-
Jetty Movie: ఒక ఊరిలో జరిగిన కథ
నందితా శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి నటించిన చిత్రం ‘జెట్టి’. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో వేణుమాధవ్ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ లోగోని లాంచ్ చేశారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ –‘‘కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకార కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ.. ఆ గోడ పేరే జెట్టి. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్య్సకారులున్న ఒక ఊరిలో జరిగిన కథ ఇది. మత్స్యకారుల జీవన శైలి, వారి కట్టుబాట్లతో తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం. మా చిత్రంలో సిద్ శ్రీరాం పాడిన పాట హైలెట్గా ఉంటుంది.. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొండకండ్ల. -
గ్యాంగ్ వార్
అలీ ప్రధాన పాత్రలో ధన్రాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య తారాగణంగా ఎస్. శ్యామ్ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగుపడుద్ది’. కిషోర్ రాఠి సమర్పణలో మనీషా అర్డ్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహేష్ రాఠి నిర్మించిన ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. ధన్రాజ్ మాట్లాడుతూ– ‘‘మనీషా బ్యానర్లో బ్లాక్బస్టర్ హిట్ అయిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఫేమస్ అయిన రంగు పడుద్ది డైలాగ్నే ఇప్పుడు టైటిల్గా పెట్టి ఇదే బ్యానర్లో సినిమా చేశారు. ‘యమలీల’ చిత్రంలోని ‘చినుకు చినుకు..’ పాటను అప్పారావు, హీరోయిన్ హీనల మధ్య రీ క్రియేట్ చేశారు. శ్యామ్ప్రసాద్గారి దర్శకత్వంలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘చాలాకాలం తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే మా చిత్రకథాంశం. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్యామ్ప్రసాద్. ‘‘ఈ సమ్మర్ వెకేషన్కు అవుట్ అండ్ అవుట్ కూల్ కామెడీ చిత్రం అవుతుంది’’ అన్నారు మహేశ్. -
ఖమ్మంలో ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా?’
సాక్షి, ఖమ్మం మయూరి సెంటర్: సిరి క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా? చిత్ర బృందం సోమవారం నగరంలో సందడి చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు ఖమ్మం నగరంలో సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. సిరి, షాలిని, ఇమ్రాన్, హరి హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ సినీ నటులు కోటా శంకర్రావు, నామాల మూర్తి, సుమన్శెట్టి, పటాస్ ప్రకాశ్, జబర్దస్త్ నటులు చిత్రంలో నటిస్తున్నట్లు దర్శకుడు సమిర్నాని తెలిపారు. ఖమ్మం, పాలేరు, కిన్నెరసాని, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సినిమాకు అవసరమైన ప్రదేశాలు ఉన్నాయని, షూటింగ్కు అనూకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరువు హత్యల నేపథ్యంలో ప్రేమిస్తే ప్రాణం తీస్తారా? సినిమాను తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో పలు సన్నివేశాలను చిత్రికరించినట్లు తెలిపారు. ఈ సినిమాకు కెమెరామెన్గా శివరాథోడ్, సంగీత దర్శకుడిగా ఏఆర్ సన్నీ, ఎడిటర్గా సుబ్రహ్మణ్యరాజు, అసిస్టెంట్ డైరెక్టర్గా సరిత కనపత్తి, కోడైరెక్టర్గా దిలీప్ రామగిరి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. చిత్రానికి సంబంధించిన ఆడియో ఫిబ్రవరి మొదటి వారంలో జీవీకే–4 ద్వారా విడుదలవుతుందని వివరించారు. -
నవ్వించడం ఓ వరం
సింహాచలం (పెందుర్తి) : హాస్య నటిగా గుర్తింపు పొందడం ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తానని గీతాసింగ్ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం హాస్యనటులు సుమన్శెట్టి, చిట్టిబాబు, జబర్దస్త్ టీం లీడర్ ఆనంద్లతో కలిసి ఆమె దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తేజ తీసిన జై సినిమాతో సినీ రంగప్రవేశం చేశానన్నారు. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమాలో నటించానన్నారు. హీరో నరేష్ సిమాలో ప్రస్తుతం నటిస్తున్నాన్నారు. మరికొన్ని సినిమాల్లో చాన్స్లు వస్తున్నాయని, స్టోరీలు వింటున్నానన్నారు. కితకితలు సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. సుమన్శెట్టితో తాను ఒక రియాల్టీ షో చేస్తున్నాని వచ్చే నెలలో ఆ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. నెగిటివ్ రోల్స్ ఇష్టం : సుమన్శెట్టి నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టమని సినీ నటుడు సుమన్శెట్టి తెలిపారు. తెలుగులో జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యానన్నారు. 7జి బృందావనం కాలనీ, రణం, యజ్ఞం తదితర సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం అనుకోకుండా ఒక రాజకుమారుడు సినిమాలో నటిస్తున్నాన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బోజ్పురి భాషల్లో ఇప్పటి వరకు భాషల్లో కలిపి 290 సనిమాల్లో నటించానన్నారు. పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్ పూర్ణామార్కెట్ అని పేర్కొన్నారు. -
గోవాలో రాజకుమారుడు
నవీన్బాబు హీరోగా సంజన, అమృత హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. హాస్యనటుడు సుమన్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షెరాజ్ దర్శకత్వంలో రమాదేవి సమర్పణలో పీవీ రాఘవులు నిర్మిస్తోన్న ఈ చిత్రం గోవాలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షెరాజ్ మాట్లాడుతూ – ‘‘లవ్, కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. గోవా నేపథ్యంలో కథ ఉంటుంది. త్వరలో హైదరాబాద్లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టి, పాటలు, మిగతా సన్నివేశాలు పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా–ఎడిటింగ్: ఏకరీ లక్కీ, సంగీతం–స్క్రీన్ప్లే–దర్శకత్వం: షెరాజ్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement