Archive Page | Sakshi
Sakshi News home page

Medak

  • బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
    ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

    మెదక్‌ మున్సిపాలిటీ: బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్‌ ముస్కాన్‌ నెల రోజుల వ్యవధిలో జిల్లాలో అన్నిశాఖల సమన్వయంతో దిగ్విజయంగా కొనసాగిందని తెలిపారు. 140 మంది పిల్లలను రెస్క్యూ చేసి సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించామన్నారు. జిల్లాలో హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులు, సంరక్షణ గృహాలకు చేర్చి యజమానులపై తగిన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 140 మంది బాలలను రక్షించి 90 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్‌తో పాటు ఇతర పోలీస్‌ అధికారులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

  • డెమో ద్వారా గెస్ట్‌ టీచర్ల ఎంపిక

    కౌడిపల్లి(నర్సాపూర్‌): ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో గెస్ట్‌ ఉపాధ్యాయులు, లెక్చరర్లను డెమో క్లాస్‌ల ద్వారా ఎంపిక చేస్తున్నట్లు ఆర్‌సీఓ గౌతంకుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకున్న గెస్ట్‌ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు నిర్వహిస్తున్న డెమో క్లాస్‌లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వివిధ ఎంజేపీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టులను గెస్ట్‌ ఉపాధ్యాయులుతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డెమో నిర్వహించి ఉత్తమ బోధన, ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ హరిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    ఎంజేపీ ఉమ్మడి జిల్లా ఆర్‌సీఓ గౌతంకుమార్‌రెడ్డి

  • బాల్య వివాహాలు  జరిపిస్తే చర్యలు

    వెల్దుర్తి(తూప్రాన్‌): బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మాధవి హెచ్చరించారు. మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో గురువారం ఓ మైనర్‌ బాలిక నిశ్చితార్థ వేడుకలను పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలికకు చిట్టోజిపల్లికి చెందిన ఓ యువకుడితో కుటుంబసభ్యులు ఇటీవల పెళ్లి సంబంధం నిశ్చయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మాధవి, వెల్దుర్తి పోలీసులు, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలతో సంఘటనా స్థలానికి చేరుకొని నిశ్చితార్థ వేడుకలను అడ్డుకున్నారు. మైనర్‌ బాలికలకు వివాహం జరిపించడం వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి జరిపిస్తామని, అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని బాలిక తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా హామీని తీసుకున్నారు.

Rangareddy

  • పాలమూరు పూర్తి చేస్తాం

    పరిగి: ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేపట్టిన జనహిత పాదయత్ర గురువారం పరిగి మండలం రంగాపూర్‌ నుంచి పరిగి పట్టణం వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేసిందన్నారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ బిల్లును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై కేంద్రంతో కొట్లాడేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పరిగి ప్రాంతం రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

    సంక్షేమంలో మనమే ఆదర్శం

    సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటుతుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. పట్టణంలో జనహిత పాదయాత్ర అట్టహాసంగా సాగింది. కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. పాదయాత్రలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్‌, పార్టీ జిల్లా, మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, మండల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం పనిచేస్తుంది

    పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకుంటాం

    గత ప్రభుత్వమే ‘ప్రాణహిత– చేవెళ్ల’ను రద్దు చేసింది

    జనహిత పాదయాత్రలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

  • జనహిత

    చేవెళ్ల/మొయినాబాద్‌: వికారాబాద్‌ జిల్లా పరిగి నుంచి ప్రారంభించే జనహిత పాదయాత్రకు వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పార్టీ శ్రేణులు మొయినాబాద్‌లో ఘన స్వాగతం పలికాయి. హిమాయత్‌నగర్‌ చౌరస్తాకు చేరుకోగానే పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. అక్కడే ఉన్న అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాలకు మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌, శ్రీధర్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారికి భారీ గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, టీపీసీసీ సభ్యు డు షాబాద్‌ దర్శన్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్‌, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

    చిలుకూరులో పూజలు

    చిలుకూరు బాలాజీ దేవాలయంలో మీనాక్షి నటరాజన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు హన్మంతరావు, రాజయ్య తదితరులతో కలిసి ఆమె ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించు కున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, అర్చకుడు సురేష్‌స్వామి ఆమెకు స్వామివారి పూలమాలలు అందజేసి ఆశీర్వదించారు.

    చేవెళ్లలో పామెన బీంభరత్‌ ఆధ్వర్యంలో..

    కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు చేవెళ్లలో పామెన భీంభరత్‌ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాబాద్‌ చౌరస్తాలోని ఇందిరాగాంధీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకుడు గౌరీ సతీష్‌, మహిళా నాయకురాలు జ్యోతిభీంభరత్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జూకన్నగారి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    వర్గపోరు మరోసారి బట్టబయలు

    పార్టీలో వర్గపోరు కొనసాగుతుందని మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గం ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ మద్య సయోధ్య లేకపోవటంతో ఇరు వర్గీయులు వేర్వేరుగా స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు.

    మొయినాబాద్‌లో

    ఆహ్వానం పలికిన పార్టీ శ్రేణులు

    చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు చేసి పాదయాత్రకు

    బయలుదేరిన నేతలు

  • ఫార్మాసిటీలో మరోసారి సర్వే

    యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో అధికారులు మరోసారి సర్వేకు సిద్ధం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. రెండు నెలల క్రితం ఫార్మాసిటీ బౌండరీని సర్వే చేసి, ఫెన్సింగ్‌ పనులు పూర్తి చేశారు. తాజాగా గురువారం బౌండరీ లోపల హద్దులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో సర్వే నంబర్ల వారీగా గుర్తించే పనులను మొదలుపెట్టారు. గ్రామంలోని పలు అసైన్డ్‌, పట్టా భూముల సర్వేనంబర్ల వారీగా ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు పరిహారం అందజేశామనే వివరాలతో కూడిన రికార్డుల ప్రకారం హద్దులు గుర్తిస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ భూముల వద్దకు రావద్దని అడ్డుకున్నారు.

    అభ్యంతరం చెప్పడం సరికాదు

    నిర్వాసితులకు పరిహారంతో పాటు తాజాగా మీరాఖాన్‌పేటలోని టీజీఐఐసీ వెంచర్‌లో లాటరీ తీసి ప్లాట్ల కబ్జాలు ఇచ్చామని ఆర్డీఓ అనంత్‌రెడ్డి తెలిపారు. అయినా రైతులు అభ్యంతరం తెలపడం సరికాదని అన్నారు. పరిహారం అందజేసిన, రికార్డులు మారిన భూములన్నీ సర్కార్‌వేనని, ఆ భూముల్లోకి ఎవరూ రావొద్దని సూచించారు. కోర్టు కేసులున్న భూముల్లోకి వెళ్లమని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వే చేస్తున్న భూముల వద్దకు రైతులెవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

    సర్వేనంబర్ల వారీగా భూమి గుర్తింపు

    అడ్డుకున్న నక్కర్తమేడిపల్లి రైతులు

    ఉద్రిక్త వాతావరణం

    భారీ పోలీసు బందోబస్తు

    బందోబస్తు మధ్య ఫార్మా ఫెన్సింగ్‌

    కందుకూరు: ఫార్మాసిటీ కోసం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్‌ 123కు సంబంధించి గురువారం అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఫెన్సింగ్‌ పనులు చేపట్టారు. దీంతో సర్వే నంబర్‌ను ఆనుకుని ఉన్న దెబ్బడగూడ రెవెన్యూ సర్వే నంబర్‌ 31లోని గిరిజన రైతులు పనులను అడ్డుకున్నారు. తమ భూమిలోకి జరిపి ఫెన్సింగ్‌ ఎలా వేస్తారంటూ నిలదీశారు. సర్వే చేసిన తర్వాతే ఫెన్సింగ్‌ వేసుకోవాలని పట్టుబట్టారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ గోపాల్‌, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకీరెడ్డి, సీఐ సీతారాం రైతులతో మాట్లాడారు. పది రోజుల్లో దెబ్బడగూడ సర్వే నంబర్‌ 31ని సర్వే చేయిస్తామని, అప్పటి వరకు ఫెన్సింగ్‌ పనులు ఆపొద్దని అన్నారు. భూమి మీకు వస్తే తిరిగి ఇచ్చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

  • పెండింగ్‌ దరఖాస్తులు పరిశీలించండి
    ● ఇందిరమ్మ ఇళ్ల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను నియమించాలి ● వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి ● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డి

    సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం కోసం మండల స్థాయి లో ప్రత్యేక బృందాలను నియమించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురు వారం క్యాంప్‌ కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశుద్ధ్యం, వనమహోత్సవం వంటి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఖాళీ స్థలం ఉండి, ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు మంజూరు ఇవ్వాలని, గతంలో రుణాలు తీసుకుని, ప్రస్తుతం అర్హులుగా ఉన్న వారికి అవగాహన కల్పించాలని, పీఎం ఆవాస్‌ యోజన కింద అర్హులైన వారందరి పేర్లను వెంటనే నమోదు చేయాలని సూచించారు.

    ఎరువుల కొరత రానివ్వొద్దు

    వర్షాకాలం నేపథ్యంలో ఆయా మండల కేంద్రాల్లోని గోదాముల్లో అవసరమైన యూరియా ఎరువులు వంద శాతం అందుబాటులో నిల్వ ఉండేలా చూసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. ఎక్కడా కొరత లేకుండా, రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి రావొద్దని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి సమస్య వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. నాణ్యమైన ఆహారం, తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చూడాలని, తాగునీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని, అందుకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్లలో కూరగాయలు నిల్వ చేయకుండా రెండ్రోజులకు ఒకసారి తెచ్చుకోవాలని, వంట గదిని పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆయా ఎంఈఓలు పర్యవేక్షించాలన్నారు.

    లక్ష్యం మేర మొక్కలు నాటాలి

    వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, ప్రత్యేకించి ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు నాటాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పల్లె ప్రకృతి వనాల్లో వంద శాతం నాటాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున సరైన సమయంలో మొక్కలు నాటేలా చూడాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ సూచించారు.

  • చిరుత చిక్కింది

    మణికొండ: కొద్దిరోజులుగా భయభ్రాంతులకు గురిచేసిన చిరుత పులి ఎట్టకేలకు మంచిరేవుల ట్రెక్‌పార్కులోనే బోన్‌లో చిక్కింది. జూలై 7వ తేదీన మొయినాబాద్‌ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌ వనమూళిక వనం నుంచి మొదలైన దాని ప్రస్థానం పోలీస్‌ గ్రేహౌండ్స్‌, ట్రెక్‌ పార్కు, రాందేవ్‌గూడ మిలిటరీ ఏరియా, తిరిగి ట్రెక్‌ పార్కుకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక ఆకలితో మేకను తినేందుకు బోనులోకి దూరి బందీ అయ్యింది. ప్రతి రోజూ మాదిరిగానే ఉదయం సిబ్బంది బోనులను తనిఖీ చేస్తున్న క్రమంలో ఒకదాంట్లో చిరుత గాండ్రింపులు విని భయాందోళన చెందారు. అంతలోనే తేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి బోను చుట్టూరా పరదాలను కట్టి నగరంలోని జూపార్కుకు తరలించారు. అక్కడ దాని గాయా లకు చికిత్సతో పాటు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి పెట్టినట్టు జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, చిలుకూరు రేంజ్‌ అధికారి లక్ష్మణ్‌ తెలిపారు.

    చిరుత మూతికి గాయం

    బోనులో చిక్కుకున్న చిరుత అందులోనుంచి బయటికి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దాని మూతి బోను ఇనుప చువ్వలకు తాకడంతో గాయమైంది. బోనులో చిక్కుకున్న భయంలో అది అందులో ఏర్పాటు చేసిన మేకను సైతం తినకుండా ఉండిపోయింది. చిరుత వయసు సుమారు 5 ఏళ్లు ఉంటాయని, యుక్త వయసులో ఉండటంతో పెద్దగా గాండ్రించటం, బెదిరించటం చేసిందని అటవీ అధికారులు తెలిపారు. చిరుతపులి ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిందనే విషయాన్ని తెలుసుకున్న మంచిరేవుల, గంధంగూడ, బైరాగిగూడ, నార్సింగి, కోకాపేట, రాందేవ్‌గూడ, ఇబ్రహీంబాగ్‌ తదితర గ్రామాల ప్రజలు దాన్ని చూసేందుకు ట్రెక్‌ పార్కు వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం నుంచి యథావిధిగా ట్రెక్‌ పార్కును తెరుస్తామని, వాకింగ్‌ చేసేవారు రావచ్చని అధికారులు తెలిపారు.

    ట్రెక్‌ పార్కులోనే బోన్‌లోకి వచ్చి..

    ఉదయం గమనించిన సిబ్బంది

    తొలుత జూపార్క్‌కు తరలింపు

    అక్కడి నుంచి నల్లమల అడవుల్లోకి..

    నేటి నుంచి తెరుచుకోనున్న ట్రెక్‌ పార్కు

  • పారిశుద్ధ్య కార్యక్రమం విజయవంతం చేయాలి

    గచ్చిబౌలి: వర్షాకాల పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సూచించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో ఉదయం వర్షాకాలం పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని జోనల్‌ కమిషనర్‌ బోర్కడే హేమంత్‌ సహదేవ్‌రావుతో కలిసి తనిఖీ చేశారు. మొదట మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో తనిఖీలు చేశారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కాలనీల్లో పరిశుభ్రతా చర్యలు ప్రభావవంతంగా చేపట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌, స్థానిక అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను సమీక్షించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య పనులను వేగంగా చేపట్టాలన్నారు.

  • గోల్కొండ రోప్‌వే పై సాంకేతిక అధ్యయనం

    సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ టూంబ్స్‌ నుంచి కోట వరకు ప్రతిపాదించిన రోప్‌వేపై గురువారం హెచ్‌ఎండీఏలో ప్రీబిడ్డింగ్‌ సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. సుమారు 1.5 కి.మీ మార్గంలో నిర్మించనున్న రోప్‌వే కోసం ఇప్పటికే రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) టెండర్‌లను ఆహ్వానించారు. ఆసక్తిగల కన్సల్టెన్సీ సంస్థలు ఈ నెల 6 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే గురువారం ప్రీబిడ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్‌ఎఫ్‌పీ బిడ్డింగ్‌ కోసం కోసం దరఖాస్తు చేసుకున్న పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిడ్డింగ్‌ గడువును పెంచాలని పలువురు ప్రతినిధులు హెచ్‌ఎండీఏ అధికారులను కోరారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుపై మరింత అవగాహన అవసరమని, అందుకోసం బిడ్డింగ్‌ గడువును పెంచాలని అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం.

    ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..

    నిత్యం వేలాది మంది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే చారిత్రక గోల్కొండ కోటను, టూంబ్స్‌ను కలిపేలా నిర్మించనున్న రోప్‌వే ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రూ.100 కోట్ల అంచనాలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోప్‌వేలు, స్కైవేలపై విస్తృత అధ్యయనం చేస్తున్న హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలోని కుతుబ్‌షాహీల సమాధుల వరకు రోప్‌వే కోసం ఇప్పటికే ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సైతం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్‌ఎఫ్‌పీ బిడ్డింగ్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. రోప్‌వేకు అనుకూలమైన మార్గాన్ని నిర్ధారించడంతో పాటు, రక్షణశాఖ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమనే అంశంపైనా ఎంపికై న కన్సల్టెన్సీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వివిధ దేశాల్లో రోప్‌వేలు, కేబుల్‌ కార్ల నిర్వహణపైనా అధ్యయనం చేసి హెచ్‌ఎండీఏకు నివేదికను అందజేయాల్సి ఉంటుంది.

    కేబుల్‌ కారులో సందర్శన..

    గోల్కొండ కోట నుంచి పర్యాటకులు రోడ్డు మార్గంలో టూంబ్స్‌ వరకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఇరుకై న రోడ్డు, వాహనాల రద్దీ దృష్ట్యా చాలామంది గోల్కొండ కోట నుంచి టూంబ్స్‌ వరకు వెళ్లకుండానే వెనుదిరుగుతున్నట్లు అంచనా. ఈ క్రమంలో పర్యాటకుల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు రోప్‌వే ద్వారా కేబుల్‌ కార్లలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 10 వేల మందికిపైగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీరిలో 3000 మంది వరకు విదేశీ టూరిస్టులు ఉంటారని అంచనా. రోప్‌వేను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పర్యాటకులకు మెరుగైన సదుపాయం కల్పించినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు.

    ఆర్‌ఎఫ్‌పీ కోసం ఈ నెల 6 వరకు బిడ్డింగ్‌

    ప్రీ బిడ్డింగ్‌ సమావేశంలో పాల్గొన్న పలు సంస్థలు

    రూ.100 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు

  • పన్నెండేళ్లకు పచ్చజెండా!

    సాక్షి, సిటీబ్యూరో: పుష్కరకాలం నాటి ప్రతిపాదనలు తిరిగి పట్టాలకెక్కనున్నాయి. హైదరాబాద్‌– సికింద్రాబాద్‌లను కలిపే బేగంపేట్‌ రోడ్‌– రాణిగంజ్‌ క్రాస్‌రోడ్స్‌ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎస్‌పీ రోడ్‌ –నెక్లెస్‌ రోడ్‌ను కలుపుతూ పాటిగడ్డ మీదుగా ఆర్‌ఓబీ (ఫ్లై ఓవర్‌) ప్రాధాన్యతతో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ, దక్షిణమధ్య రైల్వే అంగీకారానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 కోట్లు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు.

    సమన్వయం, సహకారం లోపంతో..

    ● ఇక్కడి ఆర్‌ఓబీ ప్రతిపాదన ఈనాటిది కాదు. నగరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కావడాని కంటే ఎంతోకాలం ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, సహకార లోపంతో కాగితాలు దాటి పనులు మొదలు కాలేదు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే బేగంపేట వైపు నుంచి ఖైరతాబాద్‌, సెక్రటేరియట్‌ల వైపు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. సెక్రటేరియట్‌– ట్యాంక్‌బండ్‌– ప్యారడైజ్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. అప్పటి అంచనా వ్యయం రూ.25 కోట్లు ప్రస్తుతం రూ. 80 కోట్లయింది.

    ● ఈ ఫ్లైఓవర్‌ పనులు పూర్తయితే అటు ఎస్‌పీ రోడ్‌, ఇటు ఎంజీ రోడ్‌లోనూ ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అప్పట్లోనే రైల్వే శాఖ నుంచి అనుమతులున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాదాపు 7.5 మీటర్లుండే ఫ్లై ఓవర్‌పై రెండు వైపులా క్యారేజ్‌వేలతోపాటు ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ మీడియన్‌లు గత ప్రతిపాదనల్లో ఉన్నాయి. అవసరమైతే మార్పుచేర్పులు చేయనున్నారు.

    ఫ్లైఓవర్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఇలా..

    2009లో ఉమ్టా సమావేశంలో ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ చెరిసగం భరించాలని, పనులు హెచ్‌ఎండీఏ చేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిన నిధులు జీహెచ్‌ఎంసీ ఇవ్వలేదు. హెచ్‌ఎండీఏ సైతం నిధులివ్వలేమని, ప్రాజెక్టు పని చేయలేమని, పనుల్ని జీహెచ్‌ఎంసీకి బదలాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం మెగాసిటీ ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలనుకున్నారు. ఏదీ కాలేదు. బేగంపేట, ఎంజీరోడ్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే అటు బేగంపేట, ఇటుఎంజీ రోడ్లలో రద్దీ తగ్గనున్నందున మెహిదీపట్నం– సికింద్రాబాద్‌ రాకపోకల సమయం సైతం తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు.

    బేగంపేట్‌లో తప్పనున్న ట్రాఫిక్‌ చిక్కులు

    త్వరలో పాటిగడ్డ– నెక్లెస్‌ రోడ్డు ఆర్‌ఓబీ పనులు

    పుష్కర కాలం నాటి ప్రతిపాదనలకు మోక్షం

    ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 కోట్లు

  • ‘జనహిత’లో నేతల సందడి

    మహేశ్వరం: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్రలో భాగంగా పరిగిలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి గురువారం కలిసి స్వాగతం పలికారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పీసీసీ చీఫ్‌ నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ప్రతి కార్యకర్త తీసుకెళ్లాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దిశానిర్దేశం చేశారు.

    తరలిన కాంగ్రెస్‌ నాయకులు

    కందుకూరు: టీపీసీసీ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రలో గురువారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి కేఎల్‌ఆర్‌ ఆధ్వర్యంలో నాయకులు తరలి వెళ్లారు. కందుకూరు నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, సీనియర్‌ నాయకులు సత్యనారాయణ, గణేష్‌నాయక్‌, మదన్‌పాల్‌రెడ్డి, బాబురావు, కృష్ణ, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కూతురి పెళ్లికి దాచితే.. దోచేశారు!

    నందిగామ: కూతురి పెళ్లి కోసం దాచిన నగదు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని మండలంలోని మామిడిపల్లికి చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించినా స్పందన కరువైందని లబోదిబోమన్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య కొందుర్గు మండలంలోని మహదేవ్‌పూర్‌లో ఉన్న భూమిని గతంలో విక్రయించాడు. వచ్చిన డబ్బులతో కొంత అవసరాల కోసం వాడుకున్నాడు. కూతురుకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో 16 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి, రూ.15 లక్షల నగదును ఇంట్లో భద్రపరిచాడు. ఇటీవల రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి ఫోన్‌ రావడంతో ఇంట్లో చూడగా నగదు, బంగారం కనబడకపోవడంతో లబోదిబోమన్నాడు. డబ్బులు, పసిడి దోచుకుపోయిన విషయమై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చర్చించాడు. ఎక్కడ నుంచి కనీస సమాచారం లేక పోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ చేశారు. గురువారం తిరిగి బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో సజ్జపై దాచిన డబ్బులను తెలిసిన వారే దోచుకుపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    కేసు నమోదు చేయని పోలీసులు

    మామిడిపల్లిలో ఇంత పెద్ద చోరీ జరిగినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ను వివరణ కోరగా.. బాధితులను విచారించామని, ఏసీపీ శుక్రవారం వస్తారని, మరోసారి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు.

    మామిడిపల్లిలో భారీ చోరీ

    రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారం అపహరణ

  • జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఓ నమూనా

    హైడ్రా కృషిని అభినందించిన కేంద్ర బృందం

    సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ) అధికారుల బృందం గురువారం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించింది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ఈ ప్రాంతం చెరువులా రూపాంతరం చెందిన పాత చిత్రాలను చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు. చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఒక నమూనా అవుతుందని బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడిషనల్‌ చీఫ్‌ టౌన్‌ ప్లానర్‌ మోనీస్‌ ఖాన్‌ పేర్కొన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి, మండు వేసవిలో రెండు మీటర్ల లోతు నీరు ఉబికి వచ్చే వీడియోలను చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. హైడ్రా కృషిని అభినందించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాల్వలోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్‌లెట్‌ను నిర్మించడంపై హర్షం వెలిబుచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియాల ద్వారా హైడ్రా అధికారులు కేంద్ర బృందానికి చూపించారు. చెరువు ఔట్‌లెట్‌ను సైతం పరిశీలించారు. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అసోసియేట్‌ టౌన్‌ ప్లానర్‌ సందీప్‌ రావుతో పాటు.. హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్‌, విమోస్‌ టెక్నో క్రాట్‌ ఎండీ పి.యూనస్‌, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌ ప్రదీప్‌ కుమార్‌, సిటీ ప్లానర్‌ ఉమాదేవి తదితరులు కేంద్ర బృందంతో ఉన్నారు.

  • డీ అడిక్షన్‌ సెంటర్‌ సిబ్బందికి శిక్షణ

    చంచల్‌గూడ: మత్తు మందులు లేని సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖకు నషాముక్త భారత్‌ అభియాన్‌లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ శాఖ నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న డీ అడిక్షన్‌ సెంటర్లలో విధులు నిర్వహించేందుకు గత నెలలో కాంట్రాక్ట్‌ పద్దతిన 28 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న వారికి గురువారం చంచల్‌గూడలోని సీకా సంస్థలో శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ డీ అడిక్షన్‌ కేంద్రాల ద్వారా మత్తు పదార్థాలకు బానిసలైన ఖైదీలకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్‌, పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డీ అడిక్షన్‌ కేంద్రాల్లో ఉండే వారితో ఎలా మెలగాలో, వారిలో పరివర్తన ఏ విధంగా తీసుకురావాలి అనే అంశంపై సిబ్బంది అంటీ డ్రగ్స్‌, నార్కోటిక్‌, మానసిక వైద్య కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో ఐజీ మురళీబాబు, సీకా ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • పారిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగింత

    కుల్కచర్ల: చదవడం ఇష్టం లేక పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్కచర్ల గ్రామానికి చెందిన గుడిసె అఖిల్‌ ముజాహిద్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ స్థానికంగా బీసీ వసతిగృహంలో ఉంటున్నాడు. బుధవారం అతడు పాఠశాల సమయంలో బయటకు వచ్చి కుల్కచర్లకు వచ్చి బస్సులో షాద్‌నగర్‌ వెళ్లాడు. అక్కడ పోలీసులు బాలుడిని గమనించి వివరాలు అడిగారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడి చిరునామా తెలుసుకుని స్థానికుల ద్వారా కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. గురువారం ఉదయం ఎంఈఓ హబీబ్‌ అహ్మద్‌ సమక్షంలో అఖిల్‌ను కుటుంబీకులకు అప్పజెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సతీష్‌, వసతిగృహ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sangareddy

  • కొత్త కార్డులకూ సంక్షేమ పథకాలు!

    నారాయణఖేడ్‌: రాష్ట్రంలో ప్రస్తుతం నూతనంగా జారీ చేస్తున్న రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఆరోగ్యశ్రీతోపాటు అన్ని రకాల సంక్షేమ పథకాలను ఈ నూతన కార్డుదారులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణను రూపొందిస్తున్నారు. పథకాల అమలుతో జిల్లాలో నూతనంగా రేషన్‌ కార్డులు పొందిన వారందరికీ మేలు చేకూరనుంది. చాలా పథకాలు రేషన్‌కార్డులు లేకపోవడంతో లబ్ధి పొందలేకపోతున్నారు. దాదాపు అన్ని పథకాలకు రేషన్‌కార్డే ప్రామాణికం కావడంతో ఇన్నాళ్లూ కార్డులులేని వారు పలు పథకాలను పొందలేకపోయారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుంది. దీంతో జిల్లాలో రేషన్‌ కార్డుదారుల్లో సంతోషం నెలకొంది.

    అనుమతి పొందిన దరఖాస్తులు 56,324

    జిల్లాలో నూతనంగా రేషన్‌ కార్డుల కోసం 81,587మంది దరఖాస్తు చేసుకున్నట్లు డీఎస్‌ఓ అధికారులు తెలిపారు. ఇందులో 56,324 దరఖాస్తులు అనుమతి పొందగా...13,767 అప్లికేషన్లను తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇంకా 11,496 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాత రేషన్‌ కార్డులు 3,78,511కాగా, ఇందులో సభ్యులు 19,32,137 ఉన్నారని తెలిపారు. నూతనంగా మంజూరైన, మంజూరు కానున్న రేషన్‌కార్డు లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు అర్హులు కానున్నారు.

    రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేక విభాగం

    ప్రభుత్వం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం సేవలను రేషన్‌ కార్డుదారులకు రూ.10లక్షల వరకు పెంచి అవకాశం కల్పించింది. నూతన కార్డుదారులందరికీ ప్రథమంగా ఆరోగ్యశ్రీ సేవలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయియించింది. ఇందుకోసం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుని కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరైన వారి వివరాలతోపాటు పాతకార్డులో కొత్తగా చేరిన కుటుంబ సభ్యుల వివరాలను ఆరోగ్యశ్రీలో నమోదు చేస్తారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఉన్నతాధికారులకు ఆదేశించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున వీలైనంత త్వరగా రేషన్‌ కార్డుల పంపిణీ, ఆరోగ్యశ్రీ అనుసంధాన ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అనుసంధాన ప్రక్రియ పూర్తి కాగానే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ద్వారా నిబంధనల మేరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి.

    త్వరలో అమలుకు శ్రీకారం

    మొదట రాజీవ్‌ ఆరోగ్యశ్రీ.. తర్వాత అన్ని పథకాలూ వర్తింపు

    నమోదు కోసం ఇళ్లవద్దకే అధికారులు

    ఇతర పథకాలు కూడా..

    రాజీవ్‌ ఆరోగ్యశ్రీతోపాటు ఇతర పథకాలను కూడా కార్డుదారులకు అందించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీలను కొత్త రేషన్‌ కార్డులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని భావిస్తోంది. ఈ డ్రైవ్‌లో అధికారులే నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి వివరాలను నమోదు చేసుకుని అవసరమైన అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు పొందనున్నారు. కాగా, రేషన్‌ కార్డు స్థానంలో ప్రస్తుతం మంజూరు పత్రాలు జారీ చేయగా త్వరలో డిజైన్‌ను ఖరారు చేసి రేషన్‌ కార్డులను జారీ చేయనున్నారు.

Kamareddy

  • బియ్యం మింగిన మిల్లర్లు!

    సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సీఎంఆర్‌కు సంబంధించి బియ్యాన్ని మింగిన మిల్లర్ల నుంచి రికవరీ చేయడంలో సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పెండింగ్‌ బకాయిల రికవరీ కోసం కలెక్టర్‌ ఆశిష్‌సంగ్వాన్‌ అధికారులతో రివ్యూ చేస్తూ రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కొంత నిర్లక్ష్యం చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా నోటీసులు, ఆదేశాలంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అధికారుల అలసత్వాన్ని ఆసరా చేసుకుని బియ్యం మింగిన మిల్లర్లు నోటీసులను పెద్దగా లెక్కచేయడం లేదు. పైగా ఆ ఏమవుతుందిలే.. కేసులు పెడితే చూద్దామనే ధోరణితో కనిపిస్తున్నారు. కాగా చిన్న చిన్న కారణాలతో రేషన్‌ డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసే అధికారులు రూ.కోట్ల విలువైన బియ్యాన్ని మింగేసిన మిల్లర్లను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    బియ్యం విలువ రూ.104 కోట్లు

    సీఎంఆర్‌కు సంబంధించి బకాయిపడిన బియ్యం విలువ రూ.104 కోట్ల మేర ఉంటుందని అధికారులు ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తంలో మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడిగా ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా సొంతానికి వాడుకోవడం అంటే దుర్వినియోగం చేసినట్టే. మిల్లర్లకు రాజకీయ అండదండలు కూడా ఉండడంతో అధికారులు ధైర్యం చేయడం లేదని తెలుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా రికవరీ చేయకపోవడం అంటే ప్రభుత్వానికి నష్టం చేసినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు పెండింగ్‌ బకాయల రికవరీ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

    కాయిపడిన బియ్యానికి సంబంధించి డబ్బులు చెల్లించాలని బియ్యం బొక్కేసిన మిల్లర్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద రికవరీ చేయాలని ఆయా తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. అలాగే ఆయా మిల్లుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయాలని, ఆస్తుల మార్పిడి జరగకుండా చూడాలని సబ్‌ రిజిస్ట్రార్‌లకు ఆదేశాలిచ్చి చేతులుదులుపుకున్నారు. సీఎంఆర్‌కు సంబంధించిన బియ్యం ఇవ్వకుండా వాడేసుకున్న మిల్లర్ల నుంచి రికవరీ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అధికారులకే తెలియాలి.

    ఏళ్లు గడుస్తున్నా బియ్యాన్ని గానీ, బియ్యానికి సరిపడా డబ్బులు కానీ రికవరీ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. పెండింగ్‌ బకాయిలను రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

    ఆ మూడు సీజన్‌లలో..

    జిల్లాలో 2021–22 ఖరీఫ్‌ సీజన్‌లో 39 మిల్లులు 10,406 మెట్రిక్‌ టన్నులు, 2021–22 యాసంగిలో రెండు మిల్లులు 562 మెట్రిక్‌ టన్నులు, 2022–23 ఖరీఫ్‌ సీజన్‌లో 37 మిల్లులు 23,014 మెట్రిక్‌ టన్నుల బియ్యం బకాయపడ్డారు. మొత్తంగా 78 మిల్లుల నుంచి 34 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం రికవరీ చేయాల్సి ఉండగా, కేవలం 19 మిల్లుల నుంచి 13 వేల మెట్రిక్‌ టన్నులు రికవరీ చేశారు. ఇంకా 59 మిల్లుల నుంచి 20 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం రికవరీ చేయాల్సి ఉంది. బకాయిపడిన మిల్లర్లకు ఫైన్‌ కింద 25 శాతం అదనంగా అంటే 125 శాతం ఇవ్వాలని నిబంధనల ప్రకారం అంటే 28 వేల మెట్రిక్‌ టన్నులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా బియ్యం విలువ రూ.74.97 కోట్లు ఉందని, 25 శాతం అదనంగా అంటే రూ.104.27 కోట్లు బకాయ పడినట్టు స్పష్టమవుతోంది.

    నోటీసులతో కాలయాపన..

    రికవరీ చేయడంలో

    అధికారుల మీనమేషాలు

    మూడు సీజన్లలో కలిపి

    34 వేల మెట్రిక్‌ టన్నులు..

    రికవరీ చేసింది 13,365

    ఎంటీలు మాత్రమే..

    ఇంకా 20 వేల

    మెట్రిక్‌ టన్నుల బకాయి

  • తెయూక

    ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో నెంబరు 32 జారీ చేసింది. ప్రజలు, విద్యార్థులు, విద్యావంతుల నిరంతర పోరాటాలు ఎట్టకేలకు ఫలించాయి.

    తెయూ(డిచ్‌పల్లి): పదేళ్ల ఎదురు చూపులకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేయడం ఆనందంగా ఉందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం యాదగిరి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తెయూ పరిపాలనా భవనంలో మీడియాతో వారు మాట్లాడారు. గతంలో తాను వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్‌ కళాశాల ఇస్తానని స్వయంగా చెప్పారని, ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా జీవో నెంబర్‌ 32ను గురువారం జారీ చేసినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కళాశాల మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వీసీ పేర్కొన్నారు.

    మూడో విడత కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల భర్తీ

    ప్రస్తుతం ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ రెండో విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతున్నందున మూడో విడత కౌన్సెలింగ్‌లో తెయూ ఇంజనీరింగ్‌ కళాశాల పేరు చేర్చి సీట్ల భర్తీ చేపడతారని వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు.

    అందుబాటులో ఫ్యాకల్టీ, కాలేజ్‌ భవనం

    తెయూలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు ఇటీవలే రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన సైన్స్‌ కాలేజీ భవనం సిద్ధంగా ఉందని వీసీ తెలిపారు. అన్ని రకాల మౌలిక వసతులు, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు బోధించేందుకు రెగ్యులర్‌ ఫ్యాకల్టీ, ముగ్గురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు కాంట్రాక్టు అధ్యాపకులు అందుబాటులో ఉన్నారన్నారు. అవసరమైతే గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమిస్తామన్నారు.

    సీఎం చేతుల మీదుగా ప్రారంభం

    ఆగస్టు 15లోపు జిల్లా పర్యటనకు రానున్న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రారంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీసీ యాదగిరిరావు తెలిపారు. అలాగే వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు.

    సౌత్‌ క్యాంపస్‌లో సంబురాలు

    భిక్కనూరు: తెలంగాణ యునివర్సిటీకి ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు కావడాన్ని హర్షిస్తూ డాక్టరేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థు లు, అధ్యాపకులు గురువారం సౌత్‌ క్యాంపస్‌లో సంబురాలు జరుపుకున్నారు. ఎన్నో ఏళ్ల కల నేరవేరిందని అసోసియేషన్‌ అధ్యక్షుడు సంతోష్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వం ఇంజినీరింగ్‌ క ళాశాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బాణాసంచా కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకు న్నారు. ప్రిన్సిపాల్‌ సుధాకర్‌గౌడ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, అసోసియేషన్‌ ప్రతినిధులు రాహుల్‌ నేత, సరి త, సత్యం, రమేశ్‌, అధ్యాపకులు అంజయ్య, మోహన్‌బాబు, యాలాద్రి పాల్గొన్నారు.

    జీవో జారీ చేసిన ప్రభుత్వం

    నాలుగు కోర్సులకు అనుమతి

    మూడో విడత కౌన్సెలింగ్‌

    ద్వారా సీట్ల భర్తీ

    సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు

    వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు

  • గ్రామాల్లో పండగ వాతావరణం

    నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నూతన రేషన్‌కార్డుల పంపిణీతో గ్రామాల్లో నూతన పండగ వాతవరణం నెలకొందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. మండలంలోని గోపాల్‌పేట రైతువేదికలో లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులను కలెక్టర్‌ ఆశిష్‌సంగ్వాన్‌తో కలిసి ఎమ్మెల్యే గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌కార్డుల మంజూరుతో పేదల నిరీక్షణకు తెరపడిందన్నా రు. నూతన కార్డుల మంజూరు, పాత కార్డుల్లో పేర్ల నమోదుతో పేదలు ఆనందంగా ఉన్నార న్నారు. ఎల్లారెడ్డి డివిజన్‌లో 6,934 మందికి నూ తన రేషన్‌కార్డులు మంజూరయ్యాయని, మొద టి విడతలో 2,616 కార్డులను లబ్ధిదారులకు అందజేశామని వివరించారు. ప్రజాసంక్షేమమే మొదటిప్రాధాన్యతగా రేషన్‌కార్డులను పంపిణీ చేశామని అన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందజేస్తామని, కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. అనంతరం తెలంగాణ వేర్‌ హౌసింగ్‌ గోదాము నిర్మా ణం కోసం మాల్తుమ్మెద శివారులోని సర్వే నంబర్‌ 834లో తొమ్మిది ఎకరాల స్థలాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మల్లికార్జున్‌, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్‌పర్సన్‌ రజితారెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

    రేషన్‌కార్డుల మంజూరుతో

    నిరీక్షణకు తెర

    ప్రజాసంక్షేమమే మొదటి ప్రాధాన్యత

    ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

    మదన్‌మోహన్‌రావు

  • చర్చాగోష్టి.. ప్రత్యేక కథనాలు

    ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు

    తెయూ(డిచ్‌పల్లి) : తెయూలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు ‘సాక్షి’ తనవంతు కృషి చేసింది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లాను సందర్శించిన సమయంలో తెయూకు ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. 12 ఏప్రిల్‌ 2025న ‘సాక్షి’ టౌన్‌ ఆఫీస్‌లో వివిధ విద్యార్థి సంఘాల ఆ ధ్వర్యంలో ‘తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి’ అ నే అంశంపై చర్చాగోష్టి నిర్వహించింది. జూ లై 8న ‘మంజూరు చేస్తే చాలు’ అనే కథనా న్ని ‘సాక్షి’ ప్రచురించింది. 577 విశాలమైన క్యాంపస్‌తోపాటు సైన్స్‌ కాలేజ్‌ భవనం, మౌ లిక వసతులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉ న్నాయంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

  • ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయాలి

    సదాశివనగర్‌/కామారెడ్డి అర్బన్‌/రాజంపేట : ఉపాధ్యాయుల విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండవ దశ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ విజయరామరాజు అన్నారు. గురువారం సదాశివనగర్‌ కాంప్లెక్స్‌ సమావేశం జరిగింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆగస్టు 5న ఉపాధ్యాయుల ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యుఎస్‌పీసీ జిల్లా ప్రతినిధి దేవుల, డీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు చిన్న రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు. అలాగే దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీ ప్రభాకర్‌, టీచర్లు ఆవిష్కరించారు.ఉపాధ్యాయులు గంగాకిషన్‌, బాబురావు, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఎంఈవో పూర్ణచందర్‌ రావు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం డి. ఈశ్వర్‌, జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు కలిసి ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • కేంద్రప్రభుత్వ పథకాలపై అధికారుల అధ్యయనం

    నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి):నాగిరెడ్డిపేట మండలంలో ని వాడి, అక్కంపల్లి గ్రామాల్లో కేంద్రప్ర భుత్వ పథ కాల అమలుతీరుపై గురువారం కేంద్రబృందం అఽ దికారులు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కేంద్రబృందం అధికారులు ఉపాధిహామీ కూలీలతోపాటు పింఛన్‌దారులతో,మహిళాసంఘాల సభ్యు లతో సమావేశమయ్యారు. గ్రామాల్లో ఉపాధి పను లు కొనసాగుతున్న తీరును కూలీలను అడిగి వారు తెలుసుకున్నారు.దీంతోపాటు వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్‌ డబ్బుల చెల్లింపులపై వారు ఆరా తీశారు.మహిళాసంఘాల ఆర్థికాభివృద్ధిపై వారు వి వరాలు సేకరించారు. అనంతరం వారు విలేకరుల తో మాట్లాడారు. కేంద్రప్రభత్వు పథకాలైనా ఉపాధిహామీ పథకంతోపాటు పింఛన్లు, మహిళాసంఘాల సభ్యులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటున్నామన్నారు.ఉపాధిహామీ పథకం అమలులో ఏమైనా లోటుపాట్లు జరిగితే భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా తగు చర్యలు చేపడతామని వారు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రబృందం సభ్యులు సుధాకర్‌రెడ్డి, లోహిత్‌రెడ్డి, ఐకెపీ ఏపీయం జగదీశ్‌కుమార్‌, ఈజీఎస్‌ ఏపీవో సాయిలు, పంచాయతీ కార్యదర్శులు నరేష్‌, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

  • రేషన్‌కార్డుల పంపిణీ

    బాన్సువాడ రూరల్‌/బీబీపేట/రామారెడ్డి : మండలంలోని హన్మాజీపేట్‌ గ్రామంలో గురువారం పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌ కొత్తరేషన్‌ కార్డుల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఏళ్లుగా రేషన్‌కార్డులకు ఎదురు చూశామని, ప్రభు త్వం కార్డులు మంజూరు చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రవీణ్‌గౌడ్‌, షేఖ్‌ అక్బర్‌ , రంగరి గారి సంజీవులు, వెంకాగౌడ్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రా మంలో కొత్తరేషన్‌ కార్డుల ధ్రువపత్రాలను ఓబీసీ సెల్‌ మండల అధ్యక్షులు బండి ప్రవీణ్‌ లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షులు దుంపల బాలరాజు ,సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు నర్సారెడ్డి, తోట లింగం విలేజ్‌ కాంగ్రెస్‌ నాయకులు బీబీపేట మండలంలోని తుజాల్‌పూర్‌, శేరిబీబీపేట గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను మండల కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు. నూ తన రేషన్‌ కార్డుల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మండల అధ్యక్షుడు సుతారి రమే ష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమాగౌడ్‌, మల్లు గారి మహేష్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తోట రమేష్‌ వివిధ గ్రామాల అధ్యక్షులు నరసింహారెడ్డి, పరశురాములు, నాగరాజు గౌడ్‌,రాకేష్‌ రెడి,్డ పుట్ట మల్లేష్‌, నారాయణ రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.

  • కలెక్టర్‌ నిధుల మంజూరుతో పనుల ప్రారంభం

    మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద గల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం పలు శాఖల అధికారులు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ గురుకుల పాఠశాలను సందర్శించిన సమయంలో పాఠశాలలో సమస్యలున్నాయని కలెక్టర్‌ దృష్టికి విద్యార్థినులు వివరించగా వెంటనే స్పందించి రూ. 2 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. పాఠశాలలో చేపట్టాల్సిన పనులు ప్రారంభించడానికి బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఆదేశాలతో మండల తహసీల్దార్‌ ముజీబ్‌, పంచాయతీరాజ్‌శాఖ ఏఈఈ, విద్యుత్‌ శాఖ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈలు, ఇతర శాఖల అధికారులు పనుల కోసం ప్రణాళికలు తయారు చేశారు. హాస్టల్‌ మెస్‌ వరకు విద్యుత్‌ స్తంబాల ఏర్పాటు, తాగునీరు కోసం బోరుబావి, హస్టల్‌ భద్రత సిబ్బంది కోసం గది నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్‌ ముజీబ్‌ తెలిపారు. దీంతో గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.

  • ఇళ్ల

    ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వందశాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అధికారులకు సూచించారు. గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులను ప్రతి జీపీ కార్యదర్శిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమైన చోట పనులు వేగంగా పూర్తి చేయాలని, ప్రారంభం కాని చోట పనులు ప్రారంభమయ్యే లా చూడాలన్నారు. పనులు సకాలంలో ప్రారంభించని పక్షంలో ఇందిరమ్మ ఇళ్లు రద్దవుతాయని లబ్ధిదారులకు సూచించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభంకాని వారికి వారి వారి గ్రామాలలోని డ్వాక్రా సంఘాల ద్వారా ఇంటి నిర్మా ణానికి రుణాలను ఇప్పించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అటవీభూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాలలో ఆర్డీవో దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు.అధికారులు సైతం పనులు ప్రారంభించిన వారికి సంబంధించిన బిల్లులు చె ల్లించడంలో ఎలాంటి జాప్యం చేయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, హౌజింగ్‌ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, డీపీవో మురళి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ రజిత, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, డీఎల్‌పీవోలు, హౌజింగ్‌ ఏఈలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు,మండల కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షులు సాయిబాబా, శ్రీధర్‌గౌడ్‌ తదితరులున్నారు.

    ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును కలిసిన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు

    ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంటల సాగు, ఎరువులు వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మధ్యంతరంగా నిలిచిన వ్యవసాయశాఖ భవన నిర్మాణానికి సంబంధించిన పనులు జరిగేలా చూడాలని వారు కోరారు. ఏడీఏ సుధామాధురి, ఏవోలు అనిల్‌, రాజలింగం, నదిమోద్దీన్‌ తదితరులున్నారు.

    జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

    జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌పోస్టర్లను ఓబీసీ సంఘం నాయకులు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈనెల 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు శివరాములు, నాగరాజులు తెలిపారు. జాతీయ మహాసభకు ఓబీసీ సంఘం నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు. కార్యక్రమంలో ఓబీసీ సంఘం నాయకులు భూమన్న తదితరులున్నారు.

    వందశాతం ఇందిరమ్మ

    ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

    ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

  • గుడ్ల

    కామారెడ్డి క్రైం: అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, హాస్టళ్లకు 2025–26 సంవత్సరానికి గాను కోడి గుడ్లను సరఫరా చేసేందుకు టెండర్‌ ప్రక్రియను నిర్వహించారు. ఆన్‌లైన్‌ ద్వారా ఇదివరకు వేసిన బిడ్‌లను కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సమక్షంలో తెరిచారు. ఇద్దరు బిడ్డర్లు మాత్రమే టెండర్‌ల ప్రక్రియలో పాల్గొన్నారు. సదరు బిడ్డర్ల నుంచి అందిన టెక్నికల్‌ బిడ్‌లను నిబంధనల ప్రకారం పరిశీలించి టెండర్లు కేటాయించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

    ఇంజనీరింగ్‌ కళాశాల

    మంజూరు హర్షణీయం

    కామారెడ్డి అర్బన్‌: తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్‌ కళాశాల మంజూరు చేయడం హర్షణీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకుల విజ్ఞప్తులు, ఇన్‌చార్జి మంత్రి సీతక్క కృషి ఫలితంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేశారని, దీంతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు మేలు కలుగుతుందన్నారు.

    ప్రేమ్‌ చంద్‌ రచనల్లో

    గ్రామీణ జీవితం కనిపిస్తోంది

    భిక్కనూరు/కామారెడ్డి అర్బన్‌ : ప్రముఖ హిందీ న వల రచయిత ప్రేమ్‌ చంద్‌ రచనల్లో గ్రామీణ జీవి తం గ్రామీణ వ్యవహరాలు అనుబంధాలు ఉంటా యని జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు గపూర్‌ శిక్షక్‌ అన్నారు. గురువారం మండలంలోని జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రేమ్‌ చంద్‌ జయంతిని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో కవి ప్రేమ్‌చంద్‌ జయంతిని నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హిందీ విభాగ అధిపతి డాక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ జాతీయ సాహిత్యంలో ప్రేమ్‌చంద్‌ గోదాన్‌ నవల ప్రసిద్ధి చెందిందన్నారు. విద్యార్థులకు హిందీ వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు,బహుమతులు అందజేశా రు. వైస్‌ ప్రిన్సిపల్‌ కే.కిష్టయ్య, సమన్వయకర్తలు పి.విశ్వప్రసాద్‌, బాలాజీ, ఉపాధ్యాయులు తబిత, ప్రవీణ, లింగం, సత్యనారాయణ, బాల రాజయ్యలు తదితరులు పాల్గొన్నారు.

    68 మంది బాల

    కార్మికుల గుర్తింపు

    ముగిసిన ఆపరేషన్‌ ముస్కాన్‌–11

    కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

    కామారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌–11 లో 68 మంది బాల కార్మికులను గుర్తించినట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్‌, రెవెన్యూ, కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, చైల్డ్‌ లైన్‌ 1098 ల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇందుకోసం డివిజన్‌ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలకార్మికులు, వీధి బాలల, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, రక్షణ కల్పించడం చర్యలు చేపట్టామన్నారు. మొత్తం 68 మంది పిల్లలను రక్షించామన్నారు. అందులో 9 మంది బాలికలు, 59 మంది బాలురు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో ఐదుగురు వీధి బాలల, 30 మంది బాల కార్మికులు, 33 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు తెలిపారు. బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు, విద్య ప్రాముఖ్యతపై కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం పిల్లలందరినీ అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేర్పించామన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై చైల్డ్‌ లేబర్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లల హక్కులను కాపాడడం, వారి భవిష్యత్తును మెరుగుపరచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

  • మోసం

    బాన్సువాడ రూరల్‌: బీర్కూర్‌ గ్రామానికి చెందిన నర్రసాయిలు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన నల్లజెరు జ్యోతిని పెళ్లి చేసుకుని మోసం చేశాడని అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మాల సంఘం ప్రతినిధులు డీఎస్పీ విఠల్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరితే జ్యోతితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయించాడని ఆరోపించారు. తప్పుడు కేసులను కొట్టివేయడంతో పాటు జ్యోతి, ఆమె కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు బంగారు మైసయ్య, మల్లూరు సాయిలు, ప్రశాంత్‌, బాలసాయిలు, మన్నె సాయిలు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

    జిల్లాలో 30, 30(ఏ) పోలీస్‌ యాక్ట్‌ అమలు

    కామారెడ్డి క్రైం: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 1 నుంచి 30 వ తేదీ వరకు 30, 30(ఏ) పోలీసు యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్‌ చంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని అన్నా రు. ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే సంబంధిత డివిజన్‌ పోలీసు అధికారులను సంప్రదించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసు లు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.

    బాధ్యతగా విధులు

    నిర్వహించాలి

    పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): బాధ్యతగా విధులు నిర్వహించాలని సీఐ రవీందర్‌ పోలీస్‌ సిబ్బందికి సూచించారు.గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సీఐ రవీందర్‌ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి క్రైం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులకు, సైబర్‌ క్రైంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

    పౌరులు హక్కులను

    వినియోగించుకోవాలి

    మద్నూర్‌(జుక్కల్‌): ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవాలని డోంగ్లీ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిబాబా పేర్కొన్నారు. డోంగ్లీ మండలంలోని మదన్‌హిప్పర్గాలో గురువారం సివిల్‌రైట్స్‌డే నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు సమాజంలో అంటరాని తనాన్ని రూపుమాపాలని సూచించారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్‌ రైట్స్‌ డే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

  • బ్రిడ

    పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161 పై ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టీరింగ్‌ వైఫల్యం కారణంగా లారీ హైవే బ్రిడ్జిపై సైడ్‌వాల్‌ ను ఢీకొట్టడంతో క్యాబిన్‌లో కూర్చున్న ఐదుగురు కూలీలు పైనుంచి సర్వీస్‌ రోడ్డుపై పడిపోయారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి ప రిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన ముగ్గురి ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గురువారం పిట్లం మండలం నుంచి ఇటుక లోడ్‌ చేసుకొని మద్నూర్‌కు వెళ్లిన లారీ (ఏపీ 26 ఎక్స్‌ 1377) తిరిగి వస్తుండగా.. పెద్దకొడప్‌గ ల్‌లో నేషనల్‌ హైవే 161 బ్రిడ్జిపై స్టీరింగ్‌ ఫెయిలై సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. క్యాబిన్‌లో డ్రైవర్‌తోపాటు ఐదుగురు కూలీలు కూర్చున్నారు. లారీ సైడ్‌వాల్‌ ను ఢీ కొట్టగానే డ్రైవర్‌ మినహా ఐదురు కూలీలు క్యాబిన్‌లో నుంచి కింద ఉన్న సర్వీస్‌రోడ్డుపై పడిపోయారు. పిట్లం మండలం రూం తండాకు చెందిన హలావత్‌ నర్సింగ్‌(30) అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన గణేశ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన బింబాటో, రూం తండాకు చెందిన శోభన్‌, హలావత్‌ రమేశ్‌కు గాయాలుకాగా.. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరి యా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

    బ్రిడ్జిపై సైడ్‌ వాల్‌ ను ఢీకొని ఆగిన లారీ

    ఎన్‌హెచ్‌ 161 పై ఘోర ప్రమాదం

    పైనుంచి సర్వీస్‌ రోడ్డుపై పడిన ఐదుగురు కూలీలు

    ఒకరి మృతి.. మరొకరి

    పరిస్థితి విషమం

    ప్రమాదానికి స్టీరింగ్‌

    వైఫల్యమే కారణం

  • వనమహోత్సవం అందరి బాధ్యత

    భిక్కనూరు: వన క్షేమమే.. మనందరి క్షేమమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్‌ ఆశి ష్‌ సంగ్వాన్‌ అన్నారు. తెలంగాణ యునివర్సీటీ సౌత్‌క్యాంపస్‌లో గురువారం వనమహోత్సవం నిర్వహించగా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటా రు.ఆయన మాట్లాడుతూ.. వనమహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని, భవిష్యత్‌ తరాల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. సౌత్‌ క్యాంపస్‌లో 30 వేల మొక్కలను నాటేందుకు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మొక్కలను స్పాన్సర్‌చేసిన అధ్యాపకులు డాక్టర్‌ యాలాద్రి, డాక్టర్‌ప్రతిజ్ఞలను కలెక్టర్‌ స త్కరించి అభినందించారు. ప్రిన్సిపాల్‌ సుధాకర్‌గౌడ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి సురేందర్‌, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, త హసీల్దార్‌ సునీత, ఆర్‌ఐ బాలయ్య, ఇంజినీరింగ్‌ అధి కారి రాధిక,అధ్యాపకులు మోహన్‌,సరిత,రమాదేవి, నర్సయ్య,అంజయ్య,నాగరాజు, శ్రీకాంత్‌, శర్మ, దిలీ ప్‌, సంతోష్‌గౌడ్‌, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

    మొక్కలు నాటి సంరక్షించాలి

    కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

  • క్రైం

    చికిత్స పొందుతూ బాలుడు మృతి

    వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన

    బాన్సువాడ: పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా.. బిచ్కుంద మండలం శాంతాపూర్‌ గ్రామానికి చెందిన భాను ప్రసాద్‌(16) మంగళవారం రాత్రి జ్వరం రావడంతో అతడిని కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సిబ్బంది పట్టించుకోలేదని ఉదయం నిజామాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బాలుడిని వెంటనే తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. దీంతో బాలుడి మృతదేహాన్ని బాన్సువాడలోని ఆస్పత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. పోలీసులు చొరవ చేసుకుని కుటుంబీకులకు నచ్చ జెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

  • నష్టపరిహారం ఇప్పించాలి..

    కామారెడ్డి క్రైం: ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ భూములు అంటూ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని పెద్ద కొడప్‌గల్‌ మండలం కాటేపల్లి తండావాసులు అన్నారు. దాదాపు 20 మంది గురువారం జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయానికి తరలివచ్చారు. డీఎఫ్‌వో నిఖిత ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం జుక్కల్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ సౌదాగర్‌ అరవింద్‌, గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇటీవల కాటేపల్లి తండా శివారులో అటవీ అధికారులు దాడులు నిర్వహించి గత 20 ఏళ్లకు పైగా తాము సాగు చేసుకుంటున్న భూముల్లో పంటలను జేసీబీలు, ట్రాక్టర్‌ లతో దున్నివేశారని తెలిపారు. దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉన్న కాలం నుంచి ఈ ప్రాంతం లోని దాదాపు 60 ఎకరాలకు పైగా భూమిని సాగు చేసుకుంటూ 30 కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. అధికారులు వచ్చి అటవీ భూములంటూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికే 20 ఎకరాల్లో వేసిన పంటలను చెడగొట్టారని పేర్కొన్నారు. దీంట్లో అనేక మంది నిరుపేద రైతులు ఉన్నారని అన్నారు. వేలల్లో పెట్టుబడులు పెట్టిన పంటలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను తిరిగి ఇవ్వాలని, కోల్పోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలనీ డీఎఫ్‌వోకు విన్నవించినట్లు తెలిపారు.

    డీఎఫ్‌వో కార్యాలయానికి తరలివచ్చిన కాటేపల్లి వాసులు

  • బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్‌ రక్షణ

    నిజామాబాద్‌ సిటీ: బడుగు, బలహీనవర్గాలు, గిరి జనులు, ఆదివాసీల హక్కుల కోసం కాంగ్రెస్‌ పా టుపడుతుందని, వారికి రక్షణగా పార్టీ ఉంటుందని రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే పేదల సంక్షేమం జరిగిందని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. జిల్లాకేంద్రంలోని హోటల్‌ హరితలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆదివాసీ గిరిజన కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా శిక్షణా శిబిరం గురువారం ముగిసింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశావ్యాప్తంగా 25వేల మంది ఆదివాసీలు, గిరిజనులను మంచి నాయకులుగా తీర్చిదిద్దాలన్న ల క్ష్యంతోనే ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నా రు. అనంతరం శిక్షణలో పాల్గొన్న కార్యకర్తలకు సర్టి ఫికేట్లు అందించారు. ట్రైకార్‌ చైర్మన్‌ తేజావత్‌ బె ల్లయ్య నాయక్‌, జిల్లా ఆదివాసీ గిరిజన చైర్మన్‌ కెతా వత్‌ యాదగిరి, రాణాప్రతాప్‌ రాథోడ్‌, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ తారాచంద్‌, నాయకులు రాహుల్‌బాల, చంద్రు నాయక్‌, కెతావత్‌ ప్రకాష్‌ నాయక్‌, చాంగుబాయి, సురేష్‌ నాయక్‌, సుభాష్‌ జాదవ్‌ ఉన్నారు.

    రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌

    కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌

    ముగిసిన ఆదివాసీ గిరిజన కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా శిక్షణా శిబిరం

Kurnool

  • పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పటికప్పుడు చెల్లిస్తామని మాట ఇచ్చారు. మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు అండగా ఉంటాని వాగ్దానం చేశారు, అయితే అధికారంలోకి వచ్చాక  ఇచ్చిన మాటను మరిచారు. గడిచిన విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు (మొత్తం ఆరు క్వార్టర్లు) బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

    కర్నూలు(అర్బన్‌): వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో నిశ్చింతగా ఉన్న విద్యా రంగం కూటమి ప్రభుత్వంలో అతలాకుతలం అవుతోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆలవాలంగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకం కల్పిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు విడుదల చేయాల్సిన ఫీజు బకాయిలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను పీడిస్తున్నాయి. చాలా మంది పేద విద్యార్థులు ఫీజు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు.

    పెండింగ్‌లో మూడు క్వార్టర్ల ఫీజు

    ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2న మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది. అంతలోనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అలాగే 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మూడు క్వార్టర్ల ఫీజును పెండింగ్‌లో పెట్టింది.

    రూ.133.17 కోట్ల బకాయిలు

    జిల్లాలో 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి దాదాపు రూ.133.17 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. 2023–24కు సంబంధించి 31,596 మంది విద్యార్థులకు మూడు నెలలకు రూ.61,86,61,526 కాగా, 2024–25 విద్యా సంవత్సరానికి 32,736 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు దాదాపు రూ.71,31,06,554లను ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. కాగా ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న ఎస్టీ విద్యార్థులకు మొత్తం ఫీజును చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడం శోచనీయం.

    ఐదేళ్లలో రూ.501.60 కోట్లు విడుదల

    ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచిన ఘనత వైఎస్‌ జగన్‌దే

    గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజినీరింగ్‌ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ, కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్‌ –1) ఇంజినీరింగ్‌ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని పెంచారు. దీంతో గ్రేడ్‌–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కింది.

    వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..

    2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019–20 విద్యా సంవత్సరంలో విడుదల చేసింది. అప్పట్లో జిల్లాలో 32,162 మంది విద్యార్థులకు సంబంధించిన అరియర్స్‌ను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే కుటుంబ వార్షిక ఆదాయాన్ని కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ. లక్షగా నిర్ధారిస్తే, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరాలనే సదుద్దేశంతో జగన్‌ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులకు రూ.20 వేల ప్రకారం అందించింది.

    విద్యార్థుల జీవితాలతో చెలగాటం

    ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో ఉంచడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫీజు బకాయిలను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతాం.

    – కటికె గౌతమ్‌, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, రాష్ట్ర అధికార ప్రతినిధి

    ప్రభుత్వమే బాధ్యత వహించాలి

    రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజులను చెల్లించకపోవడంతో అనేక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాయి. ఫీజు గురించి విద్యార్థులను ప్రశ్నించకుండా కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి. ఫీజుకు సంబంధించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగితే అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది.

    – కాసారపు వెంకటేష్‌, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Hyderabad

  • కళా బోనం!

    బోనాల నృత్య రూపకం ఆహూతులను ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టింది. గురువారం రవీంద్ర భారతిలో శ్రీ మహాకాళి మహేష్‌ గౌడ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పలువురికి బోనాల పురస్కారాలను హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ట్రస్ట్‌ చైర్మన్‌ కె.ప్రవీణ్‌కుమార్‌, అధ్యక్షుడు అరవింద్‌కుమార్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రీ

  • గోల్కొండ రోప్‌వేపై సాంకేతిక అధ్యయనం

    సాక్షి, సిటీబ్యూరో

    గోల్కొండ టూంబ్స్‌ నుంచి కోట వరకు ప్రతిపాదించిన రోప్‌వేపై గురువారం హెచ్‌ఎండీఏలో ప్రీబిడ్డింగ్‌ సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. సుమారు 1.5 కి.మీ మార్గంలో నిర్మించనున్న రోప్‌వే కోసం ఇప్పటికే రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) టెండర్‌లను ఆహ్వానించారు. ఆసక్తిగల కన్సల్టెన్సీ సంస్థలు ఈ నెల 6 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే గురువారం ప్రీబిడ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్‌ఎఫ్‌పీ బిడ్డింగ్‌ కోసం కోసం దరఖాస్తు చేసుకున్న పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిడ్డింగ్‌ గడువును పెంచాలని పలువురు ప్రతినిధులు హెచ్‌ఎండీఏ అధికారులను కోరారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుపై మరింత అవగాహన అవసరమని, అందుకోసం బిడ్డింగ్‌ గడువును పెంచాలని అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం.

    ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..

    నిత్యం వేలాది మంది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే చారిత్రక గోల్కొండ కోటను, టూంబ్స్‌ను కలిపేలా నిర్మించనున్న రోప్‌వే ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రూ.100 కోట్ల అంచనాలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోప్‌వేలు, స్కైవేలపై విస్తృత అధ్యయనం చేస్తున్న హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలోని కుతుబ్‌షాహీల సమాధుల వరకు రోప్‌వే కోసం ఇప్పటికే ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సైతం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్‌ఎఫ్‌పీ బిడ్డింగ్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. రోప్‌వేకు అనుకూలమైన మార్గాన్ని నిర్ధారించడంతో పాటు, రక్షణశాఖ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమనే అంశంపైనా ఎంపికై న కన్సల్టెన్సీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వివిధ దేశాల్లో రోప్‌వేలు, కేబుల్‌ కార్ల నిర్వహణపైనా అధ్యయనం చేసి హెచ్‌ఎండీఏకు నివేదికను అందజేయాల్సి ఉంటుంది.

    కేబుల్‌ కారులో సందర్శన..

    గోల్కొండ కోట నుంచి పర్యాటకులు రోడ్డు మార్గంలో టూంబ్స్‌ వరకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఇరుకై న రోడ్డు, వాహనాల రద్దీ దృష్ట్యా చాలామంది గోల్కొండ కోట నుంచి టూంబ్స్‌ వరకు వెళ్లకుండానే వెనుదిరుగుతున్నట్లు అంచనా. ఈ క్రమంలో పర్యాటకుల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు రోప్‌వే ద్వారా కేబుల్‌ కార్లలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 10 వేల మందికిపైగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీరిలో 3000 మంది వరకు విదేశీ టూరిస్టులు ఉంటారని అంచనా. రోప్‌వేను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పర్యాటకులకు మెరుగైన సదుపాయం కల్పించినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు.

    ఆర్‌ఎఫ్‌పీ కోసం ఈ నెల 6 వరకు బిడ్డింగ్‌

    ప్రీ బిడ్డింగ్‌ సమావేశంలో పాల్గొన్న పలు సంస్థలు

    రూ.100 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు

  • చిరుత

    మణికొండ: కొద్దిరోజులుగా భయభ్రాంతులకు గురిచేసిన చిరుత పులి ఎట్టకేలకు మంచిరేవుల ట్రెక్‌పార్కులోనే బోనులో చిక్కింది. జూలై 7వ తేదీన మొయినాబాద్‌ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌ వనమూళిక వనం నుంచి మొదలైన దాని ప్రస్థానం పోలీస్‌ గ్రేహౌండ్స్‌, ట్రెక్‌ పార్కు, రాందేవ్‌గూడ మిలిటరీ ఏరియా, తిరిగి ట్రెక్‌ పార్కుకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక ఆకలితో మేకను తినేందుకు బోనులోకి దూరి బందీ అయ్యింది. ప్రతి రోజూ మాదిరిగానే ఉదయం సిబ్బంది బోనులను తనిఖీ చేస్తున్న క్రమంలో ఒకదాంట్లో చిరుత గాండ్రింపులు విని భయాందోళన చెందారు. అంతలోనే తేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి బోను చుట్టూరా పరదాలను కట్టి నగరంలోని జూపార్కుకు తరలించారు. అక్కడ దాని గాయాలకు చికిత్సతో పాటు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, చిలుకూరు రేంజ్‌ అధికారి లక్ష్మణ్‌ తెలిపారు.

    చిరుత మూతికి గాయం...

    బోనులో చిక్కుకున్న చిరుత అందులోనుంచి బయటికి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దాని మూతి బోను ఇనుప చువ్వలకు తాకడంతో గాయమైంది. బోనులో చిక్కుకున్న భయంలో అది అందులో ఏర్పాటు చేసిన మేకను సైతం తినకుండా ఉండిపోయింది. చిరుత వయసు సుమారు 5 ఏళ్లు ఉంటాయని, యుక్త వయసులో ఉండటంతో పెద్దగా గాండ్రించటం, బెదిరించటం చేసిందని అటవీ అధికారులు తెలిపారు. చిరుతపులి ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిందనే విషయాన్ని తెలుసుకున్న మంచిరేవుల, గంధంగూడ, బైరాగిగూడ, నార్సింగి, కోకాపేట, రాందేవ్‌గూడ, ఇబ్రహీంబాగ్‌ తదితర గ్రామాల ప్రజలు దాన్ని చూసేందుకు ట్రెక్‌ పార్కు వద్దకు వచ్చారు. శుక్రవారం నుంచి యథావిధిగా ట్రెక్‌ పార్కును తెరుస్తామని, వాకింగ్‌ చేసేవారు రావచ్చని అధికారులు తెలిపారు.

    ట్రెక్‌ పార్కులోనే బోనులోకి వచ్చి..

    ఉదయం గమనించిన సిబ్బంది

    తొలుత జూపార్క్‌కు తరలింపు

    అక్కడి నుంచి నల్లమల అడవుల్లోకి..

    నేటి నుంచి తెరుచుకోనున్న ట్రెక్‌ పార్కు

  • పన్నెండేళ్లకు పచ్చజెండా!

    సాక్షి, సిటీబ్యూరో: పుష్కరకాలం నాటి ప్రతిపాదనలు తిరిగి పట్టాలకెక్కనున్నాయి. హైదరాబాద్‌– సికింద్రాబాద్‌లను కలిపే బేగంపేట్‌ రోడ్‌– రాణిగంజ్‌ క్రాస్‌రోడ్స్‌ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎస్‌పీ రోడ్‌ –నెక్లెస్‌ రోడ్‌ను కలుపుతూ పాటిగడ్డ మీదుగా ఆర్‌ఓబీ (ఫ్లై ఓవర్‌) ప్రాధాన్యతతో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ, దక్షిణమధ్య రైల్వే అంగీకారానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 కోట్లు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు.

    సమన్వయం, సహకారం లోపంతో..

    ● ఇక్కడి ఆర్‌ఓబీ ప్రతిపాదన ఈనాటిది కాదు. నగరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కావడాని కంటే ఎంతోకాలం ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, సహకార లోపంతో కాగితాలు దాటి పనులు మొదలు కాలేదు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే బేగంపేట వైపు నుంచి ఖైరతాబాద్‌, సెక్రటేరియట్‌ల వైపు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. సెక్రటేరియట్‌– ట్యాంక్‌బండ్‌– ప్యారడైజ్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. అప్పటి అంచనా వ్యయం రూ.25 కోట్లు ప్రస్తుతం రూ. 80 కోట్లయింది.

    ● ఈ ఫ్లైఓవర్‌ పనులు పూర్తయితే అటు ఎస్‌పీ రోడ్‌, ఇటు ఎంజీ రోడ్‌లోనూ ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అప్పట్లోనే రైల్వే శాఖ నుంచి అనుమతులున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాదాపు 7.5 మీటర్లుండే ఫ్లై ఓవర్‌పై రెండు వైపులా క్యారేజ్‌వేలతోపాటు ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ మీడియన్‌లు గత ప్రతిపాదనల్లో ఉన్నాయి. అవసరమైతే మార్పుచేర్పులు చేయనున్నారు.

    ఫ్లైఓవర్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఇలా..

    2009లో ఉమ్టా సమావేశంలో ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ చెరిసగం భరించాలని, పనులు హెచ్‌ఎండీఏ చేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిన నిధులు జీహెచ్‌ఎంసీ ఇవ్వలేదు. హెచ్‌ఎండీఏ సైతం నిధులివ్వలేమని, ప్రాజెక్టు పని చేయలేమని, పనుల్ని జీహెచ్‌ఎంసీకి బదలాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం మెగాసిటీ ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలనుకున్నారు. ఏదీ కాలేదు. బేగంపేట, ఎంజీరోడ్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే అటు బేగంపేట, ఇటుఎంజీ రోడ్లలో రద్దీ తగ్గనున్నందున మెహిదీపట్నం– సికింద్రాబాద్‌ రాకపోకల సమయం సైతం తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు.

    బేగంపేట్‌లో తప్పనున్న ట్రాఫిక్‌ చిక్కులు

    త్వరలో పాటిగడ్డ– నెక్లెస్‌ రోడ్డు ఆర్‌ఓబీ పనులు

    పుష్కర కాలం నాటి ప్రతిపాదనలకు మోక్షం

    ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 కోట్లు

  • జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఓ నమూనా
    హైడ్రా కృషిని అభినందించిన కేంద్ర బృందం

    సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ) అధికారుల బృందం గురువారం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించింది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ఈ ప్రాంతం చెరువులా రూపాంతరం చెందిన పాత చిత్రాలను చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు. చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఒక నమూనా అవుతుందని బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడిషనల్‌ చీఫ్‌ టౌన్‌ ప్లానర్‌ మోనీస్‌ ఖాన్‌ పేర్కొన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి, మండు వేసవిలో రెండు మీటర్ల లోతు నీరు ఉబికి వచ్చే వీడియోలను చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. హైడ్రా కృషిని అభినందించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాల్వలోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్‌లెట్‌ను నిర్మించడంపై హర్షం వెలిబుచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియాల ద్వారా హైడ్రా అధికారులు కేంద్ర బృందానికి చూపించారు. చెరువు ఔట్‌లెట్‌ను సైతం పరిశీలించారు. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అసోసియేట్‌ టౌన్‌ ప్లానర్‌ సందీప్‌ రావుతో పాటు.. హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్‌, విమోస్‌ టెక్నో క్రాట్‌ ఎండీ పి.యూనస్‌, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌ ప్రదీప్‌ కుమార్‌, సిటీ ప్లానర్‌ ఉమాదేవి తదితరులు కేంద్ర బృందంతో ఉన్నారు.

    బతుకమ్మ కుంట వద్ద అధికారుల బృందం

  • శ్రద్ధతో శుద్ధి!

    సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ఓఆర్‌ఆర్‌ పరిధిలో సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాల నిర్వహణ, క్లినింగ్‌ కోసం జలమండలి డయల్‌–ఎ–సెప్టిక్‌ ట్యాంక్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టిక్‌ ట్యాంకుల వ్యర్థాల క్లీనింగ్‌, డంపింగ్‌ కోసం సుమారు 50 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. నివాస, వాణిజ్య సముదాయాల్లోని సెప్టిక్‌ ట్యాంకులను క్లీనింగ్‌ చేసి వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉత్పన్నమయ్యే సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలను.. చెరువులు, కాలువలు, కుంటల్లో పారబోస్తే ఇటు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపేది. దీనిని నివారించడానికి సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలను శుభ్రపరిచే వాహనాలను అందుబాటులో తీసుకొని వచ్చింది. జీహెచ్‌ఎంసీ అవతల, ఓఆర్‌ఆర్‌ లోపలి 7 కార్పొరేషన్‌లు, 18 మున్సిపాలిటీలతో పాటు 18 గ్రామాల్లోని సెప్టిక్‌ ట్యాంక్‌ మానవ వ్యర్థాలను శుద్ధి చేయనుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ క్లినింగ్‌ వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను అమర్చి పనితీరు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది.

    వ్యర్థాల క్లీనింగ్‌పై శిక్షణ

    సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాల క్లీనింగ్‌ నిర్వహణపై వాహనాల ఆపరేటర్లకు అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శాసీ్త్రయ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. సెప్టిక్‌ ట్యాంక్‌ను క్లీనింగ్‌ చేసి వ్యర్థాలను ప్రతిపాదిత ఎస్టీపీలు, ఎఫ్‌ఎస్టీపీల్లో ఎస్టీపీల్లో డంపింగ్‌ చేసి, శుద్ధి చేసేలా జలమండలి చర్యలు చేపట్టింది. సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ వాహనం కోసం 155313/14420కు కాల్‌ చేయవచ్చు.

    శుద్ధి కేంద్రాలు ఇలా..

    జలమండలి పరిధిలో అంబర్‌పేట్‌, నల్లచెరువు, నానక్‌ రామ్‌గూడ, ఖాజాగూడ ఎస్టీపీల వద్ద 40 కేఎల్‌డీ సామర్థ్యం గల కో–ట్రీట్మెంట్‌ ప్లాంట్లను నిర్మించింది. ఇప్పటి వరకు 84 మిలియన్‌ లీటర్ల సెఫ్టేజ్‌ కో– ట్రీట్మెంట్‌ ప్లాంట్లలో శుద్ధి చేశారు.

    డయల్‌– ఎ– సెప్టిక్‌ ట్యాంక్‌

    తాజాగా ఓఆర్‌ఆర్‌ పరిధిలో సైతం..

    అందుబాటులో 50 వాహనాలు

    టోల్‌ఫ్రీ నంబర్‌– 155313/14420

  • పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

    జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌

    గచ్చిబౌలి: వర్షాకాల పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సూచించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో ఉదయం వర్షాకాలం పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని జోనల్‌ కమిషనర్‌ బోర్కడే హేమంత్‌ సహదేవ్‌రావుతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఆయన మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో తనిఖీలు చేశారు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కాలనీలలో పరిశుభ్రతా చర్యలు ప్రభావవంతంగా చేపట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌, స్థానిక అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను సమీక్షించాలన్నారు. అనంతరం పటాన్‌ చెరువును సందర్శించారు. క్షేత్ర స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య పనులను వేగంగా చేపట్టాలన్నారు.

  • నేటి నుంచి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ
    55,378 కుటుంబాలకు రేషన్‌ కార్డులు మంజూరు ● హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా

    సాక్షి,సిటీ బ్యూరో: ఎట్టకేలకు హైదరాబాద్‌లో కొత్త రేషన్‌ (ఆహార భద్రత) కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. వరసగా మూడు రోజుల పాటు కొత్త రేషన్‌ కార్డులు మంజూరైన లబ్ధిదారుల కుటుంబాలకు వాటిని పంపిణీ చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌ కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించి లబ్ధి కుటుంబాలకు అందజేయనున్నారు. తొలి విడతగా రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మూడు రోజుల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొత్తగా రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తారు. రెండో విడతలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన దాసరి తెలిపారు.

    కొత్తగా 55,378 రేషన్‌కార్డులు

    హైదరాబాద్‌ జిల్లాలో సుమారు 55,378 కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. మొత్తం మీద సుమారు 2,26, 272 కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డుల కోసం మీ సేవా ద్వారా పౌరసరఫరాల శాఖకు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 89,919 దరఖాస్తులపైన మాత్రమే క్షేత్ర స్థాయి విచారణ పూర్తికాగా, మిగిలిన 1,36,353 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు 3,910 కుటుంబాలను అనర్హులుగా గుర్తించారు. మిగిలిన అర్హత సాధించిన దరఖాస్తుల్లో 55,378 కుటుంబాలకు కార్డులు మంజూరు కాగా, ప్రస్తుం ఎసీఎస్‌ఓ లాగిన్‌లో 6,090, డీసీఎస్‌ఓ లాగిన్‌లో 24,541 దరఖాస్తులు ఆమోదానికి పెండింగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా గత ఆరు నెలలుగా కొత్త రేషన్‌ కార్డుల కోసం మీ సేవ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికి క్షేత్ర స్థాయి విచారణ మాత్రం నత్తలకే నడక నేర్పిస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగడంతో కార్డుల వెరిఫికేషన్‌ వేగవంతమైనట్లు సమాచారం.

    నగరంలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ షెడ్యూల్‌ ఇలా...

    తేది నియోజకవర్గం సమయం వేదిక

    ఆగస్టు 1 ఖైరతాబాద్‌ ఉదయం 10 గంటలు బంజారా భవన్‌

    ,, కంటోన్మెంట్‌ మధ్యాహ్నం 12 గంటలు లే ప్యాలెస్‌

    ,,, జూబ్లీహిల్స్‌ మధ్యాహ్నం 3 గంటలు రహమత్‌ నగర్‌

    ఆగస్టు 2 అంబర్‌పేట ఉదయం 10గంటలు అంబర్‌పేట

    ,, ముషీరాబాద్‌ మధ్యాహ్నం 12 గంటలు ముషీరాబాద్‌

    ,, సికింద్రాబాద్‌ 3.00 గంటలు సికింద్రాబాద్‌

    ఆగస్టు 3 చార్మినార్‌ ఉదయం 10 గంటలు చార్మినార్‌

    ,, కార్వాన్‌ మధ్యాహ్నం 12 గంటలు కార్వాన్‌

    ,, చాంద్రాయణ గుట్ట మధ్యాహ్నం 3 గంటలు చాంద్రాయణ గుట్ట

    హైదరాబాద్‌ కొత్త రేషన్‌ కార్డుల మంజూరు ఇలా

    నియోజక వర్గం మంజూరైన

    కార్డులు

    మలక్‌పేట 3,926

    యాకుత్‌పురా 3,174

    చార్మినార్‌ 4,738

    చాంద్రాయణగుట్ట 6,461

    బహద్దూర్‌పురా 5,287

    గోషామహల్‌ 3,028

    కార్వాన్‌ 5994

    అంబర్‌పేట 3,358

    ఖైరతాబాద్‌ 1,953

    జూబ్లీహిల్స్‌ 5,284

    నాంపల్లి 5,157

    ముషీరాబాద్‌ 2,672

    సనత్‌నగర్‌ 1,393

    కంటోన్మెంట్‌ 1,150

    సికింద్రాబాద్‌ 1,803

  • భార్య స్కెచ్‌ వేసింది.. భర్త అమలు చేశాడు..

    బంజారాహిల్స్‌: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్‌ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్‌ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్‌కు చెందిన సచిన్‌దూబే బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని తిబారుమల్‌ జ్యువెలర్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్‌లకు వెళ్లే అతడికి కూకట్‌పల్లిలోని కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌లో బార్‌ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. గత శనివారం తమ పబ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్‌దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్‌ తన బైక్‌ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్‌లో పబ్‌కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్‌యాదవ్‌ డ్యాన్స్‌ చేస్తూ సచిన్‌ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్‌ను తాను బైక్‌పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్‌కు వచ్చింది. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్‌ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్‌, డింపుల్‌ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్‌ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం సచిన్‌ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్‌ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఉదయం 6 గంటల సమయంలో సచిన్‌ను అత్తాపూర్‌లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్‌ భార్యకు ఫోన్‌ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్‌మెయిల్‌ చేశారు. అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్‌పల్లిలోని పబ్‌ వద్ద విచారణ చేపట్టి బార్‌ డ్యాన్సర్‌ డింపుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.

    పథకం ప్రకారమే..

    కూకట్‌పల్లిలోని కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌లో బార్‌ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌ యాదవ్‌ భర్త పవన్‌కుమార్‌యాదవ్‌ గతంలో అదే పబ్‌లో బౌన్సర్‌గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్‌కు మకాం మార్చి అంబర్‌పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్‌ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్‌ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్‌యాదవ్‌, పవన్‌కుమార్‌యాదవ్‌తో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్న సాయిప్రసాద్‌, హరికిషన్‌, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్‌నకు వాడిన కారుపై లా ఆఫీసర్‌ ఎయిమ్స్‌ బీబీనగర్‌ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్‌లతో పాటు సచిన్‌ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్‌ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామంటూ బ్లాక్‌ మెయిల్‌ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    నగల దుకాణం ఉద్యోగి కిడ్నాప్‌ కేసులో

    యువతితో సహా నలుగురు అరెస్టు..

  • ఫార్మాసిటీలో మరోసారి సర్వే

    యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో అధికారులు మరోసారి సర్వేకు సిద్ధం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. రెండు నెలల క్రితం ఫార్మాసిటీ బౌండరీని సర్వే చేసి, ఫెన్సింగ్‌ పనులు పూర్తి చేశారు. తాజాగా గురువారం బౌండరీ లోపల హద్దులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో సర్వే నంబర్ల వారీగా గుర్తించే పనులను మొదలుపెట్టారు. గ్రామంలోని పలు అసైన్డ్‌, పట్టా భూముల సర్వేనంబర్ల వారీగా ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు పరిహారం అందజేశామనే వివరాలతో కూడిన రికార్డుల ప్రకారం హద్దులు గుర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ భూముల వద్దకు రావద్దని అడ్డుకున్నారు.

    అభ్యంతరం చెప్పడం సరికాదు

    నిర్వాసితులకు పరిహారంతో పాటు తాజాగా మీరాఖాన్‌పేటలోని టీజీఐఐసీ వెంచర్‌లో లాటరీ తీసి ప్లాట్ల కబ్జాలు ఇచ్చామని ఆర్డీఓ అనంత్‌రెడ్డి తెలిపారు. అయినా రైతులు అభ్యంతరం తెలపడం సరికాదన్నారు. పరిహారం అందజేసిన, రికార్డులు మారిన భూములన్నీ ప్రభుత్వాని వేనని, ఆ భూముల్లోకి ఎవరూ రావొద్దని సూచించారు. కోర్టు కేసులున్న భూముల్లోకి వెళ్లమని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వే చేస్తున్న భూముల వద్దకు రైతులెవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

    సర్వేనంబర్ల వారీగా భూమి గుర్తింపు

    అడ్డుకున్న నక్కర్తమేడిపల్లి రైతులు

    ఉద్రిక్త వాతావరణం

    భారీ పోలీసు బందోబస్తు

    బందోబస్తు మధ్య ఫార్మా ఫెన్సింగ్‌

    కందుకూరు: ఫార్మాసిటీ కోసం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్‌ 123కు సంబంధించి గురువారం అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఫెన్సింగ్‌ పనులు చేపట్టారు. దీంతో సర్వే నంబర్‌ను ఆనుకుని ఉన్న దెబ్బడగూడ రెవెన్యూ సర్వే నంబర్‌ 31లోని గిరిజన రైతులు పనులను అడ్డుకున్నారు. తమ భూమిలోకి జరిపి ఫెన్సింగ్‌ ఎలా వేస్తారంటూ నిలదీశారు. సర్వే చేసిన తర్వాతే ఫెన్సింగ్‌ వేసుకోవాలని పట్టుబట్టారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ గోపాల్‌, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకీరెడ్డి, సీఐ సీతారాం రైతులతో మాట్లాడారు. పది రోజుల్లో దెబ్బడగూడ సర్వే నంబర్‌ 31ని సర్వే చేయిస్తామని, అప్పటి వరకు ఫెన్సింగ్‌ పనులు ఆపొద్దని అన్నారు. భూమి మీకు వస్తే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

  • 28 మంది పోలీసు అధికారుల ఉద్యోగ విరమణ

    బంజారాహిల్స్‌: హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గురువారం 28 మంది పోలీసు అధికారులు పదవీ విరమణ చేశారు. వీరిలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ వెంకటేశ్వరరావు, నలుగురు ఎస్‌ఐలు, 21 మంది ఏఎస్‌ఐలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (అడ్మిన్‌) పరిమళ హానా నూతన్‌ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, శేష జీవితం కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని కోరారు. పోలీసు శాఖకు వారు అందించిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

  • అమెరికన్‌ కాన్సులేట్‌లో వెయిటింగ్‌ ఏరియా ప్రారంభం

    రాయదుర్గం: నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో వెయిటింగ్‌ ఏరియాను గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ వెయిటింగ్‌ ఏరియాను తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ నిర్మించింది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అమెరికాతో భాగస్వామ్యం, కొత్త ఆవిష్కరణలు, పురోగతి ప్రజల సంక్షేమానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తూ రెండు ప్రాంతాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. జెన్నీఫర్‌ లార్సన్‌ మాట్లాడుతూ ఈ వెయిటింగ్‌ ఏరియా నిర్మాణంతో అమెరికా వీసాలను సమర్థవంతంగా పరీక్షించడానికి, ప్రాసెస్‌ చేయడానికి యూఎస్‌ ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. వేలాదిమంది వీసా దరఖాస్తుదారులకు, ప్రతిరోజు కాన్సులేట్‌ను సందర్శించే కుటుంబాలకు సౌకర్యం, సౌలభ్యాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు, టీజీఐఐసీ సంస్థ ఉన్నతాధికారులు, అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

  • జనహితయాత్రకు ఘన స్వాగతం

    చేవెళ్ల/మొయినాబాద్‌: వికారాబాద్‌ జిల్లా పరిగి నుంచి ప్రారంభించే జనహిత పాదయాత్రకు వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పార్టీ శ్రేణులు మొయినాబాద్‌లో ఘన స్వాగతం పలికాయి. హిమాయత్‌నగర్‌ చౌరస్తాకు చేరుకోగానే పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. అక్కడే ఉన్న అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాలకు మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌, శ్రీధర్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారికి భారీ గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మధుసూదన్‌రెడ్డి, దర్శన్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

    చిలుకూరులో పూజలు

    చిలుకూరు బాలాజీ దేవాలయంలో మీనాక్షి నటరాజన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు హన్మంతరావు, రాజయ్య తదితరులతో కలిసి ఆమె ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించు కున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

    వర్గపోరు మరోసారి బట్టబయలు

    పార్టీలో వర్గపోరు కొనసాగుతుందని మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గం ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ మద్య సయోధ్య లేకపోవటంతో ఇరు వర్గీయులు వేర్వేరుగా స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు.

Vikarabad

  • ఇందిరమ్మకు ఇసుక గండం

    దోమ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సీఎం రేంవత్‌రెడ్డి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం విధితమే. కానీ దోమ మండల అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక పర్మిషన్‌ కోసం టోకెన్‌ ఇవ్వాలని తహసీల్దార్‌ వద్దకు వెళితే.. అనుమతి లేదంటూ తిప్పిపంపిస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. దీంతో లబ్ధిదారులకు ఇసుక దొరకక ఇళ్లు కట్టుకోలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. అధికారులు మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. ఈ ఊరికి మొత్తం 185 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో 96 ఇళ్లు పనులు జరుగుతుండగా 89 ఇండ్లు ప్రారంభానికి నోచుకోలేకపోయాయి. దీంతో పనులు చేసుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక సమస్య తలనొప్పిగా మారింది.

    కాసులు దండుకుంటున్న దళారులు

    మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైనంత ఇసుక దొరుకుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. దిర్సంపల్లి, మైలారం, గొడుగోనిపల్లి వాగులతో పాటు కాకారవాణి ప్రాజెక్టులో భారీ స్థాయిలో ఇసుక ఉంది. దాన్ని కొంత మంది వ్యాపారులు ట్రాక్టర్లలో పొలాల దగ్గరకు తెచ్చుకొని డంపులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ డంపులను అధికారులు పట్టుకోకపోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వారు ఇష్టారీతిన అధిక రేట్లకు విక్రయిస్తూ కాసులు దండుకుంటున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి రూ.5 లక్షలు కేటాయిస్తుంది. దీంట్లో స్టీల్‌, సిమెంట్‌, ఇటుకలు తెచ్చుకోవాల్సి ఉంది. వాటి ధరలు సైతం అధికంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చి ఇందిరమ్మ ఇళ్లకు అందించాలని అధికారులను ఆదేశించింది. కానీ ఽఅధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.

    డస్ట్‌తో కట్టుకుంటున్నాం

    ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. పకడ్బందీగా నిర్మించుకుందామనుకుంటే ఇసుక దొరకలేని పరిస్థితి నెలకొంది. దీంతో డస్ట్‌తో ఇల్లు నిర్మించుకుంటున్నాం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించాలని కోరితే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.

    – బాలునాయక్‌, శివారెడ్డిపల్లితండా

    ఎలాంటి ఆదేశాలు లేవు

    ఇందిరమ్మ ఇళ్లయినా, మరే ఇతర అవసరాలకై నా ఇసుక పర్మిషన్‌ ఇచ్చేందుకు తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను తెచ్చుకునేందుకు టోకన్‌లను అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

    – గోవిందమ్మ, తహసీల్దార్‌, దోమ

    టోకెన్‌ అనుమతులు లేవంటున్న అధికారులు

    ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

    ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన

  • పన్నెండేళ్లకు పచ్చజెండా!

    సాక్షి, సిటీబ్యూరో: పుష్కరకాలం నాటి ప్రతిపాదనలు తిరిగి పట్టాలకెక్కనున్నాయి. హైదరాబాద్‌– సికింద్రాబాద్‌లను కలిపే బేగంపేట్‌ రోడ్‌– రాణిగంజ్‌ క్రాస్‌రోడ్స్‌ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎస్‌పీ రోడ్‌ –నెక్లెస్‌ రోడ్‌ను కలుపుతూ పాటిగడ్డ మీదుగా ఆర్‌ఓబీ (ఫ్లై ఓవర్‌) ప్రాధాన్యతతో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ, దక్షిణమధ్య రైల్వే అంగీకారానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 కోట్లు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు.

    సమన్వయం, సహకారం లోపంతో..

    ● ఇక్కడి ఆర్‌ఓబీ ప్రతిపాదన ఈనాటిది కాదు. నగరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కావడాని కంటే ఎంతోకాలం ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, ఆయా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, సహకార లోపంతో కాగితాలు దాటి పనులు మొదలు కాలేదు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే బేగంపేట వైపు నుంచి ఖైరతాబాద్‌, సెక్రటేరియట్‌ల వైపు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. సెక్రటేరియట్‌– ట్యాంక్‌బండ్‌– ప్యారడైజ్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. అప్పటి అంచనా వ్యయం రూ.25 కోట్లు ప్రస్తుతం రూ. 80 కోట్లయింది.

    ● ఈ ఫ్లైఓవర్‌ పనులు పూర్తయితే అటు ఎస్‌పీ రోడ్‌, ఇటు ఎంజీ రోడ్‌లోనూ ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అప్పట్లోనే రైల్వే శాఖ నుంచి అనుమతులున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాదాపు 7.5 మీటర్లుండే ఫ్లై ఓవర్‌పై రెండు వైపులా క్యారేజ్‌వేలతోపాటు ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ మీడియన్‌లు గత ప్రతిపాదనల్లో ఉన్నాయి. అవసరమైతే మార్పుచేర్పులు చేయనున్నారు.

    ఫ్లైఓవర్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఇలా..

    2009లో ఉమ్టా సమావేశంలో ఈ ప్రాజెక్టు కయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ చెరిసగం భరించాలని, పనులు హెచ్‌ఎండీఏ చేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిన నిధులు జీహెచ్‌ఎంసీ ఇవ్వలేదు. హెచ్‌ఎండీఏ సైతం నిధులివ్వలేమని, ప్రాజెక్టు పని చేయలేమని, పనుల్ని జీహెచ్‌ఎంసీకి బదలాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం మెగాసిటీ ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలనుకున్నారు. ఏదీ కాలేదు. బేగంపేట, ఎంజీరోడ్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే అటు బేగంపేట, ఇటుఎంజీ రోడ్లలో రద్దీ తగ్గనున్నందున మెహిదీపట్నం– సికింద్రాబాద్‌ రాకపోకల సమయం సైతం తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు.

    బేగంపేట్‌లో తప్పనున్న ట్రాఫిక్‌ చిక్కులు

    త్వరలో పాటిగడ్డ– నెక్లెస్‌ రోడ్డు ఆర్‌ఓబీ పనులు

    పుష్కర కాలం నాటి ప్రతిపాదనలకు మోక్షం

    ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 కోట్లు

  • చెరవీడని సర్కారు భూమి!

    బషీరాబాద్‌: ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి విడిపించాల్సిన అధికారులు చేతులెత్తేశారు. బషీరాబాద్‌– తాండూరు ప్రధాన రోడ్డుకు ఆనుకుని కాశీంపూర్‌ శివారులోని విలువైన సర్కారు భూమి అన్యాక్రాంతానికి గురైందని తేల్చినా స్వాధీనం చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. బషీరాబాద్‌, యాలాల, తాండూరు మూడు మండలాలను కలిపే శివారు కావడంతో కొన్నాళ్లు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సమీప రైతులు ఇటీవల ఆందోళన వ్యక్తంచేయడం, పత్రికల్లో ఇందుకు సంబంధించిన కథనాలు రావడంతో స్పందించిన యంత్రాంగం గత నెల జూలై 10న సర్వేచేసింది. జుంటివాగు బ్యాక్‌వాటర్‌ నిలిచే నది ప్రాంతాన్ని మట్టితో పూడ్చేసిన అక్రమార్కులు 200 మీటర్ల పొడవున, ఐదు మీటర్ల మేర భూమిని కబ్జా చేసినట్లు తేల్చారు. దీనికి తోడు తాండూరు మండలం మాచనూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 32/2లో సుమారు 20 గుంటల భూమి అన్యాక్రాంతమైనట్లు నిర్ధారించారు. అనంతరం యాలాల, తాండూరు రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్‌ అధికారులు మరోసారి సంయుక్తంగా సర్వే చేశారు. కబ్జా వాస్తవమేనని తేల్చినప్పటికీ సర్కారు భూమిని మాత్రం చెర నుంచి విడిపించలేదు. ఇదిలా ఉండగా భూమిని చెరబట్టిన వ్యక్తులు ఇటీవల ప్రభుత్వ స్థలంలోనే ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించారు. దీనికితోడు బషీరాబాద్‌– తాండూరు ప్రధాన రోడ్డు నుంచి వీరి పొలాల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వ భూమిని వారి సొంత స్థలంలా వినియోగిస్తున్నారు. ఇప్పటికై నా అక్రమార్కుల ఆట కట్టించి, ప్రభుత్వ భూమిని కాపాడాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

    చర్యలు తప్పవు..

    ఈవిషయమై యాలాల తహసీల్దార్‌ వెంకటస్వామిని వివరణ కోరగా.. జుంటివాగు కబ్జాపై ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి సమగ్రంగా సర్వే చేశామన్నారు. తాండూరు మండల పరిధిలో 5 మీటర్ల మేర భూమి కబ్జాకు గురైనట్లు తేలిందని చెప్పారు. యాలాల పరిధిలోకి వచ్చే చెక్‌డ్యాం వెనకవైపున 200 మీటర్ల పొడవునా ఆక్రమించారని తెలిపారు. ఇక్కడ నిర్మిస్తున్న గది తాండూరు పరిధిలోకి వస్తుందన్నారు. ఆక్రమణకు గురైన స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేయడంతో పాటు భూమిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు. మరోవైపు ఇరిగేషన్‌ డీఈ కిష్టయ్య మాట్లాడుతూ.. జుంటివాగు కబ్జాపై ఇప్పటికే కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామన్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

    కబ్జాకు గురైనట్లు తేల్చినా స్వాధీనం చేసుకోని వైనం

    ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు

  • వామ్మో.. ఇదేం బస్టాండ్‌!
    ఆవరణ మొత్తం చెత్తమయం
    ● ప్రయాణికులు కూర్చోలేని పరిస్థితి ● నిర్వహణను గాలికొదిలేసిన ఆర్టీసీ అధికారులు

    ధారూరు: లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ధారూరు బస్టాండ్‌ దారుణంగా తయారైంది. మేకలు, పందులు, కుక్కలు మలమూత్ర విసర్జన చేయడంతో ప్రయాణికులు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. బస్టాండ్‌ ఆవరణ మొత్తం కంపు కొడుతోంది. తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ దీని పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నా ఒక్కసారి కూడా పరిశీలించిన పాపానపోలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధారూరుకు వస్తుంటారు. బస్టాండ్‌లో చెత్తాచెదారం వల్ల ఒక్క నిమిషం పాటు కూడా ఉండలేక పోతున్నారు. వర్షాల కారణంగా ఆవరణ మొత్తం చిత్తడిగా మారింది. అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది. బస్సులు సైతం బస్టాండులోకి రావడం లేదని ప్రయాణికులు తెలిపారు. రోడ్డుపైనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్‌ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, బస్సులు బస్టాండ్‌ లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

  • కూతురి పెళ్లికి దాచితే.. దోచేశారు!

    నందిగామ: కూతురి పెళ్లి కోసం దాచిన నగదు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని మండలంలోని మామిడిపల్లికి చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించినా స్పందన కరువైందని లబోదిబోమన్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య కొందుర్గు మండలంలోని మహదేవ్‌పూర్‌లో ఉన్న భూమిని గతంలో విక్రయించాడు. వచ్చిన డబ్బులతో కొంత అవసరాల కోసం వాడుకున్నాడు. కూతురుకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో 16 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి, రూ.15 లక్షల నగదును ఇంట్లో భద్రపరిచాడు. ఇటీవల రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి ఫోన్‌ రావడంతో ఇంట్లో చూడగా నగదు, బంగారం కనబడకపోవడంతో లబోదిబోమన్నాడు. డబ్బులు, పసిడి దోచుకుపోయిన విషయమై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చర్చించాడు. ఎక్కడ నుంచి కనీస సమాచారం లేక పోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ చేశారు. గురువారం తిరిగి బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో సజ్జపై దాచిన డబ్బులను తెలిసిన వారే దోచుకుపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    కేసు నమోదు చేయని పోలీసులు

    మామిడిపల్లిలో ఇంత పెద్ద చోరీ జరిగినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ను వివరణ కోరగా.. బాధితులను విచారించామని, ఏసీపీ శుక్రవారం వస్తారని, మరోసారి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు.

    మామిడిపల్లిలో భారీ చోరీ

    రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారం అపహరణ

  • సేవలే చిరస్థాయిగా ఉంటాయి

    అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా ఉంటాయని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎస్‌ఐగా సేవలందించి, పదవీ విరమణ పొందిన ఎండీ శయిదుద్దీన్‌కు గురువారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఎండీ శయిదుద్దీన్‌ను సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘ సేవలను, అంకితభావాన్ని క్రమశిక్షణను కొనియాడారు. 38 ఏళ్లకు పైగా ఎలాంటి రిమార్క్‌ లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు. పోలీస్‌ ఉద్యోగం సవాలుతో కూడుకున్నదని, కుటుంబ సభ్యుల సహకారం లేనిదే ఇంత సుదీర్ఘకాలం సమర్థవంతంగా పనిచేయడం సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మురళీధర్‌, ఏఓ జ్యోతిర్మయి, జిల్లా పోలీస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

  • పారిపోయిన విద్యార్థి అప్పగింత

    కుల్కచర్ల: చదవడం ఇష్టం లేక పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్కచర్ల గ్రామానికి చెందిన గుడిసె అఖిల్‌ ముజాహిద్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ స్థానికంగా బీసీ వసతిగృహంలో ఉంటున్నాడు. బుధవారం అతడు పాఠశాల సమయంలో బయటకు వచ్చి కుల్కచర్లకు వచ్చి బస్సులో షాద్‌నగర్‌ వెళ్లాడు. అక్కడ పోలీసులు బాలుడిని గమనించి వివరాలు అడిగారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడి చిరునామా తెలుసుకుని స్థానికుల ద్వారా కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. గురువారం ఉదయం ఎంఈఓ హబీబ్‌ అహ్మద్‌ సమక్షంలో అఖిల్‌ను కుటుంబీకులకు అప్పజెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సతీష్‌, వసతిగృహ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Business

  • రక్షాబంధన్‌కు ముందు ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ  గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి.  కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

    కొత్త ధరల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ .1,631.50 కు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ.1,665గా ఉండేది.  వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపుతో క్యాటరింగ్ యూనిట్లు, హోటళ్లు-రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుంది.


    దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ కొత్త రేట్లు

    ఢిల్లీ: రూ.1,631.50

    కోల్‌కతా: రూ.1734.50

    ముంబై: రూ.1582.50

    చెన్నై: రూ.1789

    హైదరాబాద్‌: రూ.1,886.50

    డొమెస్టిక్ సిలిండర్‌ ధరలు
    డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.3 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025 నుండి స్థిరంగా ఉంది. ఇందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు, తగ్గించలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.853గా ఉంది.

Sports

  • టీమిండియా అరంగేట్రం కోసం మూడేళ్లుగా ఎదురుచూన్నాడు అభిమన్యు ఈశ్వరన్‌ (Abhimanyu Easwaran). దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఈ బెంగాల్‌ బ్యాటర్‌కు 2022లోనే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా నాటి కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) గాయపడటంతో.. అభిమన్యుతో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.

    మరోసారి పాత కథే పునరావృతం
    అయితే, ఆ సిరీస్‌లో అభిమన్యుకు ఆడే అవకాశం రాలేదు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడే టీమిండియాకు కూడా ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఎంపికయ్యాడు. అప్పుడూ తుదిజట్టులో నో ఛాన్స్‌. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ సిరీస్‌ ఆడే జట్టులోనూ స్థానం సంపాదించాడు.

    కానీ.. మరోసారి పాత కథే పునరావృతం అయింది. అభిమన్యు ఈశ్వరన్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పునరాగమనం చేసిన కరుణ్‌ నాయర్‌కు మాత్రం మేనేజ్‌మెంట్‌ వరుస అవకాశాలు ఇచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్టుల్లో విఫలమైనా.. ఐదో టెస్టులో అతడికి మరోసారి ఆడే ఛాన్స్‌ ఇచ్చింది.

    జట్టులో లేని ప్లేయర్‌కు ఛాన్సులు
    ఈ నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్‌ తండ్రి రంగనాథన్‌ ఈశ్వరన్‌ బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘అభిమన్యు టెస్టు అరంగేట్రం కోసం నేను రోజులు కాదు.. సంవత్సరాలు లెక్కబెడుతున్నాను. ఇప్పటికి మూడేళ్ల కాలం గడిచింది.

    ఓ బ్యాటర్‌గా పరుగులు చేయడం మాత్రమే కదా కావాల్సింది. ఆ పని అభిమన్యు చేస్తూనే ఉన్నాడు. నిజానికి అభిమన్యు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ జట్టుకు ఎంపికైనపుడు కరుణ్‌ నాయర్‌ అసలు జట్టులోనే లేడు.  

    ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా టెస్టులకు ఎంపికా?
    కానీ ఐపీఎల్‌లో కాస్త మెరుగ్గా ఆడితే టెస్టు టీమ్‌లోకి తీసుకుంటారు. అసలు సంప్రదాయ క్రికెట్‌ జట్టుకు ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా ప్లేయర్లను ఎంపిక చేయడం ఏమిటి? రంజీ ట్రోఫీ, దులిప్‌ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో ప్రదర్శన మాత్రమే టెస్టు సెలక్షన్‌కు ప్రామాణికం కదా!

    ఏడాది కాలంలో నా కుమారుడు 864 పరుగులు సాధించాడు. అయినా తనకు ఆడే అవకాశం రావడం లేదు. నా కుమారుడు డిప్రెషన్‌లో కూరుకుపోయినట్లు అనిపిస్తోంది’’ అంటూ రంగనాథన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సెలక్టర్ల తీరు సరికాదంటూ మండిపడ్డారు.

    నిజానికి అభిమన్యు ఈశ్వరన్‌ తొలిసారి టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్న నాటి నుంచి నేటి వరకు ఏకంగా 15 మంది క్రికెటర్లు అరంగేట్రం చేయడం గమనార్హం. కాగా 29 ఏళ్ల అభిమన్యు ఇప్పటికి 103 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 27 శతకాలు, 31 అర్ధ శతకాల సాయంతో 7841 పరుగులు సాధించాడు.

    చదవండి: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు

  • ఐపీఎల్‌-2025 సీజ‌న్ త‌ర్వాత విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా స్టార్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో అయ్య‌ర్ ఆడ‌నున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడేందుకు త‌ను సిద్దంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం.

    ఈ దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీ ఆగ‌స్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అయ్య‌ర్ వెస్ట్‌జోన్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు టీమిండియా క్రికెట‌ర్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబేలు కూడా దులీప్ ట్రోఫీలో ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వెస్ట్‌జోన్ జ‌ట్టు ఇప్ప‌టికే సెమీఫైన‌ల్‌కు క్వాలిఫై అయింది. సెప్టెంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కానున్న సెమీస్‌లో క్వార్ట‌ర్ ఫైన‌ల్ విజేతతో వెస్ట్‌జోన్ త‌ల‌ప‌డ‌నుంది.

    ఇక ఇది ఇలా ఉండ‌గా.. వైట్‌బాల్ క్రికెట్‌లో త‌న‌ను త‌ను నిరూపించుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇంకా టెస్టుల్లో మాత్రం త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. భార‌త త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు 14 టెస్టులు ఆడిన అయ్య‌ర్‌.. 36.86 స‌గ‌టుతో 811 ప‌రుగులు చేశాడు.

    అయితే డిమాస్టిక్ క్రికెట్‌లో మాత్రం అయ్య‌ర్ దుమ్ములేపుతున్నాడు.  గ‌త రంజీ ట్రోఫీ సీజ‌న్‌లో కూడా ఈ ముంబైక‌ర్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. దీంతో అత‌డిని ఇంగ్లండ్‌తో టెస్టుల‌కు ఎంపిక చేస్తార‌ని భావించారు. కానీ సెల‌క్ట‌ర్లు మాత్రం అత‌డిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. అతడికి ప్రస్తుతం జట్టులో

    అయ్యర్‌ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి.. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్‌ ఇచ్చేందుకు అవకాశం లేదని ఛీప్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించాడు. అయితే ఇంకా మెరుగ్గా రాణించి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా అయ్యర్‌ ముందుకువెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దులీప్‌ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్‌ భారత తరపున చివరగా గతేడాది ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్‌ ఆడాడు.
    చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్‌

  • మాంట్రియల్‌: కెనడాకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ జెనీ బుచార్డ్‌ ఆటకు వీడ్కోలు పలికింది. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడేసింది. నేషనల్‌ బ్యాంక్‌ ఓపెన్‌లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో బుచార్డ్‌ 2–6, 6–3, 4–6తో 17వ సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడింది. 

    తొలి రౌండ్‌లో పోరాడి గెలిచిన బుచార్డ్‌... రెండో రౌండ్‌లో అదే ఆటతీరు కనబర్చలేకపోయింది. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో... తొలి సెట్‌లో ఓడిన బుచార్డ్‌... ఆ తర్వాత పుంజుకుంది. 

    రెండో సెట్‌ గెలిచి... మూడో సెట్‌లోనూ చక్కటి పోరాటం కనబర్చినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన బెన్‌చిచ్‌ విజయం సాధించింది. 

    ప్రత్యేక అనుబంధం
    ‘మాంట్రియల్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఎదో ఒక రోజు ఇదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకాలని బలంగా అనుకునే దాన్ని. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఇదో భావోద్వేగ సందర్భం. 

    కెరీర్‌లో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా’ అని బుచార్డ్‌ పేర్కొంది. 2014లో కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో బుచార్డ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 5వ స్థానానికి చేరింది. 

    ఆ ఏడాదే కెరీర్‌లో ఏకైక డబ్ల్యూటీఏ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన ఆమె.... ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నల్లో సెమీఫైనల్‌కు చేరింది. 2014లో వింబుల్డన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయిన బుచార్డ్‌... తిరిగి పుంజుకోలేకపోయింది. 

    కన్నీటి పర్యంతం
    ‘ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఇక్కడి వరకు వచ్చా. టెన్నిస్‌ ధ్యాసలో పడి చదువుకు దూరమయ్యా. ఇష్టాలను వదులుకొని ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకున్నా. నేను ఆటకు ఎంతో ఇచ్చాను. ఇక ఆటకు వీడ్కోలు పలికి ఇతర విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. 

    టెన్నిస్‌ నాకు తిరిగిచి్చన దాంతో సంతృప్తిగా ఉన్నా. చిన్నప్పుడు ఈ మైదానంలో కూర్చొని మ్యాచ్‌లు వీక్షించేదాన్ని. ఏదో ఒక రోజు ఈ కోర్టులో అడుగు పెట్టాలని కలలు కనేదాన్ని. అది నిజం చేసుకొని సగర్వంగా ఇక్కడే ఆటకు వీడ్కోలు పలుకుతున్నా’ అని మ్యాచ్‌ అనంతరం బుచార్డ్‌ కన్నీటి పర్యంతమైంది.

Politics

  • హైదరాబాద్‌, సాక్షి: చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై లోకేష్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఇటు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చురకలంటించారు.

    బనకచర్ల కట్టి తీరతామని నారా లోకేష్‌ అంటున్నారు. మరి లోకేష్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతదాకా స్పందించలేదు. సీఎం, మంత్రులు సహా ఎవరూ ఖండించలేదు. 

    కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్‌ మాట్లాడుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడిగి తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ నాన్న చంద్రబాబు ఏడు లేఖలు కేంద్రానికి రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి. కావాలంటే మీకు అన్ని ఆధారాలు పంపిస్తాం.

    కేంద్రం, రేవంత్‌ బలం చూసుకుని లోకేష్‌ మాట్లాడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. బనకచర్లను అడ్డుకుని తీరతాం అని హరీష్‌రావు హెచ్చరికలు జారీ చేశారు.

    కాళేశ్వరంను ఆపేందుకు బాబు 7 లేఖలు రాశారు
  • సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్‌ స్కాంలో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్‌ స్కాంను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్‌ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్‌ రెవెన్యూ పెరగాలి కదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

    వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్‌ స్కాం పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కాం ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కాం డబ్బులు గల్ఫ్ అంటారు.. ఆఫ్రికా అంటారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అన్నారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెప్తున్నారు. లేని.. జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

    కేసుల పేరు చెప్పు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వైఎస్‌ జగన్‌ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు ఏపీలో ఒక ECM ఇద్దరు DCM లు ఉన్నారు. ఇద్దరు DCMలలో ఒకరు డిప్యూటీ సీఎం అయితే, మరొకరు డీఫ్యాక్టో సీఎం. వీరు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. లిక్కర్ కేసులో అరెస్టులు ఎందుకు  చేస్తున్నారు.. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే. 2019-2024 మద్యం స్కాం జరగలేదు. 2014-2019 మధ్య జరిగింది అసలైన లిక్కర్  స్కాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టారు.

    లిక్కర్ స్కాంలో రోజుకో పిట్ట కథ చెప్తున్నారు

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్  పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా?. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతం తాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి?. అతని స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా?. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా?. లిక్కర్ స్కాం జరగలేదు మిథున్ రెడ్డి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నెల్లూరు ఏమైనా కంచుకోటా.. కంచె వేసి అడ్డుకోవడం ఏమిటి?. మెయిల్స్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ మాదిరి దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్స్ ముందు మేం సరితూగం’ అని కామెంట్స్‌ చేశారు. 

Family

  • హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్.  ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ  జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్‌ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం. 

    మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్‌ మనోజ్‌. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు  ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్‌యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు. 

    మందులు పనిచేయకపోవడానికి రీజన్‌..
    నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్‌ మనోజ్‌. ఇక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు  44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్‌ మనోజ్‌.

    సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..
    కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక.  దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.

    రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్ కావొచ్చు..
    మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్‌ మనోజ్‌. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.

    తక్షణమే అవగాహన అవసరం..
    "రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్‌డీఎన​ వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్‌ మనోజ్‌
    డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్‌

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం

    (చదవండి:  ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!)

     

  • బరువు తగ్గించుకునే క్రమంలో చప్పచప్పగా తింటూ విసిగిపోయారా?  వెయిట్‌ లాస్‌జర్నీకి భంగం కలగకుండా  ఉండేలా,  బోరింగ్‌  స్నాక్స్‌ కాకుండా  హెల్దీగా, సంతృప్తి కరంగా ఉండేలా కొన్ని రకాల ఆహారాలను తయారు చేసుకోవచ్చు. ఇవాల్టీ టిప్‌ ఆఫ్‌ది డేలో భాగంగా రుచితోపాటు, సంతృప్తిగా, బరువుతగ్గడంలోనూ కూడా సాయపడే  వంటకాల గురించి తెలుసుకుందాం.


    చనా లేదా చిక్‌పీస్, లేదా కాబూలీ శనగలు  ఎలా పిలిచినా ఇవి పోషకాల గని.  వీటినే తెల్ల శనగలు అని కూడా అంటారు. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, ఎన్నో విటమిన్స్, మినరల్స్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బోర్‌ కొట్టకుండా, వెరైటీగా, రుచికరంగా ప్రోటీన్-ప్యాక్డ్‌గా  స్నాక్స్‌, కూర ,సలాడ్‌  ఇలా ఎన్నో.. సులభంగా తయారు చేసుకోవచ్చు .

    కాబూలీ శనగలకూర (Kabuli Chana Curry)
    కావలసినవి: బాగా నానబెట్టి ఉడించిన కాబూలి శనగలు, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, ఉప్పు.

    ఒక  ప్యాన్‌లో నూనెగానీ నెయ్యిగానీ వేసి  వేడెక్కిన తరువాత  సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ,పచ్చిమిర్చి, టొమాటోవేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌,  గరంమసాలా వేయించుకోవాలి. వేగాక ఉడికించి పెట్ఘుకున్నశనగలు వేసి ఉడికించాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. బాగా దగ్గరికి వచ్చిన తరువాత టేస్ట్‌ చూసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే  రుచికరమైన కర్రీ రెడీ.. అన్నంలోగానీ, చపాతీలు, రోటీలోకి గానీ  భలే టేస్ట్‌గా ఉంటుంది.

    Kabuli Chana Pulao కాబూలీ  శనగలతో పులావ్ 
    కావలసినవి: కాబూలి శనగలు, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి,  గరం మసాల దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పులావ్‌ఆకులు), ఉప్పు.

    తయారీ: ఒకప్యాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మసాలాలు వేసి వేయించుకోవాలి. తరువాతతరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేగాక అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత నీళ్లు, బియ్యం, శనగలు వేసి సాల్ట్‌ టేస్ట్‌ చెక్‌ చేసుకోవాలి. ఉడికిన తరువాత కొత్తిమీర, పుదీనాతో  గార్నీష్‌ చేసుకుంటే పులావ్‌ రెడీ.  ఇలా ఉత్తినే తీనేయవచ్చు. లేదా పుదీనా, అల్లం చట్నీతో తినవచ్చు.

    సలాడ్
    కావలసినవి: కాబూలి శనగలు, ఉల్లిపాయలు, టొమాటోలు,  కీరా నిమ్మరసం, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు.
    తయారీ: రాత్రంతా నానబెట్టిన ఉడికించిన శనగలు, సన్నగా తరిగిన ముక్కలు, నిమ్మరసం, చాట్‌ మసాలా, ఆలివ్‌ ఆయిల్‌( ఆప్షనల్‌) వేసి బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్‌ చేసుకుంటే  చాలు.

    చనా మసాలా
    కావాల్సినవి : ఉడికించి పెట్టుకున్నశనగలు కాశ్మీరీ ఎండుమిర్చి, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు  మసాలాలు (దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు , బిర్యానీ ఆకులు, ధనియాలు, జీలకర్ర , సోంపు)

    ఒక  పాన్‌లో  కొద్దిగా నెయ్యివేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేస్ట్,‌ మసాలాలు బాగా వేయించాలి.  పాన్ అడుగున అంటు కోకుండా  తిప్పుతూ బాగా వేయించాలి.  ఆ తరువాత తరిగి ఉంచుకున్న టమాటాలు ముక్కలు వేసి మరో  5 నిమిషాలు ఉడికించాలి,  ఉడికాక శనగలు వేసి  ఉప్పు, నూనెపైకి వచ్చేదాకా  బాగా ఉడికించాలి.  రుచి చూసుకొని తినేముందు నిమ్మరసం కలిపి, పైన కొత్తిమీర చల్లుకున్న ఘుమఘుమలాడే చనా మసాలా రెడీ..

    కాబూలీ శనగల స్నాక్స్
    రాత్రంతా నానబెట్టి ఉడికించిన కాబూలి శనగలు.  నూనె, ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి. శనగలను నూనెలో బాగా వేయించి, మసాలాలు  కూడా యాడ్‌ చేసి మరికొద్దిసేపు వేగించి   ఆరగించడమే.

    ఇవి కాకుండా ఉడికించిన శనగలను మెత్తగా చేసి, మసాలాలు జోడించి కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు. శెనగ పిండితో కలిపి బజ్జీలు చేసుకోవచ్చు.

    శనగలతో లాభాలు
    రోగనిరోధక శక్తికి కూడా శనగలు చాలా మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  వీటిలో విటమిన్ బి9, మెగ్నీషియం, జింక్ తదితర పోషకాలుంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇదొక యాంటి ఆక్సిడెంట్‌ కూడా. గ్లూటెన్ రహితం కాబట్టి షుగర్‌, అదుపులో ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బెల్లీ ఫ్యాట్‌ను కరిగిస్తుంది. చర్మ సంరక్షణకు కూడా మంచిదే

    నోట్‌: శనగలు ఆరోగ్యానికి మంచిది.   కానీ ఏదైనా అతిగా తినడం మంచిది కాదు కొంతమందికి గ్యాస్‌ సమస్యలు రావచ్చు. ఏవైనా సందేహాలు, సలహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)

National

  • సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల అయ్యింది. సెప్టెంబర్‌ 9వ తేదీన ఎన్నిక జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్య రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

    ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీ ఆఖరు. నామినేషన్‌ పరిశీలన 22వ తేదీన జరుగుతుంది. ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్‌ 9వ తేదీన ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. దాకా పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది.

    భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం నిర్వహించబడే ఒక ప్రత్యేక ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఈ ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ తరఫున లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.

    పరోక్ష ఓటింగ్ (Indirect Election).. ఏక బదిలీ ఓటు పద్ధతి.. ఓటర్లు ఎన్నికలో నిల్చున్న అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో (1, 2, 3...) గుర్తిస్తారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది

    అర్హతలు

    • భారతీయ పౌరుడై ఉండాలి

    • కనీసం 35 సంవత్సరాల వయస్సు

    • రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలి

    • లాభదాయక పదవిలో ఉండకూడదు

    • రిటర్నింగ్ అధికారిగా..  లోక్‌సభ లేదంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమించబడతారు

    నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపు — మొత్తం ప్రక్రియను 32 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్టికల్ 66 స్పష్టం చేస్తోంది.

Movies

  • హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కోటి ఆశలు పెట్టుకున్న కింగ్డమ్‌ మూవీ (Kingdom Movie) జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొంత నెగెటివ్‌ టాక్‌ ఉన్నప్పటికీ పాజిటివ్‌ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఫస్ట్‌ రోజు కలెక్షన్స్‌ ఎంతన్నదానిపై అందరి దృష్టి పడింది. కానీ, ఎవరి లెక్కలకు అందనంతంగా భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. కింగ్డమ్‌.. తొలి రోజు ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.

    హిట్టు కొట్టినం
    ఈ మేరకు చిత్రయూనిట్‌ అధికారికంగా పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌ను రౌడీ హీరో షేర్‌ చేస్తూ మనం (హిట్‌) కొట్టినం అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌..! ఇకపోతే కింగ్డమ్‌ వీకెండ్‌లో రాలేదు, అందులోనూ హాలీడే అసలే లేదు. అయినా ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ రావడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. లైగర్‌ మూవీ వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలన్నారు.. అప్పుడు ఎత్తిన నోళ్లు దించుకునేలా మా హీరో కింగ్డమ్‌తో సమాధానం చెప్పాడని సంతోషపడుతున్నారు.

    ఆ సినిమాలతోనే పోటీ
    అయితే ఈ చిత్రానికి.. మహావతార్‌ నరసింహ, సయారా చిత్రాల నుంచి గట్టి పోటీనే ఉంది. హరిహర వీరమల్లును జనాలు ఎలాగో లైట్‌ తీసుకున్నారు కాబట్టి ఇదేమంత పోటీ కాదు. మున్ముందు కింగ్డమ్‌ ఎన్ని బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్‌ చేస్తుందో చూడాలి! కింగ్డమ్‌ సినిమా విషయానికి వస్తే.. విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్‌, వెంకటేశ్‌, కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు.

     

    చదవండి: రెమ్యునరేషన్‌ విషయంలో అజిత్‌ సరికొత్త ఢీల్‌

  • కోలీవుడ్హీరో శివ కార్తికేయన్‌, మురుగదాస్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'మదరాసి'(Madharaasi ). ఇందులో హీరోయిన్గా రుక్మిణీ వసంత్‌ నటిస్తుంది. తాజాగా మూవీ నుంచి ఫస్ట్సాంగ్ను విడుదల చేశారు. శ్రీ లక్ష్మీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం సరికొత్త ఎగ్జయిటింగ్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్లో విద్యుత్‌ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా ఉన్న ఈ సాంగ్‌ను సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఆలపించారు. అయితే తెలుగు వర్షన్‌ను ధనుంజయ్ సీపాన ఆలపించారు. 

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: లిక్కర్‌ స్కామ్‌కు చెందిందిగా చెబుతూ సిట్‌ సీజ్‌ చేసిన రూ.11 కోట్లపై  ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌(తెలంగాణ)లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇది రాజ్‌ కేసిరెడ్డిదేనని సిట్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే..  

    సీజ్‌ చేసిన ఆ రూ. 11 కోట్ల నగదును ఫొటోగ్రాఫ్‌ తీయాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. లిక్కర్‌ కేసులో ఇవాళ నిందితుల రిమాండ్‌ ముగియడం.. బెయిల్‌ పిటిషన్లపై కోర్టు వాదనలు వింది. ఆ సమయంలో.. ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన రాజ్ కేసిరెడ్డి.. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ డబ్బులేనని చూపుతున్నారన్నారు. రూ.11 కోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

    ‘‘సిట్ అధికారులు అవి నావేనని అబద్ధం చెప్తున్నారు. 2024 జూన్‌లో నేను వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. నేను పుట్టకముందు ఆస్తులను కూడా నా బినామీలుగా చూపిస్తున్నారు. నా వయస్సు 43 ఏళ్లు. 45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్‌కి నేను బినామీ అని చూపిస్తున్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా..?’’ అంటూ కేసిరెడ్డి ప్రశ్నించారు.

    ‘‘ఆ రూ.11 కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెబుతున్నారు. ఆ డబ్బులపైనా వేలిముద్రలు చెక్ చేయాలని కోరుతున్నాను. 2024 జూన్‌లో ఆ డబ్బు వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముందించిందో తనిఖీ చేయాలి. ఆ నోట్లపై నంబర్లు రికార్డ్‌ చేయాలని కోరుతున్నాను. 

    ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేశారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారు. నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు’’ అంటూ ఏసీబీ న్యాయమూర్తి ముందు రాజ్‌ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరుణంలోనే ఆ డబ్బులను ఫోటోగ్రాఫ్ తీయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

  • సాక్షి, విజయవాడ: లిక్కర్‌ కేసులో అరెస్టైన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ‘‘నేను మూడుసార్లు ఎంపీగా చేశా. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నా. నేను ఎలాంటి స్కాం చేయలేదు. ఇది ఒక​ అక్రమ కేసు. నేనేం దేశం విడిచి ఎక్కడికీ పారిపోను. నాకు బెయిల్‌ మంజూరు చేయాలి’’ అని కోరారాయన.  

    ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే అభియోగాల మీద వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారీయన. జులై 20వ తేదీన సిట్‌ విచారణకు హాజరైన మిథున్‌రెడ్డిని.. ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. ఆపై రాత్రి సమయంలో అరెస్ట్‌ చేశారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 దాకా రిమాండ్‌ విధించింది. ఆ రిమాండ్‌ నేటితో ముగియనుంది.

    ఇదిలా ఉంటే.. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. జరగని స్కామ్‌ జరిగినట్లుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తమ కీలక నేతలను వేధింపులకు గురి చేస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది. 

    	న్యాయమూర్తి ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి విన్నపం

Karnataka

  • తవ్వక

    బనశంకరి: పవిత్ర పుణ్యక్షేత్రంలో నేర పరిశోధన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. అడవులు, నది తీరాలు, చిత్తడి ప్రదేశాలలో పోలీసులు, జాగిలాలతో గాలింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ధర్మస్థలలో మహిళల శవాల పూడ్చివేతల కేసులో సిట్‌ అధికారులు, స్థానిక పోలీసులు గురువారం కూడా గాలింపు చేపట్టారు.

    పాక్షికంగా లభ్యం

    ఫిర్యాదిదారు సూచించిన 6వ పాయింట్‌లో రెండు అస్తిపంజరాలు లభించాయి. వాటిలో కొన్నిభాగాలు మాత్రమే ఉన్నాయి. గత మూడు రోజుల నుంచి కళేబరాల కోసం కూలీ కార్మికులు జేసీబీ యంత్రాలతో తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఎలాంటి ఎముకలు లభించలేదు. ఇంక ఏమీ లేదు అనుకుంటున్న సమయంలో గురువారం పరిస్థితి మారింది. 6వ పాయింట్‌లో 15 మంది కార్మికులతో తవ్వుతుండగా రెండు అస్థిపంజరాలు కనిపించాయి. పురుషుల ఎముకలుగా గుర్తించారు. అవి కూడా కొన్ని భాగాలే లభించాయి. తరువాత 7, 8 పాయింట్లలో గాలించగా అదే మాదిరి పురుషుని పుర్రె, ఎముకలు బయటపడ్డాయి.

    13వ పాయింట్‌పై చూపు

    బుధవారం సాయంత్రం వరకు పాయింట్‌ 1 నుంచి 5 వరకు నాలుగైదు అడుగుల లోతున తవ్వగా ఎలాంటి కళేబరాల జాడ లేదు. ఇప్పుడు 13వ పాయింటుపై అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ అనేక శవాలను పూడ్చిపెట్టినట్లు ఫిర్యాదిదారు చెబుతున్నాడు. ఈ పాయింట్‌ నేత్రావతి స్నానఘట్టం సమీపంలో ఉండగా, శుక్రవారం తవ్వకాలు జరిపే అవకాశం ఉంది.

    ఏమిటీ కేసు?

    నేత్రావతి ఘాట్‌ వద్ద అటవీ ప్రదేశంలో 1998 నుంచి 2014 వరకు వందలాది మహిళలు, పిల్లలు శవాలను పూడ్చిపెట్టానని ఫిర్యాదిదారు చెబుతున్నాడు. తాను అప్పుడు పారిశుధ్య కార్మికునిగా పనిచేశానని తెలిపాడు. అత్యాచారం చేసి హత్య చేశారని పేర్కొన్నాడు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. అన్ని పాయింట్లలో 24 గంటలూ పోలీసు భద్రతను కల్పించారు. ఎటుచూసినా పోలీసు వాహనాలే కనిపిస్తున్నాయి.

    6, 7, 8 పాయింట్లలో పురుషుల ఎముకలు లభ్యం

    ధర్మస్థలలో కళేబరాల కేసు..

    ముమ్మరంగా సాగుతున్న తవ్వకాలు

    ఎవరివి అనేదానిపై ఉత్కంఠ

    సత్యం బయటపడాలి:

    హోంమంత్రి

    యశవంతపుర: ధర్మస్థలలో విచారణ సాగిస్తున్న సిట్‌ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ప్రణవ్‌ మొహంతిని కేంద్ర సర్వీసుకు పంపడం గురించి ఇంకా పరిశీలించలేదని హోంమంత్రి పరమేశ్వర్‌ తెలిపారు. ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొందరూ ఐపీఎస్‌లను డిప్యుటేషన్‌ చేయగా ఆ జాబితాలో మొహంతి పేరు ఉంది. కేంద్ర సర్వీసుకు పండంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ధర్మస్థలలో ఏం జరిగిందనే సత్యాన్ని బహిరంగం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు.

    ల్యాబ్‌ పరీక్షలకు తరలింపు

    6, 7, 8 పాయింట్లలో సాయంత్రం వరకు లోతుగా తవ్వి అవశేషాల కోసం మట్టిని బయటికి తీశారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రతి ఎముకను పరిశీలించి నంబరు రాసి బ్యాగులో వేశారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పరీక్షలకు పంపిస్తారు. ఎవరివి, ఎలా చనిపోయారు అనే వివరాలు సేకరిస్తారు. ఘటనా స్థలానికి సిట్‌ చీఫ్‌ ప్రణవ్‌ మొహంతి చేరుకుని సమాచారం సేకరించారు. సిట్‌కు మరో 9 మంది పోలీసులను డీజీపీ ఎంఏ.సలీం నియమించారు. దక్షిణ జిల్లాలో వివిధ ఠాణాలకు చెందిన ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు ఇందులో ఉన్నారు.

  • బాలికా హంతకునికి జీవితఖైదు

    మైసూరు: బాలికను అపహరించి హత్య చేసిన కిరాతకునికి చామరాజనగర జిల్లా సెషన్స్‌ ఎఫ్‌టీఎస్‌సీ 1వ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. వివరాలు.. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా వడ్డరదొడ్డి సమీపంలోని గోడెన్స్‌ నగర నివాసి తంగరాజు దోషి. ఇతను భార్యను వదిలేశాడు. 2018లో ఓ బాలికను ప్రేమ, పెళ్లి అని మోసపుచ్చి కిడ్నాప్‌ చేశాడు. తర్వాత ఇనుప రాడ్డుతో కొట్టి బాలికను చంపి మృతదేహాన్ని ఇంట్లో వదిలి పరారయ్యాడు. ఈ ఘటనపై రామాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి తంగరాజును బంధించి, కోర్టులో చార్జిషీట్‌ సమర్పించారు. కోర్టు జడ్జి ఎస్‌జే కృష్ణ తుది విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో తంగరాజుకు జీవితఖైదు, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. న్యాయ సేవా ప్రాధికారం నుంచి రూ.5 లక్షల పరిహారాన్ని బాలిక కుటుంబానికి అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ వకీలు కే.యోగేష్‌ వాదనలు వినిపించారు.

    మంత్రిపై హనీట్రాప్‌ ఉత్తిదే

    సీఐడీ నివేదిక

    దొడ్డబళ్లాపురం: గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి రాజన్న తనపై హనీట్రాప్‌ కుట్ర జరుగుతోందని చేసిన ఆరోపణల్లో నిజం లేదని సీఐడీ ప్రకటించింది. దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు ఐజీపీకి నివేదిక ఇచ్చారు. మంత్రి ఆరోపణల మీద ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని పేర్కొన్నారు.

    ఓ యువతి, కొందరు తన ఇంటికి వచ్చేవారు, కుమారునికి ఫోన్‌ చేసేవారు, హనీట్రాప్‌లోకి లాగడానికి ప్రయత్నించారు అని రాజన్న అప్పట్లో ఆరోపించడం తెలిసిందే. ఇది రాజకీయ దుమారం లేపింది. చివరకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా ఏం జరిగిందని ఆరా తీసింది. మంత్రుల మధ్య గొడవలే హనీట్రాప్‌ రచ్చకు దారితీసిందని ప్రచారం సాగింది.

    క్వాంటమ్‌ రాజధానిగా

    కర్ణాటక: సీఎం

    బనశంకరి: రాష్ట్రంలో క్వాంటమ్‌ విధానం రూపొందించామని, ఈ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. గురువారం నగరంలోని ఓ హోటల్‌లో క్వాంటమ్‌ ఇండియా బెంగళూరు– 2025 సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటకలో క్వాంటమ్‌ ద్వారా 2035 లోగా లక్ష అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టించి క్వాంటమ్‌ రాజధానిగా చేయాలనేది ఆశయమన్నారు. 20 బిలియన్‌ డాలర్ల క్వాంటమ్‌ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలన్నదే లక్ష్యమని, ఇందుకోసం కర్ణాటక క్వాంటమ్‌ మిషన్‌ ప్రారంభించామని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బోసరాజు, ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

    టిక్‌టాకర్‌ నిర్బంధం

    యశవంతపుర: జర్మనీకీ చెందిన ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ నోయెల్‌ రాబిన్సన్‌ను బెంగళూరు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చర్చి స్ట్రీట్‌లో భారతీయ సాంస్కృతిక పండుగలో నృత్యం చేస్తుండగా చూడటానికి వందల మంది జనం గుమిగూడారు. ప్రజలు, వాహనాల సంచారానికి ఇబ్బంది కలిగించారని రాబిన్సన్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. గతంలో కూడా ఓ ప్రముఖ పాప్‌ స్టార్‌ ప్రదర్శన ఇస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

    ప్లాట్‌ఫారంపై ప్రసవం

    యశవంతపుర: బెంగళూరు రైల్వే స్టేషన్‌లో అమృత అనే గర్భిణి ప్లాట్‌ఫారంపై ప్రసవించింది. సహ ప్రయాణికులు, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సహకారంతో కాన్పు జరిగింది. నెలలు నిండిన గర్భిణి ఊరికి వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు రాగా ప్రసవవేదన ఆరంభమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదు. ఆమెకు కొడుకు జన్మించాడు. తరువాత స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.

  • కూతుర

    దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ తల్లి కఠినాత్మురాలిగా మారింది. చిన్నారి బిడ్డకు విషం పెట్టి చంపి తానూ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బెంగళూరు బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. తిగళరపాళ్య నివాసి చంద్రిక (26), భర్త యోగేష్‌, కూతురు (20 నెలలు) తో జీవిస్తున్నారు. యోగేష్‌ గార్మెంట్స్‌ కార్మికుడు. కొన్నిరోజులుగా తీవ్ర కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో విసిగిపోయిన ఆమె టీ లోకి ఎలుకల మందును కలిపి బిడ్డకు తాగించి తరువాత తానూ తాగింది. ఇద్దరూ బాధతో ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చిన్నారి మృతిచెందగా చంద్రిక చికిత్స పొందుతోంది. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

    రూ.70 లక్షల హషిష్‌ ఆయిల్‌ సీజ్‌

    దొడ్డబళ్లాపురం: బెంగళూరు రైల్వేస్టేషన్‌ పోలీసులు రూ.70 లక్షల విలువైన హషిష్‌ అనే గంజాయి ఆయిల్‌ని పట్టుకున్నారు. దీనిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అప్పలరాజు (34) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భరత్‌ అనే వ్యక్తి నుంచి ఆయిల్‌ కొనుగోలు చేసి తీసుకువచ్చి యలహంకలో డ్రగ్స్‌ వ్యసనపరులకు విక్రయించేవాడు. సమాచారం అందడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి ఆయిల్‌ని సీజ్‌ చేశారు.

    మద్యం మత్తులో తల్లికి నిప్పు

    శివాజీనగర: మద్యం మత్తులో కుమారుడే తన తల్లికి నిప్పుపెట్టి, ఏమీ తెలియనట్టు పక్కనే నిద్రపోయాడు. ఈ దారుణ సంఘటన ఘటన చిక్కమగళూరు జిల్లా అరెనూరు సమీపంలోని అక్కిమక్కి గ్రామంలో జరిగింది. మహిళ భవాని (51) కూలి పని చేసుకొంటూ జీవించేది. కొడుకు పవన్‌ (27) తల్లితో కలసి నివాసమున్నాడు. బుధవారం రాత్రి బాగా తాగి వచ్చాడు, మద్యం తాగవద్దని, బుద్ధిగా పనిచేసుకోవాలని తల్లి మందలించింది. దీంతో కోపోద్రిక్తుడై గొడవపడ్డాడు. ఆమె మీద పెట్రోలు చల్లి నిప్పు పెట్టడంతో మంటల్లో కాలిపోసాగింది. కానీ దుండగుడు నిద్రపోసాగాడు. మహిళ కేకలు విన్న ఇరుగుపొరుగువారు చేరుకొని చూసేలోగానే పూర్తిగా కాలిపోయి చనిపోయింది. అల్దూరు పోలీసులు చేరుకొని కుమారున్ని అరెస్ట్‌ చేశారు. ఇతని తండ్రి కూడా తాగుబోతే. అతడు ఇంట్లో లేనప్పుడు ఈ ఘటన జరిగింది.

    ఎమ్మెల్యే కొడుక్కి

    దక్కని ఊరట

    యశవంతపుర: కాబోయే భార్యపై అత్యాచారం, చీటింగ్‌ కేసులో బీజేపీ ఔరాద్‌ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్‌ కొడుకు ప్రతీక్‌ బెయిలు అర్జీని బీదర్‌ సెషన్స్‌కోర్టు తిరస్కరించింది. బాధితురాలు అతనిపై స్థానికంగా, మహారాష్ట్రలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు ప్రతీక్‌పై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు అర్జీ దాఖలు చేయగా గురువారం విచారించారు. నిశ్చితార్థం చేసుకుని, షికార్లు చేసి పెళ్లి చేసుకోలేదని బాధితురాలు ఆరోపించింది.

  • కూలిన

    బనశంకరి: బెంగళూరు లో సంపంగి రామనగరలో జియో హోటల్‌ వద్ద పాత కట్టడం గురువారం ఆకస్మాత్తుగా కూలిపోయింది. 80 ఏళ్ల క్రితం నాటి రెండంతస్తుల కట్టడం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ధ్వంసమైంది. ఆ సమయంలో కట్టడంలో యజమాని అశ్విన్‌ ఉండగా తీవ్రంగా గాయపడ్డాడు.

    సంపును తవ్వుతుండగా

    వివరాలు.. నెల కిందట వరకు ఈ భవనంలో ఓ కుటుంబం బాడుగకు ఉండేది. వారు ఖాళీ చేయడంతో వంటశాలగా ఉపయోగిస్తున్నారు. అలాగే సంపు కోసం ముగ్గురు కార్మికులతో తవ్వకం చేపట్టారు. కూలిపోవడానికి 10 నిమిషాల ముందు ముగ్గురు కార్మికులు భోజనానికి బయటకు వచ్చారు. అశ్విన్‌ ఒక్కడే అందులో ఉన్నాడు. ఇంతలో పెద్దశబ్ధంతో భవనం కుప్పకూలిపోయింది. వెంటనే స్థానికులు అతి కష్టమ్మీద అశ్విన్‌ను బయటకు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది చేరుకుని లోపల ఇంకా ఎవరైనా చిక్కుబడ్డారా అని తనిఖీలు చేశారు. పాత భవనం కావడం, సంపు గుంతను తవ్వడం వల్ల ప్రకంపనలకు కూలిపోయిందని భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలో పాత భవనాల మనుగడ మరోసారి చర్చకు వచ్చింది. బీబీఎంపీ సిబ్బంది తమ వలయాల్లోని పాత భవనాలను ఖాళీ చేయాలని గతంలో కార్యాచరణ చేపట్టారు. కానీ కొన్నిరోజులకే అది అటకెక్కింది.

    యజమానికి తీవ్ర గాయాలు

    తృటిలో తప్పించుకున్న కూలీలు

    బెంగళూరులో ఘటన

  • పాలికె భేటీలో తోపులాట

    హుబ్లీ: ముఖ్యమంత్రి వివేచన నిధి ద్వారా ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణి నియోజకవర్గానికి మంజూరు అయిన రూ.10 కోట్ల నిధుల కార్యచరణ పథకం ఆమోదం గురించి గురువారం హుబ్లీ–ధార్వార నగర పాలికె సమావేశంలో భారీ రగడ జరిగింది. నిధుల కార్యచరణ వివరాలు లేవంటూ కాంగ్రెస్‌ కార్పొరేటర్లు చర్చను అడ్డుకున్నారు. మేయర్‌ పీఠం ముందుకు వచ్చి రభస చేశారు. బీజేపీ కార్పొరేటర్లు కూడా గొడవకు దిగారు. మేయర్‌ జ్యోతి పాటిల్‌ రెండు సార్లు సమావేశాన్ని వాయిదా వేసినప్పటికీ ఉద్రిక్తత చల్లారలేదు. 3 గంటలకుపైగా అరుపులు కేకలతో రణరంగాన్ని తలపించింది. దీంతో కాంగ్రెస్‌ సభ్యులందరిని బలవంతంగా బయటకు పంపించారు. ఈ సమయంలో సభ్యుడు శివన్న కల్లుకుంట్ల బయటకు వెళ్తుండగా గుండెనొప్పి అని పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

    ఒక్క కొళాయి చాలా?

    తరువాత ప్రజలకు తాగునీరు సరఫరా కావడం లేదని, ఒక భవనానికి ఒకటే కొళాయి అనే విధానం సబబు కాదని సభ్యులు గొంతెత్తారు. ఒకే భవనంలో మూడు నాలుగు కుటుంబాలు ఉంటే ఒక్క కొళాయి నీళ్లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. మేయర్‌ జ్యోతి స్పందిస్తూ తాగునీటి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు.

    హుబ్లీ– ధార్వాడ కార్పొరేషన్‌ సమావేశం రసాభాస

  • కాంట్రాక్టు ఉద్యోగి.. కోటీశ్వరుడు

    రాయచూరు రూరల్‌: కర్ణాటక గ్రామీణ మౌళిక సౌకర్యాల అభివృద్ధి మండలి (కెఆర్‌డిఎల్‌)లో కాంట్రాక్ట్‌ ఉద్యోగి అగర్భ శ్రీమంతుడయ్యాడు. లంచాలు, అవినీతి దీనికి కారణం. కొప్పళ జిల్లా కేంద్రంలో నెలకు రూ.15 వేల వేతనంతో పనిచేసే కాంట్రాక్ట్‌ పని ఉద్యోగి కళకప్ప నిడగుంది వ్యవహారం తెలిసి లోకాయుక్త అధికారులు దాడులు జరిపారు. కొప్పళ భాగ్య నగరలో 24 ఇళ్లు, భవనాలు, 6 స్థలాలు, తమ్ముడు, అతని భార్య పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆఫీసులో కళకప్ప దూకుడును తట్టుకోలేక కొందరు అధికారులు లోకాయుక్తకు సమాచారం ఇచ్చారు. దీంతో బుధ, గురువారాల్లో సోదాలు చేపట్టారు. అతని ఇంటిలో లభించిన భారీ బంగారు నగలు, స్థిరాస్తులను చూసి అందరూ నోరెళ్లబెట్టారు. కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా బండిహాళ్‌కు చెందిన అతడు 20 ఏళ్ల కిందట ఈ ఉద్యోగంలో చేరాడు. ఆనాటి నుంచి అవినీతి అక్రమాలను ఆలంబనగా చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మండలిలో రూ.72 కోట్ల నిధుల దు ర్వినియోగంలో ఇతని పాత్ర ఉన్నట్లు గుసగుసలున్నాయి. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

    కొప్పళలో లోకాయుక్త దాడులు

    24 ఇళ్లు, భారీగా బంగారం గుర్తింపు

Parvathipuram Manyam

  • డిజిట
    కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు తయారైంది కూటమి ప్రభుత్వం తీరు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ తీసుకోవడం లేదు కానీ..ప్రజలను ఏదో రకంగా దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి డిజిటల్‌ బోర్డుల ఏర్పాటు పేరుతో చేస్తున్న కలెక్షన్లు ఉదాహరణగా నిలుస్తున్నాయి. –వీరఘట్టం

    తప్పుల తడకగా ఇంటి నంబర్ల నమోదు

    ఒక్కో బోర్డుకు రూ.50 చొప్పున వసూలు

    ఈ పొటో చూశారా? వీరఘట్టంలోని తెలగవీధిలో ఓఇంటికి 5–18 నంబర్‌ వేస్తూ బోర్డు అతికించారు.అయితే ఈ ఇంటి నంబర్‌ 6–68 అని పంచాయతీ రికార్డులో ఉంది.తప్పులు తప్పులుగా బోర్డులు అతికించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని వారు చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ వారడిగిన రూ.50 ఇచ్చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.

    ప్రతి ఇంటికి డిజిటల్‌ ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటు పేరుతో ప్రజల నుంచి దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీపై జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి ఈ ఏడాది మార్చి 23న ఉత్తర్వులు ఇచ్చినట్లు బోర్డులు అమర్చడానికి వచ్చినవారు చెబుతున్నారు. అధికారులు ఇచ్చిన జీవో కాపీ చూపిస్తున్నారు. అయితే ఈ డిజిటల్‌ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.అభ్యంతరాలుంటే బోర్డులు బిగించవద్దని,.పేద, మధ్య తరగతి వారికి ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ జీవో కాపీలో ఉంది.అయితే అవేవీ కాకుండా ప్రతి ఇంటికి బోర్డు బిగించి డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.అయితే ఈ బోర్డుల ఏర్పాటుకు తమకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారే తప్ప ఈ నిలువు దోపిడీని అడ్డుకోకపోవడంపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇంటింటికీ ఏర్పాటు చేస్తున్న ఇంటి నంబర్లు తప్పుల తడకగా ఉన్నాయి.

    ఫోన్‌ కాల్స్‌ ఒత్తిడితో..

    అమరావతి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ ఒత్తిడితో ఇంటి చిరునామా బోర్డుల ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ ముఠా నేరుగా గ్రామాల్లో ఇంటి చిరునామా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.పేరుకు వీరు ఒక్కో ఇంటి నుంచి కలెక్షన్‌ చేస్తున్నది రూ.50 గా కనిపిస్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ.2.25 కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. కొంత మంది మాత్రం ఈ బోర్డులు వద్దని తిరస్కరిస్తున్నప్పటికీ వారితో వాదిస్తూ ఈ బోర్డులు అందరి ఇళ్లకు వేయాలని మా వద్ద ఆర్డర్‌ కాపీ ఉందని బలవంతంగా ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

    ఈ ఫొటో చూశారా?

    చిన్న ఇనుప రేకును తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మన్యం జిల్లా, డిజిటల్‌ ఇంటి చిరునామా అనే అక్షరాలు ఉన్న ప్రతి ఇంటి గుమ్మానికి అతికిస్తున్నారు. ఇలా రేకు బోర్డు పెట్టినందుకు ప్రతి ఇంచి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. వీరఘట్టం మండలంలో ఇంతవరకు సుమారు 15 వేల ఇళ్లకు ఇటువంటి బోర్డులు పెట్టి గృహవాసుల నుంచి రూ.7.50 లక్షలను వసూలు చేశారు. ఇదే మాదిరి జిల్లాలో ఉన్న 4.50 లక్షల గృహాలకు ఇటువంటి బోర్డులు అమర్చి ఏకంగా రూ.2.25 కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. డిజిటల్‌ బోర్డు పేరుతో ఇంటికి అమర్చుతున్న ఈ రేకు కనీసం రూ.5 కూడా ఉండదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    మాకు సంబంధం లేదు

    జిల్లాలో చాలా చోట్ల ఇంటికి డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఆ బోర్డుల ఏర్పాటుకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నచ్చకపోతే ఎవరూ ఆ బోర్డులు ఏర్పాటు చేసుకోవద్దు. ఎక్కడైనా బోర్డులు ఏర్పాటు చేయాలనుకుంటే గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి, పంచాయతీ అంగీకారంతో పంచాయతీ రికార్డుల ప్రకారం ఇంటి నంబర్లు వేసి బోర్డులు ఏర్పాటు చేయవచ్చు. ఇష్టం లేని వారు బోర్డులు వద్దని చెప్పండి.

    – పి.కొండలరావు,

    డీపీఓ, పార్వతీపురం మన్యం జిల్లా

  • శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ జవహర్‌నవోదయ విద్యాలయలో మూడురోజులుగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ రీజియన్‌స్థాయి హ్యాండ్‌బాల్‌ మీట్‌ 2025–26 గురువారం ముగిసింది. ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌ పర్యవేక్షణలో నిర్వహించిన హ్యాండ్‌బాల్‌ మీట్‌కు దక్షిణ భారతదేశంలో ఎనిమిది క్లస్టర్లు యానాం, అదిలాబాద్‌, కన్నూర్‌, కరైకల్‌, ఎర్నాకుళం, హవేరి, హాసన్‌, కలబుర్గిల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారంతా మూడు రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఏపీ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎస్‌.రాజారావు నేతృత్వంలో నిర్వహించిన పోటీల్లో యానాం క్లస్టర్‌ అత్యుత్తమ ప్రదర్శనతో 26బహుమతులు సాధించి ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ కై వసం చేసుకుంది. గురువారం సాయంత్రం ముగింపు వేడుకల్లో ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలను దిగ్విజయంగా పూర్తిచేసిన రిఫరీలు, కోచ్‌లు, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, క్రీడాకారులకు ప్రిన్సిపాల్‌ ధన్యవాదాలు తెలిపారు.

  • మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

    పార్వతీపురం రూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో మిగులు సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌ ఎస్‌. రూపావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత విద్య, వసతి సౌకర్యాలతో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం వరకు ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్‌ కార్డుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్‌తో తమకు కావాల్సిన ప్రాంతంలో ఆయా పాఠశాలలను, కళాశాలను నేరుగా వెళ్లి సంప్రదించాలని కోరారు. బాలురుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో కొప్పెర్ల, బాడంగి, పాలకొండ, సాలూరు, జోగింపేటలో అదేవిధంగా బాలికలకు సంబంధించి చీపురుపల్లి, నెల్లిమర్ల, వేపాడ, వీఎంపేట, వంగర, గరుగుబిల్లి, కొమరాడ, భామిని పాఠశాలల్లో అలాగే కళాశాలల్లో ఉన్న ఖాళీల మేరకు సంబంధిత ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని సూచించారు.

    జిల్లా కన్వీనర్‌ ఎస్‌ రూపావతి

Mahabubabad

  • గమ్యం

    మామునూరు: ఏకాగ్రతతో గమ్యంపై గురిపెడితే విజయం సొంతమవుతుందని తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌ బిస్త్‌ అన్నారు. పోలీస్‌ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్‌లు ఎంతో దోహదపడుతా యని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో తెలంగాణ పోలీస్‌ దేశంలోనే బెస్ట్‌ అని కొనియాడా రు. వరంగల్‌ మామునూరు పోలీస్‌ శిక్షణ కళాశాల పరేడ్‌ గ్రౌండ్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో రెండో తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌–20 25 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. తె లంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌ బిస్త్‌, అ డిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌ ముఖ్య అతిథులుగా హాజరై డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో ని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన 450 మంది పైగా 18 టీమ్‌లు హాజరుకాగా.. పోలీసులు జెండాలు చేతబూని అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌ బిస్త్‌ మాట్లాడుతూ నేర దర్యాప్తుతోపాటు అన్ని విభాగాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో నిలవడం హర్షణీయమన్నారు. 69వ ఆలిండియా డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

    జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం

    అభినందనీయం..

    ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీసులు 18 పతకాలు సాధించడం అభినందనీయమని అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌ అన్నారు. జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పథకాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. అంతకు ముందు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌.. తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహణను వివరించారు.

    450 మందికిపైగా పోలీస్‌

    అధికారులు, సిబ్బంది హాజరు..

    వరంగల్‌ మామునూరు పీటీసీలో గురువారం నుంచి ఆగస్ట్‌ 2వ తేదీ వరకు జరగనున్న పోలీస్‌ డ్యూటీ మీట్‌–2025 అట్టహాసంగా ప్రారంభమైంది. రా ష్ట్రంలోని ఏడు జోన్లతోపాటు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్లు, సీఐడీ, ఇంటెలిజె న్స్‌, యాంటీ నార్కొటిక్‌ బ్యూరో, సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌, జీ.ఆర్‌.పీ, ఐటీ అండ్‌ టీ, ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ విభాగాలకు చెందిన సుమారు 450 మందికిపైగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సైంటిఫిక్‌ ఎయిడ్‌ ఇన్విస్టిగేషన్‌, యాంటీ సబటేజ్‌ చె క్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, డాగ్‌ స్క్వాడ్‌ కాంపీటిష న్‌, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు ప్రారంభమయ్యా యి. సీఐడీ డీఐజీ నారాయణ నాయక్‌, ఎస్పీ రాంరె డ్డి, డీసీపీలు అంకిత్‌కుమార్‌, సలీమా, రాజమహేంద్రనాయక్‌, పీటీసీ ప్రిన్సిపాల్‌ ఇ.పూజ, కమాండెంట్లు రాంప్రకాశ్‌, రామకృష్ణ, అడిషనల్‌ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

    జెండాను ఆవిష్కరిస్తున్న అభిలాష్‌ బిస్త్‌

    విధుల్లో తెలంగాణ

    పోలీస్‌ దేశంలోనే బెస్ట్‌

    వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్‌ దోహదం

    69 ఆలిండియా డ్యూటీ మీట్‌లో

    సత్తా చాటాలి

    తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌ బిస్త్‌

    అట్టహాసంగా పోలీస్‌ డ్యూటీ

    మీట్‌–25 ప్రారంభం

  • ‘కాసం’ ప్రజాపోరాటాలు చిరస్మరణీయం

    నేడు నీర్మాలలో కృష్ణమూర్తి వర్ధంతి

    దేవరుప్పుల : భూమి కోసం..భుక్తి కోసం..బానిస బంధాల విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా కాసం కృష్ణమూర్తి చేపట్టిన ప్రజాపోరాటాలు చిరస్మరణీయం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన కాసం కృష్ణమూర్తి గ్రామాల్లో భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల పెత్తందారి వ్యవస్థపై ఎదురుదిరిగారు. తన తుదిశ్వాస వరకూ సీపీఎం అనుబంధ ఉమ్మడి రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా అనేక విరోచిత పోరాటాలు చేపట్టారు. కాసం వారసత్వాన్ని అందిపుచ్చుకునే క్రమంలో శుక్రవారం నీర్మాలలో ఆయన వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ సభను జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఇంటి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యూడల్‌, రాచరిక పాలన, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించి దళాలుగా ఏర్పడి ఈ ప్రాంత భూస్వాములు, దేశ్‌ముఖ్‌లను తరిమిన మహావీరుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కాసం కృష్ణమూర్తి అన్నారు. కార్యక్రమంలో నాయకులు పయ్యావుల భిక్షపతి, గడ్డం యాదగిరి, కున్సోత్‌ మాలు, రెడ్డిరాజుల నారాయణ, జాటోత్‌ శ్రీను నాయక్‌, గోడిశాల రాములు, కాసర్ల యాదిరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు .

  • డబ్బుల వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌

    చిట్యాల: మావోయిస్టు ముసుగులో డబ్బుల వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని గురువారం అరెస్ట్‌ చేసి కో ర్టులో హాజరుపరిచినట్లు సీఐ మల్లేశ్‌ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన పల్లెపాటి గోపాల్‌రావు మద్యం, పేకాటకు బానిసయ్యాడు. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మావోయిస్టు పేరుతో ఓ లేఖను సృష్టించాడు. అనంతరం పది రోజుల క్రితం చిట్యాల మండలం శాంతినగర్‌ శివారులోని శ్రీ లక్ష్మీనర్సింహ రైస్‌ మిల్లు యజమాని శేఖరయ్యకు ఫోన్‌ చేసి మీతో మాట్లాడాలని చెప్పి మావోయిస్టు పార్టీ ఇచ్చినట్లు ఓ కవర్‌ అందించాడు. అందులో పార్టీ కోసం రూ.25 లక్షలు చందా రూపకంగా ఇవ్వాలని ఉంది. అలాగే, ప్రస్తుతం రూ. లక్ష ఇవ్వాలని, లేనిపక్షంలో చంపేస్తానని బెదించాడు. వారం రోజుల్లో రూ.25 వేలు ఇవ్వాలని, లేకపోతే చంపుతానని హెచ్చరించాడు. దీంతో రైస్‌మిల్లు యజమాని శే ఖరయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అప్రమత్తయ్యారు. ఈ క్రమంలో గురువారం డబ్బులు తీసుకోవడానికి వస్తున్న గోపాల్‌రావును కై లాపూర్‌ క్రాస్‌ వద్ద పోలీసులు ఆపి విచారించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మావోయిస్టుల పేరుతో ఎవరైనా చందాల వసూళ్లకు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై శ్రావన్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

  • సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం

    కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఏబీఎస్‌ఎఫ్‌ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్‌ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనానికి గురువారం యత్నించారు. కేయూ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎస్‌ఎఫ్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్‌ఎఫ్‌ నాయకులు విజయ్‌, నందు, విష్ణు, పీటర్‌, శ్రీకాంత్‌, పవన్‌, అరవింద్‌, నవీన్‌, తరుణ్‌, గణేశ్‌, వంశీ, గోవింద్‌, సమ్మయ్య, సూర్యసాయి తదితరులు పాల్గొన్నారు.

  • వరంగల

    ఖండాంతరాలు దాటిన ప్రేమపెళ్లి

    రామన్నపేట : వరంగల్‌ అబ్బాయి, అమెరికా అమ్మాయి ప్రేమ వివాహం గురువారం నగరంలోని వెంకటేశ్వర గార్డెన్‌లో ఇరుకుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌కు చెందిన డాక్టర్‌ అశోక్‌, సునీత దంపతుల కుమారుడు రితేశ్‌, అమెరికాలోని పీట్స్‌బర్గ్‌కు చెందిన జూలియాన్‌ మనస్సులు కలవడంతో పెద్దలను ఒప్పించి బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, అమెరికా అమ్మాయి అయినా అచ్చ తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగడంపై అతిథులు ఆనందం వ్యక్తం చేశారు.

    డీఈఓకు సన్మానం

    విద్యారణ్యపురి : న్యాస్‌ (పరాక్‌)లో హనుమకొండ జిల్లాను ఉత్తమస్థానంలో నిలిపినందున జూలై 30వ తేదీన హైదరాబాద్‌లో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన జిల్లాల విద్యాశాఖాధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారురు కె.కేశవరావు, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగి తారాణా.. డీఈఓ వాసంతిని సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

    కేయూ ఇన్‌చార్జ్‌ ఫైనాన్స్‌

    ఆఫీసర్‌గా హబీబుద్దీన్‌

    కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా డిప్యూటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మహ్మద్‌ హబీబుద్దీన్‌ నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తోట రాజయ్య ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఇన్‌చార్జ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా హబీబుద్దీన్‌కు బాధ్యతలు అప్పగించారు. హబీబుద్దీన్‌ కేయూలో 1988లో చిరు ఉద్యోగిగా చేరి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగం చేసుకుంటూనే సోషియాలజీలో డాక్టరేట్‌ పొందారు. నేడు (శుక్రవారం) రిజిస్ట్రార్‌ హబీబుద్దీన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

    జిల్లాలో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

    కాజీపేట రూరల్‌: జిల్లాలో హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, బలరాంనాయక్‌ను గురువారం కలిసి వినతి పత్రాలు అందజేశారు. గతేడాది కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, వరంగల్‌కు రెండు వెల్‌నెస్‌ సెంటర్లు మంజూరైనట్లు తెలిపారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లి సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నేత సదానందం తెలిపారు.

  • నిద్ర

    కేసముద్రం: ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న ఓ ఆరేళ్ల బాలుడి మెడపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉపేందర్‌, శిరీష దంపతులకు మనీష్‌, మోక్షిత్‌ ఇద్దరు కుమారులున్నారు. ఉపేందర్‌ తన తల్లిదండ్రులైన ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా, నానమ్మ (మంగమ్మ) పక్కన పడుకున్న మనీష్‌ అనే ఆరేళ్ల బాలుడి మెడకు ఒకవైపు, వీపుభాగంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. దీంతో ఆ బాలుడు ఏడుస్తుండగా నిద్రలేచిన మంగమ్మ తన మనుమడిని దగ్గరకు తీసుకుని చూసింది. మనీష్‌ మెడభాగంపై గాయమై తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో కేకలు పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, చుట్టుపక్కలున్న వారు నిద్రలేచి మనీష్‌ను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుంచి మానుకోట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మెడపై కత్తిగాటుతో పొడవుగా పడటంతో 8 కుట్లు పడ్డాయి. కాగా, ఇంటికి రెండు దర్వాజలు ఉండగా, ఒక దర్వాజ తలుపులకు బేడం లేదని, దీంతో ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి ట్రైనీ ఎస్సై నరేష్‌ సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. రూరల్‌ సీఐ సర్వయ్య మానుకోట జనరల్‌ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉపేందర్‌, శిరీష దంపతుల చిన్నకుమారుడైన నిహన్‌ (యేడాదిన్నర బాలుడు) 7 నెలల క్రితం నీటిసంపులో పడి మృతిచెందాడు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మనీష్‌ను మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.

    మెడభాగంలో కోసిన

    గుర్తుతెలియని వ్యక్తులు

    తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రికి తరలింపు

    మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

  • వైద్యం కోసం వచ్చి అనంతలోకాలకు..

    జనగామ: వ్యవసాయ పొలంలో జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ రైతు వైద్యం కోసం వచ్చి ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసంతాపురం గ్రామానికి చెందిన రైతు ఎం.ప్రభాకర్‌రెడ్డి(47) గత నెల 26వ తేదీన వ్యవసాయ పొలం దున్నుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌ తీగ తెగిపడడంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో ట్రాక్టర్‌ కేజ్‌వీల్స్‌ అతడి రెండు కాళ్లపై వెళ్లడంతో వెంటనే జనగామలోని ‘అజంతా’ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్‌ బాలాజీ పరీక్షించి.. ప్రభాకర్‌రెడ్డి కాలుకు ఇన్‌ఫెక్షన్‌ ఉందని, తగ్గే వరకు సర్జరీ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బుధవారం ఇంటికి తీసుకెళ్లాలని చెప్పగా పరిస్థితి విషమంగా ఉంటే ఎలా తీసుకెళ్లాలని కుటుంబీకులు సదరు వైద్యుడిని నిలదీయగా ఆస్పత్రిలోనే ఉండమన్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ప్రభాకర్‌రెడ్డి మృతిచెందాడు. దీంతో డాక్టర్‌ నిర్లక్ష్యంతోనే ప్రభాకర్‌రెడ్డి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. కాలు ఇన్‌ఫెక్షన్‌కు గురైతే మరో ఆస్పత్రికి రెఫర్‌ చేయకుండా, ఐదు రోజులుగా ఆ ఆస్పత్రిలోనే ఉంచుకోవడంతోనే పరిస్థితి విషమించి ప్రభాకర్‌ రెడ్డి మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఈ ఘటనపై డాక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ పేషెంట్‌కు షుగర్‌, వీడీఆర్‌ఎల్‌ పాజిటివ్‌, ఇన్‌ఫెక్షన్‌, మోకాళ్ల వాపులు ఉండడంతో తగ్గే వరకు సర్జరీని వాయిదా వేసినట్లు చెప్పారు. అంతలోనే గుండెపోటుతో మృతి చెందాడని, ఇందులో తమ తప్పులేదని తెలిపారు.

    ఆస్పత్రిలో రైతు మృతి

    డాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ

    బాధితుల ఆందోళన

    జనగామ జిల్లా కేంద్రంలో ఘటన

  • నిధుల వినియోగంపై  విచారణ చేపట్టాలి

    ● సీఐడీకి తెలంగాణ క్రికెట్‌ సంఘం ఫిర్యాదు

    వరంగల్‌ స్పోర్ట్స్‌ : బీసీసీఐ నుంచి హెచ్‌సీఏ ద్వారా ఆయా జిల్లాలకు విడుదలయ్యే నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా కార్యదర్శి తాళ్లపెల్లి జయపాల్‌ గురువారం సైబరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పది సంవత్సరాలుగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పేరుతో రాష్ట్రంలోని జిల్లా సంఘాల ఖాతాల్లో రూ. 12 కోట్లు జమ చేశారని పేర్కొన్నారు. అందులో ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీఐడీ అధికారులను కోరారు.

    హత్యాయత్నం కేసులో వ్యక్తికి ఐదేళ్ల జైలు, జరిమానా

    దంతాలపల్లి: హత్యాయత్నం కేసులో నేరస్తుడికి ఐదేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ మహబూబాబాద్‌ జిల్లా కోర్టు గురువారం తీర్పువెలు వరించింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఏరుకొండ నరేశ్‌ అదే గ్రామానికి చెందిన పోలోజు సునీతపై 2023 సంవత్సరంలో కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సునీత కుమారుడు యాకాంబ్రం ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై జగదీశ్‌ కేసు నమోదు చేసి మహబూబాబాద్‌ జిల్లా కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. వాదోపవాదల అనంతరం నేరం రుజువు కావడంతో నేరస్తుడు నరేశ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10వేలు జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి, అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి షాలిని షాకెల్లి తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీ గణేశ్‌ ఆనంద్‌, ఎస్సై జగదీశ్‌, ఎస్సై రాజు, కోర్టు కానిస్టేబుల్‌ మంగీలాల్‌ను ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్‌ కేకన్‌ అభినందించారు.

  • ప్రజా మరుగుదొడ్ల  నిర్వహణ చేపట్టాలి

    రామన్నపేట : నగరంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. గురువారం హనుమకొండ ఏషియన్‌ షాపింగ్‌ మాల్‌ ప్రాంతంలోని డబుల్‌ బెడ్రూంలను, 35వ డివిజన్‌ వరంగల్‌ పుప్పాలగుట్ట వాటర్‌ ట్యాంక్‌ వద్ద శానిటేషన్‌ అండర్‌ డక్ట్‌ ప్రాంతం, చింతల్‌ బ్రిడ్జి వద్ద గల ప్రజా మరుగుదొడ్లను కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పుప్పాల గుట్ట ప్రాంతంలో పర్యటించి సిబ్బంది ఫే స్‌ అటెండెన్స్‌ను పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. విధులు నిర్వహించే తీ రుతోపాటు ఒక్కపూట భోజనం సరిపోతుందా..? రెండు పూటల అందించాలా..? అని అడిగి తెలుసుకున్నారు. శివనగర్‌లో అసంపూర్తిగా ఉన్న డక్ట్‌ను పరిశీలించిన కమిషనర్‌ వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్‌, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డీఈలు రాజ్‌కుమార్‌, రంగరావు పాల్గొన్నారు.

    పరిశీలన..

    నయీంనగర్‌: గ్రేటర్‌ పరిధిలోని ఉనికిచర్ల కుడా లే ఔట్‌ స్థలం, స్పోర్ట్స్‌ స్టేడియం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) వైస్‌ చైర్‌పర్సన్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌.. అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమెవెంట పీఓ అజిత్‌ రెడ్డి, ఈఈ భీంరావు, ఏపీఓ రామ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

    బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

  • రూ. 5లక్షల విలువైన గంజాయి పట్టివేత

    తరిగొప్పుల: జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్‌ వద్ద రూ. 5లక్షల విలువైన 10కిలోల గంజాయిని పట్టకున్నట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం తరిగొప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై శ్రీదేవి సిబ్బందితో కలిసి అక్కరాజుపల్లి క్రాస్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని గంజాం జిల్లా సూర్య నాగ గౌరీ శంకర్‌ రోడ్డుకు చెందిన సంతోష్‌ పాండా, పున్నాత్‌ గ్రామానికి చెందిన శివరాం డాక్వా ఆటోలో అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆటోను ఆపి తనిఖీ చేయగా రూ.5 లక్షల విలువైన 10 కిలోల గంజాయి లభించింది. కాగా, శివరాం డాక్వా పోలీసులను చూసి పారిపోగా సంతోష్‌ పాండాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించినట్లు చేసినట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై కాసర్ల రాజయ్య,సిబ్బంది పాల్గొన్నారు.

    ఒకరి అరెస్ట్‌, రిమాండ్‌.. మరొకరి పరారీ

    వివరాలు వెల్లడించిన పోలీసులు

  • ట్రైనీ సర్వేయర్లకు న్యాయం చేయాలి

    హన్మకొండ అర్బన్‌: ట్రైనీ లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎస్‌ఎస్‌)కు ఇటీవల నిర్వహించిన పరీక్షలో సమయానికి మించి ప్రశ్నాపత్రం ఉండడంతో తమకు అన్యాయం జరిగిందని ట్రైనీ ఎల్‌ఎస్‌ఎస్‌లు వాపోయారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థియరీ ప్రశ్నాపత్రంలో ఇంగ్లిష్‌, తెలుగులో విభిన్నంగా ప్రశ్నలు రావడం, ప్రశ్నాపత్రాల్లో టోపో డిటెయిల్స్‌లో జరిగిన తప్పుల కారణంగా థియరీ ప్రశ్నాపత్రంలో సమాధానాలు రాయడానికి సమయం సరిపోలేదని పేర్కొన్నారు. తాలిమ్‌ (తెలంగాణ అకాడమీ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) మెటీరియల్‌ ప్రకారం 100 శాతం థియరీ – ప్రాక్టికల్స్‌ను జిల్లా శిక్షణ కేంద్రంలో అధికారులు, అధ్యాపకులు నేర్పించారని, అయినప్పటికీ ప్రశ్నలు మెటీరియల్‌ నుంచి ఇవ్వకుండా అన్యాయం చేశారని వాపోయారు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, జవాబు పత్రాలలో పేజీలను పెంచాలని, ప్లాటింగ్‌లో ప్రింటింగ్‌ క్లారిటీగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.

SPSR Nellore

  • గుప్తనిధుల కోసం తవ్వకాలు

    సైదాపురం: మండలంలోని తోచాం గ్రామంలో పురాతన శ్రీకృష్ణుని ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఉడాయించాడు. ఊరి పొలిమేరల్లో అమ్మ వారి బొమ్మ వేసి పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఆలయానికి వెళ్లి పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసి విగ్రహాల వెనుకవైపు తవ్వకాలు చేశారు. కొద్దిరోజుల నుంచి సమీప ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ పరిసర ప్రాంతలతోపాటు గ్రామంలో సంచరించినట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • లారీని తప్పించబోయి..

    రోడ్డు ప్రమాదంలో

    ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మృతి

    కావలి(జలదంకి): రోడ్డు ప్రమాదంలో ఓ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మృతిచెందాడు. కావలి రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన కోదాటి రాజు (47) ట్రావెల్స్‌ బస్సు డ్రైవరుగా పని చేస్తున్నాడు. అతడికి భార్య సంధ్య, ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం సాయంత్రం 4:45 గంటలకు రాజు ఏలూరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సుకు డ్రైవర్‌గా ఉన్నాడు. రాత్రి 11:50 గంటల సమయంలో కావలి మండలం అడవిరాజుపాళెం దాటిన తర్వాత పెట్రోల్‌ బంకు సమీపంలో జాతీయ రహదారిపై లారీ వెళ్తోంది. దాని డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో రాజు లారీని తప్పించేందుకు స్టీరింగ్‌ను ఎడమవైపునకు తిప్పాడు. ఆ సమయంలో మరో లారీ వెళ్తుండగా దానిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు స్టీరింగ్‌, సీటు మధ్యలో ఇరుక్కుని మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కావలి రూరల్‌ సీఐ రాజేశ్వరరావు గురువారం తెలిపారు.

  • నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

    నెల్లూరు(పొగతోట): అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించాలని ఐసీడీఎస్‌ పీడీ హేనాసుజన్‌ సీడీపీఓలను ఆదేశించారు. గురువారం నెల్లూరులోని కార్యాలయంలో సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంత అవసరమో అవగాహన కల్పించాలన్నారు. పూర్తిస్థాయిలో ప్రతి అంగన్‌వాడీ కేంద్రాల్లో వారోత్సవాలను జరపాలన్నారు. శుక్రవారం కలెక్టర్‌ ఆనంద్‌ కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలియజేశారు.

Nizamabad

  • నిజామ

    గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్‌

    గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ ప్రతీకగా నిలుస్తోంది. శ్రావణ మాసంలో తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి.

    సామర్థ్యం ఎక్కువ..

    ఎస్సారెస్పీ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై ప్రభుత్వం,

    అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

    శుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025

    – 8లో u

    న్యూస్‌రీల్‌