Archive Page | Sakshi
Sakshi News home page

Kurnool

  • పీఆర్‌ ఇంజినీర్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

    అధ్యక్షులుగా నాగిరెడ్డి,

    ప్రధాన కార్యదర్శిగా సతీష్‌ కుమార్‌

    కర్నూలు (అర్బన్‌): ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్‌ ప్రాంగంణంలోని విశ్వేశ్వరయ్య భవనంలో అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళి కృష్ణనాయుడు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్షులుగా పాణ్యం పీఆర్‌ఐ డీఈఈ ఇ. నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కర్నూలు పీఐయూ ఎఈఈ ఆర్‌. సతీష్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎమ్మిగనూరు పీఆర్‌ఐ డీఈఈ ఎస్‌. చంద్రశేఖర్‌, కోశాధికారిగా ఆదోని పీఆర్‌ఐ ఏఈఈ ఎం. మహదేవప్ప, అర్గనైజింగ్‌ సెక్రటరీగా కర్నూలు పీఆర్‌ఐ ఏఈఈ జ్యోత్స్నను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ వేణుగోపాల్‌, ఈఈ మహేశ్వరెడ్డితో పాటు జిల్లాలోని డివిజన్లు, సబ్‌ డివిజన్లకు చెందిన డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.

  • అలరించిన జాతీయ కవిసమ్మేళనం

    నంద్యాల(వ్యవసాయం): సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని శ్రీశైల హైస్కూల్‌ సెమినార్‌ హాల్‌లో నిర్వహించిన జాతీయ కవిసమ్మేళనం సాహితీవేత్తలు, ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఉషోదయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.యు.వి రత్నం నేతృత్వంలో కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు, రచయిత డాక్టర్‌ కిశోర్‌ కుమార్‌, బేతంచర్ల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మరియాదాసు, కవులు నీలకంఠమాచారి, అన్నెం శ్రీనివాసరెడ్డి, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. కవిత్వమనేది కవి గుండెల్లో నుంచి ఉప్పొంగి అక్షర రూపం దాల్చి సమాజానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. ‘పసిడి నవ్వులు వెన్నెల దివ్వెలు’ అనే అంశంపై అనేక మంది కవులు వివిధ జిల్లాల నుంచి పాల్గొని తమ కవితలను చదివి వినిపించారు. సంస్థ నిర్వాహకులు కవుల సాహిత్య సేవకు గుర్తింపుగా జానపద మంజరి సేవా పురస్కారాలు, బాల చైతన్య సేవా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కవులు వెంకటేశ్వర్లు, నరేంద్ర, మహమ్మద్‌ రఫి, శేషఫణి, మాబుబాష, కేశవమూర్తి పాల్గొన్నారు.

  • కమనీయం.. స్వర్ణరథోత్సవం

    శ్రీశైలంటెంపుల్‌: ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు.వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణరథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఏఈవో, అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • స్విమ్మింగ్‌ పోటీలో స్టాఫ్‌ నర్సు ప్రతిభ

    కర్నూలు(హాస్పిటల్‌): విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న డి. మంజులాదేవి ప్రతిభ చూపారు. విజయవాడలోని సర్‌ విజ్జి మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఆరవ మాస్టర్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో మంజులదేవికి వంద మీటర్ల ఫ్రీ స్టైల్‌, బ్రెస్ట్‌ స్ట్రోక్‌లలో రెండు గోల్డ్‌మెడల్‌లు, 50 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌, 50 మీటర్ల ఫ్రీ స్టైల్‌లలో రెండు సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు.

    రేపు పలు ప్రాజెక్టులకు

    వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన

    కర్నూలు(సెంట్రల్‌): సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఏపీఐఐసీ, ఎయిర్‌పోర్టు, టూరిజం ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారన్నారు. ఆయా ప్రాజెక్టుల వద్ద లబ్ధిదారుడు, స్టేక్‌ హోల్డర్‌తో మాట్లాడుతారని తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ నూరుల్‌ ఖమర్‌, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.

Jogulamba

  • జూరాల

    అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రహదారి మరమ్మతులకు పీజేపీ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నందిమళ్ల క్యాంపు నుంచి ప్రాజెక్టు మీదుగా గద్వాల, రాయచూర్‌ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది తమ వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. వీటితోపాటు జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల పర్యాటకులు సైతం వస్తుంటారు. 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాజెక్టు ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు రహదారిపై గద్వాలకు వెళ్తుండటంతో అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన పీజేపీ అధికారులు.. నేటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులకు పూనుకోకపోవడంతో రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడం.. మరమ్మతుకు నోచుకోవడంతో రాకపోకల కష్టాలు తొలగిపోనున్నాయి.

    అడుగుకో గుంత..

    పీజేపీ నందిమళ్ల క్యాంపు నుంచి రేవులపల్లి వరకు జూరాల జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. అడుగడుకో గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల చిన్న గుంతలు, మరికొన్ని చోట్ల రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకల సమయంలో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని భారీ వాహన డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు ఎదురుగా వస్తున్న ద్విచక్ర, ఆటోలను తప్పించబోయి ప్రమాదాల బారినపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టు రూపురేఖలు మారుతాయని ఈ ప్రాంత ప్రజల ఆశలు నేటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతున్నాయి. ప్రస్తుతం రహదారి మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    మరమ్మతుకు

    రూ.30 లక్షలు మంజూరు

    బాగుపడనున్న 4.50 కిలోమీటర్ల రోడ్డు

    టెండర్ల ఆహ్వానానికి సిద్ధమవుతున్న అధికారులు

    తీరనున్న ప్రయాణికుల కష్టాలు

    కుడి, ఎడమ కాల్వల పరిధిలో..

    ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు సైతం వ్యయ ప్రయాసాలకోర్చి రాకపోకలు సాగించే దుస్థితి నెలకొంది. దీనికితోడు ఎడమ కాల్వ వద్ద చేప వంటకాల విక్రయ కేంద్రాలు ఉండటంతో పర్యాటకులతో పాటు చేప వంటకాలు ఆరగించేందుకు ప్రజలు రోజు వేలాదిగా సొంత వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. వాహనాలన్నీ కాల్వ సమీపంలోని ప్రధాన రహదారిపై నిలుపుతుండటంతో వచ్చి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • రుణ ల
    యాసంగి పంట రుణ లక్ష్యం ఖరారు

    బ్యాంకు రైతుల రుణలక్ష్యం

    సంఖ్య

    ఎస్‌బీఐ 14,926 304.16

    గ్రామీణ బ్యాంక్‌ 7,397 150.71

    యూబీఐ 8,743 178.17

    కెనరా బ్యాంక్‌ 6,952 141.96

    ఇండియన్‌ బ్యాంక్‌ 6,020 122.49

    హెచ్‌డీఎఫ్‌సీ 5,448 111.40

    ఐసీఐసీఐ 3,719 75.97

    టీఎస్‌ కోఆపరేటివ్‌ 2,181 44.03

    సెంట్రల్‌ బ్యాంక్‌ 1,989 40.25

    యాక్సిస్‌ 925 19.08

    బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 179 4.13

    కరూర్‌ వైశ్య బ్యాంక్‌ 185 3.40

    కేబీఎస్‌ 105 2.26

    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 93 1.73

    బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 31 0.45

    బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 9 0.13

    గద్వాలన్యూటౌన్‌: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాసంగి పంట రుణ లక్ష్యం ఖరారు అయ్యింది. నడిగడ్డలో యాసంగి పంటలకు గాను 58,902 మంది రైతులకు రూ. 1200.58 కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్దేశితమైంది. పంట పెట్టుబడులకి ఇక్కడి రైతులు బ్యాంకులు అందించే రుణాలపైనే అధారపడ్డారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోథల పథకం, దీని కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఏటా రెండు సీజన్‌లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఇంకా పండ్లతోటలు, కూరగాయలు పండిస్తున్నారు. జిల్లాలో తొంభైశాతం సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు.

    జిల్లా వివరాలిలా.. (రూ.కోట్లలో)

    (09జిడియల్‌203–210034)

    పంట రుణాలపైనే రైతుల పెట్టుబడి ఆశలు

    వానాకాలం సీజన్‌లో 61 శాతం రుణ లక్ష్యం చేరిన వైనం

    బ్యాంకర్లు సకాలంలో అందిస్తేనే ప్రయోజనం

    అర్హులందరికీ పంట రుణాలు

    పంట పెట్టుబడుల్లో బాగంగా పంట రుణాలఉక ధరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. రుణాలు పొందాలనుకున్న రైతులు తప్పక రెన్యూవల్‌ చేసుకోవాలి. దీనివల్ల రుణాలు అందించడానికి వీలు అవుతుంది. యాసంగి సీజన్‌లో లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

    – శ్రీనివాసరావ్‌, ఎల్‌డీఎం

  • అదిగో

    అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్‌ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు.

    అతిపెద్ద టైగర్‌ రిజర్వు..

    దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్‌ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్‌ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్‌ జోన్‌. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్‌, మద్దిమడుగు, మన్ననూర్‌, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్‌ రేంజ్‌లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్‌ ద్వారా సేకరించిన ప్లగ్‌ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు.

    అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం

    జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ

    ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం

    స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

    ఈ నెల 22తోముగియనున్న స్వీకరణ గడువు

    పెద్ద పులులకు పుట్టినిల్లు..

    నల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్‌–6 ఆడపులి, ఫరాహా ఎఫ్‌–6, తారా ఎఫ్‌–7, భౌరమ్మ ఎఫ్‌–18, ఎఫ్‌–26, ఎఫ్‌–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి.

  • శివాలయ పునర్నిర్మాణానికి రూ.3.5లక్షలు విరాళం

    గద్వాలటౌన్‌: జిల్లా కేంద్రంలోని నల్లకుంట శివాలయ పునర్నిర్మాణం కోసం భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించే శివాలయ పునర్నిర్మాణంలో కాలనీ ప్రజలతో పాటు సమీప కాలనీల భక్తులు భాగస్వామ్యం అవుతున్నారు. ఆ దిశగా ఆలయ కమిటీ సభ్యులు దాతల నుంచి విరాళాలను సేకరిస్తున్నారు. ఆదివారం ప్రముఖ సీడ్‌ ఆర్గనైజర్‌ మేకలసోంపల్లి ప్రభాకర్‌రెడ్డి రూ.3,51,116ను విరాళంగా అందజేశారు. వీరితో పాటు మరికొందరు అలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వహకులు పులిపాటి వెంకటేష్‌, వెంకట్రాములు, గోపాల్‌, నల్లారెడ్డి, రాంరెడ్డి, సోనీ వెంకటేష్‌, బాలాజీ, అల్లంపల్లి వెంకటేష్‌, రాజు, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

    కనులపండువగా అయ్యప్ప మహా పడిపూజ

    గద్వాలటౌన్‌: శరణం.. శరణం అయ్యప్పా.. అంటూ జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి నామస్మరణం, శరణు గోషతో మార్మోగాయి. ఆదివారం ఉదయం స్థానిక వెంకటరమణ కాలనీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ వేసుకున్న అయ్యప్పస్వాములతో పాటు మహిళలు, ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అయ్యప్ప సేవలో తరించారు. అయ్యప్ప మాలాధారులు భక్తి పారవశంలో మునిగిపోయారు. ఈ సందర్బంగా నిర్వహించిన మహా పడిపూజ కనులపండువగా సాగింది. మహా పడిపూజ కార్యక్రమంలో భక్తులు శరణుఘోష దీక్షాధారులనే కాక, ఇతర భక్తులను పారవశ్యంలో ముంచెత్తింది. అయ్యప్పస్వామిని, మెట్లు తదితర వాటిని వైభవంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి, పోతుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

    (09జీడీయల్‌103

  • 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి

    గద్వాలటౌన్‌: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వాల్మీకి భవన్‌లో జరిగిన బీసీ చైతన్య సదస్సుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బహుజన విద్యావేత్త అక్కల బాబుగౌడ్‌, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌తో పాటు జిల్లా బీసీ, బహుజన ఉద్యమ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూధన్‌బాబులు ప్రధాన వక్తలుగా హాజరై మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు, రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే వరకు బీసీలు ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే విషయంలో కొన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. రాజ్యాంగంలో పది శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేసిన నాయకులు, బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రంలోని అగ్రవర్ణ పాలకులు తాము ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి, రాష్ట్రపతి ఆమోదంతో గ్యారంటీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సదస్సులో పలు తీర్మాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, వివిధ సంఘాల నాయకులు అతికూర్‌ రెహమాన్‌, వాల్మీకి, శంకర ప్రభాకర్‌, వినోద్‌కుమార్‌, కుర్వ పల్లయ్య, కృష్ణయ్య, రహిమతుల్లా, అచ్చన్నగౌడ్‌, నాగన్న, కిరణ్‌, నర్సింహా, రాంబాబు, ప్రకాష్‌, రాజు, తాహేర్‌, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

  • న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

    అలంపూర్‌: న్యాయవాదులకు రక్షణ కల్పించాలని అడ్వకేట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు కోరారు. అలంపూర్‌ పట్టణంలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆదివారం న్యాయవాదులు అలంపూర్‌ టు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు జోగుళాంబ అమ్మవారి బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మహాత్మాగాంధీ, మహాత్మా జ్యోతిబా పూలే, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరిగాయని, ఎక్కడో ఒక చోట నిరంతరం భౌతిక దాడుల సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. అందుకే న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జూనియర్‌ న్యాయవాదులకు రూ.వేల స్టైఫండ్‌, అందరికి హెల్త్‌ కార్డులు ఇవ్వాలన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ ), బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 35(1) అమైన్మెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలుతోపాటు డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పాదయాత్ర పది రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్ర బృందం హైదరాబాద్‌ చేరుకొని రాష్ట్ర గవర్నర్‌, హైకోర్టు జడ్జి, ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు విన్నవించి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నరసింహ్మ, బార్‌ అసోసియేషన్‌ నాయకులు నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, గజేంద్ర గౌడ్‌, ఆంజనేయులు, మధు, వెంకటేష్‌, హేమంత్‌ యాదవ్‌, యాకూబ్‌, నాగయ్య తదితరులు ఉన్నారు.

    పాదయాత్రకు ప్రముఖుల మద్దతు

    సమస్యల పరిష్కారం కోసం అలంపూర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రముఖ న్యాయవాదులు మద్దతు తెలిపారు. తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనంతరెడ్డి, సిట్టింగ్‌ స్టేట్‌ బార్‌ మెంబర్‌ హనుమంతు రెడ్డి, మహబూబ్‌నగర్‌ సీనియర్‌ న్యాయవాది వెంకటేష్‌, షాద్‌నగర్‌ న్యాయవాది జగన్‌మోహన్‌ రెడ్డి ఉమ్మడి జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మద్దతు తెలిపారు.

  • నందిమళ్ల క్యాంపుకాలనీ నుంచి రేవులపల్లి వరకు కొత్తగా బీటీ రహదారి ని ర్మించాలి. రహదారికి తా త్కాలిక మరమ్మతు చేస్తే చిన్నప ాటి వర్షాలకే మ రోమారు దెబ్బతినే అవకాశం ఉంది. అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మ తు పక్కాగా చేపట్టాలి. – వెంకటేష్‌, నందిమళ్ల

    త్వరగా చేపట్టాలి..

    ప్రాజెక్టు రహదారిపై నిత్యం వేల మంది ప్రయాణం చేస్తుంటారు. రూ.30 లక్షలతో చేపట్టే మరమ్మతు నాణ్యతగా పూర్తిచేసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు కృషిచేయాలి. పీజేపీ ప్రాజెక్టు రహదారి మరమ్మతు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. – రాజు, మస్తీపురం

    రూ.30 లక్షలతో మరమ్మతు..

    జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ పరిధిలోని మొత్తం 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారి మరమ్మతుకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధులు మంజూరవుతాయి. వెంటనే టెండర్లు ఆహ్వానించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

    – ఖాజా జుబేర్‌ అహ్మద్‌, ఈఈ, గద్వాల

Movies

  • హీరో సిద్ధార్థ్‌ (Siddharth) చివరగా 3 బీహెచ్‌కే సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. పనిలో పనిగా తన నెక్స్ట్‌ సినిమాకు రెడీ అవుతున్నాడు. కార్తీక్‌ జీ క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈయన దర్శకత్వంలోనే సిద్దార్థ్‌ గతంలో టక్కర్‌ సినిమా చేశాడు. ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా రెండోసారి వీరి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది. దీనికి రౌడీ అండ్‌ కో అనే టైటిల్‌ ఖరారు చేశారు. 

    ఈ చిత్రాన్ని ఫ్యాషన్‌ స్టూడియోస్‌ సంస్థ అధినేత సుదన్‌ సుదర్శన్‌ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి అయిలి వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రేవా సంగీతాన్ని అందించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి తీసుకురానున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Karimnagar

  • ర్యాగ

    అడవి.. అందాల విడిది

    పని ఒత్తిడి, మానసిక ఒత్తిడికి గురయ్యే సిరిసిల్ల పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు అర్బన్‌ పార్క్‌ సిద్ధమైంది. పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో పార్క్‌ను ఏర్పాటు చేశారు.

    రాజన్న సన్నిధిలో రద్దీ

    రాజన్న సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

    కరీంనగర్‌టౌన్‌: కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలతో డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలో అడుగు పెట్టిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు పరిచయం అవుతారు. తొలి పరిచయానికి పర్యాయపదంగా నిలవాల్సిన ర్యాగ్‌ అన్న పదం వికృత క్రీడకు చిహ్నమవుతోంది. ఆ పేరు చెబితేనే జూని యర్ల వెన్నులో వణుకుపుడుతోంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం పతాకస్థాయికి చేరుకుంటోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్‌టీయూలో శనివారం రాత్రి సీనియర్లు జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలు చర్చనీయాంశమయ్యాయి.

    స్నేహమా.. జాగ్రత్త సుమా

    మంచి స్నేహం ప్రాణంతో సమానం. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరికీ స్నేహం అవసరం. కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు స్నేహితుల ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. కళాశాల క్యాంటీన్లు, హాస్టళ్లకు పాకిన ఈ భూతానికి ఏటా ఎంతో మంది విద్యార్థులు బలవుతుండగా విద్యాశాఖ, పోలీసు విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    ‘సుప్రీం’ మార్గదర్శకాలు

    సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తోంది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌కే రాఘవన్‌ కమిటీ వేసిన సిఫార్సులను 2007లో ఆమోదించింది. దీని ప్రకారం ర్యాగింగ్‌ జరిగినట్లు ఫిర్యాదు అందితే వెంటనే విద్యా సంస్థలు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణుడిని నియమించాలి. విద్యార్థులు మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా కళాశాల యజమాన్యాలే చర్యలు తీసుకోవాలి. ర్యాగింగ్‌ నిరోధించడంలో యజమాన్యాలు విఫలమైతే వారినే బాధ్యులను చేయాలి.

    ‘యూజీసీ’ మార్గదర్శకాలు

    ర్యాగింగ్‌ సంఘటనల్లో దోషులుగా తేలిన వారికి రూ.2.5 లక్షల జరిమానాల విధించాలి. తీవ్రతను బట్టి వారిని కళాశాల ప్రవేశంపై జీవితకాల నిషేధం విధించాలి. కళాశాలలో చేరే సమయంలో వేధింపులకు పాల్పడబోమని విద్యార్థి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి. వేధింపులను అరికట్టడంలో విఫలమైన కళాశాల గుర్తింపును రద్దు చేయాలి. ర్యాగింగ్‌ నిబంధనలను తెలుపుతూ ప్రతి కళాశాల పరిసరాల్లో పోస్టర్లు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి.

    సర్కారు ఏం చెబుతోందంటే..

    ర్యాగింగ్‌ నిరోధకానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్యశాఖ 1800– 5522 ట్రోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ హెల్ప్‌లైన్‌ పని చేస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదులను 1090 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపవచ్చు. ర్యాగింగ్‌ జరిగే కళాశాలల వద్ద నిఘా పెంచాలి.

    వైద్య నిపుణుల సూచనలు

    ర్యాగింగ్‌ తప్పనే విషయాన్ని సీనియర్లకు తెలిపేందుకు కాలేజీల్లో నైతిక విలువల కమిటీ లేదా మానవ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్‌ చేసే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జూనియర్లకు అవగాహన కల్పించాలి. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చేస్తే మిగతా వారికి కనువిప్పు కలుగుతుంది. కళాశాల యజమాన్యాలు నిజాలను దాచకుండా వెలుగులోకి తేవాలి. జూనియర్లు స్వేచ్ఛగా మసలేలా చర్యలు తీసుకోవాలి.

    నాచుపల్లి జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌ దృశ్యం

    ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలలు

    డిగ్రీ

    66

    పీజీ

    35

    ఇంజినీరింగ్‌

    16

    ఎంబీఏ

    8

    ఎంసీఏ

    1

    ఫార్మసీ

    2

    పాలిటెక్నిక్‌

    5

  • కదలం.

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో దశాబ్దాల తరువాత చేపట్టిన జవాన్ల అంతర్గత బదిలీలు అపహాస్యమవుతున్నాయి. అధికారులు బదిలీ చేస్తే మేం డివిజన్లు వీడాలా..? అన్నట్లుగా కొంతమంది ఇష్టానురీతిలో వ్యవహరిస్తున్నారు. పేరుకు కొత్త డివిజన్‌కు బదిలీ అయినా, పాత డివిజన్లలో అదే దందాను యథేచ్చగా కొనసాగిస్తూ, అధికారులకే సవాల్‌ విసురుతున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, అధికారులు, అధికార, విపక్ష పార్టీల నాయకులు.. ఎవరు దొరికితే వారితో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతూ, బల్దియాను మార్చలేమనే స్థితికి తీసుకొస్తున్నారు.

    బదిలీ చేస్తే వీడాలా?

    నగరపాలకసంస్థలోని 66 డివిజన్ల పరిధిలో 61మంది రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతమందికి రెండు డివిజన్ల బాధ్యతలిచ్చారు. ఆయా డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను జవాన్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కార్మికులతో పారిశుధ్య పనులు చేయించడంతో పాటు, డివిజన్‌లో పరిశుభ్రతను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. విధుల్లో భాగంగా కొంతమంది స్వచ్ఛ ఆటోల నిర్వాహకులు, పారిశుధ్య కార్మికులు, దుకాణదారులు, చిన్న వ్యాపారులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల మామూళ్లు ఇవ్వని వారిని నిబంధనల పేరిట ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పారిశుధ్య వ్యవస్థను ప్రక్షాళన చేసే క్రమంలో ఇటీవల నగర పాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న మొత్తం 61 మంది జవాన్లకు స్థానచలనం కల్పించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆయా డివిజన్లలో ఏళ్లుగా పాతుకుపోయి పలు దందాలకు, నాయకుల ఇళ్లలో సేవలకు అలవాటు పడ్డ కొంతమంది బదిలీలను అంగీకరించడం లేదు. తమకున్న పరిచయాల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికార, విపక్ష అనే తేడా లేకుండా అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులతోనూ బదిలీల రద్దుకు విశ్వప్రయత్నం చేశారు. బదిలీల రద్దు కుదిరే అంశం కాదని అధికారులు తేల్చిచెప్పడంతో, పాత దందానే కొత్తగా మొదలు పెట్టారు. తమ వెనకాల ఉన్న నేతల అండదండలతో బదిలీలు చేస్తే మాత్రం వినాలా అన్నట్లుగా అధికారుల ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు. తమ పాత డివిజన్లలో ఇప్పటికీ అనధికారికంగా విధులు నిర్వర్తిస్తూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

    పంపకాల పంచాయితీ

    పారిశుధ్య జవాన్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ల నడుమ పంపకాల పంచాయితీ తీవ్రస్థాయికి చేరింది. జవాన్ల బదిలీలు ఖాయమైన నేపథ్యంలో, ఆ బదిలీలను కొంతమంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. ఆ ఆరోపణలు అర్థం లేనివని, పూర్తిస్థాయిలో బదిలీలను పారదర్శకంగా నిర్వహించినట్లు సంబంధిత బల్దియా అధికారులు కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు, ఖండనలు ఎలా ఉన్నా...ఆయా డివిజన్‌లలో పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించే జవాన్‌లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల నడుమ పంపకాల పంచాయితీలు నివురుకప్పిన నిప్పులా ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.

    ప్రక్షాళన సాగాల్సిందే

    రూ.కోట్ల ప్రజాధనం వెచ్చిస్తున్నా, నగరంలో అనుకున్న మేరకు పారిశుధ్యం మెరుగు పడడం లేదనేది వాస్తవం. పారిశుధ్యం విభాగాన్ని కాస్త గాడినపెట్టేందుకు చేపట్టిన జవాన్ల బదిలీలను కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త వాళ్లతో పనులు మందగిస్తాయనే సాకుతో ఆయా డివిజన్లలోనే ఉండేట్లు ఒత్తిడి పెంచుతున్నారు. ఏదేమైనా చాలా ఏళ్ల తరువాత చేపట్టిన ప్రక్షాళన పర్వం పారిశుధ్య విభాగంలో కొనసాగించాల్సిందేనని నగరవాసులు కోరుతున్నారు. బల్దియా ఉన్నతాధికారులు ఆ దిశగా ముందుకు సాగాలంటున్నారు.

    ‘కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఇటీవల చేపట్టిన అంతర్గత బదిలీల్లో ఓ జవాన్‌ పక్క డివిజన్‌కు వెళ్లాడు. ఏళ్లుగా పాత డివిజన్‌తో మమేకమైన సదరు జవాన్‌, ఆ డివిజన్‌ను వీడేందుకు ససేమిరా అన్నాడు. మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చాడు. బదిలీల్లో మార్పునకు ఉన్నతాధికారులు అంగీకరించ లేదు. కొత్త డివిజన్‌లో బాధ్యతలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. పాత డివిజన్‌పై ఉన్న మమకారం సదరు జవాన్‌ను అక్కడి నుంచి కదలనీయలేదు. పేరుకు కొత్త డివిజన్‌లో ఉన్నా, పాత డివిజన్‌లోనే పెత్తనం సాగిస్తున్నాడు. పాత దందాను కొనసాగిస్తున్నాడు.’

  • 79 పాఠశాలలకు ఫైవ్‌స్టార్‌

    కరీంనగర్‌టౌన్‌: నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో పాఠశాలల స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ, ఏవమ్‌ హరిత విద్యాలయ రేటింగ్‌’ (ఎస్‌హెచ్‌వీఆర్‌) కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలలో మూత్రశాలలు, పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగం, నీటి వసతి తదితర అంశాలు పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు మంచి రేటింగ్‌ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు, కస్తూరిబా, గురుకులాలకు చెందిన హెచ్‌ఎంలు సెప్టెంబరులో వారి పాఠశాలల పరిస్థితిని ఎస్‌హెచ్‌వీఆర్‌ యాప్‌ లేదా ‘ఎస్‌హెచ్‌వీఆర్‌. ఎడ్యుకేషన్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో యూడైస్‌ కోడ్‌తో లాగినై నమోదు చేశారు. దీని ఆధారంగా జిల్లాలోని 79 పాఠశాలలకు 5 స్టార్‌ రేటింగ్‌ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. 679 ప్రభుత్వ పాఠశాలలు, 339 ప్రైవేటు పాఠశాలలు, మొత్తంగా 1,018 పాఠశాలు వివిధ రేటింగ్స్‌ సాధించాయి. గంగాధర మండలం ఒద్యారం హైస్కూల్‌ 125 మార్కులకు గానూ 124 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానం సాధించింది.

    ఆరు అంశాల ఆధారంగా

    జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగా ఆరు ప్రధానాంశాలను నమోదు చేసి, దాన్ని బట్టి రేటింగ్‌ ఇచ్చారు. మొత్తం 60 ప్రశ్నలకు 125 మార్కులు సాధిస్తే 5స్టార్స్‌ లభిస్తుంది. నీటిసంరక్షణ, తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, చేతుల శుభ్రతకు 27, మొక్కలు, తోటల పెంపకానికి 14, వ్యర్థాల నిర్వహణకు 21 మార్కులు, విద్యుత్‌ పొదుపు, సోలార్‌ వినియోగానికి 20, పర్యావరణ పరిరక్షణ అవగాహనకు 21 మార్కుల ఆధారంగా ఈ రేటింగ్స్‌ ఇచ్చినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఎకో క్లబ్‌ ఏర్పాటు లాంటి ఆరు విభాగాల్లోని 60 ప్రశ్నలకు ఆన్‌లైన్‌ ద్వారా సమాధానాలు సమర్పించారు. అవసరమైన ఫొటోలు అప్‌లోడ్‌ చేశారు.

    జాతీయస్థాయిలో 200 పాఠశాలలు

    జిల్లాలో 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలను ప్రత్యేక బృందం భౌతిక పరిశీలన చేసి ప్రతిజిల్లా నుంచి 8 పాఠశాలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20పాఠశాలలను జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేసి ఢిల్లీలో అవార్డులు, రూలక్ష స్కూల్‌ గ్రాంటు అందజేస్తారు.

    జిల్లాలోని పాఠశాలలకు వచ్చిన రేటింగ్‌

    రేటింగ్‌ పాఠశాలలు అంశం

    5స్టార్‌ 79 అద్భుతం

    4స్టార్‌ 465 చాలా బాగుంది

    3స్టార్‌ 423 బాగుంది

    2స్టార్‌ 36 సౌకర్యాలు మెరుగు పడాలి

    1స్టార్‌ 15 స్వచ్ఛతలో అతి తక్కువ

    సంతోషంగా ఉంది

  • తీరుమ

    కరీంనగర్‌: జిల్లా ఆస్పత్రిలోని రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం (టీ–హబ్‌) తీరు మారడం లేదు. టీ– హబ్‌లో సగం పరీక్షలు కూడా జరగక పో వడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజల్ట్‌ కూడా ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెషిన్లకు రిపేర్లు చేసేందుకు వచ్చిన ఇంజినీర్లు ఏం చేస్తున్నారనే సందేహం వ్యక్తమవుతోంది. రిపేర్‌ జరిగిన మరుసటి రోజే మళ్లీ పాత కథే పునరావృతం కావడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు సీబీపీ, ఏఈసీ, స్టూల్‌ ఫర్‌ అక్యూల్ట్‌బల్డ్‌, ట్రాప్‌–ఐ, ఎస్‌–టైపీ, చికున్‌గున్యా, లెప్టోస్పిరా, స్క్రబ్‌ టైపస్‌, స్టూల్‌ ఫర్‌ ఓవా అండ్‌ క్రిస్ట్‌, మలేరియా ర్యాపిడ్‌, ఈఎస్‌ఆర్‌, రెటిక్‌కౌంట్‌, సీరమ్‌ ఎలక్ట్రోలైట్స్‌, ఏబీజీ పరీక్షలు జరిగేవి. ప్రస్తుతం విటమిన్‌ డీ3, బీ12 పరీక్షలు అదనంగా జరుగుతున్నాయి.

    రేపు విద్యుత్‌ వినియోగదారుల ఫోరం సదస్సు

    కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌లోని 33/11 కె.వీ.సబ్‌స్టేషన్‌లో నేడు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ విని యోగదారుల ఫోరం సదస్సు నిర్వహిస్తున్నట్లు టీస్‌ఎన్‌పీడీసీఎల్‌ విద్యుత్‌ వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్‌ ఎన్వీ వేణుగోపాలచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోకల్‌ కోర్టులో విద్యుత్‌ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, లో ఓల్టేజీ హెచ్చ తగ్గులు, డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం పెంపుదల, లోపాలున్న మీటర్ల మార్పు, నూతన సర్వీసుల మంజూరు, అదనపు లోడ్‌ క్రమబద్ధీకరణ, సర్వీసు పేరు మార్పు, సర్వీసు రద్దు తదితర సమస్యలపై నగరవాసులు ఫిర్యాదులు చేయవచ్చన్నారు.

    కవితా సంకలనం ఆవిష్కరణ

    కరీంనగర్‌కల్చరల్‌: మనిషి ఇహలోకంలో సాధ్యం కాని విషయాలను ఊహాలోకంలో దర్శించి సంతృప్తి చెందుతాడని, నా ఊహలో అంశంపై కవులు తమ భావాలను అద్భుతంగా కవితలుగా చిత్రీకరించారని కవి, రచయిత విమర్శకుడు, భవానీ సాహిత్య వేదిక కరీంనగర్‌ అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్‌ అన్నారు. శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ, శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక మంథని సంయుక్త ఆధ్వర్యంలో దూడపాక శ్రీధర్‌ సంపాదకత్వంలో వెలువడిన ‘నా ఊహలో కవితా’ సంకలనా న్ని ఆవిష్కరించారు. పొర్ల వేణుగోపాలరావు, తూము నర్సయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

    స్పందించేవారే కవులు

    కరీంనగర్‌కల్చరల్‌: సమాజంలో జరిగే సంఘటనలు, సామాజిక రుగ్మతలపై స్పందిస్తూ కవితాస్త్రాలు సంధించే వారే కవులని తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పల్లె వీరాస్వామి అన్నారు. ఫిలింభవన్‌లో భవానీ సాహిత్య వేదిక కరీంనగర్‌ ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన కాళిదాసు రచించిన శుభకృత్‌ కవితా సంపుటిని ఆవిష్కరించారు. కవులు అనంతాచార్య, బొమ్మకంటి కిషన్‌, అన్నాడి గజేందర్‌రెడ్డి, దామరకుంట శంకరయ్య, నడిమెట్ల రామ య్య, గంగుల శ్రీకర్‌, యోగ సంపత్‌ కుమార్‌ ఆచార్య పాల్గొన్నారు.

    నగరంలో నేడు పవర్‌కట్‌ ప్రాంతాలు

    కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ. వెంకటసాయి థియేటర్‌ ఫీడర్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌, పద్మశాలి వీధి, రాఘవేంద్రనగర్‌ ప్రాంతాలతో పాటు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.శివనగర్‌ ఫీడర్‌ పరిధిలోని సప్తగిరికాలనీ, ప్రగతినగర్‌, టెలిఫోన్‌ క్వార్టర్స్‌, శివనగర్‌, బతుకమ్మకాలనీ, మార్కెండేయనగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ టౌన్‌ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎం.లావణ్య తెలిపారు.

  • ఆఫీసు
    సర్‌.. తూనికలు, కొలతలశాఖ కార్యాలయమెక్కడా? అంటూ కలెక్టరేట్‌కు వచ్చిన సతీశ్‌ ఎదురైన వారిని అడగటం, సర్‌.. డీపీవో కార్యాలయం ఎక్కడా ఎవరిని అడిగినా చెప్పడం లేదు. జర మీరైనా చెప్పరా.. అంటూ మానస ఆరా తీయడం.. వీరిద్దరే కాదు నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు కార్యాలయాల కోసం అన్వేషిస్తుంచడం నిత్యకృత్యం. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారంలో ఉన్న పాతకాలపు లేఔట్‌ను నమ్ముకుని అక్కడికి వెళితే ఆ ఆఫీసే ఉండదు. గత కొన్నేళ్లుగా ఇదీ ప్రజల పరిస్థితి. జిల్లా నలుములల నుంచి కలెక్టరేట్‌కు వచ్చేవారు ఎదుర్కొంటున్న సమస్య.

    దశాబ్దాల క్రితం నాటి లేఔట్‌

    కలెక్టరేట్‌

    కరీంనగర్‌ అర్బన్‌: కలెక్టరేట్‌ పద్మవ్యూహాన్ని మరిపిస్తోంది. ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, ప్రతి కుటుంబం వివరాలు తెలిసేలా అవగాహన ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పలు సమావేశాల్లోనూ వెల్లడించారు. కానీ ప్రజలకు పాలన చేరువవడం అటుంచితే కార్యాలయాలు ఎక్కడన్నది తెలియని అయోమయ పరిస్థితి జిల్లావాసులది. కలెక్టరేట్‌లో పాతకాలపు ప్రచారబోర్డులు ముక్కున వేలేసుకునేలా చేస్తుండగా గతంలో ఏర్పాటు చేసిన లేఔట్‌ గందరగోళానికి గురి చేస్తోంది. రెండంతస్తుల్లో కలెక్టరేట్‌ ఉండగా ప్రధాన ద్వారంలో ఉన్న లేఔట్‌ ప్రకారం కార్యాలయాలే లేవు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే కూల్చే కలెక్టరేట్‌ కదా అని దాటవేత మాటలు. మరి అలాంటప్పుడు నాలుగు రోజులు ఉండే కార్యాలయం కోసం మరమ్మతుల పేరిట రూ.లక్షలు వృథా చేయడమెందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

    పాత కాలపు ప్రచారబోర్డులు

    కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తుకు వెళ్తే చాలు గోడలపై ప్రభుత్వ పథకాల ప్రచార బోర్డులు దర్శనమిస్తుంటాయి. పథకాల తీరు తెన్నులు మారగా ముక్కున వేలేసుకునేలా వివరాలున్నా అధికారుల కళ్లకు కనిపించకపోవడం విడ్డూరం. వివిథ పథకాలకు సంబంధించి నిబంధనలు మారగా కొన్ని పథకాలే లేవు. ఈ క్రమంలో అవే ప్రచార బోర్డులు దశాబ్దాలుగా దర్శనమిస్తున్నాయి. చిన్న విషయమే కానీ ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ప్రజలకు ప్రహసనంగా మారుతోంది. సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం క్రమంలో కలెక్టరేట్‌ సగ భాగం కూల్చగా హెచ్చు కార్యాలయాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. కలెక్టరేట్‌ నిర్మాణం బిల్లులు రాక ఆగుతూ సా..గుతుండగా ప్రారంభం ఎప్పుడనేది అధికారులకే తెలియని పరిస్థితి. సదరు సమీకృత భవనం ప్రారంభమైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యేలా లేదు. గత ప్రభుత్వం 6 నెలల్లో పూర్తి చేయాలని నిధులు విడుదల చేయగా ఏళ్ల తరబడి సా..గుతునే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అయోమయానికి గురి కాకుండా కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం, గేట్ల వద్ద లేఔట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం అత్యవసరం. ఏ ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడున్నాయో స్పష్టంగా తెలిసేలా సమాచారాన్ని రూపొందిస్తే వేలమందికి ప్రయోజనం. ఇక పాత కాలపు ప్రభుత్వ పథకాల బోర్డులను తొలగించి ప్రస్తుత పథకాలను ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలి.

  • తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు

    కరీంనగర్‌: అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న వారిపై నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ), తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ) వరుస దాడులు చేస్తున్నా జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీల తీరులో మార్పు రావడం లేదు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు హెచ్చరిస్తున్నా ఇంజక్షన్లు వేస్తూ.. సైలెన్లు పెడుతున్నారు. ఓవర్‌ డోస్‌ మందులు ఇస్తూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. కొద్ది నెలలుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీలు, బయటపడిన ఘటనల నేపథ్యంలో ఓ ఆర్‌ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

    మోతాదుకు మించి మందులు

    జిల్లాలో ఊరూరా ఆర్‌ఎంపీ, పీఎంపీలు కొనసాగుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు, ఎలాంటి సమస్య అయినా అర్హతలేని వైద్యం చేస్తూ ప్రాణాల మీదకు తెస్తున్నారు. నగరంలోని ఓ మహిళకు ఇటీవల జ్వరం రాగా ఓ ఆర్‌ఎంపీ ఇంజక్షన్‌ ఇచ్చాడు. అది ఇన్‌ఫెక్షన్‌ కావడంతో పెద్దాస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులతో వైద్యాధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పలువురు ఏకంగా యాంటీబయాటిక్స్‌, స్టిరాయిడ్స్‌ను ఇస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అవసరం లేకున్నా ప్రిస్కిప్షన్‌ ఇస్తున్న వారిని గుర్తిస్తున్నారు. వైద్యం పేరుతో పెద్దాస్పత్రులకు సిఫార్సులు చేస్తున్నారని, అక్కడ అన్నిరకాల పరీక్షలు, ఆపరేషన్లు చేయించడంతో పాటు కమీషన్లు తీసుకుంటున్న విషయాన్నీ గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేయడమే కాకుండా ఆస్పత్రులు, మందుల దుకాణాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • అడవి.

    అర్బన్‌ పార్క్‌లో కొత్త అందాలు హరిదాస్‌నగర్‌ వద్ద సిరిసిల్ల అర్బన్‌ పార్క్‌ 200 ఎకరాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి

    సిరిసిల్ల: పని ఒత్తిడి, మానసిక ఒత్తిడికి గురయ్యే సిరిసిల్ల పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు అర్బన్‌ పార్క్‌ సిద్ధమైంది. పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో పార్క్‌ను ఏర్పాటుచేశారు. సిరిసిల్ల, వేములాడ పట్టణవాసులు సహా చుట్టుపక్కల వారు పొద్దంతా అడవి అందాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌–హరిదాస్‌నగర్‌ అటవీ ప్రాంతంలో 200 ఎకరాల్లో అర్బన్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అడవిలోకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డునూ ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు ఉల్లాసంగా గడిపేందుకు పూల మొక్కలు, గార్డెన్‌, ఆట వస్తువులు, వన భోజనాలకు వసతులు కల్పిస్తున్నారు. ధ్యానమందిరం ఏర్పాటు చేశారు. కూర్చోని సేదతీరేందుకు కుర్చీలు, బెంచీలున్నాయి. అడవి అందాలను, ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు టవర్లు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం రూ.3 కోట్లతో వివిధ పనులు చేపట్టారు. పార్క్‌లో ఇప్పటికే ఉన్న వృక్షాలు, మొక్కలకు తోడుగా ఖాళీ ప్రదేశాల్లో ఔషధ మొక్కలను, నక్షత్ర వనాలు, రాశివనాలనుపెంచారు. హెర్బల్‌ గార్డెన్‌, అడ్వెంచర్‌ టెక్కింగ్‌కు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కల చరిత్రను రాయనున్నారు. అడవిలోని నీటినిల్వ చేసేందుకు ఊట కుంటను , కుంట మధ్యలోకి వెళ్లేందుకు వంతెన కట్టారు. ‘అర్బన్‌ పార్క్‌లోకి ఆదివారాల్లో ఎక్కువ సందర్శకులు వస్తున్నారు. మిగితా రోజుల్లో సగటున పది మంది వస్తున్నారు. ఒక్కరికి రూ.10 నామమాత్రపు రుసుముతో అర్బన్‌ పార్క్‌లోకి అనుమతిస్తున్నాం. స్కూల్‌ పిల్లలకు రాయితీ ఇస్తున్నాం’.అని డిప్యూటీ రేంజ్‌ అధికారి ఎన్‌.మోహన్‌లాల్‌ తెలిపారు.

    పార్క్‌లో బుద్ధుడి విగ్రహం

    హరిదాస్‌నగర్‌ అర్బన్‌ పార్క్‌ కుంటలో వంతెన

  • అదుపు

    వేములవాడఅర్బన్‌: అతివేగం ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. తల్లిదండ్రులకు కన్నీటి శోకం మిగిల్చింది. ఇరు కుటుంబాలకు ఒక్కగానొక్క కుమారులు మృతిచెందడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రం హనుమాన్‌వీధికి చెందిన గుడికందుల మణిచరణ్‌ (18) అగ్రహారంలో అద్దె గదిలో ఉంటూ శ్రీ రాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్నాడు. ఆదివారం తన స్నేహితుడి బైక్‌ తీసుకుని సిరిసిల్ల మండలం రగుడులోని మరో స్నేహితుడు, క్లాస్‌మేట్‌ బూర శశికుమార్‌ (18) వద్దకు వెళ్లి తిరిగి ఇద్దరూ వస్తున్నారు. వేములవాడ మండలం అగ్రహారం శివారులోని సిరిసిల్ల– వేములవాడ రహదారిపై అతివేగంతో బైక్‌ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మణిచరణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. శశికుమార్‌ను కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • 24న మెట్‌పల్లిలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు

    మెట్‌పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 24న మొదటి ఆస్మిత లీగ్‌ జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థినులతో ఆదివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలు అందించి పోటీలను విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ బాలికలకు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించడం కోసం దేశ వ్యాప్తంగా 300 జిల్లాలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుల్లా కపిల్‌, రాందాస్‌, మరిపెల్లి కార్తీక్‌ తదితరులున్నారు.

  • గుండె

    మేడిపల్లి: భీమారం మండలం మన్నేగూడెం లైన్‌మన్‌ ధనుంజయ్‌ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. విధుల్లో ఉన్న ధనుంజయ్‌ మధ్యాహ్న భోజనానికి ఇంటికొచ్చాడు. చాతిలో నొప్పిగా ఉందని కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ధనుంజయ్‌కు భార్య భావన, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

    చికిత్స పొందుతూ గీతకార్మికుడు..

    రామడుగు: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడిపోయిన గీత కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామడుగు ఎస్సై రాజు వివరాల ప్రకారం.. మండలంలోని గుండి గ్రామానికి చెందిన చిలువేరి రాములు గీత కార్మికుడు. శుక్రవారం మధ్యాహ్నం కల్లుగీయడానికి తాటిచెట్టు ఎక్కగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కుటంబసభ్యులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది బ్రెయిన్‌ డెడ్‌ అయిటన్లు నిర్ధారించారు. తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా ఆదివారం వేకువజామున చనిపోయాడు. మృతుడి కొడుకు చిలువేరి శ్రీనివాస్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

    జమ్మికుంటలో యువరైతు..

    జమ్మికుంట: వర్షాలకు పంట నష్టపోయి, చేసిన అప్పు తీర్చే మార్గంలేక ఓ యువ రైతు పురుగుల మందు తాగగా.. చికిత్స పొందు తూ ఆదివారం చనిపోయా డు. టౌన్‌ సీఐ రామకృష్ణ వి వరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామానికి చెందిన సోమల్ల హరీశ్‌(28) రెండెకరాల సొంతభూమితో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి దిగుబడి రాలేదు. వరి నేలవాలింది. గతంలో రూ.3లక్షల అప్పు ఉండగా, పంట కోసం చేసిన అప్పు రెట్టింపైంది. తీర్చే మార్గం కనిపించకపోవడంతో శనివారం వ్యవసాయ పొలం వద్ద పురుగులు మందు తాగాడు. కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. హరీశ్‌ తండ్రి సదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

    టీ కోసం వెళ్తే.. ప్రాణమే పోయింది

    ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌ గ్రామంలో రేకులసజ్జ(సబ్‌–జా) మీదపడి అంతగిరి రాజేశ్వరి(65) ఆదివారం మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గడబోయిన ఐలమ్మతో రాజేశ్వరికి స్నేహసంబంధం ఉంది. రోజూ టీ తాగేందుకు ఐలమ్మ ఇంటికి వెళ్లింది. ఆమె రాకతో టీ తయారు చేసేందుకు ఐలమ్మ ఇంట్లోకి వెళ్లింది. సజ్జకింద కూర్చున్న రాజేశ్వరి మీద రేకులసజ్జ హఠాత్తుగా కూలింది. ఈఘటనలో రాజేశ్వరి తలపగిలి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు బుచ్చిమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు.

Karnataka

  • అవినీతి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

    కేజీఎఫ్‌: అవినీతి రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత కావాలని మానవ వనరుల శాఖ డైరెక్టర్‌ దేబి ప్రసాదర్‌ సత్పతి అన్నారు. బెమెల్‌ కాంప్లెక్స్‌లోని కళా క్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విజిలెన్స్‌ జాగృతి సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలనలో నైతికత, పారదర్శకత కలిగి ఉండాలన్నారు. బెమెల్‌ కేజీఎఫ్‌ విభాగం ప్రముఖుడు యోగానంద మాట్లాడుతూ అవినీతిపై పోరాటంలో సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములను చేయాల్సి ఉందన్నారు. మానవ వనరుల ప్రముఖులు నీనాసింగ్‌, యోజనా ప్రముఖుడు మల్లికార్జున రెడ్డి, విజిలెన్స్‌ విభాగం ప్రముఖుడు వినయ్‌ పాల్గొన్నారు.

  • బొమ్మనహాళ్‌: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఇప్పుడు భయానకంగా మారింది. హెచ్చెల్సీలో గత రెండు రోజుల వ్యవధిలోనే మూడు మృతదేహాలు బయటపడడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. బొమ్మనహాళ్‌ హెచ్చెల్సీ సెక్షన్‌ పరిధిలోని డి.హీరేహాళ్‌ మండలం నాగలాపురం సమీపంలోని 117, 116 కిలోమీటర్ల వద్ద శనివారం రెండు మృతదేహాలు బయట పడగా.. ఆదివారం మరో మృతదేహం తేలింది. కాళ్లకు తాళ్లు కట్టేసి ఉండడంతో మిస్టరీగా మారింది. ప్రమాదమా? హత్యనా? ఆత్మహత్యానా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఒకే ప్రాంతంలో వరుసగా మూడు మృతదేహాలు లభ్యం కావడం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కనిపించిన రెండు మృతదేహాల్లో హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఉన్న ఓ శవాన్ని ముందుకు తోసేయడంతో అది ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తును తప్పించుకునేందుకు హెచ్చెల్సీ ఉపరిభాగంలో ఉన్న పోలీసులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని, అయితే దిగువన ఉన్న డి.హీరేహాళ్‌ పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోజుకొక శవం కాలువలో కొట్టుకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మృతదేహాలు కర్ణాటక ప్రాంతం నుంచి కొట్టుకువచ్చాయా? లేదా జిల్లా వాసులవా? అనేది తేలాల్సి ఉంది.

    ప్రసన్న వేంకటరమణ స్వామికి పూజలు

    మాలూరు: కార్తీక మాసం సందర్భంగా తాలూకాలోని చిక్కతిరుపతి గ్రామంలోని ప్రసిద్ధ యాత్రాస్థలమైన చిక్కతిరుపతిలో ప్రసన్న వేంకట రమణస్వామి ఆలయంలో స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాన అర్చకుడు గోపాల కృష్ణ భరద్వాజ్‌ నేతృత్వంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. స్థానికులతోపాటు తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

    గ్రామ పంచాయతీ కట్టడం ప్రారంభం

    శ్రీనివాసపురం: తాలూకాలోని ముదువాడి గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన మొదటి అంతస్తును ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉందని, అయినా తాలూకాలో అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు అందించాల్సిన నిధులను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అందించడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇంచర గోవిందరాజు, సమాజ సేవకుడు శ్రీనాథ్‌, తాపం ఈఓ మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కన్నడ

    రాయచూరురూరల్‌: రాష్ట్రంలో కన్నడ భాషకు తోడుగా.. గడినాడు కన్నడలో చేస్తున్న సేవలు అపారమని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు రామణహవళే అభిప్రాయపడ్డారు. హోసముని ప్రకాశన స్థానిక కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన న్రపతుంగ అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామణహవళే మాట్లాడుతూ గడినాడులో కన్నడ భాష సంరక్షణకు బషీరుద్దీన్‌ చేస్తున్న సేవలకు అందరూ సహకరించాలన్నారు. ఎనిమిది జ్ఞానపీఠ అవార్డులు కన్నడకు లభించాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన చామరస మాలి పాటిల్‌, బాషా, అయ్యప్పహుడా, సయ్యద్‌గౌస్‌ మెయినుద్దీన్‌, పీర్‌జాద్‌ ఈరణ్ణ, రామలింగప్ప, బీరప్ప శంభోజీ, వీరేంద్ర, విక్రమరాజ, పద్మ, సోనమ్మలను న్రపతుంగ అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోపీ, షంషాద్‌బేగం, పర్వీనాబేగం, శీపా, ఋషి పాల్గొన్నారు.

    ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

    హొసపేటె: హొసపేటె తాలూకా మరియమ్మనహళ్లి పట్టణంలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల నుంచి 14–17 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. మొత్తం 892 మంది వరకు పోటీదారులు పేర్లు నమోదు చేసుకోగా, 692 మంది పోటీలలో పాల్గొన్నారు. అదే విధంగా 30 మంది న్యాయనిర్ణేతలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి.

    కార్తీక వనభోజనం

    హొసపేటె: హొసపెటెలో నివసిస్తున్న తెలుగు సభ్యులు సంప్రదాయ పద్ధతిలో కార్తీక వన భోజనాలు ఘనంగా నిర్వహించారు. బళ్లారి రహదారిలోని వడ్రళ్లి తోటలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. కర్ణాటక తెలుగు సంఘం అధ్యక్షుడు ఆర్‌.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ధర్మారావు, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీకమాసం శివుడు, విష్ణువులకు ప్రీతికరమైన నెల అన్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌, రమణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

    ఆర్‌ఎస్‌ఎస్‌ను

    నిషేధించాలనడంపై ఆగ్రహం

    హుబ్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థను నిషేధించాలనడం మూర్ఖత్వమేనని శ్రీరామ సేనా చీఫ్‌ ప్రమోద్‌ ముతాలిక్‌ అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం ప్రియాంకఖర్గే, ఆయన తండ్రి వల్ల కూడా సాధ్యం కాదన్నారు. ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుని, బలమైన పునాది కలిగిన సంస్థను నిషేధించాలని ప్రయత్నించినా.. అడ్డంకులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిందన్నారు. దేశాన్ని విడగొట్టి నాశనం చేసిన కాంగ్రెస్‌కు 130 ఏళ్ల చరిత్ర ఉన్నా.. ముక్కలు చెక్కలై పాడైందన్నారు.

    అందరినీ ఒప్పించి చెరకు

    ధర నిర్ణయించాం

    హుబ్లి: చెరకు కర్మాగారాల యజమానులను ఒప్పించి కేంద్రం మద్ధతు ధరకంటే అదనంగా రూ.700 ఇప్పించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎంబీ.పాటిల్‌ అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ బాగళకోటె, విజయపుర నగరంలో చెరకు ధర విషయలో గందర గోళం నెలకొందన్నారు. కేంద్ర సర్కారు రూ.3550 ధర నిర్ణయించిందని తెలిపారు. చెరకు కోత రవాణా వ్యయం రూ.900 అవుతుంటే.. కేంద్రం రూ.2600, రూ.2700 మద్ధతు ధర ఇచ్చిందన్నారు. ప్రస్తుతం సీఎం సూచనతో ఎంఆర్పీ ధర కన్నా రూ.700 పెరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర చెరకు రైతుల సమస్యలను ఆసరాగా తీసుకుని డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బిడ్డగా చెప్పుకొనే విజయేంద్రకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకుని సమస్య విన్నవించాలని ఆయన సూచించారు.

  • ఉచిత

    రాయచూరురూరల్‌: నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు కళ్యాణ కర్నాటక అభివృద్ధి మండలి నుంచి రూ.850 కోట్ల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్‌ పేర్కొన్నారు. సిరవార తాలుకా సముదాయ అరోగ్య కేంద్రం వసతి గదుల నిర్మాణాలకు ఆది వారం ఆయన భూమి పూజ చేశారు. మంత్రి బోసురాజ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పంచ గ్యారెంటీల పథకం అమలుపై ప్రస్తావించారు. అస్పత్రులలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా వైద్య సేవలందించేందుకు అధికారులు ముందుంటారన్నారు. కార్యక్రమంలో మాన్వి శాసన సభ్యుడు హంపయ్యనాయక్‌, జిల్లా అరోగ్య అధికారి సురేంద్రబాబు, అశోక్‌పవార్‌ పాల్గొన్నారు.

    విద్యార్థుల శ్రమదానం

    రాయచూరు రూరల్‌: స్వచ్ఛత అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా లింగసూగురు తాలుకా జలదుర్గంలో రాయచూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ఆదివారం శ్రమదానం నిర్వహించారు. పరిసరాల సంరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ నిషేధం అంశాలపై అవగాహన కల్పించి స్వచ్ఛతకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్థానిక విశ్రాంతి భవనం, ఉద్యాన వనం, దేవాలయాల చుట్టూ చెత్తా చెదారం తొలగించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సంతోష్‌కుమార్‌, అన్నపూర్ణ, జమున, నరసమ్మ, నాగమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

    దత్తాత్రేయుడికి పల్లకీ సేవ

    రాయచూరురూరల్‌: రాయచూరు తాలుకా గుంజహళ్లి దతాత్రేయస్వామి అలయంలో స్వామికి పల్లకీసేవ ఆదివారంౖ వెభవంగా నిర్వహించారు. నల్లన్న స్వామి 17వ అరాధన సందర్భంగా మఠాధిపతి భాస్కర్‌స్వామి అధ్వర్యంలో అనంతరం దేవాలయం నుంచి కృష్ణానది వరకూ పల్లకీ సేవ జరిపారు. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

    కసాప సేవల విస్తరణ

    రాయచూరురూరల్‌: జిల్లాలో కన్నడ సాహిత్య పరిషత్‌ సేవలను విస్తరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రంగణ్ణపాటిల్‌ పేర్కొన్నారు. స్థానిక కన్నడ భవనంలో నూతన తాలుకా కన్నడ సాహిత్య పరిషత్‌ పదాధికారుల సభలో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ పదాధికారుల సేవలు విస్త్రతం చేయాలని, కసాప కార్యక్రమాలను చేపట్టడానికి అందరు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విజయేంద్ర రాజేంద్ర, శరణబసవ, మహదేవప్ప, మౌనేష్‌, శివరాజ్‌, విద్యావతి పాల్గొన్నారు.

    జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రగౌడ

    బళ్లారిటౌన్‌: కర్ణాటక వర్నింగ్‌ జర్నలిస్ట్‌ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఎన్‌.వీరభద్రగౌడ ఎన్నికయ్యారు. ఆదివారం జర్నలిస్టు యూనియన్‌ ఎన్నికలు జరపగా ప్రత్యర్థి రవికుమార్‌పై 23 ఓట్ల తేడాతో వీరభద్రగౌడ గెలుపొందారు. అదే విధంగా మూడు ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్‌.గురుశాంత, వాగిష, మల్లయ్య ఎన్నికయ్యారు. ఇక కార్యవర్గ సభ్యులుగా హెచ్‌.ఎం.బసవరాజు, ప్రధాన కార్యదర్శిగా నరసింహమూర్తి, కోశాధికారిగా అశోక్లు ఎన్నికయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యుల ఓట్ల లెక్కింపు రాత్రి పొద్దుపోయేంత వరకూ జరిగింది.

  • సీటీ రవిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

    కోలారు: మాజీ మంత్రి , బీజేపీ నేత సీటీ రవిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జిల్లాకాంగ్రెస్‌ సమితి వెనుక బడిన వర్గాల విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆదివారం ఎస్పీ నిఖిల్‌ను కలిసి వినతిత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ సీటీ రవి చిక్కమగళూరు మెడికల్‌ కళాశాలలో ఓ సముదాయాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలోఅశోక్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

    సిద్దును తొలగిస్తే అంతే

    కోలారు: సీఎం సిద్దరామయ్యను పదవి నుంచి దించితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధఃపాతాళానికి చేరుతుందని మాజీ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్‌ అన్నారు. ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సిద్దరామయ్యను తొలగిస్తే 25 లక్షల మంది కురుబ సముదాయ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తారని చెప్పారు. కురుబలు, అహింద సముదాయం ఐకమత్యంగా ఉండడం వల్లనే సిద్దరామయ్య జోలికి వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారన్నారు.

    కడ్లె గౌరమ్మ నిమజ్జనం

    హుబ్లీ: కర్ణాటక, ఉమ్మడి ఆంధ్ర సరిహద్దున గల విడపనకల్లులో వెలసిన కడ్లె గౌరమ్మ నిమజ్జన వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఏటా కార్తీక పౌర్ణమి తర్వాత ఈ వేడుక నిర్వహిస్తారు. బళ్లారి, అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా ఉద్దేహాల్‌, బొమ్మనహాల్‌, శ్రీధరగడ్డ, ఉంతకల్లు, కణేకల్లు, ఉరవకొండ తాలూకాల్లో గౌరమ్మ వేడుకలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో గౌరమ్మకు పూజలు జరిపారు. విడపనకల్లులో మాత్రం కడ్లెగౌరమ్మ నిమజ్జనం ఘనంగా సాగింది. అమ్మవారి బావిలో నిమజ్జనం కాగానే ఇటు కోడి, పొట్టేలు మాంసం ఎగబడి కొనుగోలు చేశారు. బంధు మిత్రులతో కలిసి జాతరలో పాల్గొన్నారు.

    రైతుల పోరుబాట

    హుబ్లీ: రాష్ట్రంలో సిద్ధరామయ్య సర్కారు నిర్లక్ష్యంతోనే చెరకు రైతులు పోరుబాట పట్టారని మాజీ సీఎం బెళగావి జగదీశ్‌ శెట్టర్‌ మండిపడ్డారు. నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అన్నదాతలపై ఇసుమంతైన శ్రద్ధ లేదని, ధరకోసం పోరాడే వారిని అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల తీవ్ర పోరాటంతో కొంత ఉపశమనం కలిగినా.. ధర పెంపు నిర్ణయానికి ఇంకా ఆమోదం తెలపలేదన్నారు.

    మహిళ ఆత్మహత్య

    క్రిష్ణగిరి: అనుమానాస్పద స్థితిలో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. వివరాల మేరకు తిరుపత్తూరు జిల్లా చిన్న వెంగాయంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (41). క్రిష్ణగిరి జిల్లా బర్గూరు సమీపంలోని మట్టారంపల్లి ప్రాంతంలో నివాసముంటూ అక్కడే పండ్ల రసాల ఫ్యాక్టరీలో పనిచేసేది. ఆదివారం ఉదయం గదిలో ఉరివేసుకొన్న స్థితిలో శవమైంది. పోలీసులు శవాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరుపుతున్నారు.

  • 74 చె

    హొసపెటె: రూ.870 కోట్లతో 74 చెరువులను నీటితో నింపే ప్రాజెక్టును చేపట్టినట్లు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కూడ్లిగి నియోజకవర్గంలో ఆ ప్రాజెక్టు పనులతోపాటు, రూ.1750 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ కూడ్లిగి బంజరు భూమిలో పచ్చదనం నింపేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ కృషి చేశారని ప్రశంసించారు. గృహలక్ష్మి, గృహ జ్యోతి, ఇతర ప్రయోజనాల ద్వారా 1.20 కోట్ల కుటుంబాల యజమానులకు లక్షల కోట్ల రూపాయలు నేరుగా జమ చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలపై బీజేపీ అబద్ధాలను పంచుతోందన్నారు. సిగ్గు లేకుండా కొందరు ఓటు చోరీకి పాల్పడి పట్టుబడ్డారని అన్నారు. చెరకు రైతులకు ఎంఆర్‌పీ, ఎంఎస్‌పీ ధరను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రహ్లాద్‌ జోషి చెరకు రైతులకు ద్రోహం చేశారని విమర్శించారు. విజయేంద్ర బెల్గాం వెళ్లి నిరసన నాటకం సృష్టించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని దాచిపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు రైతులకు రక్షణ కల్పించడానికి కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌, మంత్రులు సతీష్‌జారికి హొలె, జమీర్‌ అహమ్మద్‌ఖాన్‌, సంతోష్‌లాడ్‌, సుధాకర్‌, బోసురాజ్‌, ఎంపీ తుకారాం, ఎమ్మెల్యేలు డాక్టర్‌.శ్రీనివాస్‌, లతా మల్లికార్జున, బీఎం నాగరాజ్‌ గోపాల్‌ కృష్ణ మాజీ మంత్రులు అల్లం వీరభద్రప్ప, ఆంజనేయులు, జిల్లాధికారి కవితా ఎస్‌మన్నికేరి, తదితరులు పాల్గొన్నారు.

    కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి

    సిద్ధరామయ్య

  • ఉచితం

    రాయచూరు రూరల్‌: జిల్లాలో ఉచితంగా రక్త పరీక్షలు చేయాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు పేర్కొన్నారు. కవితాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. దోమల నివారణకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టాలని సిబ్బందిని అదేశించారు. ఇంటి వద్ద పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ రక్తపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు.

    దోమల నివారణపై ప్రచారం

    రాయచూరురూరల్‌: నగరంలో దోమల నివారణపై ఇంటింటా ప్రచారం చేపట్టాలని రాయచూరు గ్రీన్‌ సంచాలకుడు రాజేంద్రకుమార్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. హరిజనవాడ ప్రాథమిక అరోగ్య కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటి చుట్టూ మెక్కలు నాటి పరిసరాలను సంరక్షించుకోవడం, శుభ్రత పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సరోజ, సంధ్య, పాల్గొన్నారు.

  • రూ.180 కోట్ల నిధుల కేటాయింపు

    రాయచూరులో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాయి. రాష్ట్ర సర్కారు రూ.180 కోట్లతో టెండర్‌ పిలిచింది. రైట్‌ సంస్థ రూ. 216 కోట్ల నిధులు కేటాయించింది. కళ్యాణ కర్నాటక అభివృద్ధి మండలి, జిల్లా గనుల శాఖ, కేఎస్‌ఐడీఎల్‌ అధ్వర్యంలో పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యకీయ శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ అధికారులు, టెండరు దక్కించుకున్న గుత్తేదారులను అదేశించారు. అధికారులతో సమీక్షించిన ఆయన పెండింగ్‌ పనులు, రన్‌వే, ఇతరత్రా పనులను వేగవంతం చేయాలని సూచించారు. భూమి సర్వే చేయడంతోపాటు, బాధితులకు పరిహారం అందించే విషయంపై ఎవరూ అలక్ష్యం చేయరాదన్నారు.

  • విలేకరుల సంఘం ఎన్నికలు

    చెళ్లకెర రూరల్‌: చిత్రదుర్గ కర్ణాటక కార్యనిరత విలేకరుల సంఘం ఎన్నికలు ఆదివారం శాంతియుతంగా జరిగాయి. అధ్యక్షుడిగా వినాయక తొడరనాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్య సమితి సభ్యత్వ స్థానానికి దీనేష్‌ గౌడగెరె, రాజశేఖర్‌, సిద్ధరాజు మధ్య తీవ్ర పోటీ జరిగింది. డైరెక్టర్లు ఎస్‌.అమిత్‌, టీఎస్‌.కుమార్‌, హెస్‌సీ.గిరీష్‌, చౌలూరు మంజునాథ్‌, జడేకుంటే మంజు నాథ్‌, టీజే.తిప్పేస్వామి, టి.దర్శన్‌, ఎస్టీ నవీణ్‌కుమార్‌, హెచ్‌టీ.ప్రసన్న, జీఓఎన్‌.మూర్తి, ఎస్‌బీ.రవి కుమార్‌, రవి మల్లాపుర, ఎస్‌.రాజశేఖర్‌, విశ్వనాథ్‌, కేజీ వీరేంద్ర కుమార్‌, గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, ట్రెజరర్‌, ఉపాధ్యక్ష స్థానాలకు, రాజ్య సభ సభ్యత్వ స్థానానికి ఇది వరకూ ఇంకా ఫలితాలు వెలువడలేదు. ఎన్నికల అధికారిగా చిక్కప్పనహళ్లి షణ్ముకప్ప బాధ్యతలను చేపట్టారు.

Sports

  • హాం​కాంగ్ సిక్సెస్-2025 విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కువైట్‌ను చిత్తు చేసిన పాక్‌.. రికార్డు స్దాయిలో ఆరోసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్‌ను ముద్దాడింది. అబ్బాస్ అఫ్రిది నాయకత్వంలో పాక్ జట్టు భారత్‌పై ఓటమి పాలైనప్పటికి.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఫైనల్లో విజయం తర్వాత పాక్ ఆటగాడు మహ్మద్ షాజాద్  ఓవరాక్షన్ చేశాడు.

    భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐకానిక్ ట్రోఫీ సెలబ్రేషన్‌ను మహ్మద్ షాజాద్ కాపీ చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత పాండ్యా ట్రోఫీని త‌న ముందు పెట్టుకుని భుజాలు ఎగరేస్తూ ఫోటోల‌కు పోజ్ ఇచ్చాడు. ఇప్పుడు షాజాద్ కూడా అదే విధంగా చేశాడు.

    ఇందుకు సంబంధించిన ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అందుకు క్యాప్ష‌న్‌గా హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ ఫ‌న్ ముగిసింది. ఇక్క‌డ మాకు మ‌ద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఛాంపియ‌న్‌షిప్‌ను సొంతం చేసుకోవ‌డం ఎల్లప్పుడూ ప్ర‌త్యేక అనుభూతిని క‌లిగిస్తోంది అని షాజాద్ ఇచ్చాడు.

    అయితే షాజాద్‌ భార‌త కెప్టెన్ దినేష్ కార్తీక్‌కు కౌంట‌ర్‌గా ఈ పోస్ట్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాక్‌పై విజ‌యం త‌ర్వాత కార్తీక్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. పాకిస్తాన్‌పై విజ‌యంతో హాంకాంగ్ సిక్సెస్ ఫ‌న్ మొద‌లైంది అంటూ కార్తీక్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

    ఇప్పుడు ఫ‌న్ ముగిసిందని షెజాద్‌ అతి చేశాడు. ఇందుకు సంబంధిం‍చిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీంతో షెజాద్‌పై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచమైనా మీకు సిగ్గు ఉందా?  సెల‌బ్రేష‌న్స్ కూడా కాపీనేనా అనా ఓ యూజ‌ర్ కామెంట్ చేశాడు. మీరు ఏమైనా వరల్డ్‌కప్ ట్రోఫీని సాధించారా? ఆ పోజులు ఏంటి? అని సొంత అభిమానుల సైతం షెజాద్‌పై ఫైరవతున్నారు.

Parvathipuram Manyam

  • పార్శిల్‌ పేలుడు బాధితుడికి  ఆర్థిక సాయం

    రూ.50వేలు అందజేసిన మజ్జి సిరిసహస్ర

    పార్వతీపురం రూరల్‌: ఇటీవల పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ పార్శిల్‌ కౌంటర్‌ వద్ద జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన రెడ్డి రమేష్‌కు చిన్న శ్రీను సోల్జర్స్‌ సంస్థ అపన్నహస్తం అందించింది. ఆ సంస్థ అధినేత ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుడు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరిసహస్ర జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు రమేష్‌ను పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ద్వారా విషయాన్ని తెలుసుకుని తన తండ్రి సూచన మేరకు పరామర్శించినట్లు ఆమె తెలిపారు. చిన్న శ్రీను సోల్జర్స్‌ తరఫున ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పరామర్శకు ముందు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి ముచ్చటించారు. కార్యక్రమంలో ఆమెతోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు, మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ కొండపల్లి రుక్మిణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, బీసీ సెల్‌ అధ్యక్షుడు గొర్లి మాధవరావు, కౌన్సిల్‌ సభ్యులు సంగం రెడ్డి లక్ష్మీపార్వతి, సువ్వాడ లావణ్య, యడ్ల త్రినాథ, నాయకులు చింతాడ శైలజ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • ఘనంగా ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ దినోత్సవం

    గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దొరజమ్ము గ్రామంలో ఆదివారం ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌(ఏటీఏ) ఆవిర్భావ దినోత్సవంతో పాటు బిర్సా ముండా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాడంగి సత్యనారాయణ మాట్లాడుతూ బిర్సా ముండా స్ఫూర్తితో తమ సంఘం పోరాటాలు చేస్తుందన్నారు. ఈనెల 15వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో బిర్సా ముండా జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. రద్దయిన జీవో నంబర్‌ 3 స్థానంలో ఏజెన్సీలో ఉద్యోగ నియామక చట్టం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న టీచర్స్‌, సీఆర్‌టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా సభ్యురాలు భారతి, గోవింద్‌, ముత్యాలు, వెంకటేశ్వర్లు, భగవాన్‌, రవి, యోగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

  • కొనసాగిన ఖోఖో పోటీలు

    విజయనగరం: జిల్లా వేదికగా రెండవ రోజు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆదివారం కొనసాగాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. సోమవారం ఫైనల్స్‌ నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అంతేకాకుండా జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్‌ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ జిల్లాల నుంచి పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక కస్పా ఉన్నత పాఠశాలలో వసతి కల్పించిన క్రీడాకారులకు స్నానాలు చేసేందుకు అనువైన సదుపాయాలు లేకపోవడంతో పాఠశాల ఆవరణలో ఆరుబయట స్నానాలు చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం బురదమయంగా మారడంతో రోజువారీ శిక్షణకు వచ్చే క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు.

  • కంటిత

    బాధితుల నరకయాతన

    ఆర్టీసీ పేలుడు బాధితుడు చేతి నుంచి రాయి బయటకు తీసిన ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు

    పార్వతీపురం రూరల్‌: జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేస్తూ కుదిపేసిన ఆర్టీసీ పార్శిల్‌ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన బాధితులకు నరకయాతన తప్పడం లేదు. తమకేమీ సంబంధం లేని ఓ ఘటన వారిని ఆస్పత్రి పాలు చేసి వారికి, కుటుంబసభ్యులకు తీవ్రమైన బాధను మిగిల్చింది. అయితే బాధితులకు పెద్ద ఆస్పత్రిలో సైతం భరోసా కరువైంది. బాధితుల్లో ఒకరైన రెడ్డి రమేష్‌ (కలాసీ) వైద్య సేవల్లో ఎదురైన పరాభవం పభుత్వ వైద్య సేవల తీరుకు అద్దం పడుతోంది. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్‌ను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించగా సుమారు వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అక్కడి వైద్యుల నుంచి కనీస స్పందన కరువైంది. సరైన చికిత్స అందించకుండానే కంటి తుడుపుగా సేవలందించి తమకేమీ పట్టనట్లు డిశ్చార్జ్‌ చేశారని రమేష్‌ చెల్లి వాపోయింది. గత నెల 27న ప్రైవేట్‌ అంబులెన్స్‌లో చేసేది ఏమీ లేక అర్ధరాత్రి పార్వతీపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. దేవుడిపై భారం వేసి జిల్లా కేంద్రంలో గల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు.

    ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెలికితీసిన రాళ్లు

    సదరు ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు రమేష్‌ రెండు కాళ్లను పరిశీలించి శరీరంలో కాలిన గాయాలకు మెరుగైన చికిత్స అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. అలాగే రెండు కాళ్లకు శస్త్ర చికిత్స చేసి పేలుడు సమయంలో శరీరంలోకి వెళ్లిన రాళ్లను బయటకు తీశారు. దీంతో కేజీహెచ్‌లో చేసిన కంటి తుడుపు వైద్యం తేటతెల్లమైంది. తాజాగా ఆదివారం

    రమేష్‌ చేతికి చేసిన శస్త్రచికిత్సలో అంగుళం పరిమాణంలో ఉన్న మరో రాయిని బయటకు తీయడం గమనార్హం. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యులు అందించిన సేవలు చూస్తుంటే ప్రభుత్వ వైద్యసేవలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయని, దానికి ఉదాహరణ బాధితుడు రమేష్‌కు చేసిన శస్త్రచికిత్స అని పలువురు విమర్శిస్తున్నారు.

  • ఫెన్స

    విజయనగరం: రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో జరగనున్న సీనియర్స్‌ సీ్త్ర, పురుషుల ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరుకాగా పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది క్రీడాకారులను అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయిపోటీలకు అర్హత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ చీఫ్‌ కోచ్‌ డీవీ చారిప్రసాద్‌, పలువురు శిక్షకులు పాల్గొన్నారు.

    రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం

    సత్తెనపల్లి: 12వ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లాల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ 2025 విజేతగా గుంటూరు నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన 12వ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లాల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ 2025 పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరు టీమ్‌ చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని విజయనగరం టీమ్‌, తృతీయ స్థానం అనంతపురం టీమ్‌ కై వసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు హాజరై మాట్లాడారు. క్రీడలతోపాటు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాలో 415 పోస్టుల్లో 49 పోస్టులు సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు దక్కడం అభినందనీయమన్నారు.

    ట్రాక్టర్‌ బీభత్సం..

    తప్పిన ప్రమాదం

    రాజాం సిటీ: మండల పరిధి ఒమ్మి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్‌ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్‌ తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన చెరుకూరి గణేష్‌ ద్విచక్రవాహనం నిలుపుదల చేసి ఒమ్మి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో రాజాం నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి మోటార్‌సైకిల్‌తో పాటు గణేష్‌ను, రోడ్డు పక్కన ఉన్న బోనంగి శ్రీహరినాయుడిని ఢీకొని పక్కనున్న బట్టీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గణేష్‌, శ్రీహరినాయుడు, కూరగాయలు విక్రయిస్తున్న పల్లా నర్సమ్మకు గాయాలయ్యాయి. ఇది గమనించిన మరికొంతమంది స్థానికులు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అప్రమత్తమైన బాధితులను 108 సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

    బస్సు, లారీ డీ: ఇద్దరికి స్వల్పగాయాలు

    దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి, మరడాం మధ్యలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామభద్రపురం నుంచి రెండు వాహనాలు గజపతినగరం వెళ్తుండగా కోమటిపల్లి మరడాం మధ్యలో వెనుక నుంచి లారీని బస్సు ఢీకొనడంతో బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా తోటి ప్రయాణికులు వారిని మరో బస్సు ఎక్కించి పంపించారు. ఈ విషయమై ఎస్‌ బూర్జవలస ఎస్సై వద్ద ప్రస్తావించగా తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.

  • తాటిప

    పర్యాటకులను ఆకర్షిస్తున్న బుచ్చి

    అప్పారావుజలాశయం

    ప్రత్యేక ఆకర్షణగా కాటేజీ అందాలు

    ● కార్తీకమాసంలో పెరుగుతున్న పర్యాటకులు

    గంట్యాడ: జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో తాటిపూడి ఒకటి. ఇక్కడ ఉన్న ఆహ్లాదకర అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో పర్యాటకులు వనభోజనాల (పిక్నిక్‌) కోసం వస్తారు. తాటిపూడిలో ఉన్న గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం అందాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. పచ్చని కొండ కోనల మధ్య జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం అందాలు పాపికొండలను తలపించేలా ఉన్నాయి. బోటుషికారు కూడా ఉండడంతో పర్యాటకులు ఆసక్తిగా వస్తున్నారు.

    ముచ్చట గొల్పుతున్న కాటేజీ అందాలు

    బుచ్చి అప్పారావు జలాశయం అవతల పర్యాటకులు విడిది చేసేందుకు కాటేజీ కూడా ఉంది. పర్యాటకులు ఉండేందుకు రూమ్‌లు కూడా అందంగా తీర్చిదిద్దారు. ఏసీ, నాన్‌ ఏసీ రూమ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కాటేజీ ప్రాంతాన్ని అందమైన పెయింటింగ్స్‌తో తీర్చిదిద్దడంతో ఆహ్లాదకరంగా అప్రాంతం ఉంది. దీంతో పర్యాటకులు కాటేజీని సందర్శించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ ఉన్న గిరివినాయక విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కాటేజీ ప్రాంతం అరకులో ఉండే అనుభూతిని కల్గిస్తోందని పర్యాటకులు ప్రశంసిస్తున్నారు.

    అన్ని సౌకర్యాలు ఉన్నాయి

    కార్తీక మాసంలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకుల కోసం కాటేజీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. ఏసీ, నాన్‌ ఏసీ రూమ్‌లు కూడా ఉన్నాయి. పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. భోజన వసతి కూడా ఉంది.

    సీహెచ్‌.శేషు, కాటేజీ మేనేజర్‌

  • జాతీయ స్థాయికి ఎంపికై న చెస్‌ క్రీడాకారులు

    సీతానగరం: మండలంలోని జోగింపేట ఎస్‌ఓఈ విద్యాలయంలో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో మూడురోజులు జరిగిన చెస్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. శుక్ర, శని.ఆదివారాల్లో జరిగిన 79వ రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి 398 మంది క్రీడాకారులు 70 మంది అఫీయల్స్‌ పాల్గొన్నారు.

    జాతీయ స్థాయికి ఎంపికై న ప్రతిభావంతులు..

    అండర్‌ 17, అండర్‌ 19 వ్యక్తిగత, టీం విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి నేషనల్‌ టీమ్‌కు ఎంపికై న క్రీడాకారులు వీరే..

    అండర్‌ 19 బాలికలు ఎస్‌జీఎఫ్‌ ఏపీటీం–2025

    ఆత్మకూరి టింపుల్‌ ప్రియ–నెల్లూరు. లలిత వై–అనంతపురం.

    వేముల ప్రద్యుమ్న లక్ష్మి–నెల్లూరు. రెడ్డి నవ్యసాహితి–కృష్ణా.

    అండర్‌ 19 బాలురు ఎస్‌జీఎఫ్‌ ఏపీటీం

    మజ్జిరామ్‌చరణ్‌తేజ–ఈస్ట్‌గోదావరి. అల్లుభాస్కరపద్మశార్ముఖ్‌ రెడ్డి చిత్తూరు. స్వప్న నిహాల్‌–చిత్తూరు

    అండర్‌ 17 బాలికలు ఎస్‌జీఎఫ్‌ 2025....

    సెల్వారావు దేవి దీప్తి యాస్వి–ఈస్ట్‌ గోదావరి. అస్మితా అనిమి–అనంతపురం

    లక్ష్మీప్రియా బత్తా–విశాఖపట్నం. జలాది నందిక–కృష్ణా

    మధుపాడ మనస్వి–విశాఖ పట్నం

    అండర్‌ 17 బాలురు ఎస్‌జీఎఫ్‌ 2025..

    భార్గవ్‌ సునీత్‌ సాకేత్‌ ఎం–ఈస్ట్‌గోదావరి

    గండవరపు కార్తీక్‌– విశాఖపట్నం

    కర్రి ఓంకార్‌– వెస్ట్‌గోదావరి

    (తానీష్‌ చొప్ప–విశాఖపట్నం

    క్రీడాకారులకు అభినందనలు

    రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో విజయం సాధించి జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులందరినీ ఎస్‌జీఎఫ్‌ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు అంబినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె ప్రసన్నకుమార్‌, ఇన్‌చార్జి ఎంపీడీఓ వెంకటరావు, వ్యాయామ అధ్యాపక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • మద్యం మత్తు వల్లే రోడ్డు ప్రమాదాలు

    రామభద్రపురం: మద్యం మత్తు, మితిమీరిన వేగం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. ఈ మేరకు రామభద్రపురం పోలీస్‌ స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆవరణంతా కలియదిరిగి పరిశీలించారు. అలాగే వివిధ కేసులకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తక్కువ సిబ్బంది ఉండడంతో పారాది కాజ్‌వే పాడవడం వల్ల భారీ లారీలు మళ్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ యువత మద్యానికి బానిసవడంతోనే అత్యాచారాలు, తల్లిదండ్రులపై హత్యలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామాలలో బెల్ట్‌ దుకాణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు పనుల నిమిత్తమో, లేక ఫిర్యాదులు చేయడం కోసమో వచ్చిన వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అలాగే రౌడీషీటర్స్‌, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల లాఠీ పోలీసింగ్‌ ఉంటుందని హెచ్చరించారు. పోలీస్‌ సిబ్బంది కొరత వాస్తవమేనని, కొద్ది రోజుల్లో కొత్త సిబ్బంది వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ భవ్యారెడ్డి, సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

    ప్రజాసమస్యలపై స్పందించాలి

    బాడంగి: పోలీస్‌స్టేషన్‌లో తమసమస్యల గురించి చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి సమస్యగురించి సావధానంగా విని పరిష్కారానికి కృషిచేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ చెప్పారు. ఈ మేరకు బాడంగి పోలీస్‌స్ట్షేన్‌ను ఆయన ఆదివారం సందర్శించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సమస్యలలో లీగల్‌ పొజిషన్‌ ఉంటే వారికి స్పష్టంగా చెప్పాలన్నారు. రౌడీషీటర్లు, చైన్‌స్నాచర్స్‌, దొంగతనాలు జరగకుండా మరింతగా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.

    ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

  • ఉపాధ్యాయుల హక్కుల కోసం ఏపీటీఎఫ్‌ ఆందోళన

    విద్యాహక్కు చట్టంలో వెంటనే సవరణలు చేయాలి

    సుప్రీం తీర్పుతో ఉపాధ్యాయుల్లో తీవ్ర

    ఆందోళన

    విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏపీటీఎఫ్‌–1938) విజయనగరం జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశం స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం.బలరాం నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి ఎన్‌వి.పైడిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ, 2010వ సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టీఈటీ పరీక్ష తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఈ ఏడాది సెప్టెంబరు ఒకటో తేదీన ఇచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో తీవ్రమైన ఆందోళన సృష్టంచిందని తెలిపారు. ఈ తీర్పుపై పునఃపరిశీలన కోసం..ఉపాధ్యాయుల సమాఖ్య తరఫున ఇప్పటికే తిరిగి విచారణ చేయాలని విజ్ఞప్తి పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరిగి విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని, కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టానికి వెంటనే సవర

    ణలు చేయాలని, ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనల్లో మార్పులు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుల సమాఖ్య డిమాండ్‌ చేసింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్మి ఎన్‌వీ.పైడిరాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ ఆర్‌.కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.వెంకటనాయుడు, జిల్లా సహాధ్యక్షురాలు ఎన్‌.శ్రీదేవి, అదనపు కార్యదర్మి ఏవీ.శ్రీను, ఉపాధ్యక్షులు మూర్తి, రామారావు, సత్యనారాయణ, విజయనగరం మండలం అధ్యక్షుడు సీహెచ్‌.పైడితల్లి, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

  • తెలుగు రాష్ట్రాల ఆహ్వాననాటిక పోటీల విజేతలు వీరే

    విజయనగరం టౌన్‌: గురజాడ కళాభారతిలో మూడురోజుల పాటు నిర్వహించిన నాటికపోటీల విజేతల వివరాలను సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు అభినయ శ్రీనివాస్‌, గెద్ద వరప్రసాద్‌లు ఆదివారం వెల్లడించారు. జ్యూరీ బహుమతులు మంజునాథ(గేమ్‌), కుమారి హర్షిణి (అమ్మ చెక్కిన బొమ్మ), మణికంఠ (కిడ్నాప్‌), ఉత్తమ లైటింగ్‌ శ్రీకాంత్‌, ఉత్తమ ఆహార్యం నాగు, ఉత్తమ సంగీతం నాగరాజు, ఉత్తమ రంగాలంకరణ ఎం.సత్తిబాబు, ఉత్తమ క్యారెక్టర్‌ యాక్టర్‌ పి.బాలాజీ నాయక్‌ (అసత్యం), ఉత్తమ సహాయనటుడు పి.రామారావు (అసత్యం), ఉత్తమ ప్రతినాయకుడు వై.అనిల్‌ కుమార్‌ (అసత్యం), ఉత్తమ ద్వితీయ నటి ఎస్‌.జ్యోతి (స్వప్నం రాల్చిన అమృతం), ఉత్తమ నటి జ్యోతిరాజ్‌ భీశెట్టి, ఉత్తమ నటుడు భానుప్రకాష్‌, ఉత్తమ దర్శకత్వం డాక్టర్‌ వెంకట్‌ గోవాడ, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన (అమ్మ చెక్కిన బొమ్మ), ఉత్తమ ద్వితీయప్రదర్శన (స్వప్నం రాల్చిన అమృతం)లకు బహుమతులు లభించాయి. పరిషత్‌ న్యాయనిర్ణేతలుగా పిటి.మాధవ్‌ (విశాఖ), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు), చిన్నారావు (శ్రీకాకుళం)లు వ్యవహరించారు.

    అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం

    గరుగుబిల్లి: గత నెల 27న మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన నల్ల గంగునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి దైవదర్శనం నిమిత్తం వెళ్లగా 28న తిరుమలలోని విష్ణు నివాసం వద్ద తప్పిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా సుంకి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తిరుమలలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్న క్రమంలో వారి కి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తప్పిపోయిన గంగునాయుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానిస్టేబుల్స్‌ రఘు, తిరుమల శేషులను గ్రామస్తులు అభినందించారు.

  • జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

    విజయనగరం: విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు, ప్రతిభ పాటవాలను మెరుగుపరిచేందుకు బాలలకు నాటిక పోటీలు దోహదపడతాయని హైకోర్టు న్యాయవాది, అంజని ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, పువ్వల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్‌ స్కూల్లో ఆదివారం ఏర్పాటుచేసిన బాలల ఆహ్వాన నాటిక పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటిక పోటీలు నైతిక విలువలు పెంపొందించేందుకు సందేశాత్మకంగా రూపొందించినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గేట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ గురాన రాధిక అయ్యలు, ఖాదర్‌ బాబా దర్గా, దర్బార్‌ నిర్వాహకుడు, ఏటీకే వెలుగు ఓల్డేజ్‌ హోమ్‌ ప్రతినిధి మహమ్మద్‌ అహమ్మద్‌ బాబు, జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్‌ ఎంవీఆర్‌ కృష్ణాజీ, వాకర్స్‌ క్లబ్‌ డిప్యూటీ గవర్నర్‌ ముళ్లపూడి సుభద్రా దేవి, కుసుమంచి సుబ్బారావులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వారిలో ఉన్న ప్రజ్ఞాపాటవాలు మిగిలిన వారికి పరిచయం చేసేందుకు, మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. నాటిక పోటీలకు సమన్వయకర్తగా ఈపు విజయ్‌ కుమార్‌ వ్యవహరించగా, న్యాయ నిర్ణేతలుగా పసుమర్తి సన్యాసిరావు, గెద్ద వరప్రసాద్‌, ఆదెయ్య మాస్టారు వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ ఎం.స్వరూప, గిరిజా ప్రసన్న, డిమ్స్‌ రాజు, డీవీ సత్యనారాయణ ,గ్రంధి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Mancherial

  • పోడు వేటు!

    జన్నారం: కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో విలువైన టేకుచెట్లు పోడు పోరులో నరికివేతకు గురవుతున్నాయి. అడ్డుకునేందుకు అటవీ అధికారులు నానా తంటా లు పడుతున్నారు. అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా అడ్డుకునే క్రమంలో దాడులకూ గురవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిఘా పెడుతున్నారు. ఈ పోడు పోరులో కింది ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురవుతున్నారు. కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో విధు లు నిర్వహించేందుకు జంకుతున్నారు. జన్నారం అ టవీ డివిజన్‌లో పోడు కోసం ఆదివాసీ గిరిజనులు విలువైన టేకుచెట్లను కూల్చివేస్తున్నారు. దమ్మన్నపేట, పాలఘోరీలు, గడ్డం గూడ ప్రాంతాల్లో అట వీ భూమిని చదును చేసి గుడిసెలు వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు గిరిజన పెద్దలతో కలిసి పలుసార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చినా వారిలో మార్పు కనిపించడం లేదు.

    జన్నారం రేంజ్‌లో గడ్డంగూడ వద్ద..

    టైగర్‌జోన్‌ కోర్‌ ఏరియాలోగల జన్నారం అటవీ డి విజన్‌లోని జన్నారం రేంజ్‌లో జన్నారం బీట్‌ పరిధి లోని మరో సమస్య గడ్డంగూడ. ఇక్కడి అటవీ భూ మిని 15ఏళ్ల క్రితం చదును చేసిన కొందరు గిరిజనులు గుడిసెలు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. వారు సాగు చేసినప్పుడల్లా అటవీ అధికారులు తొ లగిస్తున్నారు. ఇటీవల గిరిజనులు గుడిసెలు వేసుకుని నివాసముంటుండగా ఈ ఘటనలో ఇద్దరు అ టవీ అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆరు నె లల క్రితం అధికారులు మూకుమ్మడిగా వెళ్లి గుడిసెలు తొలగించగా గిరిజనులు తిరగబడ్డారు. ఈ ఘ టనలో పలువురిపై కేసు నమోదు చేసి జైలుకు పంపినా తిరిగి గుడిసెలు వేసుకుంటున్నారు.

    తాళ్లపేట్‌ రేంజ్‌లో దమ్మన్నపేట వద్ద..

    జన్నారం డివిజన్‌లోని తాళ్లపేట రేంజ్‌లో లింగా పూర్‌ బీట్‌లోని 379, 380 కంపార్ట్‌మెంట్లలో కొంద రు ఆదివాసీ గిరిజనులు పోడు కోసం మూడేళ్ల క్రి తం సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అడవిని న రికి భూమి చదును చేసుకున్నారు. గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. ప్రస్తుతం పంటలు కూ డా సాగు చేసుకున్నారు. వారిని చూసిన దమ్మన్నపేట్‌ ప్రాంతంలో ఆరు నెలల క్రితం సుమారు 25 కుటుంబాలకు చెందిన గిరిజనులు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. పెరుగుతున్న కొమ్మల ను తొలగిస్తూ భూమిని సాగుకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలోనూ అటవీశాఖ అధికారులు చాలెంజ్‌గా తీసుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గిరిజనులు అటవీశాఖ అధి కారులపై దాడికి పాల్పడగా ఇద్దరు గాయపడ్డారు. ఆ తర్వాత గిరిజనులకు కౌన్సిలింగ్‌ ఇప్పించారు. వారి కుల పెద్దలతో మాట్లాడించారు. అయినా గిరిజనులు ససేమిరా అనడంతో మూకుమ్మడికి వెళ్లి తొలగించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పుడు ఎన్నికల కోడ్‌ రావడంతో వెనుదిరిగారు.

    ఉలిక్కిపడేలా తపాలాపూర్‌ ఘటన

    పాలఘోరీ ప్రాంతం, గడ్డంగూడ, దమ్మన్నపేట ప్రాంతాల్లో పోడు సమస్య పరిష్కారం కోసం ప్ర యత్నిస్తుండగా తాళ్లపేట రేంజ్‌ తపాలాపూర్‌ బీట్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. రెండ్రోజుల క్రితం మండలానికి చెందిన పలువురు గిరిజనులు మూకుమ్మడిగా టేకుచెట్లు నరికివేశారు. ఊహించని రీతిలో జరిగిన ఈ ఘటనతో జిల్లా అటవీశాఖ యంత్రాంగం ఉలిక్కిపడింది. అసలు ఎందుకు నరికారనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అయితే, కొంతకాలంగా టైగర్‌జోన్‌ ప్రాంతంలో ఉంటున్న గిరిజనులను ఇతర ప్రాంతాలకు పునరావాసం కోసం తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలో భూమి కూడా చూపించారు. అయితే, పునరావాసం విషయంలో ఆలస్యం జరుగుతుండటంతో గిరిజనులు కావాలనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

    తపాలాపూర్‌లో నరికివేతకు గురైన టేకుచెట్లు

    అవగాహన లేకనా? అమాయకత్వమా?

    అటవీ భూమిని ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలుంటాయనే అవగాహన లేకో, అమాయకత్వమో గాని గిరిజనులు జైలు పాలవుతున్నా రు. గత ప్రభుత్వాలు పోడులో ఉన్నవారికి హ క్కు పత్రాలిచ్చింది. తమకు కూడా హక్కు ప త్రాలు వస్తాయనే ఆశతో అటవీభూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి వెనుక ఉండి నడిపిస్తున్నదెవరు? అని అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

  • ఆశయాలను సాధిద్దాం

    శ్రీరాంపూర్‌: అమరుల ఆశయాలను సాధిద్దామని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కా ర్యదర్శి లాల్‌కుమార్‌ పేర్కొన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీరాంపూర్‌లోని కొత్తరోడ్‌లోగల అమరవీరు ల స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి నివాళులర్పించారు. కార్మిక వాడల్లో ర్యాలీ నిర్వహించి న అనంతరం ఐఎఫ్‌టీయూ కార్యాలయం వద్ద సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడిత ప్రజ ల కోసం అనేక మంది విప్లవకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు రావాల ని వారు ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. వారి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి పాలకవర్గ విధానాలను ప్రతిఘటించాల ని పిలుపునిచ్చారు. ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బ్రహ్మానందం, నాయకులు శ్రీనివాస్‌, మేకల రామన్న, మల్లన్న, రెడ్డిమల్ల ప్రకాశం, తిరుపతిరెడ్డి, రత్నం, ప్రభాకర్‌, జ్యోతి, శ్రీకాంత్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఎస్టీపీపీలో మరో ప్లాంట్‌

    జైపూర్‌: మండలంలోని పెగడపల్లిలో 800 మె గావాట్ల సామరథ్యంలో సింగరేణి కొత్త విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మిస్తామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌ తెలిపారు. ఇందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎస్‌టీపీపీ(సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌)ను ప్లాంట్‌ ఈఅండ్‌ఎం తిరుమల్‌రావుతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈడీ చిరంజీవి, జీఎంలు నరసింహారావు, మదన్‌మోహన్‌ సీఎండీకి స్వాగ తం పలికారు. అనంతరం బలరాం నూతనంగా నిర్మించే ప్లాంట్‌ ప్రదేశంతోపాటు ప్లాంట్‌లో నూ తనంగా చేపట్టిన మిథనాల్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇందారం ఓపెన్‌కాస్ట్‌ గనిని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున బొగ్గు, ఓబీ వార్షిక లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎండీ వెంట ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, పీవో వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు హరినా రాయణ, రాజన్న, జక్కారెడ్డి ఉన్నారు.

  • సీపీఐ శతజయంతి సభను విజయవంతం చేయాలి

    పాతమంచిర్యాల: డిసెంబర్‌ 26న ఖమ్మంలో నిర్వహించనున్న సీపీఐ శతజయంతి ముగింపు సభను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌ నుంచి భద్రాచలం వరకు చేపట్టే బస్సుజాత ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీపీ ఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, మే కల దాసు, జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలిందర్‌ అలీఖాన్‌, చిప్ప నర్స య్య, దాగం మల్లేశ్‌, కారుకూరి నగేశ్‌, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • ‘ఓపెన్‌’ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

    మంచిర్యాలఅర్బన్‌: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఓపె న్‌ స్కూల్‌ అబ్జర్వర్‌, స్టేట్‌ కో ఆర్డినేటర్‌ దామోదర్‌రెడ్డి సూచించారు. ఆదివారం స్థాని క జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లోని ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ తరగతులను పరిశీలించి రికార్డులు తనఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ప్రతీ ఆదివారం, ఇతర సెలవు దినాల్లో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్‌, ఓపెన్‌స్కూల్‌ సహా య కో ఆర్డినేటర్‌ రేణి రాజయ్య పాల్గొన్నారు.

  • యువ వ

    మంచిర్యాలటౌన్‌: రాజీవ్‌ యువ వికాసం రుణాల కోసం జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులు ఎ దురుచూస్తున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అర్హులను ఎంపిక చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న రాయితీ రుణాల చెక్కుల పంపిణీ చేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పటికీ ఐదు నెలలు దాటినా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో నెలల తరబడి నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు.

    రుణాల మంజూరు ఎప్పుడో?

    జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థుల కు రుణాలు అందించేందుకు అధికారులు దరఖా స్తులు స్వీకరించారు. కేటగిరి–1 కింద రూ.50వేల లోపు, కేటగిరి–2 కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు, కేటగిరి–3 కింద రూ.లక్ష నుంచి రూ.2లక్షలు, కేటగిరి–4 కింద రూ.2లక్షల నుంచి రూ.4లక్ష ల వరకు ప్రభుత్వం రుణాలు అందించనున్నట్లు ప్ర కటించింది. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండ డం, ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లు తక్కువగా ఉండడంతో అర్హులను ఎంపిక చేసేందుకు మున్సిపాలిటీలు, మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. మొదట ప్రభుత్వం రూ.50 వేలు, రూ.లక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రుణాలు అందించాలని నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో కేటగిరి–3, 4కు చెందిన అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. వీరంతా మళ్లీ దరఖాస్తులను కేటగి రి–1, 2కు మార్చుకున్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి రుణాలు మంజూరు చేయకపోవడంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

    ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం

    యూనిట్లు తక్కువగా ఉండడం, దరఖాస్తులు ఎక్కు వగా రావడంతో వాటిలో ఎంతమంది అర్హులనే దా నిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ను బ్యాంకర్లు చెక్‌ చేసి ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు జాబితా పంపాల్సి ఉండగా, మండలస్థాయి కమిటీలు తుది జాబితాలను సిద్ధం చేయలేదు. మండలస్థాయిలో ఎంపిక చేసిన జాబితాను జిల్లాస్థాయికి పంపడం, బడ్జెట్‌ అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించడం, అనంతరం అర్హులకు చెక్కులివ్వడంలో జాప్యం జరుగుతోంది.

    ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు

    జిల్లాకు రాజీవ్‌ యువ వికాసం యూనిట్లు మంజూరయ్యాయి. దరఖాస్తు లు స్వీకరించాం. మండలాలు, మున్సిపాలిటీల వారీగా అర్హుల జాబితా రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.

    – సీహెచ్‌ దుర్గాప్రసాద్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

    కార్పొరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు, యూనిట్ల వివరాలు

    కార్పొరేషన్‌ దరఖాస్తులు యూనిట్లు

    బీసీ కార్పొరేషన్‌ 30,741 4,605

    ఎస్సీ కార్పొరేషన్‌ 17,596 5,341

    ఎస్టీ కార్పొరేషన్‌ 4,199 1,644

    మైనార్టీ కార్పొరేషన్‌ 3,331 450

    క్రిస్టియన్‌ మైనార్టీస్‌.. 141 89

  • మంచిర

    7

    ఒత్తిడి తట్టుకోలేక..

    వయస్సుతో సంబంధం లేకుండా కొందరు చిన్నచిన్న విషయాలకూ ఒత్తిడికి లోనవుతున్నారు. ఎదుర్కొనే ధైర్యం లేక అనాలోచితంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    మామిడిలో జాగ్రత్తలు..

    మామిడి పూతకు ముందు, కాయ దశలో జాగ్రత్తలు తీసుకోవాలని హార్టికల్చర్‌ అధికా రి తెలిపారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి సాధ్యమని పేర్కొన్నారు.

    సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. వాతా వరణం చల్లబడుతుంది. చలి పెరుగుతుంది.

  • అ‘పూర

    మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని బెల్లంపల్లి ఎమ్మార్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 1975 నుంచి 1988 వరకు ఆయా విద్యాసంవత్సరాల్లో ప దోతరగతి చదివినవారంతా ఆదివారం జిల్లా కేంద్రంలో అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 104 మంది హాజరై పాఠశాలలో చదివిన జ్ఞాపకాల ను గుర్తు చేసుకున్నారు. రోజంతా సరదాగా గడిపి సందడి చేశారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు క స్తూరి దేవరాజ్‌, ఉపాధ్యాయులు డైనా, కళావతి, స రోజ లక్ష్మి, కమలాకుమారి, స్వర్ణలత, కాంతయ్య, రాజయ్య, రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, సత్యనారా యణ, ప్రేమ్‌సాగర్‌ను ఆహ్వానించి సన్మానించారు. కార్యక్రమాన్ని 1975 బ్యాచ్‌కు చెందిన భాగ్యలక్ష్మి, జయశీల, సత్యవతి ఆధ్వర్యంలో నిర్వహించారు.

    శ్రీరాంపూర్‌: నస్పూర్‌లోని ఎవర్‌గ్రీన్‌ పాఠశాల 2003–04 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థులు మంచిర్యాలలోని ఓ పంక్షన్‌హాల్‌లో అపూర్వ సమ్మేళనం పేరిట ఒక్కచోట కలుసుకున్నారు. పాఠశాలలో చదివిన రోజులను గుర్తు చేసుకుని సంబురంగా వేడుక జరుపుకొన్నారు. కరస్పాండెంట్‌ పరమేశ్వర్‌రావు, ఉపాధ్యాయుడు సత్యనారాయణ, పూర్వవిద్యార్థులు తిప్పని లింగమూర్తి, రఘు, అంజన్‌, అశోక్‌, సదానందం తదితరులు పాల్గొన్నారు.

  • వేధింపులు ఆపాలని రైతుల రాస్తారోకో

    జన్నారం: అటవీశాఖ సిబ్బంది వేధింపులు ఆపాల ని డిమాండ్‌ చేస్తూ ఆదివారం లింగయ్యపల్లి, అక్కపెల్లి గూడ రైతులు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ సమీప వాగు మీది వంతెనపై రాస్తారోకో చేశా రు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయమేర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై అనూష అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో బలవంతంగా అక్కడినుంచి పంపించారు. దీంతో వారు అటవీ డివిజన్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశా రు. ఈ సందర్భంగా గంగమల్లు, కుడుకల సత్తన్న, కృష్ణ మాట్లాడుతూ.. జువ్విగూడ సమీపంలో తమ కు 350 ఎకరాల్లో సాగు భూములున్నాయని తెలిపా రు. వ్యవసాయ పనుల నిమిత్తం అక్కడికి ద్విచక్రవాహనాలపై వెళ్తే అడవిలోకి ఎందుకు వచ్చారని బీట్‌ ఆఫీసర్‌ బూతులు తిడుతున్నారని ఆరోపించారు. సత్తన్నకు చెందిన బైక్‌ తీసుకుని నెలరోజులైనా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ వేధింపులు ఆపేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీట్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, వారు ద్విచక్రవాహనం విడుదల కోసం సాయం చేయాలని టవల్‌ పరిచి డబ్బులు అడుక్కుని నిరసన తెలిపారు.

  • ప్రజాకళలతో సమాజాన్ని తట్టి లేపాలి

    బెల్లంపల్లి: ప్రజాకళలతో నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని తట్టిలేపి జన చైతన్యానికి తోడ్పడాలని ప్రజా నాట్యమండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్‌ సూచించారు. ఆదివారం బెల్లంపల్లి సీఐటీ యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజానాట్య మండలి జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని ఆ రోపించారు. పెట్టుబడిదారి, కార్పొరేట్‌ శక్తులకు దే శ సంపదను దోచిపెడుతూ ప్రజలను కష్టాల్లోకి నె డుతున్నాయని విమర్శించారు. ప్రజలను వంచిస్తు న్న ప్రభుత్వాల కుటిల నీతిని కళారూపాల ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు. సీపీఎం రా ష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. బీ జేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల కు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమాజ హితం కో రి ప్రజానాట్యమండలి కళాకారులు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి కళారూపాలను సాధనాలు గా వినియోగించుకోవాలని సూచించారు. సీపీఎం, సీఐటీయూ, ప్రజానాట్య మండలి నాయకులు రమణ, రంజిత్‌కుమార్‌, అశోక్‌, దేవదాస్‌, సుధాకర్‌, తి రుపతి, కిషన్‌, రాజేశం, బాపు, ఉమారాణి, సరిత, జిలానీ, ప్రసాద్‌, మనోహర్‌ తదితరులున్నారు.

  • చట్టాలౖపై అవగాహన కలిగి ఉండాలి

    శ్రీరాంపూర్‌: బాలికలు, మహిళలు చట్టాలను సద్వి నియోగం చేసుకోవాలని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పోక్సో) రాంబాబు తెలిపారు. ఆదివారం న స్పూర్‌లోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో జి ల్లా న్యాయ సేవా సంస్థ, షీటీమ్స్‌ ఆధ్వర్యంలో చ ట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే చట్టాల గురించి తెలుసుకోవాలని, ఎవరైనా అనుచితంగా వ్యవహరించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, లైంగికంగా వేధించినా వెంటనే షీటీమ్స్‌ను సంప్రదించి తక్షణ సహాయం పొందాలని తెలిపారు. సోషల్‌ మీ డియాలోనూ వేధింపులకు గురి చేసినా చట్ట ప్రకా రం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా పోలీసులకు తెలుపాలని సూచించారు. న్యాయవాది సందాని, కస్తూరిబా పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ మౌనిక, షీటీమ్స్‌ సిబ్బంది సతీశ్‌, శ్రీలత పాల్గొన్నారు.

  • ఒత్తిడి తట్టుకోలేక..!

    నిర్మల్‌ఖిల్లా: ఇటీవల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. చిన్నచిన్న విషయాలు కూడా మనసులో కల్లోలం రేపుతున్నాయి. వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక, పరిష్కార మార్గం కనుగొనే ఆలోచన రాక కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చావే పరిష్కారంగా భావించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, గృహిణులు ఇలా అన్నివర్గాల వారు ఒత్తిడి, నిరాశ, ఆత్మవిశ్వాస లోపంతో బలవన్మరణాలకు పాల్పడి కుటుంబాలకు దుఃఖం మిగులుస్తున్నారు.

    ఒత్తిడికి చిత్తవుతూ..

    ప్రస్తుత సమాజంలో పోటీ, ఆర్థికభారాలు, ఉద్యోగ భద్రతా సమస్యలు, కుటుంబ విభేదాలు, సామాజి క మాధ్యమాల్లో స్వీయ అస్తిత్వం ఇవన్నీ కలిసి మనసును కాకావికలం చేస్తున్నాయి. పాఠశాలల నుంచి కార్యాలయాల దాకా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. విద్యార్థులు మార్కుల ఒత్తిడితో, యువత ఉద్యోగాల కోసం తంటాలు పడుతూ, మధ్యవయస్కులు కుటుంబ బాధ్యతలతో, వృద్ధులు ఒంటరితనంతో తల్లడిల్లుతున్నారు. పట్టరాని ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్యలే శరణ్యమని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    అండగా ఉంటూ.. ఆత్మీయత కనబరిస్తే...

    ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు ఉన్నవారిని జాగ్రత్తగా పరిశీలించి వారికి తగిన సాంత్వన నిచ్చే మాటలతో ఓదార్పునివ్వాలి. అండగా ఉంటూ ఆత్మీయత కనబర్చాలి. తల్లిదండ్రులు పిల్లలలో మానసిక మార్పులను గమనించాలి. చదువుపై లేదా ఫలితాలపై అధిక ఒత్తిడి తేవడం కాకుండా వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక ధృడత్వాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడి వారి మనసులోని భావాలు తెలుసుకునేలా సానుకూల వాతావరణాన్ని కల్పించడం అత్యవసరమని మానసిక నిపుణులు భావిస్తున్నారు. మానసిక సమస్యలు ఉన్నవారిని కించపర్చకుండా, వారికి సహాయం చేయాలనే దృక్పథం సమాజంలో పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులు, నిపుణులు, కుటుంబసభ్యులు తోడుగా నిలవాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. కాగా మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారు ఉచిత కౌన్సెలింగ్‌ కోసం టెలీ మానస్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 14416లో సంప్రదించాలని సూచిస్తున్నారు.

    ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు..

    ● ఇటీవల లక్ష్మణచాంద మండలం బాబాపూర్‌ గ్రామంలో ఆర్‌ఎంపీగా పని చేసే ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, పదేళ్ల లోపు ముగ్గురు కుమారులు ఉన్నారు.

    ● ఈనెల 4వ తేదీన కుంటాల మండల కేంద్రానికి చెందిన 44 ఏళ్ల మధ్య వయస్కుడు నూతన గృహ నిర్మాణ పనులు చేపట్టగా అప్పులు పెరిగిపోవడంతో ఆర్థిక పరిస్థితుల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

    ● నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ మండలంలో గల ఓ గ్రామానికి చెందిన పాఠశాల స్థాయి విద్యనభ్యసించే ఓ బాలుడు మానసిక సంఘర్షణకు గురై తనువు చాలించాడు.

    ● పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత శనివారం కుంట్ల రాజశేఖర్‌రెడ్డి కడెం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని ఖానాపూర్‌లో జరిగే ఓ వివాహవేడుకకు హాజరయ్యేందుకు వచ్చి డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

    ● లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు మనస్పర్థల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ప్రియురాలు చనిపోవడంతో కలత చెందిన యువకుడు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

    ● ఈ నెల 1న సారంగాపూర్‌ మండలం జామ్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

    ● మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన చిందం శ్రీకాంత్‌ భార్య మనీషా(25)కు చిన్నప్పటి నుంచి చీమలంటే భయం (మైర్మెకోఫోబియా). వీరికి మూడేళ్ల పాప ఉంది. ఉపాధి నిమిత్తం శ్రీకాంత్‌ కుటుంబంతో కలిసి సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని నవ్య కాలనీలో రెండేళ్ల నుంచి ఉంటున్నారు. 10 రోజుల కిత్రం మనీషా చీమలతో భయంగా ఉంది. భరించలేక పోతున్నానని సూసైడ్‌ నోట్‌ రాసి అమీన్‌పూర్‌లోని ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    ● మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక మూడు నెలల కిత్రం హాస్టల్‌ భవనం మూడో అంతస్తుపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

  • మిల్లర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి

    మందమర్రిరూరల్‌: కాంక్రీట్‌ మిక్సింగ్‌ మిల్లర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి మున్సిపాలిటీ పరిధి బురుదగూడెం వద్ద గల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో ట్రాన్స్‌మిషన్‌ లైన్‌లో కాంక్రీట్‌ పని చేయడానికి బీహార్‌ నుంచి రెండు నెలల క్రితం కొంత మంది కూలీలు వచ్చారు. ఆదివారం సబ్‌ స్టేషన్‌ వెనుకాల కాంక్రీట్‌ పనిలో భాగంగా పని వారితో కలిసి కాచు ప్రసాద్‌(43) అనే వ్యక్తి కూడా పని చేశాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం కాసేపు అక్కడే ఉన్న పత్తి చేనులో విశ్రాంతి తీసుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు. కాంక్రీట్‌ మిక్సింగ్‌ మిల్లర్‌ డ్రైవర్‌ పత్తి చేను గుండా నిర్లక్ష్యంగా మిల్లర్‌ పోనిచ్చాడు. ప్రసాద్‌ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ శశిధర్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి పనివారిని ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. మృతుడి బంధువులకు సమాచారం అందించి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతామని ఎస్సై తెలిపారు.

  • చికిత్స పొందుతూ వివాహిత మృతి

    భీమారం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మండల కేంద్రంలోని పాత బ్యాంకు వీధికి చెందిన వివాహిత చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఎస్సై శ్వేత కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తమ్మనవేని రాజేశ్వరి(48) తరుచూ ఫిట్స్‌తో బాధపడేది. ఆమెకు తన బావ, కుటుంబ సభ్యులు మంత్రాలు చేసి అనారోగ్యానికి కారణమయ్యారనే అనుమానం ఉండేది. ఈవిషయంలో ఆమె బావ కుటుంబంతో తరుచూ గొడవ పడేది. ఈనెల 7వ తేదీన మనస్తాపానికి గురై ఇంట్లోనే గడ్డిమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. కాగా తన సోదరుడు శ్రీనివాస్‌, వదిన లక్ష్మి, సోదరి ఎల్లక్క, సోదరి కూతురు మల్లక్కలు దూషించడంవల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని రాజేశ్వరి భర్త రాజన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Anakapalle

  • వింత షరతులు
    వైజాగ్‌ మాల్యా..

    మీకు మాల్యా తెలుసు కదా.. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు చెక్కేశాడు. అలాంటి మాల్యానే.. మన వైజాగ్‌లోనూ ఉన్నాడు. ఈ మాల్యా మాత్రం పారిపోలేదు. అపరిచితుడిలా భిన్న పార్శ్వాలు ప్రదర్శిస్తున్నాడు.

    కానీ..మన వైజాగ్‌ మాల్యాలో మాత్రం రెండు కోణాలున్నాయి...

    ఎన్నికల ముందు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించి.. కోర్టుల నుంచి మొట్టికాయలు తిని.. తిన్నదంతా కక్కిన ఘనుడు.

    ఇప్పుడు.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అప్పులిచ్చిన బ్యాంకుల్నే బెదిరిస్తున్న కై ంకర్యుడు.

    సాక్షి, విశాఖపట్నం :

    ఫైనాన్స్‌ సంస్థల నుంచి అప్పు తీసుకోవడం.. వారు చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం.. రుణాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం.. చివరికి కోర్టు నుంచి నోటీసులొస్తే.. మరో చోట అప్పోసప్పో చేసి ఆ రుణం తీర్చడం.. మళ్లీ.. నోటీసులు.. మళ్లీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు.. ఇది ఓ కూటమి ఎమ్మెల్యేకు హాబీగా మారిపోయింది. దాదాపు విశాఖలో ఉన్న సింహభాగం ఫైనాన్స్‌ కంపెనీల దగ్గర సదరు ఎమ్మెల్యే.. ఓ డిఫాల్టర్‌ అనే ముద్ర పడిపోయింది. కేవలం అప్పుల విషయంలోనే కాదు.. రాజకీయాల్లోనూ డిఫాల్టర్‌ అనే ముద్ర వేసుకుంటూ.. ఈవీఎంల గాలిలో గెలిచిన మాల్యా.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలకు ఆద్యుడిగా మారుతున్నారు.

    ఆది నుంచీ అవే మోసాలు..!

    ఏ బ్యాంకు కనిపించినా.. ఏ ఫైనాన్స్‌ కంపెనీ కనిపిస్తే.. వారి దగ్గరికి వెళ్లడం.. అప్పులు చెయ్యడం.. ఆనక దాన్ని చెల్లించకుండా తిరగడమే సదరు ఎమ్మెల్యే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. చిట్‌ఫండ్‌ కంపెనీల్లో డబ్బులు పాడుకొని వాటిని ఎగ్గొట్టేందుకు యత్నించగా కోర్టు మొట్టికాయలు వెయ్యడంతో వాటిని చెల్లించారు. చిట్‌ఫండ్‌ సంస్థలకు ఎగనామం పెట్టిన వైజాగ్‌ మాల్యా... 2015 నుంచి వరుసగా దొరికిన ఫైనాన్స్‌ సంస్థ దగ్గర దొరికినంత రుణాల్ని తీసుకున్నారు. ప్రతి ఫైనాన్స్‌ సంస్థ దగ్గర కోట్ల రూపాయల రుణాలు తీసుకొని వాటికి శఠగోపం పెట్టేశారు. చివరికి కోర్టులని ఆశ్రయించిన కొన్ని సంస్థలు.. ఈయన దగ్గర నుంచి వసూలు చేసుకున్నాయి. మరికొన్నింటికి డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో.. ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి.

    వైజాగ్‌ పోర్టులో కింగ్‌ అవుతా..!

    షిప్పింగ్‌ కంపెనీని నడుపుతున్న వంశీ.. దాన్ని కొనసాగించేందుకే పలు ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని అటు బ్యాంకుల్ని.. ఇటు పోర్టుని శాసించాలని యత్నిస్తున్నారు. వైజాగ్‌ పోర్టులో షిప్పింగ్‌ కాంట్రాక్టులు పొందేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. షిప్పింగ్‌ కాంట్రాక్టులు తన సంస్థకే ఇవ్వాలనీ.. లేదంటే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పి.. బదిలీ చేస్తానంటూ కొందరు పోర్టు అధికారులతో వాగ్వాదం పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పోర్టులో తానే కింగ్‌ అవుతానంటూ విర్రవీగుతున్నారని సమాచారం.

    బ్యాంకులపైనా

    బెదిరింపుల అస్త్రాలు..!

    బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలే కాదు... కొంత మంది వ్యక్తుల దగ్గరా చేబదులుగా డబ్బులు తీసుకొని వారికి కూడా రిక్త హస్తాలు చూపించి డబ్బులు ఎగ్గొట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20 సార్లకు పైగా డిఫాల్టర్‌గా బ్యాంకుల చుట్టూ తిరిగాడు మన వైజాగ్‌ మాల్యా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఫైనాన్స్‌ సంస్థల్ని బెదిరించి.. అప్పులు మాఫీ చేసుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇటీవల డిఫాల్టర్‌గా మారారంటూ.. జప్తుకు ముందు ఇచ్చే నోటీసులు సదరు ఎమ్మెల్యే మాల్యాకు కొన్ని బ్యాంకులు ఇచ్చాయి. వెంటనే బ్యాంకు ప్రతినిధుల్ని తన కార్యాలయానికి రప్పించుకొని.. వారిపైనా బెదిరింపుల అస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది. బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురిస్తే.. తన ఇమేజీ డ్యామేజీ అవుతుందని, చిన్న చిన్న పత్రికల్లో నోటీసులిచ్చి వదిలెయ్యాలని చెప్పినట్లుగా బ్యాంకింగ్‌ వర్గాలు వాపోతున్నాయి. నోటీసులు ప్రచురించమని, డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరుతున్న బ్యాంకులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీంతో బ్యాంకు స్థానిక అధికారులు.. సదరు వైజాగ్‌ మాల్యా ఎమ్మెల్యే పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఈ నోటీసుల వ్యవహారం తమకు సంబంధం లేదని, రీజినల్‌ కార్యాలయం నుంచే పరిష్కరించుకోవాలంటూ కొన్ని బ్యాంకుల అధికారులు హెడ్‌ ఆఫీస్‌కు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రుణాలు ఎగ్గొట్టడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సదరు ఎమ్మెల్యే తన అప్పుల పరంపరని కొనసాగిస్తూ రుణాలిచ్చిన సంస్థలకే కన్నం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైజాగ్‌ అంతా కోడై కూస్తోంది.

    అప్పులిచ్చిన బ్యాంకుల్ని బెదిరిస్తున్న కూటమి ఎమ్మెల్యే

    పోర్టులో కాంట్రాక్టుల కోసం బ్యాంకుల్లో రుణాలు

    నిర్ణీత సమయాల్లో చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా ఎమ్మెల్యే

    బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం

    ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురించొద్దంటూ ఆదేశాలు

    రుణం చెల్లించే సమయం చెప్పకుండా బ్యాంకులపై పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే మాల్యా

  • కో..అంటే కాసులే..!
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

    సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో కోడి పందేలు, జూద క్రీడలు జోరుగా జరుగుతున్నాయి. గ్రామ జాతరలు, తీర్థాలు పేరిట అధికారం అండతో కూటమి నేతలు జూదాలు, కోడి పందాలు, పొట్టేలు పందాలు, గుండాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. జిల్లాలో యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నర్సీపట్నం, కోటవురట్ల గొలుగొండ, నాతవరం, రోలుగుంట, బుచ్చెయ్యపేట, మాడుగల, దేవరపల్లి మండలాల్లో గ్రామ జాతరలు, తీర్థాల పేరిట కోడి పందాలు, లాటరీ, జూదం,పేకాట, గుండాటతో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వాటిని నిలువరించాల్సిన పోలీసులే వారితో కుమ్మక్కై వెనకుండి నడిపిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కోడి పందాలు, పేకాట, గుండాట, లాటరీ గేమ్‌లకు ఒక్క రోజుకు గానూ రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకూ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం రాంబిల్లి మండలంలో వాడనర్సాపురంలో అభయాంజనేయ స్వామి తీర్థంలో అనధికారికంగా జూద క్రీడలు నిర్వహించారు. వీటి నిర్వహణ కోసం పోలీసులకు భారీగానే మామూళ్లు ముట్టచెప్పినట్టు సమాచారం. స్థానిక కూటమి నేతలే కోడి పందాలు, ఇతర జూద క్రీడలను నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేందుకు సుమారు రూ. లక్ష వరకు మామూళ్లు ఇచ్చినట్టు భోగట్టా.

    జాతరల్లో విస్తృతంగా కోడి పందాలు..

    ఈ నెల 09వ తేదీన ఆదివారం రాంబిల్లి మండలంలో వాడ నర్సాపురం, యలమంచిలి నియోజకవర్గంలో ఏటికొప్పాక గ్రామ జాతరలో విచ్చలవిడిగా కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహించారు. అచ్యుతాపురం మండలంలో ఎదురవాడ, నునపర్తి, జగన్నాథపురం, యర్రవరం గ్రామంలో, మడుతూరు గ్రామాల్లో, యలమంచిలి మండలంలో యర్రవరం గ్రామంలో, రాంబిల్లి మండలంలో మామిడాడ కొత్తూరు గ్రామంలో, మునగపాక గ్రామంలో నిర్వహించిన గ్రామ జాతరల్లో కూడా కోడి పందాలు, లాటరీ, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించారు. అదేవిధంగా దసరాకు అచ్యుతాపురం మండలంలో హరిపాలం గ్రామంలో, మాఘపౌర్ణమి నాడు పూడిమడక గ్రామంలో పొట్టేలు పందేలు, కోడి పందాలు, జూద క్రీడలు జరిగాయి. యలమంచిలి మండలంలో జంపపాలెం, సోమలింగపాలెం గ్రామంలో నిత్యం పేకాట, గుళ్లాట తరుచూ జరుగుతూనే ఉండడం గమనార్హం.

    కూటమి నేతల జూద క్రీడలు..

    పలు గ్రామాల్లో

    అనధికారంగా కోడి పందాలు

    వాడనర్సాపురం తీర్థం, ఏటికొప్పాక

    గ్రామ జాతరలో భారీగా పందేలు

    రూ.లక్షల్లో చేతులు మారినట్టు సమాచారం

    అంతా.. పోలీసుల కనుసన్నల్లోనే

    అని ఆరోపణలు

  • ● ఆనం

    నాతవరం: తాండవ రిజర్వాయరు సరుగుడు జలపాతం వద్ద సందర్శకులు కార్తీక మాసం ఆదివారం కావడంతోసందర్శకులు సరదగా గడిపారు. తాండవ ప్రాజెక్టు దిగువనున్న నల్లగొండమ్మ తల్లిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అక్కడి పార్క్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. సరుగుడు జలపాతం వద్ద కూడా సందర్శఽకుల తాకిడి కన్పించింది. ఎత్తయిన కొండల నడుమ ప్రవహించే జలపాతంలో పెద్దా చిన్న అనే తేడా లేకుండా జలకాలాడుతూ సందడి చేశారు. మధ్యాహ్నం తాండవ సరుగుడు ప్రాంతాల్లో పలువురు సందర్శకులు సహపంక్తి భోజనాలు చేసి తాండవ ప్రాజెక్ట్‌లో నీటి అందాలు తిలకించారు.

    ఎస్‌.రాయవరం: రేవు పోలవరం తీరంలో పిక్నిక్‌ పర్యాటకులతో పోటెత్తింది. పరసర ప్రాంతాల వారు ఆదివారం పెద్ద ఎత్తున తీరానికి చేరుకుని సందడి చేశారు. మధ్యాహ్నం వరకు తీరాన్ని ఆనుకుని ఉన్న తోటల్లో సందడి చేసి , సాయంత్రం అయ్యే సరికి తీరం ఇసుక తిన్నెల్లో క్రీడలతో కేరింతలు కొట్టారు,మరికొందరు కెరటాల్లో జలకాలు ఆడి సేద తీరారు.పర్యాటకులకు అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ విభీషణరావు సిబ్బందితో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.

  • ‘ఆశ’ల

    ముగిసిన ఆశ వర్కర్ల రాష్ట్ర మహాసభలు

    ఉద్యోగ భద్రత, కనీస వేతనాల

    అమలు కోసం భవిష్యత్తు

    పోరాటాలకు పిలుపు

    అనకాపల్లి: ప్రభుత్వాలు మారిన రాష్ట్రంలో ఆశ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ ఆశావర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి అన్నారు. స్థానిక గవరపాలెం జీవీఎంసీ చిన్నహైస్కూల్‌ ఎదురుగా కర్రి రమేష్‌ కల్యాణ మండపంలో యూనియర్‌ రాష్ట్ర 5వ మహాసభ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్ల పై భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని ఈ మహాసభల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ను ఆశా వర్కర్లుగా గుర్తించాలని, ఆశ వర్కర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన అంశాలపై జీవోలు విడుదల చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో మహిళలు పనిచేసే విధంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు. రాజకీయ వేధింపులు, తొలగింపులు అనేక జిల్లాల్లో జరుగుతున్నాయని వీటిపై కూడా ఉద్యమించాల్సి వస్తుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడుతున్న ఉద్యోగులు, కార్మికులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి పెట్టుబడిదారుల సేవలో మునిగి తేలుతున్నాయని అన్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా కట్టబడుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ అనకాపల్లి జిల్లాలో మరో ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌ను తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు. కార్మికులను ఎనిమిది గంటల పనిని 13 గంటలకు పెంచి శ్రమదోపిడీకి దారులు వేస్తున్నారని, చికాగో పోరాట స్ఫూర్తిని అపహాస్యం చేశారని అన్నారు.

    ఈ కార్యక్రమంలో వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్‌ రూపాదేవి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావు , ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఐదో మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.మాణిక్యం, డీడీ వరలక్ష్మి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు కె.పోచమ్మ, పి ధనశ్రీ, వి.సత్యవతి, డి.సుధారాణి, పి.మణి, డి.జ్యోతి, కమల, అమర, సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, ఆర్‌.శంకరరావు, ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్‌ పాల్గొన్నారు.

  • భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలి

    మహారాణిపేట (విశాఖ): ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌తో కలిసి ఆదివారం ఈ పనులను పరిశీలించిన ఆయన, వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున, అధికారులు సమన్వయం వహించుకుని, నిర్ణీత సమయం కంటే ముందుగానే పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్రధాన వేదిక, స్వాగత ద్వారాలు, అతిథుల రాక, పార్కింగ్‌ వసతి వంటి అంశాలపై ఆయన సూక్ష్మ స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చేయాల్సిన పనులపై ఆయన అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడా గ్యాప్‌ రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే జీవీఎంసీ సీఈకి పలు అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై, మార్పులు చేర్పులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌, డీసీపీ మణికంఠ చందోలు, జీవీఎంసీ సీఈ సత్యనారాయణరాజు, సీఎంవో డాక్టర్‌ నరేష్‌ కుమార్‌, సీఐఐ ప్రతినిధి మౌళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • భగవద్గీతతో జీవిత సమస్యలకు పరిష్కారం

    మురళీనగర్‌ (విశాఖ): ప్రతి రోజూ భగవద్గీత పఠనం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఎన్‌జీజీవోస్‌ కాలనీలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేశారు. చిన్న పిల్లలు భగవద్గీత చదివితే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. జ్యోతిష్యం, ఆగమ శాస్త్రాలను తప్పక గౌరవించాలని సూచించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం వల్ల పుణ్యం కలుగుతుందని పిలుపునిచ్చారు. మనసును నిగ్రహంగా ఉంచుకోవడానికి విగ్రహారాధన చేయాలని తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులు, ఈవో బి.ప్రసాద్‌ స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీ వైభవుడిని దర్శించుకుని పూజలు చేసి, అంతరాలయంలో కాసేపు ధ్యానం చేశారు. బీజేపీ నేత శ్యామలాదీపిక, అర్చకులు శేషాచార్యులు, వాసుదేవాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

  • నూకాంబిక సన్నిధిలో రైల్వే జీఎం దంపతులు

    నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ ఠాగూర్‌ దంపతులు, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ అంకుష్‌ గుప్తా దంపతులు

    అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ ఠాగూర్‌ దంపతులు , ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ అంకుష్‌ గుప్తా దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని మొదటిసారిగా కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్‌ల్లో అమ్మవారి చిత్రపటాన్ని రైల్వేశాఖ ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలు మేరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ కెఎల్‌.సుధారాణి, ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను (గొల్లబాబు) అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాన్ని అందజేశారు.

  • చట్టాలపై అవగాహనతో నేరాల నియంత్రణ

    బీసీ మహిళల వసతి గృహంలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న

    జిల్లా పదో అదనపు న్యాయమూర్తి నరేష్‌

    అనకాపల్లి: విద్యార్థి దశ నుంచి చట్టాలపై అవగాహన కలిగి ఉన్నట్టయితే నేరాలను నియంత్రించవచ్చని జిల్లా పదో అదనపు న్యాయమూర్తి, ఎంఎల్‌ఎస్‌సీ జిల్లా చైర్మన్‌ వి.నరేష్‌ అన్నారు. మండలంలో గుండాల జంక్షన్‌ బీసీ మహిళల విద్యార్థినుల వసతిగృహంలో ఆదివారం మండల న్యాయసేవాధికార సంఘం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడి చదువుకోవడం కంటే ఇష్టపడి చదవడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాలను నియంత్రించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) జి.ధర్మారావు, వసతి గృహం అధికారి సబిత పాల్గొన్నారు.

  • చిన్నారికి టీకా.. నూరేళ్ల జీవితానికి భరోసా

    మహారాణిపేట: పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. పూర్వం పురిట్లోనే ప్రాణాలు వదలడం, మాతాశిశు మరణాలు ఉండేవి. చిన్నారి ఎదిగే క్రమంలో అంతుచిక్కని రోగాల బారిన పడి మృత్యువాత పడేవారు. వైద్య విజ్ఞానం అప్పట్లో అంతగా అభివృద్ధి చెందకపోవడంతో కుటుంబాల్లో జననాల సంఖ్య పెంచుకునే వారు. ప్రస్తుతం వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర, పరిశోధనలు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధాలను తెచ్చాయి. పుట్టిన క్షణం మొదలు పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య శాఖ వేస్తున్న టీకాలతో ఆరోగ్యవంతంగా ఎదిగి వారంతా రేపటి పౌరులుగా మారుతున్నారు.

    అపోహలు వీడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం

    వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వివిధ వయసులో టీకాలు కచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ టీకాలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. టీకాలు వేయించడం ద్వారా జ్వరాలు రావడం, బలహీనపడతారని అపోహలతో వాటికి దూరంగా ఉంటున్నారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 10న అంతర్జాతీయ టీకాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అందరికీ రోగ నిరోధకత మానవులకు సాధ్యమే’అనే థీమ్‌తో ముందుకెళ్తున్నారు.

    ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం

    టీకాలు మన ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం లాంటివి. స్మాల్‌ ఫాక్స్‌, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించిన టీకాలు.. కోట్లాది ప్రాణాలను రక్షించాయి. టీకాలు అందరికీ చేరినప్పుడే సమగ్ర రోగనిరోధకత సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్‌ ఇమ్యునైజేషన్‌ ప్రొగ్రామ్‌ కింద ఏటా లక్షలాది శిశువులకు, గర్భిణులకు ఉచిత టీకాలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమంగా నిలుస్తోంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, నర్సులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.

    ప్రతి బుధవారం, శనివారాల్లో వ్యాక్సిన్‌

    పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు 12 రకాల వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో ఆస్పత్రులు, పంచాయతీ కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటూ టీకాలు వేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు అశ్రద్ధ చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాలని డాక్టర్‌ బి.లూసీ సూచించారు.

    ఏ టీకా.. ఎప్పుడు వేయాలి?

    ప్రసవం నుంచి 24 గంటలు: టీబీ నుంచి రక్షణకు బీసీజీ, పోలియో నివారణకు ఓపీవీ జిరో డోసు, కామెర్ల వ్యాధి అరికట్టేందుకు హెపటైటిస్‌–బి

    45 రోజులకు: పోలియో నివారణకు ఓపీవీ–1, ఓపీవీ–2, ఓపీవీ–3, ఐపీవీ

    75 రోజులకు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు, న్యూమోనియా నివారణకు పెంటావాలెంట్‌–1, 2, 3

    105 రోజులకు: తీవ్ర నీళ్ల విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి సమస్యల నివారణకు ఆర్‌వీవీ–1, 2, 3

    9–12 నెలలకు: తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్‌–1, అంధత్వ నివారణకు విటమిన్‌–ఎ, మెదడువాపు నివారణకు జేఈ–1, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందుల నివారణకు ఎఫ్‌ఐవీవీ–3, పీసీవీ–బీ

    16–24 నెలలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీడీ–1 బూస్టర్‌, పోలియో నివారణకు ఓపీవీ బూస్టర్‌, తట్టు రుబెల్లా నివారణకు ఎంఆర్‌–2, మెదడువాపు వ్యాధికి జేఈ–2, అంధత్వ నివారణకు విటమిన్‌–ఎ2

    5–6 సంవత్సరాలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీటీ–2

    10 సంవత్సరాలు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–1 బూస్టర్‌

    16 ఏళ్ల వయసు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–2 బూస్టర్‌

    జిల్లాలో అందుబాటులో

    ఉన్న టీకాలు

    ప్రస్తుతం జిల్లాలో పలు రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్‌ బి.లూసీ తెలిపారు. డీపీటీ, ఎఫ్‌ఐపీవీ, ఓపీవీ, హెపటైటిస్‌ బి, ఎంఆర్‌, బీసీజీ, పీసీవీ, టీడీ, రోటవైరస్‌ వ్యాక్సిన్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. యూనివర్సిల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా వీటిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

  • గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలక్ట్రీషియన్‌ మృతి

    తగరపువలస: ఆనందపురం మండలం వేములవలస ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్‌ ఉప్పాడ అప్పలరాము(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై, చికిత్స పొందుతూ కేజీహెచ్‌లో చనిపోయారు. మృతుడి కుమార్తె భార్గవి ఈ మేరకు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అప్పలరాము వేములవలస కాలనీ నుంచి జాతీయ రహదారిపైకి నడుచుకుంటూ వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొని, మోకాలి పైనుంచి దూసుకుపోయింది. తీవ్రమైన గాయాలతో కిందపడి ఉన్న అతన్ని స్థానికులు గుర్తించి 108 వాహనం సాయంతో కేజీహెచ్‌కు తరలించారు. అయితే గాయాలకు తాళలేక అప్పలరాము చికిత్స పొందుతూ మరణించారు. ఎస్‌ఐ శివ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • యువతి అదృశ్యంపై ఫిర్యాదు

    యలమంచిలి రూరల్‌: పట్టణంలోని తులసీ సినిమాహాలు ప్రాంతానికి చెందిన చెక్కా సన్యాసిరాజు(శివ), కుమార్తె చెక్కా గౌరీ పార్వతి (22) అదృశ్యమైనట్టు పట్టణ ఠాణాలో ఆదివారం కేసు నమోదైంది. పట్టణంలోని రంగావారి వీధిలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతి ఈ నెల 8వ తేదీ శనివారం రాత్రి 7.40 గంటలకు తన తండ్రికి ఫోన్‌ చేసి తాను పనిచేస్తున్న కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్నట్టు చెప్పింది. ఆమె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద కుటుంబ సభ్యులు వెతికారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి ఆదివారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనపుడు నీలం రంగు టాప్‌ ధరించి ఉన్నట్టు, ఆమె తెలుపురంగులో ఉండి 5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్నట్టు ఫిర్యాదులో తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

    ఎస్‌.రాయవరం: మండలంలో గోకులపాడు సమీపంలో జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన ఊడి రంజిత్‌ (28)తలుపులమ్మ లోవ నుంచి స్వగ్రామం వస్తుండగా కారుని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బైకుతో రోడ్డుపై పడిపోయాడు. ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. బైకుపై ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడినట్టు చెప్పారు. వివరాలు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

  • జాతరలో యువకుల దాష్టీకం

    నాగులచవితి రోజు యువకుడిపై విచక్షణారహితంగా దాడి

    15 రోజులుగా చికిత్స పొందుతూ మృతి

    ఆలస్యంగా వెలుగులోకి ఘటన

    యలమంచిలి రూరల్‌ : సరదాగా స్నేహితులతో కలిసి జాతర చూసేందుకు వెళ్లిన యువకుడిపై నలుగురు యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15 రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. గత నెల 25వ తేదీ రాత్రి పంచరాత్రి ఉత్సవాల ముగింపు రోజైన నాగులచవితినాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టిడ్కో కాలనీలో నివాసముంటున్న యువకుడు నెట్టి శివ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. గత నెల 25వ తేదీన యలమంచిలి పట్టణంలో నాగులచవితి సందర్భంగా జరిగిన జాతరకు స్నేహితులు దాసరి మధు, మడగల శివలతో కలిసి నెట్టి శివ జాతర చూసేందుకు వెళ్లాడు. ఆ రోజు రాత్రి సుమారు 10.15 గంటలకు ప్రధాన రహదారికి పక్కనున్న సీతాతులసీ సినిమా హాళ్లకు వెళ్లే దారిలో వెళ్తుండగా శుభయోగ ట్రేడర్స్‌ పెయింట్‌ షాపు వద్దకు వచ్చేసరికి రాత్రి 10.30 గంటలకు ఎదురుగా వస్తున్న కశింకోట గువ్వాలు, గొన్నాబత్తుల విఘ్నేషు, వెదుళ్ల మోహన్‌, కొఠారు రవిల్లో ఒకరికి నెట్టి శివ భుజం తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన నలుగురు యువకులు నెట్టి శివపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన శివ రోడ్డుపై పడిపోయినా వదలకుండా ముఖంపై మరోసారి దాడికి పాల్పడ్డారు. దీంతో అపస్మారకస్థితికి చేరుకున్న నెట్టిశివను స్నేహితులు ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు. అపస్మారకస్థితికి చేరుకున్న శివను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా వైద్యులు అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి పంపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం శివను అక్కడ్నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నెట్టి శివ మెదడులో రక్తస్రావమైనందున గత నెల 26వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స చేశారు.అప్పట్నుంచి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన సోదరుడిపై దాడి చేసిన నలుగుర్ని ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్టు, ఈ మేరకు జరిగిన ఘటనపై మృతుడు నెట్టి శివ సోదరి సంతోషరాణి ఆదివారం యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు పోలీసులు నమోదు చేసినట్టు తెలిసింది.

  • సొంత

    మైనింగ్‌ చెక్‌ పోస్టులో

    అక్రమ సీనరేజ్‌ వసూలుపై ఆగ్రహం

    నిలదీసిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రతినిధి పోతల లక్ష్మీ శ్రీనివాసరావు

    రోలుగుంట: సొంత పొలంలో మట్టిని తవ్వి తీసుకెళ్తే పన్ను వసూలు చేయడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రతినిధి పోతల లక్ష్మీ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు నిండుగొండ జంక్షన్‌లో మైనింగ్‌ చెక్‌పోస్టులో సీనరీజ్‌ వసూళ్లపై సంబంధిత సిబ్బందిని ఆయన ఆదివారం సాయంత్రం నిలదీశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మైనింగ్‌ మాఫియా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ కనుసన్నల్లో జరుగుతుందని ఆరోపించారు. గ్రామాల్లో తమ సొంత పొలంలో మట్టిని తీసుకెళ్లినా సరే రూ.300 నుంచి రూ.500 వరకు మైనింగ్‌ చెక్‌ పోస్టుల్లో సీనరీజ్‌ వసూలు చేస్తుండడం దారుణమన్నారు. క్వారీల వద్ద వే బిల్లు ఉన్నా.. లేకపోయినా సరే నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆన్‌లైన్‌ చెల్లింపు బిల్లు ఇవ్వాలన్న నిబంధనలు పాటించకుండా నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయన్నారు. మాఫియాను అరికట్టకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమ సీనరీజ్‌కు సంబంధించిన ఫారంను ఈ సందర్భంగా ఆయన విలేకర్లకు చూపించారు.

  • 177కే

    107 పరుగుల ఆధిక్యంలో తమిళనాడు

    విశాఖ స్పోర్ట్స్‌: దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో భాగంగా వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్‌–ఏ గ్రూప్‌ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఆంధ్రపై తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మ్యాచ్‌పై పట్టు సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆదివారం ఓవర్‌ నైట్‌ స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 20 పరుగులతో ఆటను ప్రారంభించిన ఆంధ్ర జట్టు.. తమిళనాడు బౌలర్ల ధాటికి త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఆంధ్ర బ్యాటర్లు భరత్‌ (12), విజయ్‌ (3), కెప్టెన్‌ రికీ భుయ్‌ (4), కరణ్‌ షిండే (9), అశ్విన్‌ హెబ్బర్‌ (13), రాజు (1) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రషీద్‌ (87 నాటౌట్‌) ఒక్కడే అద్భుత పోరాటం కనబరిచాడు. సౌరభ్‌ (30) తో కలిసి కాసేపు వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డా, మిగిలిన బ్యాటర్లు పృథ్వీ (డకౌట్‌), సాయితేజ (2) సహకారం అందించకపోవడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమిళనాడు జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆల్‌రౌండర్‌ సందీప్‌ 4 వికెట్లు, త్రిలోక్‌, సోను, సాయి కిశోర్‌ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తమిళనాడు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ఓపెనర్‌ నారాయణ్‌ (డకౌట్‌) నిరాశపరిచినా, మరో ఓపెనర్‌ విమల్‌ (20) కొంత సేపు ఆడాడు. బాలసుబ్రమణ్యం (51) అర్ధ సెంచరీతో రాణించి రనౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం ప్రదోష్‌ (26), కెప్టెన్‌ సాయికిశోర్‌(0 ) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీ, రాజు చెరో వికెట్‌ తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉంది.

  • అప్పన

    సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసిసంహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణసంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.

    విశేషంగా నిత్యకల్యాణం : శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం విశేషంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.

  • పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. యువతి ఆత్మహత్యాయత్నం

    గాజువాక : ప్రేమించిన వ్యక్తితో పోలీసులు పెళ్లి చేయలేదనే బాధతో ఓ యువతి గాజువాక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలమంచిలి ప్రాంతానికి చెందిన సీహెచ్‌ దుర్గాభవాని అనకాపల్లి ప్రాంతానికి చెందిన వీరయ్యస్వామి అచ్యుతాపురం ప్రాంతంలోని ఒక సంస్థలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం తరువాత దుర్గాభవాని అచ్యుతాపురంలో పని మానేసి గాజువాకలోని ఒక షాపింగ్‌ మాల్‌లో పని చేస్తూ శ్రీనగర్‌లోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని వీరయ్యస్వామిపై ఒత్తిడి తెచ్చింది. ఏడేళ్లపాటు కలిసి తిరిగిన తరువాత అతడు వివాహానికి నిరాకరించడంతో పాటు మొహం చాటేశాడు. దీంతో దుర్గాభవాని పది రోజుల క్రితం గాజువాక పోలీసులను ఆశ్రయించి తన ప్రియుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టింది. అయితే పోలీసులు పెళ్లి చేయడంలేదని బాధతో తనతోపాటు తెచ్చుకున్న నెయిల్‌పాలిష్‌ను తాగింది. దీన్ని గమనించిన పోలీసులు ఆమెను ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. గాజువాక సీఐ పార్థసారధి ఆస్పత్రికి వెళ్లి దుర్గాభవానిని విచారించారు. ప్రియుడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామిన పోలీసులు తెలపగా...ఫిర్యాదు చేయడానికి ఆమె ఇష్టపడలేదు. ప్రియుడితో వివాహం మాత్రమే జరిపించాలని కోరింది. ఈ విషయంపై ప్రియుడు వీరయ్యస్వామితో పోలీసులు మాట్లాడుతున్నారు.

  • వైఎస్సార్‌సీపీ నేత తాతీలుకు బెయిల్‌ మంజూరు

    తుపాను సహాయక కార్యక్రమాలపై

    పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన తాతీలు

    దీంతో అక్రమ కేసు బనాయింపు

    నక్కపల్లి: బల్క్‌ డ్రగ్‌ వ్యతిరేక ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీకి చెందిన రాజయ్యపేట మాజీ ఎంపీటీసీ పిక్కితాతీలకు యలమంచిలి కోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసులు అరెస్టు చేసి 24 గంటలు గడవక ముందే కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం రాత్రి ఆయన విడుదలయ్యారు. మోంథా తుపాను సమయంలో గ్రామస్తులందరికీ భోజన సదుపాయం కల్పించకపోవడంపై పంచాయతీ కార్యదర్శిని పిక్కితాతీలు నిలదీశారు. దీంతో పిక్కితాతీలు,12 మంది తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, కులం పేరుతో దూషించారని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిక్కితాతీలు, తదితరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్‌ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచిన వెంటనే న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, బల్క్‌గ్రడ్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న నేతలపై అక్రమ కేసులు బనాయించి ఆందోళనను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మత్స్యకారులపై అక్రమ కేసులు బనాయిస్తోందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది. పిక్కితాతీలు తదితరులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ పరామర్శించారు.

    పిక్కితాతీలుతో మాట్లాడుతున్న వీసం రామకృష్ణ

Alluri Sitarama Raju

  • భారీగా తరలివచ్చిన సందర్శకులు

    కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు

    పాడేరు : మన్యంలో పర్యాటక సీజన్‌ ప్రారంభంతో పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడాయి. వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. ప్రకృతి అందాలు తిలకించేందుకు వేకువజామునుంచి బారులు తీరారు. ఇటీవల మేఘాల కొండను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ టోల్‌గేట్‌ను ఏర్పాటుచేసింది. ప్రవేశరుసం ద్వారా రూ.65,080 ఆదాయం వచ్చింది.

    కుటుంబసమేతంగా కలెక్టర్‌ సందడి

    కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో వంజంగి మేఘాల కొండను సందర్శించారు. కొండపైనుంచి మేఘాలు, ప్రకృతి అందాలను తిలకించారు. కుటుంబ సభ్యులతో ఫొటోలు తీసుకున్నారు. ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, సహజసిద్ధ అందాలకు నిలయమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అటవీశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు సమకూర్చుతున్నామని కలెక్టర్‌ తెలిపారు.

    జి.మాడుగుల: ప్రముఖ పర్యాటక ప్రాంతం కొత్తపల్లి జలపాతానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. రోజంతా స్నానాలు చేస్తూ సందడి చేశారు. వ్యూపాయింట్‌ జలపాతాల వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ప్రకృతి ఆందాలను ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఎంజాయ్‌ చేశారు.

    డుంబ్రిగుడ: పర్యాటక ప్రాంతాలు చాపరాయి, అరకు పైనరీ పర్యాటకుల రాకతో కిటకిటలాడాయి. చాపరాయి జలవిహారికి భారీగా తరలిరావడంతో ప్రవేశ రుసుం ద్వారా శనివారం రూ.71,150, ఆదివారం రూ.1,03,830 ఆదాయం సమకూరిందని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ గిరిజన వస్త్రధారణలో పర్యాటకులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. అరకు పైనరీని శనివారం 758, ఆదివారం 860 మంది సందర్శించినట్టు అటవీశాఖ అధికారవర్గాలు తెలిపాయి.

    చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి నెలకొంది. ఆదివారం తెల్లవారుజామునుంచి భారీగా తరలివచ్చారు. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద పాల సముద్రాన్ని తలపించే ప్రకృతి అందాలను తిలకించారు. ఫొటోలు తీసుకుని సందడి చేశారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని ఎంజాయ్‌ చేశారు.

    అరకు పైనరీకి తరలివచ్చిన పర్యాటకులు

    చెరువులవేనం వ్యూ పాయింట్‌ వద్ద అందాలను తిలకిస్తున్న పర్యాటకులు

    వంజంగి హిల్స్‌ ముఖద్వారం వద్ద పర్యాటకుల సందడి

Annamayya

  • వైభవం

    ఘనంగా దర్గా పీఠాధిపతి నగరోత్సవం

    కళ్లు చెదిరేలా బాణసంచా వెలుగులు

    ముగిసిన ఉరుసు మహోత్సవాలు

    కడప సెవెన్‌రోడ్స్‌: ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం రాత్రి దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ నగరోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం ఫకీర్లు, ఇతర శిష్య గణాలతో కలిసి పీఠాధిపతి పెద్దదర్గా నుంచి పెన్నానది తీరంలోని గండి వాటర్‌ వర్క్స్‌ కొండలోని గుహల వద్దకు వెళ్లి జెండా ప్రతిష్ఠించి ఫాతెహా నిర్వహించారు. తర్వాత ఆ ప్రాంతంలో హజరత్‌ మస్తాన్‌స్వామి స్మారకంగా అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అక్కడి నుంచి ఊరేగింపుగా కడప నగరానికి తిరిగి వచ్చారు. పలు వాహనాలలో ఆయన శిష్యులు, ప్రముఖులు ఆయన వెంట ఊరేగింపులో పాల్గొన్నారు. రాత్రి మాసాపేటలోని హజరత్‌ మై అల్లా దర్గా షరీఫ్‌ వద్ద నుంచి పీఠాధిపతి ఫకీర్లు, సర్‌గిరోలు, చౌదరీలు, ఖలీఫాలు, శిష్య బృందం, నగర ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెంట రాగా నగరోత్సవం కొనసాగింది. విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై పీఠాధిపతి కొలువుదీరి ఊరేగింపుగా బయలుదేరారు. దాదాపు అన్ని కూడళ్లలో భక్తులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్యాండు మేళాలకు అనుగుణంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా నృత్యాలు ప్రదర్శించి ఆనందించారు. అడుగడుగునా యువ కు ల బృందాలు ఆయనకు స్వాగతం పలికి ఆశీస్సులు పొందాయి. ఊరేగింపు తెల్లవారుజామున తిరిగి దర్గాకు చేరింది. అనంతరం ఊరేగింపుగా తెచ్చిన చాదర్‌ను గురువు మజార్‌పై సమర్పిచారు.

    దర్గాలో సినీ నటుల ప్రార్థనలు

    దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటులు సుమన్‌, హాస్యనటులు అలీ ఆదివారం కడపకు వచ్చారు. దర్గాను దర్శించుకుని గురువుల మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారికి దర్గా ముజావర్‌ అమీర్‌ గురువుల చరిత్ర, విశిష్ఠతలను తెలియజేసి ప్రసాదాలు అందజేశారు.

  • మల్లయ్యకొండకు  ప్రత్యేక బస్సులు

    మదనపల్లె సిటీ: కార్తీకమాసం పురస్కరించుకుని తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్‌ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 5, 5.45, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్‌ నుంచి సాయంత్రం వరకు షటిల్‌ సర్వీసులు నడుస్తాయన్నారు.

    రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 10వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

    గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈసందర్భంగా భక్తుల అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం విశేషం.

    మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణం బెంగళూరుబస్టాండు సమీపంలోని హజరత్‌ సైదాని మా (బడేమకాన్‌) ఉరుసు ఉత్సవాలు ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు దర్గా మకాన్‌దార్‌ సయ్యద్‌హాషిం తెలిపారు. 11వతేదీ సందల్‌, 12వతేదీ ఉరుసు,ఖవ్వాలి, 13వతేదీ తహలీల్‌ఫాతెహా, ఖవ్వాలి జరుగుతాయన్నారు. ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. హిందు ముస్లిం సోదరులు ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

    చిన్నమండెం: రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలంలో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి చిన్నమండెం మండలం దేవగుడిపల్లి గ్రామం సమీపంలో ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డితో కలిసి పలు విషయాలపై వారు చర్చించారు.

    రాయచోటి: బాలికల ఎదుగుదలకు ప్రేరణగా నిలుస్తున్న గైడ్‌ కెప్టెన్లు ధైర్య సాహసాలకు ప్రతీక అని, నవ సమాజ నిర్మాతలని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) రాష్ట్ర సంచాలకుడు డి దేవానందరెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటి పట్టణం డైట్‌లో ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు ఏడురోజులపాటు నిర్వహించిన గైడ్‌ కెప్టెన్ల బేసిక్‌ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే క్రమశిక్షణతోపాటు దేశభక్తి, సామాజిక సేవా భావాలను పెంపొందించడానికి బాలభటుల ఉద్యమం తోడ్పడుతుందని అన్నారు. బాలికల్లో సేవాభావం, క్రమశిక్షణ, ధైర్యం, సాహసం వంటి మానవీయ విలువలను పెంపొందించడంలో గైడ్‌ కెప్టెన్ల పాత్ర ఎనలేనిదన్నారు. అనంతరం పీటీఎం మండలం, కమ్మచెరువు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయిని లలిత రూ. 10 వేలు చెల్లించి స్కౌట్‌ జీవిత సభ్యురాలుగా చేరడం గొప్ప విషయమన్నారు. లీడర్‌ ఆఫ్‌ ది కో ర్సు కస్తూరి సుధాకర్‌, జిల్లా సెక్రటరీ ఎం నరసింహారెడ్డి, అసిస్టెంట్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమిషనర్‌ లక్ష్మీకర్‌, ఆపదమిత్ర నోడల్‌ ఆఫీసర్‌ గురునాథరెడ్డి, జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన 57 మంది బేసిక్‌ గైడ్‌ కెప్టెన్లు పాల్గొన్నారు.

  • కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం

    సుండుపల్లె: పేద ప్రజల విద్య, వైద్యం అందించడమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని పార్టీ జిల్లా పరిశీలకుడు సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లె, పెద్దినేనికాలువ, ముడుంపాడు గ్రామాల్లో రచ్చబండ – కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రభుత్వ పాలనలో 17 మెడికల్‌ కళాశాలలను మంజూరు చేసి రూ.475 కోట్లతో నిర్మాణాలు చేపడితే చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఒకటిన్నర సంవత్సరంలోపే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందామని వారు అన్నారు. కార్యక్రమంలో వీరబల్లి వైఎస్సార్‌సీపీ నాయకులు మదన్‌రెడ్డి, సుండుపల్లె మండల కన్వీనర్‌ రామస్వామిరెడ్డి, జెడ్పీటీసీ ఇస్మాయిల్‌, రాష్ట్ర బూత్‌ కమిటీల ప్రధాన కార్యదర్శి రెహమాన్‌ఖాన్‌, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఆరంరెడ్డి, నాగేంద్రనాయక్‌ చౌహాన్‌, చంద్రనాయక్‌, బేరిపల్లె రఫీక్‌, నసీమాబాను, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

    వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి

  • ఒంటిమిట్ట రామయ్య సేవలో ట్రైనీ ఐఏఎస్‌లు

    ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని ఆదివారం ట్రైనీ ఐఏఎస్‌లు హర్షిత్‌ అగర్వాల్‌, స్వాతి పోగాట్‌, సుమిత్‌ కుమార్‌ సింగ్‌, సుభరామ్‌, ప్రశాంత్‌ సింగ్‌, మంజునాథ్‌ సిద్దప్ప దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, గర్భాలయంలోని మూల విరాట్‌ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో వారిని అర్చకులు సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

    బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై శిక్షణ కలెక్టర్లు 12 మంది ఆదివారం పర్యటించారు. వీరు భారత్‌ దర్శన్‌ కార్యక్రమంలో ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చారు. హార్సిలీహిల్స్‌ విశేషాలు, బ్రిటిష్‌పాలనలో కొనుగొన ఈ కొండ పూర్వ విషయాలను రెవెన్యూ సిబ్బంది వారికి వివరించారు. కొండపై ప్రకృతి అందాలను తిలకించారు. ఆహ్లదకరమైన వాతావరణం బాగుంది ప్రశంసించారు. ఈ 12 మంది అన్నమయ్యజిల్లాలో ఉండి శిక్షణ పొందుతారు.

  • ములకలచెరువు : రోడ్డు దాటుతున్న మహిళను ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పర్తికోట పంచాయతీ మావిళ్లవారిపల్లెకు చెందిన టి. సుజాత పనుల మీద భర్త పెద్దిరెడ్డితో కలిసి వేపూరికోటకు వెళ్లింది. అక్కడ రోడ్డు దాటుతున్న సుజాతను అనంతపురానికి చెందిన సింహాద్రి, ప్రశాంత్‌లు ద్విచక్రవాహనంపై ములకలచెరువు వైపు వెళ్తూ వేగంగా వచ్చి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో సుజాత(40), సింహాద్రి(30), ప్రశాంత్‌(25)లకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

     

  • దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
    వడ్డీ వ్యాపారిపై హత్యకేసు నమోదు

    మదనపల్లె రూరల్‌ : వడ్డీ వ్యాపారి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, దాడి కేసును హత్యకేసుగా నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ రాజారెడ్డి తెలిపారు. మండలంలోని కొండామర్రిపల్లె పంచాయతీ ఇసుకనూతిపల్లెకు చెందిన శ్రీనివాసులు భార్య ప్రభావతి(40) స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న రవి వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత నగదు అప్పుగా తీసుకుంది. సమయానికి తిరిగి వడ్డీ చెల్లించలేకపోవడంతో రవి ఆమెను దూషించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె అక్టోబర్‌ 30న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయమై ఆమె భర్త శ్రీనివాసులు అక్టోబర్‌ 31న వడ్డీ వ్యాపారి రవిని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో రవి, శ్రీనివాసులుపై దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టాడు. ఘర్షణలో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయం కాగా, స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు దాడి కేసును హత్యకేసుగా మార్పుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.

  • వెల్లివిరిసిన మత సామరస్యం

    మదనపల్లె సిటీ : అయ్యప్పమాలధారులకు ముస్లింలు భిక్ష(అన్నదానం) ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. మదనపల్లె పట్టణం ప్రశాంత్‌నగర్‌ జ్ఞానోదయ పాఠశాలలో ఆదివారం హెల్పింగ్‌ మైండ్స్‌ వ్యవస్థాపకుడు అబూబకర్‌ సిద్దిక్‌తో పాటు ముస్లిం యువకులు కలిసి అయ్యప్ప మాలధారులకు భిక్ష ఏర్పాటు చేశారు. తొలుత అయ్యప్పస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. హెల్పింగ్‌మైండ్స్‌ వ్యవస్థాపకుడు అబూబకర్‌ సిద్దిక్‌ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా పవిత్ర అయ్యప్పమాలధారులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మతసామరస్యంతోపాటు సోదరభావాన్ని పెంపొందించడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో సభ్యులు ఖాదర్‌ఖాన్‌, హనీఫ్‌, సమీర్‌, సైసవల్లి, ఉమర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • విష పురుగు కాటుతో వ్యక్తి మృతి

    పోరుమామిళ్ల : విష పురుగు కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలోని కాపువీధిలో జరిగింది. ఎస్‌ఐ కొండారెడ్డి కథనం మేరకు ఈనెల 6 వ తేది రాత్రి 11 గంటల ప్రాంతంలో చిలమల గురయ్య (43) తన ఇంటి ముందు కూర్చొని ఉండగా బొటనవేలు కింద విషపురుగు కాటేసింది. దాన్ని తేలికగా తీసుకుని నిద్రపోయాడు. 7 వ తేదీ ఉదయం కాలు కమిలిపోయి నల్లగా ఉండటంతో భయపడి కడప రిమ్స్‌కు వెళ్లాడు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించి, విషానికి విరుగుడు ఇంజక్షన్‌ ఇచ్చి చికిత్స చేశారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి గురయ్య మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు.

    అదృశ్యమైన గంటలోపే

    ఆచూకీ లభ్యం

    ఎర్రగుంట్ల : అదృశ్యమైన విద్యార్థిని గంటలోపే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించి పోలీసులు శభాష్‌ అనిపించుకున్నారు. వివరాలు ఇలా.. ఎర్రగుంట్ల పట్టణంలోని రెండవ సచివాలయంలో కవిత ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. ఆమె కుమారుడు సోమచరణ్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కుమారుడు పాఠశాలకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో భయ పడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ విశ్వనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా గాలించి గంటలోపే సోమచరణ్‌ను గుర్తించారు. తల్లి కవితను స్టేషన్‌కు పిలిపించి సోమచరణ్‌ను అప్పగించారు.

  • అధికార పార్టీ నాయకుల భూ కబ్జా

    ఓబులవారిపల్లె : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. వారికి అధికారులు కూడా వత్తాసు పలుకుతుండటంతో అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మండలంలోని పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని వాసుదేవపురం గ్రామానికి సమీపంలో తుమ్మెద గుర్రప్ప అనే రైతుకు చెందిన సర్వే నెంబరు. 2204లో ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని వాసుదేవపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మహేష్‌ నాయుడు డోజర్‌ సహాయంతో చదును చేసి కబ్డాకు పాల్పడ్డాడు. తన వ్యవసాయ భూమిలో ఉలవ, సజ్జ పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తన భూమికి సంబంధించి అన్ని రికార్డులు ఉన్నాయని రైతు గుర్రప్ప తెలిపాడు. పది సంవత్సరాల క్రితం మంగంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పత్రాలతో రెండు లక్షల రుణం కూడా తీసుకున్నానని తెలిపారు. గత ఎన్నికల్లో తన కుమారుడు తుమ్మెద ఈశ్వరయ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంటుగా పోలింగ్‌ బూతులో కూర్జున్నాడని, ఇందుకు తమపై కక్షకట్టి చామలమడుగు మహేష్‌ నాయుడు అధికార బలంతో తమ పొలాన్ని దౌర్జన్యంగా కబ్జాకు పాల్పడుతున్నాడని, అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలని రైతు గుర్రప్ప కోరుతున్నారు.

  • కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మూడవ రౌండ్‌ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్ల ధాటికి బ్యాటర్లు విల విల్లాడారు. రెండవ రోజు వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో కడప–అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆదివారం రెండవ రోజు 54 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 71.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని ప్రణధీర్‌ 29 పరుగులు, మన్నన్‌ 26 పరుగులు చేశారు. కడప జట్టులోని భాను వర్షిత్‌ రెడ్డి 3 వికెట్లు, ముని జాన్ఞేశ్వర్‌ రెడ్డి 3 వికెట్లు, మోనిష్‌ రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 46 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆ జట్టులోని డీఎండీ తాహీర్‌ 61 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ట్రెడిక్‌ 2 వికెట్లు, కార్తీక్‌ సాయి 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

    కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో...

    కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో చిత్తూరు –కర్నూలు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆదివారం రెండవ రోజు 78 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 81.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. ఆ జట్టులోని కేవీఎస్‌ మణిదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 167 బంతుల్లో 102 పరుగులు, ప్రశవ్‌ 41 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని యశ్వంత్‌ సూర్య తేజ్‌ 3 వికెట్లు, చేతన్‌ సాయి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 32 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఆ జట్టులోని మోక్షజ్ఞ రెడ్డి 63 పరుగులు, వియం శక్తి 60 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

    కేవీఎస్‌ మణిదీప్‌, చిత్తూరు (102 పరుగులు)

    డీయండీ తాహీర్‌, కడప

    (61 పరుగులు)

    మోక్షజ్ఞ రెడ్డి, కర్నూలు

    (63 పరుగులు)

    వియం శక్తి, కర్నూలు

    (60 పరుగులు)

  • ఇంద్రజాల పోటీల్లో అబ్బురపరిచిన ప్రదర్శనలు

    రాజంపేట టౌన్‌ : ఆంధ్రప్రదేశ్‌ మ్యాజిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాజంపేట పట్టణంలోని వజ్రం ఫంక్షన్‌ హాల్‌లో 41వ మ్యాజిక్‌ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఇంద్రజాలికులు యూపి.రాయుడు, జేవీఆర్‌ ఆధ్వర్యంలో మ్యాజిక్‌ పోటీలను నిర్వహించారు. జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి 148 మంది ఇంద్రజాల కళాకారులు పాల్గొని మ్యాజిక్‌ ప్రదర్శించారు. మాయాలోకం–2 పేరుతో ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా ఇంద్రజాలికుల సంఘం అధ్యక్షుడు కె.విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శి సుజనకుమార్‌, కోశాధి కారి నందకిషోర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శనలు ప్రేక్షకులను అబ్బురపరి మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. మ్యాజిక్‌ పోటీలు, ఇంద్రజాల ప్రదర్శనలు విజయవంతమయ్యేందుకు చెర్ర్‌సీస్‌, ఫ్యూచర్‌మైండ్‌, శ్రీసాయివిద్యాలయ స్కూల్‌ యాజమాన్యాలు తమవంతు సహకరించాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రా ష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రముఖ రంగస్థల నటుడు సింగంశెట్టి కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    విజేతలు వీరే..

    ఆంధ్రప్రదేశ్‌ మ్యాజిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 41వ మ్యాజిక్‌ ఫెస్టివల్‌ సందర్భంగా నిర్వహించిన మ్యాజిక్‌ పోటీల్లో జూనియర్స్‌ విభాగంలో ప్రథమ స్థానాన్ని సుభాని, ద్వితీయ స్థానాన్ని మహమ్మద్‌ ఇబ్రహీం, తృతీయ స్థానాన్ని లతీశ్వర్‌లు కై వసం చేసుకున్నారు. సీనియర్స్‌ విభాగంలో ప్రథమ స్థానాన్ని సురేష్‌, ద్వితీయ స్థానాన్ని శంకర్‌, తృతీయ స్థానాన్ని బాచి కై వసం చేసుకున్నారు.

    రాయుడికి మ్యాజిక్‌ స్టార్‌బోస్‌ పురస్కారం

    రాజంపేటకు చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు, జాదురత్న అవార్డు గ్రహీత యూపి.రాయుడు మ్యాజిక్‌ స్టార్‌బోస్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో యూపి.రాయుడిని ప్రముఖ ఇంద్రజాల కళాకారులు ఘనంగా సత్కరించారు.

  • నగరేశ

    ప్రొద్దుటూరు కల్చరల్‌ : స్థానిక వాసవీ సర్కిల్‌లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఉద్యాన వనంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నగరేశ్వరస్వామికి ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. నూతనంగా చరప్రతిష్ట చేసిన నగరేశ్వరస్వామి స్వరూప స్ఫటిక లింగానికి, పార్వతీ సమేత నగరేశ్వరస్వామి విగ్రహాలకు శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ చేతుల మీదుగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను జరిపారు. 102 మంది ఆర్యవైశ్య సుహాసినులు పార్వతీ మాతకు సామూహికంగా కుంకుమార్చనలు చేశారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్‌ రావు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

    ఉత్సాహంగా తైక్వాండో

    చాంపియన్‌ షిప్‌ పోటీలు

    ప్రొద్దుటూరు : జిల్లా తైక్వాండో సబ్‌ జూనియర్‌, కేడెట్‌, సీనియర్‌ కై రోగి, పూమ్సే చాంపియన్‌ షిప్‌ పోటీలు స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని స్టేడియంలో ఈనెల 8, 9 తేదీలలో నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 200 మందికిపైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలను ఎస్‌ఐ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో మొదటి స్థానం కోడూరు టీం, రెండో స్థానం ప్రొద్దుటూరు టీం, మూడో స్థానం పులివెందుల టీం సాధించినట్లు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కమాల్‌ తెలిపారు. విజేతలకు ఎస్‌ఐ ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌పీడీసీఎల్‌ బీసీ సంఘం అధ్యక్షుడు మురళీమోహన్‌ పాల్గొన్నారు.

  • గిరిజన కుటుంబంపై బీజేపీ నాయకుడు దాడి

    మదనపల్లె రూరల్‌ : వ్యక్తిగత కక్షలను మనస్సులో పెట్టుకుని బీజేపీ నాయకుడు గిరిజన కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. న్యాయం చేయాలని కోరుతూ నక్కలదిన్నె తండా వాసులు తాలూకా స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పట్టణంలోని కురవంక సరస్వతీనగర్‌లో నివాసం ఉన్న రామమూర్తి నాయక్‌ (39), స్థానికుడైన బీజేపీ నాయకుడు కోసూరి భవానీ మధ్య కొంతకాలంగా మనస్పర్థలు, వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. రామమూర్తి నాయక్‌పై భవానీ చెడుగా ప్రచారం చేస్తుండటంతో గతంలో పలుమార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రామమూర్తినాయక్‌, కురవంక వద్ద ద్విచక్రవాహనంలో వస్తుండగా, భవానీ అడ్డుకుని దాడికి పాల్పడ్డాడు. ఈలోగా రామమూర్తినాయక్‌ భార్య రోజా(32), తల్లి కమలమ్మ(60) అక్కడకు చేరుకుని నిలదీయడంతో వారిపై దాడికి దిగాడు. ఈ విషయాన్ని రామమూర్తి నాయక్‌, నక్కలదిన్నె తండాలోని తన బంధువులకు తెలపడంతో గిరిజనులు పెద్దసంఖ్యలో తాలూకా పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిందితుడితో వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భవానీని స్టేషన్‌లోనికి తీసుకెళ్లారు. అయితే భవానీ గతంలోనూ పలుమార్లు ఘర్షణకు దిగి దౌర్జన్యం చేసి దాడికి పాల్పడటమే కాకుండా చంపుతానని బెదిరించాడని, స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడం వల్లే తరచూ దాడులకు పాల్పడుతున్నాడని స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. నిందితుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

    పోలీస్‌ స్టేషన్‌ ఎదుట

    తండా వాసుల నిరసన

  • కడపలో యువకుడి దారుణ హత్య
    పోలీసుల అదుపులో నిందితులు?

    కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నగరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇద్దరు యువకుల మధ్య గతంలో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఉర్సుకు సమీపంలో ఎగ్జిబిషన్‌ జరిగే ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన కడప నగరంలో సంచలనం కలిగించింది. ఈ సంఘటన కడప టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోనే జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య సంఘటనపై పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కుమ్మరికుంటకు చెందిన సయ్యద్‌ అబూబకర్‌ అలియాస్‌ గౌస్‌ బాషా(25) కు, కడపకు చెందిన అబూజార్‌, యూసఫ్‌ ల మధ్య గతంలో మనస్పర్ధలు ఉండేవి. శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అబూబకర్‌ ఉరుసుకు వచ్చాడు. అదే సమయంలో నిందితులు, మరో ఏడుగురు స్నేహితులతో కలిసి అబూబకర్‌ కి ఎదురుపడ్డారు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యూసఫ్‌ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని అబూబకర్‌ పొట్టలో గట్టిగా పొడిచి చీల్చివేశాడు. దీంతో రక్తపు మడుగులో అబూబకర్‌ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అబూబకర్‌ను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

  • రోడ్డ

    సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గురిగింజకుంట కొండయ్య నాయుడు (51) మృతి చెందగా భార్య రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంబేపల్లె మండలంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు .. సుండుపల్లె మండలం చిన్నగొల్లపల్లె గ్రామం రామావాండ్లపల్లెకు చెందిన కొండయ్య, భార్య రత్నమ్మ ద్విచక్రవాహనంలో సంబేపల్లె మండలంలోని అన్నప్పగారిపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలోని మొటుకువాండ్లపల్లె క్రాస్‌ వద్దకు రాగానే వీరి ద్వి చక్రవాహనాన్ని రాయచోటి వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కొండయ్య నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్య రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భర్తకు ఏమైందంటూ అక్కడికి వచ్చిన వారందరిని ఆమె అడుగుతుంటే సమాధానం చెప్పలేక వారు బాధను దిగమింగడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.

    భార్యకు తీవ్ర గాయాలు

    మృతి చెందిన

    కొండయ్యనాయుడు

    తీవ్ర గాయాలతో

    పడిపోయిన రత్నమ్మ

Family

  • లబ్బీపేట(విజయవాడతూర్పు): వాష్‌రూమ్స్‌ కంపు కొడుతున్నాయని కొందరు, అందుబాటులో లేక ఇంకొందరూ, సమయం లేని మరికొందరూ యూరిన్‌ వస్తున్నా.. గంటల కొద్ది ఆపుకొంటున్న వారు అనేక మంది ఉంటున్నారు. అంతేకాదు ఇంటి నుంచి విధులకు, కళాశాలలకు వెళ్లే వారు తిరిగి ఇంటికి వచ్చే వరకూ మూత్ర విసర్జన చేయని వారు కూడా ఉంటున్నారు. నీళ్లు తాగితే వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుందని తక్కువగా తాగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో మూత్రాశయ, కిడ్నీ సమస్యలు తలెత్తుతుండటంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నగరంలోని యూరాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో ఇలాంటి వారు అధికంగా ఉంటున్నారు. మూత్రం వస్తున్నట్లు సిగ్నల్‌ వచ్చిన తర్వాత ఆపుకోవడం కరెక్ట్‌ కాదంటున్నారు. అలా చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  

    ఇవే నిదర్శనం..  
    గవర్నర్‌పేటకు చెందిన డిగ్రీ విద్యార్థిని మూత్రం వస్తే ఆపుకోలేక అర్జెంట్‌గా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తరగతి గదిలో ఉన్నప్పుడు కూడా తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో యూరాలజిస్టును సంప్రదించారు. ఎక్కువ సేపు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు.  

    పటమటకు చెందిన ఓ ఉద్యోగిని 36 గంటల వరకూ యూరిన్‌ రాకపోవడంతో యూరాలజిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తే యూరినరీ బ్లాడర్‌ పెరిగినట్లు ఉంది. అంటే ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు నిర్ధారించారు.  ఇలా అనేక మంది మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లతో వైద్యులను సంప్రదిస్తున్నారు.  

    • సమస్యలివే.. 
      యూరిన్‌ బ్లాడర్‌లో రెండు లీటర్ల వరకూ యూరిన్‌ నిల్వ ఉంటుందని, పెరిగితే యూరిన్‌కు వెళ్లాలనే సిగ్నల్‌ వస్తుంది. అలా వచ్చినప్పుడు మూత్ర విసర్జన చేయకుండా, బ్లాడర్‌లో యూరిన్‌ మూడు, నాలుగు లీటర్లకు చేరుతుంది.  

    • అలా యూరిన్‌ పెరగడం వలన యూరిన్‌ బ్లాడర్‌ ఎన్‌లార్జ్‌ అవుతుంది.  

    • కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరుపై ప్రభావం చూపుతుంది.

    •  ఇలాంటి వారిలో యూరినరీ ప్రాబ్లమ్స్‌ తలెత్తుతాయి.  

    • యూరిన్‌కు సిగ్నల్‌ వచ్చిన వెంటనే అర్జంట్‌గా వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి వాష్‌రూమ్‌కు వెళ్తుండగానే యూరిన్‌ పడిపోతుంది.  

    • కొందరిలో అసలు యూరిన్‌ రాకుండా ఆగిపోతుంది.  

    • ఇలాంటి సమస్యలతో టీనేజ్‌ పిల్లలతో పాటు పెద్ద వారు ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  

    • నీళ్లు తాగడం లేదు.. 
      నీళ్లు తాగితే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని, విద్యార్థులే కాదు, ఉద్యోగుల్లో కూడా చాలా మంది తక్కువగా నీరు తాగుతున్నారు.

    • ఇలాంటి వారిలో మూత్ర కోశ సమస్యలతో పాటు, కిడ్నీలో రాళ్లు కూడా వస్తున్నాయి.  

    • కిడ్నీలో రాళ్లు రావడానికి ఆహార అలవాట్లతో పాటు తక్కువగా నీళ్లు తాగడమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు.  

    • ఇలాంటి వారిలో యూరినరీ ట్యూబ్‌ సన్నబడటం కూడా జరగవచ్చు.  

    •  కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండేందుకు రోజుకు 3 నుంచి 4 లీటర్లు నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.  

    • ్రప్రొస్టేట్‌ సమస్యలతో... 
      ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో ప్రొస్టేట్‌ సమస్య కామన్‌గా మారినట్లు వైద్యులు చెబుతున్నారు.  

    •  ప్రొస్టేట్‌ సమస్య కారణంగా అతిగా మూత్రం రావడం, అసలు రాకపోవడం, తక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  

    • 50 ఏళ్లు దాటిన వారు ప్రొస్టేట్‌ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

    • ప్రొస్టేట్‌ సమస్యలున్న 90 శాతం మందిలో మందులతోనే నయం చేయవచ్చునంటున్నారు.  

    • కేవలం 10 శాతం మందికి మాత్రమే సర్జరీ అవసరం అవుతుందంటున్నారు.  

    మూత్రం వస్తున్న సిగ్నల్‌ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు ఆపుకోవడం సరికాదు. అలా చేయడం ద్వారా మూత్రాశయ, కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నాయి. మా వద్దకు వచ్చే వారిలో కిడ్నీలో రాళ్లు, ప్రొస్టేట్‌ సమస్యలు, యూరినరీ ట్యూబ్‌ సన్నబడటం, అర్జంట్‌గా యూరిన్‌ రావడం, అసలు రాకపోవడం వంటి వారు ఉంటున్నారు. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్‌ సమస్యలున్న వారికి అందరికీ సర్జరీ అవసరం లేదు. చాలా మందిలో మందులతో నయం చేయవచ్చు. యూరిన్‌ ట్యూబ్‌ సన్నబడటం వంటి సమస్య పుట్టుకతో పిల్లల్లో కూడా ఉంటుంది. అలాంటి వారికి మందులు, సర్జరీ ద్వారా సరిచేస్తున్నాం. 10 ఏళ్లలో 12,500 వరకూ యూరాలజీ సర్జరీలు చేశాం. 
    – డాక్టర్‌ గుంటక అజయ్‌కుమార్, యూరాలజిస్ట్‌   

Chittoor

  • ఇల్లు

    మాకు ఇప్పటికే వయసు మీదపడింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాం. పూరింట్లో జీవనం సాగిస్తున్నాం. ఇటీవల జరిగిన రాయలచెరువు ఘటనలో నీటి ప్రవాహానికి మా పూరిల్లు కూలిపోయింది. మేము ప్రాణంతో బతక గలిగాం అంటే దేవుడి దయే. ప్రస్తుత పరిస్థితిల్లో ఈ ఇంటిని బాగు చేసుకునేందుకు మాకు స్తోమత లేదు. ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అలాగూ నెల తం రూ.40 వేలతో పాలిచ్చే ఆవును కొన్నాం. అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడింది. దీనికి నష్టపరిహారం చెల్లిస్తే మా జీవనోపాధికి ఉపయోగపడుతుంది. – మునివేలు, సూర్యపుత్రి

    ఇల్లు గడవడమే కష్టంగా మారింది

    నేను టమాటా వ్యాపారం చేస్తుంటా. నా భార్య పశుపోషణతో చేదోడుగా ఉంటుంది. రోజూ మదనపల్లె నుంచి టమాటాలను తీసుకువచ్చి పలు దుకాణలు సరఫరా చేస్తుంటా. రాయలచెరువు కట్ట తెగిన రోజు ఇంటి వద్ద 80 బాక్సుల టమాటా ఉంది. నీటి ప్రవాహానికి మొత్తం పోయింది. టమాటా రవాణాకు వినియోగించే వాహనానికి వాయిదాలు కట్టేందుకు ఇంట్లో ఉంచిన రూ.50వేలు కొట్టుకుపోయాయి.అలాగే ఆరు గేదెలు మృతి చెందాయి. పైసా పైసా కూడబెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మాకు ఈ విపత్తు కారణంగా రూ.5లక్షల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం టమాటా వ్యాపారం చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రస్తుతం ఇల్లు గడవడమే కష్టంగా మారింది. – సౌందరరాజ్‌, అముద, కళత్తూరు దళితవాడ

    ఉపాధి పోయింది

    నాతో పాటు గ్రామంలో మరో పదిమందికి బీడీలు చుట్టడం ద్వారా ఉపాధి కల్పిస్తున్నా. రాయలచెరువు తెగి మా గ్రామాన్ని నీటి ప్రవాహం ముంచెత్తింది. దీంతో మా ఇంటి వద్ద నిల్వ చేసిన 15 బస్తాల బీడీ ఆకు, 8 బస్తాల పొగాకు, 53 వేల బీడీలు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా ఇంట్లోని వస్తువులు సైతం ప్రవాహంలో వెళ్లిపోయాయి. ఈ విపత్తు కారణంగా మాకు సుమారు రూ.2.5లక్షల వరకు నష్టం వాటిల్లింది. నాకు ఉపాధి పోయింది. ప్రస్తుతం పెట్టుబడికి చేతిలో పైసా లేని పరిస్థితి. నేను గుండె జబ్బుతో బాధపడుతున్నా. ఇటీవలే యాంజియోగ్రామ్‌ కూడా చేశారు. వయసు మీద పడింది. ఇప్పుడు ప్రభుత్వం చేయూతనందించాలి. – ఎన్‌.విజయ్‌ కుమార్‌

    కోలుకోలేని నష్టం

    రాయలచెరువు తెగిన ఘటనలో నీటి ప్రవాహం కారణంగా మా కుటుంబానికి రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. మాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి చెందిన 10 పశువులు, చిన్నవాడికి చెందిన 9 పశువులు ఉప్పెన ఉధృతికి మృత్యువాత పడ్డాయి. రెండు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు వాటి ఆచూకీ తెలియలేదు. 20 బస్తాలు బియ్యం నీటి పాలైంది. మా పశువుల కొట్టంలో మూడు లేగదూడలు మాత్రమే మిగిలాయి. వాటికి పాలిచ్చే గేదెలు మృతి చెందడంతో బయటి నుంచి పాలు కొనుగోలు చేసుకుని ఆకలి తీరుస్తున్నాం. ఈ విపత్తు కారణంగా కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సాయం చేస్తే కానీ, కుదుటపడలేం. – నగరం మురగయ్య, సుశీలమ్మ

    అంతా పోయింది

    రాయలచెరువుల ఘటనలో మాకు అంతా పోయింది. ఏమీ మిగలలేదు. ఇంట్లోని వస్తువులు, పిల్లల సర్టిఫికెట్లు, పాసు పుస్తకాలు, గుర్తింపు కార్డులు గల్లంతయ్యాయి. నాకున్న పది ఆవుల్లో ఏడు మృత్యువాత పడ్డాయి. పంట సాగుకు తెచ్చిపెట్టుకున్న వరి విత్తనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దాదాపు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాలాంటి బాధితులను ఆదుకోవాలి. మా కళత్తూరు దళితవాడ లోతట్టు ప్రాంతంలో ఉంది. మాకు మిట్ట ప్రాంతంలో ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. – కె.సుబ్రమణ్యం

  • కిక్క

    కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి ఆలయం కిక్కిరిసింది. ఉచిత దర్శనం మొదలు...శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శనాల వరకు భక్తులు భారీగా బారులు తీరారు. దర్శ నానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తూ..రద్దీని అధిగమించేలా ఏర్పాట్లు చేశారు.

    నేడు కలెక్టరేట్‌లో

    ప్రజాసమస్యల పరిష్కార వేదిక

    చిత్తూరు కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఉంటుందని చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు.

    నేడు పోలీసు గ్రీవెన్స్‌

    చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలు తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.

    నేటి నుంచి సమ్మేటీవ్‌ అసెస్‌మెంట్‌–1

    చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో సోమవారం నుంచి సమ్మేటీవ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 8 నుంచి 10 తరగతులకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, 6, 7 తరగతులకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు పరీక్షలుంటాయని జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

    వాలీబాల్‌ సెమీ ఫైనల్‌కు మూడు రాష్ట్రాల జట్లు

    రొంపిచెర్ల: మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో సౌత్‌ జోన్‌ లెవల్‌ వాలీబాల్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జట్లు పోటీ పడుతున్నారు. సెమీ ఫైనల్‌లో తమిళనాడు, నెల్లూరు, హైదరాబాదు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, నంద్యాల, కాకినాడ, సూర్య వేలూరు నవీన్‌ తమిళనాడు జట్లు చేరారు. వాలీబాల్‌ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. రాత్రి 11 గంటలకు పోటీలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీలకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని పల్లు జిల్లాల నుంచి పెద్ద ఎత్తు న క్రీడాకారులు విచ్చేశారు. డే అండ్‌ నైట్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు నిర్వాహకులు వసతి, భోజన వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్‌, రౌనఖ్‌, ఆజమ్‌, పూర్వ విద్యార్థుల యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.

    కేంద్ర స్కాలర్‌షిప్‌నకు అవకాశం

    చిత్తూరు కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే స్కాలర్‌షిప్‌లకు అవకాశం కల్పించినట్టు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ (సంచారజాతులు) విద్యార్థు లు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (పీఎం యశస్వి) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రు ల వార్షిక ఆదాయం రూ 2.5 లక్షల లోపు, గత ఏడాది మార్కుల జాబితా, బ్యాంకు ఖాతా, ఆధా ర్‌, కుల ధ్రువీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

  • వైఎస్‌ జగన్‌ ఇచ్చింది రూ.లక్ష కోట్ల ఆస్తి

    పుంగనూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్‌ కళాశాలల రూపంలో రాష్ట్ర ప్రజలకు రూ.లక్ష కోట్ల ఆస్తి సృష్టించారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న ర్యాలీ పోస్టర్లను ఆదివారం పుంగనూరులో పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలోనే ఏడు కాలేజీలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని కాలేజీలు వినియోగంలోకి వస్తాయన్నారు. తద్వారా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ఆస్తి విలువ రూ.లక్ష కోట్లు అవుతుందని, ఇది ప్రజలకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆస్తి అన్నారు. వీటి పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. పేదలకు వైద్యం, వైద్య విద్య దూరమవుతాయని ఆగ్రహంవ్యక్తంచేశారు. ధనవంతులు, విదేశాల్లో ఉన్నవారు, పొరుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలల్లో సీట్లు పొంది చదువుకుంటారని, విద్య పూర్తయిన తర్వాత వారి స్వస్థలాలకు లేదా విదేశాలకు వెళ్లిపోతారని, దీనివల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమీలేదన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యం, విద్య ఉండాలని వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపడితే, ఇప్పుడు వాటిని చంద్రబాబు పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న నియోజకవర్గ స్థాయి ర్యాలీని విజయవంతం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, పుంగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

  • నేను పదేళ్లుగా కళత్తూరు పరిసర గ్రామాల్లో చీరలు అమ్ముకుంటూ ఆ వ్యాపారంతో కుటుంబ పోషణ చేసుకుంటున్నా. పది రోజుల క్రితం రూ.70 వేలకు వెంకటగిరిలో చీరలు కొని ఇంట్లో ఉంచా. అందులో రూ.10 వేల విలువైన చీరలను విక్రయించా. అయితే చెరువు తెగి ఒక్క సారిగా వచ్చిన నీటి ప్రవాహానికి ఇంట్లోని చీరలు మొత్తం కొట్టుకుపోయాయి. ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం ఆదుకుంటే గాని వ్యాపారం చేసుకోలేం.

    –సీహెచ్‌ జ్యోతి మణి

    బురదలో నిలబడిపోయాం

    నాకు ఓ ప్రమాదంలో చేయి పోయింది. ఇక ఏ పని చేసుకోలేక మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యుల సహకారంతో మా కాలనీలోనే మళిగంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయితే రాయలచెరువు తెగిన ఘటనలో ఉప్పెనలా వచ్చిన నీటి ప్రవాహానికి దుకాణం మునిగిపోయింది. అంలోని పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. చివరకు దుకాణం, ఇంటిలో నిండిపోయిన బురదలో నిలబడిపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.రాజా

    ప్రశ్నార్థకంగా జీవనం

    నేను రోజువారీ నిర్మాణ పనులకు వెళుతుంటా. కాంక్రీట్‌ మిల్లరు ద్వారా ఉపాధి పొందుతుంటా. ఇళ్లకు శ్లాబు కాంక్రీట్‌ పనులకు కూలీలను తీసుకుని వెళతా. పని ఉన్న రోజు మిల్లరుకు రూ.1000 అద్దె వస్తుంది. దాంతో పాటు నాకు కూలి కింద మరో రూ.600 ముట్టుతుంది. అయితే రాయలచెరువు ఘటనతో నీటి ప్రవాహానికి నా ఇంటి ముంగిట పెట్టిన కాంక్రీటు మిల్లర్‌ కొట్టుకుపోయింది. దీంతో మా కుటుంబ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. కాంక్రీటు మిల్లర్‌ కొత్తది కొనాలంటే రూ.లక్ష కావాలి. రోజు వారీ కూలీగా కుటుంబ పోషణ చేసుకునే నేను ఒక్క సారిగా అంత పెట్టుబడి పెట్టలేని దుస్థితి. ప్రభుత్వం ఆదుకుంటే కానీ, మా బతుకు ముందుకు సాగదు. – కోళ్ల విజయరత్నం

  • గుండె‘కోత’

    జలప్రళయం అన్నదాతకు గుండెకోత మిగిల్చింది. రాయలచెరువు ఆయకట్టు పరిధిలోని రెండు వేల ఎకరాల మేర ధ్వంసమైంది. పాతపాళెం, పాతపా ళెం దళితవాడ, అరుంధతి వాడ, ఎస్‌.ఎల్‌.పురం, కళత్తూరు, ఎం.ఏ రాజులకండ్రిగ గ్రామాల్లో పొలా లన్నీ కోతకు గురయ్యాయి. కోతకు గురై రూపురేఖలే మారిపోయాయి. ఇసుక మేటలు వేశాయి. రాళ్లుతేలిపోయాయి. వీటిని బాగు చేయడానికి భారీగా ఖర్చుచేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆదుకుంటేనే రైతులను గట్టున పడే అవకాశం ఉంది.

    పాతపాళెం ప్రాంతంలో

    రాళ్లు తేలిన పంట పొలాలు

  • సంపద

    పుంగనూరు : సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడమా? అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆది వారం ఆయన పట్టణంలో వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ నిరసన పోస్టర్లను ఆవిష్కరించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో సంపద సృష్టిస్తా....పేదలకు పంచుతా... అని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చిన చంద్రబాబు ఆ సంపద సృష్టి ఎలా ఉంటుందో గత సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ప్రభుత్వ రంగంలో ఆస్తులను అభివృద్ధి పరిచి, వాటి ద్వారా సంపద పెంచాల్సింది పోయి, వేల కోట్ల ప్రభుత్వ సంపద ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, ధనికుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగించడంలో ఐదేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. దీనిని దేశం మొత్తం గుర్తించిందని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా ప్రజలకు అందించిన ఘనత వైఎస్‌.జగన్‌కు దక్కుతుందన్నారు. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించిందని విమర్శించారు. దీనిపై జగన్‌ తాను పేదల పక్షాన ఉన్నానని, ఇది క్లాస్‌వార్‌ అని ఆయన సీఎంగా ఉన్నప్పుడే ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు క్లాస్‌వార్‌ ఏమిటో చేతల్లో నిరూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదల కోసం జగన్‌ నిర్మించిన 17 వైద్య కళాశాలలను సంపన్నులకు కట్టబెట్టి, పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల పేరుతో విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం , సంపదను దోచిపెట్టడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారంటే , అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన బెట్టి ప్రజలను మోసం చేయడమేనన్న విషయం మరోసారి స్పష్టమైందని అన్నారు. పేదల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే పథకాలను జగన్‌ అమలు చేస్తే.....చంద్రబాబు హామీలతో మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టి వేటాడటం, వేధించడం విధిగా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈనెల 12న జరగనున్న నిరసన ర్యాలీకి ప్రతి ఒక్కరూ వేల సంఖ్యలో పాల్గొని , జయప్రదం చేయాలని పెద్దిరెడ్డి కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, శ్రీనాథరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా , ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, జెడ్పీటీసీ దామోదర్‌రాజు, పార్టీ నాయకులు ఆవుల అమరేంద్ర, చంద్రారెడ్డి యాదవ్‌, సంపల్లి బాబు, ఖాదర్‌, రాజేష్‌, తేజ పాల్గొన్నారు.

  • టీడీప

    శ్రీరంగరాజపురం : మండలానికి చెందిన పిళ్లారుకుప్పం పంచాయతీ యల్లంపల్లి, పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు 20 మంది మంగుంట సర్పంచ్‌ రుపాశేషాద్రి ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మి సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభివృద్ధికి కృషి చేసి టీడీపీని గెలిపించుకున్నామన్నారు. కానీ నేడు టీడీపీని గెలిపించున్నందుకు మాకు శాపంగా మారిందన్నారు. చిన్న పనులు చేసుకోవాలన్నా టీడీపీ పెద్ద నాయకులను కలవాలని లేకుంటే ఏ పనులు జరగడం లేదన్నారు. టీడీపీ జెండా మోసినందుకు తమ కు తగినశాస్త్రి జరిగిందన్నారు. జగనన్న పాలనలో రాజకీయలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంటే..కూటమి ప్రభుత్వంలో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. అందుకే టీడీపీలో ఇమడలేక , ఇందులో సామాజిక న్యాయం లేక సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్‌సీపీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను గెలిపించుకుంటామన్నారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి... నరేంద్ర, కాశీ విశ్వ నాథరెడ్డి, పురుషోత్తంరెడ్డి, కొదండరెడ్డి వారి తో పాటు పలువురికి పార్టీ కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మణి, ఎంపీపీ సరిత జనార్దన్‌, యూత్‌ విభాగం మండల అధ్యక్షులు జ్ఙానేంద్ర, మాజీ సర్పంచ్‌ భూపతిరెడ్డి, హరిరెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు.

    బంగారుపాళెం మండలంలో..

    బంగారుపాళెం: మండలంలోని ముంగరమడుగు గ్రామంలో ఆదివారం టీడీపీకి చెందిన యువకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ భువనేశ్వరి, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో గ్రామానికి చెంది న యువకులు రాజ్‌కుమార్‌, హరీష్‌, మూర్తి, గుణశేఖర్‌ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం, విద్యార్థులు, యువతను మోసగించిందన్నారు.

    వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న నారాయణస్వామి, కృపాలక్ష్మి

    టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న డాక్టర్‌ సునీల్‌కుమార్‌