‌ దారుణ హత్య
    మహారాష్ట్రకు చెందిన కిరణ్‌(23) కొన్నేళ్లుగా కదిరి పట్టణంలోని ఎంజీ రోడ్డులో మేడపై ఓ గదిని అద్దెకు తీసుకొని బంగారు నగలు తయారీతో జీవనం సాగించేవాడు. సకాలంలో నగలు సిద్దం చేసి ఇస్తుండడంతో నగల వ్యాపారులందరూ అతనికే పని ఇచ్చేవారు. దీంతో రోజంతా బిజీగా ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. అతని వద్ద కిలోకు పైగా బంగారం, 10 కిలోలకు పైగా వెండి ఉండేదని కొందరు నగల వ్యాపారులు అంటున్నారు.

     ఈ నేపథ్యంలో 2021 సెప్టెంబర్‌ 12న రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కిరణ్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మొదట్లో ఈ కేసు విషయంలో పోలీసులు కొంత హడావుడి చేసినా ఆ తర్వాత ఉన్నఫళంగా దర్యాప్తు ఆగిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి ఓ పోలీసు అధికారి తన చేతి వాటం ప్రదర్శించి పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు సొమ్ము చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపైనే సదరు పోలీసు అధికారిని వీఆర్‌కు అప్పట్లో ఉన్నతాధికారులు పంపినట్లుగా సమాచారం.

    ప్రమీల శరీరంపై 26 కత్తిపోట్లు
    కదిరిలోని కాలేజీ రోడ్డులో కిరాణా కొట్టు నిర్వహించే రంగారెడ్డి అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత అతని భార్య ప్రమీల(24) ఇంట్లోనే ఉంటూ కిరాణా దుకాణం నిర్వహించేది. 2022, మార్చి 21న అర్రధరాత్రి తన కిరాణా కొట్టులోనే ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఆమె శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. తన సమీప బంధువులతో ఆస్తి తగాదా విషయంలో అప్పట్లో తరచూ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళుతున్న ఆమె అమాయకత్వాన్ని అప్పటి ఒక పోలీసు అధికారి ‘క్యాష్‌’ చేసుకోవడంతో పాటు వివాహేతర సంబంధం కూడా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి.

     ప్రమీల సెల్‌ఫోన్‌కు అందిన కాల్స్‌ ఆధారంగా సదరు పోలీసు అధికారి తరచూ ఆమెతో మాట్లాడినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో సదరు పోలీసు అధికారిని అప్పట్లో విధుల నుంచి తప్పించినట్లుగా పోలీసు వర్గాల సమాచారం. కాగా, సదరు పోలీసు అధికారి అప్పట్లో స్థానిక సబ్‌జైలు ఎదురుగా ఉన్న పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లోనే ఉండేవారు. ఆయనకు ప్రమీల తన ఇంటి నుంచి క్యారియర్‌ తీసుకెళ్లి ఇస్తుండడం తాము కళ్లారా చూశామని కొందరు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. 

    అలాంటి మహిళ రాత్రికి రాత్రి హత్యకు గురి కావడం నమ్మలేక పోతున్నామని వారంటున్నారు. ఆమె సమీప బంధువులు సైతం ఇదే అంశాన్ని బలపరుస్తున్నారు. ఈ హత్య జరిగి మూడేళ్లకు పైగా కావస్తున్నా నిందితులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్‌ చేయలేదని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ కొందరు ఖాకీల పాత్ర ఉన్నందునే విచారణ పక్కదారి పట్టినట్లుగా బలమైన విమర్శలున్నాయి.

Sports

  • ఆసియా కప్‌ టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్‌ ఫాస్ట్‌బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvneshwar Kumar) పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ ఆసియా కప్‌ టీ20 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.

    రెండు వికెట్లు పడగొట్టిన రషీద్‌
    బంగ్లాదేశ్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా రషీద్‌ ఖాన్‌ ఈ ఘనత సాధించాడు. ఆసియా కప్‌-2025 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడింది. అబుదాబిలో టాస్‌ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

    ఓపెనర్లు సైఫ్‌ హసన్‌ (30), తాంజిద్‌ హసన్‌ (52)లతో పాటు తౌహీద్‌ హృదోయ్‌ (26) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు స్కోరు చేసింది. అఫ్గన్‌ బౌలర్లలో కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

    ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటాలో 26 పరుగులు ఇచ్చి.. సైఫ్‌ హసన్‌ రూపంలో కీలక వికెట్‌ దక్కించుకోవడంతో పాటు షమీమ్‌ హొసేన్‌ను కూడా అవుట్‌ చేశాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా రషీద్‌ ఖాన్‌ అవతరించాడు.

    ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసింది వీరే
    👉రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌)- 10 మ్యాచ్‌లలో కలిపి  14 వికెట్లు
    👉భువనేశ్వర్‌ కుమార్‌ (భారత్‌)- 6 మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు
    👉అమ్జద్‌ జావేద్‌ (యూఏఈ)- 7 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు
    👉వనిందు హసరంగ (శ్రీలంక)- 8 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు
    👉హార్దిక్‌ పాండ్యా (భారత్‌)- 10 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు.

    ఆఖరి వరకు పోరాడినా..
    ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించలేక అఫ్గనిస్తాన్‌ చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఆఖరి వరకు పోరాడినా ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.

    అఫ్గన్‌ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ (35), అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (30) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. సనూమ్‌ అహ్మద్‌, టస్కిన్‌ అహ్మద్‌, రిషాద్‌ హొసేన్‌ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక  అఫ్గన్‌కు సూపర్‌-4 ఆశలు సజీవంగా ఉండాలంటే.. తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను తప్పక ఓడించాలి.

    చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్‌.. పాకిస్తాన్‌కు ఊరట?!

  • ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌లో టీమిండియా ఇప్పటికే సూపర్‌-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్‌-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    సూపర్‌-4 బెర్తు ఖరారైంది ఇలా..
    ఇక రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సేన.. దాయాది పాకిస్తాన్‌ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్‌ను ఓడించి.. ఎలిమినేట్‌ చేయగానే సూపర్‌-4 బెర్తు ఖరారు చేసుకుంది.  

    ఇక గ్రూప్‌-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్‌- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్‌ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్‌ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.

    గెలిచిన జట్టుకే అవకాశం
    ఈ క్రమంలో దుబాయ్‌ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది.

    అంటే.. పాకిస్తాన్‌ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్‌-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్‌-‘ఎ’ నుంచి సూపర్‌-4కు అర్హత సాధిస్తుందన్న మాట.

    ఫలితం తేలకుంటే మాత్రం
    ఒకవేళ మ్యాచ్‌ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్‌ వస్తుంది. అప్పుడు నెట్‌ రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్‌ రన్‌రేటు పరంగా పాకిస్తాన్‌ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్‌కే సూపర్‌-4 చేరే అవకాశం ఉంటుంది.

    AI ఆధారిత టేబుల్‌

    ఒమన్‌, హాంకాంగ్‌ ఎలిమినేట్‌
    యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్‌ టోర్నీలో గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ... గ్రూప్‌-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-‘ఎ’ నుంచి ఒమన్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి హాంకాంగ్‌ ఎలిమినేట్‌ అయ్యాయి.

    చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్‌.. పాకిస్తాన్‌కు ఊరట?!

  • టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్‌ (West Indies tour of India- 2025) క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు రోస్టన్‌ ఛేజ్‌ (Roston Chase) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. 

    వారిపై వేటు
    ఇక ఈ టూర్‌లో భాగంగా మాజీ సారథి క్రెయిగ్‌ బ్రాత్‌వెట్‌పై వేటు వేసిన విండీస్‌ బోర్డు.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్‌ లేన్‌, మికైల్‌ లూయీస్‌లను కూడా జట్టు నుంచి తప్పించింది.

    వికెట్ల వీరుడికి చోటు
    అదే విధంగా.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఖారీ పియరికి తొలిసారిగా టెస్టు జట్టులో చోటు ఇచ్చింది. వైస్‌ కెప్టెన్‌ జోమెల్‌ వారికన్‌తో కలిసి పియరి స్పెషలిస్టు స్పిన్నర్‌గా బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్‌ చాంపియన్‌షిప్‌లో 41 వికెట్లతో సత్తా చాటినందుకు గానూ పియరీకి ఈ అవకాశం దక్కింది. ఇక అలిక్‌ అథనాజ్‌, తగెనరైన్‌ చందర్‌పాల్‌కు వెస్టిండీస్‌ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.

    చందర్‌పాల్‌ రాకతో టాపార్డర్‌లో తమ జట్టు మరింత పటిష్టం అవుతుందని.. అదే విధంగా అథనాజ్‌ కూడా స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపారు. కాగా అథనాజ్‌ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడాడు.  

    సీమర్ల కోటాలో వీరే
    అయితే.. పేసర్‌ గుడకేశ్‌ మోటికి మాత్రం విశ్రాంతినిచ్చినట్లు విండీస్‌ బోర్డు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపఖండ పిచ్‌లపై మ్యాచ్‌ నేపథ్యంలో  స్పిన్‌ విభాగానికి వారికన్‌ నాయకత్వం వహించనుండగా.. ఖారీ పియర్రి, రోస్టన్‌ ఛేజ్‌ అతడికి సహాయకులుగా ఉండనున్నారు.

    ఇక సీమర్ల కోటాలో అల్జారీ జోసెఫ్‌, షమార్‌ జోసెఫ్‌, ఆండర్సన్‌ ఫిలిప్‌, జేడన్‌ సీల్స్‌ స్థానం దక్కించుకున్నారు.  కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా వెస్టిండీస్‌ టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. అక్టోబరు 2- 14 వరకు ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికలుగా ఈ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.

    టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టు
    రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, తగెనరైన్ చందర్‌పాల్‌, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్‌ సీల్స్‌.

    చదవండి: మ్యాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం

Eluru

  • ఉపాధ్యాయుల నిరసన

    భీమవరం: ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏపీటీఎఫ్‌)ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే రెండేళ్లు పూర్తయిపోయినా పీఆర్సీ కమిషన్‌ వేయకపోవడం శోచనీయమని వెంటనే కమిషన్‌ వేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ మాట్లాడుతూ సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్రం మెమో నెంబర్‌ 57 ప్రకారంగా 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు పీఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా రూపొందించేలా కృషి చేస్తున్నామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల రెండో రోజు సదస్సులో జిల్లాలో ప్లాస్టిక్‌ వినియోగం నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు రీసైక్లింగ్‌ కాకుండా ఉండేలా యంత్రాలను నియోజకవర్గానికి ఒక యూనిట్‌ను అందించాలని, అలాంటి యూనిట్లు ఏర్పాటుచేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.

    జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో జలాశయంలోకి 4,941 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువకు 3,089 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి క్రమేపీ వరద నీరు పెరుగుతూ వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 83.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 82.58 మీటర్ల వద్ద కొనసాగుతోంది. జలాశయం వద్ద జలవనరుల శాఖ సిబ్బంది పహారా కాస్తున్నట్లు ఏఈ రాహుల్‌ భాస్కర్‌ తెలిపారు.

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేగా జ్యువెలర్స్‌ ఏలూరు షోరూంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన లక్కీడిప్‌లో గెలుపొందిన విజేతల పేర్లను మంగళవారం ప్రకటించింది. లక్కీ డ్రాలో జగ్గవరానికి చెందిన వి.వీరభద్రరావు, ఏలూరుకు చెందిన ఎస్‌.సతీష్‌కుమార్‌, జి.రమేష్‌, దుగ్గిరాలకు చెందిన వి.సత్యప్రియ, ఏలూరుకు చెందిన బి.శారద గెలుపొందారని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌ బండ్లమూడి రామ్మోహన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ నవీన్‌ వనమా మాట్లాడుతూ ఆఫర్ల కాలంలో ఆభరణాలు కొనుగోలు చేసిన ఖాతాదారులకు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తున్నామని చెప్పారు. అనంతరం విజేతలకు రూ.2 లక్షల విలువైన బంగారు/డైమండ్‌ నెక్లెస్‌లు బహుమతిగా అందజేశారు. వేగా జ్యువెలర్స్‌ అన్ని షోరూంలలో రాబోయే దసరా, దీపావళి పండుగలకు, వివాహ వేడుకల కోసం సరికొత్త డిజైన్ల ఆభరణాలను విస్తృత శ్రేణుల్లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు.

    భీమవరం: కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉందుర్తి శ్రీనివాస్‌, మామిడిశెట్టి రామాంజనేయలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పెట్టుబడి సాయం ఇవ్వాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

  • ఏజెన్సీలో భారీ వర్షం

    బుట్టాయగూడెం: ఏజెన్సీలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటలపాటు కుండపోత వర్షంతో కొండవాగులు పొంగిపొర్లాయి. రెడ్డిగణపవరం సమీపంలోని జల్లేరు వాగు ఉధృతితో ఈ రహదారిపై రాకపోకలు సుమారు 3 గంటల వరకూ నిలిచిపోయాయి. ఇప్పలపాడు సమీపంలోని జల్లేరు వాగు పొంగిపొర్లింది. బుట్టాయగూడెం శివారు అల్లి కాల్వ పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో వరదనీరు స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, పశువుల ఆస్పత్రిలోకి ప్రవేశించాయి. శివాలయం సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఉన్న రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించింది. సింగరంపాడు వద్ద ఉన్న వేరుశనగ, పామాయిల్‌ తోటల్లోకి కూడా వరదనీరు భారీగా చేరింది.

    వర్షాలకు దెబ్బతిన్న గుమ్ములూరు రోడ్డు

    బుట్టాయగూడెం: ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని గుమ్ములూరు రహదారి దెబ్బతింది. కొండవాగు పొంగిపొర్లడంతో ఆ ప్రవాహానికి రోడ్డు పాడైపోయింది. అధికారులు స్పందించి వెంటనే రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

  • రాజకీయ వేధింపులు ఆపాలి

    ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో అక్రమంగా తొలగించిన వీవోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఆన్‌లైన్‌ వర్క్‌ పేరుతో వేధింపులు ఆపాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు వీవోఏ(యానిమేటర్స్‌), ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద మంగళవారం జోరు వానలో ధర్నా నిర్వహించారు. వేతన బకాయిలు చెల్లించాలని, గ్రూప్‌ బీమా సౌకర్యం కల్పించాలని నినదించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాద్‌, యూనియన్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ సుభాషిణి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీవోఏలను రాజకీయ వేధింపులకు గురిచేస్తూ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యాప్స్‌ పేరుతో సంబంధం లేని అనేక పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

  • వైద్య కళాశాలలు ప్రభుత్వమే నడపాలి

    సీపీఎం జిల్లా కార్యదర్శి డిమాండ్‌

    పాలకొల్లు సెంట్రల్‌: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడమంటే విద్యను వ్యాపారం చేయడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎస్‌వి గోపాలన్‌ మండిపడ్డారు. మంగళవారం దగ్గులూరు మెడికల్‌ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గోపాలన్‌ మాట్లాడుతూ ప్రభుత్వమే వైద్య కళాశాలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నాడు మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం 60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ల్యాండ్‌ ఫిల్లింగ్‌ పూర్తిచేసి ఫౌండేషన్‌ ప్రాథమిక స్థాయిలో ఉందన్నారు. ప్రభుత్వం మారడంతో పనులు ఆగాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరంన్నర కావస్తున్నా ఇంతవరకూ నిర్మాణం పనులు కొనసాగించలేదన్నారు. ప్రైవేటు వాళ్లకు అప్పగించడం అన్యాయమన్నారు. ఇప్పటికే విద్యారంగం ప్రైవేటు పరమైందని, దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారన్నారు. ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం దారుణన్నారు. దీనివల్ల విద్య మరింత ఖరీదుగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వమే కళాశాలలను నడపాలని లేదంటే ప్రజా ఉద్యమం లేవనెత్తుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కానేటి బాలరాజు, జవ్వాది శ్రీనివాస్‌, బాతిరెడ్డి జార్జి, కె క్రాంతిబాబు, గొల్ల ఏడుకొండలు, టి.శ్రీనివాస్‌, ఎస్‌.మాణిక్యం, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

  • పీఆర్సీ ఊసెత్తరు.. డీఏలు చెల్లించరు

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికలకు ముందు పీఆర్‌సీ ఇస్తాం, మంచి ఐఆర్‌ ఇస్తాం, పెండింగ్‌ బకాయిలన్నీ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్న గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వినతిపత్రాలు సమర్పిస్తున్నా ఎలాంటి స్పందన లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వారికి ఎలాంటి కష్టం లేకుండా సకాలంలో చెల్లింపులు చేశారు. అంతకముందు ప్రభుత్వం బకాయి పెట్టిన 3 డీఏలతో పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలూ బకాయి పెట్టకుండా డీఏలు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 డీఏలు బకాయి పెట్టింది. దీంతో పాటు వారు దాచుకున్న పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలు కూడా మంజూరు చేయడంలేదని ఉద్యోగ, ఉపాధ్యాయులు వాపోతున్నారు. బిడ్డల చదువులకు, వివాహాల నిమిత్తం దాచుకున్న దానిలో రుణాల కింద విడుదల చేయాలని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    పీఆర్‌సీ ఊసే ఎత్తడం లేదు

    డీఏ బకాయిలు విడుదల చేయకపోయినా, సరెండర్‌ లీవులు మంజూరు చేయకపోయినా కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్‌సీ ప్రకటిస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనా విడుదల కావడం లేదు. 12వ పీఆర్‌సీ ప్రకటిస్తే కనీసం 30 శాతం ఫిట్‌మెంట్‌ లభించి సుమారు రూ.50 వేల జీతం తీసుకునే ఉద్యోగికి మరో రూ.15 వేల వరకూ పెరుగుతుందని ఆశిస్తుండగా ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించకుండా కప్పదాటుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించడానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థితిగతులు, అప్పటి జీవన ప్రమాణాలపై అధ్యయనం చేయడానికి పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించింది. పీఆర్‌సీ కమిటీ ఛైర్మన్‌ అధ్యయనం చేస్తుండగానే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల కష్టాలు మళ్ళీ మొదటికొచ్చాయి.

    2 డీఏలు విడుదల చేయాలి

    గత ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఊరడించడానికి, ప్రసన్నం చేసుకోవడానికి దసరా సమయంలోనైనా ఏదో ఒక తాయిలాలు ప్రకటిస్తూ ఉండేవి. కూటమి ప్రభుత్వం కనీసం ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. ఈ అంశం ఉద్యోగ, ఉపాధ్యాయులను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. దసరా కానుకగా కనీసం రెండు డీఏలన్నా విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 22 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు బలయ్యారు. వీరిలో సుమారు 6,500 మంది ఉపాధ్యాయులుండగా 15,500 మంది ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, గెజిటెడ్‌ అధికారులు, నాల్గొ తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఒక్క డీఏ బకాయిల వరకూ చూసుకున్నా సుమారు రూ. 50 – రూ. 60 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సరెండర్‌ లీవ్‌, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాల బకాయిల మరో రూ.150 కోట్లు ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది పెన్షనర్లు కరువు భత్యం కోసం ఎదురు చూస్తున్నారు.

    ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంతవరకూ నాలుగు డీఏలు బకాయిలు పెట్టడం దురదృష్టకరం. దసరా నాటికి కనీసం 2 డీఏ బకాయిలనైనా విడుదల చేయాలి. 3 సరెండర్‌ లీవుల బకాయిలను కూడా విడుదల చేయాలి.

    – చోడగిరి శ్రీనివాస్‌, ఏపీ ఎన్‌జీఓ సంఘం

    2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేయాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించారు. ఈ లోపు ప్రభుత్వం మారడంతో ఆ చైర్మన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటుతున్నా ఇప్పటి వరకూ పీఆర్‌సీ మాటే ఎత్తకపోవడం దురదృష్టకరం. పీఆర్‌సీ ప్రకటించే లోపు మధ్యంతర భృతి అయినా ప్రకటించి విడుదల చేయాలి.

    – గెడ్డం సుధీర్‌, వైఎస్సార్‌ టీచర్స్‌

    అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

    ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు

    ఇంత వరకూ 4 డీఏల బకాయి

    దసరా కానుకగా కనీసం 2 డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌

    ఇప్పటికే రోడ్డెక్కిన టీచర్లు

    బాకీలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్‌ కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి పోరుబాట పట్టారు. ప్రభుత్వంలో చిన్నపాటి కదలిక కూడా లేదు. ప్రస్తుత ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వారం నిర్వహిస్తోంది. వచ్చే అక్టోబర్‌ 7న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎన్‌జీఓ నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో బకాయిలన్నీ చెల్లించాలని, పీఆర్‌సీ ప్రకటించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని హెచ్చరించారు.

  • కై కల

    సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీ నేత కొల్లి బాబి అరాచకాలకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. మాజీ మంత్రి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అండదండలతో పేట్రేగిపోతున్న బాబి దళిత ఉద్యమంతో దిగొచ్చాడు. దాడులు, దౌర్జన్యాలు, దందాలతో నిత్యం వివాదాస్పద వ్యక్తిగా ఉండే బాబి తాజాగా కై కలూరు మండలం దానిగూడెంలో దళిత యువకులపై దాడిలో కీలక వ్యక్తి. ఘటన జరిగాక పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దళిత సంఘాలు రోడ్డెక్కి తీవ్ర ఆందోళనకు దిగాయి. కామినేని డైరెక్షన్‌లో పరారైన కొల్లి 12 రోజులు తరువాత ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. జనసేన కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి షాడో ఎమ్మెల్యే తరహాలో కై కలూరులో ప్రతి వివాదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. కై కలూరుకు చెందిన కొల్లి వరప్రసాద్‌ అలియాస్‌ బాబి జనసేనలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతూ గత ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన ఎలక్షన్‌ ఇన్‌చార్జిగా పనిచేశాడు. పేరుకే జనసేన అయినప్పటికీ 24 గంటలూ ఎమ్మెల్యే కామినేని వెంటే ఉంటూ దందాలు కొనసాగించాడు. గతంలోనూ కొల్లి బాబిది వివాదాస్పద వైఖరి.

    దళితుల ఉద్యమంతో లొంగుబాటు

    ఈ నెల 5న కై కలూరు శివారులోని దానిగూడెం దళితవాడలో ఇద్దరు యువకులపై జనసేన కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో 8 మందిని అరెస్టుచేశారు. ప్రధాన సూత్రధారిగా ఉన్న కొల్లి బాబి.. కామినేని డైరెక్షన్‌తో పరారయ్యాడు. దళితులు రోడ్డెక్కి ఆందోళన చేయడం, సామాజిక వర్గాల పోరుగా మారడం, ఇతర ప్రాంతాల నుంచి దళిత సంఘాలు కీలక నేతలు వచ్చి పరామర్శించి పోలీసుల తీరుపై మండిపడుతున్న క్రమంలో 12 రోజులుగా పరారీలో ఉండి మంగళవారం మధ్యాహ్నం ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. లొంగిపోవడానికి ముందు సోషల్‌ మీడియాలో ప్రత్యేకంగా వీడియో పోస్టు చేశాడు. బయటకు వచ్చిన తరువాత కొల్లి బాబి 2.0 చూపిస్తానని, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు సంగతి తేలుస్తానంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం.

    కామినేని అండతో రెచ్చిపోతున్న వైనం

    కూటమి అధికారంలోకి వచ్చాక దందాలు, దాడులు

    దానిగూడెం దళితులపై దాడి ఘటనలో కొల్లి కీలక సూత్రధారి

    12 రోజుల పరారీ తరువాత లొంగిపోయిన వైనం

    కామినేని డైరెక్షన్‌తోనే పోలీసుల ఎదుట లొంగుబాటు!

    బయటకు వచ్చాక కొల్లి బాబి 2.0 చూపిస్తానంటూ బెదిరింపులు

    పదేళ్ళ క్రితం అటవీశాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తూ కృష్ణా, ఏలూరు జిల్లాల్లో అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 25 మందికిపైగా మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలో అతనిపై కేసు నమోదైంది. సుమారు 7 చీటింగ్‌ కేసులు, 3 చెక్‌బౌన్స్‌ కేసులున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏ–2గా కొల్లి ఉన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన సమయంలో కై కలూరులో చెలరేగిపోతాడు. గతేడాది కూటమి అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హయాంలో చేసిన పనులకు సంబంధించిన శిలాఫలకాల తొలగింపుతో దౌర్జన్యకాండ మొదలుపెట్టాడు. మార్చి 27న కై కలూరు వైస్‌ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా భుజబలపట్నంలో ఎంపీటీసీ ఇంటి వద్ద జరిగిన ఘర్షణను చిత్రీకరిస్తున్న స్థానిక జర్నలిస్టు కురెళ్ళ కిషోర్‌పై బాబి, అతని అనుచరులు దాడి చేశారు. ఆ తరువాత టీడీపీకి చెందిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పైడిమర్రి మాల్యాద్రి కార్యాలయంపై జరిగిన దాడి కొల్లి డైరెక్షన్‌లో జరిగినట్లు ఆరోపణలున్నాయి. కై కలూరులో కాల్‌మనీ కేసులో దంపతులపై దాడి, ఫ్లెక్సీ ప్రింటింగ్‌ డబ్బులు అడిగినందుకు షాపు యజమానిని భయపెట్టిన సంఘటన, మార్కెట్‌ సమీపంలోని ఓ ఎలక్ట్రికల్‌ షాపుపై దాడి చేసి షాపు తాళాలు వేసిన ఘటన ఇలా చాలా ఘటనల్లో అతని ప్రమేయముంది. ప్రేమ పెళ్లి చేసుకుని తిరిగి వస్తున్న ప్రేమ జంటపై దాడి చేయడం, అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిపై దాడి ఘటన, ఏలూరుకు చెందిన జర్నలిస్టు ఉర్ల శ్రీనివాస్‌ కారును అవసరాలకు తీసుకుని అమ్మేసిన ఘటన, సంతమార్కెట్‌ వద్ద విశ్రాంత రైల్వే ఉద్యోగిపై దాడి ఇలా అనేక ఘటనల్లో కీలక వ్యక్తి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కామినేని అండతో అక్రమ మైనింగ్‌, మద్యం విక్రయాలతో పాటు పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాడు.

Politics

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆకాంక్షించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ అని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ తన పోరును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

    తెలంగాణ భవన్‌లో జరిగిన సెప్టెంబర్ 17 వేడుకల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ రాజ్యాన్ని సాధించేందుకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సెప్టెంబరు 17వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ బిడ్డలు రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజని అన్నారు. ఈ రోజును విమోచనమని అన్నా, విలీనమని అన్నా ఆనాటి రాచరిక వ్యవస్థపై  పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన దినం అన్నది వాస్తవమని చెప్పారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీఆర్‌ఎస్‌ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.

    ఈ సందర్భంగా కేటీఆర్‌..‘తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం.. అన్నింటినీ తెలంగాణ చూసింది’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని గ్రూప్-1 విద్యార్థులు తమ ఆకాంక్షను వ్యక్తం చేసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో దాడి చేసిందని విమర్శించారు.

    రాష్ట్రంలో ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ తన పోరును కొనసాగిస్తుందని, సెప్టెంబరు 17వ తేదీని సమైక్య దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. పార్టీ సీనియర్‌ నేతలు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  • ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్‌ మెషీన్‌లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ విభాగం అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ.. 

    వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్‌ షాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై  ధ్వజమెత్తేవారు. 

    అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక  బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది. 

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.

    జగన్ టైమ్‌లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన  వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్  రూమ్‌లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని  గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్  మీడియాను  అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన  అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు  అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప  ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు. 

    ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను  గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్‌లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర  ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి  మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు.  

    2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్‌ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను  ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..

    రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని  ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్‌తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. 

    ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం  చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్‌ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో  తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..

    :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

  • సాక్షి, ఎన్టీఆర్ జిల్లా:  చంద్రబాబు హయాంలో గాలి, నీరు.. మొత్తం కలుషితం అయిపోతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మూలపాడు డంప్‌ నుంచి టీడీపీ నేతల బూడిద అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఆందోళన చేపట్టిన ఆయన్ని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. భవానిపురం పీఎస్‌ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

    చంద్రబాబు వస్తే ఏ సంస్థ అయిన ప్రవేట్ అవ్వాల్సిందే. బూడిద(ఫ్లై యాష్‌) టెండర్ ఒక వింగ్‌గా చేసి లోకేష్ కనుసన్నల్లో ప్రవేట్ చేసేశారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు నీరు, గాలి మొత్తం కలుషితం అయ్యింది. ప్రజలు, థర్మల్‌ ప్లాంట్లలో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. వెరసి..  ఇబ్రహీంపట్నం మరో ఉద్దానం గా మారింది. అందుకే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం.

    ఇబ్రహీంపట్నం నుంచి అక్రమంగా బూడిద నిలువ చేసి హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరితే.. అధికారులు మమ్మల్నే అరెస్ట్‌ చేస్తున్నారు. కనీసం చంద్రబాబైనా స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొంటారా?. వీటీపీఎస్‌లో బూడిద టెండర్లు తక్షణమే రద్దు చేయాలి. కాలుష్యం భరితంగా మారిగా గ్రామాలను ఆదుకోవాలి. మొక్కలు నాటించి.. చెట్ల సంరక్షణ కొనసాగించాలి. అక్రమ డంప్‌ని ప్రభుత్వం చేసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తాం అని జోగి రమేష్‌ అన్నారు. ఇదిలా ఉంటే.. 

    బూడిద రాజకీయాలు ఎన్టీఆర్‌ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను(Ash Mafia) అడ్డుకునేందుకు జోగి రమేష్‌ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. బుధవారం మూలపాడులో బూడిద డంప్‌ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరింపజేసింది. మరోవైపు.. 

    మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.. తమను అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్‌ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

    జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు

    బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అక్రమార్జన చేశారన్నది జోగి రమేష్‌ చెబుతోంది. అంతేకాదు అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారాయన. అయితే.. జోగి రమేష్‌ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్‌ ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో అక్కడ రాజకీయ అలజడి రేగింది.

Narayanpet

  • ఉద్యమానికి ఊపిరి..

    త్మకూర్‌ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్‌ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్‌నగర్‌ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్‌, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్‌ కిష్టన్న, హరిజన్‌ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్‌రెడ్డి, వడ్డేమాన్‌ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్‌ వేసి జైలులో నిర్బంధించారు.

  • నాయకత

    మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు.

    – అంజన్న,

    ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి

    పోరాటంలో ఎంతో పాత్ర..

    తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్‌, తెలుగు ఆశన్న, దాసర్‌పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్‌ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు.

    – సాయిలు, రిటైర్డ్‌ టీచర్‌, అప్పంపల్లి

  • సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు

    చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం..

    జాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    తల్లడిల్లిన అప్పంపల్లి

    అమరవీరులకు గుర్తింపేది?

  • మహిళా

    రేపటి నుంచి అక్టోబర్‌ 2 వరకు ప్రత్యేక వైద్యశిబిరాలు

    ప్రతి రోజు మూడు మండలాల్లో స్పెషలిస్టులతో పరీక్షలు

    నర్వ: నిత్యం ఇంటా బయట పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళల ఆరోగ్యానికి మరింత భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాస్థ్‌ నారీ.. సశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో భాగంగా ప్రతి మహిళకు అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 17నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు వైద్యశిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ మా కార్యక్రమానికి అనుసంధానంగా మహిళలకు వైద్యపరీక్షలు నిర్వహించి.. అనారోగ్య సమస్యలను గుర్తించనున్నారు. వారికి అవసరమైన మందులు అందించడంతో పాటు మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు పంపించనున్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    నిర్వహించే పరీక్షలు..

    వైద్య కళాశాలల్లో పనిచేసే గైనకాలజీ, కంటి, చెవి, ముక్కు గొంతు, చర్మ, మానసిక, దంత వైద్యనిపుణులు పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్‌), క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ (ఓరల్‌, బ్రెస్ట్‌, సర్వైకల్‌), టీబీ పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళలకు రక్తహీనత సమస్య ఉంటున్నందున.. దీనిపై యుక్త వయసులోని అమ్మాయిలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గిరిజన తండాల్లో సికిల్‌ సెల్‌, ఎనీమియా పరీక్షలు చేసి, తగిన జాగ్రత్తలు వివరిస్తారు.

    సద్వినియోగం చేసుకోవాలి..

    జిల్లాలో 15 రోజులపాటు మహిళల ఆరోగ్య సంరక్షణకు నిర్వహించే వైద్యశిబిరాల ను సద్వినియోగం చేసుకోవాలి. శిబిరాల్లో టీబీ, బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, తలసేమియా, సికిల్‌ సెల్‌, ఎనీమియా వంటి పరీక్షలు నిర్వహించి.. తగిన మందులు ఇస్తారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తారు. దీంతో పాటు రక్తదాన శిబిరాలు, టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమాల ద్వారా దాతలచే పౌష్టికాహారం అందిస్తారు.

    – జయచంద్రమోహన్‌, డీఎంహెచ్‌ఓ

  • యూరియ

    టోకెన్లకు సైతం ఇబ్బందులుతప్పడం లేదని ఆందోళన

    పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్‌

    నారాయణపేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. యూరియా దొరక్క కొందరు, టోకెన్లు లభించక మరికొందరు రైతులు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా – బస్టాండ్‌ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా కోసం నిత్యం అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. యూరియా, టోకెన్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా దొరకడం లేదని వాపోయారు. వానాకాలంలో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో ఎదగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ రాములు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

    అరకొర పంపిణీపై ఆగ్రహం

    నారాయణపేట రూరల్‌: మండలంలోని సింగారం రైతువేదికలో అరకొరగా యూరియా టోకెన్లు పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజామునే నారాయణపేటలోని పీఏసీఎస్‌ కార్యాలయానికి యూరియా కోసం వెళ్లారు. అయితే తమ క్లస్టర్‌ పరిధిలోని రైతువేదికల్లోనే టోకెన్లు ఇస్తారని అధికారులు చెప్పడంతో సింగారం రైతువేదిక వద్దకు చేరుకొని బారులు తీరారు. ఈ క్రమంలో ఏఈఓ అనిల్‌కుమార్‌ కేవలం 50 టోకెన్లు ఇచ్చి వెళ్లిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఏఓ దినకర్‌ స్పందిస్తూ.. యూరియా స్టాక్‌ మేరకు రైతులకు టోకెన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

  • నారాయణపేట/నారాయణపేట రూరల్‌: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరై జాతీయ పతాకం ఆవిష్కరిస్తారని తెలిపారు. వేడుకల నిర్వహణలో భాగంగా అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, కలెక్టరేట్‌ ఏఓ జయసుధ, ఆర్డీఓ రామచందర్‌ నాయక్‌, డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు ఉన్నారు.

    ● ఇటీవల శ్రీహరి కోట (ఇస్రో)ను సందర్శించిన ఉపాధ్యాయులు అక్కడి విషయాలను తమ పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. జిల్లా సైన్స్‌ ఫోరం సభ్యులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెన్స్‌ ఫోరం మరింత సమర్థవంతంగా పనిచేయాలని.. శాస్త్ర సాంకేతిక నైపుణ్యలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగేలా కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్‌ వారికి సూచించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, సైన్స్‌ ఫోరం సభ్యులు వార్ల మల్లేశం, రాములు, యాదయ్యశెట్టి పాల్గొన్నారు.

    ‘విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దు’

    నారాయణపేట రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటోందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌ అన్నారు. స్థానిక భగత్‌సింగ్‌ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకానికి ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అజయ్‌, వెంకటేశ్‌, సురేశ్‌, రాజు, గణేశ్‌, అనూష, పౌర్ణమి, అనురాధ, శివకుమారి, సుధాకర్‌ ఉన్నారు.

    వేరుశనగ @ రూ.4,110

    గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 159 క్వింటాళ్ల విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌ గరిష్టంగా రూ. 4,110, కనిష్టంగా రూ. 2,719 ధరలు లభించాయి. అదే విధంగా 56 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,539, సరాసరి రూ. 6059 ధరలు వచ్చాయి.

  • పేట–కొడంగల్‌ భూసేకరణ ప్రక్రియ వేగవంతం

    రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

    మక్తల్‌: నారాయణపేట–మక్తల్‌–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్‌ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి రాంలీలా మైదానంలో చేపట్టిన కోనేరు ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ.4,500 కోట్లతో పేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం పూర్తయితే నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో 1.25లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. మక్తల్‌ సెగ్మెంట్‌లో 800 ఎకరాలకు గాను 600 ఎకరాలకు రైతులు ఒప్పంద పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. మిగతా రైతుల నుంచి ఒప్పంద పత్రాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పథకం పనులు ప్రారంభిస్తామన్నారు. కాగా, మక్తల్‌లో పడమటి ఆంజనేయస్వామి జాతరలోగా కోనేరు ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. అతి పురాతనమైన కోనేరును సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రాణేశ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గణేశ్‌కుమార్‌, కావలి తాయప్ప, రవికుమార్‌, ఈఓ శ్యాంసుందర్‌ ఆచారి, రవికుమార్‌, కట్ట సురేశ్‌, నాగశివ, హేమసుందర్‌, అరవిందు, డీవీ చారి పాల్గొన్నారు.

  • నా జీవితం ప్రజా సేవకు పునరంకితం

    నారాయణపేట: తన జీవితం ప్రజా సేవకే పునరంకితమని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని లింగయ్య, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని శివకుమార్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేశారు. పేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు అందించే పరిహారాన్ని రూ. 20లక్షలకు పెంచిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత బిడ్డ రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే భూ నిర్వాసితులకు ఎకరానికి రూ. 20లక్షలకు పరిహారం పెంచడంతో పాటు మరో రూ. 300కోట్ల ప్రాజెక్టుకు ఎక్కువ అయినా సాధించడం జరిగిందన్నారు. అదే విధంగా వికారాబాద్‌–కృష్ణా రైల్వేలైన్‌ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి దృఢ సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేయించినట్లు చెప్పారు. జాయమ్మ చెరువుకు సాగునీరు తీసుకురావడం సీఎన్‌ఆర్‌ కల అని.. నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపేందుకు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పర్ణికారెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి స్పీకర్‌ సీటులో కూర్చొబెట్టడమే తన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌.శివారెడ్డి, వైస్‌చైర్మన్‌ కొనంగేరి హన్మంతు, మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్‌, సరాఫ్‌ నాగరాజు, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కోట్ల రవీందర్‌రెడ్డి, నాయకులు రాజీరె డ్డి, రఘుబాబు, ఎండీ సలీం పాల్గొన్నారు.

  • అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం

    అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్‌ 12న నిజాం నవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

    స్మరించుకోని పాలకులు..

    నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం.

Nagarkurnool

  • సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు

    చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం..

    జాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    తల్లడిల్లిన అప్పంపల్లి

    అమరవీరులకు గుర్తింపేది?

  • డిజిటల్‌ లైబ్రరీనివినియోగించుకోవాలి

    నాగర్‌కర్నూల్‌: పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత డిజిటల్‌ లైబ్రరీని వినియోగించుకోవాలని ఎంపీ మల్లు రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్‌ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ రాజేష్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌తో కలిసి ఎంపీ డిజిటల్‌ లైబ్రరీని ప్రారంభించారు. సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి యూనియన్‌ బ్యాంక్‌ సౌజన్యంతో ప్రత్యేకంగా రూ.3.67 లక్షలతో డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మల్లు రవి మాట్లాడుతూ పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్‌ను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్‌ లైబ్రరీ తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

    అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం

    జిల్లాలో ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, సీఎస్‌ఆర్‌ నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల నమోదును వంద శాతం పూర్తి చేయాలని ఎంపీ మల్లు రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ నిధుల అభివృద్ధి పనుల పురోగతి, సీఎస్‌ఆర్‌ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రహదారులు, భవనాలు, పాఠశాలలు, వసతిగృహాలు వంటి అన్ని పనులను వేగంగా పెంచాలన్నారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతిగృహాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సేకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దేవ సహాయం ఉన్నారు.

  • అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం

    అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్‌ 12న నిజాంనవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతి రేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

    స్మరించుకోని పాలకులు..

    నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం.

  • ఉద్యమానికి ఊపిరి..

    త్మకూర్‌ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్‌ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్‌నగర్‌ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్‌, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్‌ కిష్టన్న, హరిజన్‌ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్‌రెడ్డి, వడ్డేమాన్‌ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్‌ వేసి జైలులో నిర్బంధించారు.

  • నాయకత

    మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు.

    – అంజన్న,

    ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి

    పోరాటంలో ఎంతో పాత్ర..

    తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్‌, తెలుగు ఆశన్న, దాసర్‌పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్‌ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు.

    – సాయిలు, రిటైర్డ్‌ టీచర్‌, అప్పంపల్లి

Mahabubnagar

  • ఉవ్వె

    నారాయణపేట: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు సాగించిన పోరులో నా రాయణపేట ఆర్యసమాజ్‌ కీలకపాత్ర పోషించింది. 1947–49 కాలంలో కర్రలు, కత్తులే ప్రధాన ఆయుధాలుగా ఉద్యమాలు కొనసాగించారు. రజాకార్లు ఉద్యమ నేతలను తుపాకులతో కాల్చి చంపడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఉమ్మడి పాలమూరులో ఎంతోమంది పోరాట యోధులను జైలుకు పంపి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. 1948 సంవత్సరానికి ముందు జిల్లాలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగా యి. ప్రజల్లో వచ్చిన చైతన్యంతో నిజాం పాలకులు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లినట్టు ప్రచారం జరు గుతోంది.

    ఖాసీం రజ్వీ పాలనలో..

    అప్పట్లో ఖాసీం రజ్వీ అనే రజాకారు నారాయణ పేట ప్రాంతంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకొని మతమార్పిడి చేసేందుకు పూనుకోవడంతో ఉద్యమాలు జరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. మొదట్లో మతమార్పిడి కొంతమేర జరిగినా.. తర్వాతి కాలంలో ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆర్యసమాజ్‌ నేతృత్వంలో పెద్దఎత్తున పోరాటాలు చేశా రు. కాలక్రమేణ స్వాతంత్య్రం కోసం రజాకర్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. తమ వద్ద పదునైన ఆయుధాలు లేకపోవడంతో కత్తి, కర్ర సా ములో యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు.

    యజ్ఞంతో ఏకం చేస్తూ..

    ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో తృతీయ మహాసభల పేరిట గ్రామీణ ప్రాంతాల్లో యజ్ఞం పేరుతో అందరిని ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఉద్యమాలు కొనసాగించారు. ఆ సమయంలో ఆర్యసమాజ్‌ సభలు, స మావేశాలు నిర్వహించేందుకు నిజాం పాలకులు అ నుమతినిచ్చే వారు కాదు. లోక కల్యాణార్థం మహారాష్ట్రాలోని సోలాపూర్‌ ఆర్యసమాజ్‌ కేంద్రంగా గ్రామాల్లో ప్రత్యేకంగా యజ్ఞాలు నిర్వహిస్తున్నట్లు నిజాం పాలకులను నమ్మించడంలో సఫలీకృతులయ్యారు. యజ్ఞాల పేరిట ప్రజలను ఒకచోట చేర్చి అవసరమైన ప్రణాళికలు రూపొందించారు.

    సుండికే వారి ఇంటి నుంచే పాలన..

    నారాయణపేట దర్గా రోడ్‌లోని సుండికే వారి ఇంటి నుంచే రజాకార్లు పాలన సాగించినట్లు పెద్దలు చెబుతున్నారు. ఇక్కడే ఉంటూ తమకు వ్యతిరేకంగా ఎవరు ఉద్యమించినా అక్కడికి తీసుకెళ్లి శిక్షించే వారన్నారు. ప్రాణాలను లైక్కచేయక జైలులో ఉండి అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు.

    వేలాదిగా తరలివచ్చిన యువత..

    1944లో నిజాం పాలనకు వ్యతిరేకంగా నారాయణపేటలో హైదరాబాద్‌కు చెందిన సూరజ్‌ చంద్రోజీ, పండిత్‌ నరేంద్రజీ, నారాయణపేటకు చెందిన రాంచందర్‌రావు కల్యాణి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ర్యాలీ అనంతరం స్థానిక శాతవాహనకాలనీ ప్రాంతంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఉద్యమకారులు ప్రతిపాదించారు. ర్యాలీకి నిజాం పాలకులు అనుమతి ఇవ్వకపోవడంతో మొదట్లో అంతంత మాత్రంగా వచ్చిన జనం తర్వాత కట్టలు తెగిన ఉత్సాహంతో తరలివచ్చి నిజాం పాలకులకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు.

    కత్తులు కర్రలే ఆయుధాలుగా ఆర్యసమాజ్‌ పోరాటం

    మతమార్పిడికి వ్యతిరేకంగా

    కదనరంగంలోకి

    1944లో నారాయణపేటలో భారీ ర్యాలీ

    సుండికే వారి ఇంటి నుంచే

    రజాకార్ల పాలన

  • ఉత్సవ

    నిజాం కాలంలో వందలాది మంది ని బందీలుగా తీ సుకువచ్చి నాటి కాలాపాని జైలు లో ఉంచేవారు. నాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న జై లుఖానాపై ప్రభుత్వం దృష్టిపెట్టి స్మారకంగా అభివృద్ధి చేయాలి. సెప్టెంబర్‌ 17న అధికారికంగా జైలు ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహించాలి.

    – సంబు వెంకటరమణ, వీహెచ్‌పీ

    జిల్లా ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌

    నేటి తరానికి తెలిసేలా..

    నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని మన్న నూర్‌ జైలులో శిక్షించారు. ఇక్కడి కాలా పాని నీళ్లు తాగితే సచ్చిపోతారని ఉద్యమకారుల ను భయపెట్టేవారు. జైలు చరిత్రను నేటి తరానికి తెలిసేలా, వెలుగులోకి తెచ్చేలా అభివృద్ధి చేయాలి.

    – తుమ్మల నారాయణరెడ్డి,

    మన్ననూర్‌

  • డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో వినూత్న తీర్పు

    మహబూబ్‌నగర్‌ క్రైం: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుడికి న్యాయమూర్తి వినూత్నంగా శిక్ష విధించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు గత నెల 24న జిల్లాకేంద్రం సమీపంలోని బోయపల్లి మార్గంలో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టణంలోని మోతీనగర్‌కు చెందిన రాఘవేందర్‌ మద్యం తాగి ద్విచక్రవాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో మంగళవారం వాహనదారుడు రాఘవేందర్‌ను కోర్టులో హాజరుపరచగా 2వ తరగతి కోర్టు స్పెషల్‌ న్యాయమూర్తి డి.నిర్మల వాహనదారుడికి రెండు రోజుల సామాజిక సేవతోపాటు రూ.2 వేల జరిమానా విధించారు. సామాజిక సేవలో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపితే వచ్చే అనర్థాలపై ప్లకార్డులు పట్టుకొని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు అవగాహన కల్పించాలని తీర్పు చెప్పారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు రాఘవేందర్‌తో జిల్లాకేంద్రంలోని సుభాష్‌చంద్రబోస్‌ చౌరస్తాలో ప్లకార్డులు ప్రదర్శింపజేశారు.

  • వరంగల్‌ జైలులో 50 రోజులు ఉన్నా..

    నవాబుపేట: సాయుధ పోరాటంలో విద్యార్థిదశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. తరగతిగదిలో సైతం తెలంగాణ విషయంలో ఎక్కువగా వాదిస్తే అణచివేత ఉండేది. రాజాకార్ల సైన్యం ప్రయాణించే బస్సును నిలిపివేసి దహనం చేశాం. ఈ ఘటనలో నాతో పాటు చాలామందిపై కేసులు నమోదు చేశారు. వారం పాటు వెతికి చివరకు అరె స్టు చేిశారు. 50 రోజుల పాటు వరంగల్‌ జైలులో ఉన్నా. అనంతరం బెయిల్‌పై వచ్చినా ఉద్యమ పంఽథా వీడ లేదు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి పొందిన సమయంలో నాకు 27 ఏళ్లు. అప్పటి సంతోషం, సంబురం చెప్పలేనివి.

    – రంగారావు, నవాబుపేట

  • బైక్‌ అదుపు తప్పి  వ్యక్తి దుర్మరణం

    మిడ్జిల్‌: బైక్‌ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలోని కొత్తపల్లి సమీపంలోని జాతీయ రహదారి పై చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మిడ్జిల్‌ మండలంలోని చిల్వేర్‌కు చెందిన జక్కా అనిల్‌కుమార్‌(30) పనిమీద జడ్చర్లకు మోటార్‌సైకిల్‌పై వెళ్తూ కొత్తపల్లి సమీపంలో అదుపుతప్పి రోడ్డుపైన నిలిచి ఉన్న బొలేరోను ఢీకొట్టడంతో బలమైన గాయాలలై అక్కడికక్కడె మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయడు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

    రోడ్డు ప్రమాదంలో

    వ్యక్తి మృతి

    వనపర్తి రూరల్‌: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాజపేట వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

    డ్రంకెన్‌డ్రైవ్‌లో

    లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష

    మహబూబ్‌నగర్‌ క్రైం: మద్యం తాగి వాహనం నడిపిన లారీ డ్రైవర్‌కు న్యాయమూర్తి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ శీనయ్య ఆధ్వర్యంలో చేసిన డ్రంకన్‌డ్రైవ్‌లో లారీ డ్రైవర్‌ బెస్త మహేశ్‌ మద్యం తాగి లారీ నడుపుతున్నట్లు గుర్తించారు. అతనికి బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా చేసిన పరీక్షల్లో ఏకంగా 550శాతం ఆల్కహాల్‌ తాగినట్లు నిర్ధారణ కావడంతో మంగళవారం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి నిర్మల లారీ డ్రైవర్‌ మహేశ్‌కు రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు. దీంతో వన్‌టౌన్‌ పోలీసులు సదరు వ్యక్తిని జిల్లా జైలుకు తరలించారు.

    తాళం వేసిన ఇంట్లో చోరీ

    కేటీదొడ్డి: ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి చోరీ చేసిన ఘటన మండలంలోని చింతలకుంట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గుడిసె ఆంజనేయులు మంగవారం ఇంటికి తా ళం వేసి పొలానికి వెళ్లాడు. సాయంత్రం పను లు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా తా ళం పగులగొట్టి తలుపులు తెరిచి ఉండాటాన్ని గమనించాడు. బీరువా పగులకొట్టి రెండు తులాలున్నార బంగారం, వెండి, నగదు చోరీ జరిగినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

    గుర్తు తెలియని

    మృతదేహం లభ్యం

    ఆత్మకూర్‌: మండలపరిధిలోని జూరాల గ్రామశివారులోని కృష్ణనది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు. మంగళవారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా మృతదేహం కనిపించడంతో సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో దాదాపు 10 నుంచి 15 రోజుల క్రితం వరదనీటిలో కొట్టుకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆనవాళ్లు తెలసిన వారు ఎవరైనా ఉంటే ఆత్మకూర్‌ పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.

    డీసీఎం బైక్‌ ఢీ:

    యువకుడికి గాయాలు

    వీపనగండ్ల: మండల కేంద్రానికి సమీపంలోని గోవర్ధనగిరి రహదారిలో మంగళవారం సా యంత్రం డీసీఎం, బైక్‌ ఢీకొన్న ఘటనలో బొల్లారానికి చెందిన కుందేళ్ల నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. కొల్లాపూర్‌ నుంచి పెబ్బేర్‌కు వెళ్తున్న డీసీఎం పల్లె ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఫొటోగ్రాఫర్‌ నాగరాజు మోకాలికి బలమైన గాయం కావడంతో 108లో పెబ్బేరు ఆస్పత్రికి తరలించారు.

    లారీ, కారు ఢీ

    వనపర్తి రూరల్‌: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలైన సంఘటన పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపి న వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌ నుంచి బెంగూళూర్‌కు బయలు దేరాడు. మార్గమధ్యలో పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుకాల వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. కారులో బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో డ్రైవింగ్‌ చేస్తున్న సతీష్‌ చంద్ర, పక్క సీటులో కూర్చున్న యశ్వంత్‌ చంద్రకు రక్తగాయాలయ్యాయి. బాధితుడు అన్నపురెడ్డి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

  • జూరాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

    ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత

    ఆరు యూనిట్లలో కొనసాగుతున్న

    విద్యుదుత్పత్తి

    ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 1,18,500 క్యూసెక్కులకు తగ్గినట్లు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 83,484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల్లో ఒక పంప్‌ను ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తున్నారు. జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రంలో ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తునట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. విద్యుదుద్పత్తి కోసం 37,008, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 46, భీమా లిఫ్టు–1కు 650, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 490, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,22,978 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు.

    నిరంతరాయంగా విద్యుదుత్పత్తి

    ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్నాటక నుంచి వరద భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు మంగళవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 334.026 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 359.114 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 693.140 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు పేర్కొన్నారు.

  • గద్దర

    జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా కేంద్రంలో ప్రజాయుద్ధనౌక, తెలంగాణ ఉద్యమ కారుడు గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాల విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా యుద్ధనౌక గద్దర్‌ విగ్రహ ఏర్పాటు కమిటీ కన్వీనర్‌ గోపాల్‌, కో కన్వీనర్లు కృష్ణముదిరాజ్‌, మైత్రియాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గద్దర్‌ సాంస్కృతి ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. అలాంటి వ్యక్తి ఆశయాలు భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు పరిచయం చేయడం కోసం జిల్లా కేంద్రంలో గద్దర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కోకన్వీనర్లు ప్రవీన్‌, గోపాల్‌, రవికిరన్‌, మురళి, చందుయాదవ్‌, శ్రీనివాస్‌, శ్రీను, వెంకట్‌స్వామి, సంజీవ్‌, తిరుపతయ్య, రామలింగం పాల్గొన్నారు.

    పీయూ ఈసీ

    హెచ్‌ఓడీగా రామరాజు

    మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనిర్సిటీలో నూతనంగా ప్రారంభించిన ఇంజినీరింగ్‌ కళాశాల హెచ్‌ఓడీగా పండగ రామరాజు నియమిస్తూ వీసీ శ్రీనివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రామరాజు మాస్టర్‌ డిగ్రీ ఓయూ నుంచి, పీహెచ్‌డీ బిట్స్‌ పిలానీ, ఐఐఐటీ మద్రాస్‌లో పోస్టు డాక్టోరల్‌ ఫెల్లోషిప్‌ను పూర్తి చేసి, పీయూలో ఇటీవల అధ్యాపకుడిగా చేరారు. హెచ్‌ఓడీగా నియమించినందుకు వీసీకి రామరాజు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేశ్‌బాబు, ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌ పాల్గొన్నారు.

    కలెక్టర్‌కు ఆహ్వానం..

    మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో వచ్చే నెల 16న నిర్వహించే స్నాతకోత్సవ కార్యక్రమానికి రావాలని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిరకు వీసీ శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు ఆహ్వాన పత్రిక అందజేశారు.

    వ్యక్తి అదృశ్యం..

    కేసు నమోదు

    తెలకపల్లి: వ్యక్తి అదృశ్యమైన ఘటనపై మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన అజమోని వెంకటేష్‌ (31) చేపల వ్యాపారంలో నష్టపోయాడు. ఈ నెల 13న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లాడు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో అతని తల్లి అజమోని తిరుపతమ్మ ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

  • జక్లే

    రజాకార్లు గ్రామాల్లో మహిళలపై చేస్తున్న ఆకృత్యాలు, ఇళ్లలో చేస్తున్న దోపిడీలను సహించలేక జక్లేర్‌కు చెందిన కిషన్‌రావు, శ్రీనివాసరావు, ఉత్తం వెంకప్ప తిరుగుబాటు చేయడంతో వారిని బంధించి గుల్బర్గ జైలుకు తరలించారు. 1947, ఆగస్టు నుంచి 1948, జూన్‌ వరకు సుమారు 11 నెలలు జైలులోనే ఉండగా.. విడుదలైన తర్వాత ఆదోని క్యాంపునకు తరలించారు. 1952 తర్వాత జక్లేర్‌ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ జెండా ఎగురవేసి 3 రోజుల పాటు 5వ మహాసభలు నిర్వహించారు.

    మక్తల్‌: భారతదేశంలో వి లీనం చేసేందుకు ఏ డో ని జాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఒప్పుకోకపోవడంతో బానిస సంకెళ్ల నుంచి తెలంగాణాకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో మక్తల్‌ నియోజ కవర్గంలో ఉన్న నారాయణపేటకు చెందిన న్యా యవాది రాఘవేందర్‌రావు పోరాటం సాగించారు. నిజాం వ్యతిరేక పోరాటానికి అప్పటి కాంగ్రెస్‌పార్టీ పిలుపునివ్వడంతో ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 300 మంది స్వాత్రంత్య్ర సమరయోధులు ముందుకురాగా.. వారికి రాఘవేందర్‌రావు నాయకత్వం వహించారు. ఆయన తన అనుచరులతో పోలీస్‌స్టేషన్లపై దాడులు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాలు ఎత్తుకెళ్లడంతో పాటు భూమి పన్ను చెల్లించరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. రాఘవేందర్‌రావును పట్టుకుంటే 5 వేల ఉస్మానియా చిక్కా నజరానా ఇస్తామని నిజాం పాలకులు ప్రకటించారు. అయినా చిక్కకపోవడంతో ఆయన తమ్ముడు శ్రీనివాసరావును అరెస్టు చేసి జైలులో బంధించారు. అప్ప టి నుంచి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రాఘవేందర్‌రావు పనితీరును పలువురు అభినందించారు. ప్రాణాలను లెక్కచేయకుండా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పేటలోనే ఉమ్మడి జిల్లా 4వ సదస్సు నిర్వహించారు. 1999, మే 22న రాఘవేందర్‌రావు మృతిచెందారు.

    కిషన్‌రావు

    శ్రీనివాసరావు

  • సమయాన్ని వృథా చేసుకోవద్దు

    నాగర్‌కర్నూల్‌: విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎంపీ మల్లురవి అన్నారు. పట్టణంలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్‌ బాలికల గురుకుల పాఠశాలలో సీఎస్‌ఆర్‌ నిధులతో ఎస్‌బీఐ బ్యాంక్‌ సౌజన్యంతో రూ.6.70 లక్షలతో నిర్మించిన మూత్రశాలలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో స్టోర్‌ రూం, మెనూ చార్టు పరిశీలించారు. ఎంపీకి ఆహార నాణ్యతపై వివరాలను ప్రిన్సిపాల్‌ వివరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఎంపీ సహపంక్తి భోజనం చేస్తూ వారితో ముచ్చటించారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఎంపీ వివరించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. అందుకు అనుగుణంగానే మెస్‌ చార్జీలను 40 శాతం పెంచిందన్నారు. విద్యాభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ దృష్టితోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీ సుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యే డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మావిళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, యూనియన్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌మూర్తి, బ్యాంక్‌ అధికారులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

  • వీరభద్రా.. మంగళం

    మన్యంకొండలో వైభవంగా అగ్నిగుండ

    మహోత్సవం

    ముగిసిన వీరభద్రస్వామి ఉత్సవం

    మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న శ్రీవీరభద్రస్వామి అగ్నిగుండం కార్యక్రమం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా దేవస్థానం ఎదుట అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి సంకీర్తనలు ఆలపిస్తూ నందికోళ సేవ చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహంతో దేవస్థానం నుంచి సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు చేశారు. తిరిగి స్వామిని దేవస్థానం ఎదుట ఉన్న అగ్నిగుండం ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అగ్నిగుండంపై నడిచి భక్తిని చాటుకున్నారు. అనంతరం అగ్ని గుండానికి మహా మంగళహారతి పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

  • విద్యుత్‌ కార్మికుల పక్షాన పోరాడుతాం

    1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా

    జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌) : విద్యుత్‌ కార్మికుల పక్షాన యూనియన్లు నిరంతరం పోరాటం చేయాలని విద్యుత్‌ ఉద్యోగుల 1104 యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. మంగళవారం స్థానిక జేజేఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో విద్యుత్‌ ఎంప్లాయీస్‌ 1104 సర్కిల్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చిన వారి తరఫున పోరాటం చేయాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడిన నాడే యూనియన్లకు మనుగడ ఉంటుందన్నారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు, కార్మికులకు తాము అండగా ఉంటామని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఏ సమస్య వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికై న నూతన అధ్యక్ష కార్యదర్శులు కార్మికుల సమస్యలు తెలుసుకుని ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోగా జిల్లా అధ్యక్షుడిగా స్వామి, జిల్లా కార్యదర్శిగా పాండు, అదనపు కార్యదర్శిగా సోమేష్‌లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఉద్యోగుల 1104 యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌, టీజీఎస్పీడీసీఎల్‌ డిస్కం అదనపు కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, వెంకన్న, జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • ఉద్యమానికి ఊపిరి..

    త్మకూర్‌ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్‌ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్‌నగర్‌ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్‌, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్‌ కిష్టన్న, హరిజన్‌ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్‌రెడ్డి, వడ్డేమాన్‌ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్‌ వేసి జైలులో నిర్బంధించారు.

  • నాయకత

    మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు.

    – అంజన్న,

    ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి

    పోరాటంలో ఎంతో పాత్ర..

    తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్‌, తెలుగు ఆశన్న, దాసర్‌పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్‌ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు.

    – సాయిలు, రిటైర్డ్‌ టీచర్‌, అప్పంపల్లి

  • చిన్నారులపై ప్రత్యేక దృష్టి

    చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న మాసో త్సవాన్ని సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటాం. వయస్సుకు తగ్గట్టుగా బరువు లేని ప్రతిఒక్క చిన్నారులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. అలాగే నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం.

    – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి

  • సమతుల

    నేటి నుంచి పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవం

    మాతాశిశు సంరక్షణపై ప్రభుత్వం దృష్టి

    నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు

    పథకాల సద్వినియోగంపై అవగాహన

    ఐసీడీఎస్‌

    ప్రాజెక్టులు

    4

    అంగన్‌వాడీ కేంద్రాలు

    1,184

    చిన్నారులు

    57,379

    బాలింతలు

    7,792

    గర్భిణులు

    6,741

    మహబూబ్‌నగర్‌ రూరల్‌: మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం ప్రతి సంవత్సరం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిశీలనకు పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం ద్వారా మాసోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం నుంచి వచ్చేనెల 16 వరకు సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై సూచనలు ఇవ్వడంతో పాటు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు అంచనా వేస్తుంటారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తుంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు ఆరోగ్యంపై సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా నిర్వహిస్తున్న పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాలు పండుగ వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.

    ఇవీ కార్యక్రమాలు..

    మొదటి వారంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లులతో పిల్లల పోషణపై సలహా సమావేశం ఉంటుంది. మహిళలతోపాటు పురుషులకు వంటల పోటీలు నిర్వహిస్తారు. బాలికలు, మహిళలకు బీఎంఐ పరీక్షలు, పిల్లల బరువు, ఎత్తు కొలిచి పోషకాహారంపై ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయిస్తారు. స్థానిక ఉత్పత్తుల గురించి అవగాహన కల్పిస్తారు.

    రెండో వారంలో భాగంగా బిడ్డకు అందించే ముర్రుపాల విశిష్టత, అనుబంధ ఆహారంతోపాటు ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. పోషణలో తండ్రుల భాగస్వామ్యం, బిడ్డ మొదటి వెయ్యి రోజుల్లో మెదడు అభివృద్ధి గురించి వివరిస్తారు.

    మూడో వారంలో భాగంగా అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆకలి పరీక్షలు నిర్వహిస్తారు. గ్రోత్‌ మానిటరింగ్‌లో హాజరుకాని పిల్లల బరువు, ఎత్తు కొలుస్తారు. పోషణ లోపం ఉన్న పిల్లల ఇళ్లకు ఆశాలు వెళ్లి వివరాలను సేకరిస్తారు.

    నాలుగో వారంలో మంచినీరు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, తక్కువ చక్కెర, నూనెలతో తయారు చేసే వంటకాలను ప్రదర్శిస్తారు. ప్లాస్టిక్‌ సంచులు, వ్యర్థాల నిర్వహణ గురించి వివరిస్తారు. పాఠశాలల్లో వ్యాసరచన, క్రీడా, బాలికలకు రక్తహీనత పోటీలు పెట్టి బహుమ పరీక్షల నిర్వహణ, బహుమతులు అందజేస్తారు. కిచెన్‌ క్రమ పరిశుభ్రత, గార్డెన్ల ఏర్పాటు, కిశోర బాలికలకు అవగాహన కల్పిస్తారు.

    జిల్లా పరిధిలో ఇలా..

  • సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు

    చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం.

    జాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    తల్లడిల్లిన అప్పంపల్లి

    అమరవీరులకు గుర్తింపేది?

  • కేసుల

    మహబూబ్‌నగర్‌ క్రైం: నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ పారదర్శక విచారణల ద్వారా శిక్షల శాతం పెంచాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్‌ ఉన్నతాధికారులతో మంగళవారం నేరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టిసారించి ప్రతి కేసును లోతైన విచారణతో ముందుకు వెళ్లాలని సూచించారు. దీంతో నిందితులకు శిక్షలు పడేశాతం పెరగాలని ఆదేశించారు. గ్రేవ్‌, నాన్‌– గ్రేవ్‌, యూఐ కేసులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టిసారించి వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టులలో కాంటెస్ట్‌డ్‌ కేసుల్లో స్థానికులను పకడ్బందీగా బ్రీఫ్‌ చేయాలని, బాధితులకు కేసుల పురోగతి తెలియజేయాలన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాల కేసులను వేగంగా ఛేదించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని, సీసీ కెమెరాలతో నిఘా పెంచాలని, పనిచేయని సీసీకెమెరాలకు వెంటనే మరమ్మతు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అరెస్టులు, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్‌, ఇజాజుద్దీన్‌, కమలాకర్‌, నాగార్జునగౌడ్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌, భగవంతురెడ్డి, రత్నం తదితరులు పాల్గొన్నారు.

    అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలు

    పాలమూరు: జిల్లా జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగా అజ్మీరాతో మంగళవారం ఆయన చాంబర్‌లో 108 అంబులెన్స్‌ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం అధికారి రవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో ఉన్న 108, 102, పార్థివదేహం అంబులెన్స్‌ వాహనాల పనితీరు, వాటి వివరాలను వెల్లడించారు. గర్భిణులను పరీక్షల కోసం ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచితంగా 102 వాహనాల్లో తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. జనరల్‌ ఆస్పత్రిలో ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు చేర్చడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు పనిచేస్తున్నాయని చెప్పారు. సమావేశంలో 108 జిల్లా కోఆర్డినేటర్‌ ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    నేడు ప్రజాపాలనదినోత్సవం

    జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని బుధవారం ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌పై రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం మంత్రి సందేశాన్ని ఇస్తారు.

    యువతకు నైపుణ్య శిక్షణ

    మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలోని టాస్క్‌ కేంద్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని రీజినల్‌ హెడ్‌ నవీన్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌ సిరాజ్‌, రీజినల్‌ ఇన్‌చార్జ్‌ సతీష్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్‌, పీజీ, డిగ్రీ, డిప్లొమా చేసిన విద్యార్థులకు ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌, సీ లాంగ్వేజ్‌, జావా ఫండమెంటల్స్‌, హెచ్‌టీఎంఎల్‌ అండ్‌ సీఎస్‌ఎస్‌, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, అర్థమెటిక్‌ అండ్‌ రీజనింగ్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 20లోగా టాస్క్‌ సెంటర్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

  • విద్యా ప్రమాణాలు పెంచేలా చర్యలు

    జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అపార్‌ ఐడీ విద్యార్థులందరూ రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. కేజీబీవీలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో సీసీ టీవీలు ఎన్ని ఉన్నాయి.. ఎన్ని పనిచేస్తున్నాయి.. ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు, కంప్యూటర్లు, బిల్డింగ్‌ మరమ్మతు, విద్యుత్‌, టాయిలెట్లు వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల, కళాశాలల్లో వైద్య సేవలు అందిస్తున్నారా అని ఆరాతీశారు. ఎఫ్‌ఎ–1, 2 పరీక్షలు, విద్యార్థులకు వచ్చిన మార్కుల గురించి వాకబు చేశారు. ఈ నెల 22 నుంచి నిర్వహించే ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    పకడ్బందీగా స్వచ్ఛతా హీ సేవ

    స్వచ్ఛతతో పల్లెలు మెరవాలని కలెక్టర్‌ విజయేందిర అన్నారు. తన చాంబర్‌లో స్వచ్ఛోత్సవన్‌ థీమ్‌ పోస్టర్‌ విడుదల చేసి మాట్లాడారు. బుధవారం నుంచి వచ్చే నెల 2 వరకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ముఖ్యంగా చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించి శుభ్రపరచడం, అన్ని విద్యాసంస్థల్లో పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు. క్లీన్‌ గ్రీన్‌, సఫాయి మిత్ర సురక్ష శిబిర్‌, శ్రమదానాలు, వేస్ట్‌ నుంచి ఆర్ట్‌ క్రియేట్‌ చేయడం, ఫుడ్‌ స్టీట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాలు అన్ని శాఖల భాగస్వామ్యంతో చేపట్టాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

  • రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్‌ ముఖ్యం

    స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తే తనకు ముఖ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌, వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతశాతం కార్యక్రమానికి ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు, ఐదు సంవత్సరాలు మీ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. మీ పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతిరోజు పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టీవీలు, సెల్‌ఫోన్‌లు కట్టిపెట్టాలన్నారు. మీరు చేసే ఈ చిన్న త్యాగమే మీ పిల్లలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచస్థాయిలో రాణించిందంటే ఆమె తల్లిదండ్రులు చేసిన త్యాగం, కృషి తెరవెనుక ఎంతో ఉందన్నారు. మన పిల్లలు మహబూబ్‌నగర్‌లోనే చదువుకోవాలనే ఉద్దేశంతో గత 20 నెలల్లోనే పాలమూరు యూనివర్సిటీలో కొత్తగా ఇంజినీరింగ్‌, లా కళాశాలలు తెచ్చామని, ఐఐఐటీ కళాశాల సైతం ఇక్కడ తీసుకురావడంలో సఫలీకృతం అయ్యామని చెప్పారు. రానున్న రోజుల్లో ఫార్మసీ, అగ్రికల్చర్‌, ఎంబీఏ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలను తెస్తామన్నారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్‌ ఫౌండర్‌ రవీందర్‌, నాయకులు వినోద్‌కుమార్‌, సిరాజ్‌ఖాద్రీ, సీఎంఓ బాలుయాదవ్‌, ఏఎంఓ శ్రీనివాస్‌, మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ పర్యవేక్షకులు మనోహర్‌, రామకృష్ణ మఠం ప్రతినిధి రాజమల్లేష్‌, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

  • అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం

    అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్‌ 12న నిజాం నవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

    స్మరించుకోని పాలకులు..

    నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం.

Jogulamba

  • గిరిజన హక్కుల సాధనకు అలుపెరగని పోరాటం

    గద్వాలన్యూటౌన్‌: లంబాడీ, గిరిజన హక్కుల సాధన కోసం సేవాలాల్‌ సేన అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ఇన్‌చార్జి మూడావత్‌ కృష్ణనాయక్‌, అధ్యక్షుడు ఆంగోత్‌ రాంబాబు అన్నారు. మంగళవారం సేవాలాల్‌ సేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ సర్కిల్‌ సమీపంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంత్‌శ్రీ తపస్వి రామారావు మహరాజ్‌ చేతుల మీదుగా సేవాలాల్‌ సేన ఆవిర్భవించిందని చెప్పారు. రాష్ట్రంలో లంబాడీ, గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. లంబాడీ, గిరిజనుల్లో రాజకీయ చైతన్యం రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మూడావత్‌ రవి నాయక్‌, ఉపాధ్యక్షుడు నెనావత్‌ రవినాయక్‌, నర్సింహులు, రేఖానాయక్‌, పాత్లావత్‌ రవి నాయక్‌, ధాన్య నాయక్‌, నరేంద్రనాయక్‌, నర్సింహ పాల్గొన్నారు.

  • నాయకత

    మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు.

    – అంజన్న,

    ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి

    పోరాటంలో ఎంతో పాత్ర..

    తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్‌, తెలుగు ఆశన్న, దాసర్‌పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్‌ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు.

    – సాయిలు, రిటైర్డ్‌ టీచర్‌, అప్పంపల్లి

  • పండ్లతోటల సాగు.. భలే బాగు

    గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో పండ్ల తోటల సాగు ఏటేటా పెరుగుతోంది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో పాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు తోటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఏటా పండ్లతోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు..

    అనువైన పరిస్థితులు..

    పండ్లతోటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్‌లతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల, రిజర్వాయర్లు, నోటిఫైడ్‌ చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోరుబావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్లతోటలను బోరుబావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణ విషయానికొస్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

    అవగాహన కరువు..

    ఆయా సీజన్‌లలో పండ్ల తోటలకు రకరకాల తెగుళ్లు ఆశించి.. దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యానశాఖ తగిన సలహలు, సూచనలు అందించి.. రైతులను అప్రమత్తం చేయాలి. దీంతో పాటు మార్కెటింగ్‌ మెళకువలు తెలియక చాలా మంది రైతులు మధ్యవర్తులకు పండ్లను విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలాంటి వాటిపై అవగాహన సదస్సులు నిర్వహించి.. రైతులకు మెళకువలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

    సంవత్సరం రైతుల సంఖ్య సాగు

    2020–21 2,594 9,315

    2021–22 3,354 11,106

    2022–23 3,930 12,337

    2023–24 4,390 13,568

    2024–25 4,936 14,939

    2025–26 5,118 15,332

    (ఇప్పటివరకు)

    నడిగడ్డలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

    తోటల పెంపకానికి ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలం

    ఏటా రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి

    2020–21 నుంచి పండ్లతోటల సాగు ఇలా (ఎకరాల్లో)..

    మారిన ఆలోచనా సరళి..

    జిల్లాలో పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను ఏళ్ల తరబడి సాగుచేస్తూ వస్తున్న రైతుల ఆలోచనా సరళిలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటం.. మూడేళ్ల నుంచి ఐదేళ్ల పాటు మంచి నిర్వహణ పద్ధతులు అవలంబిస్తే దిగుబడి బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటలపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, పొప్పాయి, అంజిర, జామ, డ్రాగన్‌ఫ్రూట్‌ తదితర తోటలు సాగుచేస్తున్నారు. కాగా, పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెరగడానికి మరో కారణం కూడా ఉంది. కేంద్ర ఆధీనంలోని ఎంఐడీహెచ్‌ పథకంతో పాటు, ఉపాది హమీ పథకం కింద పండ్లతోటల సాగుకు ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఆయా పథకాలతో సన్న, చిన్నకారు రైతులు సైతం పండ్లతోటల సాగుపై మొగ్గుచూపుతున్నారు. 2020–21లో జిల్లావ్యాప్తంగా 9,315 ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా.. ఈఏడాది (2025–26) ఇప్పటివరకు 15,332 ఎకరాలకు పండ్లతోటల సాగు విస్తీర్ణం పెరిగింది.

  • సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు

    చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి లడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం..

    జాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    తల్లడిల్లిన అప్పంపల్లి

    అమరవీరులకు గుర్తింపేది?

  • అన్ని సౌకర్యాలతో ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు

    గద్వాల: విద్యార్థులు, యువత భవిష్యత్‌ కోసం డిజిటల్‌ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ భవనంలో తాత్కాలిక డిజిటల్‌ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ భవనంలో డిజిటల్‌ లైబ్రరీ, గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులన్నీ పర్యవేక్షించి కేంద్రాన్ని త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిజిటల్‌ లైబ్రరీతో విద్యార్ధులు పుస్తకాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ తరగతులు, పోటీ పరీక్షలకు అవసరమైన సదుపాయాలతో పాటు వివిధ కోర్సులకు సన్నద్ధమయ్యేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్ధ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

  • అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం

    అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్‌ 12న నిజాం నవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

    స్మరించుకోని పాలకులు..

    నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం.

  • యూరియా కోసం తప్పని తిప్పలు

    ఎర్రవల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు

    ఎర్రవల్లి: వానాకాలంలో వరి, చెరుకు, వేరుశనగ, పత్తి తదితర పంటలు సాగుచేసిన రైతులకు యూరియా లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్‌లు, ఇతర ఎరువుల విక్రయ కేంద్రాలకు చేరుకొని గంటల తరబడి నిరీక్షించినా రెండు బస్తాల యూరియా లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం వివిధ గ్రామాల రైతులు ఎర్రవల్లి సింగిల్‌విండో కార్యాలయానికి తెల్లవారుజామునే చేరుకొని యూరియా కోసం క్యూ కట్టారు. కొందరు తమ పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌ కార్డులను క్యూలైన్‌లో పెట్టి నిరీక్షించారు. యూరియా కొరత కారణంగా పస్తులుండి పడిగాపులు కాయాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం సరిపడా యూరియాను అందించాలని కోరారు.

  • ఉద్యమానికి ఊపిరి..

    త్మకూర్‌ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్‌ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్‌నగర్‌ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్‌, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్‌ కిష్టన్న, హరిజన్‌ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్‌రెడ్డి, వడ్డేమాన్‌ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్‌ వేసి జైలులో నిర్బంధించారు.

Wanaparthy

  • విద్యతోనే సమస్యల పరిష్కారం : డీఐఈఓ

    పాన్‌గల్‌: విద్యనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతోందని.. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి (డీఐఈఓ) అంజయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు హైదరాబాద్‌ పల్స్‌ హార్ట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వారు రూ.1.80 లక్షల విలువైన తాగునీటి సీసాలు, రాత పుస్తకాలు, రెండు బీరువాలు, ప్రింటర్‌, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఆస్పత్రి యాజమాన్యం కళాశాలకు సామగ్రి అందించడం అభినందించదగిన విషయమన్నారు. ఇంటర్‌ విద్య విద్యార్థికి పునాది లాంటిదని.. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా అధ్యాపకులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ తిరుమల్‌రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

  • నాయకత

    మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు.

    – అంజన్న,

    ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి

    పోరాటంలో ఎంతో పాత్ర..

    తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్‌, తెలుగు ఆశన్న, దాసర్‌పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్‌ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు.

    – సాయిలు, రిటైర్డ్‌ టీచర్‌, అప్పంపల్లి