ఉప్పల్.. ఉర్రూతల్
అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం
సాక్షి, సిటీబ్యూరో:
మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొ న్నా రు. అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి వచ్చా రు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం ను ంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు. వీవీఐపీలు, ఫుట్బాల్ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది.
మ్యూజిక్.. మ్యాజిక్..
ఫుట్బాల్ మ్యాచ్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్ సిప్లీగంజ్, గాయని మంగ్లీ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఆస్కార్ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్ సాంగ్స్ తో మంగ్లీ మెస్మరైజింగ్ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు.
ఫలించిన పోలీసుల వ్యూహం..
ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్, పాస్లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. కాగా.. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుధీర్ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్ను ధరించి వెళ్లడం కనిపించింది.
మెస్సీ పర్యటన సాగిందిలా..
సాయంత్రం 4:35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన మెస్సీ
5:28: ఫలక్నుమా ప్యాలెస్కు రాక
● 7:31: ఫలక్నుమా నుంచి ఉప్పల్కు..
● రాత్రి 8.33 పెనాల్టీ షూట్ అవుట్
● 8.38: మైదానంలో మెస్సీ పరేడ్ వాక్.. పాల్గొన్న రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడాకారులు
● 8.48 : వేదికపై మెస్సీతో ప్రముఖుల పరిచయం
● 8.51: మెస్సీతో ఫొటో సెషన్
● 8.53 ముగిసిన మ్యాచ్.. విజేతకు బహుమతి ప్రదానం చేసిన మెస్సీ
● 8.54: మెస్సీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన సత్కారం
● 8.55– ఇతర క్రీడాకారులకు సన్మానం, కార్యక్రమం ముగింపు
● 9:26: తాజ్ ఫలక్నుమాకు చేరుకున్న మెస్సీ.
ఉప్పల్ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానులు
స్టేడియంలో లేజర్ షో వెలుగు జిలుగులు
మెస్సీ, సీఎం ఫ్రెండ్లీ మ్యాచ్ దిగ్విజయం
ఫుట్బాల్ ఆటతో అలరించిన ద్వయం
ప్రేక్షకుల ఉత్సాహంతో ఆద్యంతం కోలాహలం
ఉప్పల్.. ఉర్రూతల్
ఉప్పల్.. ఉర్రూతల్
ఉప్పల్.. ఉర్రూతల్
ఉప్పల్.. ఉర్రూతల్


