నిర్మల్టౌన్: బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల మహా నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మారన్న కోరారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మాట్లాడారు. పార్టీలకతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కవిత 72 గంటల దీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. దీక్షకు నిర్మల్ నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలిరావాలని కోరారు. అనంతరం నిరాహార దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణచారి, వడ్డెర సంఘం అధ్యక్షుడు భూపతి, నాయీబ్రాహ్మణ నాయకులు గంగాధర్, తెలంగాణ జాగతి నాయకులు పాల్గొన్నారు.
Nirmal
కడెం: యువత ఉపాధి ఆవకాశలను అందిపుచ్చుకోవాలని డీఆర్వో ప్రకాశ్, హైటీకాస్ ప్రతినిధి వెంకట్ అన్నారు. మండలంలోని కల్లెడ గ్రామంలో హైటీకాస్, ప్రథమ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో నర్సింగ్, టైలరింగ్, కార్, బైక్ మెకానిక్, బ్యుటీషియన్ తదితర కోర్సుల్లో రెండు నెలలు ఉచిత శిక్షణ, వసతి కల్పిస్తారని వివరించారు. శిక్షణ ఆనంతరం రూ.20 వేల ప్రారంభ వేతనంతో ఉపాధి ఆవకాశాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల యువతీయువకులు 7288966422, 94410752,49 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్బీవో సరిత, ప్రథమ్ ఫౌండేషన్ సిబ్బంది నరేశ్, హైటీకాస్ సిబ్బంది రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
- నిర్మల్
భవనం.. భయం భయం
జిల్లాలో ఏళ్లనాటి ప్రభుత్వ కార్యాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో ఫోకస్.
అడెల్లి ఆలయానికి రూ.36.93 లక్షల ఆదాయంశనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
9లోu
రిటైర్మెంట్ ఉద్యోగానికే..
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్టౌన్: పోలీస్ రిటైర్మెంట్ కేవలం ఉద్యోగానికే కానీ, వ్యక్తిత్వానికి కాదని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన డీసీ ఆర్బీ ఎస్సై భాస్కరరావు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోపాలకృష్ణను జిల్లా కేంద్రంలోని ప్రధా న పోలీస్ కార్యాలయంలో శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. వారు ఉద్యోగ నిర్వహణలో అంకితభా వంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. పోలీస్ శాఖ తరపున వారి కు టుంబాలకు ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. శాఖ నుంచి రావాల్సి న అన్నిరకాల బెనిఫిట్స్ సకాలంలో అందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనిస్ అలీ, ఆర్ఐలు రామ్నిరంజన్, ఉద్యోగ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నిర్మల్: చదువుల తల్లి కొలువైందన్న పేరే కానీ.. ఇప్పటికీ జిల్లాలో ఉన్నతవిద్య అందని ద్రాక్షగానే ఉంది. నిర్మల్ కేంద్రంగా ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. పైగా.. జిల్లాలో ఉన్న పీజీ సెంటర్నూ నామ్కేవాస్తేగా మార్చేశారు. జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగితే.. ఇవ్వలేదు. మెడిసిన్ ఇచ్చినా అసౌకర్యాల మధ్యన చదువు సాగుతోంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలూ ఇంకెప్పుడొస్తాయన్న ప్రశ్న అలాగే ఉంది. ఇప్పటి ప్రభుత్వమూ దృష్టిపెట్టడం లేదు. ఇతర జిల్లాలో మాత్రం అదనంగా ఇంజినీరింగ్ కాలేజీలు వస్తున్నాయి. యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు పెడుతున్నారు. కానీ.. నిర్మల్ ప్రాంతాన్ని మాత్రం ఇప్పటికీ చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ఈక్రమంలో నిర్మల్ కేంద్రంగా బాసర జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. జిల్లాకు ప్రత్యేక క్యాంపస్ ఉండాలని, ఉద్యోగ, ఉపాధినిచ్చే కోర్సులు కావాలన్న వాదన బలపడుతోంది. ఈ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి వస్తోంది.
విద్యాఫలాలెక్కడ..!?
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక యూనివర్సిటీ లేదంటే పేరున్న కళాశాలలు ఉన్నాయి. కానీ.. నిర్మల్ ప్రాంతంవైపు అలాంటి ఒక్క వర్సిటీ లేదు. బాసరలో ఆర్జీయూకేటీ ఉన్నట్లే కానీ.. అందులో జిల్లా విద్యార్థులకు దక్కే సీట్లు నామమాత్రమే. ప్రత్యేక రాష్ట్రం, జిల్లా ఏర్పడి ఏళ్లు గడిచిపోతున్నా.. ఇప్పటికీ ఈ ప్రాంతానికి విద్యాఫలాలు దక్కడం లేదన్న ఆవేదన నెలకొంది. పక్కనున్న నిజామాబాద్ జిల్లాకు తాజాగా ఇంజినీరింగ్ కాలేజీ, ఇటీవల నవోదయ కేటాయించారు. ఉమ్మడి కరీంనగర్లోనూ ఇప్పటికే రెండు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, అదనంగా హుస్నాబాద్లో మరో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేశారు. కానీ.. కనీసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక్కటంటే ఒక్క కాలేజీని కేటాయించకపోవడం శోచనీయం. నిర్మల్ కోసం అడిగిన జేఎన్టీయూను ఆదిలాబాద్కు కేటాయించినా.. అదీ కాగితాలకే పరిమితమైంది.
నిర్మల్లోని పీజీ కాలేజీ
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయ 3 నెలల హుండీ ఆదాయాన్ని శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళా భక్తుల సమక్షంలో లెక్కించారు. అమ్మవారికి భక్తులు ఆభరణాలు, కానుకలు, నగదు రూపంలో నమర్పించిన వాటిలో నగదు రూ.36,93,630 రూపాయలు, మిశ్రమ బంగారం 19 గ్రాములు, మిశ్రమ వెండి 3.8 కిలోలు సమకూరినట్లు ఇన్చార్జి ఈవో రమేశ్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పరిశీలకులు భూమయ్య, ఆలయ చైర్మన్ భోజాగౌడ్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యూస్రీల్
ఉన్నతవిద్య.. ఇప్పటికీ అందని ద్రాక్షే
పైచదువులకు పట్నం పోవాల్సిందే
చదువుల దూరం.. తగ్గించాలని విన్నపం
మళ్లీ తెరపైకి జ్ఞానసరస్వతీ వర్సిటీ డిమాండ్
పైచదువులకు పట్నంకే..
‘ఏం నర్సయ్య.. ఏం సంగతి..! ఎక్కడుంది నీ బిడ్డ, ఏం చదువుతోంది..?’ అని అడిగితే.. ‘సార్.. ఇంటర్దాకా నిర్మల్ల సదివింది. ఇప్పుడు పట్నంల ఇంజినీరింగ్ సీటచ్చిందట. ఉన్న ఒక్క ఆడపిల్లను అంతదూరం పంపాలంటే ఇబ్బందిగనే ఉంది కానీ.. మన దగ్గర కాలేజీలు లేవు కదా సార్.. తప్పడం లేదు.’ అని నర్సయ్య నీరసంగా జవాబిస్తున్నాడు. ఒక్క నర్సయ్యకే కాదు.. ఎంతోమంది తల్లిదండ్రులు, వారి పిల్లలకూ పైచదువులంటే ఇప్పటికీ పరేషానే. ఇంజినీరింగ్ ఒక్కటే కాదు. కనీసం ఎంబీఏ, ఎంసీఏ, ఇతర పీజీ కోర్సులు చదువాలన్నా.. పుస్తకాలు, దుస్తులు సర్దుకుని, పట్నం బాట పట్టాల్సిందే.
జ్ఞానసరస్వతీ వర్సిటీ కావాలె..
‘నిర్మల్ ప్రాంతాన్ని ఉస్మానియా నుంచి కాకతీయకు, ఇప్పుడు కేయూ నుంచి తెలంగాణ వర్సిటీకి జిల్లాను మార్చడం కాదు.. నిర్మల్ జిల్లాకు ప్రత్యేక క్యాంపస్ కేటాయించాలి..’ అన్న డిమాండ్ పెరుగుతోంది. చదువులమ్మ బాసర జ్ఞానసరస్వతీ పేరిట ఇక్కడ వర్సిటీ ఏర్పాటు చేయాలంటున్నారు.
గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ, శాతవాహన, పాలమూరు తదితర యూనివర్సిటీలన్నీ ఒకప్పుడు పీజీ సెంటర్లే.
పీజీ సెంటర్ల కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు.
నిర్మల్లో ఉన్న పీజీ సెంటర్నూ జ్ఞానసరస్వతీ యూనివర్సిటీగా మార్చాలని అప్పట్లో డిమాండ్ చేశారు.
కొత్త యూనివర్సిటీ చేయడం అటుంచి, ఉన్న పీజీ సెంటర్నూ నాశనం చేశారు.
ఒకవేళ కాకతీయ నుంచి తెలంగాణ వర్సిటీలోకి జిల్లాను(అఫ్లియేషన్) మార్చినా.. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఉన్న సౌత్క్యాంపస్ తరహాలో నిర్మల్లో అన్నికోర్సులతో ‘జ్ఞానసరస్వతీ క్యాంపస్’ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది.
- ● ప్రభుత్వ పాఠశాలలో ఏఐ పాఠాలు ● రెండోవిడత రాష్ట్రస్థాయి శిక్షణకు జిల్లా ఉపాధ్యాయులు ● మరింత పటిష్టం కానున్న సర్కారువిద్య...
నిర్మల్ఖిల్లా: విద్యాబోధన కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా కృత్యాధార బోధనతోపాటు డిజిటల్ పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. తాజాగా కృత్రిమ మేధ(ఏఐ) విద్యారంగంలోకి ప్రవేశించింది. పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో, జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణిత బోధనలో ఏఐని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతోపాటు సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏఐ బోధనకు చర్యలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టే దిశగా చురుకై న చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణితంలో కొన్ని పాఠ్యాంశాలను ఏఐ ద్వారా బోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గణిత సబ్జెక్టులో ఏఐ ఆధారిత బోధన ద్వారా విద్యార్థులకు లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఉంది. ఈమేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో తరగతుల వారీగా ఏఐ ఆధారిత డిజిటల్ కంటెంట్ను రూపొందించారు. ఇది విద్యార్థులకు ఆసక్తికరంగా, సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడింది.
ఉపాధ్యాయుల శిక్షణ..
ఏఐ బోధనను ప్రభావవంతంగా అమలు చేయడానికి, ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షణ అందించడం కీలకం. ఈ దిశగా, జిల్లా నుంచి ఎంపిక చేసిన ఐదుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న హైదరాబాద్లో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన మొదటి విడత శిక్షణలో ఐదుగురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ‘‘ఏఐ డిజిటల్ లిటరసీ’’ అంశంపై రెండో విడత శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో డిజిటల్ సాధనాలు, ఏఐ ఆధారిత అప్లికేషన్ల వినియోగం గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు జిల్లా స్థాయిలో మండలాల వారీగా ఇతర ఉపాధ్యాయులకు ఏఐ బోధనపై శిక్షణ ఇస్తారు.
విడతల వారీగా డిజిటల్ కంటెంట్..
ఏఐ బోధన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ద్వారా నేర్చుకునే అవకాశం కల్పించబడుతోంది. జిల్లాలోని 535 ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమం దశలవారీగా అమలు కానుంది. 50 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు కంప్యూటర్లను అందించి, డిజిటల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. జి–కంప్రైస్, ఎడ్యుఆక్టివ్ 8, తెలంగాణ కోడ్ మిత్ర, చాట్బోట్ వంటి అప్లికేషన్ల ద్వారా గణిత పాఠ్యాంశాలను ఆసక్తికరంగా బోధించేందుకు ఎస్సీఈఆర్టీ డిజిటల్ కంటెంట్ను రూపొందించింది. ప్రస్తుతం గణితంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇతర సబ్జెక్టులకు కూడా విస్తరించనున్నారు.
విద్యార్థులకు ప్రయోజనం..
కృత్రిమ మేధ ద్వారా డిజిటల్ కంటెంటును అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు ఉత్సాహంగా స్వీయ అభ్యసనం చేయగలుగుతారు. జిల్లా నుంచి నాతోపాటు ఐదుగురు రెండోవిడత రాష్ట్రస్థాయి శిక్షణలో ఇటీవల పాల్గొన్నాం. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – రాచర్ల గంగన్న,
జిల్లా రిసోర్స్ పర్సన్, సారంగాపూర్
అభ్యసన మరింత ప్రభావవంతం...
ఇప్పటికే విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండగా ఇప్పుడు మరింత దూర దృష్టితో ఏఐ ఆధారిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. దీంతో విద్యార్థుల అభ్యసన ప్రక్రియ మరింత ప్రభావవంతంగా సాగేందుకు అవకాశం ఉంటుంది.
– పి.రామారావు, డీఈవో, నిర్మల్
ఏఐ బోధన ప్రభావం ఇలా..
ఏఐ ఆధారిత బోధన విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని, లాజికల్ థింకింగ్ను పెంపొందించడంతోపాటు ఉపాధ్యాయులకు కూడా సౌకర్యవంతమైన బోధనా విధానాన్ని అందిస్తోంది. చిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్ అప్లికేషన్ల ద్వారా విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఈ విధానం వారి సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. డిజిటల్ తెరలు (ఐఎఫ్పీ ప్యానెల్ బోర్డులు) ద్వారా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభంగా, ప్రభావవంతంగా బోధించగలుగుతున్నారు. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తెరలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బోధన ప్రక్రియను మరింత ఆకర్షణీయంగా, సమర్థవంతంగా మార్చాయి.
- ● డీఎఫ్వో నాగిని భాను
సారంగపూర్: అధికారులు, ప్రజలు తాము నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని, అప్పుడే వనమహోత్సవానికి నిజమైన అర్థం ఉంటుందని జిల్లా అటవీ అధికారి నాగిని భాను అన్నారు. మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయ సమీపంలోని అడెల్లి నందనవనంలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అటవీ అధికారితోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంర్జుమంద్ అలీ నందనవనంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులందరితోపాటు అటవీశాఖ, ఇతర శాఖల అధికారులతో మొక్కలు నాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎఫ్వో మాట్లాడారు. మొక్కలు నాటడంతోనే తమ బాధ్యత తీరిపోదని వాటిని పెంచి పెద్దవిగా చేస్తేనే చేసిన పనికి నిజమైన అర్థం పరమార్థం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అడవుల పరిరక్షణ సైతం ప్రతీ పౌరుడి బాధ్యతగా గుర్తించాలని సూచించారు. రైతులు, విద్యార్థులు, ప్రజలు తమ ఇళ్ల ఆవరణలతోపాటు పొలం గట్ల వెంట, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనూ అందమైన పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సారంగాపూర్ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ, అటవీ క్షేత్రాధికారి జీవీ.రామకృష్ణారావు, టాస్క్ఫోర్స్ అటవీ క్షేత్రాధికారి వేణుగోపాల్, భైంసా ఎఫ్ఆర్వో రమేశ్రాథోడ్, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, డీఆర్వోలు నజీర్ఖాన్, సంతోష్, నిర్మల్, సారంగాపూర్ మండలాల అటవీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- ● ప్రత్యేక అధికారి సమీక్ష ● అభివృద్ధికి సమష్టి కృషికి ఆదేశం
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ ప్రత్యేక అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్యం, పన్నుల వసూలు, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, పట్టణ సుందరీకరణ తదితర అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాణిజ్య, వ్యాపార, ప్రకటనల అద్దె, పన్నులు అన్నింటినీ సకాలంలో వసూలు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పట్టణంలో కీలకమైన కూడళ్లలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- నకిలీ, కాలం చెల్లిన
సారంగపూర్: ఎరువులు, పురుగుమందుల దుకాణ యజమానులు రైతులకు కాలం చెల్లిన, నకిలీ ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మండలంలోని చించోలి(బి) ఎక్స్రోడ్డు వద్దగల డీసీఎంఎస్ ఎరువుల దుకాణాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం సారంగాపూర్లోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, పరుగు మందుల దుకాణ యజమానులు నిత్యం స్టాక్బోర్డు నిర్వహించాలని సూచించారు. అందుబాటులో ఉన్న, యూరియా , ఇతర ఎరువుల వివరాలు బోర్గుపై ప్రదర్శించాలని తెలిపారు. ఎరువుల అమ్మకానికి సంబంధించిన రశీదులను తనిఖీ చేశారు. అన్ని రశీదులు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారికి అవసరమైన ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధిక మోతాదులో యూరియా వినియోగంతో భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గుతుందని తెలిపారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, మండల వ్యవసాయాధికారి వికార్ అహ్మద్, ఏఈవోలు, రైతులు ఉన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ
Nizamabad
ఖలీల్వాడి: బాలల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధానికి చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలనిస్తోంది. ఆకలి, ఆర్థిక సమస్యలతో బాల కార్మికులు పెరుగుతున్నారు. దీంతో అధికారులు వారిని పనిలోంచి బయటికి తీసుకొచ్చి, తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నారు. జిల్లాలో పోలీసులు, బాలల సంరక్షణ, కార్మిక శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీలతో 154 మంది బాలలకు విముక్తి లభించింది.
తనిఖీలు ఇలా..
జిల్లాలో నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్–11’ మూడు బృందాలు పనిచేశాయి. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎస్సైలు ఇంచార్జీలుగా, నలుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఐసీడీఎస్, కార్మిక శాఖ అధికారులతో కలిసి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. జూలై 1 నుంచి 31 వరకు ఈ బృందాలు జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలు, ఇటుక బట్టీలు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని మూడు డివిజన్లలో మొత్తం 154 మంది గుర్తించగా 148 మంది బాలుర, 6 మంది బాలికలను విముక్తి చేశారు. నిజామాబాద్ పరిధిలో 15, ఆర్మూర్లో 12, బోధన్లో 9 కేసులు నమోదు చేశారు. తప్పిపో యిన పిల్లల వివరాలను ‘దర్పణ్ యాప్’లో నమో దు చేసి, వారి అడ్రస్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 56 మంది, బోధన్లో 56 మంది, ఆర్మూర్లో 42 మందిని గుర్తించారు. తప్పిపోయిన చిన్నారులను సైతం అక్కున చేర్చుకున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కొందరిని తల్లిదండ్రులకు అప్పగించగా, మరికొందరిని రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు.
కొన్ని రోజులకే యథాస్థితికి..
జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించిన కొన్ని రోజులకే యథాస్థితికి చేరుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలలకోసారి నిర్వహించే ఈ కార్యక్రమాల్లో గుర్తించిన పిల్లలను తల్లిదండ్రులు తమ కుటుంబ అవసరాలకు మళ్లీ పనుల్లో చేరుస్తున్నారు. నిరంతరం కార్యక్రమాన్ని కొనసాగిస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముగిసిన ‘ఆపరేషన్ ముస్కాన్–11’
జిల్లాలో 154 మంది బాలల గుర్తింపు
36 కేసులు నమోదు
నవీపేట: పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచాలని తెలియదా? నేనొచ్చి క్లీన్ చేయాలా? అంటూ నవీపేట పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. మందుల కొరత లే కుండా చూడాలని ఆదేశించారు. అనంతరం దర్యాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి అక్కడ వంటశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి మెనూ వివరాలను తెలుసుకున్నారు. ఆ వరణలో చుట్టుపక్కల వాసులు చెత్తను పారేయడంతో జీపీ కార్యదర్శి రవీందర్నాయక్ను మందలించారు. అంగన్వా డీ కేంద్రాలను పరిశీలించి చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. నవీపేట ప్రాథమిక పాఠశాలలోని మరుగుదొడ్లు, బాత్రూమ్లను పరిశీలించారు. సొసైటీ, పశు వైద్యశాల, తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూభారతిపై అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ సమస్యలను పెండింగ్లో ఉంచొద్దన్నారు.
● పంచాయతీ కార్యదర్శిపై
కలెక్టర్ సీరియస్
● నవీపేటలో ప్రభుత్వ కార్యాలయాలను
తనిఖీ చేసిన వినయ్ కృష్ణారెడ్డి
Eluru
ఏలూరు(మెట్రో): అన్నదాత సుఖీభవ సాయం కోసం రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా సాయానికి అదనంగా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత రైతులను నిలువునా మోసం చేశారు. ఏడాదిపాటు సార్వా, దాళ్వా సీజన్లలో రైతులకు ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టారు. తీరా ఈ ఏడాది నుంచి అమలు చేస్తామన్న ప్రభుత్వం జిల్లాలో సుమారు 40 వేల మంది రైతులకు కోత పెట్టనుంది.
గత ప్రభుత్వంలో పక్కాగా..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభంలో వైఎస్సార్ రైతు భరోసా కింద సాయం అందించారు. 2023–24లో జిల్లాలో సుమా రు 2 లక్షల మంది రైతులకు సాయం అందగా.. తాజా గా అన్నదాత సుఖీభవ పథకం కింద సుమారు 1,60,968 మంది అర్హులుగా కూటమి ప్రభుత్వం నిర్ధారించింది. ఈ లెక్కన జిల్లాలో సుమారు 40 వేల మందికి సాయం అందకుండా పోనుంది.
సాయంలో మెలిక
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు ఇస్తామంటూ మెలిక పెట్టారు. దీనిపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల అప్పులబాట
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సార్వా, దాళ్వా సీజన్ల ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద నగదు అందించేవారు. దీంతో రైతులు ఆనందంగా సాగు ప్రారంభించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ సాయం అందించకపోవడంతో రైతులు అప్పులబాట పడుతున్నారు. దళారు లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నా రు. దీనికి తోడు దాళ్వా సీజన్లో రైతుల నుంచి ప్ర భుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఓ పక్క సాయం అందించకపోగా.. సేకరించిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించలేదంటూ రైతులు మండిపడుతున్నారు.
సార్వా నాట్ల ముగింపు దశలో..
జిల్లాలో రైతులు అవస్థల నడుమ ప్రస్తుత సార్వా సీజన్లో వరి నాట్లు పూర్తిచేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ రూ.2 వేలు, రాష్ట్ర ప్రభు త్వం రూ.5 వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో జమచేస్తామని ప్రకటించింది. నారుమడులు, నాట్ల కోసం ఇప్పటికే అప్పులు చేశామని, సొమ్ములు అవసరమైన సమయంలో ఇవ్వకుండా జాప్యం చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అర్హుల జాబితా నుంచి సుమారు 40 వేల మందిని కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతులకు ఎగనామం
కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ నిధు లను అందిస్తామంటూ కూటమి సర్కారు మభ్యపెడుతోంది. అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్య తగ్గించడం దారుణమని, కూటమి ప్రభు త్వం అధికారంలోనికి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టడం రైతులకు అన్యాయం చేయడమే అని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ అమలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులకు వెన్నుపోటు
అన్నదాత సుఖీభవ పథకంలో 40 వేల మంది రైతులకు కోత
గతేడాది లబ్ధికి ఎగనామం
రైతులందరికీ రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ
ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలని మెలిక
కౌలు రైతులకు రిక్తహస్తం
మూడు విడతల్లో పంపిణీకి ఏర్పాట్లు: కలెక్టర్
అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లావ్యాప్తంగా శనివారం 1,60,968 మంది రైతులకు రూ.107.08 కోట్ల లబ్ధి అందించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర వాటాగా మరో రూ.14 వేలు ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. సాయాన్ని మూడు విడతల్లో అందిస్తారని, మొదటి విడతగా రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు మొత్తం రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తారని చెప్పారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): కూటమి ప్రభుత్వం బదిలీ ఉపాధ్యాయులకు ఈ నెలా మొండిచేయే చూపింది. టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం.. బదిలీలు అయిన ఉపాధ్యాయులకు మాత్రం జీతాల చెల్లింపులో పూర్తిగా విఫలమైంది. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళనలు, నిరసనలు చేపట్టినా సర్కారులో చలనం లేదు. ఈనెల 1న జీతాలు వస్తాయని ఎదురుచూసిన ఉపాధ్యాయులకు భంగపాటే ఎదురైంది.
కొందరికే పొజిషన్ ఐడీలు
సాధారణంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించాలి. దీని నిమిత్తం పొజిషన్ ఐడీలు కేటాయించాలి. గత నెల 15వ తేదీ లోపు అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేశారు. బదిలీలు పూర్తి చేసి నెల రోజులు దా టుతున్నా క్లియర్ వేకెన్సీల్లోకి బదిలీ అయిన వారికి మాత్రమే పొజిషన్ ఐడీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొత్తగా సృష్టించిన పీఎస్ హెచ్ఎం, రీపోర్షన్మెంట్లో కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటికీ పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్, జూలై నెలలకు సంబంధించి ఆగస్టు నెలలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందలేదు.
వచ్చే నెలా అనుమానమే..
ఉపాధ్యాయులను బదిలీ చేసిన తర్వాత కేడర్ స్ట్రెంగ్త్ను నిర్ధారించి ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం డైరెక్టరేట్ ఆప్ ట్రెజరీ అండ్ ఆడిట్కు అందించాలి. అయితే పాఠశాల విద్యాశాఖ ఇప్పటికీ ఆ పని చేయలేదు. కేడర్ స్ట్రెంగ్త్ అయిన తర్వాతే ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించే అవకాశం ఉంది. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జూన్, జూలై నెలలకు సంబంధించి జీతాలు ఏరియర్ బకాయిలతో ఈనెల 10వ తేదీలోపు ట్రెజరీకి బిల్లులు పెడితేనే ఈ నెలలో జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈనెల 10లోపు ఈ ప్రక్రియ పూర్తికాకుంటే బదిలీ అయిన టీచర్లకు జూన్, జూలైతో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు కూడా సెప్టెంబర్లో పడే అవకాశం ఉండదని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
బదిలీ ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాల్లేవు
ఇప్పటికీ కేటాయించని పొజిషన్ ఐడీలు
ప్రభుత్వం విఫలం
బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక నెల జీతాలు చెల్లించలేదంటే సాంకేతికలోపమో, పని ఒత్తిడో అని సరిపెట్టుకోవచ్చు. కానీ రెండు నెలల జీతాలు ఆపడం అంటే సీఎస్ఈ నిర్లక్ష్యంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సకాలంలో బిల్లులు చేసి జీతాలు చెల్లించాలి.
– గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్
ఉపాధ్యాయులపై కక్ష
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. బోధనేతర పను లు అప్పగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. అనేక రకాల లక్ష్యలు, యాప్ల అప్లోడ్ వంటి పనులు అప్పగించడం వారిని అవమానించడానికే. జీతాల చెల్లింపులో అలసత్వంపై ఉపా ధ్యాయ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
– గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
భీమవరం : పట్టణంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ సమీపంలో ఆధునికీకరించిన సబ్ జైలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్లను శుక్రవారం జైళ్ల శాఖ డీజీపీ అంజన్కుమార్ ప్రారంభించారు. అనంతరం సబ్ జైల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎస్పీ అద్నాన్నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు ఉన్నారు.
జిల్లాలో ఎరువుల కొరత
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఖరీఫ్ రైతులు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులో ఉంచాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. శుక్రవా రం స్థానిక అన్నే భవనంలో ఆయన మాట్లాడు తూ రైతులకు యూరియా అందుబాటులో లే దని, దీంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనాల్సి వస్తోందన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎరువులు నిల్వల వివరాలను అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరత లే కుండా చూడాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఉపాధ్యాయు ల నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల అవార్డుల వేడుక నిర్వహించనున్నారన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. తర్వా త వచ్చే దరఖాస్తులు స్వీకరించరని పేర్కొన్నారు.
అధ్వానంగా ప్రభుత్వ హాస్టళ్లు
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభు త్వ హాస్టళ్లలో నిర్వహణ అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వైఎ స్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అయినపర్తి రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జి ల్లాలోని పలు హాస్టళ్లను పరిశీలించిన అనంత రం శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడుకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ హాస్టళ్లలో పారిశుద్ధ్యం క్షీణించిందని, నేలపై నిద్ర, దోమల స్వైర విహారం సర్వ సాధారణమయ్యారన్నారు. పలు హాస్టళ్లలో దుప్పట్లు, దోమ తెరలు పంపిణీ చేయలేదని దీంతో విద్యార్ధులు కంటిపై నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరుగుదొడ్లకు తలుపులు కూడా లేని దుస్థితి నెలకొందని, కనీస మౌలిక వసతులు కరువై విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారన్నారు. నిధుల కొరత కారణంగా మెనూ సక్రమంగా అమలవుతున్న దాఖలాలు లేవన్నారు. తరచూ ఆహారం కలుషితమై విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరిగేల అభిషేక్ అర్జున్, కార్యదర్శి జాన్సన్, ఉపాధ్యక్షుడు సూర్య, అనిల్, వివేక్, ప్రదీప్, ప్రభాష్, గణేష్ పాల్గొన్నారు.
పక్కాగా భూ సర్వే
భీమవరం(ప్రకాశంచౌక్): ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూములు రీ సర్వేపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాలు రీ సర్వే పనులను నెలాఖరుకు పూర్తిచేయాలన్నారు. మిగిలిన 72 గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేసి నిర్ధారణ చేయాలన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని 72 గ్రామాల్లో 24,474 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు.
సాక్షి, భీమవరం : మైన్స్ అధికారులుగా చెప్పుకుంటూ జిల్లాలో వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరి వ్యక్తులపై గురువారం లారీ యూనియన్ నేతలు ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి రాజా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైన్స్ అధికారుల ముసుగులో ఇద్ద రు వ్యక్తులు రెండు రోజులుగా సిద్ధాంతం, పెరవలి, తణుకు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కారులో సంచరిస్తున్నారు. లారీలను ఆపి రికార్డులు చూపించమని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పెనాల్టీల పేరిట వసూళ్లు చేసిన సొమ్ములకు రసీదులు కూడా ఇవ్వడం లేదు. గురువారం సిద్ధాంతం సమీపంలో లారీలను ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఏలూరులోని గనులు, భూగర్భశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు రాజా చెప్పారు. మైన్స్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రెండు రోజులుగా అందుబాటులో లేకుండా తిరుగుతున్నారని, వారు అయి ఉండవచ్చునని అధికారులు అభిప్రాయపడినట్టు రాజా తెలిపారు. ఈ విషయమై మైన్స్ పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి ఏడీని ఫోన్లో సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భీమవరంలో అలంకారప్రాయంగా ఆఫీస్
భీమవరంలో గనులు, భూగర్భశాఖ జిల్లా కార్యా లయం అలంకారప్రాయంగా మిగిలింది. కార్యాలయ సూపరింటెండెంట్ లాంగ్ లీవ్పై వెళ్లిపోగా, సర్వేయర్ డిప్యూటేషన్పై ఏలూరులో పనిచేస్తు న్నారు. ఒక అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఏజీ), ఒక రా యల్టీ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఏఓ), రెండు ఆఫీస్ సబార్డినేట్, చైన్మెన్, డ్రైవర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని ఇసుక ర్యాంపులు సీఆర్జెడ్ పరిధిలోకి వెళ్లి మైనింగ్ నిలిచిపోవడంతో ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఏలూరు నుంచి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నారు.
పర్యవేక్షణ కరువు
జిల్లాలో మైనింగ్ లీజులు లేనప్పటికీ పట్టించుకునే వారు లేక ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లోని గోదావరి తీరంలో బొండు, ఇసుక, అలాగే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వెంబడి ఇసుక, తాడేపల్లిగూడెం రూరల్లోని ఆరుగొలనులో గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేస్తే వెళ్లి పరిశీలించే పరిస్థితి ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లారీలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు
ఉన్నతాధికారులకు లారీ యూనియన్ నేతల ఫిర్యాదు
ఏలూరు (టూటౌన్): ప్రమాదకర స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 5న విద్యుత్ భవనం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పాల్గొనాలని ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక పిలుపు నిచ్చింది. శుక్రవారం నగరంలోని పత్తేబాద రైతు బజార్ నుంచి ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పులూరు హేమ శంకర్, సీఐటీయూ నాయకులు పంపన రవి మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మరింతగా దోచుకునే ఉద్దేశంతో స్మార్ట్ మీటర్లను తీసుకు వస్తుందన్నారు. ఏడాదిగా కరెంటు బిల్లులు పెరిగి ప్రజలు గగ్గోలు పెడుతున్నా చార్జీలు పెంచలేదంటూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భీమవరం అంబేడ్కర్ సెంటర్లో శుక్రవారం మాల సంఘాల జేఏసీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాలలు అన్ని రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. జాతీయ కన్వీనర్ చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ మాలలకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్ గంటా సుందరకుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 3న కుప్పం నుంచి మాల సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, దీనిని మాల సంఘాల నాయకులు, సభ్యులు విజయవంతం చేయాలని కో రారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్, సోడదాసి జయపాల్, కొండేటి లాజర్, వర్ధనపు మోషే, పెట్టెం శుభాకర్, కర్ని జోగయ్య, ఉన్నమట్ల శామ్యూల్రాజ్, పరువు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Palnadu
బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసే ఆధునిక పద్ధతి అందుబాటులోకి వచ్చింది. రోగులకు ఈ విధానం ఒక వరం. ‘ఇమ్యూనో ఎషరప్షన్’ అనే ఈ విధానం ద్వారా గుంటూరు వేదాంత హాస్పిటల్లో ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నాం. ఈ పద్ధతిని రాష్ట్రంలో మొదటిసారిగా మా ఆస్పత్రిలోనే అందుబాటులోకి తెచ్చాం. రోగులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం.
– డాక్టర్ చింతా రామకృష్ణ,
నెఫ్రాలజిస్టు, గుంటూరు
- అవయవదానం వల్ల మరొకరికి నూతన జీవితాన్ని ఇవ్వొచ్చు. భూమిపై లేకున్నా ఇతరుల్లో జీవించి ఉండొచ్చు. జిల్ల్లాలో పలువురు బ్రెయిన్డెడ్ అవుతున్నారు. అలాంటి వారి కుటుంబ సభ్యులకు అవగాహన పెంచడం ద్వారా ఎంతోమందికి నూతన జీవితాన్ని ప్రసాదించే వీలుంది. ఏటా ఆగస్టు 3న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
గుంటూరు మెడికల్: అవయవాలు అవసరమైన వారు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. దీనికి జీవన్దాన్ పేరిట సర్కారు ప్రత్యేక ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి జీవన్దాన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి కోసం పలువురు దరఖాస్తు చేసుకుని అవయవాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆపరేషను ఖర్చులు భరించలేక కూడా జీవన్దాన్ పథకంలో పేర్లు నమోదు చేయించుకోని వారు అధికంగానే ఉన్నట్లు సమాచారం. అవయవాల కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పలువురు ఎదురు చూస్తున్నారు. సకాలంలో వీరికి అవయవాలు లభించకపోతే ప్రాణాలు కోల్పోవాల్సిందే. మూఢ నమ్మకాలు, అవగాహన లోపంతో ఇప్పటికీ పలువురు అవయవదానానికి ముందుకు రావడం లేదు. తాము ఈ లోకంలో లేకున్నా మరొకరికి దానం చేసిన అవయవాల వలన సజీవంగా ఉండే గొప్ప అవకాశం ఇది. కుటుంబసభ్యులు కూడా ఆ సమయంలో బాధను తట్టుకుని ముందుకు రావడంతో పలువురి ప్రాణాలు నిలిచాయి. అభాగ్యులకు పునర్జన్మ లభించడంతో వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి.
ఏవి దానం చేయవచ్చంటే..
మనిషి కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఇలా సేకరణకు ఐదు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులను అవసరమైన వారికి మూడు గంటల్లోగా అమర్చాలి. కాలేయాన్ని 5 నుంచి 8 గంటలలోపు, మూత్రపిండాలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాలి. కళ్లు చాలా కాలం నిల్వ చేయవచ్చు.
నమోదు చేసుకోవడం ఇలా...
ఎవరైనా దీనికి అంగీకరించే ముందు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసిన వారందరికీ అవయవ దానం చేస్తున్నట్లు చెప్పాలి. దీని వలన సదరు వ్యక్తి బ్రెయిన్డెడ్ అయితే త్వరగా అవయవాలు దానం చేసేందుకు వీలు కలుగుతుంది. www.jeevandan.ap.gov.in వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం వారికి ఓ కార్డును అందజేస్తుంది.
అవయవాలు కావాల్సి వస్తే...
అవయవ మార్పిడి కోసం జీవన్దాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నెంబరు ఇస్తారు. అవయవదానం చేసేందుకు వెబ్సైట్లో సమాచారం ఇస్తే తక్షణమే సీరియల్ నెంబరు ప్రకారం అవయవాలు అమర్చేలా జీవన్దాన్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు.
అవయవ దానంతో నిలుస్తున్న విలువైన ప్రాణాలు ంేపు జాతీయ అవయవ దాన దినోత్సవం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): శంకర్విలాస్ బ్రిడ్జిపై ఈ నెల 9 నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేసి కూల్చివేత పనులు చేపడుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, అధికారులతో కలిసి నగరంలో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు.
● ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2 పిల్లర్స్ కాంక్రీట్ పూర్తి అయ్యాయని, 9 నుంచి కూల్చివేత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 135 స్ట్రక్చర్లు ఉండగా వాటిలో 74 మంది అంగీకారం తెలిపారని, వారికి నష్ట పరిహారం ఇచ్చి నిర్మాణాలు తొలగించామన్నారు.
● నందివెలుగు రోడ్లోని ఆర్ఓబీ పనులు 10 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయని, 8 నెలల్లో పూర్తి చేసేలా చూస్తామన్నారు.
● మణిహోటల్ సెంటర్లో కల్వర్ట్ నిర్మాణం చేయాల్సినందున ఆర్ అండ్ బీ అధికారులు రెండు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
● ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు 7న టెండర్లు ఓపెన్ అవుతాయని, అనంతరం పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు.
● శారదాకాలనీ రోడ్, బ్రాడీపేట, నెహ్రూనగర్ రోడ్ల విస్తరణకు, ఎల్సీ నం.3 గేటు దగ్గర ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఆటో నగర్, అగతవరప్పాడులను కనెక్ట్ చేసేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
● పీవీకే నాయుడు మార్కెట్కు గతంలో చేసిన డిజైన్లు ఎవరికి నచ్చలేదు కనుక రివైజ్డ్ డిజైన్లను నిర్ణయించాలన్నారు.
● నల్లపాడు చెరువు, బొంగరాలబీడు కార్మిక శాఖ స్థలాలను నగరపాలక సంస్థకు కేటాయిస్తూ నిర్ణయం జరిగిందన్నారు. త్వరలో పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక కార్యాచరణ చేపడతామన్నారు.
● అసంపూర్తిగా ఉన్న గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ కాంట్రాక్టర్ని తొలగించి, నూతన కాంట్రాక్టర్కు పనులు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో మరమ్మతులకు గురైన రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు.
● శిథిలావస్థకు చేరిన బీఆర్ స్టేడియం రిజర్వాయర్ స్థానంలో రూ.2 కోట్లతో నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
● రెడ్డిపాలెం రోడ్ విస్తరణ గతంలో మాస్టర్ ప్లాన్కి భిన్నంగా జరిగినందున, సరిచేయాల్సి ఉందని, 3 వంతెనల వద్ద వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తున్నందున, శాశ్వత పరిష్కారం కోసం సుమారు 2 వందల ఆక్రమణలు తొలగించి, వారికి పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
● శారదా కాలనీ రోడ్ విస్తరణలో ప్రభావిత 22 మంది భవన యజమానులకు రూ.50.22 లక్షల నష్ట పరిహార చెక్కులను అందించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
కూల్చివేత పనులు ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Anakapalle
రావికమతం: విశాఖ నగరం కంచరపాలెంలో కరెంటు షాక్తో శుక్రవారం ఉదయం 8 గంటలకు రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలివి. రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన భీమరాతి రాజుబాబు(లేటు), చంద్రమ్మ రెండో కుమారుడు రమణ(41) పది సంవత్సరాల క్రితం కంచరపాలెంలో భార్య సత్యవతితో కలిసి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచి కంచరపాలెంలో ఐటీఐ జంక్షన్లోని శ్రీకుంచమాంబ వాటర్ వాస్ సర్వీసింగ్ పాయింట్లో పని చేస్తున్నారు. ఎప్పటిలాగే ఉదయం సర్వీసింగ్ సెంటర్కు వెళ్లిన రమణ వాటర్ మోటార్ స్వీచ్ ఆన్ చేస్తుండగా కరెంటు షాక్కు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీనిపై కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య సత్యవతి, కుమారులు జశ్వంత్, సుశ్చిత్ ఉన్నారు. జశ్వంత్ ఐటీఐ, సుశ్చిత్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కొత్తకోటకు తరిలించామని పోలీసులు తెలిపారు. రమణ ఆకాల మరణంతో కొత్తకోటలో విషాదఛాయలు అలముకున్నాయి.
సింహాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సింహవల్లీ తాయారు అమ్మవారికి లక్ష కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లీ తాయారు, చతుర్బుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా ఈ పూజను చేపట్టారు. లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమ పూజ నిర్వహించి.. విశేష హారతి ఇచ్చారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదం అందజేశారు. అలాగే.. సాయంత్రం అమ్మవారికి ఆలయ బేడామండపంలో తిరువీధిని ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన పూజ కూడా వైభవంగా జరిగింది. శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి సన్నిధిని అందంగా అలంకరించారు.ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు గొవర్తి శ్రీనివాసాచార్యులు ఈ పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దేవరాపల్లి/చోడవరం: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. దేవరాపల్లి మండలంలోని తారువకు చెందిన రాయపురెడ్డి అన్వేష్ 147 మార్కులు సాధించాడు. విశాఖ గ్రామీణ విభాగంలో బీసీ–డి కేటగిరిలో అన్వేష్కు 12వ ర్యాంక్ లభించింది. సామాన్య రైతు కుటుంబానికి చెందిన అప్పలనాయుడు, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు అన్వేష్ ఏయూలో ఎంఎస్సీ పూర్తి చేశాడు. చోడవరం యువకుడు నేమాల చంద్రశేఖర్ ఉమ్మడి విశాఖజిల్లాలో 19వ ర్యాంక్ సాధించాడు. పేద కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ తండ్రి పెయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మొదట్నుంచీ పోలీసు కావాల న్న ఆశయంలో ఎంబీఏ వరకూ చదివిన చంద్రశేఖర్ ప్రత్యేక కోచింగ్ తీసుకొని ఏపీ కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రతిభ చూపారు. 200మార్కులకు గాను 143మార్కు లు సాధించి జిల్లాలో 19వ ర్యాంకర్గా నిలిచారు.
కె.కోటపాడు: కె.కోటపాడు సబ్ డివిజన్ పరిధిలోని కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో పశుపోషకుల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించే ఉద్దేశంతో బ్లాంకెట్ సర్వే చేపట్టినట్లు పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఇ.దినేష్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన వారాడ, వి.సంతపాలెం గ్రామాల్లో పర్యటించి, బ్లాంకెట్ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో పశుపోష కులు అవసరాలు, ఆదాయ వనరులు, తదితర అంశాలపై 35 ప్రశ్నలు ఆధారంగా ఈ సర్వే గత నెల 26 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నా రు. ఈ సర్వేలో వారాడ, వి.సంతపాలెం, పశువైద్య సహాయకురాలు సుధారాణి, మంగ పాల్గొన్నారు.
నక్కపల్లి: ప్రమాదకర రసాయన పరిశ్రమల ఏర్పాటుపై గంగపుత్రులు గళమెత్తారు. రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ఆందోళన బాట పట్టారు. శుక్రవారం రాజయ్యపేటకు చెందిన వందలాది మంది మత్స్యకారులు సారిపల్లిపాలెం జంక్షన్ నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజుల, వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు ఎరిపల్లి నాగేష్ ఆధ్వర్యంలో కార్యాలయం వరకు వచ్చి అక్కడ ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సీపీఎం కేంద్రం కమిటీ సభ్యుడు కె.లోకనాథం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు, మత్స్యకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో మూడు ప్రాంతాల్లో ఈ బల్క్ డ్రగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోందని, వాటిలో నక్కపల్లి ఒకటన్నారు. ప్రాజెక్టు రిపోర్ట్లో 1270 ఎకరాల్లో బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారని, ఇప్పటికే 2వేల ఎకరాలు కేటాయించారన్నారు. ఇది చాలదన్నట్లు జానకయ్యపేట, సీహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, గుర్రాజుపేట గ్రామాల్లో మరో 800 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇన్ని వేల ఎకరాలు ఎవరి కోసం సేకరిస్తున్నారని నిలదీశారు. ఒక పక్క బల్క్ డ్రగ్ పార్క్ను రాజయ్యపేట, పరిసర గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఈ నెల 6న ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే కంపెనీలు ఏర్పాటు చేయబోమని గతంలో హోంమంత్రి అనిత పలు సందర్భాల్లో ప్రకటించారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఒక పక్క భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అందలేదని పోరాటాలు చేస్తుంటే మరో పక్క ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై మత్స్యకారులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలంటూ డీటీ నారాయణరావుకు వినతిపత్రం అందించారు. ఈ ఆందోళనలో ఎంపీటీసీలు లొడగల చంద్రరావు, కొల్నాటి బుజ్జి, గొర్ల గోవిందు, గంటా తిరుపతిరావు, సర్పంచ్ ముసలయ్య, రైతు నాయకులు తళ్ల భార్గవ్, గొర్లె బాబూరావు, యలమంచిలి తాతబాబు, బొంది గోవిందు, దేవర నూకరాజు, కాశీరావు, మనబాల రాజేష్, పిక్కి నూకరాజు, యజ్జల అప్పలరాజు పాల్గొన్నారు.
పేనాలు తీసే కంపెనీలన్నీ మావద్దే..
పేనాలు తీసే కంపెనీలన్ని మా దగ్గరే పెడుతున్నారు. మేం బతకొద్దా. ఎం పాపం చేసామని, ఇప్పటికే కంపెనీల వల్ల సానా ఇబ్బంది పడుతున్నాం. మళ్లీ భూములు తీసుకుని ఏదో పార్క్ పెడతామంటున్నారు. మా వోళ్లంతా భయపడిపోతున్నారు, పెబుత్వం దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అందుకే ఆఫీస్కు వచ్చి ధర్నా సేత్తన్నం. ఆరో తేదీన జరిగే మీటింగ్ అడ్డుకుంటాం.
– ఎరిపిల్లి నాగేష్, మత్స్యకారుడు
మమ్మల్ని బతకనివ్వరా?
మందుల కంపెనీల వల్ల సానా నట్టపోయాం. మళ్లీ కొత్త కంపెనీలు పెట్టి మమ్మల్ని బతకనివ్వరా. ఏటకు ఎల్తే సేపలు దొరకడం నేదు. కొన్ని సేపలను తింటే జబ్బులొస్తున్నాయి. కొత్తగా ఏదో కంపెనీ పెడతారంట. ఇక్కడ సానా కంపెనీలు వత్తాయి అంటన్నారు. భూములు, ఇళ్లు తీసేసుకుంటన్నారు. పెబుత్వం మమ్మల్ని ఏంసేద్దామని ఇవ్వన్ని పెడతన్నారు. అందరూ బాగానే ఉంటా, పక్కన కాపురాలు సేసే మాకే నట్టం.
– పిక్కి తాతీలు, మాజీ ఎంపీటీసీ
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు, అఖిల పక్ష నాయకులు
ప్రభుత్వానికి
పారిశ్రామికవేత్తలే ప్రధానం
బల్క్ డ్రగ్ పార్క్ అనేది అణుబాంబు లాంటిది. ఇక్కడ వందలాది యూనిట్లు స్థాపిస్తారు. భవిష్యత్లో పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఆరోగ్యంగా జీవించే పరిస్థితి ఉండదు. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకించిన పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నిపుణుల నివేదిక ప్రకారం బల్క్ డ్రగ్ పార్క్ చాలా ప్రమాదకరమని తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా రెడ్జోన్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పారిశ్రామిక వేత్తలే ముఖ్యంగా కనిపిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుని తీరుతాం.
– కె.లోకనాథం, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
రైతులను రోడ్డున పడేస్తారా?
ప్రమాదకర పరిశ్రమలను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదనంగా భూములు తీసుకుని రైతులను రోడ్డును పడేయాలని చూస్తున్నారు. భూములు ఇవ్వమని రైతులు కరాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రైతులు, బాధితుల పక్షాన పోరాటం చేస్తాం. 6న ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాల్సిందే.
– శీరం నర్సింహమూర్తి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు
వేట లేక మత్స్యకారులు వలస బాట
మందుల కంపెనీల వల్ల ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్లీ కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల మత్స్యకార గ్రామాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి. వేట లేక ఉపాధి కోల్పొతున్నారు. ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.
– గోసల కాసులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు
బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ధర్నా
జాతీయ రహదారిపై భారీ ర్యాలీ
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
6న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలంటూ నినాదాలు
బుచ్చెయ్యపేట: వృద్ధుల పింఛన్ల పంపిణీలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. బుచ్చెయ్యపేట మండలంలో ఉన్న మేజర్ పంచాయతీ వడ్డాదికి చెందిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుల మధ్య కొద్ది కాలంగా వర్గ విభేదాలు నడుస్తున్నాయి. శుక్రవారం స్పౌజ్ పింఛన్ల పంపిణీలో మరోసారి రెండు వర్గాల విభేదాలు బయటపడ్డాయి. మండలంలో ఉన్న 35 పంచాయతీలకు 196 స్పౌజ్ పింఛన్లు మంజూరు కాగా.. వడ్డాదికి 27 పింఛన్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు మండల కేంద్రం బుచ్చెయ్యపేటలో ఎమ్మెల్యే రాజు చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేయడానికి ఎంపీడీవో కార్యాలయం వద్ద వేదిక ఏర్పాటు చేశారు. ఒకటో తేదీ ఉదయం 9 గంటలకే పింఛన్లు పంపిణీ చేస్తారనడంతో ఉదయం 8 గంటలకే వడ్డాది పింఛన్దార్లు చేరుకున్నారు. వడ్డాది టౌన్ టీడీపీ అధ్యక్షుడు దొండా నరేష్ తన సొంత నిధులతో 22 మంది వృద్ధులను బుచ్చెయ్యపేటలో ఎమ్మెల్యే రాజు పింఛన్ల పంపిణీ చేసే వేదిక వద్దకు ఆటోలపై తీసుకొచ్చారు. ఎమ్మెల్యే రాజు వచ్చి వేదికపై ముగ్గురికి పింఛన్లు ఇచ్చి వెళ్లిపోయారు. మిగతా గ్రామాల నాయకులు, అధికారులు కలిసి లబ్ధిదారులకు పింఛన్ నగదు బట్వాడా అక్కడే చేశారు. వడ్డాదికి చెందిన వృద్ధులకు మాత్రం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. వారికి వడ్డాది పంచాయతీ వద్ద పింఛన్ నగదు ఇస్తామని తెలిపారు. అక్కడే ఉన్న తాతయ్య వర్గానికి చెందిన నాయకులు దొండా నరేష్, తలారి శంకర్, అక్కిరెడ్డి కనక, గురుమూర్తి, వెలుగుల నాగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం బుచ్చెయ్యపేటలో కొత్తవారికి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి, ఇప్పుడు వడ్డాదిలో ఇస్తామనడంలో కారణమేమిటని ఎంపీడీవో భానోజీరావు, పంచాయతీ సెక్రటరీ ఈశ్వరరావుపై మండిపడ్డారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలకు తాము బలైపోతామని గ్రహించిన అధికారులు చేసేది లేక అక్కడే వడ్డాది లబ్ధిదారులకు కూడా పింఛన్ నగదు బట్వాడా చేశారు. కొత్త పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే రాజు నుంచి తాతయ్యబాబుకు కబురు రాకపోవడంపై పలువురు టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
కొత్త పింఛన్ పంపిణీలో మరోసారి బహిర్గతం
ఎమ్మెల్యే రాజు V/S టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి దేవాలయాలు కళకళలాడాయి. ఎంతటి కష్టంలో ఉన్నా తల్లి మోము చూస్తే ప్రశాంతత కలుగుతుంది. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అందుకే జిల్లాలోని అమ్మవారి గుడులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కె.కోటపాడులోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 10 వేల గులాబీ పువ్వులతో పుష్పార్చన జరిపారు. అనకాపల్లి గవరపాలెంలో ఉత్తరాంధ్రుల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి బాలాలయంలో మహిళా భక్తులతో ఉచితంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గవరపాలెం సంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని శాకంబరి దేవిగా ఆలయ అర్చకులు అలంకరించారు.
కె.కోటపాడు/అనకాపల్లి
- ● కొత్త పింఛన్లపై సర్పంచ్, ఎంపీపీకి అందని సమాచారం ● టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ● వివాదాస్పదంగా మారిన సచివాలయ ఉద్యోగుల తీరు
దేవరాపల్లి: మండలంలోని ఎ.కొత్తపల్లి సచివాలయం పరిధిలోని ఉద్యోగులు ప్రొటోకాల్కు తూట్లు పొడిచారు. స్థానిక సచివాలయం పరిధిలో నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లపై స్థానిక సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ, స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మీకి సైతం కనీస సమాచారం ఇవ్వకుండా టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం పింఛన్ల పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్, మండల ప్రథమ పౌరురాలు ఎంపీపీకి సమాచార ఇవ్వకుండా తమ గ్రామంలో ఎలా పింఛన్లు పంపిణీ చేపడుతున్నారని ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు దృష్టికి సర్పంచ్, ఎంపీపీ తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీడీవో, పరిపాలన అధికారి డి.వి.లక్ష్మీనారాయణ ఏ.కొత్తపల్లి సచివాలయానికి చేరుకొని స్థానిక ఉద్యోగులతో సమావేశమయ్యారు. సిబ్బందిని మందలించారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుషారం వ్యవహరిస్తే తదుపరి చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. మళ్లీ ప్రొటోకాల్ సమస్యలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఎంపీడీవో సర్ది చెప్పడంతో సర్పంచ్, ఎంపీపీ శాంతించారు.
నర్సీపట్నం: ఆక్రమణదారుల నుంచి బ్రిటిషర్ల సమాధుల స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, తహసీల్దార్ రామారావుకు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.త్రిమూర్తులరెడ్డి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటానికి స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిన సర్వే నంబరు 9లోని 46 సెంట్ల స్థలంలో బ్రిటిష్ సైనికుల సమాధుల స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి శాశ్వత భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. 46 సెంట్లలో ఇప్పటికే 27 సెంట్లు ఆక్రమణకు గురైందన్నారు. మిగిలిన 19 సెంట్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నిర్మాణాలకు ఏవిధమైన అనుమతులు లేవన్నారు.
ఇటీవలో లీగల్ సెల్ చైర్మన్, పురావస్తు శాఖ సిబ్బంది స్థలాన్ని సందర్శించి, మున్సిపల్ అధికారుల సహకారంతో తుప్పులు డొంతకలతో ఉన్న స్థలాన్ని శుభ్రం చేయించారు. సమాధుల స్థలాన్ని కాపాడాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికై నా చారిత్రక నేపథ్యం ఉన్న స్థలాలను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు అడిగర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.
- ● హెచ్పీసీఎల్–ఎస్డీఐతో ఎల్జీ ఇండియా ఒప్పందం
మహారాణిపేట: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎల్జీ ఇండియా సీఎస్సార్ ఫౌండేషన్, హెచ్పీసీఎల్–ఎస్డీఐ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్లోని హెచ్పీసీఎల్ కార్యాలయంలో శుక్రవారం ఇరు సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా స్వల్ప, మధ్యకాలిక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అందిస్తారు. ఈ శిక్షణ ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణ సామర్థ్యం పెరుగుతాయని ఎల్జీ ఇండియా సీఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ గిరిజా శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి, సురక్షిత భవిష్యత్తు అందించడమే లక్ష్యమని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు, స్వయం ఉపాధి శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎల్జీ ఇండియా గ్లోబల్ హెడ్ పాల్ క్వాన్, ఎల్జీ గ్రూప్ డైరెక్టర్ సి.కె.జియాంగ్, హెచ్పీసీఎల్–ఎస్డీఐ సీఈవో ఇంతియాజ్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు సేవల్లో ఒకే కుటుంబం
Annamayya
మదనపల్లె సిటీ: మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల3వతేదీ జిల్లా పురుషుల పుట్బాల్ జట్టు ఎంపిక జరగనుంది. ఈ విషయాన్ని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9502074146, 88850 22258 నంబర్లలో సంప్రదించాలన్నారు.
3న వెలిగల్లు నుంచి
నీటి విడుదల
గాలివీడు: వెలిగల్లు కుడికాలువ గేట్లు ఈనెల 3వ తేదిన ఉదయం 9 గంటలకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈఈ బి.భాస్కర్బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైతుల విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.తంబళ్లపల్లెకు చెందిన ఆర్సీ ఈశ్వర్రెడ్డిని స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా, రాయచోటికి చెందిన వి.వెంకట రమణను స్టేట్ పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా, రాజంపేటకు చెందిన మారుతిరావును స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమించారు.
8న అరుణాచలానికి
ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే వారి కోసం ఆగస్టు 8న ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వైఎస్సార్ జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ఈనెల 8న సాయంత్రం 4.30 గంటలకు కడప డిపో రాయచోటి, పీలేరు మీదుగా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో టిక్కెట్ ధర రూ. 1044గా ఉందన్నారు. బద్వేలు డిపో నుంచి ఉదయం 9.00 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో రూ. 1282 ఛార్జిగా నిర్ణయించారన్నారు. మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సూపర్లగ్జరీ బస్సు బయలుదేరుతుందని, ఇందులో చార్జి రూ. 1352 అని తెలిపారు. ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం గంటలకు సూపర్లగ్జరీ బస్సు వెళుతుందని, ఇందులో టిక్కెట్ ధర రూ.1273. పులివెందుల డిపో నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు రాయచోటి, పీలేరు మీదుగా నడుస్తుందన్నారు. ఇందులో చార్జి రూ. 1233గా ఉందన్నారు.
నిషేధ సమయంలో
చేపల వేట సాగిస్తే చర్యలు
గాలివీడు: జులై, ఆగస్టు మాసాల్లో నిషేధ సమయంలో చేపల వేట కొనసాగిస్తే చర్యలు తప్పవని ఎఫ్డీఓ సుబ్బ నరసయ్య మత్స్యకారులను హెచ్చరించారు. ’సాక్షి’లో వెలువడిన కథనంతో జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో హుటాహుటిన మత్స్యశాఖ అధికారులు శుక్రవారం వెలిగల్లు జలాశయాన్ని పరిశీలించారు. మత్స్యకారులు, విక్రయదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ చేపలు గుడ్లు పెట్టి పిల్లలుపునరుత్పత్తి చేసే సమయంలో ఎవ్వరూ చేపల వేట సాగించరాదన్నారు. విలేజ్ ఫిషనరీష్ అసిస్టెంట్ రామాంజి నాయక్ పాల్గొన్నారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు ప్రజలను కోరారు. శుక్రవారం మండల పరిధిలోని రాచగుడిపల్లి, సీతాపురం, గొల్లపల్లి, రాచపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి ఆకేపాటి అమరనాథరెడ్డి, సురేష్ బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ..సుబ్బారెడ్డిని గెలిపించుకుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచి, ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, ఆర్థిక స్థితి గతులను మారుస్తారన్నారు. కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అవిర్భావం అయినప్పటి నుంచి ఒంటిమిట్ట జెడ్పీటీసీని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వారే దక్కించుకుంటున్నారన్నారు. ఈ సారి కూడా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ని గెలిపించి, ఒంటిమిట్ట చరిత్రను తిరగ రాయాలని ప్రజలను కోరారు. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ..తాను ఒంటిమిట్ట మండల ప్రజలకు సుపరిచితున్ని అన్నారు. నన్ను గెలిపిస్తే మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని, వాటిని పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వె వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసుల రెడ్డి, గురుమోహన్రాజు, రవిరాజు, నాగార్జున్ రాజు, రవిరెడ్డి, కత్తి శివయ్య పాల్గోన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి,
కడప మేయర్ సురేష్ బాబు
మదనపల్లె: హంద్రీ–నీవా రెండో దశశ ప్రాజెక్టులో భాగమైన పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)లో కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతుండటంతో ఈ పనులు చూసే ఎగ్జిక్యూటిన్ ఇంజనీర్ బాధ్యతల కోసం ముగ్గురు డీఈఈ (ప్రస్తుతానికి)లు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరి డివిజన్–11 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీలకంఠారెడ్డి ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రసుతం ఆయన పీబీసీ లైనింగ్ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన ఉద్యోగ విరమణ అయ్యాక ఆ స్థానంలో పని చేసేందుకు డీఈఈ హోదా కలిగిన ముగ్గురు ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇద్దరికి డీఈఈ నుంచి ఈఈ పదోన్నతి లభించే అవకాశం ఉండటంతో పదోన్నతి తర్వాత ఒకరికి అవకాశం దక్కవచ్చు. మరొక డీఈఈ సత్యసాయి జిల్లా కదిరిలో సుదీర్ఘ కాలం పని చేయడంతోపాటు అక్కడి టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్న కారణంగా గట్టిగా పోటీ ఇస్తున్నట్టు తెలిసింది. అయితే ఈఈ అర్హత ఉన్న వాళ్లకి మాత్రమే పీబీసీలో విధులు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా ప్రస్తుతం పీబీసీలో జేఈ స్థాయి ఉద్యోగికి డీఈగా అదనపు బాధ్యతలను అప్పగించి అత్యధిక భాగం పర్యవేక్షణ బాధ్యతలను కేటాయించినట్టుగా ఈఈ విషయంలోనూ వ్యవహరిస్తే ఏ స్థాయి ఉద్యోగికై నా అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఈ విషయంలో జోక్యం చేసుకునేలా కనిపిస్తోంది. హంద్రీ–నీవాలో ఇప్పటికి మంజూరు కాని పనులను..ఈ పనులకు సంబంధం లేని ప్రాజెక్టు డివిజన్కు తిరుపతి సీఈ కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ఓ టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల జరిగిందని తెలుస్తోంది. ఇలా ఇష్టారీతిన సాగుతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈఈ బాధ్యతల అప్పగింతలో విచిత్రాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇలా ఉండగా ఇప్పటికే ఈఈగా బాధ్యతలు చూస్తున్న ఓ అధికారి..నీలకంఠారెడ్డి ఉద్యోగ విరమణ చేశాక ఆయన బాధ్యతల పరిధిని కూడా తనకే అప్పగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో రూ.366 కోట్ల వ్యయంతో జరుగుతున్న పీబీసీ లైనింగ్ పనుల్లో ఈఈ బాధ్యతల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.
ప్రభుత్వ స్థాయిలో
ముగ్గురు డీఈల తీవ్ర ప్రయత్నాలు
రైల్వేకోడూరు అర్బన్: జిల్లాలోని బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సభా భవనంలో రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులు రైతులను మోసం చేస్తున్నట్లు, తూకాల్లో తేడాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్త పరిచారని, దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దళారులు సిండికేట్ అయి ధరలు తగ్గిస్తున్నట్లు గుర్తించామన్నారు. మామిడి మాదిరి బొప్పాయి రైతులకు మోసం జరిగితే దళారులపై చర్యలు తీసుకొంటామని అన్నారు. తూకాల్లో మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్చ టీడీపీ ఇన్చార్జి ముక్కారూపానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీసు పరెడ్ గ్రౌండ్లో కనుల పండువగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాల కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటాద్రి, డీఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ.. దయనీయ స్థితిలో ఉన్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో నెలకొన్న పారిశుద్ధ్య, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం వారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు నాలుగు రోజులుగా సంక్షేమ హాస్టళ్లబాట పేరుతో జిల్లా వ్యాప్తంగా అనేక వసతి గృహాలను వారు పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన నివేదికను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్కు అందజేశారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జంగంరెడ్డి కిషోర్ దాస్ మాట్లాడుతూ జిల్లాలోని చాలా హాస్టళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దిగజారిన స్థితిలో ఉన్నాయన్నారు. తాగునీటి సమస్యలు, నేలపై నిద్రించాల్సిన పరిస్థితులు, దోమల దాడులతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా హాస్టళ్లలో దుప్పట్లు, దోమతెరలు పంపిణీ కాలేదన్నారు. మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. తలుపులు లేని మరుగుదొడ్లతో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ విద్యార్థుల విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. వీటితోపాటు నిధుల కొరత కారణంగా మెనూ అమలు కావడం లేదన్నారు. పురుగులున్న బియ్యంతో వండిన అన్నం, కుళ్లిన కూరగాయలతో తయారు చేసిన కూరలు విద్యార్థుల ఆరోగ్యానికి హాని చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా ఆహారం తిన్న విద్యార్థులు తరచూ విషజ్వరాలు, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. అంతేకాక కాస్మోటిక్స్ చార్జీలు అందకపోవడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత కూడా ప్రశ్నార్థకమవుతోందని మథనపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి విద్యార్థుల ఆరోగ్యం బలవుతున్న నేపథ్యంలో విద్యార్థి విభాగం ఈ ప్రధాన డిమాండ్లపై కలెక్టర్కు వినతిపత్రంగా సమర్పించింది.
ప్రధాన డిమాండ్లు..
మెస్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు తక్షణమే విడుదల చేయాలి, శిథిలావస్థకు చేరిన హాస్టళ్లల్లో మరమ్మతులకు నిధులు కేటాయించాలని, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, హాస్టల్ వార్డన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, జిల్లావిద్యాశాఖాధికారులు వారానికి ఒకరోజు హాస్టళ్లలో బస చేయాలని, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని, ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు వసంతం మణికంఠరెడ్డి, రాజంపేట నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు అబ్దుల్ ఖాన్, పీలేరు అధ్యక్షులు లోకనాథం, జిల్లా ప్రధాన కార్యదర్సి నరేష్, రాష్ట్ర కార్యదర్శి హేమంత్, బీసీ విభాగం నాయకులు శివకుమార్, బాబు గౌడ్, రాయచోటి పట్టణ అధ్యక్షులు ఫయాజ్, జిల్లా కార్యదర్శులు అంజాద్ బాష, శివకుమార్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వసతి గృహాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం
సమస్యలపై కలెక్టర్కు
వినతిపత్రం అందజేత
Bhadradri
చుంచుపల్లి: కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలు, మండలాలను ఆకాంక్షిత జిల్లా, బ్లాక్లుగా గుర్తించి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో జిల్లాలో విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలకు చెందిన ఆరు సూచికలను 100 శాతం సాధించాలనే లక్ష్యంతో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా జిల్లాస్థాయిలో ఆరు సూచికల్లో మూడింటిని విజయవంతంగా పూర్తిచేశారు. బ్లాక్ స్థాయిలో గుండాల మండలంలో ఐదు సూచికలను పూర్తి చేసి అగ్రభాగంలో నిలిచారు. దీంతో నీతి ఆయోగ్ అధికారులు సంపూర్ణత అభియాన్ అవార్డుకు రాష్ట్రస్థాయిలో భద్రాద్రి జిల్లాను ఎంపిక చేశారు. జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలు కూడా ఎంపికయ్యాయి. ఆకాంక్షిత బ్లాక్ విభాగంలో జిల్లాలోని గుండాలతోపాటు మరో తొమ్మిది బ్లాక్లను ఎంపిక చేశారు. శనివారం హైదరాబాద్ రాజభవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అవార్డు అందుకోనున్నారు.
నేడు గవర్నర్ నుంచి
అందుకోనున్న కలెక్టర్
కొత్తగూడెంఅర్బన్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యా ధులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయుష్ డైరెక్టర్, సీజనల్ వ్యాధుల నియంత్రణ ప్రత్యేక అధి కారి డాక్టర్ జి.శ్రీధర్ సూచించారు. శుక్రవారం ఆయ న కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని, పాల్వంచలో ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు ఇంటింటి సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్లను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వైద్యసేవల వివరాలు తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ ఎస్. జయలక్ష్మి, వైద్యాధికారులు రాధామోహన్, రమేష్, స్పందన, పుల్లారెడ్డి పాల్గొన్నారు.
రైతులా గడిపిన ఇల్లెందు ఎమ్మెల్యే
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం టేకులపల్లి మండలంలో పర్యటించారు. అనంతరం బేతంపూడి గ్రామంలో సామాన్య రైతులా మారారు. అక్కడ వరి నాట్లు వేస్తున్న కూలీలతో కలిసి భోజనం చేసిన ఆయన ట్రాక్టర్ నడుపుతూ పొలంలో దమ్ము చేశారు. ఆ తర్వాత యూరియా చల్లడంతో పాటు వరి నారు తీస్తూ కూలీలతో కలిసి నాట్లు వేశారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీడీఓ మల్లేశ్వరి, ఆత్మ చైర్మన్ మంగీలాల్ తదితరులు నాట్లు వేయడం విశేషం. – టేకులపల్లి
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరా ట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
54 మంది
బాలకార్మికులకు విముక్తి
కొత్తగూడెంటౌన్: ఆపరేషన్ ముస్కాన్–11తో జిల్లావ్యాప్తంగా 54 మంది బాలలకు విముక్తి కలిగించినట్లు ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జూలై 1నుంచి 31వరకు ఐదు బృందాలతో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 44 మంది బాలురు, 10 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి 53 మంది పిల్లలను అప్పగించామని, ఒక్కరిని హోంకు తరలించామని వివరించారు. పిల్లలను పనుల్లో పెట్టుకున్న 39 మందిపై కేసులు నమోదు చేశామని, 13 మందికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.
ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి
● ఆర్టీఐకమిషనర్ అయోధ్యరెడ్డి
దమ్మపేట: తోటలను చూస్తే తనకు కూడా ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి కలుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన ఆయిల్పామ్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. అంతర పంటలు కోకో, జాజికాయ సాగు గురించి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలను తట్టుకుని నిలబడటమే కాక ధర దృష్ట్యా ఆయిల్పామ్ పంట రైతులకు లాభదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భగవాన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
సమస్య వస్తే షీ టీంను
సంప్రదించాలి
● ఎస్పీ రోహిత్రాజు
కొత్తగూడెంటౌన్: మహిళలు ఈవ్టీజింగ్, లైంగిక వేధింపుల వంటి సమస్యలపై నిర్భయంగా షీటీంను సంప్రదించాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. శుక్రవారం చుంచుపల్లి ఏహెచ్టీయూ ఆఫీస్లోని షీటీం కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ షీ టీం సభ్యులు రైల్వే స్టేషన్, బస్స్టేషన్లు, విద్యాసంస్థలు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మఫ్టీలో సంచరిస్తూ, నేరస్తులు, ఆకతాయిల కదలికలను గుర్తించాలని ఆదేశించారు. మహిళల సమస్యల పరిష్కారం ఓసం అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. షీ టీం నంబర్కు 87126 82131 సమస్యలపై ఫిర్యాదు చేయాలని కోరారు. సీఐ రాము,ఎస్సై నాగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఈఓను నియమించాలని కలెక్టర్కు ఆదేశాలు!
కొత్తగూడెంఅర్బన్: జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి గురువారం ఉద్యోగ విరమణ పొందారు. నూతన జిల్లా విద్యాశాఖాధికారి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్కు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ నిర్ణయం తర్వాత నూతన డీఈఓ ఎవరూ అనేది తెలియనుంది.
Bapatla
గుంటూరు లీగల్: సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన ప్లాపస్ చైర్మన్న్లు, మెంబెర్స్కు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్, ఒకటో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ 40 గంటల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్లాపస్ చైర్మన్ జి.రజిని మాట్లాడుతూ శిక్షకులు మీడియేషన్పై అవగాహన కల్పించారని, ఓర్పు, నైపుణ్యంతో అన్ని అనుమానాలను నివృత్తి చేశారని కృత/్ఞతలు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చైన్నె నుంచి శిక్షణ కోసం నియమించిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ రత్నతార, న్యాయవాది, సీనియర్ ట్రైనర్ సత్యారావు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్. సత్యవతి, గురజాల పదో అదనపు జిల్లా జడ్జి జి.ప్రియదర్శిని సత్కరించారు.
నరసరావుపేట రూరల్: బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అరుణకుమారి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు వరి నారుమళ్లకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మంచి విత్తనం నాటితే మంచి దిగుబడి వస్తుందని ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి చేసి నాటడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు. రైతులకు బీజామృతంతో విత్తన శుద్ధి వలన కలిగే లాభాలను వివరించాలని తెలిపారు. వరి, కూరగాయలు, మిరపతోపాటు ఏ రకమైన విత్తనాలైనా సరే బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు స్వయంగా విత్తన శుద్ధి చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్రాజ్, ఎన్ఎఫ్ఏ నందకుమార్, సైదయ్య, మేరి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు దాఖలు చేసిన ప్రతిపాదనలను డివిజినల్ స్థాయిలో ఉప విద్యాశాఖాధికారి చైర్మన్గా నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ జిల్లాస్థాయి కమిటీకి ఈనెల 12వ తేదీలోపు విధిగా సమర్పించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఉపాధ్యాయుల తుది జాబితాను రాష్ట్రస్థాయి కమిటీకి ఈనెల 16లోపు సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఈనెల 8వ తేదీ తరువాత సమర్పించే దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని స్పష్టం చేశారు.
హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష
గుంటూరు లీగల్: భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి వై.నాగరాజా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు.. అగతవరప్పాడుకు చెందిన తోట ఏడుకొండలు కుమార్తె శారద(26)ను అదే గ్రామానికి చెందిన గవిరిబోయిన శివశంకర్తో 2009 మే 6న వివాహం జరిపించారు. శివశంకర్, ఆర్మీలో పనిచేస్తున్నాడు. శివశంకర్ సెలవులో ఇంటికి వచ్చిన సమయంలో, అతడి కుటుంబ సభ్యుల ప్రభావంతో భార్య శారదపై అనుచిత ఆరోపణలు చేయడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం పెద్దల మధ్య రాజీ కుదిరినా, ఆ తరువాత శారద తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అప్పట్లో నెలకి శివశంకర్ రూ.3000 చెల్లించడానికి అంగీకరించగా, శారద రూ.6,000 అడిగిన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. 2015 జూలై 26 న శివశంకర్ తన భార్య శారదపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లేశ్వరి అనే మహిళ గాయపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారించిన రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి మొదటి నిందితుడు గవిరిబోయిన శివశంకర్ను యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధించారు. రెండో నిందితురాలు గవిరిబోయిన సుబ్బమ్మ మృతి చెందడంతో కేసు ముగించారు.
రెండు లారీలు ఢీకొని డ్రైవర్లకు గాయాలు
వినుకొండ: వినుకొండ మండలం చీకటిగలపాలెం మోడల్ స్కూల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొనగా ఇద్దరు లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు మొదట ఢీకొన్నాయి. వాటిని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు 108కి సమాచారం తెలపడంతో గాయపడిన ఇద్దరు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రమాదానికి గురైన వాహనాలను సంఘటనా స్థలం నుంచి పక్కకు జరిపించారు. డ్రైవర్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దార్యప్తు చేస్తున్నారు.
కేవలం రూపాయికే బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్
నరసరావుపేట: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఫ్రీడం ప్లాన్, కేవలం రూ.1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబి డేటా, రోజుకు 100 మెసేజ్లు, ఉచిత సిమ్కార్డు ఇవ్వబడుతుందని గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ సప్పరపు శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఎం.యన్.పి. వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించవలసినదిగా కోరారు.
సత్తెనపల్లి: ముందస్తు జాగ్రత్తలతో దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ, చికున్ గున్యా, మలేరియా, బోద , మెదడువాపు వ్యాధులను నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి అన్నారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ తో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ దోమల నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు దోమలు పుట్టకుండా అలాగే కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మురుగునీరు ప్రవహించేటట్లు చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు సూచించారు. క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను పరిశీలించి సూచనలు చేశారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ మాట్లాడుతూ దోమలను నివారించాలంటే నీటి నిల్వలు లేకుండా చేయాలన్నారు. వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి ఆరబెట్టి మళ్లీ నీరు పట్టుకోవాలని, (ఫ్రైడే డ్రై డే పాటించాలని), పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ దోమ తెరలు వాడుకోవాలన్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ పి గౌతమి ఆధ్వర్యంలో బావులలో, నీటి కుంటల్లో దోమ లార్వాలను తినే గంబుషియా చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ సబ్ యూనిట్ ఆఫీసర్ షేక్ సుభాన్ బేగ్, ఆరోగ్య విస్తరణాధికారి పిట్టల శ్రీనివాస రావు, ఆరోగ్య పర్యవేక్షకులు ఎండీ రెహమాన్, ఎమ్ఎల్హెచ్పీ వైశాలి, ఆరోగ్య కార్యకర్తలు పి.సౌరితేజ, జి నరసింహారావు, ఆశా కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి
గుంటూరు వెస్ట్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యనభ్యసిస్తున్న దళిత, బహుజన విద్యార్థులను కూటమి ప్రభుత్వం దారుణంగా అవమానిస్తుందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి క్షేత్ర స్థాయిలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ను సందర్శించామన్నారు. మంచినీరు అపరిశుభ్రంగా ఉందన్నారు. మరుగుదొడ్లు దుర్వాసనగా ఉన్నా పిల్లలు అలానే నెట్టుకొస్తున్నారన్నారు. అన్నంలో బొద్దింకలు వస్తున్నాయని తెలిపారు. రుచిశుచీ లేని ఆహారాన్ని పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందన్నారు. మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు. మౌలిక వసతులపై స్పదించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ కోసం ఖర్చు చేయడం లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకంలో రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు రవీంద్ర నాయుడు, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అజయ్, సాజిద్, పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గోపి, జిల్లా నాయకులు భాను, కిరణ్లు పాల్గొన్నారు.
జె.పంగులూరు: స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ చార్జీల నిలువు దోపిడీ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ చేశారు. ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పంగులూరు ప్రధాన కూడలిలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీలు కరెంటు చార్టీలపై బాదుడే, బాదుడు కార్యక్రమం చేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత సార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రజలను బాదుతున్నారన్నారు. సంవత్సర కాలంలో కరెంట్ బిల్లులు పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్నా, కూటమి ప్రభుత్వం కరెంటు చార్టీలు పెంచలేదంటూ మోసగిస్తోందన్నారు. ఆదాయం పెరగక, కరెంటు బిల్లులు కట్టలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆదనపు లోడు పేరుతో డెవలప్మెంట్ చార్టీలు, వినియోగదారుల డిపాజిట్ల సాకుతో వేల రూపాయలు దొడ్డిదారిని వసూలు చేస్తూనే ఉన్నారన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ పాటికే ప్రభుత్వ కార్యాలయాల్లో, దుకాణాలలో స్మార్ట్ మీటర్లు బిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాయిని వినోద్బాబు, తలపనేని రామారావు, ఆదుమ్ సాహేబ్, సుధాకర్, పి. ఏలియా తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్
Chittoor
వెదురుకుప్పం: అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన శుక్రవారం వెదురుకుప్పం పోలీస్స్టేషన్ను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నేర ప్రవృత్తికి సంబంధించిన విషయాలపై అప్రమత్తంగా మెలిగి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసుల్లో దర్యాప్తులను ముమ్మరం చేసి వెంటనే అరెస్టులు చేయాలన్నారు. కీలక హత్య కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి చార్జిషీట్లను కోర్టులకు సమర్పించాలని చెప్పారు. చివరిగా సిబ్బంది సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎస్ఐ వెంకటసుబ్బయ్య ఉన్నారు.
పలమనేరు: జిల్లాలో రహదారి నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు పలమనేరు నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎండీఆర్, ఎస్హెచ్, నాబార్డ్ నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులకు వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆరు నెలల్లో వీటిని పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని మూడు అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణానికి నెలకొన్న అడ్డంకులను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రిని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
Komaram Bheem
- ● విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ ముస్కాన్– 11’ ● రెండు డివిజన్లలో కొనసాగిన తనిఖీలు ● 48 మంది బాలల గుర్తింపు, మూడు కేసులు నమోదు ● చిన్నారులు తిరిగి విద్యనభ్యసించేలా చర్యలు
వాంకిడి(ఆసిఫాబాద్): తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించడం, బాల కార్మికులను రక్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివి జన్లలో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన 11వ విడత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రెండు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 1– 18 సంవత్సరాల వయస్సు గల అనేక మంది బాలలకు విముక్తి కల్పించారు. తప్పిపోయిన, బాల కార్మికులుగా కొనసాగుతున్న పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆధునిక కాలంలో చదువు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. జిల్లాలో నెల రోజులపాటు నిర్వహించిన తనిఖీల్లో 48 మంది బాలలను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక బృందాలతో తనిఖీలు
ఆపరేషన్ ముస్కాన్– 11లో భాగంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్, బాలల సంరక్షణ శాఖ నుంచి ఒకరు, చైల్డ్ హెల్ప్లైన్ నుంచి ఒకరు, కార్మిక శాఖ నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. ఈ బృందాలు నెల రోజులపాటు జిల్లాలోని పరిశ్రమలు, హోటళ్లు, మెకానిక్ షాప్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దాబాలు, ఇటుక బట్టీలు, మిల్లులలో తనిఖీలు చేపట్టాయి. గుర్తించిన బాలలు తిరిగి చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
48 మంది గుర్తింపు..
నెల రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో విద్యకు దూరంగా ఉంటున్న మొత్తం 48 మంది బాలలను గుర్తించారు. ఆసిఫాబాద్ డివిజన్లో 25 మందిని గుర్తించగా.. అందులో 23 మంది బాల కార్మికులు ఉన్నారు. మరో ఇద్దరు డ్రాప్ అవుట్ స్టూడెంట్లు ఉ న్నారు. కాగజ్నగర్ డివిజన్లో 23 మందిని గుర్తించగా.. అందులో 18 మంది బాలకార్మికులుగా ఉన్నారు. మరో ఐదుగురు డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి బడులకు పంపేలా చర్యలు తీసుకున్నారు. అనాథ పిల్లలను వసతి గృహాలకు తరలించి ఉచితంగా వసతి, భోజనం, విద్య, వైద్యం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చదువుకునే వయస్సులో చట్ట వ్యతిరేకంగా బాలలను పనుల్లో పెట్టుకుని కార్మికులుగా మారుస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా మూడు కేసులు నమోదు చేశారు.
ఇటుకల బట్టీలో తనిఖీ చేస్తున్న సభ్యులు
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
18 ఏళ్లలోపు బాలలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. చదువుకునే వయస్సులో పిల్లలను పనులకు పంపించకూడదు. జిల్లాలో రెండు ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా 48 మంది పిల్లలను రక్షించాం. మూడు కేసులు సైతం నమోదు చేశాం. బాలల సంరక్షణకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తిస్తే సమాచారం అందించాలి. – బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని డీటీడీవో రమాదేవి తెలిపారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో డీఎస్వో మీనారెడ్డితో కలిసి క్రీడాకారులను అభినందించారు. డీటీడీవో మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి 12 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలి పారు. వీరు ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. హెచ్ఎం జంగు, ఏటీడీవో చిరంజీవి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
జావెలిన్ త్రో పోటీలకు సాక్షి..
జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదువుతున్న సాక్షి జావెలిన్ త్రో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందని ప్రిన్సిపాల్ రాందాస్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో విద్యార్థినిని అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు.
- ● నేటి నుంచి 11వ తేదీ వరకు ప్రక్రియ ● జిల్లాలో 108 మందికి ప్రమోషన్లు
ఆసిఫాబాద్రూరల్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గురువారం రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో జిల్లా విద్యాశాఖలో ప్రమోషన్ల సందడి మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్– 2 హెడ్మాస్టర్లుగా, స్కూల్ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. జిల్లాలో సుమారు 108 మందికి పదోన్నతి దక్కనుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ ఈ నెల 11న ముగియనుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రమోషన్లకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.
108 మంది అవకాశం..
జిల్లాలో 721 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో స్కూల్ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2,447 మంది పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం 2,050 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 397 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, ఎస్ఏల నుంచి హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందనున్నారు. 108 మంది ఉపాధ్యాయులకు పదోన్నతుల అవకాశం రానుంది. ఇందులో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీలకు 76 మందికి ప్రమోషన్లు వస్తే ప్రైమరీ స్కూళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. విద్యార్థులు నష్టపోకుండా విద్యావలంటీర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఖాళీలు ఇలా..
జిల్లాలో ఉన్న 108 ఖాళీలలో పీజీ హెచ్ఎంలు 6, పీఎస్ హెచ్ఎంలు 26, స్కూల్ అసిస్టెంట్లు 76 మందికి అవకాశం రానుంది. సబ్జెక్టుల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. ఎస్ఏ గణితం 11, ఫిజికల్ సైన్స్ 7, బయోసైన్స్ 4, సాంఘిక శాస్త్రం 17, తెలుగు 13, హిందీ 12, ఇంగ్లిష్ 6, స్పెషల్ ఎడ్యుకేషన్ 6, తదితర పోస్టులు ఉన్నాయి.
షెడ్యూల్ ఇలా..
ఈ నెల 2న ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్– 2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను డీఈవో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. పదోన్నతుల కోసం ఎస్ఏ, ఎస్టీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితా ప్రదర్శిస్తారు.
3న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 4, 5 తేదీల్లో సీనియార్టీపై అభ్యంతరాలను పరిష్కరించి, ఆర్జేడీ, డీఈవో వెబ్సైట్లో ప్రదర్శిస్తారు.
ఈ నెల 6న గ్రేడ్– 2 హెచ్ఎంల పదోన్నతి కోసం ఎస్ఏలకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
7న ఎస్ఏలకు గ్రేడ్– 2 పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.
8,9వ తేదీల్లో పదోన్నతుల ఆర్డర్ వచ్చిన గ్రేడ్– 2 హెచ్ఎం పేర్ల ప్రదర్శన, ఎస్జీటీ ల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా ప్రకటిస్తారు.
10వ తేదీన ఎస్జీటీ వెబ్, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు.
11న కలెక్టర్ ఆదేశాల అనంతరం పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఉత్తర్వు కాపీలు అందజేస్తారు.
విద్యార్థులు నష్టపోకుండా చూడాలి
ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులకు అవకాశం ఇవ్వడం హర్షణీయం. ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీల్లో వీవీలను నియమించాలి. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి. సర్దుబాటు ప్రక్రియ కాకుండా నూతన నియామకాలు సైతం చేపట్టాలి.
– శాంతికుమారి,
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు
చింతలమానెపల్లి: ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ రైతువేదికలో శుక్రవారం ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి రేషన్కార్డులు పంపిణీ చేశా రు. కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రత కోసం ప్రభుత్వం రేషన్కార్డులు అందిస్తుందన్నారు. బియ్యం విక్రయిస్తే కార్డు రద్దు చేస్తామని, డీలర్లు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామ ని హెచ్చరించారు. అక్రమంగా బియ్యం కొని బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ హామీల అమలులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్కార్డులు అందిస్తుందన్నా రు. మండలంలోని దిందా వాగు వంతెన నిర్మా ణం వర్షాకాలం ముగియగానే ప్రారంభమవుతుందని తెలిపారు. ఖర్జెల్లి నుంచి గూడెం రహదా రికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అటవీ అనుమతులు రానిచోట మినహా అన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ మనోహర్, తహసీల్దార్ మడావి దౌలత్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఏవో కీర్తీషా, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సుల్కరి ఉమామహేశ్, పార్టీ యూత్ అధ్యక్షుడు బండి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కౌటాల: ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కౌటాలలోని రైతువేదికలో శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కౌటాల మండలానికి 656 కొత్త రేషన్కార్డులు మంజూరు చేయగా, 1,064 మంది సభ్యుల పేర్లు నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, తహసీల్దార్ ప్రమోద్, సహకార సంఘం చైర్మన్ మాంతయ్య పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి
కాగజ్నగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ మండలంలోని గన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలు తెలుసుకున్నారు. పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు హనుమంతు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
- సంపూర్ణతా అభియాన్లో
ఆసిఫాబాద్: కలెక్టర్ వెంకటేశ్ దోత్రే రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. సంపూర్ణతా అభియాన్లో అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం అవార్డుల్లో భాగంగా రాష్ట్రంలోని 10 జిల్లాలు ఎంపిక కాగా, అందులో జిల్లాలోని తిర్యాణి బ్లాక్ కూడా ఉంది. ఈ క్రమంలో 5 పాయింట్లు సాధించిన జిల్లా సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. అలాగే సంపూర్ణతా అభియాన్ సమ్మాన్ సమారోహ్లో భాగంగా అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అవార్డుకు ఎంపిక కాగా, బ్రాంజ్ మెడల్ దక్కింది. శనివారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డులు అందుకోనున్నారు.
తిర్యాణి బ్లాక్లో అభివృద్ధి పనులు
పౌరుల జీవన నాణ్యతను మెరుగుపర్చడం కోసం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దేశంలోని 500 బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రెండేళ్ల కింద తిర్యాణి మండలాన్ని ఏబీపీగా ఎంపిక చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్లో దక్షిణ జోన్లో ప్రథమ స్థానం, దేశవ్యాప్తంగా నాలు గో స్థానంలో నిలిచింది. ఉత్తమ బ్లాక్గా ఎంపిక కావడంతో అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. 9 రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ఆర్థికాభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ అంశాలపై దృష్టి సారిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో అంతరాయం ఏర్పడకుండా నీతి ఆయోగ్ ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ ఆరు నెలల ఒకసారి క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమంపై సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడు అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తున్నారు. మహిళలకు వందశాతం రుణాలు అందజేస్తున్నారు. భూసార పరీక్షలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వినియోగించుకుంటున్నారు.
నేడు గవర్నర్ చేతుల మీదుగా స్వీకరణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏపీ ప్రభుత్వం చేపట్టి న బనకచర్ల లింకు ప్రాజెక్టుతో తెలంగాణకు గోదా వరి నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శుక్రవా రం మంచిర్యాల జిల్లా నస్పూర్లోని పార్టీ కార్యాలయంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టు రద్దు కోసం తెలంగాణ విద్యార్థి సదస్సు నిర్వహించారు. సాగునీటి రంగ నిపుణులు వి.ప్రకాశ్రావు ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇ చ్చారు. కృష్ణా జలాల మాదిరే గోదావరి జలాలను తీసుకుపోయేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వ చర్యతో నీటిలో హక్కులు కోల్పోయి భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ స్తుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో బనకచర్లపై చర్చ జరగలేదని చెబితే.. ఏపీ సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చర్చ జరిగిందని అంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి అ న్నింటిలో ఏపీ సీఎం చంద్రబాబు అండగా ఉండడంతోనే ఈ ప్రాజెక్టుకు అడ్డుచెప్పడం లేదని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజె క్టు ఒక ఫియర్ కుంగితేనే అంతా అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు విజిత్రావు, రాజారాం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల విద్యార్థి నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ నాయకులు
మంచిర్యాలలో విద్యార్థి సదస్సు
Dr B R Ambedkar Konaseema
ముమ్మిడివరం: అన్న క్యాంటీన్లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. ముమ్మిడివరంలో గల అన్నా క్యాంటీన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ, టౌన్ ప్లానింగ్ అధికారి రాజేష్బాబు, ఏఈ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు.
ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్పై అవగాహన కల్పించాలి
కాకినాడ లీగల్: ఆస్తి రిజిస్ట్రేషన్తో పాటు వెంటనే ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ చేసే ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఐజీ, జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. ఆటోమ్యుటేషన్ విధానం అమలును తొలి రోజైన శుక్రవారం కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ జరుగుతున్న తీరు, సమస్యలపై ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ వసూలు రికార్డులను పరిశీలించారు. రోజువారీ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య, రిజిస్ట్రేషన్ల పురోగతిపై ఆరా తీశారు. జిల్లా రిజిస్ట్రార్ జేఎస్యూ జయలక్ష్మిని వివరాలడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం సేవలపై కక్షిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ, ఆటోమ్యుటేషన్ ప్రక్రియపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, బ్రోచర్లు ముద్రించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ మనీషా, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు–1, 2 ఆర్వీ రామారావు, ఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
తొలి రోజే ఇబ్బందులు
ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ ద్వారా కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తొలి రోజే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ విధానంలో సమస్యలు రావడంతో క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆటోమ్యుటేషన్ ద్వారా తొలి రోజు చెరొక డాక్యుమెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి.
అమలాపురం టౌన్: సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో బ్యాంక్ల ఖాతాదారులు ఆ మోసాల బారిన పడకుండా వారిలో చైతన్యాన్ని నింపి అవగాహన కల్పించాలని ఎస్పీ బి.కృష్ణారావు వివిధ బ్యాంక్ల అధికారులకు సూచించారు. స్థానిక ఎస్సీ కార్యాలయంలో సైబర్ మోసాల నియంత్రణపై శుక్రవారం జరిగిన వాణిజ్య బ్యాంకుల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ ఖాతాలపై ఎప్పటికప్పుడు పరిశీలన ఉండాలన్నారు. కేవైసీ సిస్టమ్స్ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఖాతాదారుల ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతుంటే అలాంటి ఖాతాలను గమనించి మొదటి దశలోనే ఖాతాదారులను అప్రమత్తం చేయాలన్నారు. సైబర్ అఫెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలకు సంబంధించిన విషయాలను ఎస్పీ చర్చించి బ్యాంక్ల అధికారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాళ్లు భారీ ఎత్తున డబ్బును లూటీ చేస్తున్నారని వివరించారు. దీనిపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ బ్యాంక్లో సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు, అకౌంట్ ఫ్రీజ్ విషయంలో ‘1930’ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. పలు బ్యాంక్ల మేనేజర్లతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
బ్యాంక్ అధికారులకు ఎస్పీ కృష్ణారావు సూచన
Parvathipuram Manyam
- ● అరకొరగా నిల్వలతో రైతన్నలు అవస్థలు ● అదునుకు అందని యూరియా ● ఆవేదనలో రైతన్న
పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం/పాలకొండరూరల్: ఖరీఫ్ సీజన్లో రైతన్నకు ఎరువు కొరత వెంటా డుతోంది. పొలం పనులు మానుకుని ఎరువుకోసం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎరువులు సమృద్ధిగా ఉన్నాయ ని అధికార యంత్రాంగం చెబుతున్నా... పంపిణీలో లోపాలు రైతన్నను వెంటాడుతున్నాయి. ఎరువు దొరికితే గంటల తరబడి ఎందుకు నిరీక్షిస్తామని ప్రశ్నిస్తున్నారు. యూరియాను అధికార పార్టీ నాయకులు ఇళ్లకు తరలించి నిల్వచేయడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో ఇబ్బందులు తప్పడంలేదని రైతులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలోని 15 మండలాల్లో 245 రైతు సేవా కేంద్రా ల ద్వారా 7,235 మెట్రిక్ టన్నులు, 22 సొసైటీల నుంచి 1,369 మెట్రిక్ టన్నుల ఎరువులు (యూరి యా, డీఏపీ కలిపి) సరఫరా చేసినట్టు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ తెలిపారు. యూరియా వినియోగా న్ని తగ్గించేందుకు ప్రత్యమ్నాయ మార్గాలను అన్వే
షిస్తున్నట్టు వెల్లడించారు. ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, నానో డీఏపీ ఎరువు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచుతామని, వాని వినియోగాన్ని పెంచాలని చెబుతున్నారు. అయితే, ఎరువు కొరత మాత్రం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువు ఎక్కడికి వెళ్తుందన్నది ప్రశ్నార్థకం.
●పార్వతీపురం మండలానికి 650 మెట్రిక్ టన్నుల యూరియా, సీతానగరం మండలానికి 520 మెట్రిక్ టన్నుల యూరియా, 100 మెట్రిక్ టన్నుల డీఏపీ, బలిజిపేట మండలానికి 550 మెట్రిక్ టన్నుల యూరియా, 200 మెట్రిక్ టన్నుల డీఏపీ సరఫరాచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎరు వు రైతులకు అందడం లేదని, కృత్రిమ నిల్వలపై అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.
●గుమ్మలక్ష్మీపురం మండలంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 15వేల ఎకరాలు. ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులు 224 మెట్రిక్ టన్నుల యూరియా, 106 మెట్రిక్ టన్నుల డీఏపీని తీసుకొచ్చి ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేశారు. మరలా 300 మెట్రిక్ టన్నుల యూరియా, 200 మెట్రిక్ టన్నుల డీఏపీ కోసం ఇండెంట్ పెట్టినా నేటికీ రాలేదు. రైతులు ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు.
●కురుపాం మండలంలో ఈ ఖరీప్లో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 12 వేల ఎకరాల్లో సాగుచేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం యూరియా, డీఏపీ కలిపి 330 మెట్రిక్ టన్నులు మాత్రమే ఆర్ఎస్కేల ద్వారా సరఫరా చేశారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదించిన యూరియా, డీఏపీ వస్తుందని, రైతులకు అందజేస్తామని వ్యవసాయాధికారి నాగేశ్వరరావు తెలిపారు.
●జియ్యమ్మవలస మండలంలో ఈ ఖరీఫ్లో సాధారణ సాగువిస్తీర్ణం 9,320 ఎకరాలు. ఇప్పటి వరకు 140 మెట్రిక్ టన్నుల డీఏపీ, 390 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించా రు. మరో 320 మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ నిమిత్తం ప్రతిపాదించినా రాలేదు. చేసేది లేక రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
●కొమరాడ మండలానికి ఇప్పటి వరకు 325 మెట్రిక్ టన్నుల యూరియా, 120 మెట్రిక్ టన్నుల డీఏపీని మాత్రమే ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేశారు. డీఏపీ, యూరియా కొరత ఉంది.
●గరుగుబిల్లి మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 14వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 260 మెట్రిక్ టన్నుల యూరియా, 150 మెట్రిక్ టన్నుల డీఏపీని మాత్రమే సరఫరా చేశారు.
●పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 25వేల హెక్టార్లలో వరి పంట సాగుకు రైతు లు ఉపక్రమించగా 60 శాతం యూరియా, డీఏపీని మాత్రమే అందుబాటులో ఉంచినట్టు రైతులు చెబుతున్నారు.
ఎరువులను సరఫరా చేయాలి
రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం ఆధారంగా యూరి యా, డీఏపీ ఎరువులను సరఫరా చేయాలి. ఎరువు లు పూర్తిస్థాయి అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రోమోర్ ఎరువుల దుకాణంలో ఎరువుతో పాటు అదనంగా సేంద్రియ ఎరువులను ఇస్తున్నారు. ఎరువులను పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోతే ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయాన్ని విరమించుకునే పరిస్థితి ఉంటుంది. – ఉరిటి అచ్యుతనాయుడు,
కొత్తపట్నం, పార్వతీపురం మండలం
ఎరువుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది
రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేవు. ఎప్పుడు వస్తాయో తెలియడంలేదు. ఎరువుల కొరత ఉంది. ప్రభుత్వం స్పందించి అవసరం మేరకు ఎరువులు సరఫరా చేయాలి.
– గుడివాడ సంపత్కుమార్, వైస్ ఎంపీపీ, జియ్యమ్మవలస మండలం
- ●గురువుల డిమాండ్ ●12వ పీఆర్సీ అమలు చేసి సీపీఎస్ రద్దు చేయాలి ●12వ వేతన సవరణ అమలుకు డిమాండ్ ●ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నేడు నిరసనకు ఉపాధ్యాయులు సిద్ధం
పార్వతీపురం టౌన్:
ఉపాధ్యాయులు అంటే చదువు నేర్పేవారు... ఇది ఒకప్పటి సంగతి. ప్రస్తుతం పిల్లలు బడికి వచ్చేది, మధ్యాహ్న భోజనం, దుస్తులు, కోడిగుడ్డు, చిక్కి, రాగి జావ విద్యార్థులకు అందించి ప్రభుత్వానికి లెక్క చెప్పేవారు అన్నట్టుగా మారింది. ప్రభు త్వ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఒత్తిడి తెచ్చింది. ఇవన్నీ చేయగా సమయం మిగిలితేనే విద్యార్థులకు నాలుగు అక్షరాలు చెప్పే అవకాశం ఉంటుంద ని ఉపాధ్యాయుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పా ఠాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
ఉపాధ్యాయుల డిమాండ్లు ఇవే...
●ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయవద్దు.
●నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకు న్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.
●ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న ఆసంబద్ధతను తొలగించాలి. 72, 71, 74 జీఓలు అమలు చేయాలి.
●హైస్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలి.
●పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి.
●12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి.
●ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 3 పెండింగ్ డీఏలను ప్రకటించాలి.
●డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
●సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
– ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి. పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కల్పించాలి.
●పదవీకాలం పూర్తికాని స్కూల్ గేమ్స్ సెక్రటరీలను (ఎస్జీఎఫ్) సెక్రటరీలను తొలగించడం సరైనది కాదు. తిరిగి వారిని కొనసాగించాలి.
●అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలి.
●సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలి.
●బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి
ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలి. బదిలీలు జరిగి 45 రోజులు దాటినా కొందరు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడం విచారకరం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నేడు కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతాం.
– పువ్వల కూర్మినాయుడు, ఫ్యాప్టో చైర్మన్, పార్వతీపురం మన్యం
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
పార్వతీపురం రూరల్: పీ–4 దత్తత పూర్తిగా స్వచ్ఛందమేనని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. పీ–4, పీఎం సూర్యఘర్, హర్ఘర్ తిరంగ తదితర అంశాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినవారికి బంగారు కుటుంబాలను బాగుచేసే బాధ్యతలు అప్పగించాలన్నారు. పీఎం సూర్యఘర్ కింద ఎస్టీ, ఎస్సీ గృహాలపైన ఖాళీ స్థలం ఉంటే నెలకు రూ.200 వారికి అద్దె ఇస్తూ సౌరవిద్యుత్ ప్యానె ల్ ఏర్పాటు చేస్తామన్నారు. హర్ఘర్ తిరంగా వేడుకులను ఆగస్టు 15వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. త్రివర్ణ పతాకాలను గృహాలపై పెట్టడం, పెద్ద ఎత్తున ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఛాయా చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటుచేసి ప్రజల్లో భక్తిభావం పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్కు మార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమల త, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పైనాపిల్ పార్క్కు
జిల్లా అనుకూలం
● మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్
పార్వతీపురం రూరల్: పైనాపిల్ పార్క్ ఏర్పాటుకు జిల్లా అనుకూలమని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్భరత్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరికం నుంచి మహిళలను ఆర్థికాభివృద్ధి దిశగా నడపడమే మెప్మా ఆశయమన్నారు. మహిళలతో కొత్త యూనిట్లను స్థాపించి ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. చెత్త నుంచి వర్మీకంపోస్టు తయారీ, ఇంటి వద్దనే కూరగాయల తోటల సాగుతో లబ్ధిపొందే అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. డీజీ లక్ష్మి పథకం కింద డిజిటల్ కియోస్క్ల స్థాపించి 250 ప్రజా సేవలను ప్రజలకు అందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో మెప్మా పథక సంచాలకులు జీవీ చిట్టిరాజు, సాంకేతిక నిపుణులు సీఎంఎంలు, సీఓలు, డీఈఓలు, సీఎల్ఆర్సీలు, టీఎల్ఎఫ్ఆర్సీలు పాల్గొన్నారు.
అరకు–విశాఖ రోడ్డులో
145 కేజీల గంజాయి పట్టివేత
లక్కవరపుకోట: ఒడిశా నుంచి నుంచి కేరళ రాష్ట్రానికి అరకు–విశాఖ జాతీయ రహదారిలో బొలెరో వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సఫీ, ఒడిశాకు చెందిన దుంబిలను గొల్జాం కూడలి వద్ద పోలీస్లు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ నవీన్పడాల్ తెలిపారు.
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లోనూ భాగస్వాములు చేస్తున్నారు. దీనవల్ల సమయం వృథా అవుతోంది. బోధన కుంటుపడుతోంది. హైస్కూల్ ప్లస్లలో వెంటనే ఉపా ధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలి. ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.
– ఉత్తరావల్లి గోంవిదనాయుడు, ఫ్యాప్టో కో చైర్మన్, పార్వతీపురం మన్యం
●ఇదెక్కడి పర్యవేక్షణ
ప్రభుత్వ ప్రచారకార్యక్రమాలను ఉపాధ్యాయులకు అప్పగించడం, వేరేశాఖ ఉ ద్యోగులను పర్యవేక్షణకు ని యమించడం అన్యాయం. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు అంటగట్టొద్దు. – ఎస్.మురళీమోహన్రావు,
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
పార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వె వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంలో వివిధ హోదాల్లో పలువురిని నియమిస్తూ శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలానికి చెందిన ఉపద్రష్ట సురేష్ను సోషల్మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను సూచించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు సురేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ స్పందిస్తున్న తీరును వివరిస్తూ..సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామని సురేష్ అన్నారు.
- ఆయనొక రైతు. వ్యవసాయాన్ని నమ్ముకుని వారసత్వంగా వచ్చిన భూమిలో సరికొత్త పద్ధతిలో సాగుచేయడం ప్రారంభించారు. ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విధానాలు అవలంబిస్తూ వ్యవసాయంలో పోటీపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని రైతులకు దీటుగా ఇక్కడ వ్యవసాయం చేస్తూ దిగుబడులు సాధిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరుగా ఏపీ సీడ్స్కే ప్రతి ఏడాది విత్తనాలు అందించే ఆ రైతు ఈ ఏడాది కూడా ఖరీఫ్సాగులో మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఖరీఫ్లో సాగుచేసే వరి పంటలో ఉభయగోదావరి జిల్లాల రైతులుఅవలంబిస్తున్న విధానాన్ని ఇక్కడ తన పంట పొలాల్లో ప్రారంభించారు. ఆయన మరెవరో కాదు రేగిడి మండలంలో ఉణుకూరు గ్రామానికి చెందిన గేదెల వెంకటేశ్వర రావు. – రేగిడి
లైన్సోయింగ్ పద్ధతిలో నాట్లు వేస్తున్న బెంగాల్ కూలీలు
● ఖరీఫ్లో కొత్త తరహా నాట్లు
● లైన్ సోయింగ్ విధానంతో
వరినారు ఆదా
● ఎకరాకు 8 కిలోల విత్తనాల
వరినారుతో ఉడుపు
● పశ్చిమబెంగాల్ కూలీలతో
వరి ఉభాలు
● రైతు గేదెల వెంకటేశ్వర రావు కృషి
ఇష్టంతోనే..
వ్యవసాయం కష్టంతో కాకుండా ఇష్టంతో చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. విత్తనాల దగ్గర నుంచి ఎరువులు వరకూ ప్రతి పెట్టుబడికి ఇతరులపై ఆధార పడకూడదు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకునే స్థితికి రావాలి. రసాయన ఎరువులు తగ్గించి సాగుచేసే విధానంవైపు రైతులు దృష్టిసారించాలి. మిగిలిన ప్రాంతాల్లోని రైతులతో పోటీపడే ఆలోచన రావాలి. అప్పుడే వ్యవసాయంలో లాభాలు కనిపిస్తాయి. ఈ ఏడాది లైన్సోయింగ్ విధానంలో వరినాట్లు వేశాం. ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉంది.
– గేదెల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు, ఉణుకూరు
జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు ఉణుకూరు గ్రామంలో 50 ఎకరాలకు పైగా పంటపొలాలు ఉన్న రైతు. ఇంత ఆస్తి ఉన్నా తాను ఆ భూమిని ఎవరికీ కౌలుకు ఇవ్వలేదు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కోసం అర్రులు చాచలేదు. తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన భూమినే నమ్ముకున్నారు. వ్యవసాయాన్నే ఉద్యోగంగా మార్చుకుని ఊహతెలిసినప్పటి నుంచి వినూత్న పద్ధతుల్లో పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల మోతాదు తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆది నుంచి ఆసక్తిగా వ్యవసాయం చేసే వెంకటేశ్వరరావుకు వ్యవసాయంలో వచ్చే కొత్త పద్ధతులు వేగంగా అందుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఇందులో భాగంగానే ఈ ఏడాది లైన్ సోయింగ్ విధానాన్ని అందుకుని, ఇక్కడ తన పంటపొలాల్లో ఈ పద్ధతిని ప్రారంభించారు.
8 కిలోల విత్తనాలతో ఎకరాలో సాగు
సాధారణంగా రైతులు ఎకరాసాగులో వరి ఉభాలకు 30 కిలోల వరకూ వరి విత్తనాలతో వరినారు తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నారు సరిపోని పరిస్థితి ఉంటుంది. వరి ఉభాలు చేసిన సమయంలో ఈ ప్రాంతంలో కనీసం పదిమొక్కలను కలిపి ఒకేచోట వేస్తుంటారు. ఇలా కాకుండా ఒకచోట ఒక వరి నారును మాత్రమే ఉభాలు చేసి, ఒక వరి మొక్కకు మరో మొక్కకు మధ్య కనీసం పది అంగుళాల ఖాళీ ఉంచి ఉభాలు చేయడాన్ని లైన్సోయింగ్ విధానం అంటారు. ఈ విధానాన్ని ఉభయగోదావరి జిల్లాలోని రైతులు అవలంబిస్తున్నారు. ఈ విధానంతో ఆయా ప్రాంతాల్లో వరి పంట అధికంగా దిగుబడి రావడంతో పాటు చీడపీడలు తట్టుకుంటుంది. ఒక వరి మొలక కాస్తా పెరగగానే 30వరకూ పిలకలు వేసి పెద్ద దుబ్బుగా మారుతుంది. పెద్దగింజల కంకి హారం కట్టి, ఎకరాకు 40 బస్తాల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విధానం నిమిత్తం వెంకటేశ్వర రావు ఎకరాకు 8కిలోలు చొప్పున విత్తనాలతో నారు పోసి పశ్చిమబెంగాల్ నుంచి కూలీలను తీసుకొచ్చి తనకున్న పొలాల్లో 40 ఎకరాల్లో ఈ విధానంలో వరినాట్లు వేయించారు. వారం రోజుల పాటు ఈ విధానంలో పంటపొలాల్లో వరినాట్లు వేయించారు. ప్రస్తుతం ఈ వరినాట్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విధానాన్ని చూసిన మరో రైతు కూడా తనకున్న పది ఎకరాల్లో వరిసాగుచేస్తున్నారు.
దిగుబడి సాధనలో దిట్ట
గేదెల వెంకటేశ్వరరావుకు జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పేరుంది. వరి పంటలో స్థానిక రకాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుచేసే సన్నాలు, మసూరి పంటలను కూడా సాగుచేస్తుంటారు. ఆయన వద్ద ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వరితో పాటు మిరప, మొక్కజొన్న పంటల సాగులో కూడా మంచి దిగుబడి సాధించే సత్తా వెంకటేశ్వరరావుకు ఉంది. వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సైతం ఆయన సాగుచేస్తున్న పంటను పరిశీలించేందుకు వస్తుంటారు. ఆయన సాగుచేస్తున్న వరిపంటలో నాణ్యత ఉండడంతో గత 20 సంవత్సరాలుగా ఏపీ సీడ్స్కు విత్తనాలు అందిస్తున్నారు.
విజయనగరం అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్కు కళాశాలల నిర్వహణకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడీ మజ్జి ఆదినారాయణ విడుదల చేశారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాకు చెందిన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మార్గదర్శకాలపై వివరించారు. కార్యనిర్వహణ, విద్యాప్రమాణాల బలోపేతానికి సంబంధించిన సూచనలు విధిగా పాటించాలని కోరారు. కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి హాజరు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్లో, భౌతిక హాజరు పుస్తకంలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవేశాల దృష్ట్యా మొదటి సంవత్సరం విద్యార్థులను ఈ నెల 11వ తేదీ వరకు చేర్చుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల విజయశాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతిభావంతుల కోసం పోటీ పరీక్ష శిక్షణ అందించాలన్న మార్గదర్శకాలు పాటించాలన్నారు. సమావేశంలో ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
మేడపై నుంచి జారిపడి యువకుడి మృతి
సాలూరు రూరల్: పట్టణ పరిధిలోని బొడ్డవలస గ్రామానికి చెందిన బండి మనోజ్ (25)తన ఇంటి మేడపై నుంచి జారి పడి మృతి చెందినట్లు పట్టణ సీఐ అప్పల నాయుడు తెలిపారు. ఇంటి మేడపై వడియాలు ఆరపెట్టేందుకు వెళ్లిన ఆయనకు గల శారీరక బలహీనత, అంగవైకల్యం కారణంగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.
జర్మనీభాషలో ఉచిత శిక్షణకు ఆహ్వానం
విజయనగరం టౌన్: జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాషపై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకురాలు అన్నపూర్ణమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైనా నర్సింగ్, జీఎన్ఎమ్ పట్టభద్రులకు జర్మనీ భాషలో బి2 స్థాయిలో 8 నుంచి 10 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతితో కూడిన సదుపాయాలు కలిగిన కేంద్రాలను విశాఖ, గుంటూరు, తిరుపతిలో ఏర్పాటుచేసి, వారికి జర్మనీ దేశంలో ఉపాధి అవకాశం కల్పించే ఉద్దేశంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రవేశానికి నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత శిక్షణకు సంబంధించి మహిళలకు 35 ఏళ్ల వయసు మించకుండా బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎమ్ నర్సింగ్ పూర్తిచేసి క్లినికల్ అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల మహిళలు ఆగస్టు 7వ తేదీ లోపు అన్ని సర్టిఫికెట్లతో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు పత్రాలను కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9848871436 నంబర్ను సంప్రదించాలని కోరారు.
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయలో 2025–26 విద్యాసంవత్సరంలో 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసై, అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ వి.దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.navodaya. gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి నేరుగా నవోదయ స్కూల్ పనివేళల్లో కార్యాలయంలో ఇవ్వాలని లేదా నవోదయ విద్యాలయ మెయిల్లో దాఖలు చేసుకోవచ్చన్నారు.
772 లీటర్ల సారా ధ్వంసం
పార్వతీపురం రూరల్: ఇటీవల పట్టుబడిన 17 సారా కేసుల్లో స్వాధీనం చేసుకున్న 772 లీటర్ల సారాను పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏఎస్పీ అంకితా సురాన ఆధ్వర్యంలో పట్టణ శివారులో శుక్రవారం ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు సంతోష్కుమార్, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్సై ఎం.గోవింద సిబ్బంది పాల్గొన్నారు.
Mulugu
ఏటూరునాగారం: వేలిముద్రలు పడితే ఆసరా పింఛన్ ఇవ్వాలనేది గతంలో ప్రభుత్వ నిబంధన. అయితే చాలామంది లబ్ధిదారులు.. ప్రధానంగా వృద్ధులు వేలిముద్రలు చెరిగిపోవడంతో పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.. దీంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏల వేలిముద్రలతో పింఛన్ డ్రా చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు వేలిముద్రలు పడని వృద్ధులకు ఐరిస్ స్కానింగ్తో పింఛన్ ఇచ్చే నిబంధనను జూలై 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఐరిస్ ఉంటేనే ఆసరా పింఛన్ అని అధికారులు చెబుతుండడంతో పోస్టాఫీసుల వద్ద లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. ఇటు వేలిముద్రలు లేక, అటు ఐరిస్ రాకపోవడంతో పింఛన్ పోతుందో ఏమో అని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. పోస్టాఫీసుల అధికారులకు పూర్తి అధికారులు ఇచ్చి యాప్ ద్వారానే ఐరిస్ స్కానింగ్ చేసి పింఛన్ ఇవ్వాలని ఆదేశించడంతో వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా కేవలం నాలుగు రోజుల సమయంలోనే పూర్తి స్థాయిలో పింఛన్ ఇవ్వాలని డెడ్లైన్ విధించడంతో పింఛన్లు పంపిణీ చేసే క్రమంలో తీవ్ర జాప్యం అవుతుంది. దాంతో కాలం ముగిసిందని, పింఛన్ ఈ నెల కాదు వచ్చే నెల తీసుకోవాలని పోస్టాఫీసు సిబ్బంది చెప్పడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉండడం.. పంపిణీ చేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో చాలాచోట్ల సమయం మించి పోతుంది. దీంతో లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడంలేదు.
పారదర్శకతో అసలుకు ఎసరు..
ఆసరా పింఛన్లో అక్రమాలు జరుగుతున్నాయని అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఐరిస్ను అమల్లోకి తెచ్చారు. కానీ అర్హులైన ఆసరా లబ్ధిదారులకు సైతం వేలిముద్ర, ఐరిస్ క్యాప్చరింగ్ కాక పింఛన్ కోల్పోయే పరిస్థితి నెలకొంది. గత నెల తీసుకోని లబ్ధిదారులకు రెండు నెలల పింఛన్ అందాల్సి ఉండగా ఇప్పుడు కంటి ఐరిస్ పడక ఆ పింఛన్ పోతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే ఆటోమెటిక్గా లబ్ధిదారుడి పింఛన్ను తొలగించే నిబంధనలు ఉండడం గమనార్హం.
పింఛన్ పొందేందుకు ఐరిస్ నిబంధన
అవస్థలు పడుతున్న
కంటిచూపు మందగించిన వృద్ధులు
పోస్టాఫీసుల వద్ద పడిగాపులు
సాంకేతిక సమస్యతో అందని ఆసరా
- సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ‘ఆన్లైన్’ ప్రక్రియ
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి 2025–26 సంవత్సరానికిగాను టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా గతనెల 23 నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించారు. ఈ మేరకు ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్ షెడ్యూల్లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. అంతకు ముందు ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్లతో కలెక్టర్లు ఫ్రీ బిడ్ సమావేశాలు కూడా నిర్వహించారు.
ఒక్కో జిల్లాలో ఒక్కో రేటు...
హనుమకొండ, వరంగల్లో తక్కువ..
ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధికారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కొడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్లు ఈ టెండర్లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్లైన్ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్ కడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే..
వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ ఆగ్మార్క్ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులై న కాంట్రాక్టర్లను ఎంపిక చేసేది. ఆ తర్వాత కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరిమా ణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్లో పేర్కొ న్న విధంగా కాకుండ తక్కువ గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు బిడ్ డాక్యుమెంట్లను టౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో బిడ్లను సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించారు. సమర్పించిన బిడ్ల హార్డ్ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్/షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటా యించిన విధంగా టెక్నికల్ బిడ్లు, ధరల బిడ్లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు.
విద్యాలయాల్లో
7.33 కోట్ల కోడిగుడ్లకు..
సుమారు రూ.40.60 కోట్లు
ఉమ్మడి వరంగల్లో
ఐదు జిల్లాలకే టెండర్లు..
భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ
ఈ నెల 6 నుంచి 12 వరకు
షెడ్యూల్ దాఖలు..
12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్
అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలు
అందుకే పాలసీ మార్చిన ప్రభుత్వం..
జిల్లా సరఫరా కేటాయించిన
చేయాల్సిన డబ్బులు (రూ.లలో)
కోడిగుడ్లు
హనుమకొండ 1,31,14,397 6,71,45,713
వరంగల్ 1,40,76,730 7,89,70,455
మహబూబాబాద్ 1,77,87,502 10,01,43,636
జనగామ 1,26,05,592 7,09,69,483
ములుగు 78,11,600 4,39,79,308
భూపాలపల్లి 79,54,004 4,47,81,042
మొత్తం 7,33,49,825 40,59,89,637
ములుగు రూరల్/ఏటూరునాగారం: రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని స్పెషల్ అఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి, ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శించారు. జ్వరంతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతర కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ సీజనల్వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో దోమల నియంత్రణకు యాంటీ లార్వా స్ప్రే చేయాలని, నీటినిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్య వ్యాధులను నియంత్రించాలని సూచించారు. ఆశా వర్కర్లు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఉపకేంద్రాల్లో మానిటరింగ్ సూపర్వైజర్లను నియమించి వ్యాధుల నియంత్రణకు ప్రణాళికు రూపొందించినట్లు తెలిపారు. ఏటూరునాగారంలో ఐసీటీసీ సెంటర్ను సందర్శించి ఎయిడ్స్, హెచ్ఐవీ టెస్టుల విషయాన్ని తెలుసుకున్నారు. షాపెల్లి గ్రామంలని సబ్ సెంటర్ను వెంకటేశ్వరెడ్డి తనిఖీ చేశారు. డెంగీ జ్వరంతో బాధపుతున్న బాలుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి పిల్లల ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు, డీపీఓ దేవరాజ, డీసీహెచ్ ములుగు వైద్యాధికారి జగదీశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఏటూరునాగారం ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్, జిల్లా పోగ్రామ్ ఆఫీసర్ పవన్కుమార్, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్ రావు, వెంకటరెడ్డి, సాంబయ్య, నర్సింహరావు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
అవగాహన కల్పించాలి
వాసం వెంకటేశ్వరెడ్డి
ములుగు రూరల్: గురుకుల పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు మెనూ ప్ర కారం పౌష్టికాహారం అందించాలని అన్నారు. సీజ నల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్ర పాటించాలని సూచించారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్లో విద్యార్థినులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత పాల్గొన్నారు.
నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలి
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ దివాకర అన్నారు. జగ్గన్నపేట, అన్నంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణా లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇంటి నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే సంపూర్ణ అభివృద్ధి
కన్నాయిగూడెం: ప్రభుత్వ అధికారులు, ఫ్రంట్లైన్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆకాంక్షా బ్లాక్, సంపూర్ణ అభియాన్ కా ర్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న 500 ఆకాంక్షా బ్లాక్లలో కన్నాయిగూడెం ఆస్పేరేషనల్ బ్లాక్ ఒకటన్నారు. పథకాలు ప్రజలకు చేరడంలో, సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ముందుండాలన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, విద్య, వ్యవసా యం, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో కృషి చేసిన జిల్లా బ్లాక్స్థాయి అధికారులను ప్రశంసించారు.
ఆకాంక్ష హట్ ప్రారంభం
స్వయం సహాయక బృందాలు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులు, చేతి వృత్తుల వస్తువులకు వేదిక కల్పించడమే ఆకాంక్షా హట్ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. మహిళలు తయారు చేసిన వస్తులవులను మార్కెటింగ్ చేసేందుకు హట్ వేదిక అవుతుందన్నారు. ఏపీడీ వెంకటనారాయణ, తుల రవి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సాజిదా, రవీష్ పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు.. దీని తీరే అమ్మతీరు.. కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఎంతో సంతోషంగా ఉంది..
నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా. –కాసర్ల శ్యామ్, పాటల రచయిత
● జిల్లావాసి కాసర్ల శ్యామ్కు నేషనల్ అవార్డు
● ఉత్తమ లిరిక్రైటర్గా గుర్తింపు
● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు
Nandyala
● జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల: బ్యాంకుల్లో దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలపై శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో చోరీలు జరిగాయని, అలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నగదు రవాణా సమయంలో శిక్షణ పొందిన లైసెన్స్ కలిగిన ఆయుధం ఉన్న గార్డులను నియమించాలని సూచించారు. బ్యాంక్లో అత్యవసర కాల్ నంబర్లు, సైబర్ క్రైమ్కు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు బ్యాంకు అధికారులకు, పోలీసు స్టేషన్కు కాల్ చేసే సౌకర్యంతో కూడిన అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు
నంద్యాల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకు చెందిన పలువురికి పార్టీ అనుబంధ రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా కురువ సుంకన్న(పాణ్యం), రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా ఎస్.నాగేంద్ర(పాణ్యం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా ఏవీ కృష్ణారెడ్డి(శ్రీశైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా ఎస్వీ రమణారెడ్డి(శైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా కె.బాబు(పాణ్యం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా వి.రామకృష్ణుడు(శ్రీశైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా బి.అబ్దుల్ఖాదర్ జిలానీ(శ్రీశైలం)లను నియమించారు.
గురుకులాల్లో
నేరుగా ప్రవేశాలు
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీయట్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, నేరుగా భర్తీ చేయనున్నట్లు డీసీఓ శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరికెల బాలుర కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు 48, కంబాలపాడు బాలికల కళాశాలలో సీఈసీలో నాలుగు సీట్లు, బైపీసీ, జనరల్ విభాగంలో ఒక సీటు ఖాళీగా ఉందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో పదో తరగతిలో 24, సీనియర్ ఇంటర్లో 2002, నంద్యాల జిల్లాలోని పదో తరగతిలో 16, సీనియర్ ఇంటర్లో 88 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9866616633, 9010070219 నంబర్లను సంప్రదించాలన్నారు.
నాణ్యతతో ‘అమృత్’ పనులు పూర్తి చేయాలి
డోన్ టౌన్: అమృత్ భారత్ మహోత్సవ్ పథకం కింద చేపట్టిన పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ సంజీవ్కుమార్ శ్రీవాత్సవ ఆదేశించారు. ప్రత్యేక రైలులో గుంతకల్లు నుంచి హైదరాబాద్వైపు వెళుతూ డోన్ రైల్వే స్టేషన్లో శుక్రవారం కాసేపు ఆగారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఆయన వెంట స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, గుంతకల్లు డివిజన్ అధికారులు ఉన్నారు.
ఆభరణాలు, వెండి పళ్లెం బహూకరణ
డోన్ టౌన్: అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి రూ.1.50 లక్షల విలువ చేసే ఆభరణాలను డోన్ పట్టణం కొండపేటకు చెందిన భాస్కర్గౌడ్, అరుణ్జ్యోతి దంపతులు బహూకరించారు. అలాగే డోన్ శ్రీషిర్డీ సాయిబాబా గుడికి రూ.43వేల విలువ చేసే వెండి పళ్లెం శుక్రవారం అందజేశారు.
బనగానపల్లె: గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి చెందిన ప్రైవేట్ గూండాలు పోలీసుల బందో బస్తుతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లె పట్టణం పాతబస్టాండ్లో కూల్చివేసిన వాటర్ ప్లాంట్ను శుక్రవారం భారీ జనసందోహం మధ్య మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్టాండ్లోని గ్రామ పంచాయతీ స్థలంలో 2019లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ నిధులతో ప్రజల అవసరం కోసం వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించానన్నారు. అప్పటి నుంచి పట్టణ ప్రజలతో పాటు బనగానపల్లెకు వచ్చే గ్రామీణులు ఈ ప్లాంట్ నుంచే మంచినీటిని పొందేవారన్నారు. వాటర్ ప్లాంట్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తన ఫొటోను ఉండటాన్ని చుస్తూ ఓర్వలేక ప్రైవేట్ గూండాలతో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న వాటర్ ప్లాంట్ను కూల్చివేయడం దారుణమన్నారు. ఈ విషయంపై రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులను అడిగితే కూల్చివేతపై తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల వద్ద తన ఫొటో ఎక్కడైనా అగుపిస్తే టీడీపీ వారు స్టిక్కర్లు అతికిస్తున్నారని, ఎన్నికల కోడ్ ఏమైనా అమల్లో ఉందా అని ప్రశ్నించారు. వాటర్ ప్లాంట్ను మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి చెందిన సొంత స్థలంలో ఏమీ నిర్మించలేదన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్తో పాటు సమీపంలోని చిరువ్యాపారుల దుకాణాలను కూడా కూల్చడం హేమమైన చర్య అన్నారు. బీసీ జనార్దన్రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లె పట్టణంలో సొంత నిధులతో పాటు ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్స్ను తాను అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ కూల్చలేదన్నారు. కాటసాని కుటుంబం 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉందని, ఏనాడూ ప్రభుత్వ ఆస్తులను కూల్చలేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లె పట్టణంలో వంద పడకల వైద్యశాలతో పాటు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు నిర్మించానని వాటిని కూడా కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు.
కూల్చివేసిన వారిపై ఫిర్యాదు చేయాలి
మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చివేసేందుకు బాధ్యులైన వారిపై రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. వాటర్ ప్లాంట్ కూల్చివేతతో ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కాటసాని వెంట అవుకు, బనగానపల్లె వైఎస్సార్సీపీ కన్వీనర్లు కాటసాని తిరుపాల్రెడ్డి, జనార్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాది అబ్దుల్ఖైర్, ముస్లిం మైనార్టీ నాయకుడు అత్తార్జాహెద్, నాయకులు శంకర్రెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, అనిల్, సురేష్, కృష్ణారెడ్డి, సుదర్శన్రెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవికుమార్రెడ్డి, సుధాకర్రెడ్డి ఉన్నారు.
ప్రజలకు మంచినీరు అందకుండా చేశారు
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
● జిల్లాను ముంచెత్తుతున్న అనుమతిలేని
బయో స్టిములెంట్స్
● గుంటూరు జిల్లా కేంద్రంగా
ఉమ్మడి కర్నూలులోకి దిగుమతి
● మార్కెట్లోకి దొంగ బయోలు,
నకిలీ పురుగు మందులు
● తూతూ మంత్రంగా
స్క్వాడ్ బృందాల తనిఖీలు
● కర్ణాటక, తెలంగాణ నుంచీ
అక్రమ విక్రయాలు
ఇటీవల తనిఖీలకు వచ్చిన స్క్వాడ్ బృందాలు ఫామ్ జీ–2 చూడటంతోనే అంతా సవ్యంగా ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్వాయిస్ బిల్లులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిని పరిశీలించినప్పుడే దొంగ బయోల గుట్టురట్టవుతుంది. అయితే ఆ దిశగా చర్యలు లేకపోవడం మామూళ్ల బంధానికి నిదర్శనంగా తెలుస్తోంది.
జీ–2 అనుమతి ఉన్న కంపెనీ ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కంపెనీకి 6 ఉత్పత్తులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయితే 25 రకాల ఉత్పత్తులను ఉమ్మడి కర్నూలు జిల్లాలో విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖ నోరు మెదపని పరిస్థితి.
.. బయో అమ్మకాల్లో కాసుల పంట పండుతుండటంతో అనేక మంది డీలర్లు వీటి అమ్మకాలపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది డీలర్లు కాలంచెల్లిన పురుగు మందులను బయోల పేరిట విక్రయిస్తున్నారు. ఆకర్షించే ప్యాకింగ్, పేర్లతో రైతులను మోసగిస్తున్నారు.
నంద్యాల: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నీళ్ల పప్పుతో అన్నం పెడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్యాదవ్ అన్నారు. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ ఎదుట సురేష్యాదవ్ విలేకరులతో మాట్లాడారు. గత నాలుగు రోజులుగా సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నామన్నారు. చాలా హాస్టళ్లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారని, నేటికీ దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేయలేదని తెలిపారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెనూ ప్రకారం ప్రతి రోజూ గుడ్డు, వేరుశనగ చిక్కీ, వారానికి రెండుసార్లు చికెన్ పెట్టడం లేదన్నారు. మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు జశ్వంత్రెడ్డి, హరికిరణ్, రియాజ్బాషా, అబ్దుల్లా, శషాంక్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం
జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్
నంద్యాల: ప్రజలందరిలో దేశభక్తి భావాలు పెంపొందించేలా ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేడుకలు నిర్వహింఏ మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులకు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై సందేశ బుక్లెట్ను సిద్ధం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వేర్వేరుగా కుర్చీలు ఏర్పాట్లు చేయాలన్నారు.
Prakasam
- సాగును చిదిమేసి..
అన్నదాతను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసింది. వర్షాలు లేక జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. భూమినే నమ్ముకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు వేయాలంటే భయపడిపోయే పరిస్థితులున్నాయి. పొగాకు, మిర్చి, పత్తి, శనగ, మామిడి, నిమ్మ, వరి.. ఏ పంటలకూ గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా రైతు కుదేలైపోయాడు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని గాలికొదిలేయడం, ఏడాది కాలంగా రైతుకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. పెరిగిపోతున్న అప్పులను చూసి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఏడాది కాలంగా జిల్లాలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఆ కుటుంబాలకు చిల్లిగవ్వ కూడా విదల్చకపోగా, ఏవేవో కుంటిసాకులు చెబుతూ రైతు ఆత్మహత్యలను తప్పుదోవ పట్టించడం మరింత దారుణమని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అన్ని రకాలుగా సంక్షోభంలో కూరుకుపోయిన రైతుకు అరకొరగా డబ్బులిచ్చేందుకు ముఖ్యమంత్రి ఆర్భాటం చేస్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న
● జిల్లాలో 17 మండలాల్లో తీవ్ర కరువు
● పట్టెడు అన్నం పెట్టే రైతన్నను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
● మిర్చి, పొగాకు, శనగ, పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధర రాక విలవిల
● ఆర్థికంగా కుదేలైన రైతు కుటుంబాలు
● ఏడాదిలోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య
● జిల్లాలో జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఆర్భాటం
● తొలి ఏడాది సాయం ఎగ్గొట్టి.. నేడు కోతలు పెట్టి
● నేడు అరకొర డబ్బులు ఇచ్చేందుకు దర్శి వస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో 2024–25 రబీ సీజన్లో సాధారణంగా 3,97,880 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. అయితే, కేవలం 2,99,331 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో కూడా దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో నిలువునా ఎండిపోయాయి. మిగతా 1.99 లక్షల ఎకరాల్లో కూడా సగానికిపైగా ఎకరాల్లో దిగుబడి మరీ దారుణంగా పడిపోయింది. దాదాపు జిల్లాలో సుమారుగా 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాల్సి ఉండగా, చివరకు దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కసారిగా చుట్టిముట్టిన ఆర్థిక సమస్యలతో కాలం వెళ్లదీయలేక ఇక లాభం లేదని నిస్సహాయతతో తనువు చాలిస్తున్నారు. సకాలంలో వర్షాలు పడక, ఒకవేళ అదును దాటి పంటలు సాగు చేస్తే పంట సక్రమంగా చేతికిరాక విలవిల్లాడిపోతున్నారు. దానికితోడు ప్రభుత్వం అందిస్తానన్న సాయం అందించకపోవటంతో ఆశగా ఎదురుచూసి చేసిన అప్పులు తీర్చలేక అశువులుబాస్తున్నా రు. జిల్లాలో రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. రైతు అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే దానికి కూడా ఏవో కొన్ని సాకులు చూపించి రైతు కుటుంబానికి వచ్చే సాయం కూడా రాకుండా పంగనామం పెడుతున్నారు. ఆదరించాల్సిన ఇంటి పెద్ద లేకపోవటంతో ఆ కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది.
మిర్చి రైతు కంట్లో కారం..
జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రైతులు అత్యధికంగా మిర్చి సాగు చేస్తారు. వైఎస్సార్ సీపీ హయాంలో 96 వేల ఎకరాల్లో సాగు చేసిన రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గించేశారు. ఈసారి సుమారు 59,005 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. గతేడాది నవంబర్లో క్వింటా ధర రూ.17 వేల నుంచి రూ.18 వేలు ఉండగా, డిసెంబరు నాటికి రూ.14 వేలకు పడిపోయింది. జనవరిలో రూ.14 వేల నుంచి రూ.12 వేలకు చేరి మార్చిలో రూ.10 వేలు కనిష్టానికి పడిపోయింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చియార్డుకు వెళ్లడంతో ప్రభుత్వం కొనుగోళ్లపై దృష్టి సారించింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా మిర్చి ధర రూ.25 వేల నుంచి రూ.32 వేల మధ్య పలికింది. అలాంటిది ఈ ఏడాది రూ.11 వేలకు పడిపోవడం గమనార్హం. రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. రైతు కుటుంబాలు కోలుకోలేని అప్పుల ఊబిలోకి నెట్టబడ్డాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాధారణ విస్తీర్ణం 4,62,944 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉంది. అలాంటిది ఇప్పటి వరకు కేవలం 25,725 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అంటే సాధారణ విస్తీర్ణంలో కేవలం నాలుగు శాతం మాత్రమే సాగులోకి వచ్చిందంటే జిల్లాలో రైతన్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అన్నదాత సుఖీభవ కుదింపే లక్ష్యంగా...
ఏడాది పాలన తరువాత చంద్రబాబుకు ఎన్నికల హామీ గుర్తుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎంతో మంది రైతుల ఉసురుపోసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలు కుమిలిపోతున్నాయి. అయినా అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ ఇస్తున్నాడా అంటే అదీ లేదు. సవాలక్ష ఆంక్షలు పెట్టి జల్లెడపట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం గాలికి వదిలేసి ఎగ్గొట్టారు. చివరకు 2,68,165 మంది రైతులను అర్హులుగా తేల్చారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న ఆయన.. తాజాగా పీఎం కిసాన్తో కలిపి ఇస్తానని మాట మార్చారు. తొలి విడత రూ.7 వేలు ఇస్తానని చెప్పి, గత నెలలో వచ్చిన పీఎం కిసాన్తో కలిపి రూ.7 వేలు అని మాట మార్చారు. అయితే, మొదటి విడతలో చంద్రబాబు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది కేవలం రూ.5 వేలు మాత్రమే. జిల్లాలో రూ.134.08 కోట్లు ఇస్తున్నానని చెబుతున్నారు.అందులో భాగంగా శనివారం సీఎం చంద్రబాబు దర్శికి రానున్నారు. అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022–23 సంవత్సరంలో రైతు భరోసా కింద 2,86,256 మందికి ఏడాదికి రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ అందజేశారు. రైతు భరోసా రూపంలో అందించింది ఐదేళ్లలో అక్షరాలా రూ.1,634.85 కోట్లు.
ఒంగోలు సిటీ: ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఆటోమొబైల్, సివిల్, మెకానికల్ బ్రాంచిల్లో సీట్లు ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్కు హాజరయ్యేందుకు దరఖాస్తులు కళాశాలలో ఇస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీలోపు విద్యార్థులు తమ దరఖాస్తు ఈ కళాశాలలో అందజేయాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యార్థి పదో తరగతి మార్క్స్ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, టీసీ, పాలిసెట్–2025 రాసిన విద్యార్థులు తమ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ల నకళ్లు జతచేయాలన్నారు. 5వ తేదీ జరిగే కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
కొండపి పంచాయతీకి ముగిసిన నామినేషన్లు
కొండపి: 14 సంవత్సరాల తర్వాత కొండపి పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంతో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పోటీపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగిసిందని, సర్పంచ్ స్థానానికి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి రవిబాబు తెలిపారు. 14 వార్డులకు 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. 1వ వార్డుకు నలుగురు అభ్యర్థులు, 2వ వార్డుకు ముగ్గురు, 4వ వార్డుకు ఇద్దరు, 5వ వార్డుకు ఇద్దరు, 6వ వార్డుకు ముగ్గురు, 7వ వార్డుకు నలుగురు, 8వ వార్డుకు ముగ్గురు, 9వ వార్డుకు ఇద్దరు, పదో వార్డుకు ముగ్గురు, 11 వ వార్డుకు ముగ్గురు, 12వ వార్డుకు ఇద్దరు, 13వ వార్డుకు ఇద్దరు, 14వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. స్క్రూట్ని శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.
టీడీపీ నాయకుడితో కలిసి పింఛన్లు పంపిణీ
మార్కాపురం: పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రహసనంలా మారింది. సచివాలయ ఉద్యోగులు కూడా కూటమి నేతలు లేనిది ముందుకు వెళ్లడం లేదు. వారి మెప్పు కోసం చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి. మార్కాపురం మండలంలోని పెద్దయాచవరం పంచాయతీ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు శుక్రవారం మొద్దులపల్లిలో పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ టీడీపీ నాయకుడిని వెంటపెట్టుకుని వెళ్లారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పింఛను డబ్బులను కూడా ఆ టీడీపీ నాయకునికి ఇచ్చి సదరు ఉద్యోగి బయోమెట్రిక్ వేసి పింఛన్లు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటో సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ విషయమై మార్కాపురం ఎంపీడీఓ శ్రీనివాసులును వివరణ కోరగా అతను పంచాయతీ వర్కర్ అని తెలిపారు.
సాగర్ కాలువను పరిశీలించిన ఇరిగేషన్ సీఈ
కురిచేడు: జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్), కమ్ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బి.శ్యాం ప్రసాద్ నాగార్జునసాగర్ కుడికాలువను శుక్రవారం పరిశీలించారు. కురిచేడు 126 వ మైలు వద్ద నుంచి 202.796 కి.మీ.వద్ద, దొనకొండ మండలం చందవరం 185.611 కి.మీ వద్ద కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. సాగర్ కాలువకు తాగు, సాగు నీరు విడుదల చేశారు. జిల్లా సరిహద్దు 85వ మైలు వద్ద 2550 క్యూసెక్కుల నీరు కుడికాలువకు వస్తోంది. 126వ మైలులో 1790 క్యూసెక్కుల నీరు దర్శి బ్రాంచి కాలువకు చేరుతోంది. ఒంగోలు బ్రాంచి కాలువకు నీరు శుక్రవారం రాత్రికి చేరుతుందని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో కురిచేడు ఎన్ఎస్పీ డీఈఈ అక్బర్ బాషా, కురిచేడు ఎన్ఎస్పీ ఏఈఈలు కె.సాంబశివరావు, బీ రవీందర్ రెడ్డి, కురిచేడు 32వ డిస్ట్రి బ్యూటరీ కమిటీ అధ్యక్షుడు ఉన్నగిరి కోటేశ్వరరావు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
- 37 /28
7
గరిష్టం/కనిష్టం
నమ్మినోళ్లకు నైరాశ్యమే..
ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తొలిసారి నేడు దర్శి నియోజకవర్గానికి రానున్నారు.
కృష్ణమ్మ పరవళ్లతో పారవశ్యం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ
వర్షాలతో కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా చిరుజల్లులు పడవచ్చు.
ఉక్కపోతగా ఉంటుంది.
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లో..
పెద్దదోర్నాల:
మండల పరిధిలోని గంటవానిపల్లె వద్ద జరుగుతున్న ఫీడర్ కెనాల్ అండర్ టన్నెల్ పనులను ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈ అబూతాలిమ్ శుక్రవారం పరిశీలించారు. గంటవానిపల్లె వద్ద జరుగుతున్న అండర్ టన్నెల్ ఎస్కేప్ రెగ్యులేటర్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు రెండవ సొరంగం తవ్వకం పనులు మరో కిలోమీటరు మేర జరగాల్సి ఉందని, దీంతో పాటు లైనింగ్ పనులు మరో 5.2 కిలోమీటర్ల మేర జరగాల్సి ఉన్నాయని అధికారులు ఎస్ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పనులు పూర్తి స్థాయిలో నిర్వహించేలా చూడాలని, దీంతో పాటు ఎస్కేప్ రెగ్యులేటర్ అండర్ టన్నెల్ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఎస్ఈ వెంట క్వాలిటీ కంట్రోల్ ఈఈ రాజగోపాల్, డీఈ. విద్యాసాగర్, ఏఈ అశోక్, ఇరిగేషన్ డీఈ చర్యణ్, ఏఈ అంజలి, మెగా కన్స్టక్షన్స్ డీఎం శ్రీనాథ్, ప్లానింగ్ ఇంజినీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Orissa
● మహామహుల భేటీ
● తెర వెనక వ్యూహాలు
భువనేశ్వర్:
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ విజయోత్సవం వెంబడి మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని భావించారు. ఈ మేరకు ఇంత వరకు ఎలాంటి చర్యలు స్పష్టం కాలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ బిగుసుకుంది. మంత్రి మండలిలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీ కంటే కొంత మంది సిట్టింగుల తొలగింపు, మరి కొంత మందికి శాఖల మార్పు, ఇంకొంత మందికి బహుళ శాఖల బాధ్యతల నుంచి ఉపశమనం దిశలో కొత్త మంత్రి వర్గం విస్తరణ రూపు రేఖలు దిద్దుకుంటుందనే ఊహాగానాలు బలంగా షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఖాళీ మంత్రి పదవుల భర్తీతో మార్పు చేర్పులకు అనుగుణంగా కొత్త ముఖాల ఎంపిక కసరత్తులో పార్టీ అధిష్టానం తలమునకలై ఉంది. రాష్ట్రంలో తొలిసారిగా మంత్రి మండలి విస్తరణలో గవర్నర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించే సంకేతాలు తారసపడుతున్నాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు, కార్యాచరణ వంటి వ్యవహారాల్లో ప్రత్యక్షంగా చొరవ కల్పించుకుని క్షేత్ర స్థాయిలో సందర్శనలో చురుగ్గా పాలుపంచుకున్నారు. తదనంతరం పలువురు మంత్రులతో ముఖాముఖి సంప్రదింపులు విభిన్న శైలిలో కొనసాగాయి. కొంత మంది మంత్రుల ఇళ్లకు వెళ్లి గవర్నర్ కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, న్యాయ శాఖ మంత్రి తదితర కీలకమైన వారు ఉన్నారు. రాష్ట్రంలో ఈ సంప్రదింపులు ముగిసిన తర్వాత గవర్నర్ న్యూ ఢిల్లీ కూడా సందర్శించారు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి వ్యూహకర్తలతో గవర్నర్ భేటీ అయ్యారు. మరో వైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తదితర ప్రముఖులు ఢిల్లీ పర్యటించి రోజుల తరబడి డేరా వేసి పలువురితో సంప్రదింపులు, సమావేశాలు జరిపారు. ఢిల్లీ, భువనేశ్వర్లో జరిగిన ఉన్నత స్థాయి బీజేపీ సమావేశాల మధ్య రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పనిలో పనిగా దీర్ఘకాలంగా ఖాళీ అయిన కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తదితర స్థాయిలో చైర్మన్ వంటి ప్రముఖ పదవుల భర్తీ పూర్తి కానుంది. ఈ మేరకు ఉన్నత స్థాయి సంప్రదింపులు, సమావేశాల్లో అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం అయి ఉంటుందనే ఆశావాదం కొనసాగుతుంది. రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో మంత్రులు, పార్టీ ప్రముఖులతో ప్రత్యక్షంగా సమావేశం కావడంతో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రతిష్టాత్మక సాహితీ, సాంస్కృతిక, సామాజిక వర్గాలతో సమావేశం కావడం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గవర్నర్ పర్యటనలు, సందర్శనలు, సమావేశాలు అధికారికంగా రాష్ట్ర వ్యవహారాలతో ముడిపడి లేనప్పటికీ రాష్ట్రంలో నెలకొని ఉన్న వర్ధమాన పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ప్రత్యేక చురుకుదనం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. గత నెల 21న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాజ్ భవన్లో గవర్నర్ను కలిశారు. అనంతరం, గవర్నర్ న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారిని రాజ్ భవన్లో కలిశారు. ఇదంతా పూర్తి కావడంతో న్యూ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో ఆరి తేరి భారతీయ జనతా పార్టీ దృష్టిలో పటిష్టమైన వ్యూహకర్తగా వెలుగొందుతున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. ఈ సమగ్ర సమావేశాల్లో రాష్ట్రంలో సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి దిశలో చర్చలు సాగినట్లు మాత్రమే స్పష్టం అయింది. రాజకీయపరమైన చర్చలు, సంప్రదింపులకు సంబంధించి గోప్యత కొనసాగుతుంది. పశ్చిమ ఒడిశా నుంచి భారతీయ జనతా పార్టీలో రాజకీయ దక్షత కలిగిన రాజ వంశీకుడు, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ ఢిల్లీలో పర్యటించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థ) బి. ఎల్. సంతోష్ను కలిశారు. ఈ కలయిక రాజకీయ ప్రాధాన్యతతో ముడిపడిందిగా చర్చ కొనసాగుతుంది. రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ విజయ్పాల్ సింగ్ తోమర్, వంటి ప్రముఖులతో గోప్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో అత్యంత బలమైన మంత్రి మండలి తెరపైకి రానుందని ఊహిస్తున్నారు. మంత్రి మండలి విస్తరణ రేపో మాపో అన్న దశకు చేరుకుంది. ఈ సమయంలో మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు ఎవరి తరహాలో వారు తమ ఉనికిని రాజకీయంగా ప్రతిబింబించే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. అటు ముఖ్యమంత్రితో ఇటు పార్టీ, ప్రభుత్వంలో పరపతి కలిగిన నాయకులతో ఆశావాదులు దక్షత, సమర్థత ప్రదర్శనకు పదును పెడుతున్నారు. పదవుల్ని కాపాడుకోవడంలో పలువురు సిట్టింగులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పట్టణ అభివృద్ధి, గృహ నిర్మాణం, పౌర సరఫరా, వినియోగదారుల సంక్షేమం, గిరిజన సంక్షేమం, వాణిజ్య, రవాణా, పాఠశాలలు, సామూహిక, ఉన్నత విద్యా విభాగాల పని తీరు ప్రజల ఆశల్ని నీరుగార్చినట్లు విమర్శలు బలం పుంజుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బలపరచిన విశ్వాసం తాజా సంఘటనలతో పూర్తిగా నీరు గారి పోయింది. మంత్రి వర్గ విస్తరణ పురస్కరించుకుని పాలనలో భారీ సంస్కరణ దిశలో కొత్త ముఖాలకు పట్టం గట్టే అవకాశంపై విశ్లేషకులు గురి పెట్టారు.
రాయగడ: శ్రావణ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని స్థానిక కస్తూరీనగర్లోని సత్యనారాయణ ఆలయంలో కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పులఖండం రఘేనాయకుల శర్మ, కిశోర్శర్మ, వరప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన పూజలు జరగ్గా అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సుప్రభాత సేవ, అభిషేక కార్యక్రమాలు జరిగాయి.
కోదండ రామ మందిరంలో..
స్థానిక బ్రాహ్మణ వీధిలోని కోదండరామ మందిరంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు అనంత ఆచార్యుల ఆధ్వర్యంలో లక్ష కుంకుమ పూజలు జరిగాయి. పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఘనంగా శ్రావణశుక్ర వరలక్ష్మీ వ్రతాలు.
పర్లాకిమిడి: శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానక రాజవీధి పోడుగు కోవెలలో వరలక్ష్మీ పూజలను ప్రధాన అర్చకులు దుర్గాబాబు ఆధ్వర్యంలో ముత్తయిదవులతో చేయించారు. అలాగే పెట్రోల్ బంకు రోడ్డు, వాసవీ కన్య కాపరమేశ్వరీ ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాలను అర్చకులు వనమాలి మణిశర్మ ఆధ్వర్యంలో సామూహికంగా చేయించారు. కేవుటి వీధి ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వరలక్ష్మి వ్రతాలు ప్రధాన పూజారి ఎ.రాజగోపాలచారి ఆధ్వర్యంలో జరిగాయి.
రాయగడ: జిల్లాలోని గుడారి గ్రామంలో ఉన్న కన్యకాపరమేశ్వరీ ఆలయ పరిసరాలను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శ్రమదానం ద్వారా శుక్రవారం శుభ్రం చేశారు. అలాగే కొత్త బస్టాండ్, తదితర ప్రాంతాల్లొ సఫాయి కార్యక్రమాలను చేపట్టారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎస్.తిరుమల సింహాద్రి, కిరణ్ దొయ నంద, బి.తిరుమల, క్రిష్ణచంద్ర సాహు, దివ్యసింగ్ పాత్రో, బి.ఆదిత్య తదితరులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మంగు ఖీలో విస్తృత పర్యటన
మల్కన్గిరి: జిల్లాలోని ఖోయిర్పూట్ సమితి బొడ్డడోరాల్ పంచాయతీలో చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఈ పంచాయతీలోని పలువురు ఇళ్లు కోల్పోయారు. దీంతో వారిని పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు ఇప్పిస్తామని తెలియజేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కై లాస్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కై లాస్పూర్ ఘాటి మలుపులో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు గురువారం సాయంత్రం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ముకుందపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒమినీ వాహనంలో ఒక వ్యాపారి ముకుందపూర్ నుంచి జేకేపూర్ వైపు వస్తుండగా, ఘాటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక కారును అదుపుతప్పి ఢీకొంది. దీంతో కారు, ఒమినీ ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, అదేవిధంగా ఒమినీ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
జయపురం: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ప్రైవేట్ బస్సు యాజమాన్య సంఘం సభ్యులు పేర్కొన్నారు. స్థానిక ప్రైవేటు బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి నరేంద్ర కుమార్ మహంతి మాట్లాడుతూ.. బస్టాండ్లో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటేందుకు నిర్ణయించామన్నా రు. చెట్లు ఉంటే అవి వివిధ రకాల పక్షులకు ఆవాసాలుగా ఉంటాయని పేర్కొన్నారు. బస్టాండ్ ప్రాంగణం అంతటా పరిశుభ్రం చేసి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని పిలుపునిచ్చారు.
రాయగడ: ఒక హత్య కేసుకు సంబంధించి బిసంకటక్ పోలీసులు కేసు దర్యాప్తును నీరు గారుస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు శుక్రవారం పోలీస్స్టేషన్ను ఘెరావ్ చేశారు. వందలాది ఆదివాసీ మహిళలు, యువకులు ఈ ఘెరావ్లో పాల్గొన్నారు. దీంతో రెండు గంటల సమయం పోలీస్ స్టేషన్ మెయిన్ గేటు వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. జిల్లాలొని బిసంకటక్ సమితి పరిధిలోని డుమురినాలొ పంచాయతీలొ గల లుటుగుడ గ్రామానికి చెందిన పింటు కిలక (21) అనే ఆదివాసీ యువకుడు జూన్ 27న సమితి పరిధిలో గల దుర్గిలో జరిగే రథయాత్రను చూసేందుకు వెళ్లాడు. యాత్రను చూసేందుకు వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల తర్వాత దుర్గీ సమీపంలో గల ఒక అడవిలో యువకుని మృతదేహం ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్య చేసి ఎవరో ఇలా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తు బాధిత కుటుంబీకులు బిసంకటక్లొ ఫిర్యాదు చేశారు. కేసు నమోదై నెల రొజులు కావస్తున్నా పోలీసులు ఇంతవరకు హత్యకు సంబంధించిన వారిని పట్టుకోలేదని బాధిత కుటుంబీకులు ,గ్రామస్తులు ఆరొపిస్తు ఈ ఆందోళనకు దిగారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్తులు
మల్కన్గిరి: పోలం పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి తేల్రాయి పంచాయతీ సుధ్దాకొండ గ్రామంలో శుక్రవారం చోటచేసుకోగా భీమా సోడి (42) మృతి చెందాడు. సుద్దాకొండ గ్రామానికి చెందిద భీమా సోడి తన పొలంలో వ్యవసాయం పనులు చేయించేందుకు ఎంపీవీ–77 గ్రామానికి చెందిన వివేకవైద్య అనే యువకుడుని ట్రాక్టర్ డ్రైవర్గా పిలిచి పని చేయిస్తున్నారు. అయితే ట్రాక్టర్ టైరు మట్టిలో కూరుకుపోవడంతో దాన్ని బయటకు తీసేందుకు వివేక్ స్పీడ్ రేజ్ చేశాడు. దానితో ట్రాక్టర్ బోల్తా పడి పక్కనే ఉన్న భీమాసోడిపై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని రోదించారు. సమాచారం తెలుసుకున్న కలిమెల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐఐసీ ముకుందో మేళ్క.. భీమా సోడి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
జయపురం: కొరాపుట్ జిల్లా నూతన కలెక్టర్ మనోజ్ సత్భాన్ మహాజన్ గురువారం కొటియ పంచాయతీ గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపైన, చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలపైన ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తాము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొటియా సర్పంచ్ నియ గమేల్, తుడా ప్రాజెక్ట్ డైరెక్టర్ బేణుధర శబర, కొరాపుట్ సబ్ కలెక్టర్ ప్రేమలాల్ హియాల్, బీడీఓ రామకృష్ణ నాయిక్, తహసీల్దార్ దేవేంద్ర దారువ, ఏఈ విశ్వనాథ్ మాదెలి, కొటియ పంచాయితీ ఇంజినీర్ జయరాం తొరాయి, ఏపీఓ సౌమేంధ్ర నాయిక్, కొటియ రూరల్ వాటర్ వర్క్స్ అండ్ శానిటేషన్ విభాగ అఽధికార ఇంజినీర్ బాసుదేవ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
జయపురం: ఒక మహిళను శారీరకంగా, మానసికంగా వేధించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు జయపురం మహిళా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. జయపురం సమితి ధనపూర్ పంచాయతీ బొడొకావిడికి చెందిన లావణ్య నాగ్ తనను భర్త, అత్త మరిదిలు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరణ ప్రకారం రెండేళ్ల కిందట లావణ్యకు, రాజా సాగరియతో వివాహం జరిగింది. ఏడాది పాటు వారు బాగానే ఉన్నారు. తర్వాత అత్తింటి వారు ప్రతి విషయానికి తిడుతూ కొడుతూ ఉన్నారని, ఆ వేధింపులు భరించలేక జయపురం ప్రసాదరావు పేటలో ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని లావణ్య ఉంటున్నారు. అక్కడకు కూడా వచ్చి కొడుతున్నట్లు ఫిర్యాదులో ఆరోపించింది. గత నెల 28వ తేదీన ఆమె మరిది ఇంటికి వచ్చి తిడుతూ ఆమె నుంచి బిడ్డను బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడని, ప్రతిఘటించటంతో కొట్టి బెదిరించి వెళ్లాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. తనకు ప్రాణాపాయం ఉందని తనకు రక్షణ కల్పించాలని ఆమె ఫిర్యాదులో కోరింది. కేసు నమోదు చేసి ఏఎస్ఐ బికాశ చంఽధ్ర నాయిక్ దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్గా నియమితులైన సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జిల్లా విలేకరుల సంఘం ప్రతినిధులు నూతన కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.
డాక్టర్ల కొరత తీర్చాలని కాంగ్రెస్ డిమాండ్
పర్లాకిమిడి: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సుసిబ్బంది కొరత వల్ల చుట్టుప్రక్కల నుండి వస్తున్న రోగులకు సేవలు అందటం లేదని ఎమ్మెల్యే మోహానా ప్రతినిధి ఈశ్వర చంద్ర మఝి, మాజీ వైస్ చైర్మన్ సంజయ్ అధికారి, అశోక్ అధికారులు తెలియజేశారు. శుక్రవారం ఆదనపు వైద్యాధికారికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. నెలరోజుల లోపు హెడ్క్వార్టర్ ఆసుపత్రిలో డాక్టర్లు నియామకం చేపట్టకుంటే ఆసుపత్రి వద్ద ధర్నా ఆందోళన చేపడతామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాస్మిన్ షేక్ అన్నారు.
దాడి ఘటనలో నిందితుడి అరెస్టు
జయపురం: జయపురం సమితి పాత్రోపుట్ పెట్రోల్ బంక్లో పనిచేసే రాజేంద్రఖిలోపై కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేయటానికి ప్రయత్నించిన దుండగులు పరారైన విషయం విదితమే. పరారీలో దుండగులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రధాన్ నేడు వెల్లడించారు. అదుపులోనికి తీసుకోబడిన వ్యక్తి జయపురం సమితి ఉమ్మిరి గ్రామస్తుడని తెలిపారు. అతడి వద్ద రాజేంద్రపై దాడికి వినియోగించిన ఆటోను సీజ్ చేసినట్లు ప్రధాన్ వెల్లడించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
టెక్కలి రూరల్: స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, రెండు రోజులుగా టెక్కలిలోనే తిరిగాడని స్థానికులు చెబుతున్నారు. గురువారం రాత్రి సమీప షాపుల బయట పడుకుని ఉదయం వెళ్లిపోయాడని, మధ్యాహ్నానికి మృతి చెంది కనిపించాడని అంటున్నారు. మృతుడు నీలం టీషర్టు, ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ రాము కోరారు.
రెడ్డీస్లో బ్యాటరీలు చోరీ
రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటీస్ సీటీవో–6 పరిశ్రమలో గత నెల 23న నాలుగు పెద్ద బ్యాటరీలు చోరీ జరిగినట్లు జె.ఆర్.పురం పోలీసులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.చిరంజీవి శుక్రవారం చెప్పారు.
టెక్కలి రూరల్: తనకు, పిల్లలకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం ఓ మహిళ పురుగుల మందుతో టెక్కలి పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించింది. గతంలో తన భర్తతో తగాదా ఉంటే పోలీసులు కోర్టులో రాజీ చేయించి తమను బాగా చూసుకుంటాడని చెప్పారని, తర్వాత పూర్తిగా పట్టించుకోవడం మానేశాడని వాపోయింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమన్నారు. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పురుగు మందు బాటిల్ను తీసుకుని స్టేషన్లోకి తీసుకువెళ్లి మాట్లాడారు. భర్తను పిలిపించి తనకు న్యాయం చేస్తామని ఎస్ఐ రాము నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించారు. కాగా, స్టేషన్ వద్ద మహిళ బైఠాయించిందన్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు స్టేషన్కు చేరుకుని వివరాలు సేకరించే క్రమంలో పోలీసులు అడ్డుతగిలారు. ఫొటోలు తీయడానికి వీలు లేదంటూ పంపించేశారు.
పురుగుమందు బాటిల్తో మహిళ నిరసన
టెక్కలి పోలీస్స్టేషన్ ఎదుట కలకలం
ఎచ్చెర్ల : శ్రీకాకుళంలోని రాజీవ్గాంధీ యూనివర్శిటీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో ఏడుగురు సీఎస్ఈ విద్యార్థులు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని గ్రిడ్లైక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగాలు దక్కించుకున్నారు. నెలకు రూ. 20 వేలు స్టైపండ్తో ఇంటర్న్షిప్ పూర్తి చేశాక సంవత్సరానికి రూ.8,00,00 ప్యాకేజీ అందిస్తారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, సీఎస్ఈ విభాగాధిపతి వై.రమేష్, అధ్యాపకులు అభినందిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు.
నరసన్నపేట: నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 3న జిల్లా యోగాసనా చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద ధ్యాన యోగా సమితి అధ్యక్షుడు కింజరాపు రామారావు తెలిపారు. యోగాసన స్పోర్ట్ అసోషియేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అభ్యాసకులకు ఇచ్చే టీషర్టులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ , ఎన్వైఎస్ఎఫ్ కార్యదర్శి బోత్స కేదారినాథ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 7 కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు.
బాక్సర్కు అభినందనలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ బాక్సింగ్ సంచలనం జి.సత్యభార్గవ్ను డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు అభినందించారు. శుక్రవారం కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద శిక్షణకు హాజరైన సత్యభార్గవ్ను, తీర్చిదిద్దుతున్న కోచ్ పి.ఉమామహేశ్వరరావును మెచ్చుకున్నారు. హర్యానాలోని రోతక్ వేదికగా జరిగిన ఆలిండియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఈ యువ బాక్సర్ రజత పతకంతో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్ కోచింగ్ క్యాంప్కు ఎంపికయ్యాడు. త్వరలో శిక్షణా శిబిరాలకు హాజరుకానున్నట్టు కోచ్ తెలిపారు.
బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి
● గోవాలో ఘటన
వజ్రపుకొత్తూరు: పల్లివూరు పంచాయతీ హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు కారి రాజులు(44) గోవాలో శుక్రవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజులు స్థానికంగా వేట సాగకపోవడంతో గోవాకు వలసవెళ్లాడు. అక్కడ శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో వేట సాగిస్తుండగా అలల ధాటికి బోటు బోల్తా పడింది. బోటు కిందే రాజులు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. రాజులు తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోగా, భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలు స్వాతి, స్వప్న ఉన్నారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోవా పోలీసులు పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని గ్రామానికి పంపిస్తారని స్థానికులు తెలిపారు.
7న ప్రతిభా పోటీలు
ఎచ్చెర్ల : శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 వసంతాలు పూర్తికావస్తున్న సందర్భంగా పీజీ, డిగ్రీ విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 7న ప్రత్యేక ప్రతిభా పోటీ నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అనూరాధ శుక్రవారం తెలిపారు. జిల్లా చరిత్ర, సంస్కృతి, స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లా పాత్ర, జిల్లా ప్రగతిలో ముఖ్య ఘట్టాలు, జిల్లాలో జన్మించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తదితర అంశాలపై విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల డిగ్రీ విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 83095 19615 నంబర్ను సంప్రదించాలన్నారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ చెలిగడ జలవిద్యుత్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ మధుమిత శుక్రవారం అధికారులతో సందర్శించారు. తొలుత కలెక్టర్ మధుమిత కువాపడ, ముషాడోల్లి గ్రామానికి వెళ్లి ఛెలిగడ రిజర్వాయర్ ప్రాజెక్టు అంతర్గత నిర్మాణాలు, టన్నెల్ను సందర్శించారు. అనంతరం చెలిగడ గ్రామంలో ఎడమవైపు నిర్మాణంలో ఉన్న డ్యాం, బోడోజోరో నదిని సందర్శించారు. తర్వాత ఛెలిగడ రిజర్వాయర్ వల్ల ముంపునకు గురైన పులుసుగుబ్బ నిర్వాసితుల కాలనీని పరిశీలించి వాటి పనులు వెంటనే పూర్తిచేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. పులుసుగుబ్బ వద్ద నిర్వాసితుల కాలనీ వద్ద ప్రభుత్వ పాఠశాల, తాగునీరు, విద్యుత్ సౌకర్యంపై అధికారులతో అక్కడ సమీక్షించారు. కలెక్టర్ మధుమిత పర్యటనలో చెలిగడ రిజార్వాయర్కు భూసేకరణ, పునరావాస అధికారి రవీంద్ర నాథ్ కుహోరో, ఛెలిగడ జలవిద్యుత్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీరు బీరేంద్ర కుమార్ జగత్, ఆర్.ఉదయగిరి తహసీల్దార్ జ్యోతి మయ దాస్, మండల అధికారి శుభాషిష్ పండా, లోకనాథ బెహరా, ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు లక్ష్మీ చరణ్ మిశ్రా, ఏఈ జయంత్ నాయక్, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చెలిగడ గ్రామం వద్ద నిర్వాసిత కుటుంబ ప్రజలతో కలెక్టర్ మధుమిత మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెలిగడ రిజర్వాయర్ను వీలైంనంత తొందరలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రాయగడ: లారీ యజమానుల సంఘానికి చెందిన 60 కోట్ల రూపాయలకు పైగా నిధులు దారిమళ్లించి ఆ నిధులతో స్వంత వ్యాపార లావాదేవీలు కొనసాగించి కోట్ల రుపాయలకు పడగెత్తిన రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు ఆగడాలకు ఇక చెక్ పెట్టడం ఖాయమని లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాల్ల కొండబాబు (వేంకటేశ్వరులు) అన్నారు. ఈ మేరకు లారీ యజమానుల సంఘం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన నెక్కంటి కార్యకలాపాలపై దుమ్మెత్తి పోశారు. నాలుగు దశాబ్దాలకు పైగా లారీ యజమానుల సంఘానికి ప్రాతినిథ్యం వహించిన నెక్కంటి ఈమేరకు సంఘానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని కాజేశారని ఆరోపించారు. గత రెండేళ్లుగా తాను లారీ యజమానుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూర్చామని వివరించారు. ఈ నిధుల్లో భాగంగా సుమారు రు. 60 లక్షలు వెచ్చించి కార్యాలయం భవనం నిర్మించామని అన్నారు 40 ఏళ్లు సంఘానికి ప్రాతినిథ్యం వహించిన నెక్కంటి సంఘానికి వచ్చే నిధులను దారిమళ్లించి తమ సొంత వ్యాపారాలకు పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. బినామీ పేర్లతో వ్యాపారాలను కొనసాగించి కోట్లాది రూపాయలకు పడగలెత్తిన నెక్కంటి కాజేసిన సంఘం నిధులు లారీ యజమానుల కష్టార్జితమేనని అన్నారు. సంఘం నిధులు,వాటి లెక్కలను చూపించని నెక్కంటిపై సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు చేయకుండా పోలీస్ యంత్రాంగం నాన్చుతుందని ఆరోపించారు . కేసు నమోదు చేయాలంటే అందుకు నెక్కంటికి సంబంధించిన కొన్ని వివరాలు సమర్పిస్తేనే తాము కేసు రిజిష్ట్రర్ చేస్తామని పోలీసులు తనకు నోటీసులు జారీ చేశారని కొండబాబు చెప్పారు.
ఆందోళన చేస్తాం..
లారీ యజమానుల సంఘం నిధులు దారిమళ్లింపునకు సంబంధించి పోలీస్ స్టేషన్లో నెక్కంటిపై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి దానికి అనుగుణంగా దర్యాప్తు చేయకపొతే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయడం ఖాయమని కొండబాబు వెల్లడించారు. అనంతరం నెక్కంటికి సంబధించిన వ్యాపార అక్రమ లావాదేవీలకు సంబంధించి విలేకర్ల సమావేశంలొ ప్రస్తావించారు. ఈ సమావేశంలొ లారీ యజమానుల సంఘానికి చెందిన కార్యకర్తలు ఆదినారాయణ, సంఘం కార్యదర్శి కడుపుకూట్ల జానకీరామయ్య తదితరులు పాల్గొన్నారు.
భువనేశ్వర్: జాతీయ చలనచిత్ర అవార్డులు–2023లో పుష్కర ఉత్తమ ఒడియా చిత్రంగా గెలుపొందింది. నాన్–ఫీచర్ ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్ మెన్షన్) లఘుచిత్రంగా ది సీ – ది సెవెన్ విలేజెస్ ప్రత్యేక గుర్తింపు పొందింది. శుభ్రాంషు దాస్ దర్శకత్వం వహించిన ‘పుష్కర’ ఒడియా చలన చిత్రంలో సబ్యసాచి మిశ్రా ప్రముఖ పాత్ర పోషించారు. ఈ చిత్రం శంకర్ త్రిపాఠి రచన ఒడియా నవల ‘నాదబిందు’ ఆధారంగా నిర్మించారు. అనేక చలనచిత్రోత్సవాలలో పుష్కర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం జాతీయ వేదికపై అత్యున్నత గౌరవాన్ని అందుకుంది. పుష్కర’ గ్రామీణ ఒడిశాలోని సంప్రదాయం, సామాజిక పరివర్తన ఇతివృత్తాలతో చిత్రీకరించారు. హిమాంషు ఖటువా దర్శకత్వం వహించిన ది సీ – ది సెవెన్ విలేజెస్ లఘు చిత్రం ఒడిశాలోని సాతొభయ్యా తీరప్రాంత స్థానభ్రంశంతో సమాజాల భావోద్వేగ, సామాజిక, పర్యావరణ పరిణామాల్ని సమగ్రంగా చిత్రీకరించింది. ఈ చిత్రం వాతావరణ మార్పు, సముద్ర మట్టాలు పెరగడం, ఈ ప్రాంతంలోని తరతరాలుగా కుటుంబాలను ప్రభావితం చేస్తున్న పూర్వీకుల గృహాల నష్టం వాస్తవాల్ని తెరకి ఎక్కించింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్కర’ ఉత్తమ ఒడియా చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ‘ది సీ అండ్ సెవెన్ విలేజెస్’ నాన్–ఫీచర్ విభాగంలో ఉత్తమ ఒడియా చిత్రంగా అవార్డును పొందింది. ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక ఇతర వర్గాల్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు. ఒడియా చలన చిత్ర రంగం మరిన్ని మంచి చిత్రాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
భువనేశ్వర్: యువ అధికారులుగా ప్రభుత్వ నియమాలు, ఫైళ్లకు పరిమితం కాకుండా ప్రజా సంక్షేమం వాస్తవ కార్యాచరణగా ఉన్నత సామాజిక జీవన ఆవిష్కర్తలుగా వెలుగొందాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. శుక్రవారం రాజ్ భవన్ ప్రాంగణం న్యూ అభిషేక్ హాల్లో 2022 బ్యాచ్కు చెందిన 83 మంది శిక్షణార్థి ఒడిశా రెవెన్యూ సర్వీస్ (ఓఆర్ఎస్) అధికారులతో గవర్నర్ ప్రత్యక్షంగా సంభాషించారు. కార్యక్రమంలో గవర్నర్ కమిషనర్ రూపా రోషన్ సాహు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలన వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్రధారులు రెవెన్యూ సర్వీస్ అధికారులుగా పేర్కొన్నారు. వీరి సేవలు ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. నిజాయితీ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయడంలో అధికారులు తమ బాధ్యతలను ప్రతిబింబించాలని కోరారు. భూముల సంబంధిత రికార్డుల నిర్వహణ, వివాద పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు రెవెన్యూ అధికారుల కీలక బాధ్యతలుగా గవర్నర్ వివరించారు. సంక్షేమ పథకాల్లో అర్హులైన పౌరులను నమోదు చేయడంలో ఓఆర్ఎస్ అధికారుల చురుకై న పాత్ర ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు.
Mancherial
బెల్లంపల్లి రైల్వేస్టేషన్
బెల్లంపల్లి: రైల్వే శాఖ తీసుకుంటున్న ఆకస్మిక, అనా లోచిత నిర్ణయాలు ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి, ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ తీరైన నిర్ణయం తీసుకుంటారో తెలియ ని అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లు మంచిర్యా ల, బెల్లంపల్లిలో పలు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ తొలగించినట్లు రైల్వే రిజర్వేషన్ పోర్టల్ ఐఆర్సీటీసీలో చూపిస్తుండడం ప్రయాణికుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయా రైల్వేస్టేషన్లలో సదరు రైళ్ల హాల్టింగ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఓ వైపు రైళ్ల హాల్టింగ్కు ఆదేశాలు జారీ చేయాలని పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రైల్వే మంత్రి, అధికారులకు వినతిపత్రాలు అందిస్తుండగా.. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న హాల్టింగ్లను రద్దు చేస్తుండడంతో విమర్శలు వస్తున్నాయి.
నవీకరణ పేరుతో ఎత్తివేతలు
ప్రతీ ఆరు నెలలకోసారి రైల్వేశాఖ రైళ్లను నవీకరణ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని రైళ్ల హాల్టింగ్ను కొనసాగించడమా.. రద్దు చేయడమా అనేది రైల్వే అధికారులు నిర్ణయిస్తున్నారు. రైళ్ల హాల్టింగ్ అప్, డౌన్ మార్గాల్లో కనిష్టంగా 40చొప్పున సాధారణ టిక్కెట్లు అమ్మకాలు జరగాల్సి ఉంటుంది. అదే తీరుగా సదరు రైల్వేస్టేషన్లలో ఎక్కే, దిగే ప్రయాణికుల సంఖ్యను రైల్వేశాఖ ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రస్తుతం హాల్టింగ్ తొలగించినట్లు భావిస్తున్న రైళ్లన్నీ కూడా అర్ధరాత్రి పూట ఆయా స్టేషన్లకు చేరుతుండడంతో ప్రయాణికులు ప్రయాణం చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ల విక్రయాలు, ఆదాయం, ప్రయాణికుల సంఖ్యను బేరీజు వేసుకుని రైళ్లకు హాల్టింగ్ కల్పించడం, ఎత్తివేయడం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో ఇప్పటికి మూడుసార్లు నవీకరణ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒకసారి ఏదైనా రైలుకు ప్రయోగాత్మక స్టాప్ సదుపాయం కల్పిస్తే అలాగే కొనసాగించే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆర్నెల్లకోసారి హాల్టింగ్ సమస్య ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. ప్రయాణికుల అవసరాలు, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా.. లాభాపేక్షతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు
రైల్వే శాఖ ప్రతీ ఆర్నెల్లకో సారి ఆయా రైల్వేస్టేషన్లలో గతంలో ఇచ్చిన ప్రయోగా త్మక హాల్టింగ్లను రైల్వే అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదు. దీంతో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంతోపాటు రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఉందా, లేదా లేక ఎత్తేశారా అనేది తెలియక అయోమయానికి గురవుతున్నారు. నిర్ధేశించిన గడువుకు నెల రోజుల ముందుగానే అప్డేట్ చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ఒకసారి హాల్టింగ్ కల్పించాక కొనసాగించాలే గానీ రకరకాల కారణాలతో ఎత్తి వేసే చర్యలు సరికాదు.
– ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు
వెబ్సైట్లో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి–న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే ఏపీ సంపర్క్క్రాంతి ట్రై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 7నుంచి దిగువ మార్గంలో బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ల నిలుపుదలను రైల్వే రిజర్వేషన్ పోర్టల్ ఐఆర్సీటీసీలో తొలగించినట్లు చూపిస్తోంది. ఈ నెల 4వరకు హాల్టింగ్ ఉన్నట్లు నిర్ధారిస్తుండడంతో ఆ తర్వాత నుంచి హాల్టింగ్ను ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్–నిజాముద్దీన్(న్యూఢిల్లీ)–హైదరాబాద్ మధ్య నడిచే దక్షిణ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఎగువ మార్గంలో ఇప్పటికే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో బెల్లంపల్లి రైల్వేస్టేషన్ను చూపించడం లేదు. కేవలం దిగువ మార్గంలో రైలు వివరాలు అందుబాటులో ఉండడం గమనార్హం.
సికింద్రాబాద్–రాయ్పూర్ మధ్య నడిచే ట్రైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ ఎగువ మార్గంలో బెల్లంపల్లి రైల్వేస్టేషన్ పేరు కనిపించడం లేదు.
కాజీపేట–పూణే మధ్య రాకపోకలు సాగిస్తున్న వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చే సెప్టెంబర్ 28 నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఎత్తివేస్తున్నట్లు పోర్టల్లో కనిపిస్తుండగా.. సెప్టెంబర్ 21వరకు మాత్రం ఆ రైలు హాల్ట్ ఉన్నట్లు చూపిస్తోంది.
రామకృష్ణాపూర్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్రాజ్ సూచించారు. మందమర్రి పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మానస, జాన్వీ, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించాలి
జన్నారం: వైద్యసిబ్బంది గ్రామాల్లో పర్యటించి వ్యాధులపై తెలుసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డెంగీ, వైరల్ ఫీవర్లపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నారు. గ్రామాల్లో అనుమానితుల రక్త నమూనాలు సేకరించాలని తెలిపారు. సమావేశంలో వైద్యులు ఉమాశ్రీ, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్: సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణ తీరు చాలా అన్యాయంగా ఉందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మండిపడ్డారు. మందమర్రిలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. హయ్యర్ రిఫర ల్స్ పేరిట తొమ్మిది నెలలపాటు 52 మంది కార్మికులకు జీతాలు రాకుండా కోతపెట్టి చివరికి ఐదుగురిని మాత్రమే ఇన్వాలిడేషన్ చేశారని అన్నారు. మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హైదరాబాద్, కొత్తగూడెం డాక్టర్లతో కాకుండా ఏ ఏరియా వారికి అక్కడే అన్ఫిట్ చేస్తే అసలు మెడికల్ దందా అనేది ఉండదు కదా అని పేర్కొన్నారు. మెడికల్ బోర్డు నిర్వహణ విషయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నాయకులు సారయ్య, జె.శ్రీనివాస్, పార్వతి రాజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
జన్నారం: టైగర్జోన్ పేరిట విధించిన అటవీ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ పగటి పూట భారీ వాహనాల రాకపోకలను నిషేధించడం వల్ల జన్నారం అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా తగ్గిపోయాయని అన్నారు. ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతం మరింత వెనుకబడే ప్రమాదం ఉందని తెలిపారు. అటవీ ఆంక్షలను ఎత్తివేసే వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు అశోక్, రాకమ్మ, లక్ష్మణ్, విజయ, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలఅర్బన్/దండేపల్లి: జిల్లాలోని సర్కారు బడుల్లో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్ఏ) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. పారదర్శకత కోసం విద్యాశాఖ ఎఫ్ఆర్ఎస్ఏ ప్రవేశపెట్టింది. మొదటి రోజు శుక్రవారం ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణ నుంచి అటెండెన్స్ వివరాలు అప్లోడ్ చేయడం, హాజరు నమోదులో తలమునకలయ్యారు. కొన్ని పాఠశాలల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. 738 పాఠశాలల్లో 3209 మంది టీచర్లు న్నారు. ఇందులో 2020 మంది మాత్ర మే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. యాప్లో వివరాలు నమోదు తర్వాత 1934 మంది టీచర్లు ఎఫ్ఆర్ఎస్ఏతో హాజరు నమోదయ్యారు.
పాతమంచిర్యాల: ఎస్సీ వర్గీకరణలోని లోపా ల వల్ల మాల, మాల ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుందని, లోపాలను సవరించి న్యాయం చేయాలని మాల, మాల ఉపకులాల జేఎసీ జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వర్గీకరణ అమలు కాకముందు వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగుల రోస్టర్ పా యింట్ల విషయంలో సరైన నియమ నిబంధనలు పాటించడం లేదన్నారు. మాల ఉద్యోగుల సంఘం నాయకులు దాసరి వెంకటరమణ, కూన రవికుమార్, వేముల కృష్ణ, కాసర్ల యోహన్, వేల్పుల నరేష్, తొగరు కార్తీక్, గోపాల్, రేవెల్లి సతీష్ పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల లింకు ప్రాజెక్టుతో తెలంగాణకు గోదావరి నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టు రద్దు కోసం తెలంగాణ విద్యార్థి సదస్సు నిర్వహించారు. సాగునీటి రంగ నిపుణులు వి.ప్రకాశ్రావు ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల మాదిరే గోదావరి జలాలను తీసుకుపోయేందు కు కుట్రపన్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వ చర్యతో నీటిలో హక్కులు కోల్పోయి భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంద ని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో బనకచర్ల పై చర్చ జరగలేదని చెబితే.. ఏపీ సాగునీటి శా ఖ మంత్రి నిమ్మల రామనాయుడు చర్చ జరి గిందని అంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి అన్నింటిలో ఏపీ సీఎం చంద్రబాబు అండగా ఉండడంతోనే ఈ ప్రాజెక్టుకు అడ్డుచెప్పడం లేదని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫియర్ కుంగితేనే అంతా అయిపోయిందని తప్పుడు ప్రచా రం చేస్తున్నారన్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నాయకులు విజిత్రావు, రాజారాం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు
మంచిర్యాలలో విద్యార్థి సదస్సు
- ● పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్బిస్త్
నస్పూర్: పురుషులతో సమానంగా మహిళా సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించాలని ఆర్బీవీఆర్ఆర్(రాజా బహదూర్ వెంకటరమణారెడ్డి) పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అన్నారు. శుక్రవారం ఆమె సీసీసీలోని సింగరేణి గెస్ట్హౌస్లో మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓ, మహిళా సిబ్బందితో మాట్లాడుతూ డ్యూటీలు, పోస్టింగ్లు, సెలవులు, పని ప్రదేశంలో సమస్యలు, కుటుంబ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్ శిక్షణ సమయంలో పురుషులతో సమానంగా మహిళా సిబ్బంది అన్ని విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారని, విధుల నిర్వహణలో మాత్రం తారతమ్యం చూపిస్తున్నారని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం, బ్లూకోట్స్, నైట్డ్యూటీలు, మెడికల్ డ్యూటీలు, వెహికిల్ చెకింగ్, క్రైమ్, ఎస్కార్ట్, ట్రాఫిక్, బందోబస్తు వంటి అన్ని విధులు పురుషులతో సమానంగా నిర్వర్తించాలని సూచించారు. మహిళా సిబ్బందికి డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
శ్రీరాంపూర్: పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ తెలిపారు. శుక్రవారం ఆమె శ్రీరాంపూర్ పోలీస్స్టేషన్ను సందర్శించారు. రిసెప్షన్ సెంటర్, లాకప్, స్టేషన్ గదులు, బ్యారెక్స్, టెక్నికల్ రూం, పరిసరాలు పరిశీలించారు.
దుర్గాదేవి ఆలయంలో పూజలు
మంచిర్యాలక్రైం: మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఏసీసీ క్వారీ దుర్గాదేవి ఆలయంలో దుర్గామాతను అకాడమీ డైరెక్టర్ అభిలాష్బిస్త్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి శేషవస్త్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో డీసీపీ భాస్కర్, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు ప్రమోద్రావు, అశోక్కుమార్, ఎస్సైలు సంతోష్, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.
- ● నేడు సీనియారిటీ జాబితా ప్రదర్శన
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. టీచర్ల సీనియార్టీ జాబితా వడపోత కార్యక్రమంలో అధికార యంత్రాంగం తలమునకలైంది. ఎస్జీటీలతోపాటు భాషా పండితుల్లో అర్హులైన సీనియర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, భాషా పండితులకు గ్రేడ్–1 పదోన్నతులు లభించనున్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు సీనియార్టీ ప్రకారం పీజీహెచ్ఎంలుగా అవకాశం రానుంది. పదోన్నతుల సీనియార్టీ జాబితా తయారీకి డీఈవో యాదయ్య నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఎంఈవో, పీజీహెచ్ఎం, కంప్యూటర్ సహాయకులు ఇందులో ఉన్నారు. ఒక్కో పదోన్నతికి ముగ్గురి(1ః3) పేర్లు సూచించనున్నారు. జీహెచ్ఎంల సీనియార్టీ జాబితాను ఆర్జేడీ కార్యాలయానికి పంపించనున్నారు. జిల్లాలో 25మంది వరకు స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్ఎంలుగా, సీనియర్ ఎస్జీటీల్లో 100 నుంచి 110మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. సోషల్, బయోలజీ విభాగాల్లో ఎక్కువ మందికి అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. పదోన్నతుల సీనియార్టీ జాబితాను శనివారం ప్రదర్శించనున్నారు. జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లతో ఉపాధ్యాయుల ఖాళీల జాబితా అటుఇటుగా మారే అవకాశాలున్నాయి.
కేటగిరీ వారీగా ఖాళీలు
పోసు లోకల్బాడీ ప్రభుత్వ ఖాళీలు
పాఠశాల
జీహెచ్ఎం 25 2 27
పీఎస్హెచ్ఎం 26 01 27
బయోసైన్స్ 12 03 15
ఇంగ్లిష్ 06 03 09
హిందీ 15 01 16
సోషల్ 23 04 27
తెలుగు 15 01 16
- ● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
జైపూర్: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపల్లిలో పల్లె దవాఖాన, కుందారం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్లు, ఆస్పత్రి పరిసరాలు పరిశీలించారు. రోగులకు పరీక్షలు, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని తెలిపారు. జైపూర్, గంగిపల్లిలో పల్లె దవాఖానలో విధులకు గైర్హాజరైన వైద్యులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గంగిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలించారు. జైపూర్లో కస్తూర్భాగాంఽధీ విద్యాలయాన్ని సందర్శించారు. వంటశాల, మరుగుదొడ్లు, తరగతి గదులు, పరిసరాలతోపాటు అదనపు భవన నిర్మాణ పనులు పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యంశాలు బోధించి వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి వారి పఠనా సామర్థ్యాలను తెలుసుకున్నారు. స్థానిక గురుకులాలను సందర్శించి పలు సూచనలు చేశారు.
వైద్యులు సమయపాలన పాటించాలి
మంచిర్యాలటౌన్/మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందించడంతోపాటు వైద్యులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు, పరీక్షలపై అవగాహన కల్పించాలని సూచించారు. పోషకాహార లోపం, రక్తహీనత ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి ఆరోగ్య స్థితి సాధారణ స్థితికి వచ్చేలా, సాధారణ ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంచిర్యాలలోని కేజీబీవీని సందర్శించి అదనపు గదుల నిర్మాణంపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అమలవుతుందా అని అడిగి తెలుసుకున్నారు.
- ● జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు ● ఈ నెల 7వరకు కార్యక్రమాలు
జిల్లా వివరాలుమంచిర్యాలటౌన్: జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా శిశు, మహిళా, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలింతలు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తల్లిపాల ప్రాముఖ్యతను చాటేలా ఈ నెల 7వరకు వారోత్సవాలు నిర్వహిస్తారు. పుట్టినప్పటి నుంచే బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే ముర్రుపాలను కచ్చితంగా శిశువుకు పట్టాలి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందుతాయి. సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. ఈ పాలల్లో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరు నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. తల్లిపాల వారోత్సవాలపై ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లతో జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ఖాన్ సమావేశం నిర్వహించారు. తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బాలింతలు తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
అంగన్వాడీకేంద్రాలు : 976
బాలింతలు : 3,889
గర్భిణులు : 3,328
చిన్నారులు : 29,916