Archive Page | Sakshi
Sakshi News home page

West Godavari

  • ప్రభుత్వ స్థలాల పరిశీలన

    ఉండి: ఉండి, ఎన్నార్పీ అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలను కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉండి ఆర్‌అండ్‌బీ బంగ్లా, అక్విడెక్టు, ఇరిగేషన్‌ స్థలాలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించి వెంటనే సరిహద్దు రాళ్ళు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కే ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు. స్థలాలు ఆక్రమణలో ఉంటే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి ఆక్రమణలు తొలగించాలని తహసీల్దారు నాగార్జునకు ఆదేశాలు జారీ చేశారు.

    అధినేతతో భేటీ 

    తాడేపల్లిగూడెం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు విభాగం, ఆక్వా కల్చర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు వడ్డి రఘురాం బుధవారం కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు.

    ఆందోళన బాటలో విద్యుత్‌ ఉద్యోగులు

    భీమవరం(ప్రకాశంచౌక్‌): రాష్ట్ర విద్యుత్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం భీమవరంలోని జిల్లా సర్కిల్‌ కార్యాలయం ఎదుట విద్యుత్‌ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళనలో పాల్గొన్నారు. అపరిమితమైన మెడికల్‌ పాలసీని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2004 వరకూ ఉద్యోగం పొందిన వారికి జీపీఎఫ్‌ కొనసాగించాలని కోరారు. బకాయిపడిన కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

    మెడికల్‌ కాలేజీలపై 20న రౌండ్‌ టేబుల్‌ సమావేశం

    భీమవరం: ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ.. ఈ నెల 20న రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు భీమవరం మెంటేవారితోటలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 మెడికల్‌ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు గోపాలన్‌ తెలిపారు.

    ఆచంటలో అత్యధికంగా 120 మి.మీ. వర్షం

    భీమవరం: జిల్లాలోని ఆచంట మండలంలో బుధవారం ఉదయం అత్యధికంగా 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారశాఖ తెలిపింది. వీరవాసరంలో 74 మి.మీ, భీమవరంలో 67.2, పెనుమంట్రలో 70.2, పాలకోడేరు 56.4, ఉండి 19.4, గణపవరం 19.4, అత్తిలి 23.4, ఇరగవరం 42.2, పెనుగొండ 67.8, పోడూరు 46.4, పాలకొల్లు 66.4, యలమంచిలి 29.4, నరసాపురం 29.4, మొగల్తూరు 4.2, పెంటపాడు 6, తాడేపల్లిగూడెం 3.4, తణుకులో 2.4, ఆకివీడులో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

    రేపు చేబ్రోలులో జాబ్‌ మేళా

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు గీతాంజలి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో ఈ నెల 19న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 81848 87146, 7710177767 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

  • టైలర్ల్‌కు చేదోడుగా నిలవాలి

    ఆటో డ్రైవర్లకు ఇస్తున్నట్లే రూ.15 వేలు అందించాలి

    టైలర్ల డిమాండ్‌

    తాడేపల్లిగూడెం (టీఓసీ): గత ప్రభుత్వంలో చేదోడు పథకంలో ప్రతి టైలర్‌కు ఏడాదికి రూ.10 వేల చొప్పున నాలుగేళ్లు అందజేశారు. తమకు కూడా చేదోడు పథకం తరహాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా టైలరింగ్‌ స్కీంను అమలు చేయాలని, టైలర్స్‌కు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అర్హత కలిగిన దర్జీలకు వారి వ్యాపార ఉన్నతికి, పరికరాల కొనుగోలు నిమిత్తం చేదోడు పేరుతో ప్రతి టైలర్‌కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందించారు. నాలుగేళ్ల పాటు ఈ పథకం అమలు చేశారు. ఐదో సంవత్సరం ఎన్నికల కోడ్‌ కారణంగా అమలు చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో రూ.15 వేలు ఆటో కార్మికులకు అందిస్తున్న నేపథ్యంలో టైలర్లకు కూడా రూ.15 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

    పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు

    ఇప్పటికే టైలర్లు వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. రెడిమేడ్‌ వస్త్రాలతో వారికి పనిలేకుండా పోతోంది. గతంలో టైలరింగ్‌ షాపులలో యాజమానితో పాటు పనివారు ఉండే వారు. నేడు ఎవరికీ పనులు లేకపోవడంతో టైలర్లు ఆర్థికంగా చితికి పోతున్నారు. నాడు రద్దీగా ఉండే టైలరింగ్‌ షాపులు వారికి నేడు పని లేకుండా పోవడంతో టైలర్స్‌ ఆర్థికంగా చితికిపోయారు. టైలర్స్‌కు పనులు లేకపోవడంతో షాపులకు అద్దెలు చెల్లించలేకపోతున్నారు. విద్యుత్‌ బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల్లో రాయితీలు ఇవ్వాలని, ప్రభుత్వ షాపుల్లో తక్కువ అద్దెకు టైలర్లకు షాపులు కేటాయించాలని, ఎక్కడైనా టైలర్లకు ఇచ్చిన ప్రభుత్వ షాపులు పాడైతే వాటికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

  • టైలర్

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమం అందజేసింది. టైలర్లు, కుమ్మరులు, రజకులు, ఆటోవారికి, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేశారు. నేటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి టైలర్లకు, చేతివృత్తిదారులకు కూడా సాయం ప్రకటించాలి.

    – చింతకాయల సత్యనారాయణ, సీనియర్‌ టైలర్‌, తాడేపల్లిగూడెం

    గత ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంది. నేటి ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం ప్రకటించాలి. నేడు ఆటో కార్మికులకు సంక్షేమం అందజేసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో టైలర్లకు కూడా సాయం ప్రకటించాలి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి

    – టి.సుబ్రహ్మణ్యం, టైలర్‌, తాడేపల్లిగూడెం

    గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు రూ.10 వేలు సాయం అందుకున్నాను. ప్రస్తుత ప్రభుత్వం కూడా పేద మహిళా టైలర్లను ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం ఇంతవరకు టైలర్ల సంక్షేమానికి ఎలాంటి ప్రకటన చేయలేదు. కార్పోరేట్‌ శక్తులు కారణంగా మహిళా టైలర్లు చితికిపోతున్నారు.

    – ఎస్‌.కృష్ణవేణి, మహిళా టైలర్‌, తాడేపల్లిగూడెం

Peddapalli

  • ● సింగరేణిలోనే ద్వితీయస్థానం ● దూకుడు పెంచిన ఆర్జీ–2 ఏరియా

    గోదావరిఖని: వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణిలోని ఆర్జీ–2 ఏరియా దూకుడుగా ముందుకు సాగుతోంది. సంస్థలోనే అతిపెద్ద ఓసీపీ–3 ఉత్పత్తి సాధనలో అగ్రస్థానంలో ఉంది. ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ముందుకు సాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు చివరి నాటి 129 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదుచేసి సింగరేణిలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఇదేసమయంలో ఉద్యోగులను అప్రమత్తం చేస్తోంది. రక్షణ, ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించడంతో లక్ష్య సాధన సులభమవుతోంది.

    స్థితిగతులను వివరిస్తూ..

    సింగరేణి సంస్థ స్థితిగతులను ఉద్యోగులకు వివరిస్తూ లక్ష్య సాధనలో కార్మోన్ముఖులను చేయడంలో అధికారులు విజయం సాధించారు. దీంతో బొగ్గు వెలికితీయడంతో సంస్థలోనే ఆర్జీ–2 ఏరియా నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రాజెక్టులోని ప్రైవేట్‌ ఓబీ కంపెనీల్లో మట్టి వెలికితీత లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగడం, డిపార్ట్‌మెంట్‌ పరంగా ఉత్ప త్తి, ఓబీ వెలికితీత పెరగడంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అడ్డంకి లేకుండా పోయింది. అంతేకాకుండా డిపార్ట్‌మెంటల్‌ ఓబీ, బొగ్గు వెలికితీత కోసం భారీ యంత్రాలను యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో ఉత్పత్తికి అనుకూల మార్గాలు ఏర్పడ్డాయి. వకీల్‌పల్లి గని కూడా ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఏరియాలోని ఓసీపీ–3, వకీల్‌పల్లి గనులు పోటాపోటీగా ఉత్పత్తి చేస్తూ లక్ష్య సాధనలో పాలుపంచుకుంటున్నాయి.

    ఆదినుంచీ దూకుడుగానే..

    ఆర్జీ–2 ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఆదినుంచీ దూకుడుగానే సాగుతోంది. గత ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు నిర్దేశిత లక్ష్యానికి మించి 129 శాతం బొగ్గు ఉతత్తి చేసింది. వర్షాలు కురిసి.. తెరిపి ఇవ్వగానే ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది.

    నెల వారీగా..(టన్నుల్లో)

    నెల లక్ష్యం సాధించింది శాతం

    ఏప్రిల్‌ 2,28,400 4,99,986 218

    మే 5,29,000 7,05,271 133

    జూన్‌ 5,50,000 7,20,574 131

    జూలై 6,80,500 7,31,703 107

    ఆగస్టు 5,78,400 6,44,656 111

  • రక్తదానంతో మరొకరికి ప్రాణదానం

    సుల్తానాబాద్‌(పెద్దపల్లి): రక్తదానం ద్వారా మరొక రికి ప్రాణదానం చేసిన వారవుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, సేవా పక్వాడ జిల్లా క న్వీనర్‌ నల్ల మనోహర్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆ ధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సంజీవరెడ్డి, మనోహర్‌రెడ్డి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశా న్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మో దీకే దక్కుతుందన్నారు. అంతకుముందు పట్టణంలోని పూసాల రోడ్డులో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపారు. నాయకులు కందుల శ్రీనివాస్‌, మీస అర్జున్‌రావు, కడారి అశోక్‌రావు, సౌదరి మ హేందర్‌యాదవ్‌, కామని రాజేంద్రప్రసాద్‌, చింతల లింగారెడ్డి, రఘుపతిరావు, చాతరాజు రమేశ్‌, గుంటి కుమార్‌, కోట నాగేశ్వర్‌, ఎళ్లేంకి రాజు, కొల్లూరి సంతోష్‌ కుమార్‌, కందునూరి కుమార్‌, గుడ్ల వెంకటేశ్‌, సతీశ్‌, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.

    2 వరకు సేవా కార్యక్రమాలు

    పెద్దపల్లిరూరల్‌: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అక్టోబర్‌ 2వ తేదీవరకు వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, సేవా పక్వాడ కన్వీనర్‌ నల్ల మనోహర్‌రెడ్డి తెలిపారు. మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో కేక్‌కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశా రు. రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తదాన శిబిరం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. కార్యక్రమంలో నా యకులు రాకేశ్‌, పల్లె సదానందం, అశోక్‌రావు, ప్ర దీప్‌, నిర్మల, శివంగారి సతీశ్‌, నర్సింగం, నారాయణస్వామి, చిలారపు పర్వతాలు, క్రాంతి, సంపత్‌, దిలీప్‌, రాజగోపాల్‌, మహంతకృష్ణ, సురేందర్‌, ఉమేశ్‌, రాజవీరు, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • స్వచ్ఛతా హీ సేవలో భాగస్వాములు కావాలి

    కోల్‌సిటీ(రామగుండం): స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా బుధవారం నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ కోరారు. బల్దియా కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేసి మాట్లాడారు. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు సందర్భంగా ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండువారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పచ్చజెండా ఊపి స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, ఈఈ రామన్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాజు, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ శంకర్‌రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రావు, ఎన్విరాన్మెంట్‌ ఇంజినీర్‌ మధుకర్‌, మెప్మా టీఎంసీ మౌనిక పాల్గొన్నారు.

  • నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
    ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

    ధర్మారం(ధర్మపురి): ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఇటీవల మృతి చెందిన మార్కెట్‌ యార్డులోని హమాలీ మెడవేని రాజేశంకు మార్కెటింగ్‌శాఖ ద్వారా మంజూరైన రూ.లక్ష విలువైన చెక్కును మృతుడి కుటుంబసభ్యులకు బుధవారం మంత్రి అందజేసి మాట్లాడా రు. మార్కెట్‌లో అదనపు షెడ్‌ నిర్మాణానికి రూ.1.40కోట్లు, యార్డు చదును చేసేందుకు మరో రూ.28 లక్షలు, ధర్మారం మెడవేనివాడ – ఎండపల్లిక్రాస్‌ రోడ్డు వరకు బైపాస్‌ నిర్మాణానికి రూ.3.20కోట్లు మంజూరైనట్లు ఆయన వివరించారు. వీటితోపాటు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయించిన ఘనత తనదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, వైస్‌ చైర్మన్‌ అరిగే లింగయ్య, మాజీ వైస్‌ చైర్మన్‌ పాలకుర్తి రాజేశంగౌడ్‌, డైరెక్టర్లు బద్దం గంగారెడ్డి, కాంపెల్లి రాజేశం, అల్వాల రాజేశం, కోల శ్రీనివాస్‌, గందం మహిపాల్‌, జనగామ తిరుపతి, ఈదుల శ్రీనివాస్‌, ఎలగందుల అశోక్‌, నాయకులు ఓరం చిరంజీవి, కాంసాని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

  • స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు..

    గోదావరిఖని: నిజాం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజును తెలంగాణ ప్రజాపాలన దినంగా నిర్వహిస్తున్నామని సింగరేణి ఆర్జీ –వన్‌ జీఎం లలిత్‌కుమార్‌ అన్నారు. గోదావరిఖనిలోని ఆర్జీ – వన్‌ జీఎం కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించగా, జీఎం జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు, క్వాలిటీ అధికారి బ్రహ్మాజీ, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సర్వే డీజీఎం జీఎల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్జీ–2 ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం రా ముడు, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, సివిల్‌ డీజీఎం ధనుంజయ్‌, ఏరియా రక్షణాధికారి సంతోష్‌కుమార్‌, ఎస్టేట్‌ అధికారి సునీత, పర్సనల్‌అధికారి సాధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Rajanna

  • సిరిసిల్ల: అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందరికీ అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోందని, ధార్మిక, కార్మిక క్షేత్రంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయజెండాను ఎగురవేశారు. పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆనాటి హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రజాపాలన వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. 60 ఏళ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉందన్నారు.

    రైజింగ్‌ తెలంగాణ లక్ష్యంగా..

    2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్‌చేంజర్‌ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం తమదన్నారు. ఈ సంకల్పానికి దార్శనికపత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ అని వివరించారు. జిల్లాలోని ఎస్‌హెచ్‌జీల ద్వారా 23 ఫర్టిలైజర్‌ షాపులు ప్రారంభించినట్లు తెలిపారు. శ్రీనిధి ద్వారా రూ.25కోట్ల రుణాలు అందించామని, 5,691 యూనిట్లకు 1,607 గ్రౌండింగ్‌ చేశామని, చేయూత పింఛన్లు 1,17,370 మందికి ప్రతి నెలా రూ.25.73కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

    నేతన్నలకు ఉపాధి

    మహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలు అందించే లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి చీరల ఉ త్పత్తి ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు అందించామ న్నా రు. ఇప్పటికే 4.30కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 1,77,851 కుటుంబాలకు సన్నబియ్యం అందుతుందని, కొత్తగా 14,075 రేషన్‌కార్డులు అందించామని, 3,376 మంది పేర్లను ఇప్పటికే ఉన్న కార్డుల్లో చేర్పించామన్నారు.

    రైతు రుణమాఫీ

    రాష్ట్రంలోని 25.35లక్షల రైతులకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇందిరమ్మ రైతు భ రోసా కింద ఎకరాకు రూ.12వేల పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 393 రైతు కుటుంబాలకు రూ.18కోట్ల బీమాసాయం పంపిణీ చేసిన ట్లు, 47,977 మందికి రూ.381.45కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు.

    పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

    జిల్లాలో 12,623 ఇందిరమ్మ ఇళ్లు, అదనంగా మధ్యమానేరు నిర్వాసితులకు 4,696 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మహిళలు రూ.119.50 కోట్ల విలువైన జీరో టిక్కెట్లపై ప్రయాణం చేశారని తెలిపారు. జగ్గారావుపల్లి, పద్మనగర్‌, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్‌(వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు.

    పేదలకు మెరుగైన వైద్యం

    సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.16.85కోట్లు, ఎల్‌వోసీల ద్వారా రూ.5కోట్ల మేరకు మేలు జరిగిందన్నారు. 20 నెలల్లో 60వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలి పారు. 39 రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో ఆన్‌లైన్‌ అకాడమీ సంస్థ ద్వారా ఐఐటీ ఫౌండేషన్‌, ఐఐటీ–జేఈఈ, నీట్‌–యూజీ మెడికల్‌ ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందిస్తున్నామని తెలిపారు. చివరి ఆయకట్టుకు సా గునీరందేలా ప్రాజెక్టుల పనులు చేస్తున్నామన్నా రు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేశ్‌ బి గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, ఏఎస్పీ చంద్రయ్య, జెడ్పీ సీ ఈవో వినోద్‌కుమార్‌, డీఆర్‌డీవో శేషాద్రి ఉన్నారు.

    రాజన్న ఆలయంలో వేడుకలు

    వేములవాడ: రాజన్న ఆలయంలో ఈవో రమాదేవి జాతీయజెండాను ఆవిష్కరించారు. అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ సంపత్‌రెడ్డి సిబ్బందితో ప్రమాణం చేయించారు.

    డీపీవోలో జెండా ఆవిష్కరణ

    సిరిసిల్లక్రైం: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని జిల్లా పోలీస్‌ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆవిష్కరించారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

  • మహిళల
    ● జిల్లా న్యాయసేవాధికార సమితి సెక్రటరీ రాఽధికా జైశ్వాల్‌

    సిరిసిల్లటౌన్‌/సిరిసిల్లకల్చరల్‌: మహిళలపై వేధింపుల నివారణలో పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా లీగల్‌సెల్‌ అథారిటీ కార్యదర్శి రాధిక జైశ్వాల్‌ కోరారు. సిరిసిల్లలోని యూనియన్‌ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌లో బుధవారం పనిప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ సూరజ్‌, లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, టి.వెంకటి తదితరులు పాల్గొన్నారు.

    పరిశుభ్ర పట్టణమే లక్ష్యం

    సిరిసిల్లటౌన్‌: సిరిసిల్లను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా మార్చడమే తమ లక్ష్యమని మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా పేర్కొన్నారు. ‘స్వచ్ఛతా హీ సేవ’లో భాగంగా బుధవారం పట్టణంలో బల్దియా ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కమిషనర్‌ ఎంఏ ఖదీర్‌పాషా మాట్లాడుతూ పట్టణ ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రచారం రానున్న రెండు వారాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీ అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి బతుకమ్మఘాట్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అందరూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.

    సిరిసిల్లటౌన్‌: కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీకి ఎందుకు ఆర్భాటమని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు విమర్శించారు. బుధవారం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల ఆర్డీవో ఆఫీసు నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అంబేడ్కర్‌చౌరస్తాలో జరిగిన సభలో బద్దం ఎల్లారెడ్డి, అమృత్‌లాల్‌ శుక్లా, కర్రోళ్ల నర్సయ్య, గడ్డం తిరుపతిరెడ్డి, సింగిరెడ్డి భూపతిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1946 సెప్టెంబర్‌ 11 నుంచి 1951 సెప్టెంబర్‌ 17 వరకు జరిగిన వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ నాయకులు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విద్యార్థులు యువతరం అధ్యయనం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    సిరిసిల్లటౌన్‌: జిల్లాలో కొ న్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అంగూరి రంజిత్‌ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం డిస్ట్రిక్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేసి మాట్లాడారు. పాఠశాలల బస్సులకు సరైన ఫిట్‌నెస్‌ లేకపోవడం, ఫైర్‌ ఎగ్జాస్టింగ్‌ కిట్స్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ లేకుండా, సీట్ల సంఖ్యకు మించి ఎక్కువ మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారన్నారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • ‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో వేగం పెంచాలి
    ● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

    సిరిసిల్ల/తంగళ్లపల్లి/ఇల్లంతకుంట: ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సూచించారు. తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం పరిశీలించారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాళ్లపేటలో 57 ఇళ్లు మార్క్‌చేయగా 10 బేస్మెంట్‌ లెవెల్‌, 10 గోడలు, 20 స్లాబ్‌, 17 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. రానున్న పండగ రోజుల్లో గృహప్రవేశాలు చేయాలని సూచించారు.

    ఇసుక కొరత ఉంటే తహసీల్దార్లను సంప్రదించండి

    ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉంటే తహసీల్దార్లను సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. జిల్లాలో 10,234 ఇళ్లు మంజూరుచేయగా ఇప్పటికే 5,308 మంది పనులు ప్రారంభించారని, 2,549 మంది బేసిమెంట్‌ వరకు, 618 మంది గోడల వరకు, 285 మంది రూప్‌లెవల్‌ వరకు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇసుక కొరత లేకుండా, నిర్మాణ సామగ్రికి అధిక ధరల సమస్య లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. హౌసింగ్‌ పీడీ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

    మౌలిక వసతులు కల్పించండి

    ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లోని ఇందిరమ్మకాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కాలనీలోని సమస్యలను స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని చూసిన కలెక్టర్‌ కాలనీలో అన్ని వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవో శశికళ, డిప్యూటీ తహసీల్దార్‌ సత్యనారాయణ, మండల కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి, కార్యదర్శి రంజిత్‌ కుమార్‌ ఉన్నారు. అనంతరం రహీంఖాన్‌పేటలోని మోడల్‌సూ్‌క్‌ల్‌ను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

  • ఆరోగ్

    సిరిసిల్ల: ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే మహిళల ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిరిసిల్ల అంబేడ్కర్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం ‘స్వస్థ్‌ నారి, సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి ప్రారంభించారు. గురుకులాల్లో బాలికలకు స్పెషల్‌క్యాంప్‌ ఏర్పాటు చేసి అవసరమైన వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలి పారు. అనంతరం పది మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారా యణగౌడ్‌, సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్వరూపారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, ఐఎంఏ వైద్యులు లీలాశిరీష, పద్మలత, గీతావాణి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చొప్పదండి ప్రకాశ్‌, సంగీతం శ్రీనివాస్‌, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, బండ నర్సయ్యయాదవ్‌, జగన్‌మోహన్‌రెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, ఫిరోజ్‌పాషా ఉన్నారు.

    చిరుజల్లులు

    సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. బోయినపల్లిలో అత్యధికంగా 55.1 మిల్లీమీటర్లు కురి సింది. గంభీరావుపేటలో 32.0, ముస్తాబాద్‌లో 20.8, రుద్రంగిలో 1.5, చందుర్తిలో 3.2, వేములవాడరూరల్‌లో 4.3, వేములవాడలో 12.4, సిరిసిల్లలో 5.9, కోనరావుపేటలో 10.8, వీర్నపల్లిలో 20.1, ఎల్లారెడ్డిపేటలో 3.8, తంగళ్లపల్లిలో 7.9, ఇ ల్లంతకుంటలో 10.9 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.

  • పౌష్టికాహారం అందేలా చూడాలి

    వేములవాడ: పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సూచించారు. ‘పోషణ్‌భీ... పడాయీభీ’ కార్యక్రమంపై చందుర్తి, బోయినపల్లి, ధర్మారం, రుద్రంగి, కోనరావుపేట, చెక్కపల్లి, కొదురుపాక, వేములవాడఅర్బన్‌ సెక్టార్‌ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. లక్ష్మీరాజం మా ట్లాడుతూ అంగన్‌వాడీలలో పూర్వప్రాథమిక విద్య, పోషణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. తక్కువ బరువు పిల్లలను గుర్తించాలని సూచించారు. సీడీపీవో సౌందర్య, సూపర్‌వైజర్లు సరిత, అంజమ్మ, తార, కమల, మమత, లక్ష్మి, నిర్మల, పోషన్‌ అభియాన్‌ ఇన్‌చార్జి రాజకుమార్‌ పాల్గొన్నారు.

Sri Sathya Sai

  •  New SP Satish Kumar

    అత్యాచారాలు, అరాచకాలు.. భూకబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు...  జూదం, గంజాయి అక్రమ రవాణా, హత్యలు... ఇలా నిత్యం శ్రీసత్యసాయి జిల్లా వార్తల్లో నిలుస్తోంది. కంచెలా సమాజానికి కాపుకాయాల్సిన ఖాకీల్లోనూ కొందరు దారి తప్పారు. కూటమి నేతల కనుసన్నల్లో పనిచేస్తూ జనానికి మరింత నరకం చూపుతున్నారు. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారంతా ఇటీవలే చార్జ్ తీసుకున్న కొత్త పోలీసు బాస్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆయనైనా లాఠీ ఎత్తూతారా.. లేదా అందరిలాగే లైట్ గా తీసుకుంటారా.. అన్న చర్చ సాగుతోంది.

    కొత్త బాస్‌కు లెక్కలేనన్ని సవాళ్లు

    జిల్లా నూతన పోలీస్‌ బాస్‌గా సతీష్‌ కుమార్‌ ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పనితీరు, చేసిన సంస్కరణల గురించి తెలుసుకున్న జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అదుపుతప్పిన శాంతిభద్రతలను కట్టడి చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

    సాక్షి, పుట్టపర్తి: ఏడాదిన్నర కాలంగా జిల్లాలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఏ గ్రామంలో చూసినా ఏదో ఘటన వెలుగు చూస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారు. నాయకుల అండ చూసుకుని రౌడీ గ్యాంగ్‌లు తెరపైకి వచ్చాయి. ప్రజలకు అండగా నిలిచి భద్రత కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండటంతో పోలీస్‌ వ్యవస్థపైనా ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది.

    మత్తు.. జీవితాలు చిత్తు..

    జిల్లాలోకి గంజాయి విచ్చలవిడిగా దిగుమతి అవుతోంది. వీధివీధినా మద్యం ఏరులై పారుతోంది. అరికట్టేనాథుడే లేకపోవడంతో ఎంతోమంది యువత చిన్న వయసులోనే మద్యానికి, గంజాయికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు. జిల్లాలో జరిగిన చాలా భూ తగాదాలు, హత్యలు మద్యం మత్తులో చేసినట్లు తేలింది.

    హిందూపురంలో అరాచకాల పర్వం..

    నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, మైనర్‌ బాలికలపై అఘాయిత్యాలు వెలుగు చూశాయి. పోలీసుల తీరును అలుసుగా తీసుకున్న ఓ వ్యక్తి పక్కా ప్లాన్‌తో తూమకుంట ఎస్‌బీఐలో భారీ చోరీ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లిలో ఇంట్లో ఉన్న అత్తా కోడలిపై కొందరు యువకులు గంజాయి మత్తులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత హిందూపురంలో ఓ వ్యక్తిని హత్య చేశారు. ఇటీవల చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై హత్యాయత్నం చేశారు. పుట్టపర్తిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఆఖరికి పోలీసుల వాహనాలు సైతం చోరీలకు గురవుతుండటం గమనార్హం. శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ క్వార్టర్స్‌లో ఏకకాలంలో 9 బ్లాకుల్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. అయినా పోలీసులు దొంగలను పట్టుకోలేకపోయారు.

    రేషన్‌ మాఫియా కేరాఫ్‌ పెనుకొండ..

    మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం రేషన్‌ బియ్యం మాఫియాకు కేరాఫ్‌గా నిలిచింది. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో సోమందేపల్లికి చెందిన తెలుగు తమ్ముడు రామకృష్ణ రేషన్‌ బియ్యాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ దందా అందరికీ తెలిసినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

    పోలీసుల తీరుపైనా విమర్శలు..

    జిల్లాలోని ఏ ఒక్క పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో కూడా శాంతి భద్రతలు అదుపులో లేవు. పైగా పోలీసుల తీరుపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మడకశిర సీఐ ఓ మహిళను వేధించిన కేసులో సస్పెండ్‌ అయ్యారు. అలాగే పట్నం ఎస్‌ఐ ఓ మహిళకు న్యూడ్‌ వీడియోకాల్స్‌ చేసి వేధించి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఇక సివిల్‌ పంచాయితీల్లోనూ తలదూరుస్తున్న పోలీసులు సెటిల్‌మెంట్లు చేస్తూ.. భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చాలా స్టేషన్‌లలో చోరీలు, హత్య కేసులు కూడా ఏడాదిగా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. బాధితులు మాత్రం రోజూ పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

    ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల దందా..

    మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణంలో వడ్డీ వ్యాపారులు.. పేదల రక్తం పీలుస్తున్నారు. వారానికి రూ.100కు రూ.పది చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. సకాలంలో వడ్డీ చెల్లించలేని వారిపై దాడులకు తెగబడుతున్నారు. వడ్డీ వ్యాపారులపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలోని ముదిగుబ్బ గంజాయి అక్రమ సరఫరాకు కేంద్రంగా మారిందని సమాచారం. ఇలా నియోజకవర్గంలోని పలు మండలాల్లో మద్యం మత్తులో విచ్చలవిడిగా గొడవలు, తగాదాలు, హత్యలు వెలుగు చూస్తున్నాయి.

    రామగిరిలో రాక్షస క్రీడలు..

    పరిటాల సునీత సొంత మండలం రామగిరిలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రజాప్రతినిధులకే భదత్ర లేకుండా పోయింది. ఎంపీపీ ఎన్నికల కోసం వెళ్తున్న ఓ మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేయడం కలకలం రేగింది. పేదల భూముల కబ్జాకు అంతేలేకుండా పోయింది. ఇక రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ఓ దళిత మైనర్‌ బాలికను కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడి సామూహిక అత్యాచారం చేశారు. బాలిక ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడా అమ్మాయి అనాథగా ప్రభుత్వ ఆశ్రయంలో ఉంది. టీడీపీ అల్లరి మూకలు సాగించిన ఈ అరాచకం చూసి సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకుంది. ఇక రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో లింగమయ్య హత్య రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రామగిరిలో దౌర్జన్యాలు, దుర్మార్గాలను అడ్డుకోవాల్సిన ఎస్‌ఐ... టీడీపీకి అంటకాగుతూ సామాన్యులపై తన ప్రతాపం చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి.

  • భౌ..

    ● కదిరి జీవిమాను కూడలిలో ఈ నెల 7వ తేదీన అఫ్రిన్‌ అనే ఐదేళ్ల చిన్నారిని వీధి కుక్క కరిచి తీవ్రంగా గాయపరచింది. కుటుంబీకులు చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుడి సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. అంతకుముందు అడపాల వీధిలో ఒకేరోజు రాత్రి వేళ కుక్కలు 17 మంది చిన్నారులతో పాటు మరో మహిళను కూడా తీవ్రంగా గాయపరిచాయి.

    ● హిందూపురం మోడల్‌ కాలనీలో ఇటీవల వీధి కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. పట్టణంలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తున్న శునకాలు చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. పెనుకొండలోనూ వీధి కుక్కలు పెరిగిపోగా, ఇటీవల కుక్కకాటు బాధితుల సంఖ్య భారీగా పెరిగింది.

    కదిరి: జిల్లాలో శునకాల సంతతి ఇటీవల బాగా పెరిగింది. జిల్లాలోని ఏ వీధిలో చూసినా కుక్కల మందలే కనిపిస్తున్నాయి. ఇలా వీధుల్లో తిష్టవేస్తున్న శునకాలు దారి వెంట వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో బైక్‌ల వెంట బడుతూ తీవ్రంగా భయపెడుతున్నాయి. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట...ఎవరో ఒకరు కుక్కకాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా కొందరు చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన పడేయటంతో పదుల సంఖ్యలో కుక్కలు చేరి, పోట్లాడుకొని ఆఖరకు అడ్డొచ్చిన జనాన్ని కరుస్తున్నాయి. గత 8 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 2,406 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఇక నమోదు కాని కేసులు మరో 1,000 దాకా ఉండచ్చని అధికారులే చెబుతున్నారు. ఇక మూగ జీవాలను కూడా కుక్కలు వదలడం లేదు.

    పెంపుడు కుక్కల వివరాలను ఆయా మున్సిపాలిటీల్లో నమోదు చేయించాల్సి ఉన్నా.. జిల్లాలో ఎక్కడా నమోదు చేయడం లేదు. ఇక వీధి కుక్కల సంఖ్య ఎంత ఉందని చెప్పడం కూడా కష్టమేనని సంబంధిత అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో 1,484 పెంపుడు కుక్కలు, 27,099 వీధి కుక్కలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటికి తోడు మండలాల పరిఽధిలోని గ్రామాల్లోని కుక్కలను సైతం లెక్కిస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు 1.60 లక్షల పెంపుడు, వీధి కుక్కలు ఉండచ్చని తెలుస్తోంది.

    కుక్కల్ని చంపడానికి నిబంధనలు ఒప్పుకోవు. అందుకే స్టెరిలైజేషన్‌ (ఆపరేషన్‌) చేసి వాటి సంతతిని తగ్గిస్తారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఈ ప్రక్రియ సాగడం లేదు. కూటమి ప్రభుత్వంలో కుక్కల నియంత్రణకు నిధుల కొరత ఉందని ఆయా మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుక్కకు కు.ని శస్త్ర చికిత్స చేయాలంటే రూ.500 ఖర్చు అవుతుందంటున్నారు. ఈ లెక్కన కోట్లలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని వారంటున్నారు. ఇక పంచాయతీల పరిధిలో కుక్కలకు కు.ని ఆపరేషన్ల సంగతి చెప్పనక్కర లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక కుక్కల స్టెరిలైజేషన్‌ కోసం నిధులు విడుదల చేసిన దాఖలాల్లేవు.

    కుక్కకాటు బాధిత సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. జిల్లా కుక్కకాటుకు వేసే రేబిస్‌ వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్క కాటుకు మందులు లేవని వైద్యులే చెబుతున్నారు. ఇక సీహెచ్‌సీలు, పట్టణాల్లోని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ అంతమాత్రంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో చాలా మంది పురాతన పద్ధతులైన వాతలు పెట్టుకోవడం...పసరు తాగడం చేస్తున్నారు. కానీ కుక్కకాటు బాధితులు సకాలంలో వ్యాక్సిన్‌ వేసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

    కదిరిలో సంచరిస్తున్న వీధి కుక్కలు

    కుక్కలు కొరికేస్తున్నాయ్‌

    వీధుల్లోకి రావాలంటేనే భయపడుతున్న జనం

    బైక్‌పై వెళ్తున్నా తప్పని కుక్క కాటు

    8 నెలల్లోనే 2,406 కేసుల నమోదు

    అనధికారికంగా ఈ లెక్క

    మరింత ఎక్కువే

    పశువులనూ వదిలి పెట్టని గ్రామ సింహాలు

    రేబిస్‌ టీకాల సరఫరా

    అంతంత మాత్రమే

    నిధుల కొరతతో కు.నికి పాట్లు

    రేబిస్‌ వ్యాక్సిన్‌కూ దిక్కులేదు

    జిల్లాలో 1.60 లక్షల శునకాలు

    ...ఇలా జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ వీధి కుక్కలు

    స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ ఒంటిరిగా వెళ్లే వారిపై

    దాడి చేస్తున్నాయి. ఇటీవల కుక్కకాటు బాధితులు సంఖ్య భారీగా పెరగుతుండగా..ఆస్పత్రుల్లో రేబీస్‌ వ్యాక్సిన్‌

    అరకొరగా ఉంటోంది.

  • రేపు

    పుట్టపర్తి టౌన్‌: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైన కూటమి సర్కార్‌ తీరును నిరసిస్తూ ఆ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. వైఎస్సార్‌ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ (శుక్రవారం) ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం నిర్వహిస్తోంది. పెనుకొండలోని మెడికల్‌ కళాశాల వద్ద చేపట్టనున్న కార్యక్రమంలో పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమరనాథ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం ద్వారా మెడికల్‌ కళాశాలకు సంబంఽధించిన పూర్తి వాస్తవాలు ప్రజలకు వివరిస్తామన్నారు.

    మానవ మనుగడకు

    మార్గదర్శకుడు విశ్వకర్మ

    జయంతి వేడుకల్లో

    జేసీ అభిషేక్‌ కుమార్‌

    ప్రశాంతి నిలయం: మానవ మనుగడకు మార్గదర్శకుడు విశ్వకర్మ అని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ అభిషేక్‌కుమార్‌ మాట్లాడుతూ, ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా ప్రవచనకారులు విశ్వకర్మను ప్రస్తావిస్తారన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్‌ 17న విశ్వకర్మ జయంతిని అధికారికంగా జరుపుతున్నాయన్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే విశ్వకర్మ ఉప సమూహాలైన కమ్మరి, వడ్రంగి, కాంస్య కమ్మరులు, శిల్పులు, స్వర్ణకారులు తదితర కులవృత్తుల వారికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘విశ్వకర్మ యోజన’ పథకం కింద రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోందన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామసుబ్బయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్‌రెడ్డి, డీఎస్‌డీఓ ఉదయభాస్కర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • బీజేపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం

    గోరంట్ల: ఓ కేసు విషయంలో గోరంట్ల సీఐ శేఖర్‌తో పాటు సిబ్బంది తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తూ గోరంట్లకు చెందిన దేవాంగం నరేష్‌ బుధవారం సాయంత్రం పోలీసుస్టేషన్‌ ఎదుటే ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు నరేష్‌ తెలిపిన వివరాల మేరకు.. గోరంట్లకు చెందిన దేవాంగం నరేష్‌ బీజేపీ నాయకుడు. అతను ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. దీంతో బుధవారం ఉదయం సీఐ శేఖర్‌ అతన్ని, అతని సోదరుడైన మహేష్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం సీఐ శేఖర్‌ ఆదేశాలతో ఇద్దరు కానిస్టేబుళ్లు అన్నదమ్ములిద్దరినీ చిత్రహింసలకు గురి చేశారు. అలాగే వారి కుటుంబీకులను అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపం చెందిన దేవాంగం నరేష్‌ సాయంత్రం పోలీసు స్టేషన్‌ ఎదుటే ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ఎస్‌ఐ రామచంద్ర, పోలీసులు అతన్ని నిలువరించి కాపాడారు. తాను తప్పుచేసి ఉంటే కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని, ఇలా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే అధికారం సీఐకి ఎవరిచ్చారని నరేష్‌ ప్రశ్నించారు.

    రౌడీషీటర్లు.. ఇందుకే కౌన్సెలింగ్‌ ఇచ్చాం..

    ఈ విషయమై సీఐ శేఖర్‌ను వివరణ కోరగా... నరేష్‌తో పాటు అతని సోదరుడు మహేష్‌పై గోరంట్ల పోలీసు స్టేషన్‌లో 2014లో రౌడీషీట్‌ ఓపెన్‌ అయ్యిందని, అదేవిధంగా 2025 జూన్‌ 17వ తేదీన ఆర్‌అండ్‌బీ ప్రహరీని జేసీబీలతో కూల్చిన కేసుతోపాటు అదేరోజు మరో కేసు కూడా నమోదైందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్న ఉన్నతాధికారుల అదేశాల మేరకే నరేన్‌తో పాటు అతని సోదరుడు మహేష్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించడంతో పాటు స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన నరేష్‌పై తాజాగా మరోకేసు నమోదు చేశామన్నారు.

    స్టేషన్‌ ఎదుటే ఒంటిపై

    డీజిల్‌ పోసుకున్న బాధితుడు

    సీఐ శేఖర్‌, పోలీసులు తనపై

    థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన

  • కుక్క

    కూటమి ప్రభుత్వం కుక్కలను చాలా తక్కువగా అంచనా వేస్తోంది. ఎంతోమంది పిల్లలను కరిచినా పట్టించుకోవడం లేదు. ఎక్కడచూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లోకి రావాలంటేనే పెద్దలే భయపడుతున్నారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర లేదు. కూటమి నేతల పిక్కలు పట్టుకుంటేగానీ ఈ ప్రభుత్వంలో చలనం వచ్చేటట్లు లేదు.

    – ఎంఐఎం అక్బర్‌, కదిరి

    రేబిస్‌ సోకే ప్రమాదం

    కరచిన కుక్కకు రేబీస్‌ వ్యాధి ఉంటే ఆ వ్యాధి మనకు సోకే ప్రమాదం ఉంది. అందుకే కుక్క కరచిన వెంటనే యాంటి రేబీస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు మేరకు 5 నుంచి 7 వ్యాక్సిన్లు వేస్తారు. కుక్కకాటుకు గురైన వ్యక్తి నీళ్లు తాగాలన్నా, నీటి శబ్ధానికి భయం పడినా... జ్వరం తదితర అనారోగ్య లక్షణాలున్నా రేబీస్‌ వ్యాధిగా పరిగణించాలి. –డా.ఫైరోజ్‌బేగం,

    జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి

Orissa

  • చిన్న

    రాయగడ: చిన్నారులకు చదువు, మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మికతపై అవగాహన కలిగేలా తల్లిదండ్రులు కృషి చేయాలని స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణవేంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొత్తకొట చంద్రమౌళి కుముంధాన్‌ అన్నారు. రెండు రోజులుగా ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో కొనసాగిన శ్రీకృష్ణ జయంతి వేడుకలు మంగళవారం రాత్రితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుముంధాన్‌ మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న మన సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల్లో ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అనంతరం శ్రీకృష్ణ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషాధారణలతో అలరించారు. వారి నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ, గొపికల వేషాధారలతో పాటు వారు చేసిన నృత్యాలు ఆనందడొలికల్లో ముంచెత్తాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు రాధాగోవిందునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నృత్యాల్లో పాల్గొన్న చిన్నారులకు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చంద్రమౌళి, కార్యదర్శి రాఘవ కుముంధాన్‌ బహుమతులను అందజేసి వారిని ఉత్సాహపరిచారు.

  • 75 లక

    భువనేశ్వర్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన కానుకగా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా స్థానిక ఏకామ్ర కళాశాల ప్రాంగణంలో ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. పుడమి తల్లి పరిరక్షణకు కృతజ్ఞతపూర్వకంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలనే ప్రధాని పిలుపునకు స్పందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యాచరణ ప్రధాని మోదీకి అమూల్యమైన జన్మదిన కానుకగా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానం మానవాళికి ఉత్తమ సేవగా పేర్కొన్నారు.

  • Minister Nityananda Gond at a blood donation camp

    పర్లాకిమిడి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక బిజూ పట్నాయక్‌ కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం రక్తదాన శిబిరాన్ని బీజేపీ అధ్యక్షులు నవకిశోరో శోబోరో, మాజీ ఎమ్మెల్యే కోడూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, విద్య, గణశిక్షా మంత్రి నిత్యానంద గోండ్‌ ముఖ్యఅతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు. 

    ఎక్సైజ్ సూపరింటెండెంటు, బీజేపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొత్తం 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు బ్లడ్‌బ్యాంక్‌ అధికారులు తెలియజేశారు. సీడీఎంవో డాక్టర్‌ మహ్మద్‌ ముబారక్‌ ఆలీ, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు, జిల్లాపరిషత్‌ మాజీ చైర్మన్‌ పొట్నూరు లత, కౌన్సిలర్లు బబునా బెహారా, బాలక్రిష్ణ పాత్రో, నృసింహాచరణ్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

  • నువాపడాలో 56 కొత్త పోలింగ్‌ కేంద్రాలు

    భువనేశ్వర్‌: నువాపడా ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అఖిల పక్షాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల దృష్ట్యా చేపట్టిన పలు సంస్కరణలు, సవరణలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రతినిధులకు వివరించారు. త్వరలో నువాపడాలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం కింద 56 కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను 302 నుంచి 358కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 36 పోలింగ్‌ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 322 ఉన్నట్లు పేర్కొన్నారు. నువాపడా నియోజకవర్గంలో 52 పోలింగ్‌ కేంద్రాల పేర్లు మార్చినట్లు ప్రకటించారు. ఈ నెల 15న అర్హత తేదీగా పరిగణించి బ్యాలెట్‌ పత్రాల జాబితాను సిద్ధం చేశారు. రాజకీయ పార్టీలకు బ్యాలెట్‌ పత్రాల జాబితాను అందుబాటులో ఉంచారు. బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు.

  • ఉద్ధృ

    రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో కళ్యాణి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరుతోంది. వంతెనకు నీరు తాకుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఇదే తరహా వరదలు రావడంతో కళ్యాణసింగుపూర్‌ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    బీజేడీ నాయకుల నిరసన

    రాయగడ: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నిరసిస్తూ బీజేడీ శ్రేణులు బుధవారం ఆందోళనకు దిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో గుణుపూర్‌ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్‌ గొమాంగొ, బీజేడీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జగదీష్‌ చంద్ర పాత్రో, సీనియర్‌ నాయకులు, జిల్లా పరిషత్‌ మాజీ సభ్యుడు పట్నాన గౌరీ శంకరరావు, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, రాయగడ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శుభ్ర పండ, దేవాషీష్‌ ఖడంగా, సంతోష్‌ పాత్రొ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ స్వాతి ఎస్‌.కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అత్యాచారాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని కోరారు.

  • పరిశు

    భువనేశ్వర్‌: పరిసరాల పరిశుభ్రత జీవితంలో ఓ భాగం కావాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు. బుధవారం స్థానిక రమాదేవి మహిళా విశ్వవిద్యాలయంలో స్వచ్ఛత అభియాన్‌ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలను నివారించడంలో పరిసరాల పాత్ర కీలకమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్యాంపస్‌ను శుభ్రపరిచారు. వర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోస్టర్‌ తయారీ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి వైస్‌–ఛాన్సలర్‌ చండి చరణ్‌ రథ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • బీజేడీ ఆందోళన

    కొరాపుట్‌: మహిళలపై జరుగుతున్న దురాఘాతాల ను అడ్డుకోవాలని ప్రతిపక్ష బీజేడీ ఆందోళన బుధవారం చేసింది. నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్‌ రంధారి నివాసం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేడీ ముఖ్య నాయకులు తన గదికి రావాలని ఎస్పీ మడకర్‌ సంపత్‌ సూచించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను బీజేడీ నాయకులకు ఎస్పీ వివరించారు. ఇంకేం చర్యలు తీసుకోవాలో సూచించాలని కోరారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం బీజేడీ నాయకులు సూచన లు చేశారు. వారు చెప్పిన అన్ని రక్షణ చర్యలూ వెంటనే తీసుకొంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీకి బీజేడీ నాయకులు వినతిపత్రం అందించారు. మా జీ ఎమ్మెల్యేలు సదాశివ ప్రధాని, సుభాష్‌ గోండో, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజులా మజ్జి, మాజీ జెడ్పీ వైస్‌ ప్రెసిడెంట్‌ నివేదిత మహాంతి, కౌసల్య ప్రధాని, రబి పట్నాయక్‌ పాల్గొన్నారు.

  • ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతదేహం లభ్యం

    భువనేశ్వర్‌: మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శుభ మిత్ర సాహు ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కెంఝొహర్‌ ఘొటొగాంవ్‌ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం బుధ వారం లభ్యమైంది. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె స్నేహితుడు గుమాస్తా దీపక్‌ రౌత్‌ పట్ల తలెత్తిన సందేహం ప్రాథమికంగా రుజువు అయింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక విచారణలో తేలిన ఆధారాలతో పోలీసులు నిందితుడు దీపక్‌ రౌత్‌ను శుభమిత్ర మృత దేహాన్ని వెలికితీసేందుకు కెంఝొహర్‌ ఘొటొగాంవ్‌ అటవీ ప్రాంతంలో పాతిపెట్టిన ప్రదేశానికి భువనేశ్వర్‌ నుంచి తీసుకెళ్లారు. పోలీసులు, మేజి స్ట్రేట్‌ సమక్షంలో జేసీబీ సహాయంతో తవ్వి శుభమిత్ర మృతదేహాన్ని బయటకు తీశారు. సిమెంట్‌ సంచిలో కట్టిన మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • తేనెట

    రాయగడ: పొలం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న తల్లీకుతూళ్లు తేనేటీగల దాడిలో గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని నారాయణపూర్‌ పంచాయతీ పరిధిలో గల పిందుగుడ గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. మంజులత హియల్‌(గర్భిణి), ఆమె మూడేళ్ల కూతురు సుశ్రీలు దొందులి కూడలి చేరేసరికి తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఇద్దరూ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పక్కనే పొలం పనులు చేసుకుంటున్న కొందరు రైతులు వీరిని చూశారు. అటుగా వస్తున్న వాహనంలో కళ్యాణసింగుపూ ర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తేనేటీగల ముళ్లును వైద్యులు తీశారు. పరిస్థితి కుదుటగా ఉండటంతో చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

    రాయగడ: ఛత్తీష్‌గఢ్‌ జిల్లా రాయిపూర్‌ నుంచి విజయవాడకు బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ మంటల్లో చిక్కుకుంది. స్థానిక లడ్డ రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాగన్‌లో మంటల వ్యాపించడంతో గూడ్స్‌ సిబ్బంది వెంటనే రైలును నిలిపి అధికారులకు సమాచారం అందించా రు. రాయగడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

    పర్లాకిమిడి: పట్టణంలో మూడు రోడ్ల జంక్షన్‌ లో పాత ఫైర్‌ స్టేషన్‌ వద్ద సీసీ రోడ్డులో భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ము ఖ్యంగా రాత్రిపూట వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి గొయ్యిని పూడ్చాలని పలువురు కోరుతున్నారు.

    రాయగడ: దేశ ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బీజేపీ శ్రేణులు బస్టాండును శుభ్రపరిచారు. స్వచ్ఛ ఉత్సవ్‌ సందర్భంగా బస్టాండ్‌ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బీజేపీ సీనియర్‌ నాయకులు బసంత కుమార్‌ ఉలక, పద్మనాభ దాస్‌, మంజులా మినియాక పాల్గొన్నారు.

    పీహెచ్‌సీ ముందు గిరిజన మహిళల ధర్నా

    పాతపట్నం: మండలంలోని బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) ముందు వైద్యం అందడం లేదని గిరిజన మహిళలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. బుధవారం ఉదయం ఆర్‌.ఎల్‌.పురం,పెద్ద సున్నాపురం, రామన్నగూడ తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళలు పీహెచ్‌సీకి చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని తమకు డాక్టర్‌ వద్దని ఆందోళన చేపట్టారు. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే డాక్టర్‌ను నియమించి తమకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

    వీధి కుక్కల దాడిలో

    నలుగురికి గాయాలు

    మందస: మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. బుధవారం గుంపుగా వెళ్లి దాడిచేసి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులకు కాటు వేశాయి. దీంతో వీరికి మందస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • 672 క

    మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 90 గ్రామం వద్ద మంగళవారం రాత్రి కలిమెల పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ డి.డి.సుగ్రీ తన సిబ్బందితో పెట్రోలింగ్‌ నిర్వహించారు. బైక్‌పై ముగ్గురు వ్యక్తు లు అతివేగంగా రావడంతో పోలీసులకు అనూమ నం వచ్చింది. వారిని అపి తనిఖీ చేశారు. ఆ ముగ్గురు బైక్‌ను, గంజాయి బస్తాను వదిలి పారారయ్యారు. బైక్‌ను, గంజాయిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఎస్‌ఇఐ బి.కె.మాఝి తన సిబ్బందితో పుల్లిమేట్ల గ్రామం వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. మోటు వైపుకు అతి వేగంగా ఓ కారు వచ్చింది. అందులో 26 బస్తాల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. కారును అపి తనిఖీ చేయగా అందులో గంజాయి ఉంది. వెంటనే ఈ గంజాయి ఏవరిది అని ఆరా తీయగా యం.పి.వి 13 గ్రామానికి చెందిన సుమన్‌ హల్దార్‌కి చెందినది అని పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే సుమన్‌ను అరేస్టు చేసి కారును, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మొత్తం గంజాయిని తూకం వేయగా 677 కేజీలు ఉంది. ఐఐసీ ముకుందో మేల్క మాట్లాడుతూ ఈ మొత్తం గంజాయి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందన్నారు. బైక్‌ను విడిచిపెట్టి పారారైన వారి కోసం గాలిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి సుమన్‌ను కోర్టుకు తరలిస్తామన్నారు.

  • నాణ్య

    కొరాపుట్‌: ఇంద్రావతి మెగా హిల్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాసిరకంగా పనులు జరిగితే ఉపేక్షించబోమని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి హెచ్చరించారు. బుధవారం ఇంద్రావతి ప్రాంతంలో రెండు కొండల మధ్య నిర్మా ణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ నిర్మాణంపై దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే తెంతులకుంటి, నందాహండి, నబరంగ్‌పూర్‌ సమితుల్లో 19 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందన్నారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఏడాదికి ఒకే పంట పండించే రైతులు ఖరిఫ్‌తోపాటు, రబీలో కూడా పంటలు వేసుకోవచ్చన్నారు. ప్రాజెక్ట్‌కి అనుసంధానం చేసే రోడ్లు, అక్కడ నిర్మితం అవుతున్న భవనాలు, తదితర ప్రాంతాలను సందర్శించారు. కొత్త నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తాను ఈ నిర్మాణ పురోగతిని పరిశీలిస్తుంటానన్నారు.

  • ప్రశ్

    శ్రీకాకుళం న్యూకాలనీ:

    విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కణితి శ్రీరాములు అధ్యక్షతన కళాశాల సిల్వర్‌ జూబ్లీ ఆడిటోరియం వేదికగా సమాజంలో సైన్స్‌ వైబ్రేషన్‌ పేరిట రెండు రోజుల సైన్స్‌ ప్రయోగాల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కళాశాల సెంటర్‌ ఫర్‌ అప్లయిడ్‌ సైన్సెస్‌, జంతుశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఇండిజీనిఎస్‌ ఫర్‌ ప్రోగల్‌ సైన్స్‌ ఇన్వెన్షన్‌ సొసైటీ సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రశ్నించే తత్వం ఉంటే విషయ పరిజ్ఞానం పెరిగి, అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. అలాగే సైంటిఫిక్‌ టెంపర్‌, పరిశోధనా విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీరాములు మాట్లాడుతూ ఇటువంటి సైన్స్‌ ఎగ్జిబిషన్లతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు.

    కార్యక్రమంలో లైఫ్‌ సైన్సెస్‌ విభాగాధిపతి డాక్టర్‌ మదమంచి ప్రదీప్‌, ఎన్‌వైకే డిప్యూటీ డైరెక్టర్‌ కె.వెంకట్‌ ఉజ్వల్‌, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.పోలినాయుడు, ప్రొగ్రాం కో–ఆర్డినేటర్స్‌ డాక్టర్‌ రోణంకి హరిత, పి.సుధారాణి, శివాల రవిబాబు, కె.అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

  • గంజాయితో ఇద్దరు యువకులు అరెస్టు

    ఇచ్ఛాపురం:

    స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఎల్‌సీ గేట్‌ వద్ద 11 కేజీల గంజాయితో ఇద్దరు యువకులను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు సీఐ కార్యాలయం ఆవరణలో పత్రికా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ఎల్‌సీగేట్‌ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. తమిళనాడుకి చెందిన కదాశిమ ముత్తుకుమార్‌, కపిల్‌దేవ్‌ మరియప్పన్‌ 11.120 కేజీల గంజాయితో పట్టుబడినట్లు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం తుత్తుకొడి పట్టణానికి చెందిన వీరిద్దరూ.. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాకి చెందిన గంజాయి వ్యాపారి మణిక్‌ సబర్‌ వద్ద తక్కువ రేటుకి గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ఒడిశా నుంచి బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకున్నారు. అక్కడ నుంచి రైలు మార్గం ద్వారా తమిళనాడుకి వెళ్లేందుకు గంజాయిని తీసుకెళ్తుండగా ఎల్‌సీగేట్‌ వద్ద రూరల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Prakasam

  • 19న ‘ఛలో మెడికల్‌ కాలేజ్‌’ జయప్రదం చేయండి

    ఒంగోలు సిటీ: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 19న మార్కాపురం మెడికల్‌ కాలేజీ వద్ద విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఛలో మెడికల్‌ కాలేజ్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 19వ తేదీన మార్కాపురం మెడికల్‌ కాలేజీ వద్దకు శాంతియుతంగా పెద్ద ఎత్తున తరలివెళ్లి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు, కార్తకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

    సింగరాయకొండ: మండలంలోని పాకల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు విజయానంద్‌ న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్న సమావేశాల్లో 100 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 89వ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రో టెక్నికల్‌ కమిషన్‌ జనరల్‌ మీటింగ్‌, ఎగ్జిబిషన్‌లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌, పాఠశాల స్టాండర్డ్‌ క్లబ్‌ మెంటార్‌ అయిన విజయానంద్‌కు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ నుంచి సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు పేర్కొన్నారు.

    ఒంగోలు టౌన్‌: జిల్లాలో 10 మెడికల్‌ షాపుల లైసెన్స్‌లను సస్పెన్షన్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ శాఖ లైసెన్సింగ్‌ అథారిటీ ఉత్తర్వుల మేరకు ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీల్లో కొనకనమిట్ల, దర్శి, పొదిలి, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటుగా ఒంగోలులోని ఒక మెడికల్‌ షాపులో డ్రగ్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ యాక్ట్‌–1940ను ఉల్లంఘించినట్లు నిర్ధారించినట్లు వివరించారు. ప్రజారోగ్యం, ఔషధ వినియోగంలో నిబంధనల పాటించకపోవడం, అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను విక్రయించడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.

    ఒంగోలు సిటీ: జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న యూటీఎఫ్‌ రణభేరి బైక్‌జాత ర్యాలీని జయప్రదం చేయాలని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్‌ హై, వీరాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన ఆర్థిక, విద్యారంగ సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రణభేరి జాత నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా చేపట్టిన బైక్‌జాత ఈ నెల 18, 19 తేదీల్లో కనిగిరి నుంచి ప్రారంభమై గిద్దలూరు, బేస్తవారిపేట, మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి, దర్శి, తూర్పు గంగవరం, చీమకుర్తి, మీదుగా ఒంగోలుకు చేరుకుంటుందని తెలిపారు. జాతలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

    ఒంగోలు మెట్రో: విద్యుత్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యుత్‌ కార్మికుల కార్యాచరణ జేఏసీ స్పష్టం చేసింది. విద్యుత్‌ కార్మికుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో రోజు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అపరిమిత వైద్య సౌకర్యం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం, సమాన పనికి సమాన వేతన, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్‌సీ అరియర్స్‌, జేఎల్‌ఎం గ్రేడ్‌–2లను రెగ్యులర్‌ చేయడం, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా జేఏసీ చైర్మన్‌ హరికృష్ణ, కన్వీనర్‌ వెంకటరవి, బెల్లంకొండ సురేష్‌, తేళ్ల అంజయ్య, రాఘవరెడ్డి, దుర్గాప్రసాద్‌, జబ్బర్‌, ఆనందరావు, రంగమన్నార్‌, వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

  • బాల్య వివాహం నేరం

    ఒంగోలు: బాల్య వివాహం అనేది చట్టప్రకారం నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్‌ ఇబ్రహీం షరీఫ్‌ అన్నారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని దిశగా సమాజం ముందుకు పోవాలన్నారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేసి వాటిని అడ్డుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. జువైనల్‌ బోర్డు లీగల్‌ ఆఫీసర్‌ రత్నప్రసాద్‌ మాట్లాడుతూ సీ్త్రశిశు సంక్షేమ శాఖ తరఫున ప్రతి ఒక్క అంగన్‌వాడీ కార్యకర్త క్షేత్రస్థాయిలో బాల్య వివాహాల వివరాలు సేకరించి సంబంధిత వర్గాలకు తెలియజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన పూజారులు, పాస్టర్లు, ముల్లాలు పాల్గొన్నారు.

  • కలెక్టర్‌ను కలిసిన బూచేపల్లి

    ఒంగోలు సబర్బన్‌: జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబును జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం కలిసి అభినందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులపై కొంతసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Nizamabad

  • పోరాటయోధుల చరిత్ర భావితరాలకు తెలపాలి

    ● అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ

    సుభాష్‌నగర్‌: నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారితో కలిసి ధన్‌పాల్‌ సూర్యనారాయణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాంజీ గోండ్‌, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్‌ వంటి ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. తెలంగాణ బిడ్డల ఆత్మఘోషను గ్రహించిన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 1948 సెప్టెంబర్‌ 17న నిజాం మెడలు వంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. నిజాం ఆనవాళ్లను పూర్తిగా చెరిపేసి, నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షులు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • పెండింగ్‌ బిల్లు చెల్లించాలి

    సీఎం సలహాదారుకు వినతి

    ఖలీల్‌వాడి: పెండింగ్‌లో ఉన్న బిల్లులను అందించాలని జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు షకీల్‌పాషా కోరారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిను బుధవారం కలిసిన జిల్లా పోలీసుల సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2024 జనవరిలో డిపార్ట్‌మెంట్‌కు రావాల్సిన ఎస్‌ఎల్‌ఎస్‌, అడిషనల్‌ ఎస్‌ఎల్‌ఎస్‌–5, జీపీఎఫ్‌, 2018 పీఆర్‌సీ బకాయిలు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అందరు ఉద్యోగులకు పీఆర్సీ అందించారని, పోలీసులకు ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగులు తమ పిల్లలకు అకడమిక్‌ ఇయర్‌ నుంచి ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరారు.

  • తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు

    వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు

    తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ చరిత్రను 1948 సె ప్టెంబర్‌ 17 మలుపుతిప్పిన రోజని, శతాబ్దాల బాని స సంకెళ్లను తుంచి స్వాతంత్య్రం పొందిన ఉద్విఘ్న సందర్భమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ ఫెసర్‌ యాదగిరిరావు అన్నారు. ప్రజాపాలన దినో త్సవం సందర్భంగా బుధవారం తెయూ పరిపాల నా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజరికం పరిసమాప్తమై తెలంగాణ సమాజం నిజాం కబందహస్తాల నుంచి విమోచన పొందిన రోజన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ్‌ మామిడాల, అ ధ్యాపకులు పాత నాగరాజు, శాంతాబాయి, పీఆ ర్వో పున్నయ్య, టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

  • పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలి

    జిల్లా పశువైద్యాధికారి రోహిత్‌ రెడ్డి

    నిజామాబాద్‌ రూరల్‌: పాడి రైతులు పశువుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశు వైద్యాఽ దికారి రోహిత్‌ రెడ్డి అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని అర్సపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 36 పశువులకు గర్భకోశ, 42 దూడలకు నట్టల నివారణ మందులు, 48 పశువులకు సాధారణ చికిత్సలు, మూడు పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి బాబురావు, జిల్లా పశువైద్య ఆస్పత్రి డాక్టర్‌ హనుమంత్‌ రెడ్డి, అర్సపల్లి సబ్‌సెంటర్‌ రమేశ్‌, వీఎల్‌వో శ్రీనివాస్‌, ఎల్‌ఎస్‌ఏ సిబ్బంది, గోపాల మిత్రలు, ట్రెయినీ డాక్టర్లు పాల్గొన్నారు.

  • రిటైర్డ్‌ ఐఏఎస్‌ చక్రపాణి

    చదువుతోనే భవిష్యత్తు

    నిజామాబాద్‌ రూరల్‌: చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని విద్యావేత్త, విశ్రాంత ఐఏఎస్‌, పూర్వ కలెక్టర్‌ డీ చక్రపాణి పేర్కొన్నారు. నగరంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు రామాలయంలో బుధవారం అవగాహన సద స్సు నిర్వహించారు. విద్యార్థులు ధారాళంగా ఇంగ్లిష్‌ మాట్లాడడం నేర్చుకోవాలని, ప్రతిరోజు న్యూస్‌ పేపర్‌ చదవాలని సూచించారు. అంతకు ముందు చక్రపాణిని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్‌సింగ్‌, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్‌ సీనియర్‌ సిటిజన్‌ వీరేశం, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

  • త్వరలో జీవాలకు నట్టల నివారణ మందులు

    డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): రెండేళ్ల క్రితం నిలిచిపోయిన జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ మళ్లీ ప్రారంభం కాబోతుంది. త్వరలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు కావాల్సిన మందులు ఎన్నో పశుసంవర్ధక శాఖ అధికారులు రాష్ట్ర శాఖకు ఇండెంట్‌ పంపించారు. ఐదుగురు అధికారులతో కూడిన కమిటీ నాలుగు రకాల మందులను గుర్తించింది. అయితే, ప్రభుత్వం వీటిని ఈ నెలాఖరు నాటికి జిల్లాకు పంపనుంది.

    జిల్లాలో 6లక్షలకు పైగా జీవాలు

    జిల్లాలో మేకలు, గొర్రెలు కలిపి 6,02,703 ఉన్నాయి. ప్రధానంగా నట్టల వ్యాధితోపాటు బద్దె పురుగులు, కార్యపు జలగలు, బొంత పురుగుల వ్యాధులను సైతం అధికారులు గుర్తించారు. వీటికి కూడా మందులు వేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నట్టల నివారణ మందులు ఉచితంగా జిల్లాకు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు మందులు రాలేదు. ఏడాదిలో కనీసం మూడుసార్లు మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయాలి. దీంతో జీవాల పెంపకందారులైన గొల్ల, కుర్మలు డబ్బులు వెచ్చించి మందులు కొనుగోలు చేస్తున్నారు. త్వరలో నట్టల నివారణ మందులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గొల్ల, కుర్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి మందులు జిల్లాకు చేరుకోనుండగా అక్టోబర్‌ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు పశుసంవర్ధక శాఖ ప్రణాళిక తయారు చేస్తోంది. తేదీ ఖరారైన వెంటనే గ్రామాల వారీగా షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. అయితే, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

    మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం వాస్తవమే. నెలాఖరు నాటికి జిల్లాకు పంపుతామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తాం.

    – రోహిత్‌ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

    ఇండెంట్‌ పంపిన పశుసంవర్ధక శాఖ

    నెలాఖరు నాటికి జిల్లాకు

    మందుల సరఫరా

    అక్టోబర్‌ మొదటి వారంలో

    పంపిణీకి ఏర్పాట్లు

  • తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. వర్సి టీ కళాశాలలో జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం నాలుగో సెమిస్టర్‌ పరీక్షలలో మొత్తం 28 మంది విద్యార్థులకు 28 హాజరైనట్లు పేర్కొన్నారు.

    గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో తరలించిన సీపీ

    డిచ్‌పల్లి: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి నడిపల్లి శివారులోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో బుధవారం ద్విచక్రవాహనంపై వెళుతున్న అశో క్‌ గాబ్రీ అదుపుతప్పి కిందపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. అదే సమయంలో డిచ్‌పల్లి ఖిల్లా గ్రామానికి వెళ్తున్న సీపీ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయిచైతన్య వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. 108 అంబులెన్స్‌ను పిలిపించి తీవ్రంగా గాయపడిన అశోక్‌ను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీపీ వెంట డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్‌, సిబ్బంది ఉన్నారు.

    జెండా ఎగురవేసిన సీపీ

    ఖలీల్‌వాడి: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య బుధవారం జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీపీలు బస్వారెడ్డి, రాంచందర్‌ రావు, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ వై వెంకటేశ్వర్లు, సీసీఎస్‌ ఏసీపీ నాగేంద్ర చారి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ శ్రీశైలం, సీఐలు, ఆర్‌ఎస్సై, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

    విశ్వేశ్వర శర్మకు డాక్టరేట్‌

    తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థి ఏ.విశ్వేశ్వర శర్మ పీహెచ్‌డీ డాక్టరేట్‌ సాధించారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జి.మనోజ పర్యవేక్షణలో ‘అప్లికేషన్స్‌ అండ్‌ రేసియల్‌ ఆఫ్‌ నాదిన్‌ గార్డెమర్‌’ అనే అంశంపై విశ్వేశ్వర శర్మ పరిశోధన పూర్తి చే సి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. బుధవా రం తెయూ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ సెమినార్‌ హాల్‌లో నిర్వహించిన ఓపెన్‌ వైవాకు ఓయూ ప్రొఫెసర్‌ సవిన్‌ ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. ఆర్ట్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ లావ ణ్య, హెచ్‌వోడీ రమణాచారి, బీవోఎస్‌ చైర్మన్‌ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు.

  • క్రైం

    కుక్కల దాడిలో మేకల మృతి

    నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందాయి. నందిపేటకు చెందిన ఎస్‌కే. అజీం తన ఇంటి ఎదుట రెండు మేకలను కట్టేసి ఉంచాడు. కాగా, ఒక్కసారి గుంపులుగా వచ్చిన కుక్కలు దాడి చేసి రెండు మేకల గొంతులను పట్టేసాయి. మేకల అరుపులు విని కుక్కలను తరిమివేసే ప్రయత్నం చేసినా కుక్కలు మేకలను విడిచి పెట్టకుండా వాటి తల, మొండెం భాగాలను వేరు చేశాయి.

    ఎల్లారెడ్డిరూరల్‌: రేసు కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 9 గొర్రెలు, ఒక మేక మృతి చెందినట్లు బాధితుడు రవి తెలిపారు. మండలంలోని తిమ్మారెడ్డి కట్టకింది తండాకు చెందిన రవి గొర్రెల మందపై రేసు కుక్కలు దాడి చేశాయి. ఘటనా స్థలాన్ని బీట్‌ ఆఫీసర్‌ మౌనిక పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరారు.

    మెండోరాలో భారీ చోరీ

    ఆరు తులాల బంగారం అపహరణ

    బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేర రామకృష్ణ దంపతులు మెండోరా మండల కేంద్రంలో కిరాణాషాపును నిర్వహిస్తారు. రోజూ ఇంటికి తాళం వేసి వచ్చి షాపులో ఉంటారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు తాళం పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం పాఠఽశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళం పగుల గొట్టి ఉండడాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసేలోపు భారీ చోరీ జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీధర్‌ రెడ్డి, ఎస్సై సుహాసిని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

  • అలరిం

    ● ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

    నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హాజరై జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్దార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు, బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాల, డిచ్‌పల్లి మానవతా సదన్‌ చిన్నారులు చూడచక్కని నృత్యాలు ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, ఆర్‌.భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, నుడా చైర్మన్‌ కేశవేణు, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, ట్రెయినీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీ, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కామన్‌ స్కూల్‌ విద్యా విధానం కావాలి

    నిజామాబాద్‌ సిటీ: విద్యా వ్యవస్థలు అన్నీ ఒకే విధమైన విద్యావిధానం పాటించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో పీఆర్‌టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ముఖ్యఅతి థిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాల ల్లో అన్ని కులాలకు చెందిన పేద, నిరుపేద పిల్లలు చదువుతున్నారని, నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు. సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పుల్గం దామోదర్‌ రెడ్డి, భిక్షం గౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, గుండు లక్ష్మణ్‌, వంగ మహేందర్‌ రెడ్డి, మోహన్‌ రెడ్డి, కిషన్‌, పెంట జలంధర్‌, వెంకటేశ్వర గౌడ్‌, తుమ్మల లక్ష్మణ్‌, అంకం నరేశ్‌, గంట అశోక్‌, సరిత తదితరులు పాల్గొన్నారు.

  • రక్తదానంతో మేలు

    వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు

    తెయూ(డిచ్‌పల్లి): రక్తదానం చేయడమంటే ప్రాణదానమేనని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టీ.యాదగిరిరావు అన్నారు. రక్తదాన్‌ అమృత్‌ మహోత్సవ్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం తెయూలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ కే.రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం మూడుసార్లు రక్తదానం చేయాలని సూచించారు. దీంతో తలసేమియా వ్యాధితోపాటు అత్యవసర చికిత్సలు అవసరమున్న వారికి ఎంతో మేలు చేసినట్లవుతుందన్నారు. రక్తదాన కార్యక్రమాలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి అన్నారు. వర్సిటీ విద్యార్థులతోపాటు జీజీ కాలేజ్‌, ఎస్‌ఎస్‌ఆర్‌, వాగ్ధేవి (నిజామాబాద్‌), ఆర్కే డిగ్రీ కాలేజ్‌ (కామారెడ్డి), తెలంగాణ రెసిడెన్షియల్‌ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, పీఆర్వో పున్నయ్య, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు స్వప్న, స్రవంతి, అలీమ్‌ఖాన్‌, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • నిజామాబాద్‌నాగారం: దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డి చక్రపాణి అన్నారు. బుధవారం నగరంలోని స్నేహ సొసైటీ ఫర్‌ రూరల్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాల ను విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డి చక్రపాణి సందర్శించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 33 ఏళ్ల క్రితం కలెక్టర్‌గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం టీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రైతు, సైనికుడిని సన్మానించా రు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సి ద్ధయ్య, ప్రిన్సిపాల్‌జ్యోతి, మానసిక పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, రమణస్వామి, టీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ అశోక్‌ కుమార్‌, జిల్లా సైనిక వెల్ఫేర్‌ అధ్యక్షుడు హరప్రసాద్‌ పాల్గొన్నారు.

    ప్రోత్సాహకాలు అందజేత 

    మోపాల్‌: నగరశివారులోని బోర్గాం(పి)లో ఎన్‌డీసీసీబీ వైస్‌ చైర్మన్‌, సొసైటీ చైర్మన్‌ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి తల్లి నల్ల మంగమ్మ మృతిచెందడంతో వారి కుటుంబాన్ని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట నిజామాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖర్‌ గౌడ్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, మోపాల్‌ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, అశోక్‌ తదితరులు ఉన్నారు.

    విద్యార్థులకు జామెట్రీ బాక్సులు అందజేత

    నిజామాబాద్‌ రూరల్‌: శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జెడ్పీహెచ్‌ఎస్‌ కాలూర్‌ పాఠశాల విద్యార్థులకు 80 జామెట్రీ బాక్సులు, 150 పెన్నులను అందజేశారు. వి ద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలిపారు. సంస్థ ప్రతినిధులు రామ్‌ మోహన్‌, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, బాలశేఖర్‌, ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

    ధర్పల్లి: మండలంలోని దుబ్బాక ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న 60 మంది విద్యార్థులకు ఉల్లాస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం రూ. వెయ్యి చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. ఎంఈవో రమేశ్‌, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాజారెడ్డి సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందిస్తున్న ఉల్లాస్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు అశ్విన్‌ స్వప్న దంపతులు తెలిపారు.

    అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం 

    ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు ఐదో టౌన్‌ ఎస్సై గంగాధర్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రశేఖర్‌ కాలనీకి చెందిన సుమయ్య బేగమ్‌ తన ఎనిమిదేళ్ల కొడుకు మహమ్మద్‌ హుస్సేన్‌ను భారతీరాణి కాలనీలో ఉన్న తన అమ్మ సమీనా బేగం ఇంటి వద్ద మంగళవారం వదిలి వెళ్లింది. బాలుడు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో బయట ఆడుకోడానికి వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో సమీనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాలుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న బాబన్‌ సాహబ్‌ పహడ్‌ దర్గా వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని అతని తల్లి దండ్రులకు అప్పగించినట్లు ఎస్సై గంగాధర్‌ పేర్కొన్నారు.

    డ్రంకన్‌ డ్రైవ్‌లో ఒకరికి రెండు రోజుల జైలు

    ఖలీల్‌వాడి: డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఒకరికి మెజిస్ట్రేట్‌ నూర్జహాన్‌ రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టబడ్డు 13 మందిని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో 12 మందికి రూ. 15 వేల జరిమానా విధించగా ఆర్మూర్‌కు చెందిన సయ్యద్‌ అజ్జుకు రెండు రోజుల జైలు శిక్షను మెజిస్ట్రేట్‌ విధించినట్లు సీఐ ప్రసాద్‌ తెలిపారు.

    జీపీకి ఫ్రీజర్‌ అందజేత

    డిచ్‌పల్లి: మండలంలోని ఘన్‌పూర్‌కు చెందిన హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సభ్యులు బుధవారం మృతదేహాన్ని పరిచే ఫ్రీజర్‌ను జీపీకి అందించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, జీపీ కార్యదర్శి, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

     

  • చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

    డిచ్‌పల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాపోటీల్లో రాణించాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య సూచించారు. బుధవారం మండలంలోని డిచ్‌పల్లి ఖిల్లా జెడ్పీ పాఠశాలను సీపీ సందర్శించారు. పాఠశాలకు రూ.60వేలు విలువ గల క్రీడాపరికరాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి వితరణ చేశారు. ఈ క్రీడాపరికరాలను సీపీ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. సీపీ మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ పీడీగా అవార్డు తీసుకున్న పీడీ స్వప్నను సీపీ సన్మానించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి సీఐ వినోద్‌, ఎస్సై ఎండీ షరీఫ్‌, పాఠశాల హెచ్‌ఎం బి.సీతయ్య, ఖిల్లా రామాలయ కమిటీ చైర్మన్‌ జంగం శాంతయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ సావిత్రి, గ్రామపెద్దలు బూస సుదర్శన్‌, నర్సారెడ్డి, యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  • సీపీఐఎంఎల్‌ ఆధ్వర్యంలో విద్రోహ దినం

    నిజామాబాద్‌ సిటీ/ డిచ్‌పల్లి: భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నెత్తుటేరులో ముంచిన సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు చీకటి రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. కోటగల్లి ఎన్‌ఆర్‌భవన్‌లో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో విద్రోహ దినం సదస్సు నిర్వహించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులను అణచడానికి జవహాల్‌లాల్‌ నెహ్రూ కుట్రలు పన్నారని అన్నారు. సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి పుట్ట వరదయ్య ఆధ్వర్యంలో నాగారంలో విద్రోహ దినోత్సవం నిర్వహించారు. నాందేవ్‌వాడలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన తెలంగాణ సాయుధ రైతాంగ సభ నిర్వహించారు. కార్యదర్శివర్గ సభ్యురాలు నూర్జహాన్‌, నాయకులు పాల్గొన్నారు. డిచ్‌పల్లిలో సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ ప్రజాపంథా డిచ్‌పల్లి మండల కార్యదర్శి బోశెట్టి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ సభ నిర్వహించారు. మాస్‌లైన్‌ ప్రజాపంథా నాయకులు పాల్గొన్నారు.

  • రైతులను ఆదుకోండి

    నిజామాబాద్‌ రూరల్‌: ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జిల్లాకు వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి కంఠేశ్వర్‌లోని రూరల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగెట్‌ శేఖర్‌గౌడ్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి, నూడా చైర్మన్‌ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మునిపల్లి సాయారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

  • ఘనంగా

    సుభాష్‌నగర్‌/ ధర్పల్లి/ సిరికొండ/ మోపాల్‌/ నిజామాబాద్‌ రూరల్‌: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ యుగపురుషుడని అన్నారు. జీజీహెచ్‌లో పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు మహిపాల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, ఆలయంలో పూజలు నిర్వహించారు. సపాయి కార్మికులకు చేతు గ్లౌజులు, డెటాల్‌ సబ్బులను అందజేశారు. సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి హాజరయ్యారు. శుభోదయం పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. మోపాల్‌ మండల కేంద్రంలోని కేజీబీవీలో పదోతరగతి విద్యార్థినులకు బీజేపీ నాయకులు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. నగరంలోని గాజుల్‌పేటలో ఉన్న గురుద్వారాలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

  • ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

    జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలు, అధికారులు

    నిజామాబాద్‌ సిటీ/ సిరికొండ/ ధర్పల్లి/ డిచ్‌పల్లి/ మోపాల్‌/ సుభాష్‌నగర్‌/ నిజామాబాద్‌ రూరల్‌/ నిజామాబాద్‌నాగారం/ నిజామాబాద్‌ లీగల్‌/ జక్రాన్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పా లన వివరిస్తూ ప్రజాపాలన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో అడిషనల్‌ కలెక్టర్‌ అంకిత్‌, నుడా కార్యాలయంలో చైర్మన్‌ కేశవేణు, కాంగ్రెస్‌ భవన్‌లో జిల్లా గ్రంథాలయ చైరమ్న్‌ అంతిరెడ్డి రాజారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించా రు. సిరికొండ, ధర్పల్లి, డిచ్‌పల్లి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల్లో ప్రజాపాలన వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో స్‌ జిల్లా కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షుడు సుమన్‌ కుమార్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రి న్సిపాల్‌ ఎన్‌ కృష్ణమోహన్‌, జిల్లా కోర్టు ప్రాంగ ణంలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో, జక్రాన్‌పల్లిలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • యూరియ

    సిరికొండ: మండలంలోని తూంపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బుధవారం బారులు తీరారు. సొసైటీకి మంగళవారం 225 సంచుల యూరియా వచ్చింది. బుధవారం పంపిణీ చేస్తారని ఉదయం ఆరు గంటల నుంచే రైతులు సొసైటీ వద్దకు తరలివచ్చారు. అధికారులు వచ్చేంత వరకు వరుసలో నిలబడలేక చెప్పులను వరుసలో ఉంచారు. పోలీసుల సహకారంతో ఏవో నర్సయ్య, సొసైటీ సీఈవో దేవిలాల్‌, సిబ్బంది ఒక్కో రైతుకు రెండు సంచుల చొప్పున యూరియాను పంపిణీ చేశారు.

    నిజామాబాద్‌ లీగల్‌: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జి. ఉదయభాస్కర్‌ రావు అన్నారు. నగరంలోని అంబేడ్కర్‌ కాలనీలో బుధవారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏడాదికి రూ. మూడు లక్షలకన్నా ఆధాయం తక్కువ ఉన్న వారికి ఉచిత న్యా య సహాయం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు,కాలనీవాసులు పాల్గొన్నారు.

    నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని సీతారాంనగర్‌ కాలనీలో ఉన్న అభయాంజనేయ ఆలయం వద్ద యువ నేత్ర యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బుధవారం దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో యూత్‌ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

  • ఘనంగా

    నిజామాబాద్‌ రూరల్‌/ సిరికొండ/ ధర్పల్లి: ఆర్యనగర్‌లోని హనుమాన్‌ మందిర కమిటీ హాల్‌లో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్‌కు పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకటేశం, రమేశ్‌, అంజయ్య, గంగేశ్వర్‌, లక్ష్మీనారాయణ, రామస్వామి, విశ్వనాథ్‌, సంఘ సభ్యులు వెంకట చారి, గంగాధర్‌, పురుషోత్తం, దేవ శర్మ, అశోక్‌, రాంబాబు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని న్యావనందిలో విశ్వకర్మ చిత్ర పటానికి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పూజలు చేశారు. ధర్పల్లిలో మండలంలో మైలారంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శోభాయాత్ర నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు.

  • పంటలను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలి

    జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు

    మోపాల్‌: రైతులు పండించిన పంటలను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని, గిట్టుబాటు ధర వచ్చిన సమయంలో విక్రయించుకోవాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు సూచించారు. బుధవారం నగర శివారులోని బోర్గాం(పి) సొసైటీలో గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గిడ్డంగుల్లో పంటలను భద్రపర్చుకున్న సమయంలో పొందిన రసీదుల ఆధారంగా రైతులు బ్యాంకుల ద్వారా రు ణాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఐసీఎం డాక్టర్‌ శ్యాంకుమార్‌ మాట్లాడుతూ.. రైతులు గోదాములను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సహకార శాఖ అధికారి సరస్వతి, సొసైటీ వైస్‌ చైర్మన్‌ జయకృష్ణారెడ్డి, డైరెక్టర్లు గంగదాస్‌, సాయిరెడ్డి, మోహన్‌, నారాయణ, రైతులు సూర్యారెడ్డి, చిట్టి సాయిరెడ్డి, సుభాష్‌, రాజారెడ్డి, హన్మాండ్లు, పండరి, వ్యాపారులు, సొసైటీ సిబ్బంది నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

  • సీఎం సలహాదారుకు వినతులు

    నిజామాబాద్‌నాగారం: ఉద్యోగుల సమస్యలపై జిల్లాకు వచ్చిన సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి టీఎన్జీవోస్‌, రెవెన్యూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విన్నవించారు. అనంతరం వేం నరేందర్‌ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్‌ కుమార్‌, రెవె న్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్‌, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్‌ హుస్సేన్‌, జాకీర్‌ హుస్సేన్‌, శశికాంత్‌ రెడ్డి, విశాల్‌, మారుతి, సునీల్‌ పాల్గొన్నారు.

    ఎస్సీ వర్గీకరణతో రోస్టర్‌ పాయింట్‌ల విధానంలో మాలలకు అన్యాయం జరుగుతుందని వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌ ఆధ్వర్యంలో జిల్లా మాల మహానాడు కార్యవర్గ సభ్యులు సీఎం సలహాదారుడికి వినతిపత్రం అందజేశారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చొక్కం దేవీదాస్‌, నాంది వినయ్‌ కుమార్‌, ఆసది గంగాధర్‌, పి.చంద్ర కాంత్‌, బీస భూమయ్య, శంకరయ్య, బాలస్వామి, దొడ్డి మోహన్‌, భూషణ్‌, గంగాధర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Nirmal

  • త్యాగధనుల పోరాటంతో తెలంగాణకు విమోచనం

    భైంసా: త్యాగధనుల పోరాటంతోనే తెలంగాణకు విమోచనం కలిగిందని ఎమ్మెల్యే రామరావ్‌ పటేల్‌ అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్‌ జిన్నింగ్‌ మిల్లులో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం పాలననుంచి విముక్తి కల్పించడానికి కుమురంభీం, రాంజీగోండు లాంటి ఎందరో పోరాట యోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ తాడేవార్‌ సాయినాథ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బి. గంగాధర్‌, నాయకులు రావుల రాము, సుష్మారెడ్డి, గాలి రవి, వడ్నపు శ్రీనివాస్‌, గౌతం పింగ్లే, తదితరులు పాల్గొన్నారు.

    కేంద్ర ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు

    భైంసా: కేంద్ర ప్రభుత్వ హయాంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రామారావు పటేల్‌ అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా భైంసాలోని ఎస్‌ఎస్‌ జిన్నింగ్‌ మిల్లులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. భారత కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సేవా పక్వాడ్‌ జిల్లా కో కన్వీనర్‌ చిన్నారెడ్డి, నాయకులు రావుల పోశెట్టి, మల్లేశ్‌, సొలంకి భీమ్‌రావు, పండిత్‌ రావు, దిలీప్‌, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

  •  SP saluting the national flag

    నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె ప్రజా పాలన ప్రాముఖ్యత పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు అందే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్‌ మీనా, ఏవో యూనస్‌ ఆలీ, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

    ఆర్జీయూకేటీలో..

    బాసర: బాసర ఆర్జీయూకేటీలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజేశ్‌, డీన్లు చంద్రశేఖర్‌, విఠల్‌, మహేశ్‌, పీడీ శ్యాంబాబు, పాల్గొన్నారు.

  • పోరాట వారసత్వం  కమ్యూనిస్టులదే

    నిర్మల్‌టౌన్‌: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడుత రవీందర్‌ అన్నారు. బుధవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం రాజులు, భూస్వాములు, రజాకార్ల అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజానీకం చేసిన పో రాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టం అన్నారు. కమ్యూనిస్టులు చేసిన పోరాటం ఫలితంగానే దొరలు, దేశ్‌ముఖ్‌లు గడీలు వది లి హైదరాబాద్‌ పారిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్‌ కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు సురేష్‌, సుజాత, జిల్లా కమిటీ సభ్యులు శంభు, గంగామణి, ముత్యం, తిరుపతి, నారాయణ, సంతోష్‌ పాల్గొన్నారు.

  • ‘యాత్రాదానం’  విజయవంతం చేయాలి

    నిర్మల్‌టౌన్‌: ఆర్టీసీ చేపట్టిన యాత్రాదానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సోలోమాన్‌ అన్నా రు. బుధవారం నిర్మల్‌ ఆర్టీసీ డిపోను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. బస్టాండ్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, దాతలు, నాయకులు పెద్ద మనసుతో ఆలోచించి పేద విద్యార్థులను, దివ్యాంగులను యాత్రలకు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను బుక్‌ చేయించి ఉదారతను చాటుకోవాలని సూచించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ రీజియన్‌ డిప్యూటీ ఆర్‌ఎం శ్రీహర్ష, నిర్మల్‌ డిపో మేనేజర్‌ పండరి, సహాయ మేనేజర్లు దేవపాల, నవీన్‌ కుమార్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

SPSR Nellore

  •  గుండ

    విధి.. ఐదు కుటుంబాల్లో గుండెలు పిండే విషాదాన్ని నింపింది. అందరూ దగ్గరి బంధువులే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును పరామర్శించేందుకు కారులో బయల్దేరిన వీరిని ఇసుక టిప్పర్‌ మృత్యువై కబళించింది. మృతుల్లో రెండు కుటుంబాల భార్యాభర్తలు ఉన్నారు. మహిళలిద్దరూ తోబుట్టువులు. వీరి మరణంతో ఆ దంపతుల బిడ్డలు అనాథలయ్యారు. అంతులేని విషాద ఘటనకు సంబంధించి బంధువులెవర్ని కదిలించినా కన్నీటి సుడులు.. గుండెలవిసే ఆవేదన పెల్లుబుకుతోంది. అధికార పార్టీ నేతల ధనదాహానికి ఏడు నిండు ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఆ కుటుంబాలు కకావికలమయ్యాయి.

    సంగం / నెల్లూరు (క్రైమ్‌) / ఆత్మకూరు / నెల్లూరు(పొగతోట): ఇసుకాసురుల ధనదాహం.. ఏడుగురి ప్రాణాలను బలిగొంది. మద్యం మత్తులో డ్రైవర్‌ భారీగా ఇసుక లోడ్‌తో మితిమీరిన వేగంతో రాంగ్‌రూట్‌లో వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో మృత్యుఘోష మిన్నంటింది. సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో మృతుల కుటుంబాలు కకావికలమయ్యాయి.

    బావను పరామర్శించేందుకెళ్తూ..

    బాలవెంగయ్య, తాళ్లూరు రాధమ్మ, చల్లగుండ్ల లక్ష్మి అన్నా చెల్లెళ్లు. మరో చెల్లెలు లక్ష్మి భర్త మధు ప్రస్తుతం వింజమూరు మండలం తక్కెళ్లపాడులో ఉంటున్నారు. మధు ఈ నెల 16వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆత్మకూరు ప్రభుత్వాస్ప త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు శేషం బాలవెంగయ్య, వదిన శేషం శారమ్మ, బావలు, చెల్లెళ్లు తాళ్లూరు రాధమ్మ, శ్రీనివాసులు దంపతులు, చల్లగుండ్ల లక్ష్మి, శ్రీనివాసులు దంపతులు బుధవారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో నెల్లూరు నుంచి తమ కారులో బయల్దేరారు. 

    మరికొన్ని నిమిషాల్లో చేరుకుంటారనుకున్న వీరి కారును ఇసుక అక్రమ రవాణా సాగించే టిప్పర్‌ మృత్యుశకటమై కబళించేసింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో బాలవెంగయ్య మృతి చెందడంతో ఆయన భార్య శారదమ్మ తమ పరిస్థితి ఏమిటంటూ, తన కుమార్తెల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయంటూ కన్నీరుమున్నీరుగా గుండెలవిసేలా రోదించారు. ఇసుక టిప్పర్‌ తమ కుటుంబాలను సర్వనాశనం చేసిందని వారి బంధువులు శాపనార్థాలు పెట్టారు. ఈ బిడ్డల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల ధనదాహంతోనే ఇలా జరిగిందని, రెండు కుటుంబాలు సర్వనాశనమయ్యాయని బంధువులు విలపిస్తున్నారు.

    బంధువుల ఆర్తనాదాలతో విదారకం

    పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంతో వారి తరఫు బంధువులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అందరూ దళిత కుటుంబీకులే. పరామర్శకు వస్తూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడడం చూసిన వారి హృదయాలను కలిచి వేసింది. పోస్టుమార్టం జరుగుతున్న ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వద్ద మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకరంగా మారింది. ఆస్పత్రిలో పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆత్మకూరు ఆర్డీఓ బి పావని, ఏఎస్పీ సౌజన్య, సీఐ నాగేశ్వరమ్మ, ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్‌, సంగం, ఆత్మకూరు సీఐలు వేమారెడ్డి, ఎం గంగాధర్‌, పలు స్టేషన్ల ఎస్సైలు హాజరయ్యారు.

    ఊరూరా విషాదఛాయలు

    గుర్రాలముడుగు సంఘంలో విషాదఛాయలు అలముకున్నాయి. శారమ్మ, బాలవెంగయ్య కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గుండెలవిసేలా రోదిస్తుండడంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. విషయం తెలుసుకున్న బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. సాంబశివరావు హుటాహుటిన అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. వారి కుటుంబ సభ్యులను, బంధువులను ప్రత్యేక వాహనంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులు స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. శారమ్మ, బాలవెంగయ్య అందరితో కలివిడిగా ఉంటేవారని అలాంటి వారిని మృత్యువు కబళించడం జీర్ణించుకోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్నీ విధాలా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

    స్టోన్‌హౌస్‌పేట సాలివీధిలో..

    రోడ్డు ప్రమాదంలో తాళ్లూరు శ్రీనివాసులు, రాధమ్మ దంపతులు మృతి చెందడంతో వడ్డిపాళెంతో పాటుగా నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సాలివీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసులు దంపతులు కొంతకాలంగా సాలివీధిలో శ్యామ్‌ ఫాస్ట్‌ఫుడ్స్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఫంక్షన్లకు ఆర్డర్‌లపై టిఫిన్స్‌ సప్లయి చేసేవారు. నాణ్యమైన ఫుడ్‌ అందిస్తుండటంతో అనతికాలంలోనే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ బాగా క్లిక్‌ అయింది. ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాలకు చెందిన వారు టిఫిన్‌ చేసేందుకు వచ్చేవారు. అందరితో శ్రీనివాసులు కలివిడిగా ఉండేవారు. ఎప్పటిలాగే టిఫిన్‌ చేసేందుకు కస్టమర్లు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వద్దకు వచ్చారు. సెంటర్‌ మూసి ఉండటంతో పక్క దుకాణదారుల ద్వారా విషయం తెలుసుకుని బాధపడ్డారు.

    ఇందుకూరుపేటలో..

    ఇందుకూరుపేట: సంగం మండలం పెరమన వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందుకూరుపేట దళితవాడ (అరుంధతీయవాడ)కు చెందిన చల్లగుండ్ల శ్రీనివాసులు, భార్య లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందడంతో ఇందుకూరుపేటలో విషాదం నెలకొంది. రోజులాగే కూలీలను ఎక్కించుకొని నరుకూరు రోడ్డులో వదిలారు. అక్కడ నుంచి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు ఆటోలో నెల్లూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుమార్తె చందు ప్రియ, కుమారుడు విశ్వంత్‌ స్కూల్‌కు వెళ్లారు. భార్యాభర్తలు ఇరువురు బంధువులతో కలిసి కారులో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. అప్పటి వరకు తమ కళ్ల ఎదుటే ఉన్న శ్రీనివాసులు, లక్ష్మి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో దళితవాడ వాసులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోవడంతో బిడ్డలిద్దరు అనాథలుగా మిగిలిపోయారు.

    మేకపాటి విక్రమ్‌రెడ్డి సంతాపం

    పెరమన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సమీప బంధువులు ఏడుగురు మృతి చెందడం బాధాకరమని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఆయన పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి ప్రమాద స్థలం వద్ద సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరే కుటుంబంలోనూ జరగకూడదన్నారు. తల్లిదండ్రులను, మరో కుటుంబంలో పిల్లలను కోల్పోయిన వారి బాధ తీర్చలేనిదని, వారికి ప్రభుత్వ పరంగా జరగాల్సిన అన్ని సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన కోరారు.

    ఎమ్మెల్సీ పర్వతరెడ్డి సంతాపం..

    నెల్లూరు జిల్లాలో కూటమి నేతల ధనదాహం కారణంగా ఇసుక అక్రమ రవాణా ఏడుగురు ప్రాణాలను బలి తీసుకున్న విషాదకర ఘటన బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి బంధువులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

    నా భర్తను చూపించండయ్యా...

    తన భర్త బాలవెంగయ్య మృతి చెందాడని తెలుసుకున్న అతని భార్య శారదమ్మ ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపిస్తూ.. నా భర్తను చూపించండయ్య అంటూ గుండెలవిసేలా రోదిస్తూ కనిపించిన అందరిని పట్టుకుని అడుగుతుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. కారులో విగతజీవి అయి మాంసం ముద్దగా ఉన్న బాలవెంగయ్య మృతదేహాన్ని చూపలేక పోలీసులు, కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు.

    కన్నీరు పెట్టిన తనయుడు

    తల్లి శేషం శారమ్మ మృతి చెందడంతో కుమారుడు తేజ కన్నీరుమున్నీరుగా విలపించారు. నెల్లూరు నుంచి వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులు అతడ్ని ఓదార్చలేకపోయారు. తండ్రి చనిపోయాడు. ఈ రోజు తల్లి కూడా పోయింది.. నాకెవరు దిక్కు అంటూ బోరున విలపించాడు.

    డ్రైవర్‌ నా కొడుకే..

    అయ్యా డ్రైవర్‌ బ్రహ్మయ్య నా కొడుకే.. ఎక్కడున్నాడో చూపించండయ్యా అంటూ అతని తల్లి వెంకట రమణమ్మ, అక్క పార్వతి కన్నీరుమున్నీరుగా విలపించారు. నా కొడుకు బ్రహ్మయ్యకు బాల వెంగయ్యతో పరిచయం ఉండడంతో కారు డ్రైవింగ్‌ కోసం ఆత్మకూరుకు వెళ్లాలని ఉదయాన్నే పిలుచుకెళ్లాడు. అంతే తిరిగి రాని లోకాలకు వెళ్లాడంటూ.. చేతికంది వచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారంటూ విలపిస్తుంటే.. స్థానికులు సైతం కంటతడి పెట్టారు.

    ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్పీ

    సంగం: రోడ్డు ప్రమాద ఘటనా స్థలిని బుధవారం రాత్రి ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. రోడ్డు ప్రమాద కారణాలను, మృతుల వివరాలు, ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్‌ డ్రైవర్‌, యజమాని వివరాలను స్థానిక సీఐ కె. వేమారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని, ఇప్పటికే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • రైతన్న గోడు పట్టని సీఎం

    మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

    పొదలకూరు: ధాన్యం ధరలు రోజురోజుకూ దిగజారుతున్నా.. మాటలతో సీఎం చంద్రబాబు కాలయాపన చేస్తూ రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని మహ్మదాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. తనను కలిసిన రైతులతో వివిధ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో క్వింటాల్‌ ఉల్లి ధరలు రూ.3500 ఉండగా, ఇప్పుడు రూ.600కు పతనమయ్యాయని చెప్పారు. వరి పండించిన రైతులు గిట్టుబాటు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. సూపర్‌సిక్స్‌ పథకాల్లో కొన్నింటిని అసలు పట్టించుకోకపోగా, మిగిలిన వాటిని తూతూమంత్రంగా అమలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా అందక రైతులు నానా అగచాట్లు పడుతుంటే, చంద్రబాబు మాత్రం పూటకో మాట మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్‌ కళాశాలలను మంజూరు చేయించి నిర్మిస్తే, వాటిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేయడం రాష్ట్ర ప్రజలను కలిచివేస్తోందని తెలిపారు.

    చంద్రబాబు, ఆయన అనుకూల పత్రికలు, మీడియా విషప్రచారానికి తెరలేపాయని పేర్కొన్నారు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు వీల్లేకుండా, వారి ఆశలపై నీరుజల్లుతూ ఆయన తీసుకున్న నిర్ణయాలే మేలైనవిగా ప్రచారం చేయించుకుంటున్నారని విమర్శించారు. రూ.లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రచారార్భాటంలో చూపే చొరవ కార్యరూపంలో లేదని ఎద్దేవా చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం పార్టీ నేత, సొసైటీ మాజీ చైర్మన్‌ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి తల్లి పెంచలమ్మ దశదిన కర్మకు హాజరై నివాళులర్పించారు. నేతలు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, కరిపరెడ్డి కృష్ణారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, మాలకొండారెడ్డి, కోనం బ్రహ్మయ్య, కమలాకర్‌రెడ్డి, రమణారెడ్డి, లచ్చారెడ్డి, చెంచుకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • 21న జిల్లా స్థాయి  సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపిక

    నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా స్థాయి సీనియర్స్‌ పురుషులు, సబ్‌ జూనియర్స్‌ బాలబాలికల సాఫ్ట్‌బాల్‌ జట్లను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆదివారం ఉదయం పది గంటలకు ఎంపిక చేయనున్నామని అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, కార్యదర్శి కామేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌ జూనియర్స్‌ బాలబాలికలు 2011, జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్‌తో పాటు వయస్సు ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని, వివరాలకు 97036 54315, 80742 99640 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

    డిజిటల్‌ మారథాన్‌లో భాగస్వాములుకండి

    నెల్లూరు రూరల్‌: ఆంధ్ర యువ సంకల్ప్‌ రాయబారి డిజిటల్‌ మారథాన్‌లో యువత భాగస్వాములు కావాలని సెట్నెల్‌ ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వారు తమ పేర్లను ఈ నెల 30లోపు నమోదు చేసుకోవాలని కోరారు. 120 సెకన్ల నిడివి గల వీడియో పార్ట్‌లను అధికారిక హ్యాష్‌ట్యాగ్‌తో సొంత సోషల్‌ మీడియా ద్వారా చేయాలని సూచించారు. ఎంట్రీలను జ్యూరీ సమీక్షించి, ఉత్తమమైన వాటిని షార్ట్‌ లిస్ట్‌ చేసి విజేతలను ప్రకటించనుందని వివరించారు. మొదటి మూడు బహుమతులుగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలను అందజేయడంతో పాటు తొమ్మిది మంది విజేతలను ఆంధ్ర యువత బ్రాండ్‌ అంబాసిడర్‌గా సత్కరించనున్నామని ప్రకటించారు. పాల్గొన్న అందరికీ డిజిటల్‌ క్రియేటర్‌ ఏపీ 2కే25 సర్టిఫికెట్లను అందజేయనున్నామని తెలిపారు.

    ఐ అండ్‌ పీఆర్‌ డీడీ

    బాధ్యతల స్వీకరణ

    నెల్లూరు రూరల్‌: జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలను వేణుగోపాల్‌రెడ్డి బుధవారం స్వీకరించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏడీగా ఉన్న ఆయన్ను ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమించారు.

    11 బార్లకు

    దరఖాస్తుల దాఖలు

    నెల్లూరు(క్రైమ్‌): బార్లకు దరఖాస్తుల దాఖలుకు గడువును పొడిగించినా, వ్యాపారుల స్పందన నామమాత్రంగానే ఉంది. జిల్లాలో 33 బార్లకు రీనోటిఫికేషన్‌ను ఎకై ్సజ్‌ అధికారులు ఈ నెల మూడున జారీ చేశారు. ఆన్‌లైన్‌ / ఆఫ్‌లైన్‌ విధానాల్లో 14వ తేదీ సాయంత్రం ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ.. లాటరీ డ్రాను 15న నిర్వహించాల్సి ఉంది. అయితే 11వ తేదీ నాటికి కేవలం ఐదు బార్లకే దరఖాస్తులొచ్చాయి. దీంతో స్వీకరణ గడువును బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించారు. ఈ క్రమంలో చివరి రోజు నాటికి నెల్లూరులోని ఆరు బార్లకు 24.. కావలిలోని మూడింటికి 12.. బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పంచాయతీల్లోని రెండింటికి ఎనిమిది దరఖాస్తులు దాఖలయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు పది బార్లకు 44 దరఖాస్తులొచ్చాయి. కలెక్టరేట్లోని శంకరన్‌ హాల్లో కలెక్టర్‌ సమక్షంలో లాటరీ డ్రాను గురువారం ఉదయం తొమ్మిది గంటలకు తీయనున్నారు.

    శ్రీవారి దర్శనానికి

    24 గంటలు

    తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం అ ధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. స్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 63,607 మంది దర్శించుకున్నారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

  • టీడీపీ నేత ధనదాహమే..

    సంగం: పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఐదుగురు దళిత కుటుంబాల్లో పెనువిషాదం నింపింది. ఓ టీడీపీ నేత ధనదాహం ఏడుగురిని కబళించింది. ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎటువంటి అనుమతులు లేకపోయినా.. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నారు. సామర్థ్యానికి మించి ఇసుక లోడ్‌ చేసుకుని మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. పెరమన దుర్ఘటనకు కారణమైన AP 39 WH 1695 టిప్పర్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏఎస్‌పేట మండలం చిరమనకు చెందిన కాటం రవీంద్రారెడ్డికి చెందిన కేపీఆర్‌ మైన్స్‌ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. మైనింగ్‌ కంపెనీ చాటున చేజర్ల మండలం పెరుమాళ్లపాడు, అనంతసాగరం మండలం పడమటికంభంపాడులో అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఏడుగురు మృత్యువాతకు కారణమైన టిప్పర్‌ దేశం నేతది కావడంతో ఈ కేసు తారుమారుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. డ్రైవర్‌గా మరో వ్యక్తిని బలి చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సమాచారం.

  • అయ్యో

    క్లస్టర్లు, రిటైర్‌మెంట్‌ స్థానాల్లో పోస్టింగ్‌

    జిల్లాలో ఆగస్ట్‌ వరకు రిటైరైన ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకుని కొత్త టీచర్లకు పోస్టింగ్‌ ఇస్తాం. ఇప్పటికే రిటైర్‌మెంట్‌తో కొన్ని స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేస్తాం, మిగిలిన కొత్త టీచర్లను ఆయా మండలాల్లోని క్లస్టర్లకు కేటాయిస్తాం. అక్కడి నుంచి వారి సేవలను వినియోగించుకుంటాం. సీనియారిటీ విషయంలో అన్యాయం జరగదు.

    – ఆర్‌.బాలాజీరావు, డీఈఓ

    నెల్లూరు(టౌన్‌): కొత్త ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి విద్యాశాఖలో గందరగోళం నెలకొంది. జిల్లాలో పూర్తి స్థాయిలో సర్దుబాటు చేసి ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం హడావుడిగా ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏలు) సర్‌ప్లస్‌లో ఉండగా వారిని క్లస్టర్లకు కేటాయించారు. కొత్తగా 542 మంది ఎస్‌ఏలు జిల్లాకు రానున్నారు. వీరి నియామకం కోసం జిల్లాలో ఎక్కడా ఖాళీల్లేవు. దీంతో క్లస్టర్లకు కేటాయించిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా 400కు పైగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 115కు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ క్లస్టర్లలో 532 పోస్టులను కేటాయించింది. జిల్లాలోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు సెలవు పెడితే వారికి విధులు కేటాయించనున్నారు. దీంతోపాటు రిటైరైన వారి స్థానంలో క్లస్టర్లలో ఉన్న అయ్యోర్లను ఆ పాఠశాలకు పంపించే ఆలోచనలో విద్యాశాఖ అధికారులున్నారు.

    అలా చేయకుండా..

    సాధారణంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చే సమయంలో రీ అపోర్ష్‌మెంట్‌ చేసిన తర్వాతే ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అయితే ప్రభుత్వం హడావుడి, హంగామా కారణంగా జిల్లాలో అవసరానికి మించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మిగులు పోస్టులను పరిగణలోకి తీసుకోలేదు. ఖాళీలను పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో 673 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీరిలో 657 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. అభ్యర్థులు లేరనే కారణంతో 16 పోస్టులను ఖాళీగా ఉంచారు. అయితే మే, జూన్‌ నెలల్లో ఉపాధ్యాయులకు రీ అపోర్ష్‌మెంట్‌ జరిగింది. మిగులు ఉపాధ్యాయులకు ఖాళీ పోస్టులున్న పాఠశాలల్లో అవకాశం కల్పించారు. జిల్లాలో 192 మంది స్కూల్‌ అసిస్టెంట్లు సర్‌ప్లస్‌ ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. వీరు, కొత్తగా వచ్చే 542 మంది ఎస్‌ఏలను క్లస్టర్లకే పరిమితం చేయనున్నట్లు తెలిసింది. అయితే సర్‌ప్లస్‌లో ఉన్న వారిని ఎస్జీటీ పోస్టులకు పంపనున్నారా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. దీనిపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి గైడ్‌లైన్స్‌ రాలేదు.

    వారిలో ఆందోళన

    కొత్తగా వచ్చే స్కూల్‌ అసిస్టెంట్లకు జిల్లాలో రిటైరైన వారి స్థానంలో పోస్టింగ్‌ ఇస్తే ఇప్పటికే క్లస్టర్లలో ఉన్న టీచర్లు వారి కంటే జూనియర్లవుతారు. దీంతో పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.

    పబ్లిసిటీ పిచ్చితో..

    కొత్త ఉపాధ్యాయ నిమామకంలో ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది. నియామకపత్రాలను ఈనెల 19న విజయవాడలో సీఎం చేతుల మీదుగా అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఎంపికై న వారు ఒక సహచరుడిని తీసుకుని రావొచ్చని ప్రకటించారు. మొత్తం 1,314 మంది కానున్నారు. వీరంతా గురువారం వెంకటాచలం మండలం గొలగమూడిలో రిపోర్టు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి అక్కడ ఉంచి మరుసటి రోజు బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్లనున్నారు. ఇందుకు 31 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. రూ.13.02 లక్షలకు పైగా ఖర్చువుతుంది. దీంతోపాటు అందరికీ అల్పాహారం, భోజనాలు, వసతులు తదితర వాటికి మరో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు అవ్వొచ్చు. అంటే జిల్లాకు రూ.18 లక్షల నుంచి రూ.19 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఇంత మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    తప్పనిసరిగా రావాలి

    ఎంపికై న ఉపాధ్యాయులు గురువారం సాయంత్రం 4 గంటల్లోపు గొలగమూడిలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. నియామకపత్రాలు అందుకునే టీచర్లు ఆధార్‌, 2 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, (ఉపాధ్యాయుడు, సహచరుడు ఫొటోలు), డీఎస్సీ హాల్‌టికెట్‌ తెచ్చుకోవాలన్నారు.

    జిల్లాకు కొత్తగా 657 మంది

    రేపు నియామకపత్రాల అందజేత

    ఇప్పటికే 192 మంది సర్‌ప్లస్‌ టీచర్లు

    కొత్తవారు సైతం క్లస్టర్లకే పరిమితమా?

    సెలవు పెట్టిన లేదా రిటైరైన వారి స్థానంలో బోధన

  • జింకన

    నెల్లూరు(అర్బన్‌): రూరల్‌ మండల పరిధిలోని ఆమంచర్ల ఎస్టీ కాలనీకి చెందిన నంబూ రి నాగయ్య అనే వ్యక్తి బుధవారం మట్టెంపాడు వద్ద ఉచ్చు బిగించి చుక్క ల జింకను వధించాడు. మాంసాన్ని అక్కడే అమ్ముతుండగా ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందింది. రేంజ్‌ ఆఫీసర్‌ మాల్యాద్రి ఆధ్వర్యంలో ఆమంచర్ల ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఎం.శ్రీనివాసులు, దొంతాలి బీట్‌ ఆఫీసర్‌ మనోజ్‌కుమార్‌ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి నాగయ్యను పట్టుకున్నారు. కిలో జింక మాంసం, తల, చర్మంతో సహా స్వాధీనం చేసుకుని నెల్లూరులోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అనంతరం నెల్లూరులో కోర్టు వారికి అప్పగించగా ముద్దాయికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాల్యాద్రి మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    బస్సు ఆపలేదని డ్రైవర్‌పై దాడి

    ఆత్మకూరు: బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన బుధవారం జరిగింది. ఆత్మకూరు డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంగళరెడ్డి వింజమూరు మార్గంలో బస్సును తీసుకెళ్లాడు. తిరిగి ఆత్మకూరుకు వస్తున్న క్రమంలో అప్పటికే వంద మంది పైనే జనం ఉన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితమంటూ ప్రకటించి దానికి తగిన బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో గంటల కొద్ది వేచిచూస్తున్న మహిళలు వచ్చిన బస్సులోనే ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. నబ్బీనగరం వద్ద పలువురు ప్రయాణికులు ఆత్మకూరుకు వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. అప్పుడే ఆ బస్సు వచ్చింది. స్థలం లేకపోవడంతో అక్కడి వారు చేయి చూపించినా ఆపకుండా డ్రైవర్‌ ముందుకు వచ్చేశాడు. దీంతో ఆ గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి మోటార్‌బైక్‌పై వచ్చి బస్సును క్రాస్‌ చేసి అడ్డుగా పెట్టాడు. బస్సు ఎందుకు గ్రామంలో ఆపలేదంటూ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. అతని తల, చేతికి గాయాలయ్యాయి. పలువురు సర్ది చెప్పడంతో వెంగళరెడ్డి గాయపడినా బస్సును ఆత్మకూరుకు తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎస్‌కే జిలానీ కేసు నమోదు చేశారు.

    అదనపుకట్నం కోసం వేధింపులు

    నెల్లూరు(క్రైమ్‌): అదనపుకట్నం కోసం వివాహితను ఇంటి నుంచి గెంటేయడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటివారిపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. వెంకటరెడ్డినగర్‌కు చెందిన బింధు మాధవికి కావలికి చెందిన మహేష్‌తో గతేడాది పెద్దల సమక్షంలో వివాహమైంది. అప్పుడు వధువు కుటుంబ సభ్యులు కట్న కానుకల కింద రూ.1.50 లక్షల నగదు, 13 సవర్ల బంగారం మహేష్‌ కుటుంబానికి ఇచ్చారు. రెండునెలలు వారి కాపురం సజావుగా సాగింది. అనంతరం భర్త, అత్తింటివారు అప్పులున్నాయని రూ.10 లక్షలు కట్నం తీసుకురావాలని మాధవిని వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలో అత్తింటివారు ఆమెను పుట్టింట్లో వదిలారు. అప్పటి నుంచి ఆమె పెద్దల ద్వారా మాట్లాడినా వారిలో మార్పురాలేదు. బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • బేస్‌బాల్‌ ఎంపికలపై వివాదం

    భారత జట్టుకు అంటూ నిర్వాహకుల ప్రచారం

    ప్రశ్నించిన వివిధ క్రీడా సంఘాల నేతలు

    నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): బేస్‌బాల్‌ ఇండియా జట్టు ఎంపికల పేరుతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో హడావుడి జరిగింది. నాలుగో బీఎఫ్‌ఏ ఉమెన్స్‌ బేస్‌బాల్‌ ఆసియా కప్‌ సెలక్షన్‌ ట్రైల్స్‌ పేరుతో మంగళవారం స్టేడియంలో ఎంపికలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై బుధవారం స్థానిక క్రీడాకారులు, క్రీడా సంఘ నేతలు నిర్వాహకులను ప్రశ్నించారు. వసతుల్లేని చోట భారతదేశ జట్టును ఎంపిక చేయడం ఏంటని అడిగారు. కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ అనుమతి ఇచ్చారని వారు చెప్పారు. నేతలు నిర్వాహకుడి గురించి ఆరా తీస్తే నవలాకులతోట జెడ్పీ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడని తెలిసింది. ఫొటోలు తీయడం మొదలుపెట్టగానే అక్కడ కట్టిన ఫ్లెక్సీలను తీసేశారు. క్రీడాకారులు, నిర్వాహకులు వెళ్లిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంపికలంటూ రూ.లక్షలు దండుకుని తల్లిదండ్రులను మోసం చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. ఆటలాడేందుకు అనుమతిచ్చామని, అంతర్జాతీయ స్థాయి ఎంపికలకు ఎటువంటి పత్రాలు చూపించలేదని డీఎస్‌డీఓ అధికారులు చెబుతున్నారు.

  • జర్నల
    ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు

    పాలకులు చేసే తప్పులను జర్నలిస్టులు ఎత్తి చూపుతారు. వాస్తవాలను తమ కలం ద్వారా వెలుగులోకి తెస్తున్న వారిపై, పత్రికలపై అక్రమ కేసులు పెట్టడం జర్నలిజానికి సంకెళ్లు వేసినట్టే. ఇలాంటి చర్యలు సిగ్గుచేటు. ప్రజా సమస్యలపై వార్తలు రాశారనే కక్షతో సాక్షి ఎడిటర్‌తోపాటు ఆ పత్రిక జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గం. ఇకనైనా కేసులు ఎత్తివేయాలి. – కొండా ప్రసాద్‌, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సీపీఎం కార్యదర్శి

    ఏ ప్రభుత్వం తప్పు చేసినా వార్తల ద్వారా జర్నలిస్టులు ప్రశ్నిస్తారు. తప్పులు, మోసాలను ఎత్తి చూపినందుకు కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై కక్ష పెంచుకుంది. ఆ పత్రిక ఎడిటర్‌, జర్నలిస్టుల గొంతు నొక్కుతోంది. ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మెప్పుపొందాలి. ప్రజా గొంతుకలైన పత్రికలను బెదిరించడం మంచిది కాదు.

    – కృష్ణమూర్తి, సోషల్‌ వర్కర్‌, బుజబుజనెల్లూరు

  • బంగారు దుకాణాల్లో ఐటీ సోదాలు

    నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని రెండు బంగారు దుకాణాలపై కేంద్ర ఆదాయపన్ను శాఖ అధికారుల బృందాలు బుధవారం మెరుపుదాడులు నిర్వహించాయి. ఆచారివీధి, కాపువీధి తదితర ప్రాంతాల్లో ఉన్న డీపీ, జేటీ హోల్‌సేల్‌ బంగారు దుకాణాలు, వాటి యజమానుల నివాసాల్లో వేకువజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో బంగారు వ్యాపారుల్లో కలకలం రేగింది. ప్రధాన నగరాలతోపాటు హోల్‌సేల్‌ వ్యాపారం నిర్వహించే గోల్డ్‌ షాప్‌ల లక్ష్యంగా అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. నిత్యం కిలోల కొద్ది బంగారం క్రయవిక్రయం చేసే హోల్‌సేల్‌ దుకాణాల నిర్వాహకులు అందుకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా నిర్వహించలేదన్న ఫిర్యాదులు, ఆరోపణలు, బిల్లుల చెల్లింపు, రాబడి, ఖర్చు తదితర వివరాలను రికార్డుల్లో సరిగ్గా పొందు పరచలేదన్న ప్రధాన కారణంగానే ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. ఇటీవల బంగారం ధరకు నియంత్రణ లేకపోవడంతోపాటు కొద్దికాలంలోనే సుమారు 500 కిలోల బంగారానికి సంబంధించి ఆదాయపన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఆయా దుకాణాలతోపాటు యజమానులకు చెందిన ఆచారివీధి, కాపువీధి, పాత జెడ్పీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఉన్న వారి గృహాల్లో సైతం సోదాలు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిగాయి. స్థానిక పోలీస్‌, ఐటీ అధికారులకెవరికీ సమాచారం లేకుండానే కేంద్ర బలగాలతో నిర్వహించిన మెరుపు దాడులతో వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. దీంతో నగరంలోని వందల సంఖ్యలో ఉన్న రిటైల్‌ బంగారు వ్యాపార సంస్థలు, పదుల సంఖ్యలో ఉన్న హోల్‌సేల్‌ వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

    నెల్లూరులో ఏకకాలంలో..

    ఓ గోల్డ్‌, డైమండ్స్‌ వ్యాపారి

    ఇంట్లోనూ..

    బిల్లులు, రికార్డుల పరిశీలన

  • కసుమూరులో కానరాని ఏర్పాట్లు

    వెంకటాచలం: మండలంలోని కసుమూరు మస్తాన్‌వలీ దర్గా 248వ గంధ మహోత్సవాలు గురువారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు వక్ఫ్‌ బోర్డు అధికారులను ఆదేశించారు. వేలాది మంది భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏటా ముందస్తుగా ఏర్పాట్లు చేసేవారు. ప్రస్తుతం వక్ఫ్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై దర్గా ముజావర్లు, భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉత్సవాలకు రూ.16 లక్షలతో వసతులు కల్పించాల్సి ఉన్నా, విద్యుద్దీపాలంకరణ, దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇంకా తాగునీరు, మొబైల్‌ టాయ్‌లెట్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Family

  • ‘పెద్దమ్మతల్లి అంటేనే అందరికీ పెద్దదిక్కు.. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా ఇట్టే జరిగిపోతుంది. భక్తులపాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆ తల్లి నేనున్నానంటూ అందరికీ దీవెనలందిస్తోంది’ ఇదీ భక్తుల నమ్మకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆదివారం అయితే వేల సంఖ్యలోనే వస్తారు. కొత్తగూడెం–భద్రాచలం ప్రధాన రహదారిపై పెద్దమ్మతల్లి(కనకదుర్గమ్మ) ఆలయం ఉంటుంది. ఆ రహదారి పై వెళ్లే ప్రతి ఒక్కరూ అమ్మవారికి నమస్కరించనిదే వెళ్లరంటే 
    అతిశయోక్తి కాదు.   

    ఇంతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం స్థలపురాణంలోకి వెళితే...పూర్వం ఇక్కడి భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాథపురం గ్రామాల మధ్యలో ఖమ్మం–భద్రాచలం వెళ్లే రాజమార్గం సమీపంలో ఒక పెద్దపులి సంచరిస్తూ ఉండేది. ఆ పెద్దపులి రాజమార్గం సమీపంలో గల ఒక చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ సమీప గ్రామ ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా సాధు జంతువులా సంచరిస్తూ ఉండేది. 

    ఈ పెద్దపులిని గ్రామ ప్రజలు, బాటసారులు రాజమార్గాన ప్రయాణించే వాహనదారులు వనదేవతగా, శ్రీకనకదుర్గ అమ్మవారి వాహనంగా భావించి భక్తితో పూజించేవారు. అలా ప్రణమిల్లిన వారి మనోభావాలు, వాంఛలు నెరవేరుస్తూ కాలక్రమంలో ఆ పులి అదృశ్యం కావడంతో చింతచెట్టు కింద అమ్మవారి ఫొటోను పెట్టి గ్రామప్రజలు పూజించేవారు. 1961–62లో శ్రావణపు వెంకటనర్సయ్య అమ్మవారి దేవాలయం నిర్మించేందుకు కొంత స్థలం దానం ఇవ్వగా.. కంచర్ల జగ్గారెడ్డి భక్తుల ఆర్థిక సహాయ సహకారాలతో శ్రీ పెద్దమ్మతల్లికి దేవాలయం నిర్మించి శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

    నాటినుంచి స్మార్త సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా వనదేవత అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆది, గురువారాలలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

    వివాహాది శుభకార్యాలు ఏవైనా ఇక్కడే..
    శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మగుడి)లో భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలను ప్రతినిత్యం నిర్వహిస్తుంటారు. అంతేకాక ప్రతియేటా అమ్మవారి ఆలయంలో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. 

    పిల్లలకు బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, పుట్టినరోజు, పెళ్లిరోజు, పదవీ విరమణ కార్యక్రమాలు... ఇలా ఏ శుభకార్యమైనా అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తుండడం ఆనవాయితీ. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ప్రత్యేక ‘పొంగల్‌ షెడ్‌’తోపాటు ప్రైవేటు వారి నిర్వహణలో ఉన్న వివిధ ఫంక్షన్‌ హాళ్లలో నిత్యం ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి.

    నవరాత్రులు ప్రత్యేకం..
    పెద్దమ్మతల్లి దేవాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల΄ాటు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి.. అన్ని రకాల పూజలు చేస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి, శ్రీ లలితాదేవి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ మంగళ గౌరీదేవి, శ్రీ మహిషాసుర మర్థనీదేవి అలంకారాలు నిర్వహించి.. విజయదశమి రోజు అమ్మవారికి గ్రామసేవ, శమీపూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎవరు వాహనం కొనుగోలు చేసినా ముందు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకపూజ చేయించాల్సిందే. 

    నవరాత్రుల సమయంలో ఆయుధపూజ రోజున ప్రత్యేకంగా వేలాది వాహనాలకు పూజలు చేయించడం విశేషం. ఇక్కడ పూజలు చేయిస్తే ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా ప్రయాణం సాగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమీప ప్రాంత రైతులు అమ్మవారికి పూజ చేసిన తర్వాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తుంటారు.

    ఆలయ విశేషాలు..
    అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉంటాయి. ఈ మహావృక్షాన్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాలుగా భక్తులు భావిస్తారు. ఈ వృక్షానికి ఊయలకట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం లేని మహిళలు గర్భం దాలుస్తారని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. 

    బస్సు మార్గం..
    హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, వరంగల్‌ నుంచి భద్రాచలం, మణుగూరు వెళ్లే ప్రతి బస్సు అమ్మవారి ఆలయం ముందు నుంచే వెళ్తాయి. భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, మణుగూరు డి΄ోలకు చెందిన బస్సులు ప్రతినిత్యం ఈ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటాయి. 

    రైలు మార్గం..
    సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కొత్తగూడెం(భద్రాచలంరోడ్‌ రైల్వే స్టేషన్‌) వరకు రైలు సౌకర్యం ఉంది. ఖమ్మం వరకు రైలు మార్గం ఉంది. ఖమ్మం నుంచి 100 కి.మీ., కొత్తగూడెం నుంచి నుంచి 20 కి.మీ. దూరంలోగల అమ్మవారి ఆలయం మీదుగా నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.
    – గగనం శ్రీనివాస్, సాక్షి, పాల్వంచ రూరల్‌

    (చదవండి: ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..! ఏకంగా పదకొండు అలంకరాలు..)

     

Mulugu

  • ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఎగురవేసి మాట్లాడారు. ప్రజలు నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజునే తెలంగాణ విమోచన దినోత్సవం అన్నారు. ప్రతీ తెలంగాణవాది విమోచన దినోత్సవాన్ని గర్వంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్‌ రెడ్డి, సురేందర్‌, స్వరూ ప, రవీంద్రచారి, జాడి వెంకట్‌, కృష్ణారావు, శోభన్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    కన్నాయిగూడెం: ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీసీ ఇంటలెక్చువల్స్‌ కో ఆర్డినేటర్‌గా మండల పరిధిలోని చింతగూడెంకు చెందిన గొస్కుల సుధాకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇంటలెక్చువల్స్‌ సమావేశంలో రాష్ట్ర కమిటీ సుధాకర్‌ను ఎన్నిక చేసి నియామక పత్రాన్ని అందించింది.

    వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్‌ బ్యూటీఫుల్‌గా ఉందని జర్మనీ దేశానికి చెందిన క్రిష్టియన్‌ స్లావిక్‌ కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆయన బుధవారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌ కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.

    హసన్‌పర్తి: బైక్‌ అదుపు తప్పి ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈసంఘటన కేయూ–వడ్డేపల్లి రోడ్డులో జరిగింంది. ములుగు జిల్లా అన్నంపల్లికి చెందిన పోరిక రమేశ్‌నాయక్‌ (42) జవహర్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి మోడల్‌ స్కూల్‌లో ఆయన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి బైక్‌పై ఇంటి నుంచి కేయూ జంక్షన్‌ వైపు పని నిమిత్తం ఆయన బయల్దేరాడు. మార్గమధ్యలో తులసి బార్‌ సమీపంలో చీకటిగా ఉండడంతో ఎదురుగా వెళ్తున్న ఆవు కనిపించలేదు. దీంతో సడన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ అదుపు తప్పి ఆవును ఢీకొని కిందపడిపోయాడు. ఈసంఘటనలో తలకు బలమైన గాయమై రమేశ్‌నాయక్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

    కాటారం: దివంగత మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు విగ్రహాలను తొలగిస్తానని పుట్ట మధు బెదిరింపులకు గురి చేస్తున్నారని, దీనిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రోత్సహిస్తున్నారని మండల కేంద్రానికి చెందిన మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు జాడి మహేశ్వరీ బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కమాన్‌పూర్‌ మండలంలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పుట్ట మధు తన అనుచరులతో సమావేశం పెట్టి త్వరలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం జరుగుతుందని శ్రీపాదరావు విగ్రహాలను తొలిగిస్తామని భయబ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారన్నారు. విగ్రహాల రక్షణపై అనుమానం ఉందని, శ్రీపాదరావు విగ్రహాలకు ఏదైన జరిగితే పుట్ట మధు ప్రమేయంతోనే అన్నారు.

  • పెరుగ

    వాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. మండల పరిధిలోని పేరూరు వద్ద బుధవారం సాయంత్రానికి 14.84 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద క్రమంగా పెరుగుతుండడంతో మండల కేంద్రం సమీపంలో కొంగాల వాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చితోటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. పూసూరు, ఏడ్జెర్లపల్లి గ్రామాల మధ్యన బ్రిడ్జిపైకి వరద నీరు చేరింది.

    సమ్మక్క సాగర్‌కు 5,93,830 క్యూసెక్కుల నీరు

    కన్నాయిగూడెం: గోదావరికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పరిధిలో సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి వరద భారీగా వచ్చి చేరుతోంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి 5,93,830 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అధికారులు 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

    నీటిలోనే మిర్చి చేలు

  • ‘డైలీవేజ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి’

    ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్‌ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ, గిరిజన సంఘం జిల్లా నాయకులు కోరం చిరంజీవి అన్నారు. జీఓ నంబర్‌ 64ను వెంటనే రద్దు చేయాలని డైలీవేజ్‌ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బుధవారం వారు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో హాస్టల్‌ డైలీవేజ్‌ కార్మికులు ఆరు రోజులుగా సమ్మె చేస్తుంటే ఒకవైపు హాస్టళ్లలో విద్యార్థులు వంటలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యను పరిష్కరించడం లేదన్నారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేతనాలను కలెక్టర్‌ గెజిట్‌ ఆధారంగా చెల్లించే విధంగా ట్రెజరీలకు మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. అర్హులైన డైలీవేజ్‌ వర్కర్లను వెంటనే పర్మనెంట్‌ చేయాలని, అందరికీ టైం స్కేల్‌ వర్తింపజేయాలని కోరారు. అలాగే రూ.10 లక్షల ప్రమాద బీమా, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, మరణిస్తే రూ.50వేలు దహన సంస్కారాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లాజర్‌, గిరిజన సంఘం నాయకులు మధు, హాస్టల్‌ వర్కర్లు నాగలక్ష్మి, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, కమల, రాజు, యాకలక్ష్మి, స్రవంతి, రాజమ్మ, సమ్మక్క, వసంత, మాణిక్యం, శారద, భారతి, పద్మ, లచ్చిరాం, సత్యం పాల్గొన్నారు.

  •  Minister Seethakka launching the Swachhtahi Seva program

    ములుగు/ములుగు రూరల్‌: గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ ఆవరణలో కలెక్టర్‌ దివాకరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్టోబర్‌ 2వ తేదీ వరకు స్వచ్ఛతాహీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో దోమలు వృద్ధి చెందవని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు, మహిళా సంఘాల ద్వారా రంగోలి వ్యాసరచన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

    ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన నూతన పనులు, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. గిరిజన భవన్‌లో కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాసోత్సవం కార్యక్రమాన్ని, ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్‌ దివాకరతో కలిసి సందర్శించి మాట్లాడారు. వచ్చేనెల 16వ తేదీ వరకు పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో స్వస్తినారి స్వసక్తి పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం, రాష్ట్రం, దేశ బాగుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీశ్‌, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి, డీపీఓ దేవరాజ్‌, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి

    ములుగు రూరల్‌: రైతులు పంటల సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలని వరంగల్‌ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ కృష్ణ అన్నారు. మండల పరిధిలోని బండారుపల్లి, చిన్నగుంటూర్‌పల్లి ప్రాంతాలలో వరి, పత్తి పంటలను శాస్త్రవేత్తలు శ్రవణ్‌కుమార్‌, మానస, మాధవి, సౌందర్యలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో బ్యాక్టీరియా, ఎండాకుల తెగులు, ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు ఆశించడాన్ని గమనించాలన్నారు. ఉల్లికోడు నివారణకు వరి నాటిన 15 రోజుల లోపు ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్‌ 3జీ గుళికలు చల్లుకోవాలని సూచించారు. లేదా లీటర్‌ నీటికి 2.5 ఎంఎల్‌ పెట్రోల్‌ను పిచికారీ చేయాలన్నారు. కాండంతొలుచు పురుగు నివారణకు పంట పిలక దశలో నాటిన 20 నుంచి 25 రోజుల్లో ఎకరానికి 10 కేజీల కార్బోప్యూరాన్‌ 3జీ గుళికలు లేదా నాలుగు కిలోల క్లోరంట్రినిలిప్రోల్‌ గుళికలు చల్లుకోవాలని సూచించారు. లేదా కార్‌టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 2 గ్రాములు లీటర్‌ నీటికి లేదా ఎసిపేట్‌ 1.5 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలని వివరించారు. ఎండాకుల తెగులు నివారణకు అగ్రిమైన్‌సీన్‌ 0.4 గ్రాములు లేదా ప్లాంటామౌసిన్‌ 0.2 గ్రాములు లేదా కపర్‌ ఆక్లిక్లోరైడ్‌ 3 గ్రాములను లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలని వెల్లడించారు. పత్తిలో రసం పీల్చు పురుగు, పచ్చదోమ నివారణకు పిప్రోనిల్‌ 2 ఎంఎల్‌, మోనోక్రోటోపాస్‌ 1.6 ఎంఎల్‌, ఎసిపేట్‌ 1.5 గ్రాములు లేదా థయోమితగ్జామ్‌ 0.2 గ్రాములు లేదా ప్లానికామిడ్‌ 0.7 ఎంఎల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్‌, ఏఈఓలు హరీశ్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    వరంగల్‌ వ్యవసాయ పరిశోధన స్థానం

    శాస్త్రవేత్త కృష్ణ

  • సాయుధ పోరాట చరిత్ర ఎర్రజెండాదే..

    ములుగు: తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చైతన్య పరిచి సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండాదేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఎం ములుగు మండల బాధ్యుడు రత్నం ప్రవీణ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం సభ నిర్వహించారు. 4 వేల మంది ప్రాణత్యాగాలతో లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకత్వం వహించిందన్నారు. భూ స్వాములను గ్రామాల నుంచి తరిమి కొట్టి, గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి ప్రజాపాలనను ప్రజలకు చూపించింది కమ్యూనిస్టులని వెల్లడించారు. ఈ సభలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రత్నం రాజేందర్‌, వెంకటాపురం మండల కార్యదర్శి అలువాల ఐలయ్య, నాయకులు రెడ్డి రామస్వామి, రవిగౌడ్‌, చందర్‌, దేవేందర్‌, రవీందర్‌, చంటి, వెంకటేశ్‌, కుమారస్వామి పాల్గొన్నారు.

    సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు

    వెంకటరెడ్డి

  • కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్న ప్రజలు

    మంగపేట: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు అన్నారు. మండల పర్యటనలో భాగంగా బుధవారం బ్రాహ్మణపల్లి కిందిగుంపునకు వచ్చిన ఆయనకు బీఆర్‌ఎస్‌ యూత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్‌, జిల్లా నాయకురాలు కొమరం ధనలక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు డోలివాయిద్యాలతో మహిళలు బతుకమ్మలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం దోమెడ, రామచంద్రునిపేట, మల్లూరు, శనిగకుంటలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. బ్రాహ్మణపల్లి కింది గుంపులోని నాగులమ్మ ఆలయం, దోమెడలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రామచంద్రునిపేటలో ఇటీవల మృతి చెందిన పోటూరు శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేల నగదును అందజేశారు.

    బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

    కాకులమర్రి లక్ష్మణ్‌బాబు

  • నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

    ములుగు రూరల్‌: సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ దివాకర సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల పక్కన నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. కలెక్టరేట్‌ భవనంలో స్టేట్‌ బోర్డు చాంబర్‌, కలెక్టర్‌ చాంబర్‌, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌, ఇతర శాఖలకు కేటాయించిన గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ గ్రానైట్‌, ఎలక్రిషన్‌, ప్లంబింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రవేశ ద్వారం వద్ద రెడ్‌సెల్‌తో రోలింగ్‌ చేయించి సుందరీకరణ పనులు చేయాలని ఇంజనీరింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.

    కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

Nandyala

  • ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లోనూ ఖరీదైన ఇంజెక్షన్లు

    ఇటీవల కాలంలో చిన్న వయస్సు నుంచే దురలవాట్లు ఎక్కువయ్యాయి. దీనికితోడు మితిమీరిన ఆహారపు అలవాట్లు, సమయానికి తినకపోవడం, మద్యపానం, దూమపానంతో స్థూలకాయ బాధితులు ఎక్కువయ్యారు. దీనివల్లే గుండైపె ఒత్తిడి అధికమవుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువైంది. ఇలాంటి వారు పెరగడంతో 2023లో స్టెమీ ప్రోగ్రామ్‌ ప్రారంభించి ఖరీదైన టెనిక్టమిప్లేజ్‌ అనే ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వీటిని రోగులకు ఉచితంగా అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ ఇంజెక్షన్‌ ఎంతో ఉపయోగపడుతోంది. వారి ప్రాణాలు పోకుండా కాపాడుతోంది.

    –డాక్టర్‌ జఫ్రుల్లా, డీసీహెచ్‌ఎస్‌, కర్నూలు

    ఆసుపత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి ప్రతిరోజూ ఐదారుగురు గుండెపోటుతో చికిత్స కోసం వస్తుంటారు. వీరికి 2023లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన స్టెమీ ప్రోగ్రామ్‌ కింద దాదాపు రూ.40వేల ఖరీదైన టెనెక్టిప్లేజ్‌ ఇంజెక్షన్లు ఉచితంగా ఇస్తున్నాం. రెండు గంటల అబ్జర్వేషన్‌ తర్వాత కార్డియాలజీ విభాగానికి పంపిస్తున్నాం. గుండెపోటు వచ్చిన వెంటనే రెండు గంటలలోపు ఆసుపత్రికి రోగిని తీసుకువస్తేనే ఈ ఇంజెక్షన్‌ బాగా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం 30 నుంచి 40 ఏళ్లలోపు వారే గుండెపోటుతో వస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది.

    – డాక్టర్‌ పి. సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, జీజీహెచ్‌, కర్నూలు

  • హిట్‌ అండ్‌ రన్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించండి

    కర్నూలు: ఉమ్మడి జిల్లాలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. స్థానిక న్యాయ సేవాసదన్‌లో హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై బుధవారం జిల్లాస్థాయి అధికారులతో మానిటరింగ్‌ సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 76 హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు గాను 21 కేసుల్లో నష్టపరిహారం (అవార్డు) మంజూరైందని అధికారులు తెలిపారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు గాను 11 కేసుల్లో నష్టపరిహారం మంజూరైందన్నారు. మిగతా వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని లీలా వెంకటశేషాద్రి అధికారులను ఆదేశించారు. కర్నూలు, నంద్యాల డీఆర్వోలు వెంకటనారాయణమ్మ, రాము నాయక్‌, ఆర్‌టీఓలు భరత్‌ చవాన్‌, శివారెడ్డి, డీటీఆర్‌బీ సీఐలు ఆదిలక్ష్మి, మల్లికార్జున, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ సంధ్యారెడ్డి, డీసీఆర్‌బీ ఎస్‌ఐ శ్రీనివాసరావు, డిప్యూటీ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరాం తదితరులు పాల్గొన్నారు.

  •  Doctors administering a tenectomy plaque injection to a patient who had suffered a heart attack at the casualty ward of the Kurnool Government General Hospital

    దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గుండెశస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి ఎంతో మందికి ప్రాణం పోశారు. ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుండెపోటుకు గురైన వారికి వెంటనే ఖరీదైన ఇంజెక్షన్లు ఇచ్చే వైద్యాన్ని తీసుకొచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన స్టెమీ ప్రోగ్రామ్ ఇప్పటికీ కొనసాగుతూ అనేక మంది ప్రాణాలు నిలుపుతోంది. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాటు ఏరియా ఆసుపత్రులు, సీహెచ్ సీల్లోనూ ఈ ఖరీదైన ఇంజెక్షన్లు ఇస్తున్నారు.

    కర్నూలు(హాస్పిటల్‌): ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గుండెపోటుతో ఆకస్మిక మరణాలు అధికమయ్యాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ గుండెపోటు మరణాలు ఇప్పుడు యువకుల్లోనూ అధికమయ్యాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి బాధితుల కోసం 2023 సెప్టెంబర్‌లో నేనున్నాంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త ప్రోగ్రామ్‌ను తెచ్చారు. కేవలం నగర కేంద్రాల్లోని ఆసుపత్రుల్లోనే గాకుండా ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో కూడా త్రాంబోలైసిస్‌ విధానంలో రూ.40వేల విలువ చేసే ఖరీదైన టెనిక్టమి ప్లేజ్‌ అనే ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేటట్లు చేశారు. సీహెచ్‌సీలకు వచ్చిన రోగికి ముందుగా ఈసీజీ తీసి కర్నూలులోని టెలిమెడిసిన్‌ హబ్‌కు పంపిస్తారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈ ఇంజెక్షన్‌ ఇస్తున్నారు. గుండెపోటు వచ్చిన వారిని మొదటి గంటలోపు సమయానికి తీసుకొస్తే వెంటనే ఈ ఖరీదైన ఇంజెక్షన్‌ ఇచ్చి బతికిస్తున్నారు. రోగులకు భారం గాకుండా ఆరోగ్యశ్రీ పథకంలోనే దీనిని చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వందలాది మంది ప్రాణాలు పోసింది ఈ ఇంజెక్షన్‌.

    కూటమి ప్రభుత్వం గొప్పలు

    స్టెమీ ప్రోగ్రామ్‌ను తామే ప్రవేశపెట్టామని, దానిని ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పథకంలో చేర్చి రోగులకు ఉచితంగా ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఈ ప్రోగ్రామ్‌పై ఆ పార్టీ నాయకులతో పాటు పచ్చమీడియా సైతం ప్రచారం చేసుకుంటూ వస్తోంది. వాస్తవంగా ఈ ప్రోగ్రామ్‌ 2023లో అప్పటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పట్లోనే దీనిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి గుండెరోగుల ప్రాణాలు పోకుండా కాపాడుతోంది.

    మూడేళ్లలో టెనిక్టమి ప్లేజ్‌ ఇంజెక్షన్‌ వివరాలు

    ఆసుపత్రి, 2023, 2024, 2025

    ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, 1, 9, 5

    ఆలూరు సీహెచ్‌సీ, 1, 10, 8

    పత్తికొండ సీహెచ్‌సీ, 3, 20, 26

    ఓర్వకల్‌ సీహెచ్‌సీ, 1, 7, 6

    కోడుమూరు సీహెచ్‌సీ, 3, 14, 11

    వెల్దుర్తి సీహెచ్‌సీ, 1, 4, 6

    కర్నూలు జీజీహెచ్‌, 25, 59, 55

    నంద్యాల జిల్లాలో ఈ యేడాది ఇప్పటి వరకు 123 టెనిక్టమి ప్లేజ్‌ ఇంజెక్షన్లు ఇచ్చారు.

  • ఆత్మకూరు: ఆధార్‌, రేషన్‌కార్డు ఆధారంగా గిరిజనులకు ఎల్‌ఎల్‌ఆర్‌ మంజూరు చేస్తున్నట్లు ఆర్టీఓ సత్యనారాయణరెడ్డి తెలిపారు. కొట్టాల చెరువు, పెచ్చెరువులోని 60 మంది గిరిజన ఆటో డ్రైవర్లకు ఈ కార్డులను బుధవారం ఆత్మకూరు పట్టణంలో అందించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ చెంచుగూడాల నుంచి ఆటోల్లో ఆత్మకూరుకు వచ్చేటప్పుడు లైసెన్సులు లేక గిరిజన డ్రైవర్లు ఇబ్బందులు పడేవారన్నారు. వారికి ఎల్‌ఎల్‌ఆర్‌ కార్డులు ఇవ్వడంతో సమస్య పరిష్కారమయ్యిందన్నారు.

    డోన్‌లో జీబీఎస్‌ కేసు

    డోన్‌ టౌన్‌: పట్టణంలోని ఒక మహిళకు గులియన్‌ బారే సిండ్రోమ్‌(జీబీఎస్‌) అనే వ్యాధి సోకినట్లు కుటుంబ సభ్యులు బుధవారం విలేకరులకు తెలిపారు. కుట్టు మిషన్‌పై ఆధారపడి జీవించే ఈ మహిళక తీవ్ర నరాల నొప్పి రావడంతో ఈ నెల 2న కర్నూలు పెద్దాసుపత్రికి వెళ్లారన్నారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వ్యాధి నిర్ధారించినట్లు తెలిపారు.

    పంట మార్పిడి ఎంతో మేలు

    నంద్యాల(అర్బన్‌): పంట మార్పిడి రైతుకు ఎంతో మేలు చేస్తుందని ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు వెంకటరమణ, ప్రజనన, చైతన్య తెలిపారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో మొక్కజొన్న, వరి పొలాలను రైతులతో కలిసి బుధవారం వారు పరిశీలించారు. ఖరీఫ్‌లో మినుము వేసిన పొలంలో రబీలో మొక్కజొన్న వేయాలన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నను కత్తెర పురుగుతో పాటు గొంగళి పురుగులు ఆశించాయని, ఎకరాకు క్లూరాంట్రినిప్రోల్‌ 60మి.లీ, ఇమో మేక్‌టీన్‌ బెంజోయెట్‌ 80గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు.

    టైగర్‌ ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌గా విజయ్‌కుమార్‌

    బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా అటవీ సంరక్షణాధికారి, టైగర్‌ ప్రాజక్ట్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌గా బి. విజయ్‌కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగి నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తిలేదని హెచ్చరించారు. ప్రకృతి సంపదలైన అడవులను సంరక్షించే భాధ్యత అటవీశాఖ ఉద్యోగులపై ఉందన్నారు. గతంలో తాను రాజమండ్రిలో పని చేసినట్లు చెప్పారు.

    నాల్గో విడత ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో నాల్గో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కాలేజీ ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఎల్‌.నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27లోపు www.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28వ తేదీన వెరిఫికేషన్‌ చేసి, ప్రభుత్వ కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 29వ తేదిన.. ప్రైవేటు కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత కాలేజీల్లో 30వ తేదిన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

    ఉల్లి పంట పరిశీలనకు గ్రామ, మండల స్థాయి టీంలు

    కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో సాగైన ఉల్లి పంట స్థితిగతులను పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసింది. గ్రామస్థాయిలో వీఆర్‌వో, రైతుసేవా కేంద్రాల ఇన్‌చార్జీలతో కమిటీలు ఏర్పాటయ్యాయి. మండల స్థాయిలో తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి, హార్టికల్చర్‌ ఆఫీసర్‌లతో టీంలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఉద్యాన పంటల పరిస్థితి ఎలా ఉంది.. అధిక వర్షాలకు దెబ్బతినిందా.. వారానికి ఎన్ని టన్నులు మార్కెట్‌కు వస్తుంది తదితర వివరాలపై టీంలు సర్వే చేస్తాయి. గ్రామస్థాయి టీంలు చేసే సర్వేను మండల స్థాయి టీమ్‌లు పర్యవేక్షిస్తాయి. ఈ నెల 20వ తేదీలోపు సర్వే పూర్తి చేసి జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు ఇవ్వాలని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి గ్రామ, మండల స్థాయి టీంలను ఆదేశించారు.

  • ఉద్యాన పథకాలను పకడ్బందీగా అమలు చేస్తాం

    కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో ఉద్యాన పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా ఉద్యాన అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న పి.రామాంజనేయులు పదోన్నతిపై చిత్తూరు జిల్లా ఆత్మ డీపీడీగా బదిలీ అయ్యారు. ఈ స్థానంలో అనంతపురం నగరపాలక సంస్థలో ఉద్యాన శాఖ ఏడీగా పనిచేస్తున్న రాజాకృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈయన ఏపీఎంఐపీ అదనపు పీడీగా ఈ ఏడాది జూన్‌ 12వ తేదీ వరకు పనిచేశారు. తాజాగా జిల్లా ఉద్యాన అధికారిగా నియమితుల్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని, పండ్లతోటల అభివృద్ధికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతామన్నారు. ఆయిల్‌పామ్‌ సాగులో పురోగతికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.

    దరఖాస్తుల ఆహ్వానం

    కర్నూలు(సెంట్రల్‌): సంగీత వాయిద్య కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నారని, ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టు ద్వారా ఇంటి నంబర్‌ 4–25–5, బాలాజీనగర్‌, కర్నూలు–518006 అనే చిరునామాకు అక్టోబర్‌ 10వ తదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

    ఒక్క రూంలో ఆరుగురు ఎలా ఉంటారు?

    వీసీని కలసిన ఆర్‌యూ ఇంజినీరింగ్‌

    కళాశాల విద్యార్థులు

    కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని, ఒక్క రూంలో ఆరుగురు ఎలా ఉంటారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు 30 మంది బుధవారం వీసీ వి.వెంకట బసవరావు, రిజిస్ట్రార్‌ బి. విజయ్‌కుమార్‌ నాయుడును కలిశారు. హాస్టళ్లలో మెనూ సరిగా పాటించడం లేదని, రూంలలో విద్యుత్‌ స్విచ్‌ బోర్డులు, విద్యుత్‌ తీగలు సరిగా లేవని చెప్పారు. హాస్టల్‌ కమిటీ సమావేశమై విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని వీసీ, రిజిస్ట్రార్‌ విద్యార్థులకు హామీ ఇచ్చారు.

  • ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ

    ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా

    బొమ్మలసత్రం: ముస్లింలకు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీమ్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా, మైనారిటీ నాయకులతో కలసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వక్ఫ్‌ సవరణ బిల్లుపై లోక్‌సభ, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వ్యతిరేకించారన్నారు. అయితే ఎన్‌డీఏ ప్రభుత్వ మెజారిటీ కారణంగా ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందన్నారు. ఎన్‌డీఏలో భాగస్వామ్యులైన టీడీపీ, జనసేన, బీజేపీలు బిల్లుకు మద్దతు తెలపటం బాధాకరమన్నారు. సుప్రీమ్‌ కోర్టు వక్ఫ్‌బోర్డు సవరణ చట్టంపై జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల విషయంలో సీఎం చంద్రబాబు చేసిన వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు జోక్యం వల్లే ఈ ఉత్తర్వులు సాధ్యమయ్యాయని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింను మభ్య పెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. గతంలో వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇప్పుడు ముస్లింలకు మేలు చేస్తున్నట్లుగా మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ముస్లింలను మోసం చేసే ఈ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవని, వారి అబద్ధపు మాటలను ప్రజలను విశ్వసించబోరన్నారు. ముస్లింల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతోందన్నారు.

  • 25న వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ కార్యవర్గ సమావేశం

    కర్నూలు (టౌన్‌): స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఈనెల 25వ తేదీన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం ఇన్‌చార్జ్‌ ఉప్పల యోబు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు (కర్నూలు), తిరుపతయ్య (నంద్యాల) తెలిపారు. నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపు నిచ్చారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎస్సీ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. దళితులను రాజకీయంగా అభివృద్ధి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీల సంక్షేమాన్నిన నీరుగార్చిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్లు అలంకారప్రాయంగా మారాయన్నారు. ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కన్నెమరకల వెంకటేష్‌, నగర అధ్యక్షుడు కమతం పరుశురామ్‌, ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు ప్రభుదాసు, కార్యదర్శి కాశపోగు శ్రీకాంత్‌, శివ, కార్యవర్గ సభ్యులు పండు, వంశీ క్రిష్ణ, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

  • ఘనంగా విశ్వకర్మ జయంతి

    నంద్యాల: కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో, జిల్లా ఎస్పీ కార్యాలయంలో శ్రీ విరాట్‌ విశ్వకర్మ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య మాట్లాడుతూ.. విశ్వకర్మ వల్లే చేతివృత్తులు అభివృద్ధి చెందాయన్నారు. కలెక్టరేట్‌ ఏవో సుభాకర్‌, అసిస్టెంట్‌ బీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఓబులేసు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    ● జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ యుగంధర్‌ బాబు ఆధ్వర్యంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కష్టపడే తత్వం, పట్టుదల, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే సందేశాన్ని విశ్వకర్మ ద్వారా మనం నేర్చుకోవచ్చని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు.

  • పొలం నిండా కన్నీళ్లే!

    గిట్టుబాటు ధర లేక.. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే ఆశ లేక రైతులు ఉల్లి పంటపై ఆశలు వదులుకున్నారు. పంటను పీకి పొలంలోనే వదిలేస్తున్నారు. మండల పరిధిలోని గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన కౌలు రైతు పెద్ద రంగన్న 15 రోజుల క్రితం ఉల్లి పంట పీకి పొలంలోనే వదిలేశాడు. ఐదు ఎకరాల్లో ఉల్లి సాగుచేస్తే రెండు ఎకరాల ఉల్లిని అరకొరగా విక్రయించడు. మిగిలిన మూడు ఎకరాల ఉల్లి పంటను గిట్టుబాటు ధర లేక పొలంలోనే వదిలేశాడు. పంట సాగుతో దాదాపు రూ.4 లక్షల వరకు నష్టం వచ్చినట్లు రైతు వాపోతున్నాడు.

    – ఎమ్మిగనూరు రూరల్‌

  • రుణాలు తక్షణమే మంజూరు చేయాలి

    బ్యాంకర్లను ఆదేశించిన

    జేసీ విష్ణు చరణ్‌

    నంద్యాల: జిల్లాలోని రైతులకు, పొదుపు మహిళలకు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే యువకులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ లోని వీసీ హాలులో డిస్ట్రిక్ట్‌ కన్సల్టెటివ్‌ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం రూ. 15,120 కోట్ల వార్షిక రుణ లక్ష్యమని, జూన్‌ 30 నాటికి రూ. 5,360 కోట్లు మాత్రమే సాధించారన్నారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేకుండా పంట రుణాలు ఇవ్వాలన్నారు. స్టాండప్‌ ఇండియా రుణాల మంజూరులో ప్రగతి అధ్వాన రీతిలో ఉందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం కింద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు మినహా 57 వేల మందికి రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. నాబార్డ్‌ డీడీఎం కార్తిక్‌ , యూనియన్‌ బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ నరసింహారావు, ఆర్బీఐ ఆర్‌ఎం రామకృష్ణ, కెనరా బ్యాంక్‌ ఆర్‌ఎం సుశాంత్‌ కుమార్‌, ఏపీజీబీ ఆర్‌ఎం వెంకటరమణ, ఎల్డీయం రవీంద్రకుమార్‌, డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌ రెడ్డి, సంక్షేమ కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు.

Nalgonda

  • చరిత్

    సీపీఎం పొలిట్‌ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్‌

    నల్లగొండలో సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు

    నల్లగొండ టౌన్‌ : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించి అబద్ధపు ప్రచారం చేయడాన్ని ఆపాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం బందాకరత్‌ మాట్లాడుతూ భారత చరిత్రలో సెప్టెంబర్‌ 17 లిఖించబడిందని, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్‌ సంస్థానం సెప్టెంబర్‌ 17న 1948న ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైందన్నారు. ఒక సంవత్సరం పాటు జరిగిన పరిణామాలను వక్రీకరించి రకరకాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రక్షణమంత్రి హైదరాబాద్‌ వస్తూ తనతో పాటు అబద్దాలు తయారు చేసే మిషన్‌ తెచ్చారని ఎద్దేవా చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం రాజు, హిందువులకు జరిగిన పోరాటమని చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల గ్రామాలను సందర్శించి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. ఆనాడు దేశంలో మరోప్రాంతం జమ్ముకశ్మీర్‌ కూడా విలీనమైందని అక్కడ రాజు హరిసింగ్‌ హిందూ, ప్రజలు ముస్లింలు అక్కడ ఎందుకు ఇలా ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దేశంలో ముస్లింలు, హిందువులు, సిక్కులు సబ్బండ వర్గాలు స్వాతంత్య్రం కోసం పోరాడాని గుర్తు చేశారు. నైజాంతో పాటు లక్షల ఎకరాల భూములను చేతిలో పెట్టుకున్న భూస్వాములు, దోపిడీదారులపై జరిగిన ఉద్యమమే వీర తెలంగాణ సాయుధ పోరాటమన్నారు. ఆనాటి అమరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు మర్రిగూడ బైపాస్‌ నుంచి సుభాష్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, బొంతల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, నాగార్జున, ప్రమీల, హశం, ప్రభావతి, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, ఎండీ.సలీం, సత్తయ్య, అనురాధ, నన్నూరి వెంకట రమణారెడ్డి, గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • అక్టోబర్‌ 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’

    నల్లగొండ : ప్రతి గ్రామ పంచాయతీలో అక్టోబరు 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం డీఆర్‌డీఏ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని గ్రామీణ పంచాయతీ అధికారులకు సూచించారు. ప్రతి ఉద్యోగి ఇంటి పరిసరాలతో పాటు కార్యాలయ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీఓ శ్రవణ్‌కుమార్‌, వేణుగోపాలరావు, వెంకన్న, మెయినుద్దీన్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

    మూసీకి కొనసాగుతున్న వరద

    కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీటి రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 3,523 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. బుధవారం అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్‌గేట్లను పైకెత్తి 2,625 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నారు. కాల్వలకు 552 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సీపేజీ ఆవిరి రూపంలో 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

    ఎంజీయూలో నూతన అధిపతుల నియామకం

    నల్లగొండ టూటౌన్‌: నల్లగొండ పట్టణ సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బుధవారం వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్‌ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి ఎం. జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి జి. ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి శాంతకుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్‌గా ఆర్‌. రూప నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిని వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అభినందించారు.

  • ఇంటర్‌ ఫలితాల పెంపుపై దృష్టి పెట్టాలి

    నల్లగొండ : ఇంటర్మీడియట్‌ ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌, మైనార్టీ వెల్ఫేర్‌, మోడల్‌ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్షించారు. ఇంటర్‌ కళాశాలల్లో ఫలితాలు, ఫేస్‌ రికగ్నిషన్‌ విధానం తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మట్లాడుతూ ఇంటర్‌ కళాశాలల్లో నూటికి నూరు శాతం పేస్‌ రికగ్నిషన్‌ సిస్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం, అభ్యసన సామర్థ్యం పెంచాలన్నారు. సమావేశంలో డీఐఈఓ దస్రూనాయక్‌, డీఈఓ భిక్షపతి, ఆర్‌సీఓ స్వప్న, బలరాం తదితరులు పాల్గొన్నారు.

    లబ్ధిదారులను ఎంపిక చేయాలి

    రామగిరి(నల్లగొండ): పూర్తయిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నల్లగొండ మండలంలోని దోమలపల్లిలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్రూం ఇళ్లను బుధవారం ఆమె పరిశీలించారు. దోమలపల్లికి 70 ఇళ్లు మంజూరు కాగా.. 56 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని హౌసింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గిరిధర్‌ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్‌ పరశురామ్‌ పాల్గొన్నారు.

    17ఎన్‌ఎల్‌సి304 :

    ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

  • ప్రాణాలర్పించింది కమ్యూనిస్టులే..

    సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

    నల్లగొండ టౌన్‌ : భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సందర్భంగా నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు పింఛన్లను ఇవ్వకుండా నిలిపివేసి అవమానపరిచిన బీజేపీ.. నేడు విమోచనం పేరుతో సభలు పెట్టడం వెనుక ఏ కుట్ర దాగిఉందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గసభ్యుడు మల్లేపల్లి ఆదిరెడ్డి, శ్రవణ్‌కుమార్‌, పబ్బు వీరస్వామి, కర్ర సైదిరెడ్డి, లెనిన్‌, బూడిద సురేష్‌, యాదయ్య, ముండ్ల ముత్యాలు, దోటి పాండరి, కోమటిరెడ్డి ప్రధుమ్మరెడ్డి, యూసుఫ్‌, వీరయ్య, వెంకటయ్య, రాములు, విజయరెడ్డి, విజయ, దేవేందర్‌, చారి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

  • బీఆర్‌ఎస్‌.. జాతీయ సమైక్యతా దినోత్సవం

    నల్లగొండ టూటౌన్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం బీఆర్‌ఎస్‌ నాయకులు జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ నల్లగొండలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండా నరేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్‌, చీర పంకజ్‌యాదవ్‌, మాలే శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Mancherial

  • చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

    జైపూర్‌: మండలంలోని ఇందారం గ్రామానికి చెందిన పత్తి రాజ్‌కుమార్‌(33) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించగా చిక్సిపొందుతూ గోదావరిఖని ఆస్పత్రిలో బుధవారం మృతిచెందాడు. ఎస్సై శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కూలీ పని చేస్తూ జీవించే రాజ్‌కుమార్‌ కొన్ని రోజులుగా ఖాళీగా ఇంటి వద్ద ఉంటున్నాడు. పనికి వెళ్లాలని భార్య మానస, తల్లిదండ్రులు సూచించారు. ఇదే విషయంలో భార్యాభర్తల తరచూ గొడవలు జరిగేవి. గత నెల 20న భార్యతో గొడవపడి ఇంట్లో గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. అక్కడి నుంచి మళ్లీ ఈ నెల 10న గోదావరిఖని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య మానస, కూతురు శ్రీశ్వ, కుమారుడు శ్రీహాన్‌ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఏస్సై హాబీబ్‌ తెలిపారు.

  • ‘కార్మికులను వేధిస్తున్న గని మేనేజర్‌’

    మందమర్రిరూరల్‌: ఏరియాలోని కేకే–5 గనిలో ఇష్టానుసారంగా కార్మికులకు లెటర్లు పంపిణీ చేస్తూ గని మేనేజర్‌ వేధింపులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. బుధవారం కేకే–5 వద్దకు చేరుకున్న పలు కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన కార్మికులను కలుసుకుని వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం గని సేఫ్టీ ఆఫీసర్‌ రమేష్‌తో మాట్లాడగా గని మేనేజర్‌ అందుబాటులో లేరని, వచ్చాక మాట్లాడుదామని నచ్చజెప్పడంతో కార్మికులు యధావిధిగా విధుల్లోకి వెళ్లారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎమ్మెస్‌ నాయకులు పాల్గొన్నారు.

  • రాయితీ సిలిండర్లు పట్టివేత

    వాంకిడి(ఆసిఫాబాద్‌): హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వినియోగిస్తున్న రాయితీ సిలిండర్లను పట్టుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌ బు ధవారం తెలిపారు. వాంకిడి మండల కేంద్రంలోని తెలంగాణ హోటల్‌, నేచర్‌ టీ స్టాల్‌, రి యాజుద్దీన్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌, ఫ్రెండ్స్‌ విల్లా ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌, పాడ్యావర్చా చాహా టీ స్టా ల్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగ రాయితీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • వీడని

    మంచిర్యాలక్రైం: జిల్లాలో సంచలనం సృష్టించిన నా నమ్మ, మనవరాలి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చే స్తున్నా కొలిక్కి రావడం లేదని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణాలకు కారణం ఏమిటనేది తెలిసే అవకాశం ఉంది. మంచిర్యాలలోని గోపాలవాడ శివారు రైల్వే ఏ క్యాబిన్‌ వద్ద ఓ ఇంట్లో ఖమ్మంలోని 3వ టౌన్‌ ప్రాంతానికి చెందిన బెజ్జాల సత్యవతి(55), ఆమె మనవరాలు గీతశిరీష(4) ఈ నెల 10న మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను విచారించినట్లు సమాచారం.

    ఇల్లు అమ్మడానికి వచ్చి..

    ఖమ్మంలోని 3టౌన్‌ ప్రాంతానికి చెందిన బెజ్జాల చంద్రయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు గంగోత్రి, ట్రాన్స్‌జెండర్‌గా మారిన శిరీష ఉన్నారు. ట్రాన్స్‌జెండర్‌ శిరీష రైల్వే ఏ క్యాబిన్‌ వద్ద ఇల్లు నిర్మించుకుంది. 2022 జనవరి 4న అనుమానాస్పద స్థితిలో ఇదే ఇంట్లో చనిపోయింది. కుటుంబ సభ్యులు తరచూ వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో స్థానిక ఉండే ఓ ఆర్‌ఎంపీతో సత్యవతి కుటుంబ సభ్యులకు పరిచయం ఏర్పడింది. సత్యవతి ఆర్‌ఎంపీతో కాస్త చనువుగా ఉండేదని, ఇంటి మరమ్మతులకు రూ.50వేలు ఇంట్లో ఎవరికీ తెలియకుండా అప్పుగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో ఆరు నెలల క్రితం ఆర్‌ఎంపీతో సత్యవతి భర్త చంద్రయ్యకు మధ్య గొడవ జరిగింది. ట్రాన్స్‌జెండర్‌ శిరీష ఇంటిని కొనడానికి పార్టీ సిద్ధంగా ఉందంటూ ఆర్‌ఎంపీ పిలిపించడంతో ఈ నెల 8న సత్యవతి, కుమారుడు గంగోత్రి, ఇతడి కూతురు గీతశిరీష కలిసి వచ్చారు. వచ్చిన రోజు ఆర్‌ఎంపీ స్పందించకపోవడంతో మరుసటి రోజు సత్యవతి, గీతశిరీష ఇక్కడే ఉండగా.. గంగోత్రి వెళ్లిపోయాడు. సాయంత్రం సత్యవతి తన కుమారుడు గంగోత్రికి ఫోన్‌ చేసి తనకు పాపకు విరేచనాలు, వాంతులు అవుతాయని చెప్పింది. 10న తెల్లవారే సరికి ఇద్దరూ మృతిచెంది ఉండడం కలకలం రేపింది.

    అన్నీ అనుమానాలే..!

    సత్యవతి, గీతశిరీష ఎలా మృతిచెందారు..? హత్య, ఆత్మహత్యా..? ఒకవేళ ఆత్మహత్య అయితే కారణాలు ఏంటి.. హత్య అయితే ఎవరు చేసి ఉంటారు.. ఎందుకు.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలంలో తెల్లకల్లు ప్లాస్టిక్‌ బాటిల్‌, పాల డబ్బా, వాటర్‌ బాటిల్‌, వండుకున్న ఎగ్‌ కర్రీ, వైట్‌ రైస్‌, ఛాయ్‌ లభించడంతో పోలీసులు సీజ్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు. సత్యవతికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒక వేళ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ఏ పాపం తెలియని పసిపాప శిరీష ఏం చేసింది. వాంతులు, విరేచనాలు తగ్గేందుకు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీని సంప్రదిస్తే ఇద్దరికీ వైద్యం అందించాడా..? ఒకవేళ అదే జరిగితే వైద్యం వికటించిందా..? లేదా రాత్రి వంట చేసుకొని తిన్నారు. సత్యవతి తెల్ల కల్లు తాగింది. కల్లులో గానీ ఎగ్‌ కర్రీలో గానీ ఎవరైన విష పదార్థాలు కలిపారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఫుడ్‌ ఫాయిజన్‌ అయినా కావాలి. విష ప్రయోగమైనా జరిగి ఉండాలి. వైద్యం వికటించి అయినా జరగాలి. గీతశిరీష మృతదేహం రంగు మారడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా పోస్ట్‌మార్టం నివేదికపై ఆధారపడి ఉందని పోలీసులు చెబుతున్నారు.

  • గోదావ

    బాసర: ఎగువన కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్‌ పర్బాని జిల్లా పరిధిలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో గోదావరినదిలోకి భారీ గా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో నదీతీరంలోని స్నానఘట్టాల వద్దకు భక్తులను అనుమతించడం లేదు. ఆలయం నుంచి గోదావరి నదికి ఉండే మార్గంలో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల, రెవెన్యూ అధికారులు గోదావరి నది వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

    మళ్లీ వరదనీరు

    బాసరలో 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓనీ, కౌట, సావర్గాం, సాలాపూర్‌ గ్రామాలకు వెళ్లే రహదారులు గోదావరి బ్యాక్‌వాటర్‌తో నిండి రాకపోకలు నిలిచిపోయాయి.

  • మోటార

    తాండూర్‌: మండలంలోని రేచిని–గోపాల్‌నగర్‌ మూలమలుపు వద్ద బుధవారం మోటార్‌సైకిల్‌ను స్కూల్‌బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తాండూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్‌లోని సెయింట్‌ థెరి స్సా స్కూల్‌ బస్సు రెబ్బెన మండలం కిష్టాపూర్‌ గ్రా మం నుంచి విద్యార్థులను తీసుకొస్తుండగా రేచి ని–గోపాల్‌నగర్‌ మూలమలుపు వద్ద మోటార్‌సైకిల్‌ను ఎదురుగా ఢీకొట్టింది. దీంతో గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన పోగుల నానక్క, పీరిట్ల మారుతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నానక్క(40) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

    కొడుకును పాఠశాలకు పంపేందుకు వచ్చి..

    పోగుల నానక్క తన కుమారుడు అన్షిత్‌ను సెయింట్‌ థెరిస్సా పాఠశాలకు పంపేందుకు స్టేజీ వద్దకు వచ్చి బస్సు ఎక్కించి పంపించింది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన పీరిట్ల మారుతి యూరియా బస్తాల కోసం రేచినికి వెళ్తున్నాడు. విషయం తెలిసిన నానక్క తాను కూడా యూరియా కోసం వస్తానని మారుతి మోటార్‌సైకిల్‌పై వెళ్లింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే బస్సు మృత్యు శకటమై ఢీకొట్టింది. నానక్కకు భర్త మల్లేష్‌, కుమారుడు ఉన్నారు.

    పిల్లల ప్రాణాలతో చెలగాటం

    సెయింట్‌ థెరిస్సా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యపు పనితీరు, పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల స్కూల్‌ బస్సు డ్రైవర్‌ డ్రంకెన్‌డ్రైవ్‌లో పోలీసులకు చిక్కాడు. మద్యం సేవించి బస్సు నడుపుతున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అనుమతి లేకుండా హాస్టల్‌ నిర్వహించినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.