Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికాను భారత్‌ 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకొని సౌతాఫ్రికాను గడగడలాడించింది. అర్షదీప్‌ సింగ్‌ (4-0-13-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-11-2), హర్షిత్‌ రాణా (4-0-34-2), కుల్దీప్‌ యాదవ్‌ (2-0-12-2), హార్దిక్‌ పాండ్యా (3-0-23-1), శివమ్‌ దూబే (3-0-21-1) చెలరేగడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్‌ (61) ఒంటరిపోరాటం చేయడంతో సౌతాఫ్రికా కనీసం మూడంకెల స్కోర్‌నైనా చేయగలిగింది.

    మిగతా ఆటగాళ్లలో ఫెరియెరా (20), నోర్జే (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్‌ (1), బ్రెవిస్‌ (2), స్టబ్స్‌ (9), కార్బిన్‌ బాష్‌ (4), జన్సెన్‌ (2), బార్ట్‌మన్‌ (1), ఎంగిడి (2 నాటౌట్‌) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. హెండ్రిక్స్‌ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను భారత్‌ ధాటిగా ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత కాస్త నిదానించింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించి ఔటయ్యాక శుభ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు), తిలక్‌ వర్మ (34 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఆచితూచి ఆడారు. 

    శివమ్‌ దూబే (4 బంతుల్లో 10 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించడంతో భారత్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్‌, బాష్‌కు తలో వికెట్‌ దక్కింది. నాలుగో టీ20 లక్నో వేదికగా డిసెంబర్‌ 17న జరుగనుంది. 

  • ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో వంద వికెట్ల మైలు రాయిని పాండ్యా అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులతో పాటు వంద వికెట్లు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు. 

    ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా పాండ్యా నిలిచాడు. అతడు ఇప్పటివరకు టీ20ల్లో 1939 పరుగులతో పాటు వంద వికెట్లను సాధించాడు. పాండ్యా దారిదాపుల్లో ఏ భార‌త ప్లేయ‌ర్ లేరు.

    ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ త‌లా రెండు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

    టీ20ల్లో 1000+ పరుగులు & 100+ వికెట్లు తీసిన ఆటగాళ్ళు:

    మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్‌) - 2417 పరుగులు & 104 వికెట్లు

    షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 2551 పరుగులు & 149 వికెట్లు

    సికందర్ రజా (జింబాబ్వే) - 2883 పరుగులు & 102 వికెట్లు

    విరణ్‌దీప్ సింగ్ (మలేషియా) - 3180 పరుగులు & 109 వికెట్లు

    హార్దిక్ పాండ్యా (భారత్‌) - 1939 పరుగులు & 100* వికెట్లు

  • సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.  స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు. 

    ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది.  "జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు మూడో టీ20కు అందుబాటులో లేడు. బుమ్రా తదుపరి మ్యాచ్‌లకు జట్టులో చేరే విషయంపై అప్‌డేట్ ఇస్తామని" బీసీసీఐ  పేర్కొంది. 

    ఇదే విషయాన్ని టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జస్ప్రీత్ స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులో వచ్చాడు. బుమ్రాతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ధర్మశాల టీ20కు దూరమయ్యాడు. 

    దీంతో కుల్దీప్ యాదవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. అయితే బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.  ఈ సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నో వేదికగా జరగనుంది. రెండు రోజుల సమయం లభించడంతో అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

    ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తడబడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హర్షిత్ రాణా రెండు , అర్ష్‌దీప్‌, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.

    తుది జట్లు
    దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

    భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
    చదవండి: Asia Cup 2025: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా..
     

  • ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికాను టీమిండియా 117 పరుగులకే కట్టడి చేసింది. 

    అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లు ఛేదించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. 

    మూడో వికెట్‌ డౌన్‌
    గెలుపు ఖరారయ్యాక టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (12) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 109/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 30 బంతుల్లో మరో 9 పరుగులు చేస్తే చాలు. తిలక్‌ వర్మ (24), దూబే క్రీజ్‌లో ఉన్నారు. 

    సౌతాఫ్రికా రెండో వికెట్‌ డౌన్‌..
    92 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. 28 పరుగులు చేసిన గిల్‌.. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్‌ విజయానికి ఇంకా 26 పరుగులు కావాలి. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు.

    10 ఓవర్లకు భారత్‌ స్కోరెంతంటే?
    10 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(28), తిలక్‌ వర్మ(17) ఉన్నారు. 

    భారత్ తొలి వికెట్ డౌన్‌
    60 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 35 పరుగులతో దూకుడుగా ఆడిన అభిషేక్‌.. బాష్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.

    👉5 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 60/0. క్రీజులో అభిషేక్‌ శర్మ(35), గిల్‌(20) ఉన్నారు.

    దూకుడుగా ఆడుతున్న అభిషేక్‌
    118 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్‌ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22), గిల్‌(5) ఉన్నారు.

    117 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్‌
    ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో టీ20లో భార‌త బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్‌.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో117 ప‌రుగుల‌కే ఆలౌటైంది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టి స‌ఫారీల ప‌త‌నాన్ని శాసించారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా ప్రోటీస్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

    వరుణ్‌ మ్యాజిక్‌.. ఆలౌట్‌ దిశగా ప్రోటీస్‌
    స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బంతితో మ్యాజిక్‌ చేస్తున్నాడు. వరుణ్‌ దెబ్బకు ప్రోటీస్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్‌గా ఫెరీరా, ఏడో వికెట్‌గా జాన్సెన్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 15.1 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్‌: 77/7

    ఐదో వికెట్‌ డౌన్‌..
    33 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కార్బిన్‌ బాష్‌(4).. శివమ్‌ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    పది ఓవర్లకు ప్రోటీస్‌ స్కోరెంతంటే?
    10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్‌(28), బాష్‌(4) ఉన్నారు.

    సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ డౌన్‌
    30 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ట్రిస్టన్‌ స్టబ్స్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

    మూడో వికెట్‌ డౌన్‌.. బ్రెవిస్‌ ఔట్‌
    బ్రెవిస్‌(2) రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో బ్రెవిస్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి ట్రిస్టన్‌ స్టబ్స్‌ వచ్చాడు.

    సౌతాఫ్రికాకు భారీ షాక్‌..
    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌ వికెట్ల ముందు దొరికిపోగా.. రెండో ఓవర్‌లో హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో క్వింటన్‌ డికాక్‌(1) ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్‌ మార్‌క్రమ్‌(4), బ్రెవిస్‌)2) ఉన్నారు.

    ధర్మశాల వేదికగా మూడో టీ20లో సౌతాఫ్రికా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత దూరమయ్యాడు.

    ఈ విషయాన్ని టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించాడు. అదేవిధంగా అక్షర్‌ పటేల్‌కు కూడా విశ్రాంతి ఇచ్చారు. వీరిద్దరూ స్ధానంలో హర్షిత్‌ రాణా, కుల్దీప్‌ యాదవ్‌ వచ్చారు. సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి చూపించారు. సౌతాఫ్రికా కూడా మూడు మార్పులు చేసింది. మిల్లర్‌, లిండే, సిప్లామ దూరం కాగా.. బాష్‌, నోర్జే, స్టబ్స్‌ జట్టులోకి వచ్చారు.

    తుది జట్లు
    దక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

    భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

  • అండ‌ర్‌-19  ఆసియాక‌ప్ 2025లో యువ భార‌త జ‌ట్టు జోరు కొన‌సాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 90 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతం చేశారు. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాక్‌ చతికల పడింది.

     భారత బౌలర్ల ధాటి​కి పాక్‌ అండర్‌ 19 జట్టు 41.2 ఓవర్లలో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. దీపేష్ దేవేంద్రన్, కన్షిక్‌ చౌహన్‌ తలా మూడు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించారు. వీరితో పాటు కిషాన్‌ కుమార్‌ రెండు వికెట్లు సాధించారు. పేసర్‌ దీపేష్‌ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని దెబ్బతీశాడు.

    పాక్‌ బ్యాటర్లలో హుజైఫా అహ్సాన్(83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి అహ్సాన్‌ మాత్రం దూకుడుగా ఆడి భారత్‌పై ఒత్తిడిపెంచాడు. ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ముగ్గురే ముగ్గురు డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ సాధించారు.

    అదరగొట్టిన ఆరోన్‌..
    ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో  భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌(85) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(5) విఫలమయ్యాడు. పాక్‌ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్‌, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. 
    చదవండి: IPL 2026: కేకేఆర్‌ కీలక నిర్ణయం..! కెప్టెన్‌గా అతడే?
     

  • అభిషేక్ శర్మ.. టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు దొరికిన అణిముత్యం. గతేడాది టీ20 దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన అభిషేక్.. తన ఐపీఎల్ దూకుడును అంతర్జాతీయ వేదికపై కూడా కొన‌సాగిస్తున్నాడు. 

    ఈ పంజాబ్ బ్యాట‌ర్ అతి త‌క్కువ కాలంలోనే టీ20ల్లో వరల్డ్ నంబర్ బ్యాటర్‌గా ఎదిగాడు. యువ‌రాజ్ సింగ్ వంటి లెజెండ్ కోచింగ్‌లో రాటుదేలిన అభిషేక్ టీ20ల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొదటి బంతి నుంచే భారీ షాట్ల ఆడే సత్తా అతడిది. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వణికిస్తున్నాడు.

    పరుగుల సునామీ..
    అభిషేక్ శర్మ గతేడాది జిం‍బాబ్వేతో సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన అరంగేట్ర సిరీస్‌లోనే 183.33 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 2024 ఏడాదిలో 11 ఇన్నింగ్స్‌లలో  23.27 సగటుతో 256 పరుగులు చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 171.81 ఉంది. మెరుగ్గా రాణించకపోయినప్పటికి తనకు పవర్ హిట్టింగ్ స్కిల్స్ కారణంగా టీమ్ మెనెజ్‌మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. 

    దీంతో మెనెజ్‌మెంట్ నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకున్నాడు. 2025 ఏడాదిలో పరుగులు సునామీ సృష్టించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ దాదాపుగా తన బ్యాట్‌కు పనిచెబుతున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా  కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 790 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్ధానంలో తిలక్ వర్మ(468) ఉన్నాడు.

    కోహ్లి రికార్డుపై కన్ను..
    ఈ డేంజరస్ బ్యాటర్ ఇప్పుడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టీ20 క్రికెట్‌(అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ)లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచేందుకు అభిషేక్ చేరువయ్యాడు.

    ఆదివారం సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టీ20లో 81 పరుగులు చేస్తే ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంటాడు. అభిషేక్ ఇప్పటివరకు ఈ ఏడాది టీ20ల్లో 41.43 సగటుతో 1514 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. 2016లో​ కోహ్లి ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్‌తో కలిపి టీ20ల్లో 1614 పరుగులు చేశాడు. 

    ఇప్పుడు ఈ సౌతాఫ్రికా సిరీస్ ముగిసేలోపు కోహ్లి ఆల్‌టైమ్ రి​​కార్డు శర్మ బద్దలు కొట్టడం ఖాయం. అభిషేక్ ఐపీఎల్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ-2025లోనూ దుమ్ములేపాడు. అయితే అభిషేక్‌ సఫారీలతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంకా తన విశ్వరూపాన్ని ప్రదర్శించలేదు. అదేవిధంగా ఒకే క్యాలెండర్ ఈయర్‌లో వంద టీ20 సిక్స్‌లు పూర్తి చేసుకున్న ఏకైక భారత ఆటగాడిగా కూడా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.

    విరాట్‌ కోహ్లి తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 125 మ్యాచ్‌లు ఆడి 4188 పరుగులు చేయగా.. అభిషేక్‌  ఇప్పటివరకు 31 మ్యాచ్‌లలో 1046 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా  కోహ్లి టీ20 కెరీర్‌లో 13543 పరుగులు ఉండగా .. అభిషేక్‌ 4849 రన్స్‌ చేశాడు.
    చదవండి: IPL 2026: కేకేఆర్‌ కీలక నిర్ణయం..! కెప్టెన్‌గా అతడే?

     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్ వేలానికి ముందు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాబోయో సీజ‌న్‌లో కూడా త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా వెట‌ర‌న్ ప్లేయ‌ర్ అజింక్య ర‌హానేను కొన‌సాగించాల‌ని కేకేఆర్ యాజ‌మాన్యం నిర్ణయించుకున్న‌ట్లు స‌మాచారం.

    డిసెంబ‌ర్ 16న దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మినీ వేలానికి కూడా అత‌డు హాజ‌రు కానున్న‌ట్లు ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గ‌త సీజ‌న్‌లో ర‌హానే కెప్టెన్సీలో కేకేఆర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన నైట్‌రైడ‌ర్స్ ఏ మాత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. 

    పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్దానంలో నిలిచింది. అజింక్య త‌న కెప్టెన్సీ మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. దీంతో ఐపీఎల్‌-2026లో రహానేను కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ కేకేఆర్ యాజ‌మాన్యం మాత్రం ర‌హానేకు మ‌రో అవ‌కాశ‌మిచ్చేందుకు సిద్ద‌మైంది. ఇదే విష‌యంపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించాడు.

    ఈ సీజ‌న్‌లో అజింక్య ర‌హానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. అదేవిధంగా మ‌రోసారి అత‌డు కేకేఆర్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే కెప్టెన్సీ స‌త్తా ఉన్న ఆట‌గాడు ఎవ‌రూ వేలంలో లేరు. యువ ఆట‌గాడు ర‌ఘువంశీ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించనున్నాడు. అత‌డిని వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా ఉప‌యోగించుకోవాల‌ని కేకేఆర్ భావిస్తుంద‌ని బంగర్ ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

    గ్రీన్‌పై క‌న్ను..
    కాగా కేకేఆర్ రూ. 64.30 కోట్లు పర్స్‌తో వేలంలోకి వెళ్లనుంది. ఇది అన్ని జట్ల కంటే అత్య‌ధిక మ‌నీ కేకేఆర్ వ‌ద్దే ఉంది. నైట్‌రైడ‌ర్స్ మొత్తంగా 13 స్ధానాలను భ‌ర్తీ చేయ‌నుంది. అందులో విదేశీ ఆట‌గాళ్ల స్ధానాలు ఆరు ఉన్నాయి. ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్‌ను ద‌క్కించుకునేందుకు కేకేఆర్ ప్ర‌య‌త్నించే అవ‌కాశ‌ముంది.

    ఈ వేలానికి ముందు కేకేఆర్ రహానే పాటు రింకూ సింగ్, సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్, వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, అంకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, వైభవ్ అరోరాతో సహా మొత్తం 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

    వదేలిసిన ఆటగాళ్లు వీరే..
    ఆండ్రీ రస్సెల్ (₹12 కోట్లు)
    వెంకటేష్ అయ్యర్ (₹23.75 కోట్లు)
    క్వింటన్ డి కాక్
    రహమనుల్లా గుర్బాజ్
    అన్రిచ్ నోర్ట్జే
    మొయిన్ అలీ
    చదవండి: IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్‌క్యాప్డ్‌ బౌలర్ల మీదే!

     

  • పుణే వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆంధ్ర ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. పంజాబ్‌ బ్యాటర్లలో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌(47) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సైల్‌ ఆరోరా(42), రమణ్‌దీప్‌ సింగ్‌(43), హర్నార్‌ సింగ్‌(42) రాణించారు. 

    ఆంధ్ర బౌలర్లలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సత్యనారాయణ రాజు, సౌరభ్‌ కుమార్‌, పృథ్వీరాజ్‌ తలా వికెట్‌ సాధించారు. మధ్యప్రదేశ్‌పై హ్యాట్రిక్‌తో సత్తాచాటిన నితీశ్‌ రెడ్డి.. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌కే పరిమితమయ్యాడు.

    హేమంత్‌ రెడ్డి సూపర్‌ సెంచరీ..
    206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. నితీశ్‌ కుమార్‌ బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. రెండు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అతడితో పాటు శ్రీకర్‌ భరత్‌(1), అశ్విన్‌ హెబ్బర్‌(4), రికీ భుయ్‌(15) నిరాశపరిచారు. 

    కానీ మర్మరెడ్డి హేమంత్‌ రెడ్డి సూపర్‌ సెంచరీతో సత్తాచాటాడు. 53 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. హేమంత్‌తో పాటు ఎస్డీఎన్వీ ప్రసాద్‌(35 బంతుల్లో 53 నాటౌట్‌) మెరుపు హాఫ్‌ సెంచరీతో సత్తాచాటాడు. ఆంధ్ర తమ తదుపరి సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లో డిసెంబర్‌ 16న జార్ఖండ్‌తో తలపడనుంది. 
    చదవండి: శతక్కొట్టిన జైస్వాల్‌.. సర్ఫరాజ్‌ ధనాధన్‌.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై
     

  • అండ‌ర్‌-19 ఆసియాక‌ప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త యువ బ్యాట‌ర్లు త‌డ‌బడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ అండ‌ర్‌-19 జ‌ట్టు 46.1 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌటైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది.

    సూపర్‌ ఫామ్‌లో ఉన్న స్టార్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్‌ ఆయూష్‌ మాత్రే, హైదరాబాద్‌ కుర్రాడు ఆరోన్‌ జార్జ్‌ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం మాత్రే ఔటయ్యాక విహాన్ మల్హోత్రా(12), వేదాంత్‌(7) వికెట్లను కోల్పోయింది. 

    అనంతరం జార్జ్‌, వికెట్‌ కీపర్‌ అభిజ్ఞాన్ కుండు(22) కాసేపు పాక్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కనిష్క్ చౌహాన్ కాస్త దూకుడుగా ఆడాడు. అయితే జార్జ్‌, చౌహన్‌ ఔటయ్యాక భారత టెయిలాండర్లు ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు.

    దీంతో మరో 17 బంతులు మిగిలూండగానే టీమిండియా ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌(85) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్‌, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. నిఖాబ్ షఫీక్ రెండు వికెట్లు సాధించారు.
    చదవండి: శతక్కొట్టిన జైస్వాల్‌.. సర్ఫరాజ్‌ ధనాధన్‌.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై

  • సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లో ముంబై అదరగొట్టింది. హర్యానా విధించిన 235 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. దేశీ టీ20 టోర్నమెంట్‌ సూపర్‌ లీగ్‌లోని గ్రూప్‌-బిలో భాగంగా పుణెలోని డీవై పాటిల్‌ అకాడమీలో ముంబై- హర్యానా జట్లు ఆదివారం తలపడ్డాయి. 

    234 పరుగులు
    టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. హర్యానా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 234 పరుగులు స్కోరు చేసింది.

    ఓపెనర్లలో కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ (42 బంతుల్లో 89) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నిశాంత్‌ సంధు (38 బంతుల్లో 63 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టాడు. మిగిలిన వారిలో సమంత్‌ జేఖర్‌ (14 బంతుల్లో 31 రిటైర్డ్‌ అవుట్‌), సుమిత్‌ కుమార్‌ (4 బంతుల్లో 16 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు.

    శతక్కొట్టిన జైస్వాల్‌.. సర్ఫరాజ్‌ ధనాధన్‌
    ఇక హర్యానాకు ధీటుగా బదులిచ్చే క్రమంలో ముంబై ఓపెనర్‌, టీమిండియా స్టార్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) శతక్కొట్టాడు. కేవలం యాభై బంతుల్లోనే ఏకంగా 16 ఫోర్లు, ఒక సిక్స్‌బాది 101 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ అజింక్య రహానే (10 బంతులల్లో 21) ఫర్వాలేదనిపించగా.. మూడో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfraz Khan) అదరగొట్టాడు.

    కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన సర్ఫరాజ్‌.. మొత్తంగా 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -2026 వేలానికి ముందు ఈ మేరకు సత్తా చాటి.. తానూ రేసులోనే ఉన్నానంటూ ఫ్రాంఛైజీలకు మరోసారి సందేశం ఇచ్చాడు.

    17.3 ఓవర్లలోనే 
    ఇక మిగిలిన ముంబై ఆటగాళ్లలో అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (7), సూయాంశ్‌ షెడ్గే (13), కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (2) విఫలం కాగా.. సాయిరాజ్‌ పాటిల్‌ (3 బంతుల్లో 8), అథర్వ అంకోలేకర్‌ (2 బంతుల్లో 10) మెరుపులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 

    జైసూ, సర్ఫరాజ్‌ దంచికొట్టగా.. వీరిద్దరు ఆఖర్లో వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే హర్యానా విధించిన లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

    చదవండి: IND Vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. వైభవ్‌ సూర్యవంశీ అట్టర్‌ఫ్లాప్‌

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2025 వేలంలో దేశీ ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్‌, పృథ్వీ షా, రవి బిష్ణోయి, సర్ఫరాజ్‌ ఖాన్‌ తదితరులు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. పాటు విదేశీ ప్లేయర్లు కామెరాన్‌ గ్రీన్‌, క్వింటన్‌ డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌ వంటి వారు హైలైట్‌ కానున్నారు. స్టార్లను మినహాయించితే ఈ ఐదుగురు భారత అన్‌క్యాప్డ్‌ బౌలర్లు కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది.

    ఆకిబ్‌ నబీ
    జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీ. అనుభవం, నైపుణ్యాలు కలిగిన ఈ ఫాస్ట్‌బౌలర్‌ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం.  తాజా దేశీ సీజన్లలో అతడు అద్భుత ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణం. 2025-26 రంజీ సీజన్లో అదరగొట్టిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ దుమ్ములేపాడు.

    ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు 15 వికెట్లు కూల్చిన ఆకిబ్‌.. అ‍త్యధిక వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. వేలానికి ముందు అతడి ఈ అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాంఛైజీలను ఊరిస్తోంది.

    ఈడెన్‌ ఆపిల్‌ టామ్‌
    కేరళకు చెందిన తాజా బౌలింగ్‌ సంచలనం ఈడెన్‌ ఆపిల్‌ టామ్‌. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు 20 ఏళ్ల ఈ రైటార్మ్‌ పేసర్‌. తాజా రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌పై (4/55 & 2/33) ఉత్తమ గణాంఖాలు నమోదు చేశాడు.

    ఇక మొత్తంగా ఏడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు కూల్చాడు ఆపిల్‌. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడికి అనుభవం లేదు. అయినప్పటికీ అతడి నైపుణ్యాల కారణంగా కనీస ధర రూ. 20లక్షలకైనా అమ్ముడుపోయే అవకాశం ఉంది.

    రాజ్‌ లింబాని
    అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ చేరిన భారత జట్టులో రాజ్‌ లింబాని సభ్యుడు. 2024లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం పేసర్‌.. ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు కూల్చాడు. కొత్త బంతితో అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో అతడు అదరగొట్టాడు. డెత్‌ ఓవర్లలోనూ తనదైన శైలిలో రాణించాడు.

    ఆకాశ్‌ మధ్వాల్‌
    2023లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు ఆకాశ్‌ మధ్వాల్‌. ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున సత్తా చాటాడు. ఆ తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌కు మారి అక్కడా తనను తాను నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు.

    సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2025-26లో ఈ యార్కర్ల కింగ్‌ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. ఉత్తరాఖండ్‌ తరపున ఆరు మ్యాచ్‌లలో మూడు వికెట్లే తీశాడు. అయితే, అతడి అనుభవం దృష్ట్యా ఈసారి మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.

    అశోక్‌ శర్మ
    సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2025-26లో రాజస్తాన్‌ తరఫున సత్తా చాటుతున్నాడు అశోక్‌ శర్మ. ఇ‍ప్పటికి ఏడు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 19 వికెట్లు కూల్చి.. లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లకు నెట్‌బౌలర్‌గా పనిచేసిన అశోక్‌ శర్మ ఈసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు.

Telangana

  • హైదరాబాద్‌: మ‌న దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ధుమేహ బాధితులు ఎక్కువ‌గా ఉన్నార‌ని, వీరికి కాళ్ల‌లో పుళ్లు ప‌డినా నొప్పి తెలియ‌క‌పోవ‌డంతో అవి తీవ్ర‌మై.. చివ‌ర‌కు కాళ్లు తొల‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతోంద‌ని వైద్య నిపుణులు తెలిపారు. ప్ర‌తి న‌లుగురు మ‌ధుమేహ బాధితుల్లో ఒక‌రికి ఈ త‌ర‌హా స‌మ‌స్య వ‌స్తోంద‌న్నారు. ముందుగా గుర్తించ‌గ‌లిగితే వాస్క్యుల‌ర్ చికిత్స‌ల‌తో కాళ్ల‌ను కాపాడుకునే అవ‌కాశం ఉంటుంద‌ని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ వాస్క్యుల‌ర్, ఎండోవాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వెంక‌టేష్ బొల్లినేని తెలిపారు.

    అన్ని విభాగాల‌కు చెందిన వైద్యుల స‌మ‌న్వ‌యంతో మ‌ధుమేహ బాధితుల కాళ్ల‌ను తొల‌గించాల్సిన అవ‌స‌రం లేకుండా కాపాడుకోవ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు. ఈ అంశంపై ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ఆదివారం నిర్వ‌హించిన కంటిన్యువ‌స్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (సీఎంఈ) స‌ద‌స్సులో ఆయ‌న ప్ర‌ధాన వ‌క్త‌గా మాట్లాడారు. హైద‌రాబాద్, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు చెందిన సుమారు 200 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో ప్ర‌ధానంగా వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్లు, ప్లాస్టిక్ స‌ర్జ‌న్లు, పోడియాట్రిస్టులు (పాదాల నిపుణులు), జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్లు, ఎండోక్రినాల‌జిస్టులు, ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ నిపుణులు, ఇన్ఫెక్షువ‌స్ డిసీజ్ స్పెష‌లిస్టులు ఉన్నారు.

    ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ వెంక‌టేష్ బొల్లినేని మరియు బృందం మాట్లాడుతూ, “చికిత్సా ప‌ద్ధ‌తిని ప్రామాణీక‌రించ‌డం ద్వారా మ‌ధుమేహ బాధితులలో కాళ్ల తొల‌గింపును నివారించ‌డం, త‌గ్గించ‌డ‌మే ఈ స‌ద‌స్సు ప్ర‌ధాన ల‌క్ష్యం. ఇందుకోసం ముప్పును ముందుగా గుర్తించ‌డం, వాస్క్యుల‌ర్ చికిత్స‌లు చేయ‌డం, ఇన్ఫెక్ష‌న్ల‌ను నియంత్రించ‌డం, గాయాలు, మృదు క‌ణ‌జాలాల‌కు చికిత్స‌లు అందించ‌డం, దీర్ఘ‌కాలం పాటు పాదాల సంర‌క్ష‌ణ ఎలా చేసుకోవాలో మ‌ధుమేహ బాధితుల‌కు చెప్ప‌డం లాంటివి చాలా ముఖ్యం.

    దేశంలో ఇత‌ర ప్రాంతాల కంటే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో మ‌ధుమేహం చాలా ఎక్కువ‌మందికి ఉంటోంది. దానివ‌ల్ల కాళ్ల తొల‌గింపు ముప్పు కూడా ఇక్క‌డే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. మ‌ధుమేహం ఉన్న ప్ర‌తి న‌లుగురిలో త‌మ జీవితకాలంలో ఎప్పుడో ఒక‌సారి ఒక‌రికి కాళ్ల‌లో పుళ్లు ఏర్ప‌డ‌తాయి. అయితే, వారికి స్ప‌ర్శ అంత‌గా తెలియ‌క‌పోవ‌డంతో ఆ విష‌యాన్ని గుర్తించ‌రు. దీనివ‌ల్ల పుళ్లు ఉన్న ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రికి కాళ్లు తొలగించాల్సి వ‌స్తోంది. అందువ‌ల్ల కేవ‌లం మ‌ధుమేహ నియంత్ర‌ణ‌కే వైద్యులు ప‌రిమితం కాకుండా.. స‌మ‌గ్ర చికిత్స‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

    అత్యాధునిక ఊండ్ కేర్ విధానాలు పాటించాలి. అలాగే ఇన్ఫెఫెక్ష‌న్ల‌ను నియంత్రించాలి. మ‌ధుమేహ బాధితుల కాళ్ల‌ను కాపాడ‌డంతో వాస్కులర్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌ విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సి ఉంటుంది. గ‌తం కంటే ఇప్పుడు ఎండోవాస్క్యుల‌ర్ విధానాలు, ఆధునిక రీక‌న్‌స్ట్ర‌క్టివ్ టెక్నిక్‌లు, డెర్మ‌ల్ స‌బ్‌స్టిట్యూట్లు రావ‌డంతో చికిత్స ఫలితాలు మెరుగుపడుతున్నాయి. చాలా కేసుల్లో చివరి దశకు చేరుకున్న తర్వాతే రోగులు వైద్యులను సంప్రదించడం పెద్ద సవాలుగా మారుతోంది” అని తెలిపారు.

    ప్లాస్టిక్ సర్జన్ డా. శరత్ చంద్రరెడ్డి మరియు ఆయన బృందం మాట్లాడుతూ మ‌ధుమేహం ఉన్నవారు కాళ్ల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, చిన్న గాయం కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ప‌లువురు ఇత‌ర వైద్య నిపుణులు సూచించారు. ముందస్తు స్క్రీనింగ్‌, సరైన అవగాహనతో చాలావ‌ర‌కు కాళ్ల తొల‌గింపుల‌ను నివారించవచ్చని వారు స్పష్టం చేశారు. ఇలాంటి సీఎంఈ కార్యక్రమాల ద్వారా వైద్యుల్లో అవగాహనను పెంచుతూ, రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి కిమ్స్ ఆస్ప‌త్రి కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.

Business

  • ఏఐ రోబోటిక్స్‌ అంకుర సంస్థ పర్సెప్టైన్‌ వచ్చే ఏడాది మరింతగా నిధులను సమీకరించడంపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే దేశీ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ. 30 కోట్లు సేకరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు జగ్గరాజు నడింపల్లి తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా చెప్పారు. ఇంటెల్‌ సీఈవో తదితరులు తమ సంస్థలో ఇన్వెస్ట్‌ చేసినట్లు చెప్పారు. గణనీయంగా పెరుగుతున్న క్లయింట్లకు తగ్గట్లుగా ఉత్పత్తులను అందించే సామర్థ్యాలను పెంచుకునేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఆమ్ని, యునో, డ్యుయో అనే మూడు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వివరించారు. ఆటోమోటివ్, ఎల్రక్టానిక్స్‌ తదితర విభాగాల్లో తమకు క్లయింట్లు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏటా తొమ్మిది వేల పైచిలుకు రోబోలు దిగుమతవుతున్నాయని చెప్పారు.

    అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దేశీయ పరిజ్ఞానంతో ఇంటెలిజెంట్‌ హ్యూమనాయిడ్‌ రోబోల తయారీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పైలట్‌ దశలో వందల స్థాయిలో ఉన్న ఉత్పత్తిని త్వరలో వార్షికంగా వెయ్యి రోబోల స్థాయికి పెంచుకోనున్నట్లు నడింపల్లి వివరించారు. ప్రస్తుతం సంస్థలో నలభై మంది వరకు సిబ్బంది ఉన్నారని చెప్పారు. రోబోటిక్స్, మెకానికల్‌ ఇంజినీరింగ్, టెక్నీíÙయన్స్‌ మొదలైన విభాగాలవ్యాప్తంగా మరింత మందిని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

  • గోస్ట్ వేర్‌హౌస్‌లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్‌ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    అన్ని పనుల్లో రోబోలే!
    పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.

    అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.

    మనుషులు చేయాల్సింది!
    ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.

    ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..

    పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి.

  • భారతదేశంలో.. చాలా ప్రభుత్వ & ప్రైవేట్ సంస్థలు వారానికి 5 రోజుల పని షెడ్యూల్‌ను పాటిస్తున్నాయి. కానీ ఇప్పుడు చాలామంది కార్మికులు వారానికి నాలుగు రోజులు పని చేసి మూడు రోజులు సెలవు తీసుకోవాలని కోరుకుంటారు. జపాన్, స్పెయిన్ & జర్మనీ వంటి దేశాలు వారానికి 4 రోజుల పని విధానాన్ని పాటిస్తున్నాయి. ఇది ఇండియాలో సాధ్యమవుతుందా? అని చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంపైనే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.

    మంత్రిత్వ శాఖ.. వారానికి నాలుగురోజుల పనికి సమ్మతించినట్లు పోస్టులో వెల్లడించింది. అయితే కొన్ని షరతులను కూడా వెల్లడించింది. సవరించిన కార్మిక నియమావళి ప్రకారం.. నాలుగు రోజులు, రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులుగా పొందవచ్చని స్పష్టం చేసింది.

    మంత్రిత్వ శాఖ ప్రకారం వారానికి 48 గంటలు (4 రోజులు, రోజుకు 12 గంటలు) పనిచేయాలన్న మాట. ఉద్యోగులు దీనికి సిద్ధంగా ఉంటే.. ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉండవు. ఈ సమయంలో రోజుకు 12 గంటలు పనిచేస్తే.. ఓవర్ టైం కింద జీతం పెరుగుతుందా? అనే ప్రశ్న తలెత్తింది. వారంలో 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. ఓవర్ టైంకి అదనపు చెల్లింపులు ఉంటాయి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    నాలుగు లేబర్ కోడ్‌లు
    భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు.. వచ్చినట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు. అవి ''వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)''.

    వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.

    పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.

    సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్‌ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టిస్తుంది.

    OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.

    ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు

  • రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియోను ''హ్యాపీ న్యూ ఇయర్ 2026'' ప్లాన్‌లను ఆవిష్కరించింది. ఇందులో నెల రోజుల ప్లాన్, ఏడాది ప్లాన్ రెండూ ఉన్నాయి. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    హీరో యాన్యువల్ రీఛార్జ్
    ఏడాది పాటు రీఛార్జ్ కావాలనుకునే వారి కోసం రిలయన్స్ జియో ఈ ప్లాన్ పరిచయం చేసింది. రూ. 3599లతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

    సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్
    సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ పేరుతో 500 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా జియో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటు ఉన్నప్పటికీ.. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా ఓటీటీ ప్రయోజనాలు (యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్‌, సోని లివ్, జీ5 మొదలైనవి) లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా పొందవచ్చు.

    ఫ్లెక్సీ ప్యాక్
    ఫ్లెక్సీ ప్యాక్ పేరుతో.. 103 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఇందులో కేవలం డేటా మాత్రం లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు.. హిందీ, ఇంటర్నేషనల్, ప్రాంతీయ ప్యాక్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

    ఇదీ చదవండి: ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్

  • రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 365 రోజుల ప్లాన్ పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

    బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన రూ. 2399 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్ఎ‌స్‌లు, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. నాన్ స్టాప్ కనెక్షన్ అని పోస్ట్ చేసింది.

    సంవత్సరం ప్లాన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంటే తక్కువే. దీన్నిబట్టి చూస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లన్స్ పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది.

  • ఇంటి దగ్గర ఉన్న సాధారణ నీటి పైపులు రాత్రి వీధి దీపాలను వెలిగించగలవంటే నమ్ముతారా? నిజమే. ఎలాంటి సౌర ఫలకాలూ లేకుండా, పెద్ద యంత్రాలను అమర్చే అవసరం లేకుండా కేవలం నీరు పారుతూనే విద్యుత్‌ తయారవుతోంది. ఇదే ఇజ్రాయెల్‌ ఇంజినీర్లు ఆవిష్కరించిన ‘స్మార్ట్‌ వాటర్‌ పైప్స్‌’ మ్యాజిక్‌!  

    పైపుల లోపల చిన్న చక్రాలు లాంటివి అమర్చితే, నీరు ఒత్తిడితో ప్రవహించినప్పుడు అవి మెల్లగా తిరుగుతాయి. ఆ తిప్పుడే నీటి ప్రవాహాన్ని నేరుగా విద్యుచ్ఛశక్తిగా మారుస్తుంది. నీరు మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా తన దారినే ప్రవహిస్తుంది. నగరాలు ఇప్పుడు ఈ స్మార్ట్‌ ఎనర్జీ పైపులను పరీక్షిస్తున్నాయి.

    వీధి దీపాలు వెలిగించడం నుంచి నగరంలోని సెన్సర్లు పనిచేయించడం వరకూ ఇవే సరిపోతున్నాయని తేలింది. అంతేకాదు, పైపుల్లో ఎక్కడ లీక్‌ ఉందో, నీటి నాణ్యత ఎలా ఉందో కూడా వెంటనే తెలియజేస్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న చిన్న వ్యవస్థలే భవిష్యత్తును ఎలా మార్చగలవో ఈ పైపులు చూపుతున్నాయి.

  • కొత్త కారు కొనుగోలు చేయాలని అందరికి ఉంటుంది. అయితే ఇది కొందరికి సాధ్యమవుతుంది. మరికొందరికి కొంత కష్టమే. ఒకవేళా ఎవరైనా కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే.. తప్పకుండా కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఆ విషయాలు, వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

    బడ్జెట్
    కారు కొనడానికి ముందు.. ఆలోచించాల్సిందే బడ్జెట్. ఎంత డబ్బు వెచ్చించి కారు కొనాలి. తక్కువ బడ్జెట్లో కావాలా?, ఎక్కువ బడ్జెట్ పెట్టాలా? అనే విషయంపై స్పష్టత ఉండాలి. ఇక్కడ కారు ధర మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత ఉంటాయనే విషయాన్ని కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.

    అవసరాలు
    కారును ఏ అవసరం కోసం కొంటున్నారనే విషయంపై స్పష్టత ఉండాలి. నగరంలో ప్రయాణించడానికా?, లేక లాంగ్ డ్రైవ్ చేయడానికా? అనే విషయంతో పాటు.. ఫ్యామిలీ కోసమా?, వ్యక్తిగత వినియోగం కోసమా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. పెట్రోల్ / డీజిల్ / ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ ఏది కావాలో ముందుగానే ఆలోచించండి.

    సేఫ్టీ ఫీచర్స్
    కారు బడ్జెట్, అవసరాలు వంటి విషయాలతో పాటు.. ఆ కారులో ఉన్న ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్స్ ఏమిటనేది తెలుసుకోవాలి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్లు / కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, సేఫ్టీ రేటింగ్ వంటివన్నీ మీరు కొనే కారులో ఉండేలా చూసుకోవాలి.

    మైలేజ్ & పర్ఫామెన్స్
    దాదాపు అందరూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆలోచిస్తారు. కాబట్టి మంచి మైలేజ్ ఇచ్చే కారు ఏది? దాని పర్ఫామెన్స్ ఎలా ఉందనే విషయాలను ముందుగానే గమనించాలి. ఈ విషయాలను తెలుసుకోవడానికి రియల్-వరల్డ్ మైలేజ్ రివ్యూలు చూడటం మంచిది. ఇంజిన్ పవర్, డ్రైవింగ్ స్మూత్‌నెస్ కూడా పరిశీలించాలి.

    మెయింటెనెన్స్ & సర్వీస్
    కారు కొనేస్తారు. కానీ దానిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తుండాలి. కాబట్టి మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయా?, లేదా? గమనించాలి. అవసరమైన పార్ట్స్ లభిస్తాయి. సర్వీస్ ఖర్చులు ఎలా ఉంటాయనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి.

    పైన చెప్పినవి మాత్రమే కాకుండా.. వారంటీ (స్టాండర్డ్ + ఎక్స్‌టెండెడ్ వారంటీ) & ఆఫర్లు (ఫెస్టివ్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్), టెస్ట్ డ్రైవ్, రీసేల్ వాల్యూ, ఇన్సూరెన్స్, డెలివరీకి ముందు తనిఖీ వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్, అవసరమైన అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది.

  • ఇదివరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి విని ఉంటారు, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల గురించి తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచంలోనే అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు ఎవరు?, వాళ్ల నెట్‍వర్త్ ఎంత అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.

    వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)
    రష్యన్ అధ్యక్షుడు పుతిన్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడు. ఈయనకు ప్రధానంగా ఇంధన & సహజ వనరుల కంపెనీలలో ఎక్కువ వాటా వస్తుందని సమాచారం. దీంతో ఆయనను అత్యంత సంపన్నుడిగా గుర్తించారు. అయితే ఈయన నెట్‍వర్త్ ఎంత అనే విషయం అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. 200 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. సుదీర్ఘ రాజకీయ జీవితం ఈ అపారమైన సంపదకు కారణమైందని పలువురు చెబుతున్నారు.

    అలెగ్జాండర్ లుకాషెంకో (Alexander Lukashenko)
    పలు నివేదికల ప్రకారం.. సుమారు 9 బిలియన్ డాలర్ల సంపద కలిగిన అలెగ్జాండర్ లుకాషెంకో ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయం నాయకుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1994 నుంచి బెలారస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయనకు.. విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ , వ్యవసాయ, మాన్యుఫ్యాక్టరింగ్ సంస్థలలో వాటాలు ఉన్నాయని సమాచారం.

    డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద.. ప్రధానంగా రియల్ ఎస్టేట్, బ్రాండింగ్, హోటల్స్ & గోల్ఫ్ రిసార్ట్‌ల నుండి వస్తుంది. ఈయన నెట్‍వర్త్ సుమారు 7.2 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈయన రాజకీయ పదవిలో ఉన్న సమయం కంటే.. పెట్టుబడులు & మీడియా వెంచర్లలోనే సమయం గడిపారు. దీంతో ఆయన నెట్‍వర్త్ గణనీయంగా పెరుగుతూ ఉంది.

    కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)
    ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నెట్‍వర్త్ దాదాపు 5 బిలియన్ డాలర్లు అని అంచనా. కానీ ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు ఈయన సంపద 40 బిలియన్ డాలర్లని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం, సైన్యం, వ్యాపారాలన్నీ కిమ్ కుటుంబం నియంత్రణలోనే ఉంటాయి. అంతే కాకుండా.. బంగారం, బొగ్గు, ఆయుధాలు, సిగరెట్లు, మద్యం ఎగుమతులు ద్వారా కూడా వీరికి ఆదాయం వస్తుంది.

    జీ జిన్‌పింగ్ (Xi Jinping)
    బ్లూమ్‌బెర్గ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంపద 1.5 బిలియన్ డాలర్లు. ఇందులో ఆయన కుటుంబ సంబంధిత ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. జిన్‌పింగ్ జీతం ఏడాదికి కేవలం 22,000 డాలర్లు మాత్రమే. ఇది కాకుండా ఈయనకు భూ ఖనిజాలు, టెక్ సంస్థలు, బంధువులతో ముడిపడి ఉన్న రియల్ ఎస్టేట్‌లో అనేక పెట్టుబడులు ఉన్నాయి.

    ఇదీ చదవండి: డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..

  • కొంత కాలంగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ రీసేల్‌ మార్కెట్‌ అంటూ ప్రత్యేకమైన ఒరవడిని సృష్టిస్తోంది. కొత్త కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులతో పాటు రీసేల్‌ మార్కెట్‌ అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగంగా మారింది. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయని భావించి ఈ రంగంలోకి అనేక మంది ప్రవేశిస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోలు, విక్రయాల్లో వినియోగదారులు, ఇన్వెస్టర్లు, బ్రోకర్లకు సమానంగా లాభాలు అందించడంలో ఈ రీసేల్‌ సెగ్మెంట్‌ కీలకపాత్ర పోషిస్తోంది. అదే సమయంలో నగర జీవనశైలిపై కూడా స్పష్టమైన ప్రభావం చూపుతోంది.  – సాక్షి, సిటీబ్యూరో

    హైదరాబాద్‌లో ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగావకాశాలు పెరిగే కొద్దీ, వలసలు పెరుగుతున్నాయి. దీంతో స్థిరమైన నివాసాల కోసం డిమాండ్‌ వేగంగా పెరిగింది. చాలా మంది రెడీ టు మూవ్‌ ఇళ్లు, వెంటనే ఉపయోగించుకునే ఫ్లాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త కన్‌స్ట్రక్షన్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడటం కంటే రీసెల్‌ ప్రాపర్టీ తీసుకోవడం సౌకర్యంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.

    సులభంగా బ్యాంక్‌ లోన్లు.. 
    రీసేల్‌లో ప్రధానంగా పెట్టుబడి తక్కువ. కొత్త వెంచర్లు వంటి భారీ ఖర్చులు, మార్కెటింగ్‌ వ్యయాలు, ప్రీలాంచ్‌ ప్రకటనలు, ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ వంటి ఖర్చులు ఉండవు. ఇప్పటికే ఉన్న ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం వల్ల రిస్క్‌ కూడా తక్కువ. రీసేల్‌ ప్రాపర్టీలకు సాధారణంగా రెడీ డాక్యుమెంటేషన్‌ ఉండటం, బ్యాంక్‌ లోన్లు సులభంగా లభించడం, వాస్తు/ప్రాంతీయ వివరాలు ఇప్పటికే తెలిసి ఉండటం కొనుగోలుదారులకు అదనపు నమ్మకాన్ని ఇస్తుంది.

    ఇదే కారణంగా ఈ రంగంలో ఇన్వెస్టర్లు కూడా వేగంగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ రంగంలో ఏజెంట్లకు భారీ కమీషన్లు ఇచ్చే వ్యవస్థ తగ్గిపోతోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌లు, రియల్‌ ఎస్టేట్‌ లిస్టింగ్‌ యాప్‌లు, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌తో ప్రాపర్టీ యజమానులు నేరుగా కస్టమర్లతో మాట్లాడే అవకాశం పెరిగింది. ప్రధానంగా మధ్యవర్తి ఖర్చులు తగ్గి, విక్రేతలకు ఎక్కువ లాభం, కొనుగోలుదారులకు తక్కువ ధరకు లభిస్తోంది. ఈ మార్పు రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలను మరింత పారదర్శకంగా చేస్తోంది.

    రెడీ ఇళ్లకు అధిక డిమాండ్‌ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు.. శంషాబాద్, షాద్‌నగర్, ఫ్యూచర్‌ సిటీ ప్రాంతాల్లోని ప్లాట్లు, వెంచర్లు.. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, మణికొండ, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రీసెల్‌ మార్కెట్‌ చురుగ్గా మారింది. ఐటీ ఉద్యోగస్తులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాల్లో రెడీ ఇళ్లకు డిమాండ్‌ నిరంతరం ఉంటుంది. ఇక అపార్ట్‌మెంట్లతో పాటు విల్లాలు, సొంత గృహాలు, జీ ప్లస్‌–1, జీ ప్లస్‌–2 హౌసింగ్‌ యూనిట్లు కూడా పెద్ద సంఖ్యలో రీసేల్‌ అవుతున్నాయి.

    లైఫ్‌స్టైల్‌ కోణం నుంచి చూస్తే రీసేల్‌ మార్కెట్‌ నగర జీవనశైలిలో కొత్త అనుభవాన్ని తెచ్చింది. ఉద్యోగ మార్పులు, నగరాల మధ్య తరలింపు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ విస్తరణ.. వంటివి వేగంగా జరిగే ఈతరం వెంటనే మకాం మార్చుకునేందుకు వీలైన ఇళ్లు ప్రధాన అవసరంగా మారాయి. ఈ అవసరాన్ని తీర్చడంలో రీసేల్‌ సెగ్మెంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. భద్రత, రవాణా సౌకర్యాలు, స్కూళ్లు, హాస్పిటల్స్, మార్కెట్లు తదితర వాటిని చూసుకునే ఇంటిని నిర్మించుకుంటారు. దీంతో వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

    భవిష్యత్‌లో మరింత బలపడే అవకాశం
    ప్రస్తుత మాంద్యం పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే, రెంటల్‌ ఇన్‌కమ్‌ కోసం ఇళ్లు కొనుగోలు చేసే వారికి రీసేల్‌ ప్రాపరీ్టలు తక్షణ లాభం అందిస్తున్నాయి. నగర వృద్ధి వేగం పెరగడంతో భవిష్యత్తులో ఈ మార్కెట్‌ మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రీసేల్‌ విభాగం సంప్రదాయ కొనుగోలు, అమ్మకాల నమూనాను మార్చి, కొత్త తరానికి అనుగుణంగా జీవన శైలిని ప్రతిబింబించే ట్రెండ్‌గా ఎదుగుతోంది. ఈ వినూత్న మార్పులు, తక్కువ రిస్క్, ఎక్కువ లాభాలు, స్మార్ట్‌ లివింగ్‌ అవసరాల కలయికగా ఈ రంగాన్ని రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యంతో ముందుకు నడిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • నిర్మాణ రంగంలో ముఖ్యంగా గృహ నిర్మాణంలో అనేక కొత్త కొత్త టెక్నిక్‌లు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా ఐఐటీ తిరుచ్చి ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఇలా గతంలో అనేక ఉన్నత విద్యా సంస్థల నుంచి కూడా పలు కొత్త నిర్మాణ నిర్మాణ పద్ధతులు తెరమీదకు వచ్చాయి. అవి ఏవి.. వాటిలో ఏవి విజయవంతమై క్షేత్ర స్థాయిలో వినియోగంలో ఉన్నాయి.. చూద్దాం ఈ కథనంలో..

    నెల రోజుల్లో నిర్మాణం
    ఎన్‌ఐటీ తిరుచ్చి తాజాగా మరో కొత్త నిర్మాణ టెక్నిక్‌ను అభివృద్ధి చేసింది. నిర్మాణ సమయం, సిమెంట్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు భవనం ధృడంగా ఉండేలా రూపొందించిన కొత్త కోల్డ్ ఫార్మడ్ స్టీల్ (CFS)-కాంక్రీట్-బ్రిక్ కాంపోజిట్ హౌసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రోటోటైప్ భవనం 'సెంటినెల్'ను ఆవిష్కరించింది సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ అండ్ ఇంక్యుబేషన్ (సీఈడీఐ) అధ్యాపకుల నేతృత్వంలోని స్టార్టప్.

    కాంక్రీట్ వినియోగాన్ని 40-50% తగ్గించడంతోపాటు భూకంపానికి తట్టుకునే సామర్థ్యం కూడా ఈ నిర్మాణానికి మెరుగ్గా ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. ఈ 400 చదరపు అడుగుల సింగిల్-బీహెచ్‌కే యూనిట్ కోసం మొత్తం సివిల్ పని కేవలం 25 పని దినాల్లో పూర్తయింది. సాధారణంగా  ఇదే పరిమాణంలో సాంప్రదాయ ఆర్‌సీసీ భవనం నిర్మించాలంటే 2-3 నెలలు పడుతుంది.

    గతంలో వచ్చిన టెక్నిక్‌లు
    దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన అనేక నిర్మాణ సాంకేతికతలు క్రమంగా ప్రయోగశాలలు, పైలట్ ప్రాజెక్టుల నుండి వాస్తవ ప్రపంచ వినియోగంలోకి మారుతున్నాయి. ప్రీకాస్ట్ నిర్మాణం, కోల్డ్-ఫార్మ్డ్ స్టీల్ సిస్టమ్స్, జియోపాలిమర్ కాంక్రీట్ ఇప్పటివరకు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నిర్మాణ టెక్నిక్‌లు.

    వీటిలో, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఎస్‌పీఏ ఢిల్లీ వంటి సంస్థలు రూపొందించిన ప్రీకాస్ట్, మాడ్యులర్ నిర్మాణానికి విస్తృత ఆమోదం లభించింది. సైట్లో అసెంబుల్ చేసిన ఫ్యాక్టరీ-మేడ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్లను ఇప్పుడు సాధారణంగా పట్టణ హౌసింగ్, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో ఉపయోగిస్తున్నారు.

    అదే విధంగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన విస్తృత పరిశోధనల ద్వారా అభివృద్ధి చెందిన జియోపాలిమర్ కాంక్రీట్ ప్రయోగాత్మక దశను దాటి ప్రాయోగిక వినియోగానికి చేరుకుంటోంది. ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో తయారయ్యే ఈ పదార్థం ప్రస్తుతం రహదారి పేవ్‌మెంట్లు, ప్రీకాస్ట్ విడిభాగాలు, పారిశ్రామిక నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు.

    అయితే, అన్ని ఆవిష్కరణలు ఇంకా క్షేత్రస్థాయిలోకి ప్రవేశించడం లేదు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌లు ప్రదర్శించిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నిక్‌.. అధిక పరికర వ్యయం, నైపుణ్యం కలిగిన ఆపరేటర్ల అవసరం కారణంగా ఇప్పటికీ పైలట్ హౌసింగ్ ప్రాజెక్టులు, క్యాంపస్ స్థాయి నిర్మాణాలకే పరిమితమై ఉంది.

    అలాగే, వెదురు మిశ్రమాలు, కంప్రెస్డ్ ఎర్త్ బ్లాక్స్ వంటి బయో-ఆధారిత నిర్మాణ పదార్థాలను ఎక్కువగా గ్రామీణ లేదా ప్రాంత-నిర్దిష్ట అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ నిర్మాణ సాంకేతికతలు ప్రధానంగా నిర్మాణ పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కోసం పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఓ ఎంపికగా మాత్రమే అమలు చేస్తున్నారు.

Movies

  • సాధారణంగా డిసెంబరు నెల సినిమా ఇండస్ట్రీలకు సీజనే. కాకపోతే ఓ మాదిరి హిట్స్, కలెక్షన్స్ మాత్రమే వస్తుండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సీన్ పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్‌కి తెగ కలిసొచ్చేస్తోంది. పాన్ ఇండియా మూవీస్ అయితే కొన్ని వారాల పాటు ఆడేసి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇంతకీ డిసెంబరు సంగతేంటి? ఏయే సినిమాలకు ఎలా కలిసొచ్చిందనేది చూద్దాం.

    డిసెంబరు అంటే చలికాలం. క్రిస్మస్ పండగకు సెలవులు ఉంటాయి కాబట్టి చాలావరకు ఈ ఫెస్టివల్ టార్గెట్ చేసుకుని మూవీస్ రిలీజ్ చేస్తుంటారు. కానీ కొవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఇదే నెలలో వివిధ తేదీల్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్నాయి. కొవిడ్ తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. 2021 నుంచి ప్రతి ఏడాది ఏదో ఓ సినిమా ప్రేక్షకుల్ని అలరించి వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతూనే ఉంది.

    2020లో కరోనా రావడం వల్ల పెద్ద సినిమాల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. చాలా చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అలా 2021 డిసెంబరులో తొలుత 'పుష్ప' వచ్చింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజై పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాదాపు నెలరోజుల పాటు సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఈ మూవీ ఒక ఊపు ఊపేసింది. వారం పదిరోజుల తర్వాత వచ్చిన రిలీజైన 'అఖండ' కూడా హిట్ అయింది. 2022లో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం టాలీవుడ్ నుంచి రాలేదు.

    2023 డిసెంబరులోనూ టాలీవుడ్ బాక్సాఫీస్‌కి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే నెల మొదట్లో సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' వచ్చి దుమ్ములేపింది. దర్శకుడు తప్ప మిగిలిన వాళ్లంతా హిందీ యాక్టర్సే అయినప్పటికీ తెలుగులోనూ అద్భుతమైన వసూళ్లు దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. నెల చివరలో వచ్చిన ప్రభాస్ 'సలార్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ.600 కోట్ల మేర వసూళ్లు సొంతం చేసుకుంది.

    గతేడాది జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప' మేనియాని కొనసాగిస్తూ సీక్వెల్‌ని గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి పార్ట్ ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. దీనికి మాత్రం అంతకు మించి అనేలా స్పందన వచ్చింది. తెలుగు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఉత్తరాదిలో వచ్చిన కలెక్షన్స్ చూసి అందరికీ కళ్లు చెదిరిపోయాయి. చెప్పాలంటే మూవీ టీమ్ కూడా ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ వస్తాయని ఊహించి ఉండదు.

    ఈ ఏడాది కూడా డిసెంబరులో బాగానే కలిసొచ్చింది. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన బాలీవుడ్ మూవీ 'దురంధర్'.. అదిరిపోయే టాక్‌తో పాటు వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది. హిందీ వెర్షన్ మాత్రమే ఉన్నప్పటికీ హైదరాబాద్ లాంటి చోట కూడా హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. ఇక 'అఖండ 2' సీక్వెల్ తాజాగానే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడే దీని ఫలితం గురించి చెప్పలేం. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే ఇందులో కాస్త అతి ఎక్కువైందని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే రిజల్ట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఇలా కొవిడ్ తర్వాత పాన్ ఇండియా సినిమాలకు డిసెంబరు అనేది లక్కీగా మారిపోయింది. చెప్పాలంటే ఇది ఎవరూ ఊహించలేదు. చూస్తుంటే ఇకపై సంక్రాంతి, దసరాలానే డిసెంబరు కూడా సినిమాలకు సీజన్ అయిపోతుందేమో చూడాలి?

  • మరాఠీ స్టైల్లో చీరకట్టుతో మృణాల్ ఠాకుర్

    చీరలో అందాల ముద్దుగుమ్మలా అనసూయ

    తెల్లని డ్రస్‌లో అతిలోక సుందరిలా శ్రీలీల

    బ్లాక్ అండ్ వైట్ శారీలో ముద్దొచ్చేలా నిహారిక

    బెలూన్‌తో హీరోయిన్ అనన్య నాగళ్ల ఫన్నీ గేమ్

    జీన్స్‌లో రచ్చ లేపేస్తున్న ఆషికా రంగనాథ్

  • కామనర్స్‌ వర్సెస్‌ సెలబ్రిటీస్‌.. ఈ ట్యాగ్‌లైన్‌తోనే సీజన్‌ మొదలైంది. ఈ ట్యాగ్‌తోనే సీజన్‌ ముగింపు కాబోతోంది. కామనర్‌ కల్యాణ్‌, సెలబ్రిటీ తనూజలలో ఒకరు విన్నర్‌, మరొకరు రన్నర్‌ కాబోతున్నారు. సీజన్‌ ముగింపుకు చేరుకోవడంతో హౌస్‌లో డబుల్‌ ఎలిమినేషన్‌ ప్రకటించారు. అందులో భాగంగా సుమన్‌ను ఎలిమినేట్‌ చేశారు.. నేటి ఎపిసోడ్‌లో భరణిని పంపించేయనున్నారు.

    ఒక్క కారణం..
    సుమన్‌ ఇన్ని వారాలు కొనసాగడమనేది కొంత ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు బలంగా గేమ్‌ ఆడింది లేదు, కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతీకి ప్రయత్నించిందీ లేదు, కంటెంట్‌ కోసం ఓవరాక్టింగ్‌ చేసిందీ లేదు. అయినా 14 వారాలు హౌస్‌లో ఉన్నాడు. అందుకు గల ఏకైక కారణం అమాయకత్వం.

    నవ్విస్తాడనుకుంటే..
    సినిమాల్లో కమెడియన్‌గా నవ్వించిన సుమన్‌ శెట్టి బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా సైలెంట్‌గా ఉండిపోయాడు. సాధారణంగా అలా ముఖం పక్కకు తప్పుకుని కూర్చుంటే జనాలు వాళ్లను వీలైనంత త్వరగా హౌస్‌ నుంచి పంపించేస్తారు. కానీ, సుమన్‌ను ఎన్నో ఏళ్లుగా అభిమానించినవాళ్లకు అతడిని పంపించేసేందుకు మనసొప్పలేదు. అతడి ముఖంలో, ఆటలో, ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు.

    ఒక్క స్టెప్పేస్తే చాలు
    వీలైనంత వరకు ఎవర్నీ నొప్పించకుండా మాట్లాడేవాడు. మాట్లాడింది తక్కువసార్లే అయినా.. అందులోనూ నీతి, నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు. ఆయన ఒక్క స్టెప్పేస్తే చాలు.. జనం హాయిగా నవ్వుకునేవారు. తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్‌ టు ఫినాలే రేసులో సుమన్‌ బాగా ఆడాడు. కానీ, అది సరిపోదు.. అంతా వదిలేసి చివర్లో కసితో ఆడితే ఏం లాభం.. అందుకే ఎలిమినేట్‌ అయ్యాడు.

    అందుకే 14 వారాలు
    కేవలం అమాయకత్వంతో 14 వారాలు హౌస్‌లో ఉండటం సుమన్‌ శెట్టి (Suman Shetty) కి మాత్రమే సాధ్యమైంది. ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్‌బాస్‌ షోకి మీరు సెట్టవరు అని ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా పంపించేసేవారు. సుమన్‌ను మాత్రం ఆరాధించారు, అభిమానించారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు కూడా అన్నది సోషల్‌ మీడియాలో నెటిజన్ల వాదన!

  • డార్లింగ్‌ ప్రభాస్‌ ఫుల్‌ స్పీడుమీదున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటించిన హారర్‌ మూవీ ది రాజాసాబ్‌. నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రెబల్‌ సాబ్‌ పాట రిలీజైంది. రెబల్‌ స్టార్‌ పేరుపై వచ్చిన సాంగ్‌ కావడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. 

    సెకండ్‌ సాంగ్‌ ప్రోమో
    తాజాగా రాజాసాబ్‌ నుంచి సెకండ్‌ సాంగ్‌ 'సహానా సహానా' ప్రోమో వదిలారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాటలో ప్రభాస్‌.. నిధితో స్టెప్పులేశాడు. తమన్‌ సంగీతం అందించాడు. సహానా సహానా ఫుల్‌ సాంగ్‌ డిసెంబర్‌ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానున్నట్లు వెల్లడించారు. తొలిసారి హారర్‌ జానర్‌లో ప్రభాస్‌ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కన్నా ముందే అంటే జనవరి 9న విడుదల కానుంది.

     

     

  • హీరోయిన్ భావన స్వతహాగా మలయాళీ. కానీ తెలుగులోనూ ఒంటరి, మహాత్మ తదితర సినిమాలు చేసింది.  అయితే ఈమెపై 2017లో దారుణం జరిగింది. రాత్రిపూట ఈమెని కిడ్నాప్ చేసి, రెండు గంటల పాటు లైంగిక వేధింపులకు గురిచేశారు. తొలుత పదిమందిని అనుమానితులుగా చేర్చరు. తర్వాత హీరో దిలీప్‌ని కూడా అనుమానితుడిగా చేర్చారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసులో రీసెంట్‪‌గానే తుదితీర్పు వచ్చింది. ఆరుగురుని దోషులుగా తేల్చారు. హీరో దిలీప్‌ని మాత్రం నిర్దోషిగా ప్రకటించారు.

    అయితే ఈ తీర్పు విషయమై హీరోయిన్ భావన అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఈ మాత్రం న్యాయమైనా జరిగింది అని ఆనందపడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ట్రయల్ కోర్టుపై తను నమ్మకం కోల్పోవడానికి కారణాలు బయటపెట్టింది. అలానే ఈ దేశంలో న్యాయవ్యవస్థ ముందు అందరికీ ఒకేలాంటి న్యాయం దొరకదని కూడా చెప్పుకొచ్చింది.

    '8 సంవత్సరాల 9 నెలల 23 రోజుల తర్వాత ఈ బాధాకరమైన ప్రయాణంలో చిన్నపాటి ఆశ కనిపించింది. ఆరుగురు నిందితులకు శిక్ష ఖరారైంది. నా బాధ అబద్ధం, ఇదంతా కట్టుకథ అనుకునే వాళ్లకు ఈ తీర్పు అంకితం. మీకు ఇప్పుడు మనశ్శాంతి దొరికిందని అనుకుంటున్నా'

    'అందరూ అనుకుంటున్నట్లు మొదటి అనుమానితుడు నా డ్రైవర్ కాదు, అదంతా అబద్ధం. నేను చేస్తున్న ఓ సినిమా కోసం ప్రొడక్షన్ కేటాయించిన డ్రైవర్ అతడు. సంఘటన జరిగిన రోజు తప్పితే అంతకు ముందు ఒకటి రెండుసార్లు మాత్రమే చూశా. కాబట్టి అసత్య ప్రచారాలు ఆపండి. ఈ తీర్పు చాలామందికి ఆశ్చర్యపరిచి ఉండొచ్చు కానీ నాకు కాదు. ఎందుకంటే 2020 ప్రారంభంలోనే ఈ కేసులో ఏదో పొరపాటు జరుగుతుందనిపించింది. ప్రొసిక్యూషన్ కూడా కేసులో తేడా గుర్తించింది. మరీ ముఖ్యంగా ఓ అనుమానితుడు విషయంలో'

    'ఇన్నేళ్లలో హైకోర్టు, సుప్రీంకోర్టుకి నేను పలుమార్లు వెళ్లాను. ట్రయిల్ కోర్టుపై నాకు నమ్మకం లేదని పేర్కొన్నాను. కానీ నా ప్రతి రిక్వెస్ట్‌ని తోసిపుచ్చారు. ఇన్నేళ్ల బాధ, కన్నీళ్లు, ఎమోషనల్ స్ట్రగుల్ తర్వాత.. 'దేశంలోని అందరికీ కోర్టులో ఒకేలాంటి ట్రీట్‌మెంట్ దొరకదు' అనే విషయం నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇప్పటికీ నన్ను తిట్టే వాళ్లకు చెబుతున్నాను. మీరు అలానే అనుకోండి నాకేం అభ్యంతరం లేదు' అని భావన సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.

    ట్రయల్ కోర్టుపై నమ్మకం కోల్పోవడానికి కారణాలు ఇవే అని భావన కొన్నింటిని ప్రస్తావించింది.

    • నా ప్రాథమిక హక్కులకు రక్షణ దొరకలేదు. ఈ కేసులో కీలక సాక్ష‍్యమైన మెమొరీ కార్డ్‪‌ని మూడుసార్లు ట్యాంపర్ చేశారు. అది కూడా కోర్టు కస్టడీలో ఉండగానే.

    • వాదనలు సాగుతున్నప్పుడే ఇద్దరు పబ్లిక్ ప్రొసిక్యూటర్స్ రాజీనామా చేశారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆశపడొద్దని, కోర్టు వాతావరణం అస్సలు సరిగా లేదని నాతో చెప్పారు.

    • మెమొరీ కార్డ్ ట్యాంపరింగ్ విషయంలో పక్కా దర్యాప్తు చేయమని ఎన్నోసార్లు అడిగా కానీ అది జరగలేదు. మళ్లీ మళ్లీ అడిగేంతవరకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు.

    • ఈ కేసు విషయమై న్యాయం జరగట్లేదని గౌరవనీయ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా స్వయంగా నేను లేఖ రాశాను.

    • ఓపెన్ కోర్టులో ఈ కేసు విచారించాలని నేను అడిగాను. తద్వారా మీడియా, ప్రజలకు ఏం జరిగిందో తెలుస్తుందని అన్నాను. కానీ నేను అడిగిన విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు.

    ఈ సంఘటనకు కారణమేంటి?
    హీరో దిలీప్ తొలుత హీరోయిన్ మంజు వారియన్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో బంధంలో ఉన్నప్పటికీ హీరోయిన్ కావ్య మాధవన్‌తో రిలేషన్ మెంటైన్ చేశాడు. కొన్నాళ్లకు మంజు విడాకులు ఇవ్వడంతో దిలీప్.. కావ్యని వివాహం చేసుకున్నాడు. అయితే కావ్య గురించి భావననే మంజుకి చెప్పిందని దిలీప్ అనుమానించాడు. ఈ క్రమంలోనే సుఫారీ ఇచ్చి భావనపై దారుణానికి ఒడిగట్టాడనేది ఆరోపణ.

  • మాస్‌ మ్యూజిక్‌ ఇవ్వడంలో తమన్‌ దిట్ట. కిక్‌ నుంచి మొదలుపెడితే అఖండ 2 వరకు ఎన్నో సినిమాలకు బ్లాక్‌బస్టర్‌ సంగీతం అందించాడు. మాస్‌కే పరిమితం కాకుండా క్లాస్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలకు సైతం మంచి మ్యూజిక్‌ కొట్టాడు. అప్పుడప్పుడూ తమిళ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే తమిళంలో తనకు అంతగా అవకాశాలివ్వడం లేదంటున్నాడు తమన్‌.

    ఇండస్ట్రీ కలుషితం
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్‌ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ కలుషితమైపోయింది. ఇక్కడ వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి. మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్‌ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలోనూ లేరు. అనిరుధ్‌కు తెలుగులో సినిమా ఛాన్స్‌ రావడం చాలా ఈజీ. కానీ నాకు తమిళంలో అవకాశం రావడం చాలా కష్టం. అక్కడ నాకు అవకాశాలివ్వరు.

    ప్రాంతీయభావం ఎక్కువ
    తమిళనాడులో ప్రాంతీయభావం ఎక్కువ. వేరేవాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ, ఇక్కడ ఆ ఐక్యత లేదు. దేశంలో ఎక్కడినుంచి వచ్చినా మనవాళ్లు యాక్సెప్ట్‌ చేస్తారు. పోటీని నేను తప్పుపట్టను. అది మంచిదే! దర్శకులు వేరేవాళ్లను రిఫర్‌ చేస్తున్నారంటే వాళ్లేం కోరుకుంటున్నారో అది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్లందరూ తెలుగులో పని చేస్తున్నారు. 

    పీఆర్‌తో పని
    వాళ్లందరూ పీఆర్‌ టీమ్‌ను పెట్టుకుని బాగా పని చేసుకుంటున్నారు. వారి వారి ఇండస్ట్రీలలో లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం వాళ్లను పిలిచి మరీ కోట్లు ఇస్తాం. వాళ్లేదో తెలుగు సినిమా అని కసితో చేయరు. ఇక్కడ డబ్బులు ఎక్కువిస్తారని పని చేస్తారంతే! మనం అలా ఫేక్‌గా బతకలేం. అభిమానులకు ఏం కావాలో  అందుకు తగ్గట్లు కష్టపడతాం అని తమన్‌ చెప్పుకొచ్చాడు.

    చదవండి: ప్లేటు పట్టుకుని లైన్‌లో నిల్చోవాలా? నా వల్లకాదు!

  • టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీల హవా నడిచేది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు లవ్‌స్టోరీ, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రాజ్యమేలాయి. ఇప్పుడు ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. మన స్టార్ హీరోలంతా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీలపై ఆసక్తి చూపిస్తున్నారు. పిరియాడిక్, హిస్టారికల్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలను ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. అడవి నేపథ్యంలో వచ్చిన కాంతార 1&2 బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్‌  నేపథ్యంలో వచ్చిన పుష్ప ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేసిందో అందరికి తెలిసిందే. 

    అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురమ్‌ భీమ్‌ ఎపిసోడ్‌తో పాటు అల్లూరీ యాక్షన్‌ సీన్‌ అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ సినిమా విజయం కీలక పాత్ర పోషించాయి. ఇలా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కథలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండడంతో .. మరికొంత మంది స్టార్‌ హీరోలు కూడా అడవి నేపథ్యం కథలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

    అందులో అతిపెద్ద సినిమా ‘వారణాసి’. మహేశ్‌ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్‌ మూడు గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలన్నీ అడవి నేపథ్యంలోనే సాగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

    అక్కినేని హీరో నాగచైతన్య కూడా అడవి బాటనే పట్టారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. విరూపాక్ష’ వంటి సూపర్‌ హిట్‌ మూవీ తర్వాత దర్శకుడు కార్తీక్‌ వర్మ దండు  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ అడ్వెంచరస్‌ అండ్‌ మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామాలోని కీలక సీన్లన్ని అడవి నేపథ్యంలోనే  తెరకెక్కస్తున్నారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.

    ఇక మేగా మేనల్లుడు సాయి దుర్గతేజ్‌ కూడా అడవినే నమ్ముకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ కథ మొత్తం అడవి నేపథ్యంలోనే ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుది.

    ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) కథ కూడా ఫారెస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే సాగుతుందట. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే  ఓ యాక్షన్‌ సీన్‌ ఈ సినిమాకే హైలెట్‌ అవుతుందట. శ్రీవిష్ణు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ‘హైందవ’ చిత్రాల్లో కూడా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాపే హైలెట్‌ కానుందనే టాక్‌ వినిపిస్తోంది. 

  • ఇండస్ట్రీలో హీరోగా చేసి హిట్ కొట్టడం గొప్పకాదు. వచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడం గొప్ప. అలా చేయలేకే చాలామంది హీరోలు కనుమరుగవుతున్నారు. అలాంటి ఓ హీరోనే ఇతడు. 'రాజాసాబ్' డైరెక్టర్ మారుతి తీసిన తొలి మూవీ హీరో ఇతడే. కానీ గత తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇంతకీ ఇతడెవరు? ఇప్పుడేం చేస్తున్నాడు?

    (ఇదీ చదవండి: 'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?)

    పైన ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు మంగం శ్రీనివాస్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. 'ఈ రోజుల్లో' హీరో శ్రీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 2012లో ఈ సినిమా రిలీజైంది. అందరూ కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది. దర్శకుడు మారుతికి మంచి గుర్తింపు తెచ్చింది. అలానే హీరోగా చేసిన శ్రీ కూడా చాలానే అవకాశాలు సొంతం చేసుకున్నాడు. కాకపోతే సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవడం వల్ల కేవలం మూడు నాలుగేళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయాడు.

    'ఈ రోజుల్లో' సినిమా తర్వాత శ్రీ.. రయ్ రయ్, అరవింద్ 2, తమాషా, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, సాహసం చేయరా డింభకా, లవ్ సైకిల్.. ఇలా మూడునాలుగేళ్లలో 12 వరకు మూవీస్ చేశాడు. కానీ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. శ్రీ కూడా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని చెప్పాడు. హీరోగా చేస్తున్న టైంలో తాహతుకు మించిన పనులు చేశానని, తన చిత్రాలు రిలీజ్, షూటింగ్ విషయంలో ఇబ్బందుల్లో ఉంటే సొంత డబ్బులు ఇచ్చానని.. అలా ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు.

    ప్రస్తుతం సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారు చేసే ఓ కంపెనీ నడుపుతున్నాడు. ఇది శ్రీ కుటుంబ బిజినెస్. తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి ఇతడికి వచ్చింది. 2020లో కొవిడ్ కారణంగా నాన్న చనిపోవడంతో ఈ బిజినెస్‌లోకి వచ్చానని శ్రీ చెప్పాడు. దీనితో పాటు హైదరాబాద్‌లో వారాహి స్టూడియోస్ అని ఓ డబ్బింగ్ స్టూడియో ఉందని అన్నాడు. పెద్దల కుదిర్చిన సంబంధం చేసుకున్నానని, భార్య కూడా సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సాహిస్తుందని కానీ తనకే సరైన అవకాశాలు రాక ఇలా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా తొలి సినిమాతో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు ఈ హీరో.

    (ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. 'అరోమలే' ఓటీటీ రివ్యూ)

  • తెలుగు సినీ నటి ప్రత్యూష మృతి కేసు 2002లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో  నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి శిక్ష అనుభవిస్తున్నాడు. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్‌ చేస్తూ.. అతనికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి కోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం  తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, ప్రత్యూష బయోపిక్‌ త్వరలో తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఆమె కథన రష్మిక ఇప్పటికే విన్నారని, త్వరలో గ్రీన్ సిగ్నల్  ఇస్తారని ఫిల్మ్ నగర్ టాక్.(Actress Pratyusha Biopic)

    ప్రత్యూష ఉదంతం 2002, ఫిబ్రవరిలో జరిగింది. సుమారు 23ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ తీర్పు రాలేదు. న్యాయం కోసం ఆమె తల్లి పోరాటం చేస్తూనే ఉంది. న్యాయం ఎప్పటికి వస్తుందో తెలియదు. నిందితుడు సిద్ధార్థ రెడ్డి తరఫు న్యాయవాది మరణించడంతో మరికొంత జాప్యం చోటు చేసుకుంది. న్యాయపరంగా ఇది లాంగ్-రన్నింగ్ కేసు, 23 ఏళ్ల తర్వాత కూడా తీర్పు రాకపోవడం న్యాయవ్యవస్థలో ఆలస్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రత్యూష మరణం ఆత్మహత్యగా పరిగణించబడినా, సిద్ధార్థరెడ్డి పాత్రపై వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే గానీ పూర్తి విషయాలు వెలుగులో వస్తాయి.

    ప్రత్యూష కేసులో సీబీఐ నివేదిక 
    ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ఇద్దరూ ఇంటర్‌  చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. హైదరాబాద్‌లోనే వారిద్దరూ ఇంటర్‌ పూర్తి చేశారు. అయితే, చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన ప్రత్యూష సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, సిద్ధార్థరెడ్డి మాత్రం ఇంజినీరింగ్‌లో చేరాడు. కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు రావడతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో  ఇద్దరూ విషం తాగారు. 

    చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే, ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందన గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్‌ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి  పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.

    నిందితుడు సిద్ధార్థరెడ్డి ఎక్కడ ఉన్నాడు..?
    ప్రత్యూష హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. హైకోర్టు ఆయనకు శిక్ష విధించినప్పటికీ, అప్పీల్ కారణంగా ఆయన జైలు శిక్షను తప్పించుకుని బయట ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండటంతో తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఈ కారణంతోనే ప్రత్యూష తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది నవంబర్ 20 సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే ఆయన భవిష్యత్తు స్పష్టమవుతుంది.

    ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే
    అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. అది కన్నడ సినిమాలో తొలి అవకాశం.  ఫేషియల్, వ్యాక్సింగ్‌ చేయించుకోవడానికి కజిన్‌ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. తనకిష్టమైన కెనెటిక్‌ హోండా మీదనే వెళ్లారిద్దరూ. పింకీ పార్లర్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాట్ట. ఫేషియల్‌ పూర్తయ్యే వరకు వెయిట్‌ చేశాట్ట. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు రైడ్‌కెళ్లి వస్తానని శిరిని వెయిట్‌ చేయమని చెప్పింది. 

    సిద్ధార్థ తన కారులో తీసుకెళ్లాడు. కొంత సేపటికి నాకు ఫోన్‌... ‘జయం సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్లు తేజ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే చివరి మాట. కానీ వాళ్లు మాత్రం జయం ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరి ఫోన్‌ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట. ఆ తర్వాత ఫోన్‌ తియ్యలేదట. అప్పటి వరకు ప్రతి వివరమూ సరిగ్గా సరిపోలుతూనే ఉంది. ఆ తర్వాత అంతా మిస్టరీనే. (Actress Pratyusha Death Mystery)

    కేర్‌ నుంచి నిమ్స్‌కి
    పోస్ట్‌మార్టమ్‌ నిమ్స్‌లో. సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్‌మార్టమ్‌ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్‌ పోశారని నాకనిపించింది. హాస్పిటల్‌ వాళ్లు మాత్రం ‘ట్రీట్‌మెంట్‌ సమయంలో పాయిజన్‌ వామిట్‌ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు.

     పొరపాటు చేశాం.. ఖననం చేసి ఉంటే..!
    ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇలా చెప్పారు. ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్‌మార్టమ్‌ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్‌ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్‌ వచ్చేశాను. అప్పటి నుంచి మొదలైన నా న్యాయపోరాటం ఇంకా సాగుతూనే ఉంది.

    ప్రత్యూష  సినిమా విశేషాలు
    సినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998–2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్.
     

  • పెళ్లి భోజనాలనగానే కొందరు పండగ చేసుకుంటారు. నచ్చిన వంటకాలను కడుపునిండా ఆరగించవచ్చని ఉబలాటపడతారు. మరికొందరు మాత్రం అంతమందిలో లైను కట్టి మరీ తినడానికి మొహమాటపడతారు. తనకు ఆ మొహమాటం కాస్త ఎక్కువేనంటున్నాడు బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌.

    నాకంత ఓపిక లేదు
    కృతి కర్బందా, పులకిత్‌ సామ్రాట్‌ హోస్ట్‌ చేస్తున్న 'ద మాన్యావర్‌ షాదీ' షోకి తాజాగా కరణ్‌ జోహార్‌ హాజరయ్యాడు. కృతి, పులకిత్‌ పెళ్లి విందు గురించి మాట్లాడారు. ఎంతమంది జనాలున్నా సరే అందరూ తమ వంతు వచ్చేవరకు ఓపికగా నిల్చుకుని భోజనం చేస్తారని పేర్కొన్నారు. ఇంతలో కరణ్‌ కలగజేసుకుటూ తనకు మాత్రం అంత ఓర్పు, సహనం లేదన్నాడు.

    భోజనం చేయకుండా వచ్చేస్తా!
    పెళ్లిలో నేనెప్పుడూ భోజనం చేయలేదు. భోజనం దగ్గర పెద్ద పెద్ద లైన్లుంటాయి. ఆహారం కోసం ప్లేటు పట్టుకుని అంత పెద్ద క్యూలో నిల్చోవాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పెళ్లిళ్లకు వెళ్తాను.. కానీ అక్కడ భోజనం చేయకుండానే వెనుదిరుగుతాను అని పేర్కొన్నాడు. అతడి సమాధానం విని కృతి అవాక్కయింది.

    సినిమా
    ఇకపోతే కరణ్‌ నిర్మించిన తాజా చిత్రం "తూ మేరీ మే తేరా -మే తేరా తు మేరీ". సమీర్‌ విద్వాన్స్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కార్తీక్‌ ఆర్యన్‌, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరూ గతంలో 'పతీ పత్నీ ఔర్‌ వో' సినిమాలో తొలిసారి జోడీ కట్టారు. ఇప్పుడు రెండోసారి జత కట్టిన ఈ చిత్రం క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల కానుంది.

    చదవండి: మౌగ్లీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌

  • బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ తన ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని వెల్లడించాడు. ప్రియురాలు గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్‌తో తన నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఈ విషయాన్ని రియా చక్రవర్తి చాప్టర్‌ 2 అనే పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ఈ పాడ్‌కాస్ట్‌కు అర్జున్‌ ప్రేయసి గాబ్రియెల్లాతో కలిసి హాజరయ్యాడు. మాకింకా పెళ్లి కాలేదు. 

     ఆరేళ్లుగా డేటింగ్‌
    అదెప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? అని గాబ్రియెల్లా అంది. అందుకు అర్జున్‌ వెంటనే.. కాకపోతే మా నిశ్చితార్థం మాత్రం జరిగిపోయింది అన్నాడు. అలా నిశ్చితార్థం విషయాన్ని తొలిసారి బయటపెట్టారు. అంటే ఆరేళ్లుగా డేటింగ్‌ చేసుకుంటున్న వీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట!!

    మొదటి పెళ్లి
    కాగా అర్జున్‌ రాంపాల్‌.. 1998లో నిర్మాత మెహర్‌ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2018 మేలో భార్యాభర్తలు విడిపోతున్నట్లు ప్రకటించారు. మరుసటి ఏడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి గాబ్రియెల్లాతో ప్రేమలో పడటంతో పాటు ఆమెను గర్భవతిని చేశాడు అర్జున్‌. అలా పెళ్లికి ముందే వీరు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం.

    ఎవరీ గాబ్రియెల్లా?
    గాబ్రియెల్లా 16 ఏళ్లకే మోడలింగ్‌ చేసింది. పలు మ్యూజిక్‌ వీడియోల్లో నటించింది. ఇష్క్‌ ఝమేలా అనే హిందీ మూవీలో అర్జున్‌-గాబ్రియెల్లా కలిసి నటించారు. తెలుగులో ఊపిరి మూవీలో ఫ్రెంచ్‌ డ్యాన్సర్‌గా గాబ్రియెల్లా అలరించింది. ఇక అర్జున్‌ రాంపాల్‌ విషయానికి వస్తే.. ఆంఖేన్‌, డాన్‌, ఓం శాంతి ఓం, ఈఎమ్‌ఐ, హౌస్‌ఫుల్‌, రాజ్‌నీతి, చక్రవ్యూహ్‌, సత్యాగ్రహ, ధాకడ్‌, ధురంధర్‌ వంటి పలు హిందీ సినిమాలు చేశాడు. తెలుగులో భగవంత్‌ కేసరి చిత్రంలో నటించాడు.

    చదవండి: రెండోసారి విడాకులు తీసుకోబోతున్న దర్శకుడు!

  • రీసెంట్‌గా రిలీజైన 'అఖండ 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాలకృష్ణ అభిమానులకు ఇది నచ్చేస్తుండగా.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఓకే ఓకే అనిపిస్తోంది. ఏదైతేనేం సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ అయితే నడుస్తోంది. ఇందులో బాలయ్య కూతురిగా నటించిన అమ్మాయి సీన్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఐక్యూ 226, 17 ఏళ్లకే డీఆర్‌డీఓలో సైంటిస్ట్ అనే సన్నివేశాలపై మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

    ఈ సినిమాలో అఖండ కూతురి పాత్రలో కనిపించిన నటి పేరు హర్షాలీ మల్హోత్రా. పంజాబీ హిందు కుటుంబానికి చెందిన ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. ఏడేళ్ల వయసులోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' మూవీలో నటించింది. మున్నీ పాత్రలో మాటలు రానీ అమ్మాయిగా ఆకట్టుకుంది. ఈ మూవీ కంటే ముందే 2012లోనే అంటే నాలుగేళ్ల వయసులోనే 'ఖబూల్ హై', లాత్ ఆవో త్రిష, సావధాన్ ఇండియా సీరియల్స్‌లో నటించింది. 2017లో సబ్ సే బడా కళాకార్ అనే సీరియల్ కూడా చేసింది.  దీని తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు నటనకు గ్యాప్ ఇచ్చింది.

    మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమా 'అఖండ 2'తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హర్షాలీ యాక్టింగ్‌కి ఓ మాదిరి ప్రశంసలు దక్కుతున్నాయి తప్పితే మరీ సూపర్‌గా చేసిందని ఎవరూ అనట్లేదు. కాకపోతే ఈమె క్యారెక్టర్‪‌కి సంబంధించిన సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా హర్షాలీ చాన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 

  • తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ దక్కడం సినీతారలకు ఓ వరం లాంటింది. ఆ ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి. వరుస అవకాశాలు వస్తాయి. స్టార్‌ హీరోలతో నటించే చాన్స్‌ వస్తుంది. అయితే ఇదంతా ఒకటి, రెండు చిత్రాలకే పనికొస్తుంది. ఆ తర్వాత కూడా హిట్‌ రాకపోతే..అంతే సంగతి. హీరోలలాగా హిట్‌ లేకపోయినా..ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేదు. వయసు పెరిగేకొద్ది చాన్స్‌లు తగ్గిపోతుంటాయి. పైగా టాలీవుడ్‌లో అందాలకు కొదవేలేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పుటుకొస్తున్నారు. అందుకే హీరోయిన్ల హిట్‌ చాలా అవసరం. ఇప్పుడు హిట్‌ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ కృతిశెట్టి. 

    తొలి సినిమా ఉప్పెనతో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగింది. తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్  లాంటి హిట్లు పడడంతో తనకిక ఎదురులేదనుకున్నారు. కానీ ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా కిందకు పడిపోయింది ఈ బ్యూటీ. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే లాంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో టాలీవుడ్‌ ఆమెను పక్కకి పెట్టింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో.. మాలీవుడ్‌కి షిఫ్ట్‌ అయింది. అక్కడ కూడా కలిసి రాలేదు.  ఆమె నటించిన 'ఆర్మ్' అనే సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. 

     కార్తి 'వా వాథియార్'(అన్నగారు వస్తున్నారు), ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', రవి మోహన్  'జీని' చిత్రాల్లో నటించింది. అయితే వీటిల్లో ఒక్కటి హిట్‌ అయినా చాలు.. కొన్నాళ్ల పాటు ఆమెకు ఢోకా ఉండదు. కానీ హిట్‌ సంగతి పక్కకుపెట్టు..కనీసం విడుదలకు కూడా నోచుకోవడం లేదు. ఆమె నటించిన సినిమాన్నీ వాయిదాలు పడుతున్నాయి.  ఈ నెల 12న అన్నగారు వస్తున్నారు రిలీజ్‌ అవ్వాల్సింది. భారీ పబ్లిసిటీ కూడా చేశారు. కానీ హఠాత్తుగా ఇప్పుడా సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు.

    ఇప్పటికే రావాల్సిన మరో తమిళ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 18న దానిని రిలీజ్ చేస్తామని ఆ మధ్య చెప్పారు. ఆ తర్వాత ఇది కూడా వాయిదా పడినట్లు ప్రకటించారు. అలానే ఆ మధ్య 'జయం' రవి నటించిన 'జీనీ' సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అదీ త్వరలోనే విడుదల అవుతుందని అన్నారు. కానీ డేట్‌ ప్రకటించలేదు.

    ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ టెన్షన్‌ పడుతుంది కృతి శెట్టి మాత్రమే. అసలే హిట్‌ లేక చాలా కాలం అవుతుంది. వరుస సినిమా రిలీజ్‌ అయితే..ప్రేక్షకులు తనను మర్చిపోకుండా ఉంటారకుంది. అందుకే ఎంతో హుషారుగా ప్రమోషన్స్‌ చేసింది.  అన్నగారు వస్తున్నారు సినిమాతో హిట్‌ పడుతుందని.. అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి వాయిదా పడడంతో బ్యాడ్‌లక్‌ అనుకొని సైలెంట్‌ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమాలన్నీ రిలీజై..ఒక్కటి హిట్‌ అయినా కృతికి మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా ఫ్లాప్‌ అయితే మాత్రం.. కోలీవుడ్‌లో కూడా కృతికి అవకాశాలు రావు.  ఓవరాల్‌గా ఆమె సినీ కెరీరే ఇప్పుడు డేంజర్‌ జోన్‌లో ఉంది. 

  • ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తరచుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. అనుమతి లేకుండానే తన పాటలను నేటి సినిమాల్లో వినియోగించడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోవాలంటూనే నష్టపరిహారం కూడా చెల్లించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశంలో ఆయన్ను సమర్ధించే వారు ఉన్నారు. మరికొందరు వ్యతిరేఖిస్తున్నారు.

    ఇళయరాజా సంగీతం అందించిన 5వేల పాటలను సోని మ్యూజిక్ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో నేటి తరం సినిమా నిర్మాతలు అందరూ సోని మ్యూజిక్‌తో ఒప్పందం చేసుకుని రైట్స్‌ కొనుగోలు చేస్తున్నారు. రీసెంట్‌గా డ్యూడ్‌, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ విషయంలో అదే జరిగింది. మైత్రీ మూవీస్‌ కూడా ఇదే పేర్కొంది.

    ఇళయరాజాకు కౌంటర్‌ ఇస్తున్న లాయర్లు
    ఒక సినిమా కోసం ఇళయరాజా పాటలు స్వరపరిచినందుకు నిర్మాత డబ్బులు చెల్లిస్తారు. అదే పాటను ఆ సంగీత దర్శకుడు మరో పది సినిమాలకు అమ్ముకోలేరని కౌంటర్‌ వేశారు.  ఒక సంగీత దర్శకుడు అందించిన పాటను తమ సినిమాలో ఉపయోగించాలా వద్దా  అనేది పూర్తిగా దర్శకుడు, నిర్మాత ఇష్టంపైనే ఉంటుందని గుర్తుచేశారు. సంగీతమనేది తన కష్టానికి ఫలితమైనప్పటికీ.. ఒక సినిమా కోసం దానిని అమ్మేసిన తరువాత యాజమాన్య హక్కులు ఎట్టిపరిస్థితిలోనూ కోరలేడని న్యాయవాదుల పేర్కొన్నారు. ఒక సంగీత దర్శకుడు అందించిన పాటను ఎవరైన నిర్మాత ఉపయోగించకుండా ఉన్నప్పటికీ కూడా ఆ పాటను మరో సినిమాకు సంగీత దర్శకుడు అమ్మలేరని తెలిపారు.

    తన పాటలను వేదికలపై పాడొద్దని ఎస్పీబాలు, చిత్ర, ఎస్పీ చరణ్‌లకు కూడా గతంలో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారనే విషయం తెలిసిందే.. నోటీసులు అందుకోగానే  ఇళయరాజా పాటలు పాడటం ఆపేస్తున్నట్లు బాలు ప్రకటించారు. చట్టం గురించి తనకు తెలియకపోవడం వల్ల కచేరీలలో ఇళయరాజా పాటలు పాడానని బాలు చెప్పారు. ఇకపై షోలలో ఆయన పాటలు పాడలేనని సోషల్‌మీడియాలో ప్రకటించారు.

    1980 కాలంలో ఇళయరాజా టైమ్‌ కొనసాగుతుంది. ఆ సమయంలో ఆయన ఆడియో కంపెనీ కూడా ప్రారంభించారు. తనకు ఏదైనా సినిమా ఆఫర్‌ వస్తే దాని ఆడియో హక్కులు కూడా సొంత కంపెనీకే ఇవ్వాలని షరతు పెట్టేవారు. ఇలాంటి డీలింగ్స్‌ అన్నీ కూడా తన మేనేజర్ కల్యాణం చూసుకునేవారు. కనీసం తన ఫైనాన్స్‌ విషయంలో కూడా ఆయన వేలు పెట్టరు.  ఇళయరాజా చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. తనకు టాలెంట్‌తో పాటు డబ్బు విలువ బాగా తెలుసు. ఇళయరాజా వల్లనే ఎన్నో సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ముందే కాపీ రైట్స్‌ తన కంపెనీ చేతిలో పెట్టుకున్నారు.

    ఇళయరాజా అందరికీ నోటీసులు పంపారా..?
    తన పాటల కాపీ రైట్స్‌ విషయంలో ఇశయరాజా అందరికీ నోటీసులు పంపలేదు. చాలామంది సరదాగా ఆయన పాటలు పాడుతుంటారు. సినిమా పాట అంటేనే ఇలాంటివి సహజం. ఆయన ఎప్పడూ కూడా మామూలు జనాలకు  నోటీసులు ఇవ్వలేదు. చిన్నాచితక ఆర్కెస్ట్రా వారికి కూడా ఇవ్వలేదు. తన పాట ఎక్కడా కూడా వినిపించకూడదనే కండీషన్‌ పెట్టలేదు. ఆయన అభ్యంతరం చేసింది కేవలం సినిమా వాళ్లనే.. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వంటి వారు సామాజిక ప్రయోజనాల కోసం ఇళయరాజా పాటలు పాడలేదు. వారు కూడా కమర్షియల్ కార్యక్రమంలోనే పాడారు. తద్వారా  ఈవెంట్‌ నిర్వాహుకులకు డబ్బు వస్తుంది కదా అనేది ఇళయరాజా పాయింట్‌.. భారీ బడ్జెట్‌ సినిమాల్లో కూడా తన పాటలను ఉపయోగించుకుని  డబ్బు సంపాదించడం ఏమిటి అని ఇళయరాజా భావించి ఉండొచ్చు. అందుకే ఆయన నోటీసులు జారీ చేస్తున్నారు.
     

Politics

  • సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

    చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

    ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్‌సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.

    మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్‌ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

    చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలు
    ఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్‌లా మారిపోయాడని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.

    ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది.  కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్‌సీపీ ఖండిస్తోంది.

    మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.

    మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?
    1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్‌ జగన్ హయాంలోనే 17 మెడికల్  కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్‌ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.

    బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం  ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.

    పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి
    పీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్‌ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.

    ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.

    పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారం
    ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.

    పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్‌సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.

    స్థాయీ సంఘం పేరుతో అబద్దాలు
    కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం  సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్‌ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్‌ జగన్‌ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.

    వైఎస్‌ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు,  పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.

    పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.

    చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని..  ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?

    కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానా
    ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.

    పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా...  కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?

    5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60  సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైంది

    మెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..
    మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి  257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.

    ప్రైవేట్‌ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం  2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.

    మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే  ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.

    కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయం
    రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్‌ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్‌ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.

    15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్‌కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్‌ జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్‌ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు.

  • సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్‌ టార్గెట్‌ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్‌లో ఉంది. హైరిస్క్‌ ఏరియా అని రాశారని, గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.

    ‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్‌ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్‌ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..

    ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:
    పీపీపీ మోడల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.

    ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్‌ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్‌ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.

    అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్‌ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.

    ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్‌. 

    మొన్నటివరకూ పీపీపీ మోడ్‌ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్‌ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?

    జగన్‌కి పేరు వస్తుందనే ఇదంతా..:
    మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్‌లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్‌ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్‌ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్‌ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్‌ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.

    పీపీపీ పేరుతో మెడికల్‌ కాలేజీలు దోచి పెడుతున్నారు:
    అసలు మెడికల్‌ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్‌ జగన్‌ హయాంలోనే నాబార్డ్‌ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్‌ను సంప్రదిస్తే మెడికల్‌ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్‌ జగన్‌కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్‌ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్‌ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?

    ఇంకా 10 మెడికల్‌ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్‌ మెంట్‌ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.

    రికార్డుస్థాయిలో అప్పు:
    అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్‌ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.

    కోటి సంతకాలు గవర్నర్‌కి సమర్పణ:
    10 కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్‌కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు వివరించారు.

  • సాక్షి,ఢిల్లీ: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్‌లో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ఆయన పేరును ఖరారు చేసింది.

    బిహర్‌కు చెందిన సీనియర్ నాయకుడైన నితిన్ నబిన్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. క్రమశిక్షణ, నిర్వాహణా నైపుణ్యం, యువ నాయకత్వం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ ఆయనను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఈ పదవి బీజేపీలో అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. పార్టీ జాతీయ అధ్యక్షుడికి సహకరించడం, దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం, ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం వంటి బాధ్యతలు ఈ పదవికి చెందుతాయి. బిహర్ నుంచి జాతీయ స్థాయిలో ఇంత పెద్ద పదవి రావడం అరుదు. రాబోయే ఎన్నికల దృష్ట్యా యువ నాయకత్వాన్ని ముందుకు తేవాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    నితిన్ నబిన్‌కు బిహర్‌లో ఉన్న బలమైన మద్దతు, ఆయన నిర్వాహణా అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని అంచనా. మొత్తం మీద, ఆయన నియామకం బీజేపీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా పరిగణించబడుతోంది. బిహర్ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అరుదైన నాయకుల్లో నితిన్ నబిన్ ఒకరుగా నిలిచారు.
     

     

  • సాక్షి,ఢిల్లీ: ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను ఓటర్ల జాబితానుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ  కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో  ఓట్ చోర్, గద్దీ ఛోడ్ ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.

    ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..‘ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యి వ్యవస్థల్ని నిర్విర్యం చేస్తున్నారు. ఓట్‌ చోరీపై దేశ వ్యాప్తంగా 5.5కోట్ల మందికి పైగా సంతకాలు సేకరించాం. ఓట్‌చోరీపై అందరూ ఏకమవ్వాలి. ఓటర్ల జాబితాలో బోగస్‌ ఓట్లు జోడించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారు.   ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత,నిస్పక్షపాతం ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి’అని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.  

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో టీడీపీ కండువాలు వేసేందుకు బీటెక్ రవి వెళ్లారు. ఆయన రాకతో గ్రామస్తులు.. తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లారు.

    పోలీసు ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నుంచి గ్రామం మొత్తం వైఎస్‌ కుటుంబం వెంటనే నడుస్తున్నామన్న గ్రామస్తులు.. టీడీపీ ఊరిలో అడుగు పెట్టడంతోనే ఊరు వదిలి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు.

    వైఎస్సార్‌సీపీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్సార్‌సీపీకి అమ్మగారిపల్లి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. అమ్మగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైఎస్సార్‌సీపీకి వెయ్యి ఏనుగుల బలం.

    ‘‘టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైఎస్‌ జగన్‌ కోరుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మగారిపల్లి గ్రామస్తులు తెగువ చూపించారు’’ అని సతీషరెడ్డి పేర్కొన్నారు.

  • సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న (శనివారం) బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం​ జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

    ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. కృష్ణా,గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్‌ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం,కార్యచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు,సాగునీటి హక్కుల విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.  

     

  • విజయవాడ:  ఏపీలో అధికార టీడీపీ నేతలైన ఎంపీ కేశినాని చిన్ని-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌ తారాస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా కొలికపూడి  సోషల్‌ మీడియాలో రోజుకో పోస్ట్‌ పెడుతూ హిట్‌ పుట్టిస్తున్నారు. కొలికపూడి పోస్ట్‌లతో ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా కేశినేని చిన్నిపై కొలికపూడి పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింంది. 

    గంపలగూడెం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘ బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్‌ పెట్టారు కొలికపూడి.  ఈనెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లెనిద్ర అంటూ మరో పోస్టు పెట్టారు.  కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపుతున్నాయి.

     

     

     

     

National

  • ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో యూదుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.

    ఇంటెలిజెన్స్‌ సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు భారత్‌లోని ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్‌కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

    హనుక్కా పండుగ ఎప్పుడు?
    యూదులు ఘనంగా జరుపుకునే ఎనిమిది రోజుల పండుగ హనుక్కా. ఈ పండుగ డిసెంబర్ 14 నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో యూదులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తారు. అందువల్లే పండుగ పర్వదినాన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

    ఏ నగరాలు ప్రధాన టార్గెట్?
    ఇంటెలిజెన్స్‌ నివేదికల ప్రకారం యూదు సంస్థలు, ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత పెంచారు. విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్రాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.  

  • సాక్షి శబరిమల: శబరిమలలో అరవణ ప్రసాద కొరత తీవ్రంగా ఉన్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. ప్రస్తుతాని అధిక సంఖ్యలో ప్రసాదాలు అందుబాటులో లేనట్లు స్పష్టం చేసింది. అంతేగాదు ప్రతి భక్తుడు 20 ప్రసాదం డబ్బాలకు మించి కొనుగోలు చేయానికి వీల్లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం గతేడాది(జనవరి 2024) అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు కలకలం రేగిన ఘటనే. ఆ సమయంలో లక్షలాది డబ్బాలను అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

    అదీగాక ఇటీవలే సరిగ్గా అలాంటి లోపాలే  అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో కూడా ఉన్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్‌లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఈ అరవణ ప్రసాదం డబ్బాల కొరత ఏర్పడింది, అలాగే భక్తులకు కూడా పరిమితులు విధించారు ఆలయ అధికారులు. 

    ఇక శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు కూడా ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాక్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.

     

    (చదవండి: శబరిమలలో మరో అపచారం)
     

International

  • ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండై బీచ్‌లో ఉగ్ర దాడి వేళ ఓ పౌరుడు పెద్ద సాహసమే చేశాడు. ఉగ్ర మూకపై స్థానిక పౌరుడు తిరగబడ్డాడు. కాల్పులు జరుపుతున్న ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని అతడిపైనే కాల్పులు జరిపాడు.  ఆ తర్వాత అతడిని తరిమికొట్టాడు. వందలాది మంది పర్యాటకులను ఉగ్రవాదుల నుంచి ఆ వ్యక్తి రక్షించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

    బాండి బీచ్‌ కాల్పుల ఘటనలో 10 మంది మరణించారు. బీచ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్‌ చేయడంతో వందల మంది పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగులను అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

     

     

     

  • జెరూసలేం: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌ దాడి ఘటనపై ఇజ్రాయెల్‌  తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ముందే అలర్ట్‌ చేయడంతో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదుల వేడుకలను టార్గెట్‌ చేసిన ఉ‍గ్రమూక దాడిలో  10 మంది మృతిచెందగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.

    యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని.. యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్‌ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్‌ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు. 

    మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు’ అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న ‘యాంటీ-సెమిటిజం’ని ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉగ్రదాడి యూదులే లక్ష్యంగా జరిగిందా? అనేదానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

    బాండీ బీచ్‌లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని.. బాధితులకు తన ప్రగాఢ సానుభూతి’’ అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు.
     

  • సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్‌ పహల్గాం తరహాలో సిడ్నీ బాండీ బీచ్‌లో ఉగ్రదాడి జరిగింది. బీచ్‌లోని యూదులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పదిమందికి పైగా పర్యాటకులు మృతిచెందారు. ముసుగు ధరించిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు.

    అయితే బీచ్‌లో సరదాగా గడుపుతున్న పర్యాటకులు.. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

    బీచ్‌లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాల్పుల తర్వాత ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

     

     

     

     


     

Family

  • తల్లి ఎప్పుడూ తన పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటుంది. కానీ ఈ తల్లి తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జస్ట్‌ కార్పెంటర్‌ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటే చాలు అనుకుంది. అదే విషయం కొడుకుకి నూరుపోస్తూ ఉండేది. కానీ అతడు తన అ‍మ్మ కూడా ఊహించని విధంగా సీఈవో అయ్యి ప్రభంజనం సృష్టించాడు. చుట్టూ పరిస్థితులు ఎలా  ఉన్నా..గొప్ప టాలెంట్‌, శక్తి సామర్థ్యాలు ఉంటే..ఆకాశమంత కలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని చాటిచెప్పి స్ఫూర్తిగా నిలిచాడు.

    అతడే మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్. 39 ఏళ్ల డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు అయిన సులేమాన్‌ బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో తన సక్సెస్‌ జర్నీ గురించి ఇలా షేర్‌ చేసుకున్నాడు. తన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా, తల్లి ఎన్‌ఎహెచ్‌ఎస్‌ నర్సుగా పనిచేసేదని చెప్పుకొచ్చాడు. శ్రామిక వర్గానికి చెందిన కుటుంబం కావడంతో తన తల్లి 16 ఏళ్లు వచ్చేటప్పటికీ కార్పెంటర్‌గానో లేదా ఎలక్ట్రిషియన్‌ ఉంటే చాలని పదేపదే చెబుతుండేదని అన్నాడు. 

    ఎందుకంటే 1980-90లలో తన కుటుంబం పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని వివరించాడు. సరిగ్గా 16 ఏళ్లప్పుడు తన తల్లిదండ్రులు విడిపోవడంతో తాను తన తమ్ముడు ఒంటరిగా పెరిగామని నాటి స్థితిని గురించి బాధగా చెప్పుకొచ్చారు. అయితే ఆ ఏజ్‌ ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఉండే వయసు కావడంతో పెద్దగా భయపడలేదని, ఏదో సాధించేస్తాననే ధీమా ఎక్కువగా ఉండేదని తెలిపాడు. అయితే తన తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా చదువులో బాగా రాణించి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంల సీటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచ్చిన నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు సులేమాన్‌. 

    అయితే అక్కడ చదువు పూర్తి చేయకుండా ప్రపంచాన్నే ఉద్ధరించేద్దామన్న ఉత్సాహంతో అమెరికా 9/11 వరల్డ్‌ట్రైడ్‌ సెంటర్‌ కూల్చివేతతో ముస్లిం యువతపై వచ్చిన వివక్షను రూపుమాపేందుకు కృషి చేసే పనికి పూనుకున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న ముస్లిం వ్యతిరేక భావాన నుంచి పుట్టికొచ్చిందే అతిపెద్ద కౌన్సెలింగ్ హెల్పలైన్‌ సేవ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్‌ ఇది అతిపెద్ద కౌన్సిలింగ్‌ సర్వీస్‌లలో ఒకటని తెలిపారు. కుటుంబం తల్లిందండ్రులతో సంబంధాలు తెగిపోయి, బెదిరింపులకు లోనై ఇబ్బందిపడుతున్న యువ బ్రిటిష్‌ ముస్లింలకు ఆ సర్వీస్‌ వరంగా మారింది. 

    ఆ సామాజిక లక్ష్యమే చివరికి 2010లో డీప్‌మైండ్‌(మార్గదర్శక ఏఐ)ను స్థాపించడానికి దారితీసింది. ఆ తర్వాత గూగుల్‌ 650 మిలియన్‌ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైనే) ఆ కంపెనీని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సులేమాన్‌ మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఏఐ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఏఐని "హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణిస్తాడు. 

    తన శ్రామిక కుటుంబ నేపథ్యమే టెక్నాలజీవైపు ఆకర్షితుడిని చేసి..ఈ స్థాయికి చేర్చిందని అంటాడు. చివరగా జీవితంలో "మనంచేసే ఏ పనైన ది బెస్ట్‌గా చేయాలనుకుంటే కచ్చితంగా దిబెస్ట్‌ పొజిషన్‌లో ఉంటాం" అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని చెబుతున్నాడు సులేమాన్‌.  

    (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..)

     

  • ముఖంపై బ్లాక్‌హెడ్స్‌, వైట్‌హెడ్స్‌, నల్లటి మచ్చలు లేకుండా కాంతిమంతంగా ఉండాలంటే ఈ డివైజ్‌ బెస్ట్‌. అలాగే శీతాకాలంలో ముఖం వడిలిపోకుండా తాజాగా ఉండాలంటే మాత్రం ఈ సింపుల్‌ టిప్‌ ఫాలో అయ్యిపోండి చాలు..మరి సులభమైన చిట్కాలు, హెల్ప్‌ అయ్యే బ్యూటీ డివైజ్‌ల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

    బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, నల్లటి మచ్చలు, గీతలు, మొటిమలు ఇవి ముఖాన్ని కళావిహీనంగా మారుస్తుంటాయి. ఇలాంటి సమస్యలను దూరం చెయ్యడానికి ఇప్పుడు సాంకేతికత బాగానే తోడవుతోంది. చిత్రంలోని ఈ స్కిన్‌ క్రష్‌ మైక్రోడెర్మాబ్రేషన్‌ డివైస్‌ – చర్మాన్ని మెరిపించడానికి రూపొందించిన ఒక అధునాతన సాధనం. ఈ డివైస్‌తో చర్మాన్ని లోతుగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది చర్మం పైపొర నుంచి నిర్జీవ కణాలను ఇట్టే తొలగిస్తుంది. దాంతో చర్మం మరింత నునుపుగా, తాజాగా మారుతుంది. నిగారింపుకు రాసే సీరమ్, క్రీమ్, మాయిశ్చరైజర్‌ వంటివి అప్లై చేసుకునే సమయంలో కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.

    ఈ మెషిన్‌తో పాటు చాలా హెడ్స్‌ లభిస్తాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. నిజానికి ఈ పరికరాన్ని ఉపయోగించడం చాలా తేలిక. మొదటగా చర్మాన్ని చల్లటి నీళ్లతో కడుక్కుని, పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత, చర్మాన్ని కొద్దిగా సాగదీస్తూ ఈ పరికరాన్ని చర్మానికి ఆనించి, పైకి లేదా వెలుపలి దిశలో నెమ్మదిగా కదిలించాలి. దీనిలో ఆన్, ఆఫ్‌తో పాటుగా ‘లో, మీడియం, హై’ అనే ఆప్షన్స్‌ కూడా ఉంటాయి. 

    ఎప్పుడైనా సరే, మీడియం మోడ్‌ సౌకర్యంగా అనిపిస్తేనే, హై మోడ్‌ పెట్టుకోవచ్చు. చర్మం ఎర్రబడినా, మంటగా అనిపించినా వెంటనే దీని వాడకం ఆపెయ్యడం ఉత్తమం. చికిత్స పూర్తయిన తర్వాత, తేలికపాటి మాయిశ్చరైజర్‌ లేదా సీరమ్‌ రాసుకోవాలి. మంచి ఫలితాల కోసం, దీనిని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. అయితే, ఈ చికిత్స తర్వాత 24 గంటల పాటు లేదా చర్మం సాధారణ స్థితికి వచ్చే వరకు ‘విటమిన్‌ ఏ’ లేదా రెటినోల్స్‌ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించకూడదు.

    మెరుపునిచ్చే చిట్కా
    శీతకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చర్మం వడిలిపోయినట్లు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. పొడి చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవడానికి, ఇలా ప్రయత్నిస్తే సరిపోతుంది. ఒక చిన్న బౌల్‌లో ఒక టీ స్పూన్‌ బాదం పేస్ట్‌ (4–5 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్‌ చేసుకోవాలి.), 2 టీస్పూన్లు చిక్కటి పచ్చి పాలు, 4 చుక్కల గ్లిజరిన్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. 

    ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి, 15 లేదా 20 నిమిషాలు ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత, గోరువెచ్చని నీటితో సున్నితంగా మసాజ్‌ చేస్తూ కడిగేసుకోవాలి. ప్యాక్‌ తొలగించిన తర్వాత చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఎందుకంటే బాదంలో విటమిన్‌–ఇ  పుష్కలంగా ఉంటుంది, 

    ఇది యాంటీ ఏజింగ్‌ లక్షణాలను కలిగి చర్మానికి చక్కటి పోషణనిస్తుంది. పాలలో ఉండే కొవ్వు, లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని శుభ్రపరుస్తూ, తేమగా ఉంచుతాయి. అలాగే గ్లిజరిన్‌ చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. దాంతో వారానికి ఒకసారి ఈ మాస్క్‌ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  

    (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..)

Wanaparthy

  • స్వగ్
    దమగ్నాపూర్‌: ఇద్దరూ.. ఇద్దరే

    ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు

    స్వీయ పర్యవేక్షణతో పాటు వేగుల ద్వారా పావులు

    జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం

    ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు

    ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ

    డ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్‌ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపొందారు.

    ..ఇలా తొలి విడత సం‘గ్రామంశ్రీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్‌ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్‌ఎస్‌ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్‌గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

    దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్‌ సర్పంచ్‌ అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్‌ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్‌ఎస్‌ బలపరిచిన ఇ.పావని సర్పంచ్‌గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    ప్రభావిత వర్గాలు..

    బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్‌, ఉప్పరి

    మహిళలు 2,706

    పురుషులు 2,658

    మొత్తం ఓటర్లు 5,364

    ధన్వాడ పంచాయతీ కార్యాలయం

    ప్రభావిత వర్గాలు..

    పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్‌, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి

    పురుషులు 4,034

    మహిళలు 4,293

    మొత్తం ఓటర్లు 8,327

    ప్రభావిత వర్గాలు..

    పురుషులు 1,369

    మహిళలు 1,416

    మొత్తం ఓటర్లు 2,785

    ఎస్సీ, వాల్మీకి, ముస్లిం, కురువ, ముదిరాజ్‌

    పుల్లూరు: ఎవరి ధీమా వారిది

    తూడుకుర్తి: నువ్వా.. నేనా..

    నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్వగ్రామం తూడుకుర్తి. నాగర్‌కర్నూల్‌ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్‌ పదవి అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్‌ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ బలపరిచిన లక్ష్మీ, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్‌రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. దామోదర్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్‌లుగా కాంగ్రెస్‌ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్‌ఎస్‌కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్‌రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్‌ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    ఇటు అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, అటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామ సర్పంచ్‌ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ సర్పంచ్‌ స్థానానికి మొత్తం నలుగురు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు సునీత, కాంగ్రెస్‌ బలపరిచిన సువర్ణతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఉమామహేశ్వరి, కవిత పోటీలో నిలిచారు. ప్రధానంగా సునీత, సువర్ణ మధ్యే పోటీ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌కు చెందిన వారు కావడం.. చల్లా స్కెచ్‌తో తన గెలుపు ఖాయమని సునీత ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం తనకు కలిసి వస్తుందని సువర్ణ భావిస్తున్నారు.

  • రెండో
    నేడు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

    సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్‌.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్‌ సామగ్రిని అందజేశారు.

    520 సర్పంచ్‌లకు 1,709 మంది పోటీ..

    ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్‌ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్‌నగర్‌, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    రెండో విడతలో ఇలా..

    జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్‌ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్‌ బరిలో

    సర్పంచ్‌లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది..

    మహబూబ్‌గర్‌ 151 9 142 474 1,334 267 1,065 2,811

    నాగర్‌కర్నూల్‌ 151 4 147 473 1,412 143 1,269 3,228

    నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755

    వనపర్తి 94 5 89 294 850 148 702 1,769

    జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263

    మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826

    2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు..

    2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా..

    జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

    మహబూబ్‌నగర్‌ 94,975 96,998 4 1,91,977

    నాగర్‌కర్నూల్‌ 1,27,142 1,26,602 5 2,53,749

    జో.గద్వాల 55,710 57,094 3 1,12,807

    వనపర్తి 61,553 62,726 2 1,24,281

    నారాయణపేట 73,674 76,642 2 1,50,318

    మహబూబ్‌గర్‌: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్‌,

    హన్వాడ, కోయిల్‌కొండ)

    నాగర్‌కర్నూల్‌: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌,

    పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజీపేట)

    నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్‌)

    వనపర్తి: 5 (వనపర్తి,

    కొత్తకోట, మదనాపూర్‌,

    ఆత్మకూర్‌, అమరచింత)

    జోగుళాంబగద్వాల: 4 (మల్దకల్‌, అయిజ,

    వడ్డేపల్లి, రాజోలి)

    నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్‌ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు.

    మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్‌ నిర్వహించడం లేదు.

    ఉమ్మడి జిల్లాలో

    45 మంది సర్పంచ్‌లు,

    1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం

    520 జీపీలు..

    4,202 వార్డులకు పోలింగ్‌

    అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

    రెండో విడతలో పోలింగ్‌ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

    ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

  • 1,150

    వనపర్తి: జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో పోలీసు అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసిస్తూ.. రెండోవిడత విధులు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. రెండోవిడతలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్‌, మదనాపురం, అమరచింత మండలాల్లోని 94 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని, 1,150 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, నిబంధనలు ఉల్లంఘించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవైనా ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటిస్తూ కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సోషల్‌ మీడియాపై జిల్లా పోలీసుశాఖ నిషిత పరిశీలన ఉందని.. ఎవరైనా ఎన్నికల నిర్వహణకు అటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచా రం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్పులు, డీజేలకు అనుమతి లేదని తెలిపారు.

    సజావుగా

    రెండోవిడత ఎన్నికలు

    మదనాపురం: మండలంలో ఆదివారం జరిగే రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్‌ తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ ప్రసన్నకుమారి, రూట్‌ అధికారులు ఉన్నారు.

    అమరచింతలో

    ఝార్ఖండ్‌ బృందం

    అమరచింత: స్థానిక చేనేత ఉత్పత్తుల సంఘం పనితీరు అద్భుతంగా ఉందని ఝార్ఖండ్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ ప్రతినిధులు కొనియాడారు. అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘంలో తయారవుతున్న జరీ చీరలు, రెడీమెట్‌ వస్త్రాల తయారీపై అధ్యయనం చేయడానికి ప్రతినిధుల బృందం రెండ్రోజుల పర్యటనకు వచ్చిందని సంఘం సీఈఓ చంద్రశేఖర్‌ వెల్లడించారు. సంఘం ఏర్పాటును వారికి వివరించామన్నారు. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు హ్యండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు తమ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో ఇక్కడి క్లస్టర్‌ను సందర్శించామని నోడల్‌ ఏజెన్సీ కంపెనీ సీఈఓ శ్యాంసుందర్‌, టెక్నికల్‌ అడ్వయిజర్‌ బిష్యుప్రసాద్‌, మహిళా ప్రతినిధులు తెలిపారు. ఇక్కడి నేత కార్మికుల పనితీరును పరిశీలించామని త్వరలోనే తమ రాష్ట్రంలో ఇలాంటి కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు.

    నిండుకుండలా

    రామన్‌పాడు జలాశయం

    మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం సముద్రమట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని.. ఎన్టీఆర్‌ కాల్వకు 925 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.

  • ఈసీ మార్గదర్శకాలు విధిగా పాటించాలి

    కొత్తకోట రూరల్‌/వనపర్తి రూరల్‌/అమరచింత/ఆత్మకూర్‌: పీఓ, ఓపీఓలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా పాటించి పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్‌ ఎంపీడీఓ కార్యాలయాలు, అమరచింత ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి ఆయా కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం ఎదుట ఫారం–9లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తు పోస్టర్‌ అతికించాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్నిరకాల సామగ్రి, బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు తీసుకొని కేటాయించిన గ్రామపంచాయతీకి రూట్‌ వారీ బస్సులో తరలివెళ్లారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల సాధారణ జిల్లా పరిశీలకుడు మల్లయ్య బట్టు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఉన్నారు.

  • పెద్దదగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..

    ప్రభావిత వర్గాలు..

    పురుషులు 1,071

    మహిళలు 1,021

    మొత్తం ఓటర్లు 2,092

    యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి

    రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్‌ అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలపరిచిన ఉడుతల భాస్కర్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు గొంది నిరంజన్‌ రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ యాదవ్‌ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్‌రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్‌ యాదవ్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు.

Narayanpet

  • రెండో పోరుకు రెడీ

    సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్‌.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్‌ సామగ్రిని అందజేశారు.

    520 సర్పంచ్‌లకు 1,709 మంది పోటీ..

    ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్‌ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్‌నగర్‌, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    రెండో విడతలో ఇలా..

    జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్‌ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్‌ బరిలో

    సర్పంచ్‌లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది..

    మహబూబ్‌గర్‌ 151 9 142 474 1,334 267 1,065 2,811

    నాగర్‌కర్నూల్‌ 151 4 147 473 1,412 143 1,269 3,228

    నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755

    వనపర్తి 94 5 89 294 850 148 702 1,769

    జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263

    మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826

    2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు..

    2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా..

    జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

    మహబూబ్‌నగర్‌ 94,975 96,998 4 1,91,977

    నాగర్‌కర్నూల్‌ 1,27,142 1,26,602 5 2,53,749

    జో.గద్వాల 55,710 57,094 3 1,12,807

    వనపర్తి 61,553 62,726 2 1,24,281

    నారాయణపేట 73,674 76,642 2 1,50,318

    మహబూబ్‌గర్‌: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్‌,

    హన్వాడ, కోయిల్‌కొండ)

    నాగర్‌కర్నూల్‌: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌,

    పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట)

    జోగుళాంబ గద్వాల: 4 (మల్దకల్‌, అయిజ,

    వడ్డేపల్లి, రాజోలి)

    నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్‌)

    వనపర్తి: 5 (వనపర్తి,

    కొత్తకోట, మదనాపూర్‌,

    ఆత్మకూర్‌, అమరచింత)

    నేడు 2 విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

    నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్‌ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు.

    మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్‌ నిర్వహించడం లేదు.

    ఉమ్మడి జిల్లాలో

    45 మంది సర్పంచ్‌లు,

    1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం

    520 జీపీలు..

    4,202 వార్డులకు పోలింగ్‌

    అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

    ఉదయం 7 గంటలకు షురూ..

    ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

    8,33,132 మంది ఓటర్లు..

    రెండో విడతలో పోలింగ్‌ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

  • పోలింగ్‌ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలి

    కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

    నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ. మరికల్‌ మండలాల పరిధిలో ఆదివారం జరిగే రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. శనివారం ఆమె ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్‌లో విధులు నిర్వహించిన వారిలో కొందరు రెండోవిడత నియమింపబడ్డారని, విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్‌ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా బ్యాలెట్‌ పత్రాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే జోనల్‌, రూట్‌ అధికారులకు తెలియజేయాలని, ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటిస్తూ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించే అవకాశం ఉందని, పోలింగ్‌ కేంద్రాల్లో కెమెరాలను ఎవరూ నిలిపివేయరాదని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి పోలీసులకు ప్రవేశం లేదని, కేంద్రాల ఆవరణలోనే బందోబస్తు చేయాలని తెలిపారు. పోలింగ్‌ సిబ్బందితో మాట్లాడటంతో పాటు ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. రూట్‌, జోనల్‌, నోడల్‌ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం 9 ప్రకారం సిబ్బంది తప్పనిసరిగా బ్యాలెట్‌ బాక్స్‌ చెక్‌ చేసుకోవాలన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుందని, మధ్యాహ్నం రెండు తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అబ్జర్వర్‌ ఆదేశాల అనంతరమే ఫలితాలు వెల్లడించాలని సూచించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం అందించిన సామగ్రిని జాగ్రత్తగా సీల్‌చేసి డిపాజిట్‌ చేయాలని పేర్కొన్నారు. కాగా అదనపు కలెక్టర్లు సంచిత్‌ గంగ్వార్‌, శ్రీను దామరగిద్ద, మరికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్‌ వెంట ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉన్నారు.

  • 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు

    సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్దఅదనపు బలగాలు : ఎస్పీ డా. వినీత్‌

    నారాయణపేట: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఎస్పీ డా. వినీత్‌ కోరారు. ఆదివారం నారాయణపేట, దామరిగిద్ద, ధన్వాడ, మరికల్‌ మండలాల్లో రెండోవిడత పోలింగ్‌ జరగనుండగా.. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లో మొత్తం 28 రూట్లు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు 5 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, 5 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌రోజు, కేంద్రాల దగ్గర పాటించాల్సిన నియమాలను వివరించారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పని చేయాలని, కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్‌ స్టేషన్ల దగ్గర 163 (బీఎన్‌ఎస్‌స్‌)యాక్ట్‌ అమలులో ఉంటుందని, 200 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించవద్దని, కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇంక్‌ బాటిల్స్‌, ఇతర హానికర వస్తువులు తీసుకెళ్లకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ఊరేగింపు, ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్‌, రఘునాథ్‌, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Mahabubnagar

  • తగ్గేదేలే.. !

    ఎగిసిన ప్రలోభాలు, తాయిళాలు.. మద్యం

    ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు..

    అంచనాలకు మించిన ఖర్చులతో

    ఆస్తుల తనఖా..

    బెంబేలెత్తుతున్న

    అభ్యర్థులు.. అయినా

    ముందుకే..

    సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో దశలో ఆదివారం ఉమ్మడి పాలమూరులోని 26 మండలాల పరిధిలో 565 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. 46 ఏకగ్రీవం పోనూ 519 జీపీల్లో పోలింగ్‌ జరగనుంది. రెండో విడత ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియగా.. ఆ తర్వాత ప్రలోభ పర్వం ఎగిసిపడింది. మొదటి దశలో జరిగిన ఎన్నికల్లో ఆయా జీపీల్లో అభ్యర్థుల జయాపజయాలు.. లోటుపాట్లను బేరీజు వేసుకున్న రెండో విడత అభ్యర్థులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో మద్యం ఏరులై పారగా.. కుల, మహిళా సంఘాలు, యువత.. ఇలా వర్గాల వారీగా తాయిలాల పంపిణీ జోరుగా సాగింది.

    ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పుంజుకోవడం చూసి కంగుతున్న ఆయా నియోజకవర్గాల్లోని అధికార కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు రెండు, మూడో విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామాలపై ప్రత్యేక నజర్‌ వేశారు. ప్రధానంగా మలి విడతలో కారు, కమలం పొత్తు.. రెబల్స్‌ ప్రభావం.. ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు వంటి వాటితో పాటు ఆయా పల్లెల్లో ప్రభావిత వర్గాల సమాచారాన్ని తెలుసుకుని..అందుకనుగుణంగా ముందుకు సాగారు. ఈ మేరకు వారే నేరుగా ఆయా వర్గాలకు చెందిన ముఖ్యులతో మాట్లాడడంతోపాటు పలు రకాల హామీలు గుప్పించినట్లు సమాచారం. ప్రత్యర్థి పక్షంలోని తమ సన్నిహితులైన గ్రామ స్థాయి నాయకులతోనూ టచ్‌లో ఉంటూ పరిస్థితులను చక్కబెట్టేలా మంత్రాంగం నడిపించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థి వర్గాలు సైతం పై ఎత్తులతో ముందుకుసాగినట్లు తెలుస్తోంది

    ఒక్కో చోట.. ఒక్కో రేటు

    రెండో విడతలో పలు గ్రామాల్లో అధికార, ప్రతిపక్షాలు బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న క్రమంలో ప్రలోభాల పర్వం ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగిసిన శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు పలు పల్లెల్లో వార్డులు, కూడళ్ల వారీగా విందులు.. వర్గాల వారీగా మద్యం పంపిణీ.. మహిళలకు చీరల వంటి పంపిణీని నిఘా కళ్లు తప్పించి పూర్తి చేశారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో యూత్‌కు క్రీడా సామగ్రి పంపిణీతో పాటు మద్యం బాటిళ్లు అందజేశారు. ప్రత్యర్థి మద్దతుదారులు, బంధువుల ఇళ్లకు అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి దండాలు పెట్టడంతో పాటు ఓటుకు ఇంత చొప్పన ఎందరు ఉంటే అందరికీ లెక్కలేసి ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ఓటుకు అత్యల్పంగా రూ.500.. అత్యధికంగా రూ.3 వేల చొప్పున అందజేసినట్లు సమాచారం. ఈ రేటు ఒక్కో పల్లెలో ఒక్కోరకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక శాతం గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి.. ఒక్క క్వార్టర్‌, కొన్ని చోట్ల హాఫ్‌ బాటిల్‌ మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం.

    బెంబేలెత్తుతూనే ముందుకు..

    తొలి విడత సర్పంచ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్‌.. అనూహ్య ఫలితాలతో బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు ఎవరికి వారు రెండు, చివరి విడత గ్రామాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతుదారులు ఎక్కడా తగ్గని పరిస్థితులు నెలకొన్నాయి. అంచనాలకు మించి రెట్టింపు ఖర్చులు అవుతుండడంతో బెంబేలెత్తుతున్నారు. ఎన్నికల కోసం ముందస్తుగా సమకూర్చుకున్న మొత్తం అయిపోవడంతో కొందరు అభ్యర్థులు ఆస్తులు, నగలు తనఖా పెట్టి నగదు తెచ్చి..పంచుతున్నారు. అయినా తగ్గేదేలే అన్నట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చివరి దశ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. రోజుకు మద్యం ఇతరత్రా ఖర్చులతో అభ్యర్థులకు ఇప్పటికే తడిసిమోపైడెంది. అసలు ఘట్టం ముందుగా ఉండగా.. ఏం చేయాలో తోచక పలువురు తలపట్టుకుంటున్నారు.

    ● మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని ఓ గ్రామంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి శనివారం రాత్రి పలు వార్డుల్లో ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేశాడు. కాంగ్రెస్‌ మద్దతుదారుడైన సర్పంచ్‌ అభ్యర్థి పోటీగా ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, కార్టర్‌ మద్యం బాటిల్‌ పంచాడు. అయితే ఆదివారం రాత్రి బీఆర్‌ఎస్‌కు చెందిన మద్దతుదారుడు మళ్లీ ఒక్క ఓటర్‌కు క్వార్టర్‌ మద్యం బాటిల్‌, రూ.500 చొప్పున కొందరికి పంచాడు. కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా కొందరికి ఆ విధంగానే పంచాడు. ఆ తర్వాత ఓ వార్డులో లొల్లి మొదలైనట్లు తెలిసింది. తమకు మళ్లీ రాలేదంటూ కొందరు శాపనార్ధాలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

    ● రెండో విడతలో జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి, రాజోలి మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్‌ స్థానాలను కై వసం చేసుకునేందుకు పోటీపడుతున్న అభ్యర్థులు పలువురు తమ విలువైన భూములను తనఖా పెట్టి అప్పులు చేసినట్లు సమాచారం. మూడో విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఎర్రవెల్లి, మానవపాడు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

    భార్య సర్పంచ్‌.. భర్త ఉప సర్పంచ్‌

    గట్టు: మండలంలోని గొర్లఖాన్‌దొడ్డి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ పదవులు భార్యభర్తలకు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే.. మొదటి విడతలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొర్లఖాన్‌దొడ్డి పోలింగ్‌ జరగగా.. షేకమ్మ అలియాస్‌ శ్వేత తన సమీప అభ్యర్థి జయమ్మపై 287 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసి పోటీపడ్డారు. మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులు ఏకగ్రీవం కాగా.. 5 వార్డుల్లో పోటీ ఏర్పడింది. ఇందులోను సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థి షేకమ్మ పక్షానికి 3 వార్డుల్లో విజయం సాధించగా, మొత్తం 9 వార్డులు సర్పంచ్‌ పక్షం వారు గెలుచుకున్నారు. దీంతో 7వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమైన ఉప్పరి ఆంజనేయులును మిగతా వార్డు సభ్యులు ఉప సర్పంచుగా ఎన్నుకున్నారు. దీంతో గొర్లఖాన్‌దొడ్డి గ్రామంలో భార్య షేకమ్మ సర్పంచ్‌గా, భర్త ఉప్పరి ఆంజనేయులు ఉప సర్పంచ్‌గా ఎంపికయ్యారు.

    ఈ విజయం మీ అందరిదీ..

    ఇంటింటికీ స్వీట్‌ బాక్సులు అందజేసిన సర్పంచ్‌

    నవాబుపేట: తనను సర్పంచ్‌గా గెలిపించిన ఊరందరి నోరు తీపి చేసి కృతజ్ఞతలు తెలిపారు కొత్త సర్పంచ్‌ గీతారాణి. మండల కేంద్రానికి చెందిన గీతారాణీ సర్పంచ్‌గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు నవాబుపేటలో ప్రతి ఇంటికి తిరిగి స్వీట్‌ బాక్సులు అందించి కృతజ్ఞతలు చెప్పారు. గెలిచినందుకు సంతోషంతో తానే మిఠాయిలు తింటే సరిపోదని తన ఊరందరి నోరు తీపి చేస్తేనే అసలైన సంబురమని ఆమె పేర్కొన్నారు.

    జుట్టు కత్తిరించి.. ఓటు పట్టి

    మానవపాడులో ఓ సర్పంచ్‌ అభ్యర్థి వినూత్న ప్రచారం

    నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ

    ఇంటింటికి తిరిగి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో గ్రామంలోని హెయిర్‌ సెలూన్‌ వద్ద ఓ వ్యక్తికి కటింగ్‌ చేసి ఓటు అభ్యర్థించడం ఆకట్టుకుంది.

    – మానవపాడు

  • హ్యాండ్‌బాల్‌ ఫైనల్‌కు పాలమూరు జట్లు

    బాల, బాలికల విభాగాల్లో జిల్లా జట్ల సత్తా

    నేడు ముగియనున్న అండర్‌– 19 టోర్నీ

    మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలో జరుగుతున్న స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌– 19 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఉమ్మడి పాలమూరు జట్లు సత్తా చాటి ఫైనల్‌కు చేరుకున్నాయి. బాలుర విభాగం మ్యాచ్‌లను హీరా మోడల్‌ స్కూల్‌ మైదానం, బాలికల మ్యాచ్‌లను మహబూబ్‌నగర్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన బాలుర విభాగం సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జిల్లా జట్టు 13–6 గోల్స్‌ తేడాతో కరీంనగర్‌ జట్టుపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్‌లో వరంగల్‌ జట్టు 14–6 తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. బాలికల విభాగం సెమీఫైనల్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 5– 2 గోల్స్‌ తేడాతో కరీంనగర్‌ జట్టుపై, మరో సెమీస్‌లో వరంగల్‌ జట్టు 14– 6 తేడాతో ఖమ్మం జట్టుపై గెలుపొందాయి. టోర్నమెంట్‌ నేటి(ఆదివారం)తో ముగియనుంది.

    లీగ్‌ మ్యాచ్‌ల వివరాలు..

    బాలుర విభాగం లీగ్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 10– 4 గోల్స్‌ తేడాతో నిజామాబాద్‌ జట్టుపై గెలుపొందగా, మరో మ్యాచ్‌లో జిల్లా జట్టు 15– 8 తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచుల్లో ఖమ్మం జట్టు 13– 10 గోల్స్‌ తేడాతో మెదక్‌పై, రంగారెడ్డి జట్టు 8– 7 తేడాతో నిజామాబాద్‌పై, మెదక్‌ జట్టు 7– 2 తేడాతో నల్లగొండపై, హైదరాబాద్‌ జట్టు 7– 6 తేడాతో ఆదిలాబాద్‌పై, వరంగల్‌ జట్టు 13– 1 తేడాతో నల్లగొండపై, కరీంనగర్‌ జట్టు 14– 6 తేడాతో ఖమ్మంపై, వరంగల్‌ జట్టు 13– 8 తేడాతో ఖమ్మంపై, కరీంనగర్‌ జట్టు 7– 1 తేడాతో మెదక్‌పై, హైదరాబాద్‌ జట్టు 6– 4 తేడాతో నిజామాబాద్‌పై గెలుపొందాయి. బాలికల విభాగం లీగ్‌ మ్యాచుల్లో మహబూబ్‌నగర్‌ జట్టు 12– 5 గోల్స్‌ తేడాతో మెదక్‌పై, మరో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 5– 0 గోల్స్‌ తేడాతో నిజామాబాద్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచుల్లో ఖమ్మం జట్టు 8– 5 గోల్స్‌ తేడాతో మహబూబ్‌నగర్‌ జట్టుపై, కరీంనగర్‌ జట్టు 17– 0 తేడాతో నల్లగొండపై, ఖమ్మం జట్టు 13– 2 తేడాతో మెదక్‌పై, ఆదిలాబాద్‌ జట్టు 9– 6 తేడాతో నల్లగొండపై, రంగారెడ్డి జట్టు 2– 1 తేడాతో నిజామాబాద్‌పై, వరంగల్‌ జట్టు 13– 5 తేడాతో హైదరాబాద్‌పై, ఖమ్మం జట్టు 12– 3 తేడాతో రంగారెడ్డిపై, వరంగల్‌ జట్టు 9– 0 తేడాతో నల్లగొండపై విజయం సాధించగా ఆదిలాబాద్‌– కరీంనగర్‌ జట్లు చెరో 5 గోల్స్‌ చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.

  • సిలిండర్‌ పేలిన ఘటనలో మరో మహిళ మృతి

    ధరూరు: మండల కేంద్రంలో ఈ నెల 6న గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో మరో మహిళ కుర్వ సునీత (23) శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్స పొందుతున్న ముగ్గురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు సునీత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త వెంకటేష్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ డీఆర్‌ విజయ్‌కుమార్‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే ప్రమాదంలో గాయపడిన తల్లీకొడుకులు (అశ్విని ఆమె ఏడాదిన్నర కుమారుడు) ఈ నెల 10న కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

    మూడుకు చేరిన మృతుల సంఖ్య

  • బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

    అమరచింత: బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న అమరచింతకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. అమరచింతకు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌ పెద్దకుమారుడు శరత్‌ (24) రెండేళ్లుగా బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఐదురోజుల క్రితం బెంగళూరులో తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి బయటికి వెవెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఈ విషయాన్ని ఇతర స్నేహితులు శరత్‌ తండ్రి చంద్రశేఖర్‌కు రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తమ బంధువులు, యువకుడి స్నేహితుల గ్రామాల్లో వాకబు చేశారు. చివరకు శరత్‌ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లారు. అయితే, రోడ్డు ప్రమాదంలో శరత్‌ మృతదేహం ఛిద్రమైందని.. కొన్ని వస్తువులను గుర్తించి అవి తన కుమారుడివే అని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అందించారు. ఇదిలాఉండగా, మృతుడు శరత్‌ ఐదు రోజుల క్రితం తన మొబైల్‌ నుంచి చెల్లెలికి రూ.3 లక్షల పంపడం, అదే రోజు తండ్రికి ఫోన్‌ చేసినా తండ్రి ఎత్తకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం రాత్రి భోజనం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన శరత్‌ తన మొబైల్‌ను రూంలోనే ఉంచి బయటకు వెళ్తున్నానని చెప్పి ఇలా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

  • ‘స్వగ్రామాలే’ సవాల్‌..!

    ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు

    జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం

    స్వీయ పర్యవేక్షణతోపాటు వేగుల ద్వారా పావులు

    ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు

    జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్‌ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 31కి పెరిగింది.

    వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపొందారు.

    ..ఇలా తొలి విడత సం‘గ్రామం’లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్‌ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్‌ఎస్‌ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్‌గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం..

    – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

    తూడుకుర్తి: నువ్వా.. నేనా..

    నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్వగ్రామం తూడుకుర్తి. నాగర్‌కర్నూల్‌ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్‌ పదవి అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్‌ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ బలపరిచిన లక్ష్మీ, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్‌రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. దామోదర్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన ‘కారు’లోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    పురుషులు : 2658, మహిళలు 2706; మొత్తం ఓటర్లు: 5364

    ప్రభావిత వర్గాలు.. బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్‌, ఉప్పరి

    దమగ్నాపూర్‌: ఇద్దరూ.. ఇద్దరే

    దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్‌ సర్పంచ్‌ అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్‌ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్‌ఎస్‌ బలపరిచిన ఇ.పావని సర్పంచ్‌గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    పురుషులు : 848, మహిళలు 856; మొత్తం ఓటర్లు: 1704

    ప్రభావిత వర్గాలు.. రెడ్డి, యాదవ, గొల్ల, బోయ, ఎస్సీ

    పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..

    రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్‌ అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలపరిచిన ఉడుతల భాస్కర్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు గొంది నిరంజన్‌ రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ యాదవ్‌ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్‌రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్‌ యాదవ్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు.

    పురుషులు : 1071, మహిళలు 1021; మొత్తం ఓటర్లు: 2092 ప్రభావిత వర్గాలు..

    యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి

    దన్వాడ: అత్తాకోడళ్ల మధ్యే..!

    నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్‌లుగా కాంగ్రెస్‌ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్‌ఎస్‌కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్‌రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్‌ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    పురుషులు : 4034, మహిళలు 4293; మొత్తం ఓటర్లు: 8347

    ప్రభావిత వర్గాలు..

    పద్మశాలి, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్‌, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి

    పుల్లూరు:ఎవరి ధీమా వారిది

    టు అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, అటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామ సర్పంచ్‌ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ సర్పంచ్‌ స్థానానికి మొత్తం నలుగురు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు సునీత, కాంగ్రెస్‌ బలపరిచిన సువర్ణతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఉమామహేశ్వరి, కవిత పోటీలో నిలిచారు. ప్రధానంగా సునీత, సువర్ణ మధ్యే పోటీ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌కు చెందిన వారు కావడం.. చల్లా స్కెచ్‌తో తన గెలుపు ఖాయమని సునీత ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం తనకు కలిసి వస్తుందని సువర్ణ భావిస్తున్నారు.

    పురుషులు : 1369, మహిళలు 1416; మొత్తం ఓటర్లు: 2785

    ప్రభావిత వర్గాలు..

    ఎస్సీ, వాల్మీకి, ముస్లిం, కురువ, ముదిరాజ్‌

    తూడుకుర్తి పంచాయతీ కార్యాలయం

  • రెండో
    నేడు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

    సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్‌.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్‌ సామగ్రిని అందజేశారు.

    520 సర్పంచ్‌లకు 1,709 మంది పోటీ..

    ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్‌ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్‌నగర్‌, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    రెండో విడతలో ఇలా..

    జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్‌ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్‌ బరిలో

    సర్పంచ్‌లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది..

    మహబూబ్‌గర్‌ 151 9 142 474 1,334 267 1,065 2,811

    నాగర్‌కర్నూల్‌ 151 4 147 473 1,412 143 1,269 3,228

    నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755

    వనపర్తి 94 5 89 294 850 148 702 1,769

    జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263

    మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826

    2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు..

    2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా..

    జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

    మహబూబ్‌నగర్‌ 94,975 96,998 4 1,91,977

    నాగర్‌కర్నూల్‌ 1,27,142 1,26,602 5 2,53,749

    జో.గద్వాల 55,710 57,094 3 1,12,807

    వనపర్తి 61,553 62,726 2 1,24,281

    నారాయణపేట 73,674 76,642 2 1,50,318

    నాగర్‌కర్నూల్‌: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌,

    పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట)

    మహబూబ్‌గర్‌: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్‌,

    హన్వాడ, కోయిల్‌కొండ)

    జోగుళాంబ గద్వాల: 4 (మల్దకల్‌, అయిజ,

    వడ్డేపల్లి, రాజోలి)

    నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్‌)

    వనపర్తి: 5 (వనపర్తి,

    కొత్తకోట, మదనాపూర్‌,

    ఆత్మకూర్‌, అమరచింత)

    నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్‌ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు.

    మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్‌ నిర్వహించడం లేదు.

    ఉమ్మడి జిల్లాలో 45 మంది

    సర్పంచ్‌లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం

    520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్‌

    అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

    ఉదయం 7 గంటలకు షురూ..

    ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

    8,33,132 మంది ఓటర్లు..

    రెండో విడతలో పోలింగ్‌ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

  • ఆరు క

    పరిశీలించిన కలెక్టర్‌ విజయేందిర

    జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 142 సర్పంచ్‌ స్థానాలు, 1,065 వార్డులకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ఆరు కేంద్రాల్లో పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. చిన్నచింతకుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, దేవరకద్రలోని మార్కెట్‌యార్డు, హన్వాడలోని బాలిక పాఠశాల, కోయిలకొండలో రైతు వేదిక, కౌకుంట్లలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మిడ్జిల్‌లో ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీల వారీగా కేటాయించిన పీఓలు, ఓపీఓలకు సామగ్రిని పంపినీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయేందిర, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయనీదేవిలు వేర్వేరుగా దేవర కద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల పోలింగ్‌ సామ గ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చా రు. పోలింగ్‌ సిబ్బందిని తరలించేందుకు మొత్తం 148 వాహనాలను అందుబాటులో ఉంచారు.

    ● రెండో విడత పోలింగ్‌కు సంబంధించి 151 మంది రిటర్నింగ్‌ అధికారులను నియమించడంతో పాటు 13 రిజర్వ్‌తో కలిపి 164 ఆర్‌ఓలను నియమించారు. 1,334 ప్రిసైడింగ్‌ ఆఫీసర్లను, 1,584 మంది ఇతర పోలింగ్‌ సిబ్బందిని, 45 మంది జోన్‌ ఆఫీసర్లను నియమించారు. ఈ విడతలో 48 రూట్లు ఉండగా.. 65 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు.

    ● ఈ విడతలో 58 సమస్యత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. హన్వాడ మండలంలోని టంకర గ్రామ పంచాయతీ పరిధిలో 12, సీసీకుంటలోని ఉంద్యాల 8 , దేవరకద్రలోని నాగారంలో 10, కోయిల్‌కొండ శేరివెంకటపూర్‌లో 8, కౌకుంట్లలోని ఇస్రాంపల్లిలో 8, మిడ్జిల్‌లో 12 పోలింగ్‌స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. 36 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

    ● రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయేందిర ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు కాత్యాయనీదేవితో కలిసి వెబెక్స్‌ నిర్వహించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. వార్డు సభ్యుల సంఖ్య ననుసరించి కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ వీడియోగ్రఫీ నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించాలని, కౌంటింగ్‌ తర్వాత బ్యాలెట్‌ పేపర్‌లు సీల్‌ వేసేప్పుడు కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు.అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ఆర్‌డీఓ నవీన్‌, డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్‌ బాలు పాల్గొన్నారు.

  • ఖాకీల నిఘా

    మహబూబ్‌నగర్‌ క్రైం: రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఖాకీలు గట్టి నిఘా పెట్టారు. 1,334 పోలింగ్‌ కేంద్రాల్లో 1,249 మందిని బందోబస్తు కోసం కేటాయించారు. ఇందులో 36 గ్రామాల్లో 355 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు.49 రూట్‌ మొబైల్స్‌, 16 ఎఫ్‌ఎస్‌టీ, 5 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు కేటాయించిన వారందరూ శనివారం సాయంత్రం నాటికి ఎన్నికల సామగ్రితో సహా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల కోసం ఒక ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 29మంది సీఐలు, 66 మంది ఎస్‌ఐలు, 1,134 మంది ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్‌ విధుల్లో ఉన్నారు.

    ● పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్‌ శాఖ జిల్లావ్యాప్తంగా రూ.11 లక్షల నగదు, 80 మద్యం కేసుల్లో రూ.6.72 లక్షల విలువ చేసే 1 043.43 లీటర్ల మద్యం, ఎన్నికల నియమావళి కేసులు మూడు, నాకా బందీ 55, 37 తుపాకులు డిపాజిట్‌, 448 కేసుల్లో 630 మందిని బైండోవర చేశారు.

    అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

    రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. శనివారం దేవరకద్ర, హన్వాడలో పోలీస్‌ సిబ్బందికి విధులపై సూచనలు చేశారు. రాత్రి టంకర పోలింగ్‌ కేంద్రం వద్ద గస్తీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్‌ జరుగుతున్న సమయంలో అవాంచనీయ ఘటనలు, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటే వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీస్‌ సిబ్బంది చురుకుగా విధులు నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే క్షణం వరకు ప్రతి ఒక్కరూ కేటాయించిన స్థానాల నుంచి పక్కకు వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి పెట్టాలని, ఏదైనా గొడవలు చేయాలని చూసినా, గుంపులుగా నిలబడినా అప్రమత్తంగా ఉంటూ అడ్డుకొని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

    రూ.11 లక్షల నగదు, 1,043 లీటర్ల మద్యం సీజ్‌

    గ్రామాల్లో 630 మంది బైండోవర్‌

    సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

Nagarkurnool

  • రెండో పోరుకు రెడీ
    నేడు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

    సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్‌.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్‌ సామగ్రిని అందజేశారు.

    520 సర్పంచ్‌లకు 1,709 మంది పోటీ..

    ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్‌ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్‌నగర్‌, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    రెండో విడతలో ఇలా..

    జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్‌ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్‌ బరిలో

    సర్పంచ్‌లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది..

    మహబూబ్‌గర్‌ 151 9 142 474 1,334 267 1,065 2,811

    నాగర్‌కర్నూల్‌ 151 4 147 473 1,412 143 1,269 3,228

    నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755

    వనపర్తి 94 5 89 294 850 148 702 1,769

    జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263

    మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826

    2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు..

    2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా..

    జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

    మహబూబ్‌నగర్‌ 94,975 96,998 4 1,91,977

    నాగర్‌కర్నూల్‌ 1,27,142 1,26,602 5 2,53,749

    జో.గద్వాల 55,710 57,094 3 1,12,807

    వనపర్తి 61,553 62,726 2 1,24,281

    నారాయణపేట 73,674 76,642 2 1,50,318

    నాగర్‌కర్నూల్‌: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌,

    పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట)

    మహబూబ్‌గర్‌: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్‌,

    హన్వాడ, కోయిల్‌కొండ)

    జోగుళాంబగద్వాల: 4 (మల్దకల్‌, అయిజ,

    వడ్డేపల్లి, రాజోలి)

    నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్‌)

    వనపర్తి: 5 (వనపర్తి,

    కొత్తకోట, మదనాపూర్‌,

    ఆత్మకూర్‌, అమరచింత)

    నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్‌ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు.

    మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్‌ నిర్వహించడం లేదు.

    ఉమ్మడి జిల్లాలో

    45 మంది సర్పంచ్‌లు,

    1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం

    520 జీపీలు..

    4,202 వార్డులకు పోలింగ్‌

    ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

    రెండో విడతలో పోలింగ్‌ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

    ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

  • ‘స్వగ్రామాలే’ సవాల్‌..!

    ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు

    జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో

    ‘అధికార’ నేతల్లో కలవరం

    స్వీయ పర్యవేక్షణతోపాటు

    వేగుల ద్వారా పావులు

    ఎత్తులకు పైఎత్తులతో

    రసవత్తరంగా మారిన పోరు

    డ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్‌ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపొందారు.

    ..లా తొలి విడత సం‘గ్రామం’లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్‌ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్‌ఎస్‌ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్‌గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

    తూడుకుర్తి: నువ్వా.. నేనా..

    ప్రభావిత వర్గాలు..

    బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్‌, ఉప్పరి

    మహిళలు 2,706

    పురుషులు 2,658

    మొత్తం ఓటర్లు 5,364

    నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్వగ్రామం తూడుకుర్తి. నాగర్‌కర్నూల్‌ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్‌ పదవి అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్‌ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ బలపరిచిన లక్ష్మీ, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్‌రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. దామోదర్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ

  • పకడ్బందీగా వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణ

    సాక్షి, నాగర్‌కర్నూల్‌/ నాగర్‌కర్నూల్‌/ తిమ్మాజిపేట: పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, తిమ్మాజిపేట, కొల్లాపూర్‌, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో రెండో విడత పోలింగ్‌ జరగనుండగా.. మొత్తం 40 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ తీరును పరిశీలించనున్నారు. 42 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఓటింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంచారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, ఓపీఓలు, ఆర్‌ఓ, ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. శనివారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పోలింగ్‌ సామగ్రి పంపిణీని జిల్లా కలెక్టర్‌ సంతోష్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

    గైర్హాజరైతే కఠిన చర్యలు

    ఎన్నికల సామగ్రి పంపిణీ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత పోలింగ్‌ కోసం 1,694 పీఓలు, 2,411 ఓపీఓలతోపాటు వివిధ రకాల బాధ్యతలతో 6 వేల మందికిపైగా సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. ఎన్నికల విధులకు గైర్వాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి వారి పేర్ల వివరాలను సస్పెన్షన్‌కు సిఫారసు చేయాలని తిమ్మాజిపేట మండల ప్రత్యేకాధికారి, డీఈఓ రమేష్‌కుమార్‌ను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించుకోవాలని చెప్పారు.

  • పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..

    ప్రభావిత వర్గాలు..

    పురుషులు 1,071

    మహిళలు 1,021

    మొత్తం ఓటర్లు 2,092

    యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి

    రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్‌ అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలపరిచిన ఉడుతల భాస్కర్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు గొంది నిరంజన్‌రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ యాదవ్‌ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్‌రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్‌ యాదవ్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు.

  • మండలం కనిష్టం బల్మూరు 9.4 అమ్రాబాద్‌ 9.8 కల్వకుర్తి 9.8

    వణికిస్తున్న చలి

    సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లావ్యాప్తంగా చలిపులి వణికిస్తోంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వరకు చలి వణికిస్తోంది. శనివారం జిల్లాలోని బల్మూరు మండలంలో అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అమ్రాబాద్‌ మండలంలో 9.8, కల్వకుర్తి 9.8, తెలకపల్లిలో 10.1, పదరలో 10.4, లింగాలలో 10.7, తాడూరు మండలంలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటోంది.

  • నిర్వాసితుల పోరాటంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి

    చారకొండ: గోకారం జలాశయంలో భూములు కోల్పోయిన ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని నిర్వాసితులు చేస్తున్న పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అన్నారు. ముంపు నుంచి మినహాయించాలని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలని చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 12వ రోజు చేసుకున్నాయి. రిలే దీక్షలకు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి జక్క బాలయ్య, లక్ష్మీనారాయణ, బసవరాజు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయి ఉన్న ఫలంగా గ్రామాలను వదిలి వెళ్లాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్‌ జలాశయం సామర్థ్యం తగ్గించి, వెంటనే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రద్దు చేస్తూ జీఓ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వారికి న్యాయం చేసే వరకు పౌరహక్కుల సంఘం మద్దతు ఉంటుందని చెప్పారు. అక్కడి నుంచి గతంలో గోకారం చెరువును ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించారు. చెరువును ధ్వంసం చేయడం వల్ల ఎంతో మంది మత్స్యకారులు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.

  • ధన్వాడ: అత్తాకోడళ్ల మధ్యే..!

    నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్‌లుగా కాంగ్రెస్‌ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్‌ఎస్‌కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్‌రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్‌ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    ప్రభావిత వర్గాలు..

    పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్‌, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి

    పురుషులు 4,034

    మహిళలు 4,293

    మొత్తం ఓటర్లు 8,327

  • దమగ్నాపూర్‌: ఇద్దరూ.. ఇద్దరే

    దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్‌ సర్పంచ్‌ అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్‌ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్‌ఎస్‌ బలపరిచిన ఇ.పావని సర్పంచ్‌గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయా వకాశాలు ఉన్నట్లు తెలు స్తోంది.

Andhra Pradesh

  • నిడదవోలు: ఆకాశానంటుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలతో పప్పు ధాన్యాలు, అపరాలు, పంచదార కూడా కొనలేని పరిస్థితితో పేద ప్రజలు లబోదిబోమంటున్నారు. ఈ వారం మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలను పరిశీలిస్తే ప్రతి వస్తువుపై కిలో రూ.10 నుంచి రూ.30లు పెరగడంతో పప్పుల జోలికే సామాన్య, మధ్య తరగతి ప్రజలు వెళ్లలేకపోతున్నారు. నూనె ధరలు పెరగడం కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయని వారు వాపోతున్నారు. 

    ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మకాలు 
    పట్టణంలో ఉన్న పలు దుకాణాల్లో వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక షాపులో ఉన్న ధర మరొక షాపులో ఉండట్లేదు. ప్రస్తుతం మార్కెట్లో హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వారికి ఇష్టం వచ్చిన ధరలకు అపరాలు, నిత్యవసరాలు విక్రయిస్తున్నా పౌర సరఫరాల శాఖాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

    జీఎస్టీ తగ్గినా పాత ధరలే.. 
    నిత్యవసరాలు సరకులపై జీఎస్టీ తగ్గినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వం తగ్గించిన కొత్త స్లాబులు అమలుకు నోచుకోవడం లేదు. మార్కెట్లో నిత్యావసరాల వస్తువులను పాత ధరలతోనే అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఇదే పరిస్థితి నెలకొనడంతో కొందరు వ్యాపారులు జీఎస్టీ తగ్గింపు విధానాన్ని బహిష్కరించినట్లుగా కనిపిస్తుంది. 

    కొందరు ఉద్యోగులు, విద్యావంతులు సరకుల ధరలు, సబ్బులు, వంట నూనెలపై జీఎస్టీ తగ్గించాలని వ్యాపారస్తులను ప్రశ్నిస్తున్నా.. వంట నూనెలకు జీఎస్టీ తగ్గించలేదని వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. ఆన్‌లైన్‌లో ఒక రకం ధరలు క్షేత్రస్థాయిలో మరో రకం ధరలు అమలు చేస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.  

    కానరాని నిబంధనలు  
    ప్రతీ దుకాణం వద్ద తగ్గిన నిత్యావసర ధరలను ప్రదర్శించాలని జిల్లా అధికారులు సంబంధిత కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దుకాణాదారులను ఆదేశించారు. అయితే, చాలా చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యాపారులు, దుకాణదారులు అసలు జీఎస్టీ ఊసే ఎత్తడం లేదు. ధరల వ్యత్యాసాలపై ఎవరైనా వినియోగదారుడు వ్యాపారులను ప్రశ్నిస్తే ఇంకా అమలు కావడం లేదని, అమలు తర్వాత జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుందని కొనుగోలుదారులను నిలువునా ముంచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ధరల దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోతుందని మధ్య తరగతి, పేద ప్రజలు వాపోతున్నారు. 

    కందిపప్పు ఇవ్వకపోవడంతో.. 
    కందిపప్పు ధరలు ఆకాశానంటుతున్నాయి. రేషన్‌ దుకాణాల ద్వారా అందిస్తున్న కందిపప్పును ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం నిలిపివేసింది. రేషన్‌ షాపుల్లో తెలుపు కార్డుదారులకు కిలో రూ.67 కందిపప్పు అందించేవారు. అయితే, గత 10 నెలల నుంచి కందిపప్పు ఇవ్వకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ¯ð లబ్ధిదారుడు కందిపప్పు తీసుకునేందుకు రేషన్‌ షాపులకు వెళ్లగా.. కందిపప్పు ఇవ్వడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. 

    నిడదవోలు పట్టణంలో 11,208, పెరవలి మండలంలో 22,463, ఉండ్రాజవరం మండలంలో 21,912, నిడదవోలు మండలంలో 23,912 తెలుపు కార్డులు ఉన్నాయి. ఇలా ప్రతీ వస్తువుపై ధరలు పెరిగిపోవడం పనులు లేక కూలీలు, పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ఆదాయ వనరుల బట్టి కుటుంబ పోషణకే కష్టమవుతున్న పరిస్థితుల్లో ఆడంబరాలకు దూరంగా బాధతో ఉంటున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    రేషన్‌ షాపుల్లో కందిపప్పు ఇవ్వాలి 
    ధరలు పెరిగిపోవడంతో ఏమీ కొనలేక పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కందిపప్పును రేషన్‌ షాపుల్లో తక్కువ ధరకు ఇవ్వాలి. జీఎస్టీ ధరలు ఎక్కడా కూడా అమలు చేయడం లేదు. పేదలు పప్పులు కొనాలంటేనే ధరలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీ పనులు చేసుకునే మాలాంటి వాళ్లం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. 
    – మర్రిపూడి విజయ, గృహిణి, నిడదవోలు. 

Hyderabad

  • ఉప్పల

    అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం

    సాక్షి, సిటీబ్యూరో:

    హా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్‌ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్‌ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా తాజ్‌ ఫలక్‌నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌లో పాల్గొ న్నా రు. అనంతరం ఆయన ఉప్పల్‌ స్టేడియానికి వచ్చా రు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం ను ంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్‌ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు. వీవీఐపీలు, ఫుట్‌బాల్‌ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్‌ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది.

    మ్యూజిక్‌.. మ్యాజిక్‌..

    ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్‌ సిప్లీగంజ్‌, గాయని మంగ్లీ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. ఆస్కార్‌ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్‌ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్‌ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్‌ సాంగ్స్‌ తో మంగ్లీ మెస్మరైజింగ్‌ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు.

    ఫలించిన పోలీసుల వ్యూహం..

    ఉప్పల్‌: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్‌ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్‌, పాస్‌లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్‌ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. కాగా.. గతంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్‌ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుధీర్‌ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్‌ను ధరించి వెళ్లడం కనిపించింది.

    మెస్సీ పర్యటన సాగిందిలా..

    సాయంత్రం 4:35 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన మెస్సీ

    5:28: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు రాక

    7:31: ఫలక్‌నుమా నుంచి ఉప్పల్‌కు..

    రాత్రి 8.33 పెనాల్టీ షూట్‌ అవుట్‌

    8.38: మైదానంలో మెస్సీ పరేడ్‌ వాక్‌.. పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, క్రీడాకారులు

    8.48 : వేదికపై మెస్సీతో ప్రముఖుల పరిచయం

    8.51: మెస్సీతో ఫొటో సెషన్‌

    8.53 ముగిసిన మ్యాచ్‌.. విజేతకు బహుమతి ప్రదానం చేసిన మెస్సీ

    8.54: మెస్సీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘన సత్కారం

    8.55– ఇతర క్రీడాకారులకు సన్మానం, కార్యక్రమం ముగింపు

    9:26: తాజ్‌ ఫలక్‌నుమాకు చేరుకున్న మెస్సీ.

    ఉప్పల్‌ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానులు

    స్టేడియంలో లేజర్‌ షో వెలుగు జిలుగులు

    మెస్సీ, సీఎం ఫ్రెండ్లీ మ్యాచ్‌ దిగ్విజయం

    ఫుట్‌బాల్‌ ఆటతో అలరించిన ద్వయం

    ప్రేక్షకుల ఉత్సాహంతో ఆద్యంతం కోలాహలం

  • రెండో విడతకు రె‘ఢీ’

    చేవెళ్ల, కందుకూరు డివిజన్లలో ఎన్నికలు

    పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

    నేడు రంగారెడ్డి జిల్లాలో మలిదశ పంచాయతీ పోరు

    ఆమనగల్లు/చేవెళ్ల: రెండో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. కందుకూరు డివిజన్‌లోని 3 మండలాలు, చేవెళ్ల డివిజన్‌లో 4 మండలాల్లో ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కందుకూరు డివిజన్‌ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్‌ మండలాల పరిధిలోని 61 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆమనగల్లు మండలంలో 13 సర్పంచ్‌ స్థానాలకు గాను ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా మిగిలిన 12 చోట్ల 40 మంది అభ్యర్థులు, 112 వార్డులకు 20 ఏకగ్రీవం కాగా 92 స్థానాలకు 258 మంది పోటీలో ఉన్నారు. కడ్తాల్‌ మండలంలో 24 సర్పంచ్‌ స్థానాలకు నాలుగు ఏకగ్రీవం కాగా 20 సర్పంచ్‌ స్థానాలకు 59 మంది, 210 వార్డులకు 52 వార్డులు ఏకగ్రీవం కాగా 158 స్థానాలకు 453 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. తలకొండపల్లి మండలంలో 32 పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా మిగిలిన 29 సర్పంచ్‌ స్థానాలకు 85 మంది, 272 వార్డులకు గాను 49 వార్డులు ఏకగ్రీవం కాగా 223 వార్డులకు 567 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చేవెళ్ల డివిజన్‌ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌, శంకర్‌పల్లి మండలాల్లో 109 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలంలో 25 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 23 పంచాయతీలకు 68 మంది అభ్యర్థులు, మొయినాబాద్‌ మండలంలో 19 పంచాయతీ సర్పంచ్‌లకు 59 మంది, షాబాద్‌లో 41 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా 40 గ్రామాల్లో 111 మంది అభ్యర్థులు, శంకరపల్లి మండలంలో 24 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 22 చోట్ల సర్పంచ్‌ పదవికి 64 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చేవెళ్ల మండలంలో 183 వార్డులకు 469 మంది అభ్యర్థులు, మొయినాబాద్‌ మండలంలో 157 వార్డులకు 434 మంది, షాబాద్‌ మండలంలో 305 వార్డులకు 794 మంది, శంకర్‌పల్లి మండలంలో 188 వార్డులకు 463 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద శనివారం సిబ్బందికి అధికారులు సామగ్రి అప్పగించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల కౌంటింగ్‌ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈమేరకు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

    కడ్తాల్‌: ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందజేస్తున్న అధికారులు

    ఎన్నికలు జరగనున్న మండలాలు: 7

    మొత్తం సర్పంచ్‌ స్థానాలు: 165

    మొత్తం వార్డు స్థానాలు: 1,306

    బరిలో ఉన్న సర్పంచ్‌ అభ్యర్థులు: 499

    పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు: 3,508

    పోలింగ్‌ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

  • నడక దారుల కోసం..

    ఆధునిక సాంకేతికతతో అధ్యయనం

    సీఆర్‌ఎంపీ రెండో దశలో 3,805 లేన్‌ కిలోమీటర్ల పనులు

    సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) కాంట్రాక్టు ముగిసి దాదాపు ఏడాది కావస్తోంది. తిరిగి కాంట్రాక్టు ఏజెన్సీని నియమించలేదు. రెండో దశ కింద ప్రధాన రహదారుల్లోని రోడ్లే కాక, ఇతరత్రా ముఖ్యమైన రోడ్లను సైతం కలిపి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అందుకయ్యే వ్యయం, తదితరాలను పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ అనుమతి రాగానే తిరిగి కాంట్రాక్టు కోసం ఏజెన్సీలను ఆహ్వానించనున్నారు. ఈసారి ప్రధాన రహదారుల్లోని బీటీ రోడ్లే కాక సీసీ, వీడీసీసీ ఇతరత్రా రోడ్లను సైతం సీఆర్‌ఎంపీ కిందకు తేనున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలకు రహదారులతో పాటు పాదచారులు నడిచేందుకు నడకదారులు కూడా బాగుండాలనే తలంపుతో ఉన్నారు. అందుకుగాను రోడ్ల పనులు చేపట్టేనాటికే నడకదారుల సామర్థ్యం తదితరమైవి తెలుసుకోవడంతో పాటు కొత్తగా నడకమార్గాలు వచ్చే ప్రాంతాల్లోనూ నేల స్వభావం తదితరమైనవి తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతికత వినియోగంతో సర్వే చేయాలని భావిస్తున్నారు. సర్వే నిర్వహించేందుకు ముందుకొచ్చే సంస్థల కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు.

    దీర్ఘకాలం మన్నికగా ఉండేలా..

    సర్వే కోసం నెట్‌వర్క్‌ సర్వే వె హికల్‌ (ఎన్‌ఎస్‌వీ–3డీ) ఫాలింగ్‌ వెయిట్‌ డిఫ్లెక్టోమీటర్‌(ఎఫ్‌డబ్ల్యూడీ), గ్రౌండ్‌ పెనేట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) వంటి ఆధునిక సాంకేతికత వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయాలనేది లక్ష్యం. నగరంలో వాహన రద్దీ పెరిగిపోవడం, వివిధ యుటిలిటీల కోసం రోడ్లను తరచూ తవ్వుతుండటం వంటి పనులతో రోడ్లు, నడకమార్గాలు కూడా తరచూ దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో రోడ్ల పరిస్థితులను కూడా అంచనా వేసి దీర్ఘకాలం మన్నిక ఉండేలా నడకమార్గాలు నిర్మించేందుకు సాంకేతిక సర్వేకు సిద్ధమయ్యారు. దాదాపు 3,805 లేన్‌ కిలోమీటర్ల మేరకు నడక మార్గాల కోసం ఆధునిక సాంకేతికతతో సర్వే జరిపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

  • కొత్తబండికీ కొర్రీలు
    దళారుల ద్వారా వస్తే సరే...లేదంటే వెనక్కి

    సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరికి చెందిన సదానంద్‌ రెండు రోజుల క్రితం తన కొత్త ద్విచక్ర వాహనం శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఉప్పల్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సంప్రదించారు. నిబంధనల మేరకు స్లాట్‌ నమోదు చేసుకుని వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో వెళ్లారు. కానీ బండి నమోదుకు అవసరమైన మొత్తం పత్రాలు లేవంటూ తిప్పి పంపించారు. దాంతో అతడు మరోసారి షోరూమ్‌లో సంప్రదించాల్సి వచ్చింది. వాహనానికి సంబంధించిన తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌)పత్రాలతో పాటు ఇన్వాయీస్‌, బీమా పత్రాలు సహా అన్నింటిని మరోసారి పరిశీలించుకుని ఆధార్‌, పాన్‌కార్డుతో పాటు చిరునామా ధృవీకరణ కోసం వంటగ్యాస్‌ కనెక్షన్‌ పత్రాలను కూడా తీసుకుని మరోసారి ఉప్పల్‌ ఆర్టీఏకు వెళ్లారు. వంట గ్యాస్‌ పత్రాలు ఒరిజినల్‌ కావాలంటూ మరోసారి మెలిక పెట్టి వెనక్కి పంపించారు. ఇది ఒక్క ఉప్పల్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మాత్రమే కాదు, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చాలా చోట్ల ఇదే పరిస్థితి. అన్ని రకాల డాక్యుమెంట్‌లతో స్వయంగా వెళ్లే వాహనదారులను ఆర్టీఏ సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏజెంట్‌లు, దళారుల ద్వారా వెళ్లేవారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. పాన్‌కార్డు, ఆధార్‌ వంటి బలమైన ధృవీకరణ పత్రాలు ఉన్నప్పటికీ ఏదో ఒక నెపంతో కొర్రీలు వేసి వేధింపులకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

    షోరూమ్‌లలోనూ చేతివాటమే...

    ఆర్టీఏ కార్యాలయాల్లోనే కాకుండా వాహనాల షోరూమ్‌లలోనూ కొత్త బండ్లపైన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హ్యాండ్లింగ్‌ చార్జీల పేరిట, యాక్సెసరీస్‌ పేరిట బైక్‌లు, కార్లు, తదితర వాహనాలపై రూ.5000 నుంచి రూ.20 వేల వరకు అదనపు దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణంగా వాహనం కొనుగోలు సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు, ఆర్టీఏ కార్యాలయంలో బండి శాశ్వత నమోదు ఫీజులను కూడా షోరూమ్‌లోనే చెల్లిస్తారు. మరో రూ.3000 అదనంగా వసూలు చేసి షోరూమ్‌ నుంచి ఏజెంట్‌ను ఏర్పాటు చేస్తారు. నిజానికి కొత్త వాహనానికి అన్ని పత్రాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఏజెంట్‌ల అవసరం ఉండదు. వాహనదారులు బండి కొనుగోలు చేసిన తర్వాత నెల రోజుల వ్యవధిలో తమకు వీలైనప్పుడు స్లాట్‌ నమోదు చేసుకుని ఆర్టీఏ అధికారులను సంప్రదించవచ్చు. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి సదరు వాహనం చాసీస్‌ నెంబర్‌, ఇంజన్‌ నెంబర్‌, తదితర వివరాలను, డాక్యుమెంట్‌లను పరిశీలించి శాశ్వత నమోదుకు అవకాశం కల్పించాలి. షోరూమ్‌ ఏజెంట్‌లు లేదా దళారులకు రూ.3000 నుంచి రూ.5000 వరకు చెల్లించి రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది. కానీ ఏజెంట్‌లతో కాకుండా స్వయంగా వెళ్లే వాహనదారులకు మాత్రం ఏదో ఒక పత్రం లేదంటూ (అన్నీ ఉన్నా) వేధించి వెనక్కి పంపిస్తారు. దీంతో సదరు వాహనదారుడు అనివార్యంగా ఏజెంట్‌ను లేదా దళారిని ఆశ్రయించాల్సి వస్తుంది. సిటీలో 2500 నుంచి 3000 లకు పైగా వాహనాలు నమోదవుతున్నాయి.

    అన్ని రకాల పత్రాలున్నా ఏదో ఒక సాకుతో వేధింపులు

    గ్రేటర్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఇదే దందా...

    షోరూమ్‌లలో శాశ్వత నమోదుకు అవకాశం లేకపోవడమే కారణం...

    షోరూమ్‌ రిజిస్ట్రేషన్‌లు ఏమైనట్లు..

    కేంద్రం అమల్లోకి తెచ్చిన రహదారి భద్రతా చట్టంలో కొత్త వాహనాలకు షోరూమ్‌లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌ సదుపాయం కల్పించాలని సూచించారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నాలుగైదేళ్లుగా షోరూమ్‌లలోనే వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ పత్రాలతో పాటు హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌ను కూడా అమర్చి బండిని కొనుగోలుదారుడికి అప్పగిస్తున్నారు. ఒకసారి వాహనం కొనుగోలు చేసిన తరువాత పదే పదే ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఈ సదుపాయాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.కొన్ని రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ నాలుగేళ్ల క్రితమే రవాణా అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచకపోవడం గమనార్హం.

  • మన పబ్బులెంత భద్రం.?

    బంజారాహిల్స్‌: నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నెల 31న జరగనున్న ఈ వేడుకల కోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సుమారు 150కి పైగా పబ్‌లు, క్లబ్‌లు, నైట్‌ క్లబ్‌లు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాయి. ఇప్పటికే కలర్‌ఫుల్‌ థీమ్‌లతో ఆకట్టుకునే కార్యక్రమాలతో ఉర్రూతలూగించే బ్యాండ్‌తో హైలెట్‌గా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. సెలబ్రిటీలు, అంతర్జాతీయ డీజేలను రప్పించి ఈ వేడుకలకు సరికొత్త ఆకర్షణ తీసుకొచ్చేందుకు వీరు సిద్ధమయ్యారు. అయితే వారం రోజుల క్రితం గోవాలోని ఓ నైట్‌ క్లబ్‌లో అగ్ని ప్రమాదం జరిగి 25 మంది మృతి చెందారు. అక్కడ ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌ లేకపోవడంతో పాటు భద్రతాపరంగా లోపాలు ఈ ప్రమాదానికి కారణమని నిపుణులు నిర్థారించారు. మరి గ్రేటర్‌ పరిధిలోని మన పబ్‌లు, నైట్‌క్లబ్‌లు ఎంత వరకు భద్రంగా ఉన్నాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రూ.లక్షలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించే పబ్‌లు, నైట్‌ క్లబ్‌ల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లో మాత్రం ఫైర్‌ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవడంలో చేతులెత్తేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ట్రేడ్‌ లైసెన్స్‌లు, ఎకై ్సజ్‌ పోలీసులు మద్యం లైసెన్స్‌లు, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు వేడుకలకు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటుండగా పబ్‌లు, నైట్‌ క్లబ్‌లలో భద్రతపై మాత్రం దృష్టి సారించడం లేదు. పలు పబ్‌లలో ఇప్పటికీ ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు చేసుకోకపోవడం గమనార్హం. ఏదైనా ఘటన జరిగితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గోవా ఘటన జరిగినప్పుడే అధికారులు మేల్కొని ఆయా పబ్‌లు, క్లబ్‌లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికీ వాటి ఊసెత్తడం లేదు. సుమారు 80 శాతం పబ్‌లలో ఫైర్‌ ఎక్విప్‌మెంట్స్‌ లేనట్లు సమాచారం. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్వాహకులు ముందుకు రావడం లేదు. న్యూ ఇయర్‌ వేడుకలకు అనుమతి ఇచ్చే ముందు ఫైర్‌, ఎకై ్సజ్‌,జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసుల నుంచి అనుమతుల పత్రాలు, ఎన్‌ఓసీలు చూపించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో శాఖ ఒక్కో అనుమతి పత్రం ఇస్తుండటంతో నిర్వాహకులు తెలివిగా తప్పించుకుంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడే సంబంధిత అధికారులకు నిబంధనలు గుర్తుకు వస్తున్నాయి. హడావిడిగా వెళ్లి అనుమతులు పరిశీలిస్తున్నారు.

    అంతస్తులను బట్టి అనుమతులు..

    అవుటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల 15 మీటర్ల ఎత్తు నిర్మాణాలకు హైడ్రా ఫైర్‌ స్టేఫ్టీ అనుమతులు ఇస్తోంది. అంతకుమించి ఉంటే నేరుగా ఫైర్‌ డిపార్ట్‌మెంటే అనుమతి ఇవ్వాల్సి ఉంది. దీనిని సాకుగా చూపి సదరు పబ్‌ల నిర్వాహకులు తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా అన్ని పబ్‌లు, నైట్‌ క్లబ్‌లు వేలాది మంది యువతను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గోవా తరహా సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక వైపు హైడ్రా, ఇంకో వైపు పోలీసు, మరో వైపు ఫైర్‌ అధికారులు వీటిపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌తో పాటు ఫైర్‌ లైసెన్స్‌ లేని పబ్‌లను సీజ్‌చేయాల్సిన అవసరం ఉంది. ఒక వేళ అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోతే వెంటనే వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటూ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    80 శాతం పబ్‌లకు లేని ఫైర్‌ సేఫ్టీ

    పట్టించుకోని అధికారులు

    చేతులెత్తేస్తున్న పోలీసులు,

    ఇష్టానుసారంగా అనుమతులు

  • రాచకొండ పోలీసులకు డీజీపీ అభినందనలు

    సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో శనివారం జరిగిన ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ మ్యాచ్‌ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినందుకుగాను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు, సిబ్బందిని డీజీపీ శివధర్‌ రెడ్డి అభినందించారు. ఎలాంటి లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని, వారికి సహకరించిన ఇతర పోలీసు అధికారులను డీజీపీ ప్రశంసించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మెస్సీ మ్యాచ్‌ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటనతో అప్రమత్తమై, అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని, ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అభిమానులు ఎవరూ గ్రౌండ్‌ లోపలికి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ఫుట్‌బాల్‌ క్రీడాభిమానులు, మెస్సీ అభిమానులకు డీజీపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

    ఇద్దరు వ్యక్తుల రిమాండ్‌

    మల్లాపూర్‌: గుట్టు చప్పుడు కాకుండా పాపిస్ట్రా డ్రగ్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం నాచారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం నుంచి చిలుకానగర్‌కు వెళ్లే దారిలో వాహనాల తనీఖీలు చేస్తుండగా రాజస్థాన్‌కు చెందిన రమేష్‌ కుమార్‌, సురేష్‌కుమార్‌ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీపులు వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను సోదా చేయగా పాపిస్రా డ్రగ్‌ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నగరానికి వలసవచ్చి చెంగిచర్లలో ఉంటూ రేలింగ్‌ పని చేస్తున్నట్లు తెలిపారు. మంగళ్‌రామ్‌ అనే వ్యక్తి నుంచి 14.7 కిలోల పాపిస్ట్రాను కోనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి 14.7 కిలోల పాపిస్ట్రా డ్రగ్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

  • ముగిసిన గ్లోబల్‌ సమ్మిట్‌

    కందుకూరు: గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతంగా పూర్తయింది. ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమ్మిట్‌ నిర్వహించింది. 10 నుంచి 13వ తేదీ వరకు ప్రాంగణాన్ని సందర్శించడానికి విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు అనుమతిచ్చింది. ప్రధాన వేదిక పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శనివారం ముగింపు సందర్భంగా ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ, స్పీడీ సీఈఓ ఈవీ నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. భవిష్యత్‌ శ్రేయస్సుకు వర్తమాన పద్ధతులు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన వ్యూహ్యం అనే అంశంపై రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, సెంటర్‌ ఫర్‌ సస్టేయినబుల్‌పై అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ జీవి రామాంజనేయులు, విశ్రాంత ఐఏఎస్‌ ఎంవీ రెడ్డి, వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్‌ ఎస్‌డీ శిఖామణి, పార్మర్స్‌ కార్పొరేషన్‌ ఫౌండర్‌ సీఎస్‌ రెడ్డి, అగ్రి బిజినెస్‌, అగ్రిటెక్‌ నిపుణుడు విజయ్‌ నడిమింటి తదితరులు చర్చించారు. గ్రామీణ తెలంగాణను పట్టణ ప్రాంతానికి అనుసంధానించడం అనే అంశంపై వీసీ డి.రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.నర్సింహారెడ్డి తదితరులతో చర్చా గోష్టి నిర్వహించారు. రైతు సంఘం నాయకులు అన్వేష్‌రెడ్డి, నల్ల వెంకటేశ్వర్లు, ఆదర్శ మహిళా రైతు లావణ్య తదితరులు వ్యవసాయంపై నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. గాయని మంగ్లీ పాటలతో అలరించగా, కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

    చివరిరోజు తరలివచ్చిన సందర్శకులు

    ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

Medak

  • రెండో సంగ్రామం

    రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగనుంది. మధ్యాహ్నం

    2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. కాగా శనివారం వివిధ మండలాలకు ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన గ్రామాలకు సిబ్బంది తరలివెళ్లారు.

    – మెదక్‌జోన్‌

    తేలనున్న భవితవ్యం

    పోటాపోటీగా పంపకాలు

    పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

    142 సర్పంచ్‌,

    1,036 వార్డు స్థానాలకు ఎన్నికలు

    ఉదయం 7 గంటల నుంచి

    మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌

    2 గంటల నుంచి కౌంటింగ్‌

    పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

  • నవోదయ పరీక్ష ప్రశాంతం

    వర్గల్‌(గజ్వేల్‌)/మెదక్‌కలెక్టరేట్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2026–27 విద్యాసంవత్సరంలో వర్గల్‌ జవహర్‌ నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశానికి 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,754 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సిఉండగా 3,967 మంది పరీక్షకు హాజరైనట్లు వర్గల్‌ నవోదయ ప్రిన్సిపాల్‌ దాసి రాజేందర్‌ పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగిందన్నారు. 83.44 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నా రు. సమర్థంగా పరీక్ష నిర్వహణకు సహకరించిన ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, జిల్లావిద్యాధికారులు, సిబ్బంది, పోలీస్‌ యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    జిల్లాల వారీగా విద్యార్థుల హాజరు

  • మల్లన్న కల్యాణానికి రారండీ

    కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల కొంగుబంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మల్లన్న క్షేత్రంలోని జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. తోటబావి ప్రాంగణంలో ప్ర త్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ మండలపంలో మల్లికార్జున స్వామి, కేతలమ్మ, మేడలదేవిని ఉదయం 10.45నిమిషాలకు వివాహమాడనున్నారు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించే కల్యాణోత్సవంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మ ల్లన్న కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారు. శనివారం పీఠా ధిపతులు మహమండలేశ్వర్‌, డాక్టర్‌ మహంత్‌ సిద్ధేశ్వరానందగిరి మహంత్‌ మహస్వామి కొమురవెల్లికి చేరుకున్నారు.

    స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు..

    ఆలయ గర్భగుడిలో మల్లన్న మూల విరాట్‌ వద్ద మొదట కల్యాణ తంతును ప్రారంభించి అదే సమయంలో తోట బావి వద్ద ఉత్సవ విగ్రహాలకు కల్యాణం జరిపిస్తారు. వధువులు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ తరపున మహదేవుని వంశస్తులు, వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు.

    సర్వాంగసుందరంగా కల్యాణ వేదిక

    స్వామివారి కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చలువపందిళ్లు వేశారు. స్వామి వారి రథం పనులు, గుట్టపైన ఎల్లమ్మ ఆలయ అలంకరణ పనులు పూర్తీ చేశారు.

    పటిష్ట బందోబస్తు

    మల్లన్న కల్యాణానికి పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేసినట్లు అదనపు డీసీపీ చంద్రబోస్‌ తెలిపారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బందోబస్తులో అదనపు డీసీపీ, ఏసీపీలు ఇద్దరు, సీఐలు 10మంది , ఎస్‌ఐలు12, కానిస్టేబుల్‌లు మొత్తం 361 సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    కొమురవెల్లిలో నేటి ఉదయం 10:45 గంటలకు..