Archive Page | Sakshi
Sakshi News home page

Tirupati

  • భారీగా గంజాయి స్వాధీనం

    చంద్రగిరి: కూటమి ప్రభుత్వంలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోందనడానికి ఇదొక నిదర్శనం. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి రవాణాను పోలీసులు చేధించారు. మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి గాదంకి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి తమిళనాడుకు వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారు డోర్‌ లోపల, డ్యాష్‌ బోర్డు, గేర్‌బాక్స్‌, స్టెప్‌నీ టైర్‌ లోపల, స్టెపనీ వెనుక రహస్య ఛాంబర్‌లో ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    అనుమానం రాకుండా

    శునకాన్ని రక్షణగా ఉంచుకుని

    విశాఖ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న గంజాయి రవాణాపై ఎవరికీ అనుమానం రాకుండా డ్రైవరు తన తెలివితేటలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కారు వెనుక భాగంలో ఓ భారీ సైజులోని శునకాన్ని ఉంచుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎవరైనా వాహనాలను తనిఖీ చేసేందుకు వస్తే వారిపైకి శునకం పెద్ద ఎత్తున అరవడంతో, అధికారులు బెంబేలెత్తిపోతారన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలో గంజాయిను తరలిస్తున్న బొలెరోతో పాటు డ్రైవరును, శునకాన్ని పోలీసులు చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన గంజాయిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.

  • టీటీడీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ

    తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : టీటీడీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం ఆదివారం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి విశ్వనాథం ప్రకటించారు. అధ్యక్షుడిగా చీర్ల కిరణ్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా శ్రీహరి చౌదరి, ప్రధాన కార్యదర్శిగా వంకీపురం పవన్‌, కోశాధికారిగా గుంటూరు రేఖ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గంట భరత్‌, అదనపు కార్యదర్శిగా మణికంఠ, ఉపాధ్యక్షులుగా సి.సునీల్‌ కుమార్‌ యాదవ్‌, కొప్పర్తి శివ, వి.ఈశ్వర్‌ నాయక్‌, బి.ఈశ్వరయ్య, ఈ.విశ్వనాథం, పార్థసారథి, వెంకటరమణ, బి.ధరణి కుమార్‌, గౌరవ సలహాదారులుగా చిన్నంగారి సూరిబాబు, పి.అశోక్‌ కుమార్‌, కోలా గిరి, జి.శ్రీనివాసరావు, చంద్రకుమార్‌, ఎస్‌.చంద్రకిరణ్‌, మదన్‌, సుబ్రహ్మణ్యం, కందూరి రంగాచార్యులు, డిప్యూటీ సెక్రటరీలుగా తులసమ్మ, ఎస్‌.తేజస్విని, వి.రామాదేవి, కె.అంకయ్య, పి.వి.సురేష్‌, పి.రవికుమార్‌రెడ్డి, ఎం.ఉమాశంకర్‌, ఎ.టి.యోగేష్‌, జాయింట్‌ సెక్రటరీలుగా ఎ.మురళీబాబు, టి.హర్షవర్ధన్‌, ఎన్‌.గుణశేఖర్‌, ఉత్తమ కుమారి, గోవర్ధన్‌, ఏ.మునిహరీష్‌, హేమలత, మురళి, నిర్మల, ఈసీ మెంబర్లుగా 13 మంది ఎన్నికయ్యారు.

  • పూలంగిసేవలో పార్వతీ పరమేశ్వరులు

    నేడు త్రిశూల స్నానంతో ఉత్సవాలు పరిసమాప్తి

    చంద్రగిరి: తొండవాడ స్వర్ణముఖీ నది ఒడ్డున శ్రీఅగస్తేశ్వరస్వామి(ముక్కోటి) ఆలయంలో నిర్వహిస్తున్న రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ, ఆలయ పరివార దేవతలైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీవేణుగోపాలస్వామిలకు అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారు అధికార నంది వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆ తర్వాత పుష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. రాత్రి స్వామివారు రావణా సుర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త మొగిలి రఘురామిరెడ్డి, సిబ్బంది పర్యవేక్షించారు. సోమవారం త్రిశూల స్నాన ఘట్టం, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

NTR

  • అసంబద

    సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ కనబరుస్తోంది. వీలైనంతగా పంట నష్టాన్ని తగ్గించి, రైతుల నోట్లో మట్టి కొట్టే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మోంథా తుపాను పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రాథమిక అంచనాలకు, తుది జాబితా మధ్య భారీగా వ్యత్యాస్యం కనిపిస్తోంది. తొలుత వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రాథమిక అంచనా 1.16లక్షల ఎకరాలు కాగా, సర్వే తరువాత తుది పంట నష్ట అంచనా 75వేల ఎకరాలకు పరిమితం అయ్యింది. అంటే 38వేల ఎకరాల్లో కోత విధించారు. ఉద్యాన పంటలకు సంబంధించి 3,540 ఎకరాల్లో పంటలకు నష్టం వాటినట్లు అంచనా వేయగా, సర్వే తరువాత తుదిపంట నష్ట అంచనా 1,715 ఎకరాలుగా లెక్క కట్టారు. ఈ లెక్కన 1825 ఎకరాల్లో కోత విధించారు. దీనికి తోడు పంట నష్టం పరిహారం వస్తే, ఆ పొలంలో పండిన ధాన్యం కొనుగోలు చేయబోమని మెలిక పెట్టి, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. కౌలు రైతులకు రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోమవారం కేంద్ర బృందం జిల్లాలోని పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రానుంది.

    భారీ నష్టమైనా..

    మోంథా తుపాను అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి వరి పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చిరుపొట్ట దశ, గింజ గట్టి పడే దశలో ఉన్న వరి పంట నేలవాలింది. వరి దుబ్బులు మీదుగా వర్షపునీరు ప్రవహించింది. చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో వర్షం కురవటంతో తాలు తప్ప గింజ ఏర్పడుతుందని, మానుగాయ వచ్చి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ. 30వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట చేలు కోతకు సిద్ధమయ్యే దశలో వచ్చి పడ్డ తుపానుతో పెట్టుబడులు పూర్తిగా నీటిపాలై నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పంటలు డెబ్బతింటే, ఎకరాకు రూ.25వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు పంట నష్ట పరిహారం రూ.10వేలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.

    కంకిపాడు మండలం దావులూరులో మోంథా ధాటికి పడిపోయిన వరిని చూపుతున్న రైతు (ఫైల్‌)

    ఈ ఏడాది 35 ఎకరాల్లో వరిసాగు చేశా. వరి కంకులు పాలుపోసుకునే దశలో ఉండగా వచ్చిన తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు ఎంతసేపు పడిందా, నిలబడిందా అని అడుగుతున్నారు, పడిన దానికంటే నిలబడిన పొలాల్లోనే కంకులు రాసుకుని గింజలు తప్పలుగా మారిపోతున్నాయి. దీనిని ఎవరూ గమనించడం లేదు. నిలబడిన పంటపొలాల రైతులకు పరిహారం అందించాలి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.

    – వేమూరి రత్నగిరి, రైతు, ఘంటసాల

    ఉద్యాన పంటల నష్టం వివరాలు..

    దెబ్బతిన్న పంటల ప్రాథమిక అంచనా : 3,540.55 ఎకరాలు

    దెబ్బతిన్న పంటల తుది అంచనా : 1,715.07 ఎకరాలు

    పంట నష్టం ప్రాథమిక అంచనా : రూ.73.45 కోట్లు

    తుది అంచనా : రూ.23.43 కోట్లు

    జిల్లాలో వ్యవసాయ పంటల నష్టం ఇలా..

    పంట రకం ప్రాథమిక అంచనా తుది అంచనా ఇన్‌పుట్‌ సబ్సిడీ

    (ఎకరాల్లో..) (ఎకరాల్లో..) (రూ.లక్షల్లో)

    వరి 1,12,600 75,781.5 7,878.15

    ఇతర పంటలు 3,742.5 2,056.2 75.75

    మొత్తం 1,16,342.5 77,837.7 7,953.90

Prakasam

  • కోటి సంతకాలు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

    మార్కాపురం టౌన్‌: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వమే పూర్తిచేసి నిర్వహించాలని కోరుతూ పీపీపీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వానికి కనువిప్పు తీసుకు రావాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా 9, 18, 31 వార్డుల్లో రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొని మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే విద్యార్థులకు వైద్య విద్యతోపాటు ప్రజలకు వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాలేజీలను దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులు తాము పెట్టిన పెట్టుబడిన పొందేందుకు వైద్యవిద్య ఆరోగ్యాన్ని వ్యాపారం చేసి దోచుకుంటారని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, సూపర్‌ సక్సెస్‌ అని చెప్పుకోవడమే తప్ప ప్రజలకు చేకూరిన లబ్ధి ఏమీ లేదన్నారు. అదే మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన హామీలే కాకుండా మరెన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆర్ధికాభివృద్ధి చేకూర్చారని అన్నారు. 14 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు రాష్ట్రంలో చెప్పుకునేలా ఒక్క సంక్షేమ కార్యక్రమాన్నైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ముందుకు వచ్చి మెడికల్‌ కాలేజీని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం వార్డుల్లోని ప్రజలతో సంతకాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ అబ్జర్వర్‌ కే ఆదెన్న, పార్టీ స్టేట్‌ కమిటీ సభ్యులు వెన్న హనుమారెడ్డి, అన్నా క్రిష్ణచైతన్య, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ షంషేర్‌ ఆలీబేగ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్‌ జీ శ్రీనివాసరెడ్డి, పీఎల్‌పీ యాదవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ సలీమ్‌, కౌన్సిలర్లు డాక్టర్‌ కనకదుర్గ, సిరాజ్‌, కొత్త కృష్ణ, డాక్టర్‌ మక్బుల్‌ బాష, రిటైర్డు వార్డెన్‌ నజీర్‌, బత్తుల సుబ్బారెడ్డి, సీయం ఖాశీం, గఫూర్‌, గొలమారి సత్యనారాయణరెడ్డి, మౌలాలి, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, న్యాయవాది భూపని కాశయ్య, నాలి కొండయ్య యాదవ్‌, బట్టగిరి తిరుపతిరెడ్డి, పోరుమామిళ్ల విజయలక్ష్మి, మల్లిక, రఫీ, జీ అంజిరెడ్డి, శివరాంపురం సర్పంచ్‌ గురుబ్రహ్మం, గౌస్‌, పత్తి రవిచంద్ర, కరీముల్లా, ఏడుకొండలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్‌ సిరాజ్‌ ఆధ్వర్యంలో గజమాలతో అన్నా రాంబాబును సన్మానించారు.

  • ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలి

    ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమంలో అన్నీ వర్గాలు భాగస్వాములు కావాలని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ‘ప్రజా ఉద్యమం’ నిరసన ర్యాలీ పోస్టర్లను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యంతో పాటు పేద విద్యార్థుల వైద్యవిద్య కలను సాకారం చేసే దిశగా అడుగులు వేశారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారన్నారు. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా వారికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడానికి ఈ నెల 12న నెల్లూరు బస్టాండ్‌ లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు వెళ్లి వినతిపత్రం అందజేస్తారని తెలిపారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉంచేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుతూ ‘ప్రజా ఉద్యమాన్ని’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్‌, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు వై.వీ. గౌతమ్‌ అశోక్‌, మీరావలి, ధర్నాసి హరిబాబు, పిగిలి శ్రీనివాస్‌, కోటేశ్వరరావు, పల్నాటి రవీంద్రారెడ్డి, మల్లిశెట్టి దేవ, వేముల శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

  • వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

    మద్దిపాడు: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందామని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మద్దిపాడులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి నాయకులు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ జేబులు నింపుకోవడానికి కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి పేదవారు కలలు కంటారని, ఆ కలలను ధ్వంసం చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హయాంలో వారు చెప్పిన హామీలు ఏవీ అమలు కాకపోగా, ఉన్న అవకాశాలను సైతం పేద విద్యార్థులకు అందకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని గతంలో మాదిరి కల్లబొల్లి హామీలు చెప్పి తప్పించుకోవడం కుదరని పని అని ఆయన పేర్కొన్నారు. చేయలేని పనిని చేస్తున్నామంటూ, చేసేశామంటూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజం అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బలవంతంగా వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడానికి కూడా జగనన్న వెనుకాడనన్నారని ఆయన తెలిపారు. ఈనెల 12వ తేదీ నియోజకవర్గ స్థాయిలో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన నాయకులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు బెజవాడ శ్రీరామ్‌ మూర్తి, పల్లపాటి అన్వేష్‌, కంకణాల సురేష్‌, కుమ్మరి సుధాకర్‌, బొమ్మల రామాంజనేయులు, పోలినేని వెంకట్రావు, మోహనరావు, అశోక్‌, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • జన గణనకు పైలెట్‌ ప్రోగ్రాం కింద ‘పొదిలి’ ఎంపిక

    పొదిలి: కేంద్ర ప్రభుత్వం 2027వ సంవత్సరంలో నిర్వహించ తలపెట్టిన జన గణనకు సంబంధించి పైలెట్‌ ప్రోగ్రాం కింద పొదిలి నగర పంచాయతీ ఎంపికై ందని కమిషనర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నాలుగు ప్రాంతాలను ఎంపిక చేయగా వాటిలో పొదిలి ఒకటి. పొదిలిలోని 13, 14, 15, 16, 17, 18, 20 వార్డులను ఇందుకు ఎంపిక చేశారు. దీనికి సంబంధించి 21 బ్లాకులుగా ఏర్పాటు చేసి, 21 మంది ఎన్యుమరేటర్లను, 3 సూపర్‌వైజర్లను ఎంపిక చేశామని తెలిపారు. సోమవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు అన్ని గృహాలను సందర్శిస్తారన్నారు. 34 రకాల ప్రశ్నలతో కూడిన వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. జన గణన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, గృహ యజమానులు ఎన్యుమరేటర్లకు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని నారాయణరెడ్డి కోరారు.

    గిద్దలూరు రూరల్‌: పట్టణానికి చెందిన యువదర్శకుడు తేజ కల్లూరి రూపొందించిన సామాజిక లఘు చిత్రం ‘నవోదయం’ గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ కాంపిటేషన్‌ కు అధికారికంగా ఎంపికై ంది. ఫిల్మ్‌ ఫ్రీ వే ప్లాట్‌ఫారం ద్వారా జరిగిన ఎంపికలో తేజ దర్శకత్వం వహించిన ‘నవోదయం’ షార్ట్‌ ఫిల్మ్‌ ఎంపిక సమయంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. సామాజిక అవగాహన కల్పించే అంశాన్ని హృదయాన్ని హత్తుకునేలా షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించిన తేజను పలువురు అభినందించారు.

    ఒంగోలు టౌన్‌: మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడానికి నేడు జిల్లాకు వస్తున్న కేంద్ర బృందం పశ్చిమ ప్రకాశంలో కూడా పర్యటించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పమిడి వెంకటరావు, జయంతిబాబు సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మోంథా తుపాను వలన పశ్చిమ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, పెద్దారవీడు, దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, తర్లుపాడు తదితర ప్రాంతాల్లో పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. గతంలో ఇదే ప్రాంత రైతులు 10 మంది మిర్చి సాగుచేసి అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన మోంథా తుపాను రైతులను కోలుకోని విధంగా నష్టాలకు గురిచేసిందని తెలిపారు. మిర్చి పంటకు ఎకరానికి రూ.50 వేలు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే పర్యటించడం సరికాదని, ఇలాంటి కంటితుడుపు చర్యల వలన రైతాంగానికి ఒరిగేదేమీ ఉండదన్నారు.

  • అసలు పంటల నష్టం ఇదీ...

    గత నెల 26 నుంచి మోంథా తుపాను ప్రారంభమైంది. 27, 28 తేదీల్లో భారీవర్షం కురిసింది. 28వ తేదీ ఒక్క రోజులోనే గత 15 సంవత్సరాలుగా ఏనాడూ లేని విధంగా 25.68 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. తుపానుకు మొత్తం 90 వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అందులో ప్రధానంగా పత్తి 35 వేల ఎకరాల్లో అన్నదాతలు దెబ్బతిన్నారు. వరి 9,500 ఎకరాలు, కంది 7 వేల ఎకరాలు, మినుము 7600 ఎకరాలు, సజ్జ 7300 ఎకరాలు, మొక్కజొన్న 7,100 ఎకరాలు, అనుములు 5,600 ఎకరాలు, పొగాకు 5200 ఎకరాలు, మిర్చి 4,700 ఎకరాలు, నువ్వు 2500 ఎకరాలు, జొన్న, వేరుశనగ, పెసర, బొబ్బరు, కొర్ర, ఆముదం, అలసందతో పాటు ఉద్యానవన పంటలు 3 వేల ఎకరాల్లో (పూల తోటలు, అరటి, బొప్పాయి, పుచ్చ, ఉల్లి, తమలపాకు తోటలు, కూరగాయల తోటలు) ఉన్నాయి.

  • నష్టా

    పెద్దారవీడు:

    సాధారణంగా రైతే రాజు అనే నానుడి వాడుకలో ఉంది. కానీ, ఆ రైతు కష్టాల్లో ఉంటే జాలిపడే వారేగానీ.. ముందుకొచ్చి అదుకునే వారు కరువయ్యారు. ప్రభుత్వం సైతం రైతులను కష్టకాలంలో ఆదుకోకపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన ఉల్లి పంట సమృద్ధిగా పండి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయనే ఆశతో ఉన్న రైతుకు కన్నీళ్లే మిగిలాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదవడంతో చేతిదాకా వచ్చిన పంట మొత్తం నీటిలో మునిగి మొలకెత్తింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట సరిగ్గా చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ రూపంలో ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని వాపోతున్నారు.

    ఉల్లి పంట నష్టం అంచనా వేయడంలో

    అధికారుల నిర్లక్ష్యం...

    పెద్దారవీడు మండలంలో మోంథా తుఫాన్‌ బాధిత రైతులకు అధికారులు మొండిచేయి చూపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉల్లి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం రైతులను విస్మరిస్తోంది. మండల పరిధిలో పెద్దారవీడు, సిద్దినాయునిపల్లె గ్రామాల్లో రైతులు దాదాపు 100 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టారు. కోత కోసే సమయంలో క్వింటా ధర రూ.900 పలికింది. ప్రస్తుతం క్వింటా రూ.300కు కూడా వ్యాపారులు అడగడం లేదని రైతులు వాపోతున్నారు. ఉల్లిగడ్డలు కోత కోసిన కూలి ఒక్కొక్కరికి రూ.350, గ్రేడింగ్‌ చేసిన కూలి రూ.500 చెల్లించాల్సి వస్తోంది. దాని ప్రకారం క్వింటా కూలి ఖర్చులే ఒక్కొక్కరికి రూ.900 వస్తుంటే.. మొదటి నాణ్యత ఉల్లిగడ్డలను క్వింటా రూ.300కు వాపారస్తులు అడుగుతుంటే ఎలాగని రైతులు ఆవేదన చెందుతున్నారు. దిగుబడి ఎకరాకు దాదాపు 10 క్వింటాలు కూడా రాలేదని చెబుతున్నారు. ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉల్లి పంటను రైతులు దున్నేస్తున్నారు. ఉల్లి గడ్డలను రైతులు దున్నేస్తున్నారని తెలిసి పెద్దారవీడు, బద్వీడుచెర్లోపల్లి గ్రామస్తులు వచ్చి వాటిని ఏరుకుని బస్తాల్లో నింపుకుని తీసుకెళ్తున్నారు.

    రైతుల కన్నీటి పర్యంతం...

    ఓవైపు వదలకుండా కురిసిన వానలు.. మరోవైపు ధర పూర్తిగా పడిపోవడంతో రాత్రీపగలూ శ్రమించినా ఉల్లి పంట కలిసి రాక నష్టాలు మిగలడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటు తుఫాన్‌, అటు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నడిసముద్రంలో మునిగి కొట్టుమిట్టాడుతున్నారు. రెక్కల కష్టంతో పాటు పెట్టుబడులు నేలపాలై అన్నదాతలకు అప్పులు, కన్నీళ్లు మిగిలాయి. పంటలు తీవ్రంగా నష్టపోయినా, ధర పతనమైనా కూటమి ప్రభుత్వం స్పందన కరువవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఉల్లి రైతులను

    ప్రభుత్వం అదుకోవాలి :

    రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. దాదాపు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టా. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ వచ్చింది. పంట మొత్తం నీటిలో మునిగిపోయి కుళ్లిపోయింది. క్వింటా రూ.300కు వ్యాపారులు అడుగుతున్నారు. కోత, గ్రేడిండ్‌ కూలి ఖర్చులే దాదాపు రూ.900 అవుతున్నాయి. ధర లేకపోవడంతో పెట్టుబడి ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంగాక పంటను ట్రాక్టర్‌తో దున్నివేశాను. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. గ్రామంలో రైతులంతా పంటను దున్నేందుకు సిద్ధంగా ఉన్నారు. మిరప పంట సాగుచేసేందుకు పొలాలు సిద్ధం చేస్తున్నారు.

    ఆళ్ల వెంకటరెడ్డి, రైతు, పెద్దారవీడు

  • మార్కాపురం టౌన్‌: వేర్వేరు ఘటనల్లో గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దొనకొండ మండలం మల్లంపేట గ్రామానికి చెందిన ఎం శ్రీనివాసరావు (20) ఈ నెల 4న మార్కాపూర్‌ పట్టణ శివారులోని ఒక ప్రైవేట్‌ కళాశాల వద్దకు వెళ్లి వ్యక్తిగత సమస్యలతో గడ్డి మందు తాగాడు. సమాచారం తెలుసుకున్న స్నేహితులు మార్కాపురం ప్రభుత్వాస్పపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీ శనివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ● తర్లపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన ఎం శివకుమార్‌ రెడ్డి (23) వ్యక్తిగత సమస్యలతో ఈ నెల 6వ తేదీన మార్కాపురం పట్టణానికి వచ్చి ఒక ప్రైవేట్‌ లాడ్జిలో రూము తీసుకొని గడ్డి మందు తాగాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాథమిక చికిత్స కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి కొండారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్ల ఎస్సై సైదుబాబు చెప్పారు.

    ఒంగోలు టౌన్‌: జిల్లా పోలీసు శాఖలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా ఒంగోలు నగరంలో పనిచేస్తున్న కొందరు సీఐలను మార్చారు. ట్రాఫిక్‌ సీఐ పాండురంగారావు మీద వేటు వేసి జిల్లా వీఆర్‌కు పంపించారు. పాండురంగారావు స్థానంలో సీసీఎస్‌ సీఐ జగదీష్‌ను నియమించారు. ఆదివారం జగదీష్‌ బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో ఒంగోలు టూటౌన్‌ సీఐగా పనిచేశారు. అదేవిధంగా మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ సుధాకర్‌ను సీసీఎస్‌ ఇన్‌చార్చిగా నియమించినట్లు సమాచారం.

    దర్శి: పట్టణంలోని దద్దాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటున్న షేక్‌ అమీర్‌ బాషా (27) సాగర్‌ కాలువలో గల్లంతైనట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి అతను కనిపించకపోవడంతో స్నేహితులు, బంధువులను విచారించారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో గాలిస్తుండగా, అమీర్‌బాషాకు చెందిన మోటార్‌ సైకిల్‌, చెప్పులు సాగర్‌ కాలువ కట్టపై కనిపించాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అమీర్‌బాషా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆ ద్విచక్రవాహనం, చెప్పులు చూసి అవి అమీర్‌బాషావేనని నిర్ధారించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకూ ఆచూకీ లభించకపోవడంతో గజ ఈతగాళ్లను పిలిపించి సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపడతామని ఏఎస్‌ఐ రాంబాబు తెలిపారు.

    ఒంగోలు మెట్రో: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఒంగోలు మంగమూరు రోడ్డులోని హరిహరసుత అయ్యప్ప క్షేత్రంలో ఆదివారం రాత్రి హరిహరసుత అయ్యప్పస్వామికి శాస్త్రోక్తంగా విళక్కు పూజ నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర పండితులు పరాంకుశ చక్రవర్తి, పరాంకుశం రంగస్వామి ఆధ్వర్యంలో నేత్రపర్వంగా క్రతువులు నిర్వహించారు. వందమంది అయ్యప్ప మాలధారులు పాల్గొని పూజలు చేసి అయ్యప్ప ఆశీసులు అందుకున్నారు.

  • వైభవం

    పొదిలిరూరల్‌: మండలంలోని మదాలవారిపాలెంలో నాసర్‌ మహమ్మద్‌ వలి గంధ మహోత్సవం ఆదివారం గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఉరుసు జరుపుకొని గ్రామస్తులు ఐక్యత చాటుకున్నారు. వేలాది మంది భక్తులు నాసర్‌ మహమ్మద్‌వలి గంధ మహోత్సవంలో పాల్గొన్నారు. దర్గాను ప్రత్యేకంగా విద్యుత్‌ దీపాలతో సర్వాంగా సుందరంగా అలంకరించారు. ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి ఉపవాసలతో పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. రాత్రి ప్రతి ఇంటి నుంచి జెండాల ఊరేగింపుతో దర్గాకు చేరుకొని నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పొదిలి నుంచి ముస్లింలు ప్రత్యేక వాహనంలో గంధం తీసుకువచ్చి దేవునికి సమర్పించారు. ఉరుసు సందర్భంగా వైఎస్సార్‌ సీపీ, టీడీపీల విద్యుత్‌ ప్రభలు ఏర్పాటు చేశారు. ప్రభలపై నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

    కుల, మతాలకు అతీతంగా ఐక్యత

    చాటుకున్న గ్రామస్తులు

    దర్గాను దర్శించుకున్న

    వేలాది మంది భక్తులు

  • జిల్ల

    ఒంగోలు: ఫెన్సింగ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్థాయి క్రీడాకారులను ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో ఎంపిక చేశారు. ఎంపిక ప్రక్రియను జిల్లా కార్యదర్శి జి.నవీన్‌ పర్యవేక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 10,11 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ, జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు నవీన్‌ తెలిపారు. ఈ క్రీడాకారుల సౌకర్యార్థం బి.భరత్‌, టి.క్రాంతికుమార్‌లను కోచ్‌లుగా నియమించారు. ఎంపికై న క్రీడాకారులను ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, ఒలంపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ కోటా మనోహర్‌ అభినందించారు.

    ఎంపికై న క్రీడాకారులు వీరే:

    ఈపీ బాలుర విభాగం: కమ్మ జగదీష్‌ చౌదరి, వాటుపల్లి లోకేష్‌ సాయి, పుత్తూరి అంబరీష్‌, అబ్దుల్‌ ముఖీత్‌ ఇర్భాజ్‌ మొహమ్మద్‌

    ఈపీ బాలికల విభాగం: షేక్‌ అఫీఫా తబస్సుమ్‌, బెజవాడ నమ్రత, ముతకాని మనస్వి, షేక్‌ ఫిర్డౌస్‌ తన్వీర్‌

    ఫాయిల్‌ బాలుర విభాగం: షేక్‌ ఆదిల్‌ అహ్మద్‌ మదీనే, మేడా రామ్‌చరణ్‌, తుల్లిబల్లి అక్షయ్‌ శ్రీనాథ్‌, తుల్లిబల్లి క్రాంతికుమార్‌

    ఫాయిల్‌ బాలికల విభాగం: కోడెల తనూజ, కూరపాటి బాలనాగ స్నేహంజలి, ఎద్దు భూమి నర్తన, చుండూరి వర్షిణి

    సాబ్రే బాలుర విభాగం: కోడూరి వెంకట సాయి తేజరెడ్డి, కోడూరి మోహన్‌ సాయినాథ్‌రెడ్డి, తుల్లిబల్లి అభినవ్‌ బుద్ద, గడికొయ్యల శ్రీకాంత్‌

    సాబ్రే బాలికల విభాగం: పుత్తూరి చక్రిక, ఏకాంబరం వెంకట సాయి మహిత, మందిగ నందితాదేవి

  • సీఐటీయూ బలోపేతానికి కృషి చేయాలి

    దర్శి: జిల్లాలో సీఐటీయూ బలోపేతానికి ప్రతినిధులు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక పీజీఎన్‌ కాంప్లెక్స్‌ కల్యాణ మండపంలో ఆదివారం జిల్లా మహాసభలు అధ్యక్షుడు కాలం సుబ్బారావు, డీకే ఎం రఫీ, పీ కల్పన, కొర్నేపాటి శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మిక పక్షాన సీఐటీయూ పోరాడుతుందని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను మహాసభలు ఆమోదించాయి. అందులో జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి చేసి ఉపాధి పెంచాలని, గ్రానైట్‌ పరిశ్రమను రక్షించాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కార్మిక ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, పెన్షనర్స్‌ కనీస పెన్షన్‌ రూ.9 వేలుగా నిర్ణయించాలని తదితర మొత్తం 40 తీర్మానాలను సభ ఆమోదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు సీఐటీయూ పోరాటాలు కార్మికుల ఐక్యతను గురించి వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌, ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, మరొక ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంకణాల ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి జీ శ్రీనివాసులు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పీ కల్పన, జిల్లా కార్యదర్శి తాండవ రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెల్లంపల్లి ఆంజనేయులు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు దేవి పిచ్చయ్య, రైతు సంఘం దర్శి మండల కార్యదర్శి సందు వెంకటేశ్వరరావు, సీఐటీయూ దొనకొండ మండల కన్వీనర్‌ చిరుపల్లి అంజయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బోడపాటి హనుమంతరావు, స్థానిక సీఐటీయూ నాయకులు షేక్‌ కాలే బాష, ఉప్పు నారాయణ, జిల్లా ప్రతినిధులు 280 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.

    రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

  • సోషల్‌ మీడియాలో  బండ్లమూడి వీడియో హల్చల్‌

    ఒంగోలు టౌన్‌: చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో పోలీసుల సమక్షంలోనే దళితులపై దాడి జరగడం తెలిసిందే. సరిగ్గా గత ఆదివారం ఈ దాడి జరిగింది. బహిరంగంగా దాడి చేసిన వీడియో ఒకటి అప్పుడు బయటకు వచ్చింది. ఆ దాడికి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో బండ్లమూడి సెంటర్లో గ్రామస్తులందరూ చూస్తుండగానే పోలీసు కానిస్టేబుల్‌ సమక్షంలో అగ్రకులాల వారు కర్రలు తీసుకుని దళితులను విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు ఒళ్లుగగుర్పాటు కలిగిస్తున్నాయి. ఈ దాడిలో ఏలిశమ్మ కిందపడిపోయి ఉంది. మిగిలిన వారిని కర్రలతో ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారు. తలల మీద కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. కొట్టు కొట్టు అంటూ కేకలు వినిపిస్తున్నాయి. పోలీసు కానిస్టేబుల్‌ ఒక్కడే ఉండటంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ఒక్క పోలీసు కానిస్టేబుల్‌ కూడా లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

    కంభం: గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కందులాపురం పంచాయతీలోని పూసల బజారులో నివాసం ఉంటున్న శీలం రాజ(31) రాడ్‌ బెండింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన అతను ఆదివారం భార్య, కుమార్తె చర్చికి వెళ్లిన సమయంలో గడ్డి మందు తాగాడు. చర్చికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన భార్య..భర్త ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి వెంటనే వైద్యశాలకు తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

  • రెండు లారీలు ఢీ

    డ్రైవర్‌కి తీవ్రగాయాలు

    వేటపాలెం: జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఢీకొట్టిన లారీ డ్రైవర్‌ తీవ్రగాయాల పాలయ్యాడు. 216వ నంబర్‌ జాతీయ రహదారి బైపాస్‌లో వేటపాలెం మండలంలోని అక్కాయిపాలెం వద్ద అఖిల ట్రేడర్స్‌ గోడౌన్‌ సమీపంలో శనివారం ఆర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు నుంచి చీరాల వైపు లోడుతో ఓ లారీ వెళ్తోంది. దాని వెనుక మరో ఖాళీ లారీ వేగంగా వెళ్తోంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఢీకొట్టిన లారీ నడుపుతున్న డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న వేటపాలెం ఎస్సై జనార్దన్‌ సంఘటన స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ మురళిని బయటకు తీసి చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.

Sangareddy

  • ఆశలన్

    సంగారెడ్డి జోన్‌: వానాకాలం సీజన్‌లో ఎన్నో ఆశలతో పంటలు సాగు చేసిన రైతులకు అకాల, అధిక వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కురవాల్సిన సమయంలో వర్షాలు కురవకపోవడం, పంట చేతికొచ్చిన సమయంలో అధిక వర్షాలతో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. ఈ యాసంగి సీజన్‌లోనైనా మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. యాసంగి సీజన్‌లో భాగంగా జిల్లాలో 8 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను సాగు అంచనా వేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

    యాసంగి ప్రణాళికలు సిద్ధం

    జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటల సాగుకు సంబంధించిన అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే గతేడాది కంటే సుమారు 20వేల ఎకరాలకు పైగా సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో 2,71,510 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా పంటలకు అవసరమయ్యే ఎరువులను సైతం అంచనాలు వేశారు. డీఏపీ, యూరియా, ఎంఓపి, కాంప్లెక్స్‌, ఎస్‌ఎస్‌పీ ఎరువులు 56,160 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వానాకాలం సీజన్‌లో అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తుంటారు. అధిక వర్షాలతో పత్తి పంట తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ఒకసారి తెంపటంతోనే పత్తి పూర్తి కావడంతో పంటను దున్నేసి ఇతర పంటలు సాగు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

    సబ్సిడీతోపాటు ఉచితంగా విత్తనాలు

    రైతులు పంటలు యాసంగిలో సాగు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో పాటు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తుంది. కుసుమ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు శనగ విత్తనాలు 40% సబ్సిడీతో అందించారు.

    18 వేల ఎకరాల్లో పంట నష్టం

    గత సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు 18వేల ఎకరాల్లో నష్టం వాటిలినట్లు వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కురిసిన అకాల వర్షాలకు మూడు విడతల్లో నష్టం వివరాలను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.

    చెరుకు పంటలో నిలిచి ఉన్న వరద నీరు

    యాసంగి సాగుకు మరింత ఆలస్యం

    అయితే యాసంగి పంటలు సాగు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వారం క్రితం మోంథా తుపానుతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వ్యవసాయ భూములు ఇంకా తడిసే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలతోపాటు రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లో ఇంకా వరద నిలిచి ఉంది. దీంతో భూములు దుక్కులు దున్నేందుకు వీలు లేకుండా ఉంది. మరింత సమయం పట్టడంతో సాగుకు ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే పలు చోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తాయి.

    పంట ఎకరాలు

    వరి 1,22,180

    గోధుమ 450

    జొన్న 92,350

    మొక్క జొన్న 9,090

    శనగ 19,950

    వేరుశనగ 300

    నువ్వులు 150

    పొద్దు తిరుగుడు 810

    కుసుమ 2,630

    చెరుకు 12,600

    ఇతర పంటలు 11,000

    ఖరీఫ్‌ పంటలకు నష్టం చేకూర్చిన అధిక వర్షాలు

    ఇంకా తడి ఆరని వ్యవసాయ భూములు

    ఈసారి 2.70లక్షల ఎకరాల్లో

    సాగయ్యే అవకాశం

    యాసంగి పంట సాగు విస్తీర్ణం అంచనా

  • ఎంతో

    మూడు నెలల శిక్షణలో తాను వ్యవసాయ పంట పొలాల్లో పర్యటించి అల్లం, అరటి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసే విధానంపై రైతుల దగ్గర ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నా.

    – పి.నవ్య, విద్యార్థిని

    మంచి అనుభవం

    ‘రావెప్‌’కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్‌ ప్రాంతాన్ని తమకు కేటాయించారు. ఈ ప్రాంతంలో సాగులో ఉన్న పంటల గురించి తెలుసుకున్నాం. రైతులు ఎంతో సహకారం అందించారు. జీవితంలో ఈ పర్యటన ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

    – కె.లహరి, విద్యార్థిని

  • పొలం

    జహీరాబాద్‌: ఉద్యానవన పంటలతోపాటు వాణిజ్య, చిరుధాన్యాల పంటల సాగుకు ప్రసిద్ధిగా ఉన్న జహీరాబాద్‌ ప్రాంతంలో పంటల అధ్యయనానికి పలు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన కళాశాలకు చెందిన విద్యార్థులు ఐదు బ్యాచ్‌లకు సంబంధించి 250 మంది సందర్శించారు. మల్లారెడ్డి కళాశాలకు చెందిన మూడు బ్యాచ్‌లకు చెందిన 150 మంది విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. వనపర్తి జిల్లాలోని ఉద్యాన కళాశాల విద్యార్థులు సైతం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. ప్రతీ బ్యాచ్‌ మూడు నెలల పాటు క్షేత్రపర్యటన చేస్తారు. ప్రతీ ఏటా ప్రత్యేకంగా ఎంపిక చేసి విద్యార్థులు అవగాహన పొందేందుకు జహీరాబాద్‌ ప్రాంతంలోని రంజోల్‌, పస్తాపూర్‌, చిన్న హైదరాబాద్‌, హోతి(కె), బాబానగర్‌ గ్రామాల్లో పర్యటిస్తారు. గ్రామీణ ఉద్యాన పని అనుభవ శిక్షణ కార్యక్రమం(రావెప్‌)లో భాగంగా క్షేత్ర పర్యటన చేస్తారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారు సాగు చేస్తున్న పంటలను అధ్యయనం చేస్తారు. పంటల సాగులో విత్తనం ఎంపిక నుంచి పంట చేతికి అంది వచ్చే వరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులను అవంబిస్తారనేది తెలుసుకుంటారు.

    ఎగ్జిబిట్లను ప్రదర్శించి మరీ...

    అవగాహన పొందడంతోపాటు విద్యార్థులు కళాశాలల్లో నేర్చుకున్న వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు తయారీ గురించి ఎగ్జిబిట్లను ప్రదర్శించి రైతులకు చెబుతున్నారు. రావెప్‌ కార్యక్రమానికి వచ్చే విద్యార్థులను జట్లుగా ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని రైతుల ఇంటి వద్ద నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత రైతుతో కలిసి నిత్యం క్షేత్రస్థాయి పర్యటన చేసి వారి అనుభవాల గురించి తెలుసుకుంటున్నారు. పంటల సాగు విధానం, వాటిలో చేపట్టాల్సిన అంతర కృషి, పంట దిగుబడులను సాధించడం, ఎరువుల యాజమాన్య పద్ధతులు, సేంద్రీయ ఎరువుల వినియోగం, పచ్చిరొట్టె ఎరువుల విధానం, మార్కెటింగ్‌, రవాణ, వ్యవసాయానికి అనుబంధంగా ఉండే అంశాలపై అనుభవం పొందుతున్నారు. రావెప్‌ కార్యక్రమానికి తరలివచ్చే విద్యార్థులకు ఏఈఓ ప్రదీప్‌కుమార్‌ గైడ్‌గా వ్యవహరిస్తూ ఆయా పంటల గురించి అవగాహన కల్పిస్తున్నారు.

    క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న

    ఉద్యాన, వ్యవసాయ విద్యార్థులు

    ‘రావెప్‌’కార్యక్రమానికి

    స్వాగతిస్తున్న రైతులు

    పొలం బాటలో నేర్చుకున్న

    అనుభవాల ప్రదర్శన

  • విద్యుత్‌ అధికారులు పల్లెబాట

    సమస్యల పరిష్కారం...

    బీ స్విచ్‌, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పొందల తొలగింపు, ఎర్తింగ్‌ లోపాల సవరణ, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందికరంగా మారిన చెట్ల కొమ్మల నరికివేత, లైన్ల మరమ్మతులు, ఇళ్లకు విద్యుత్‌ సరఫరా పరంగా ఉన్న వైర్లలో ఇబ్బందులు ఉంటే సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంబాల వద్ద ఉన్న విద్యుత్‌ డబ్బాలు, ఫీజులు మరమ్మతులు, కాలిపోయిన వైర్లు సరిచేయడం, లోడ్‌బ్యాలెన్సింగ్‌ చేయడం లాంటి సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారు.

    నారాయణఖేడ్‌: క్షేత్రస్థాయిలో విద్యుత్‌ ఇబ్బందులు తీర్చేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు పల్లెబాట పట్టారు. టీజీఎస్పీడీసీఎల్‌ పరిధిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆయా విద్యుత్‌ సమస్యలతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను తక్షణం పరిష్కరించనున్నారు. ఇంజనీర్లు మొదలుకుని ఆర్టీజన్‌ స్థాయి సిబ్బంది వరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి సమస్యలు తీర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలోనూ అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నారాయణఖేడ్‌ విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 7, జోగిపేటలో 5, సంగారెడ్డిలో 4, సదాశివపేట్‌లో 4, జహీరాబాద్‌లో 7, పటాన్‌చెరులో 9, ఇస్నాపూర్‌లో 2 చొప్పున 38 సెక్షన్లు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో సుమారు 158కి పైగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లున్నాయి. ఈ సబ్‌స్టేషన్ల పరిధిలో గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో ఉన్న విద్యుత్‌ సమస్యలను అధికారులు తక్షణం పరిష్కారం చేసే చర్యలను ప్రారంభించారు.

    వారంలో మూడు రోజులు

    ప్రతీవారంలో మూడు రోజుల అధికారులు ‘విద్యుత్‌ అధికారుల ప్రజాబాట’కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో వీరు గ్రామాలను పర్యటిస్తారు. ఎస్‌ఈ, ఏడీఈ, ఏఈ, లైన్‌మెన్‌ మొదలుకుని ఆర్టీజన్‌ స్థాయి సిబ్బంది వరకు అందరూ పర్యటించనున్నారు. నేరుగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి నెట్‌వర్క్‌ తనిఖీలు చేయనున్నారు. వినియోగదారుల నుంచి సలహాలు, ఫిర్యాదులను సైతం స్వీకరిస్తారు. విద్యుత్‌ అధికారులు నేరుగా గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు విద్యుత్‌ సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు తెలుసుకోనున్నారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో ప్రజలు వివరించిన ఆయా సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారు. గ్రామానికి వెళ్లిన సందర్భంగా రెండు ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో ఈ పనులు చేపడతారు. అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టే పనులు చేస్తూ ఖర్చుతో కూడుకొని ఉన్న పనులు, ఉన్నతాధికారులకు నివేదించే పనులు ఏమైనా ఉంటేపై అధికారులకు నివేదించనున్నారు. మొత్తమ్మీద నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. స్థానికంగా ప్రజలు, కాలనీల వాసులు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే వీలుంది. సమస్యల పరిష్కారంతోపాటు విద్యుత్‌ పరంగా ఫిర్యాదులు కూడా తగ్గి నెట్‌వర్క్‌ బలపడి విద్యుత్‌ నష్టాలు తగ్గుతాయని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.

    క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం ఉన్నతాధికారి నుంచి కింది సిబ్బంది వరకు పర్యటన

    ప్రజల నుంచి ఫిర్యాదులూ స్వీకరణ వారానికి మూడు రోజులు ప్రజాబాట

  • వికలా

    కల్హేర్‌(నారాయణఖేడ్‌): దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ కొనసాగించాలని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ముత్యం బస్వరాజ్‌పాటీల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కల్హేర్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ...జీవో నంబర్‌ 34 వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, రాజకీయ రంగాల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. సమస్యల సాధన కోసం సోమవారం కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. చలో సంగారెడ్డి కార్యక్రమానికి జిల్లాలోని దివ్యాంగులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

    కార్మికుల సమస్యలపై

    సీఐటీయూ పోరాటాలు

    ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌

    పటాన్‌చెరు టౌన్‌: కార్మికుల సమస్యలపై అవిశ్రాంత పోరాటాలు చేసేది సీఐటీయూనేనని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ మల్లికార్జున్‌ పేర్కొన్నారు. పటాన్‌చెరు శ్రామిక భవన్‌లో ఆదివారం నిర్వహించిన సీనర్జీ కార్మికుల జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో మెదక్‌ పట్టణంలో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఉద్యమించిందని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా అనునిత్యం కార్మికులను సంఘటితం చేసింది సీఐటీయూనే అని చెప్పారు.

    దాడిచేసిన వారిపై

    చర్యలు తీసుకోండి

    నారాయణఖేడ్‌: ఝరాసంగం మండలం కక్కెరవాడలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారని అబ్బాయి కుటుంబీకులపై భౌతిక దాడి చేసి ఇంటిని తగులబెట్టిన అమ్మాయి తరఫు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నర్సింహులు, ఖేడ్‌ నియోజకవర్గ అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షులు కాన్షీరామ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఖేడ్‌ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కుల వివక్షత నేటికీ కొనసాగుతుండటం దారుణమన్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుని ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సంఘాల డివిజన్‌ బాధ్యులు గణపతి, అశోక్‌ పాల్గొన్నారు.

    శ్రమశక్తి నీతిని

    ఉపసంహరించుకోవాలి

    చుక్కా రాములు

  • ఒక్కరోజులోనే హమీలు నెరవేర్చాం

    రామచంద్రాపురం(పటాన్‌చెరు): కొల్లూరు ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో కాలనీవాసులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 24గంటలు తిరగకముందే వాటిని అమలు చేసి ప్రారంభించామని ఇది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కొల్లూరు డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో సమస్యలపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహారుద్దీన్‌, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు రఘురాంరెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. వారం క్రితం కాలనీవాసులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 24గంటలు కాకముందే పరిష్కరించినట్లు తెలిపారు.

    రాత్రికి రాత్రే రేషన్‌ దుకాణాలు

    10 రేషన్‌ దుకాణాలను రాత్రికి రాత్రే ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కాలనీకి బస్సు సర్వీస్‌లను పెంచినట్లు వివరించారు. పోలీస్‌ అవుట్‌ పోస్టును ప్రారంభించామన్నారు. కాలనీలో అర్హులైన లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు గుర్తు చేశారు. వృద్ధులకు ఇక్కడే పింఛను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాలనీలోని దుకాణాలకు త్వరలో టెండర్లు పిలుస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం వెంటనే సొసైటీను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ కొల్లూరి భరత్‌, నాయకులు సీ.ప్రభాకర్‌రెడ్డి, అరుణ్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్‌, శ్రీనివాస్‌, సామ్రాట్‌ తదితరులు పాల్గొన్నారు.

    మిగిలిన సమస్యల్ని త్వరలో

    పరిష్కరిస్తాం

    మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

  • బహుమత
    ఉత్తరం రాద్దాం
    తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘ఢాయి ఆఖర్‌’ పోటీలు
    ● చేతిరాతకు 50 వేల ప్రైజ్‌ మనీ

    మెదక్‌ కలెక్టరేట్‌: పెరుగుతున్న సాంకేతిక విప్లవం పోస్టల్‌ వ్యవస్థను ఒక కుదుపు కుదిపేసింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు రావడంతో గతంలో మాదిరిగా ప్రజలు ఉత్తరాలు , పోస్టల్‌ సేవలను వినియోగించడం లేదు. ప్రజలతోపాటు పలు కార్యాలయాలు, సంస్థలు ఉత్తర ప్రత్యుత్తరాలు, మెయిల్స్‌ ద్వారానే నిర్వహిస్తున్నాయి. డిజిటలైజేషన్‌తో ఉపాధ్యాయులు సైతం ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా తరగతులు బోధిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు చేతి రాత తగ్గిపోతోంది. ఇది గుర్తించిన తపాలా శాఖ తమ వైపు తిప్పుకునేలా డిజిటల్‌ సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగా చేతిరాతను ప్రోత్సహించేందుకు ఢాయి ఆఖర్‌ పేరుతో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తుంది.

    రాయాల్సిన అంశాలు

    ఈ సంవత్సరం ‘‘నా రోల్‌ మోడల్‌కి లేఖ’’ అనే అంశంపై ఉత్తరం రాయాలి. అభ్యర్థులు తమ చేతితోనే రాయాలని, టైప్‌ రైటింగ్‌ చెల్లదని తపాలా శాఖ సూచించింది. ఎన్వలప్‌ కవర్‌లో రాసేవారు ఏ4 సైజు తెల్ల కాగితంలో వెయ్యి పదాలు, ఇన్‌లాండ్‌ లెటర్‌లో 500 పదాలకు మించకూడదు. అభ్యర్థులు కేవలం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాలి. 18 ఏళ్లలోపు , ఆపై వయస్సు గల వారికి రెండు కేటగిరిల్లో పోటీ ఉంటుంది. ఉత్తరానికి వయస్సు ధృవీకరణ పత్రం కూడా జత చేయాలి. వీటిని ఢాయి ఆఖర్‌, ఎన్‌ఓపీఓఎస్‌ మెదక్‌ డివిజన్‌ పేరిట డిసెంబర్‌ 8వ తేదీలోపు పంపించాలి.

    రూ.50వేల బహుమతి

    సర్కిల్‌ స్థాయిలో ప్రతి కేటగిరిలో మూడు ఎంట్రీలను ఎంపిక చేసి బహుమతులిస్తారు. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతికి రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10వేల నగదును ప్రకటించారు. సర్కిల్‌ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది.

    జాతీయ స్థాయిలో పోటీలు

    పోస్టల్‌ శాఖ ప్రజలు, విద్యార్థులను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీతో ప్రత్యేకంగా ఢాయి ఆఖర్‌ పేరిట ప్రతి యేడాది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 8 వరకు అభ్యర్థుల నుంచి లేఖలు స్వీకరిస్తుంది.

    యువతరం కోసమే..

    నేటి యువతరాన్ని పోస్టల్‌ వైపు ఆకర్షించేందుకు ఢాయి ఆఖర్‌ ఒక జాతీయ స్థాయి వేదిక. అలాగే సృజనాత్మకత, వాస్తవీకత, స్వీయ వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో వ్యక్తులు తమ రచనా నైపుణ్యాలు, ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. చేతిరాత అనేది విద్యార్థులకు చదవడం, రాయడం, భాషా సామర్థ్యాలు, విమర్శనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేస్తాయి. అలాగే మెదడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

    – శ్రీహరి, పోస్టల్‌ సూపరింటెండెంట్‌, మెదక్‌

  • రోడ్డుపై సంత.. తప్పని చింత

    చేగుంట(తూప్రాన్‌): వారాంతపు సంతతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వడియారంలో ప్రతి గురువారం వారాంతపు సంత జరుగుతుంది. అయితే ప్రధాన రహదారి పక్కనే సాగుతుండటంతో స్థానికులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. వాహనాలపై సంతకు వచ్చేవారు రోడ్డుపక్కనే పార్కింగ్‌ చేయడం, జనాలు రోడ్డు దాటి సంతలోకి వస్తున్నారు. ఈ క్రమంలో సంత సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు జరుగుతుండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు. సంతకు జనాల రాక పెరిగిపోవడంతో రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలు అదుపుతప్పితే సంతలోకి దూసుకెళ్లే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అధికారులు సంతపై దృష్టి సారించి మరోచోట నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • జీఎస్‌పీ ప్యానల్‌ ఘన విజయం

    మెదక్‌జోన్‌ : చర్చ్‌ సౌత్‌ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) మెదక్‌ కేథడ్రల్‌ పాస్టరేట్‌ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఎన్నికల ఫలితాలు అర్ధరాత్రి వెలువడ్డాయి. 20 మంది కమిటీ సభ్యులను ఎన్నుకునే ఈ ఎన్నికల్లో మూడు ప్యానళ్లలో 60 మంది పోటీ పడ్డారు. ఇందులో గంట సంపత్‌ (జీఎస్‌పీ), బానీ, రోల్యాండ్‌ ప్యానల్స్‌ తలపడ్డాయి. కాగా చర్చి పరిధిలో 1712 ఓటర్లు ఉండగా 1451 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంట సంపత్‌ (జీఎస్‌పీ) ప్యానల్‌ సభ్యులు 13 మంది విజయం సాధించగా బానీ ప్యానల్‌కు చెందిన వారు ఏడుగురు గెలుపొందారు. ఇందులో అత్యధికంగా సంపత్‌ 814 ఓట్లు సాధించగా, ఆయన ప్యానల్‌ సభ్యులు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సంపత్‌ మాట్లాడుతూ చర్చి అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

  • షెల్ట

    కొమురవెల్లి(సిద్దిపేట): ఓ వృద్ధురాలిని పోలీసులు చేరదీసి షెల్టర్‌ హోంకు తరలించారు. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అయినాపూర్‌ గ్రామానికి చెందిన జోర్రిగాల బాలనర్సవ్వ(80) ఎవరూ లేకపోవడంతో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంది. ఆమె బంధువులు కూడా స్పందించక పోవడంతో సిద్దిపేటలోని లార్డ్‌ షెల్టర్‌హోంకు తరలించినట్లు తెలిపారు.

    పేకాటరాయుళ్ల అరెస్టు

    జహీరాబాద్‌ టౌన్‌: పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ.కాశీనాథ్‌ కథనం ప్రకారం... మండలంలో రంజోల్‌లో డైమండ్‌ హోటల్‌ వెనుక గల మామిడితోటలో జూదం ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేవారు. వారి వద్ద నుంచి రూ.6.890 నగదు, 4 సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

    గుండెపోటుతో డ్రైవర్‌ మృతి

    మునిపల్లి(అందోల్‌) : లారీడ్రైవర్‌ మృతి చెందాడు. బుదేరా ఎస్‌ఐ రాజేశ్‌ నాయక్‌ కథనం ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్‌ గంభీర్‌పూర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ రాం నఖీన్‌ యాదవ్‌ (53) ఆదివారం తెల్లవారు జామున ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మీట్‌ డోస్‌ డ్రగ్స్‌లోడ్‌తో లారీని డ్రైవింగ్‌ చేస్తూ వస్తున్నాడు. కంకోల్‌ శివారులోని దాబాలో భోజనం చేసి పడుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బుదేరా పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

    అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు

    పాపన్నపేట(మెదక్‌): యువకుడు అదృశ్యమై శవంగా కనిపించాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ వివరాల ప్రకారం... మండలంలోని నార్సింగి గ్రామానికి చెందిన వడ్ల మహేశ్‌ (32) కార్తీక పౌర్ణమి రోజు మిత్రుడు దారబోయిన నర్సింహులుతో కలిసి ఏడుపాయలకు వెళ్లాడు. అక్కడ స్నానం చేసే క్రమంలో మహేశ్‌ నీటిలో మునిగిపోయాడు. దీంతో భయపడిన తోటి మిత్రుడు చెప్పా పెట్టకుండా ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో నాలుగు రోజులుగా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం రాత్రి ఏడుపాయల్లోని మడుగులో అతని శవం తేలింది. పోలీసులు మహేశ్‌గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    కబ్జాకు యత్నించిన

    వారిపై కేసు

    శివ్వంపేట(నర్సాపూర్‌): అక్రమంగా పట్టా భూమిలోకి ప్రవేశించి బెదిరించిన వారిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన సంజయ్‌రెడ్డికి చెందిన పట్టాభూమి సర్వే నం.433లో ఏడెకరాల 13 గుంటల భూమిని 40 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చుక్క శ్రీనివాస్‌, చుక్క రాణి, నక్క శ్రీధర్‌, చుక్క సుధాకర్‌తోపాటు మరికొందరు సంజయ్‌రెడ్డి పట్టాభూమిలోకి అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్లతో చదును చేసి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిని చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

    వృద్ధురాలు అదృశ్యం

    రామచంద్రాపురం (పటాన్‌చెరు): వృద్ధురాలు అదృశ్యమైంది. ఈ ఘటన రామచంద్రాపురం పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వినాయక నగర్‌లో నివాసం ఉండే వృద్ధురాలు లక్ష్మి ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం బంధువులు, మిత్రుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లిన సమయంలో గులాబీ రంగు కుర్తా ధరించి ఉన్నట్లు తెలిపారు.

  • రోడ్డు ఆక్రమణలతో ప్రమాదాలు
    ● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ● దుకాణాలు తొలగించాలనిస్థానికుల వేడుకోలు ● పట్టించుకోని అధికారులు

    రోడ్డును ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మండల కేంద్రం కుకునూరుపల్లితో పాటు మేదినీపూర్‌ గ్రామ శివారుల్లో రాజీవ్‌ రహదారి వెంట రోడ్డు ఇరుకై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    – కొండపాక(గజ్వేల్‌):

    ండల కేంద్రమైన కుకునూరుపల్లిలో సుమారు అరకిలో మీటరు వరకు రహదారికి ఇరువైపులా పలు రకాల దుకాణాలు, వ్యాపార సంస్థలు, కూరగాయలు అమ్మే తోపుడు బండ్లు, టీ పాయింట్లు, టిఫిన్‌ సెంటర్లు వెలిశాయి. అయితే రహదారిపై డివైడర్‌ను కలుపుకొని 100 ఫీట్ల వరకు బీటీ రోడ్డు వేశారు. కానీ రోడ్డు వెంట ఉన్న దుకాణ దారులు పలు వస్తువులను రోడ్డు వెంట పెడుతుండటంతో ఒక వాహనాన్ని మరొక వాహనం ఓవర్‌టేక్‌ చేయడం కష్టంగా మారింది.

    మేదినీపూర్‌ శివారులో...

    మేదినీపూర్‌ శివారులో కూడా రహదారికి ఆనుకొని ఓ టిఫిన్‌ సెంటర్‌తో పాటు భోజన హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఈ హోటల్‌ వద్ద యథేచ్ఛగా కరీంనగర్‌, మంచిర్యాల, గోదావరిఖని, మెట్‌పల్లి., జగిత్యాల, సిరిసిల్ల పట్టణాల డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను సైతం రోడ్డుపై పార్కు చేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదేంటనీ దుకాణ దారులను అడిగితే ఎదురు దాడికి దిగే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు ఆక్రమణ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి, పోలీస్టేషన్‌ను సంప్రదించినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలు ఏర్పాటు చేయడటానికి అనుమతులు లేవంటున్న కార్యదర్శి వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అధికారులు స్పందించి బీటీ రోడ్డును ఆక్రమించుకొని ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.

    కొన్ని ప్రమాదాలు..

    ● కుకునూరుపల్లిలో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయి ఆరు నెలల కిందట ద్విచక్ర వాహనదారులు కన్నైమెన అశోక్‌, పోశయ్య, రాకేశ్‌తోపాటు మరి కొందరు రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందారు. దీంతో పాటు పలువురు వ్యక్తులు గాయాలపాలయ్యారు.

    ● మరో ఘటనలో రెండు రోజుల కింద కుకునూరుపల్లిలో లారీని కారు ఓవర్‌ టేక్‌ చేయబోయి అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. సుమారు అరగంట పాటు వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  • బస్సు
    ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

    కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మామిడిపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. రూరల్‌ సీఐ క్రాంతి కుమార్‌ కథనం ప్రకారం.. హైదరాబాద్‌ వన్‌ డిపోలో అద్దెకు నడుస్తున్న బస్సు కర్ణాటకలోని కల్బుర్గి(గుల్బర్గా) నుంచి భాగ్యనగరంలోని రాంనగర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో నారాయణఖేడ్‌ నుంచి బాలనగర్‌కు వెళ్తున్న తుఫాన్‌ వాహనం మామిడిపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్‌లో ప్రయాణిస్తున్న నారాయణఖేడ్‌ మండలం శాంతఖాన్‌పల్లికి చెందిన కూరగాయల వ్యాపారి బాలయ్య(45) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంలో మొత్తం ఆరుగురు ఉండగా కళప్ప,షేక్‌ ఫరీద్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. షేక్‌ ఫరీద్‌ను పటాన్‌ చెరువులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి, కళప్పను సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే డ్రైవర్‌ రవిని కూడా సంగారెడ్డిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

    లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు..

    కొమురవెల్లి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని లెనిన్‌నగర్‌ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూర్‌ మండలం గంగాపురానికి చెందిన ఎర్రోల్ల నర్సయ్య(రమేష్‌) కుటుంబ సభ్యులతో సిద్దిపేట పట్టణంలో ఉంటూ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం చేర్యాల పట్టణంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి భార్య, కూతురుతో కలిసి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లెనిన్‌నగర్‌ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో భార్య సునీత(42) అక్కడికక్కడే మృతి చెందింది. నర్సయ్య, కూతురు కీర్తనకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కొహెడ మండలం శనిగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

  • బిజిలీపూర్‌లో తాగునీటి కటకట
    20 రోజులుగా సమస్య
    ● కాలనీవాసుల ఆవేదన ● పట్టించుకోని అధికారులు

    వట్‌పల్లి(అందోల్‌): మండల పరిధిలోని బిజిలీపూర్‌ గ్రామంలో ఎస్సీ కాలనీవాసులు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా కాలనీకి మిషన్‌ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో కాలనీలో ఉన్న బోరు మోటారుపై ఆధారపడి నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇటీవల ఆ మోటారు కూడా కాలిపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో గ్రామం బయట ఉన్న బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో చెడిపోయిన బోరు మోటారుకు మరమ్మతులు చేయించాలని వారం రోజులుగా వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయడంతో పాటు బోరు మోటారుకు మరమ్మతులు చేయించి, నీటి ఎద్దడిని తీర్చాలని కోరుతున్నారు. ఈ విషయంపై కార్యదర్శిని వివరణ కోరగా.. బోరు మోటారు కాలిపోవడంతో నీటి ఇబ్బందులు ఏర్పడిన విషయం వాస్తవమేనన్నారు. సోమవారం నాటికి మరమ్మతులు చేయించి నీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.

  • శంభుని కుంటను పరిరక్షించండి
    ● సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ● సుందరీకరణ చేయాలని డిమాండ్‌

    పటాన్‌ చెరు: అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శంభుని కుంటను పరిరక్షించి ప్రజా అవసరాల కోసం సుందరీకరించాలని సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం సీనియర్‌ నాయకులు పాండు రంగారెడ్డి, నరసింహారెడ్డి, ిసీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు నాయిని లలిత, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత తదితరులు మాట్లాడారు. భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, కుంటలో ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పిల్లలకు, వృద్ధులకు ఉపయోగపడేలా కుంట చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, పార్కులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. చుట్టుపక్కల కాలనీవాసులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున సంతకాలు చేశారని అన్నారు. ఈ సంతకాలను సోమవారం జిల్లా కలెక్టర్‌కు అందజేసి ప్రజల ఆకాంక్షను తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జార్జ్‌, శ్రీనివాస్‌, సత్తిబాబు, శ్రీనివాస్‌ రెడ్డి, మహిళా సంఘం నాయకులు సుజాత, మల్లేశ్వరి, యువజన సంఘం నాయకులు సురేశ్‌, హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
    డ్రైవర్‌కు గాయాలు.. ప్రయాణికులు క్షేమం

    చిన్నశంకరంపేట(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగి మండలం వల్లూర్‌ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా... జాతీయ రహదారిపై పెట్రోల్‌పంప్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఢీకొట్టింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్‌ముందు భాగం దెబ్బతినగా డ్రైవర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. వెంటనే వారిని మరో బస్సులో పంపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఆటో బోల్తా పడి.. నలుగురికి

    చేగుంట(తూప్రాన్‌): రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని పొలంపల్లి చెరువు వద్ద చేగుంట–మెదక్‌ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం... చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామానికి చెందిన వేముల స్వామి కుటుంబీకులు చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ ఆలయానికి ఆటోలో వెళుతున్నారు. ఈ క్రమంలో పొలంపల్లి చెరువు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి రోడ్డుకిందకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్వామి, నర్సింలు, లక్ష్మి, నర్సమ్మలకు గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.

  • ఆలయంలో చోరీ

    కౌడిపల్లి(నర్సాపూర్‌): ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేట గ్రామ సమీపంలో ఉన్న రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో గౌడ సంఘం సభ్యులు శనివారం పూజలు చేసి రోజు మాదిరిగా తాళం వేసి వెళ్లారు. కాగా ఆదివారం ఉదయం పూజలు చేసేందుకు వచ్చేసరికి గుర్తుతెలియని దొంగ గేట్‌ తాళం పగులగొట్టి ఆలయంలోని హుండీని బయట పడేశాడు. దీంతోపాటు అమ్మవారి మెడలోని వన్‌గ్రామ్‌ బంగారు మంగళసూత్రం, వెండి మెట్టెలు, వెండి కళ్లు చోరీకి గురయ్యాయి. హుండీలో సుమారు రూ.8వేల వరకు ఉండవచ్చని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. ఆలయం గ్రామ సమీపంలో ఉండటంతో ఇందులో ఇప్పటివరకు అయిదుసార్లు చోరీ జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా చోరీలు మాత్రం ఆగడం లేదని చెబుతున్నారు. గ్రామస్తులు, గౌడ సంఘం నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    తాళం వేసిన ఇంట్లో..

    హవేళిఘణాపూర్‌(మెదక్‌): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పాతూర్‌ పంచాయతీ పరిధి చీపురుదుబ్బ తండాకు చెందిన ముడావత్‌ కమ్లీ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. శనివారం రాత్రి దుండగులు తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న మూడున్నర తులాల బంగారు, పది తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సత్యనారాయణ పరిశీలించి క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

  • విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి

    దుబ్బాకటౌన్‌ : విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని చెల్లాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లాపూర్‌ వార్డుకు చెందిన తొగుట నరేందర్‌ రెడ్డి తన పాడి గేదెను పొలంలో కట్టేశాడు. మధ్యాహ్నం వచ్చి చూడగా విద్యుదాఘాతంతో మృతి చెంది కనిపించడంతో బోరున విలపించాడు. గేదె విలువ దాదాపు రూ. 80 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

    తప్పిపోయిన

    విద్యార్థి అప్పగింత

    సంగారెడ్డి క్రైమ్‌: తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ కనిపెట్టి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా... పట్టణంలోని రాజంపేట్‌కు చెందిన తలారి సుధాకర్‌ కుమారుడు నిక్సాన్‌(12) స్థానిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 5గంటల సమయంలో తప్పిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విద్యార్థి సదాశివపేట్‌ మండలం సూరారం గ్రామంలోని తన మేనమామ ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. శనివారం ఉదయం బంధువుల ఇంట్లో ఉన్న విద్యార్థిని స్టేషన్‌కు తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Vikarabad

  • పొలాల్లోనే బేరం

    వికారాబాద్‌: సన్నరకం వడ్లకు బహిరంగ మార్కె ట్‌లో ఫుల్‌ డిమాండ్‌ కనిపిస్తోంది. అధిక ధర పలుకుతోంది. వ్యాపారులు పొలాల వద్దే కొనుగోలు చేస్తు న్నారు. నూర్పిడి కాకముందే బయానా ఇచ్చే పంట తమదేనని ఖాయం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సన్నాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే రెండింతలైంది. ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో సన్న రకం వరి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. క్వింటాలు సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తమ వ్యాపారం దెబ్బతింటుందని హైరా నా పడుతున్నారు. ఈ క్రమంలో పొలాల వద్దకు పరుగులు పెడుతున్నారు. నూర్పిడులు అవుతుండగానే బేరాలకు దిగుతున్నారు. జిల్లాలో 1.52 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా 25 శాతం వరకు సన్నాల సాగు చేస్తున్నారు. దిగుబడిలో ఎక్కువ శాతాన్ని బహిరంగ మార్కెట్‌ లేదా బియ్యంగా మా ర్చి విక్రయిస్తున్నారు. దీంతో రైతులకు మంచి ధర లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఐదు శాతానికి మించి రావడం లేదు. రేషన్‌ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి పక్క జి ల్లాపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జి ల్లాలోని దిగుబడినంతా సేకరించడం తప్పని సరిగా మారింది. గతేడాది బోనస్‌ డబ్బు ఇంకా చెల్లించకపోవడంతో ఈ సారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తుందా? రాదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

    పెరిగిన సన్నాల సాగు

    జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 93 వేల ఎకరాలు కాగా ఈ ఏడాది 1.52 లక్షల ఎకరాల్లో పంట వేశారు. పరిగి వ్యవసాయ డివిజన్‌లో అత్యధికంగా.. ఆ తర్వాత తాండూరు, కొడంగల్‌ డివిజన్లలో భారీగా సాగు చేశారు. గతేడాది 14 వేల ఎకరాల్లో పంట వేయగా ఈ సారి 38 వేల ఎకరాల్లో సాగు చేశారు.

    సన్న రకం వడ్లకు ఫుల్‌ డిమాండ్‌

    ఈ ఏడాది సాగు విస్తీర్ణం 38వేల ఎకరాలు

    ఖరీఫ్‌, రబీ సీజన్లలో దాదాపు మూడు లక్షల టన్నుల దిగుబడి

    కొనుగోలు కేంద్రాలకు వస్తోంది ఐదు శాతం లోపే..

    రూ.500 బోనస్‌ ప్రకటించినా ఆసక్తి చూపని రైతులు

    జిల్లాలో మొత్తం 2.5లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా లబ్ధిదారులకు 5,373 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి 64,476 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 38 వేల ఎకరాల్లో సన్నరకం వడ్లు సాగు చేశారు. యాసంగిలో మరో 30 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సీజన్లలో కలిపి లక్ష నుంచి 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల ద్వారా 65 నుంచి 70 వేల మెట్రిక్‌ టన్నులు సమకూరే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాలో మొత్తం ధాన్యాన్ని సేకరిస్తేనే రేషన్‌ దుకాణాలకు సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. లేకుంటే పొరుగు జిల్లాలైన సంగారెడ్డి, నిజామాబాద్‌, నారాయణ్‌పేట్‌, నాగర్‌కర్నూల్‌, ఏపీలోని కర్నూల్‌ జిల్లా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

  • నేడు

    తాండూరు: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నేడు (సోమవారం) గుండె సంబంధిత ఆపరేషన్‌ నిర్వహించనున్నారు. ఆదివారం యాలాల మండలంలో పర్యటన ముగించుకొని తాండూరుకు వస్తున్న సమయంలో అత్యవసరంగా నగరానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు హైదరాబాద్‌ మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో కొంత మంది బాధిత కుటుంబాలను కలిసి ఆర్థిక సాయం చేశారు. మిగిలిన వారికి ఆర్థిక సాయం అందించాలని నాయకులకు చెప్పి బయలుదేరారు. అత్యవసరంగా వెళ్లాల్సిన అవసరం ఏమిటని విలేకరులు అడగ్గా తనకు సోమవారం ఉదయం గుండెకు సంబంధించిన సర్జరీ చేస్తారని తెలిపారు. అపోలో హాస్పిటల్స్‌ ఎండీగా ఎంపీ కొండా సతీమణి సంగీతారెడ్డి కొనసాగుతున్నారు. సోమవారం ఉదయం అపోలో వైద్యులు సర్జరీ చేయనున్నారు. అనంతరం నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిసింది.

    ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

    పరిగి: మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్‌ వరకు రోడ్డు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలోనే నిధులు మంజూరైనట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు. కొందరు గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో కేసు వేయడంతో పనులు జరగలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో కేసు వాపసు చేసుకున్నారని పేర్కొన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వాహనదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

    రజక రిజర్వేషన్‌ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి

    కొడంగల్‌ రూరల్‌: ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లలో దోభీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రజక రిజర్వేషన్‌ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి కోరారు. ఆదివారం పట్టణంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సి.అశోక్‌, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రులు, హాస్టళ్లలో అధునాతన దోభీ ఘాట్‌ కోసం ఎకరా భూమిని కేటాయించాలని, బట్టలు ఉతికేందుకు నియమించే కాంట్రాక్టర్‌ను రజకులకే కేటాయించాలని కోరారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, నాయకులు ఎస్‌.వెంకటయ్య, బాలప్ప, వెంకటయ్య, సుందరప్ప, వెంకటేష్‌, నాగేష్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, చిన్న మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    సంఘం జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌

    పరిగి: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌, రాష్ట్ర కన్వీనర్‌ లాల్‌కృష్ణప్రసాద్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ స్కూల్‌లో బీసీ కుల సంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు సాధించుకునే వరకు పోరాటం చేయాలన్నారు. ఈ నెల 16న జేఏసీ కమిటీ వేసి బీసీల సంక్షేమానికి కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్‌ జగన్‌మోహన్‌, బేరి రాంచందర్‌ యాదవ్‌, రామాంజనేయులు, రామకృష్ణధనేశ్వర్‌, శ్రీశైలం, వెంకటయ్య, బచ్చన్న, గోవర్ధన్‌, అడ్వకేట్లు ఆనందంగౌడ్‌, సదానందం, ఆంజనేయులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

  • ఎక్కడా మలుపులు ఉండొద్దు

    తాండూరు: హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారిలో ఎక్కడా మలుపులు లేకుండా విస్తరణ పనులు జరిగేలా కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇటీవల మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌కుమార్‌తో కలిసి పరామర్శించారు. పిల్లల చదువుకు సాయం చేస్తామని తల్లి రేహానా బేగంకు హామీ ఇచ్చారు. అనంతరం రూ.20 వేలు నగదు అందజేశారు. వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందుతుందని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం నగరంలోని పోలీస్‌ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి విస్తరణకు రూ.1,000 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వివిధ కారణాల వల్ల పనులు సాగలేదన్నారు. మలుపులు లేని రహదారి నిర్మాణం కోసం అఖిల పక్ష నేతలు కలిసి వస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని తెలిపారు. యాలాల మండలం హాజీపూర్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు నగరంలో ఐఏఎస్‌ అధికారులు నిర్వహించే ఆశ్రమంలో చేర్పిస్తామన్నారు. అక్కడే చదువు చెప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, నాయకులు మల్లేశం, సందీప్‌కుమార్‌, కిరణ్‌, రజినీకాంత్‌, వీరేశం, జగన్‌ ముదిరాజ్‌, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

    చిన్నారుల బాధ్యత నాదే

    యాలాల: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యత తాను తీసుకుంటానని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హాజీపూర్‌లో చిన్నారులు శివలీల, భవానీని పరామర్శించి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం లక్షీనారాయణపూర్‌లో అఖిలారెడ్డి, పేర్కంపల్లిలో ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట యాలాల మాజీ ఎంపీపీ, బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్‌ బాలేశ్వర్‌గుప్తా, జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్‌ ఉన్నారు.

    కనుచూపు మేర రోడ్డు కనిపించాలి

    మీర్జాగూడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

    వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా

    చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

  • వణుకు మొదలాయె!

    బషీరాబాద్‌: చలిపులి జనాన్ని వణికిస్తోంది. జిల్లాలో ఐదు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో జనం ఉదయం వేళల్లో బయటికి రావడానికి జంకుతున్నారు. నవంబర్‌ మొదటి వారం వరకు వర్షాలు కురవడంతో చలి గాలులు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఆదివారం జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా నమోదైంది. గ్రామాల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. జనం ఉన్ని దుస్తులు ధరించి బయటికి వస్తున్నారు.

    క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత

    పడిపోతున్న ఉష్ణోగ్రతలు

    జిల్లాలో 15 డిగ్రీల కనిష్ట స్థాయికి..

    పగలు 27 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదు

    ఉన్ని దుస్తులకు పెరిగిన డిమాండ్‌

    ఐదు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో..)

    తేదీ పగలు రాత్రి

    5 28 21

    6 27 20

    7 27 19

    8 26 18

    9 27 15

  • చట్టాలపై అవగాహన అవసరం

    అనంతగిరి: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వికారాబాద్‌ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల కళాశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల నిరోదక చట్టం, ఫోక్సో చట్టం, గృహ హింస, వృద్ధుల సంరక్షణ చట్టం వాటి ఉద్దేశాలు, శిక్షల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల నిండిన తర్వాతనే అమ్మాయిలకు వివాహం చేయాలన్నారు. బాల్యవివాహాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను పనిలో పెట్టుకోరాదని సూచించారు. బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మహబూబ్‌ ఫాతిమా, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ వెంకటేష్‌, రాము, శ్రీనివాస్‌, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

    జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు

  • కార్మిక సమస్యలు పరిష్కరించండి

    సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్‌

    అనంతగిరి: మున్సిపల్‌ కార్యాలయంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం కార్మిక సమస్యల పరిష్కారం కోసం పట్టణంలోని ప్రధాన కూడలిలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎఫ్‌ పెండింగ్‌ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. రెండు సంవత్సరాల యూనిఫారాలు, నూనె, సబ్బులు ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగణంగా వేతనాలను రూ.26 వేలకు పెంచాలన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను వెంటనే రెగ్యూలర్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బుచ్చయ్య, శంకర్‌, జంగమ్మ, లక్ష్మమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Movies

  • తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ (Bigg Boss Telugu 9) లో 9వ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. ఇంటి మీద బెంగతో రాము స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే సాయి శ్రీనివాస్‌ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఎలిమినేట్‌ అయ్యాడు. మరి ఆయన ఎలిమినేషన్‌కు కారణాలేంటి? రెమ్యునరేషన్‌ ఎంత చూసేద్దాం..

    ఇమ్యూనిటీతో హౌస్‌లోకి..
    అక్టోబర్‌ 12న వైల్డ్‌ కార్డ్‌గా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్‌ (Sreenivasa Sayee). ఇమ్యూనిటీ పవర్‌ ఉన్న వజ్రాన్ని అతడి చేతికిచ్చిన నాగ్‌ కావాల్సినప్పుడు వాడుకోమన్నాడు. అంతేకాదు, ఫస్ట్‌ వీక్‌లో వైల్డ్‌కార్డ్స్‌ నామినేషన్‌లోకే రాలేదు. తర్వాతి వారం నామినేషన్‌లోకి వచ్చినప్పటికీ సేవ్‌ అయిపోయాడు. కానీ, మరో వైల్డ్‌ కార్డ్‌ రమ్య ఎలిమినేట్‌ అయింది.

    కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు
    ఆ తర్వాతి వారం తన ఇమ్యూనిటీ వాడుకుని నామినేషన్స్‌ నుంచి తప్పించుకున్నాడు. గత వారం మాత్రం ఈ గండాన్ని తప్పించుకోలేకపోయాడు. తనూజను స్ట్రాంగ్‌ పాయింట్లు చెప్పి నామినేట్‌ చేసిన సాయి ధైర్యాన్ని కొందరు మెచ్చుకున్నారు. కానీ, తనూజ ఫ్యాన్స్‌కు మాత్రం గిట్టలేదు. తనూజతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించాలనుకున్నారు. పోనీ, టాస్కుల్లో అరాచకంగా ఏమైనా ఆడాడా? అంటే అదీ లేదు. 

    అవకాశాలు దక్కించుకోలేక..
    ఆడేంత సత్తా ఉన్నప్పటికీ అవకాశాన్ని చేజిక్కించుకునే తెలివి లేకుండా పోయింది. టీమ్‌లో ఉన్నాడే కానీ, ముందు వరుసలో ఆడలేకపోయాడు. దివ్య తెలివిగా అతడిని వెనకపడేయడం.. రీతూ మరింత తెలివిగా అతడ్ని ఆటలో తప్పించడంతో గేమ్స్‌ ఆడే ఛాన్సులు రాలేవు. హౌస్‌లో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్పడంతో మానిప్యులేటర్‌ అన్న ముద్ర కూడా పడింది. 

    రెమ్యునరేషన్‌ ఎంత?
    కెప్టెన్సీ గేమ్‌లోనూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో తడబడ్డాడు. ఎక్కువ అయోమయానికి లోనయ్యాడు. అప్పటికీ నెమ్మదిగా తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, అంత నెమ్మదితనం బిగ్‌బాస్‌ షోలో పనికిరాదు. ఫలితంగా సాయి ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. అతడికి వారానికి రూ.2 లక్షల మేర రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నాలుగువారాలకుగానూ రూ.8 లక్షల మేర సంపాదించాడన్నమాట!

    చదవండి: Bigg Boss 9.. నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి

Peddapalli

  • మట్టి
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
    ర్యాగింగ్‌ వద్దు.. స్నేహం ముద్దు

    కరీంనగర్‌టౌన్‌: కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలతో డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలో అడుగు పెట్టిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు పరిచయం అవుతారు. తొలి పరిచయానికి పర్యాయపదంగా నిలవాల్సిన ర్యాగ్‌ అన్న పదం వికృత క్రీడకు చిహ్నమవుతోంది. ఆ పేరు చెబితేనే జూని యర్ల వెన్నులో వణుకుపుడుతోంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం పతాకస్థాయికి చేరుకుంటోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్‌టీయూలో శనివారం రాత్రి సీనియర్లు జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలు చర్చనీయాంశమయ్యాయి.

    స్నేహమా.. జాగ్రత్త సుమా

    మంచి స్నేహం ప్రాణంతో సమానం. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరికీ స్నేహం అవసరం. కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు స్నేహితుల ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. కళాశాల క్యాంటీన్లు, హాస్టళ్లకు పాకిన ఈ భూతానికి ఏటా ఎంతో మంది విద్యార్థులు బలవుతుండగా విద్యాశాఖ, పోలీసు విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    ‘సుప్రీం’ మార్గదర్శకాలు

    సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తోంది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌కే రాఘవన్‌ కమిటీ వేసిన సిఫార్సులను 2007లో ఆమోదించింది. దీని ప్రకారం ర్యాగింగ్‌ జరిగినట్లు ఫిర్యాదు అందితే వెంటనే విద్యా సంస్థలు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణుడిని నియమించాలి. విద్యార్థులు మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా కళాశాల యజమాన్యాలే చర్యలు తీసుకోవాలి. ర్యాగింగ్‌ నిరోధించడంలో యజమాన్యాలు విఫలమైతే వారినే బాధ్యులను చేయాలి.

    ‘యూజీసీ’ మార్గదర్శకాలు

    ర్యాగింగ్‌ సంఘటనల్లో దోషులుగా తేలిన వారికి రూ.2.5 లక్షల జరిమానాల విధించాలి. తీవ్రతను బట్టి వారిని కళాశాల ప్రవేశంపై జీవితకాల నిషేధం విధించాలి. కళాశాలలో చేరే సమయంలో వేధింపులకు పాల్పడబోమని విద్యార్థి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి. వేధింపులను అరికట్టడంలో విఫలమైన కళాశాల గుర్తింపును రద్దు చేయాలి. ర్యాగింగ్‌ నిబంధనలను తెలుపుతూ ప్రతి కళాశాల పరిసరాల్లో పోస్టర్లు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి.

    సర్కారు ఏం చెబుతోందంటే..

    ర్యాగింగ్‌ నిరోధకానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్యశాఖ 1800– 5522 ట్రోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ హెల్ప్‌లైన్‌ పని చేస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదులను 1090 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపవచ్చు. ర్యాగింగ్‌ జరిగే కళాశాలల వద్ద నిఘా పెంచాలి.

    వైద్య నిపుణుల సూచనలు

    ర్యాగింగ్‌ తప్పనే విషయాన్ని సీనియర్లకు తెలిపేందుకు కాలేజీల్లో నైతిక విలువల కమిటీ లేదా మానవ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్‌ చేసే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జూనియర్లకు అవగాహన కల్పించాలి. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చేస్తే మిగతా వారికి కనువిప్పు కలుగుతుంది. కళాశాల యజమాన్యాలు నిజాలను దాచకుండా వెలుగులోకి తేవాలి. జూనియర్లు స్వేచ్ఛగా మసలేలా చర్యలు తీసుకోవాలి.

    మహిళా.. మౌనమేలా?

    ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలలు

    డిగ్రీ

    66

    పీజీ

    35

    ఇంజినీరింగ్‌

    16

    ఎంబీఏ

    8

    ఎంసీఏ

    1

    ఫార్మసీ

    2

    పాలిటెక్నిక్‌

    5

    మ్యాట్‌పైనే ఖోఖో పోటీలు క్రీడాకారులకు గాయాలు కాకుండా సౌకర్యం

  • మట్టి పరిమళం దేహదారుఢ్యానికి ఎంతోదోహదం చేస్తుందని నిపుణుల అభిప్రాయం.. అందుకే చిన్నపిల్లల్ని మట్టిలోనూ ఆడుకునేందుకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వాలంటున్నారు వైద్యులు.. మట్టిలో ఆటలు ఆడితే దెబ్బలు తగులుతాయని, గాయాలవుతాయని, ఇవి శరీర పటుత్వానికీ దోహదం చేస్తాయంటున్నారు.. అందుకే మట్టితో మమేకమైన వ్యవసాయదారులు, కూలీలు, మట్టిమనుషుల దేహాలు పటిష్టంగా ఉంటాయి.. ఇట్లాంటి మట్టి మైదానంలో ఖోఖో ఆడే క్రీడాకారుల శరీరం దృఢంగా మారుతుంది.. ఆటగాళ్లు మెరికల్లా తయారవుతారు.. దురదృష్టవశాత్తు ఖోఖో కూడా మట్టి మైదానం నుంచి మ్యాట్‌ మైదానంపైకి చేరింది.. ఆటగాళ్లు గాయాలపాలవకుండా మ్యాట్‌ బాగానే పనిచేస్తున్నా.. శారీరక పటిష్టం కోల్పోతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఖోఖో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి నాటి కృష్ణమూర్తి ఇంటర్వ్యూ.. – పెద్దపల్లి

    తామరఆకులు పర్యాటకానికి ప్రతిబంధకంగా మారాయి. తామర మొక్కలు చెరువంతా విస్తరించి బోట్లను ముందుకు కదలనివ్వడంలేదు. పెద్దపల్లి మున్సిపల్‌, పర్యాటక శాఖ సంయుక్తంగా ఒకటి స్పీడ్‌, మరోటి సాధారణ బోట్‌, ఇంకో రెండు సైకిల్‌పెడల్‌ బోట్లు కొనుగోలు చేశాయి. వాటిని ఇటీవల జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌ బండ్‌(ఎల్లమ్మ చెరువు)లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ శని, ఆదివారాలు, రోజూ ఉదయం, సాయంత్రం స్థానికులు, పొరుగు జిల్లావాసులు బోటింగ్‌ చేయడం ప్రారంభించారు. తద్వారా టూరిజం శాఖకు ఆదాయం గణనీయంగా పెరిగింది. కానీ, చెరువులో తామర మొక్కలు ఏపుగా పెరగడంతో పర్యాటక శాఖ సిబ్బంది బోట్లను నిలిపివేశారు. దీంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బోటింగ్‌ సౌకర్యం పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

    – సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

    రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఇక్కడ ఎప్పుడు నిర్వహించారు?

    కృష్ణమూర్తి : సుమారు 21 ఏళ్లక్రితం.. 2004లో ఖోఖో పోటీలను పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలోనే నిర్వహించాం. ప్రస్తుతం ఖోఖోకు పూర్వవైభవం వచ్చింది. మహిళలు, పురుషులు మరోసారి ఇక్కడే పోటీపడడం విశేషం. క్రీడా సంఘం ఈసారి పెద్దపల్లి జట్టుతోపాటు పోలీస్‌ జట్టుకు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించడం శుభపరిణామం.

    కామన్వెల్త్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందా?

    కృష్ణమూర్తి : ఖోఖో అసోసియేషన్‌తోపాటు జిల్లా సంఘాలు కేకేఎఫ్‌ఐతో కలిసి కామన్వెల్త్‌ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరాం. 2030లో కామన్వెల్త్‌ పోటీలు ఈసారి ఢిల్లీలో జరుగుతాయి. ఆ ఏడాది మార్చిలో జరిగే పోటీల్లో మన ఖోఖో క్రీడాకారులకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం.

    ఖోఖో జట్లను ఎన్ని విభాగాలుగా విభజిస్తారు?

    కృష్ణమూర్తి : సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ జట్లుగా విభజిస్తాం. వీరికి తెలంగాణ స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తాం. జాతీయ జట్టులో పాల్గొనే క్రీడాకారులకు ట్రక్‌ సూట్లు, షూ అందిస్తాం. రవాణా చార్జీలు చెల్లిస్తాం. భోజన సౌకర్యం కల్పిస్తాం.

    జాతీయస్థాయి పోటీలు ఎప్పుడు నిర్వహిస్తారు?

    కృష్ణమూర్తి : వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు కాజీపేట రైల్వేగ్రౌండ్‌లో జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహిస్తారు. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 40 మహిళా జట్లు, మరో 40 పురుషుల జట్లు హాజరవుతాయి. రైల్వే, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఆల్‌ ఇండియా పోలీస్‌ బెటాలియన్స్‌తోపాటు వివిధ విభాగాల్లోని ఉద్యోగులు సైతం పోటీల్లో పాల్గొంటారు.

    ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటుందా?

    కృష్ణమూర్తి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్‌ కోటాలో రెండు శాతం రిజర్వేషన్‌ సౌకర్యం వర్తింపజేస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ క్రీడాకారులు మొదలుకొని అంతర్‌జిల్లా ఆటగాళ్లకూ రిజర్వేషన్‌ సౌకర్యం వర్తింపజేస్తేనే సార్థకత చేకూరుతుంది.

    ఖోఖో అకాడమీ ఏర్పాటు చేసే అవకాశం ఉందా?

    కృష్ణమూర్తి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ జిల్లాకు ఒక ఖోఖో కోచ్‌ను నియమించాలంటే తప్పనిసరిగా అకాడమీ ఏర్పాటు చేయాలి. ప్రతినెలా వారికి ఇన్సెంటివ్‌ చెల్లించాలి. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాలి.

Rangareddy

  • 27
    ఉత్సాహంగా సైక్లోథాన్‌
    మండలాలు..
    మంది సర్వేయర్లు
    వేధిస్తున్న సిబ్బంది కొరత

    ఉన్నవారిపై అదనపు భారం

    ప్రభుత్వ ప్రాజెక్టుల్లో తలమునకలు

    2,258 దరఖాస్తులు పెండింగ్‌

    పరేషాన్‌లో అర్జీదారులు

    సర్వే కోసం తప్పని నిరీక్షణ

    12

    సాక్షి, రంగారెడ్డిజిల్లా: సర్వేయర్ల కొరత జిల్లాలో తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న 215 మంది లైసెన్డ్‌ సర్వేయర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించక పోవడంతో పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య అంతకంతకూ పేరుకుపోతోంది. ప్రస్తుతం 2,258 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సరిహద్దు వివాదాలు తేలక పోవడంతో బాధితులు తరచూ ఘర్షణలకు దిగుతున్నారు. అప్పటివరకు ఉన్న సివిల్‌ కేసులు కాస్తా.. ఆ తర్వాత క్రిమినల్‌ కేసులుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

    ఒక్కో సర్వేయర్‌కు రెండు మూడు మండలాలు

    జిల్లాలో 27 మండలాలు.. 558 గ్రామ పంచాయతీలు, 12 లక్షల ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూముల పక్కనే ప్రైవేటు భూములు ఉండటం.. ఆక్రమణలకు గురి కావడం.. సర్వే నంబర్లకు భిన్నంగా పొజిషన్లు ఉండటం.. విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు.. సరిహద్దు సమస్యలు ఉండడంతో బాధితులు ఏడీ సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్‌ 2016 నుంచి ఇప్పటి వరకు 77,940 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 17,532 దరఖాస్తులు ఆమోదించి, ఆయా వివాదాస్పద భూములకు హద్దులు నిర్ధారించారు. వివిధ కారణాలతో మరో 58,155 తిరస్కరించారు. ప్రస్తుతం పోర్టల్‌లో 2,253 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 14 మంది సర్వేయర్లు ఉండగా, గండిపేట సర్వేయర్‌ ఏసీబీ కేసులో అరెస్ట్‌ అయి సస్పెండ్‌ అయ్యారు. ఆమనగల్లు సర్వేయర్‌ సైతం ఇదే కేసులో సస్పెండ్‌ అయ్యారు. ప్రస్తుతం 12 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో సర్వేయర్‌ రెండు నుంచి మూడు మండలాలు చూడాల్సి వస్తోంది. దీనికి తోడు వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ పనులు సైతం వీరికి భారంగా మారుతు న్నాయి.

    ఏడీ సర్వేపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం

    ఇదిలా ఉంటే భూ సర్వే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) చంద్రారెడ్డి ఏడీ సర్వేయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలెక్టరేట్‌లోని ఏడీ ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ సర్వేలో జాప్యంపై నిలదీశారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఎందుకు పెడుతున్నారని, దరఖాస్తు దారులను ఆఫీసు చుట్టూ ఎందుకు తిప్పుతున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. దరఖాస్తు చేసినప్పటికీ సర్వే ఎందుకు చేయడం లేదో స్పష్టం చేయాలన్నారు. సర్వేయర్ల కొరతే జాప్యానికి కారణమని ఏడీ సర్వేయర్‌ శ్రీనివాసులు ఆయనకు వివరించినట్లు సమాచారం.

    మూసీ ఆక్రమణల తొలగింపులో భాగంగా గండిపేట నుంచి అత్తాపూర్‌ వరకు ఏడీ సర్వేనే కీలకంగా మారింది. నదికి రెండు వైపులా హద్దులు నిర్ధారణ.

    మూడు నియోజకవర్గాలు, ఏడు మండలాలు, 56 గ్రామ పంచాయతీలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 30 వేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన భారత్‌ ఫ్యూచర్‌ సిటీ భూ సేకరణ పనులు.

    కందుకూరు, మహేశ్వరం, యాచారం మండలాల్లో వివిధ ఇండస్ట్రియల్‌, ఐటీ పార్కుల కోసం భూ సేకరణ ప్రక్రియ.

    మోకిలలో హెచ్‌ఎండీఏ చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌ పనులు.

    రావిర్యాల ఎగ్జిట్‌ 13 నుంచి ఆమనగల్లు వరకు 41 కిలోమీటర్ల గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డుకు భూ సేకరణ పనులు.

    ఇటు మంచాల నుంచి మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట, షాద్‌నగర్‌, కొందుర్గు మండలాల మీదుగా వెళ్లే రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులకు భూ సేకరణకు సర్వే.

    వీటికి అదనంగా ప్రైవేటు వ్యక్తుల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలను తేల్చాల్సిన బాధ్యత కూడా ఏడీ సర్వేపైనే ఉంది.

  • పర్యా

    శంకర్‌పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రముఖ పర్యావరణ, విద్యావేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తం రెడ్డి అన్నారు. ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల నుంచి సాగుతున్న మోడల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం ప్రొ. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత గ్రామీణ ప్రాంతాలను ఎంచుకొని పర్యావరణంపై అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణానికి హాని చేసే వారిని గుర్తించి, దాంతో కలిగే నష్టాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్‌ లా స్కూల్‌ డైరెక్టర్‌ ప్రొ. రవిశేఖర రాజు, అసిస్టెంట్‌ డీన్‌ డా. అరుణ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొ. రుద్రతేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

    తుర్కయంజాల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్డ్‌ అయిన పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కూరపాటి నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. సంఘం ప్రథమ మహాసభను ఆదివారం పురపాలక సంఘం పరిధి రాగన్నగూడలోని వశిష్ట మోడల్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. పెన్షనర్‌ల సమస్యలపై చర్చించడంతో పాటు వారిలో మానసిక స్థైర్యం నింపడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం తుర్కయంజాల్‌ ఏరియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.బలరాం, ఉపాధ్యక్షులుగా రాఘురామయ్య, విజయలక్ష్మి, రవి కుమార్‌, అమర్‌నాఽథ్‌, ప్రధాన కార్యదర్శిగా కె.సాయిలు, కోశాధి కారిగా కె.నాగయ్య, కార్యదర్శులుగా ముత్యాలు, కాశిరెడ్డి, సీతారం రెడ్డి, గోపాల్‌, కార్యవర్గ సభ్యులుగా తిరుపతయ్య, రమేష్‌, భిక్షమయ్య, కృష్ణయ్య ఎన్నికైనట్లు అసోసియే షన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి కృష్ణారావు తెలిపారు.

    ప్రముఖ బ్యాడ్మింటన్‌

    క్రీడాకారిణి కృష్ణప్రియ

    శంకర్‌పల్లి: క్రీడాకారులు నిత్యం సాధన చేసి పోటీల్లో పాల్గొనాలని, అప్పుడే ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కృష్ణప్రియ అన్నారు. మండల పరిధిలోని ప్రొద్దుటూరులో రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న సీఎస్‌ విట్టల్‌ మెమోరియల్‌ వాలీబాల్‌ ముగింపు వేడుకలకి ఆదివారం ఇండియన్‌ నేవీ మాజీ కమాండర్‌ సంజీవ్‌ గుప్తాతో కలిసి హాజరయ్యారు. టోర్నమెంట్‌లో మహిళా విభాగంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రఽథమ స్థానంలో నిలవగా, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ద్వితీయ స్థానంలో నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు ట్రోఫీతోపాటు రూ.25 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.10 వేల నగదు అందించారు. పురుషుల విభాగంలో ఆర్మీ రెడ్‌ ప్రథమ స్థానంలో, తమిళనాడు టైగర్స్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేత జట్టుకు రూ.లక్ష, రన్నరప్‌ జట్టుకు రూ.50 వేలు, బెస్ట్‌ స్పైకర్‌కు రూ.10వేలు, డిఫెండర్‌కు రూ.10వేల చొప్పున ప్రదానం చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. స్పాన్సర్స్‌ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించి, తగిన సహాయసహకారాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్తలు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కండి
    ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌ మాదిగ

    షాద్‌నగర్‌: దళితులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్‌ మాదిగ పిలుపునిచ్చారు. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపేందర్‌ మాదిగ మాట్లాడుతూ.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ మీద దాడియత్నం జరిగితే దేశంలోని వ్యవస్థలన్నీ మౌనం వహించాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకుండా పోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి తాము శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా ఈనెల 17న మందకృష్ణ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. కార్యక్రమానికి దళితులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, మహేందర్‌, బొబ్బిలి పాండు, బాలరాజు, సురేష్‌, ప్రేమ్‌, హర్షవర్ధన్‌, మనోహర్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఘనంగా కార్తీక వనభోజనాలు

    షాద్‌నగర్‌రూరల్‌: పట్టణ సమీపంలోని ఎంపీ శేషయ్యనగర్‌ కమ్యూనిటీ హాలులో కమ్మ మహిళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వరల్డ్‌ ఎగ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిట్టూరి సురేష్‌రాయుడు, కమ్మసేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆరికెపూడి గాంధీ, మియాపూర్‌ కార్పొరేటర్‌ శ్రీకాంత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. పౌల్ట్రీ రైతు పన్ను రద్దుకోసం కమ్మసేవా సమితి అధ్యక్షుడు పాతూరి వెంకట్‌రావు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కమ్మసేవా సమితి మహిళలు సొంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రైవేట్‌ లెక్చరర్‌ శివకుమార్‌కు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రాగిణిశర్మ నేతృత్వంలో కూచిపూడి నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో కమ్మసేవా సమితి నాయకులు పినపాక ప్రభాకర్‌, వసంతరావు, నాగేశ్వర్‌రావు, రామసుబ్బారావు, ఎర్రయ్య, హరికుమార్‌, శశి, శ్రీనివాసరావు, ప్రభాకర్‌, మల్లేశ్వర్‌రావు, కట్టహరి, శ్రీను, సాంబశివరావు, శ్రీనివాస్‌, పాతూరి భ్రమయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • పైపులు వేసి.. కాలువ పూడ్చి

    ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

    అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

    మొయినాబాద్‌: మండల పరిధిలోని అమ్డాపూర్‌ రెవెన్యూలో కొందరు అక్రమార్కులు రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. వరద నీరు వెళ్లే కాలువలో పైపులు వేసి.. కాలువను పూడ్చి ఆక్రమించే ప్రయత్నం కొనసాగుతోంది. అమ్డాపూర్‌ గ్రామ సమీపంలోని పీతవాగు పక్కన రోడ్డుకు ఆనుకుని సర్వే నంబర్‌ 33లో ప్రభుత్వ భూమి ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పీతవాగులోకి వెళ్లేందుకు ఈ భూమి నుంచే కాలువ ఉంది. ఆ పక్కనే ఫాంహౌస్‌లు నిర్మించిన కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కాలువలో పైపులు వేసి పూడ్చివేస్తున్నారు. ఈ విషయమై మండల రెవెన్యూ అధికారులకు సమచారం అందడంతో ఆదివారం సిబ్బంది అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ను వివరణ కోరగా ఆదివారం సిబ్బంది వెళ్లి పనులు ఆపారని.. సోమవారం స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • నచ్చిన పార్టీకి స్వేచ్ఛగా ఓటేయాలి

    పంజగుట్ట: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, క్రైస్తవులు తమకు నచ్చిన పార్టీకి స్వేచ్ఛగా ఓటేయాలని క్రిస్టియన్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కన్వీనర్‌ జెరూషలేము మత్తయ్య పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీజేపీ హిందూ ఓటర్లను, కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం ఓటర్లను మతపరంగా ప్రభావితం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడలోని ఫ్రంట్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో ఉన్న సుమారు 80 వేల మంది దళిత క్రైస్తవులు, బీసీ, ఓసీ, మైనార్టీ కన్వర్టెడ్‌, క్యాథలిక్‌ క్రిస్టియన్‌ ఓటర్లు రాజకీయ పార్టీల విధానాలను, ఇస్తున్న హామీలను, సంక్షేమ పథకాల అమలు తీరును గమనించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్రైస్తవులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, పాస్టర్లకు జీతాలు, మైనార్టీ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ వంటి హామీలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఉమ్రాకు బయలుదేరిన యాత్రికులు

    శంషాబాద్‌: తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలకు చెందిన మరో యాత్రికుల బృందం ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఉమ్రా యాత్రకు బయలుదేరింది. దాదాపు 60 మంది యాత్రికులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యాత్రను అల్‌మిజాన్‌ సంస్థ నిర్వాహకులు ఫయాజ్‌ అలీ పర్యవేక్షిస్తున్నారు.

    ‘డబుల్‌’ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు

    హిమాయత్‌నగర్‌: రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(ఆర్‌డబ్ల్యూఏ) పేరుతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దని మేడ్చల్‌– మల్కాజిగిరి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఆదివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్లు నర్సింగరావు, పెంటయ్య, వినోద్‌ కుమార్‌, శేఖర్‌, శ్రీశైలం యాదవ్‌, శ్రీనివాస్‌చారి, వెంకటేష్‌, నరేష్‌ గౌడ్‌ మాట్లాడారు. ఇటీవల అహ్మద్‌గూడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను జిల్లా కలెక్టర్‌ సందర్శించి 18 సమస్యలను గుర్తించారని, వాటిని పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకూ పట్టించుకోలేదని అన్నారు. భూగర్భ డ్రైనేజ్‌, మంచినీటి పైపుల మరమ్మతు, నిర్వహణ, వీధిదీపాల కరెంట్‌ బిల్లు, పార్క్‌, ఎస్‌టీపీ మెయింటెనెన్స్‌ చార్జీలను లబ్ధిదారులపై విధిస్తే ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు భారం పడుతుందని తెలిపారు. ఈ జిల్లాలో అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు 13 కాలనీల్లో 27 వేల 472 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించిందన్నారు. బహదూర్‌పల్లి, అహ్మద్‌గూడ, మురహరపల్లిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. కొంతమందికి పట్టాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఇళ్లు కేటాయించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఇందిరాపార్కు వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.

    బొల్లారం చర్చిలో బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ప్రార్థనలు

    బొల్లారం: బొల్లారంలోని చరిత్రాత్మక హోలీ ట్రినిటీ చర్చిని ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ సందర్శించారు. రిమెంబరెన్స్‌ డే సందర్భంగా చర్చి ప్రాంగణంలో ఉన్న బ్రిటీష్‌ ఆర్మీ అధికారుల సమాధుల వద్ద నివాళులర్పించారు. చర్చి పాస్టర్‌ చార్లెస్‌ వెస్లీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో బ్రిటీష్‌ అధికారుల చేసిన సేవలను ఆయన స్మరించారు. బ్రిటీష్‌ అధికారుల సమాధుల వద్దకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని చర్చి కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేయగా ఓవెన్‌ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో చర్చి సభ్యులు నవీన్‌ నోసినా, సునీల్‌ కుమార్‌, సలోమి, గాబ్రియేలు తదితరులు పాల్గొన్నారు.

    కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి: సబిత

    శ్రీనగర్‌ కాలనీ: గత రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తీవ్రంగా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం చివరిరోజు ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్‌కాలనీల్లో బీఆర్‌ఎస్‌ ర్యాలీ నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బీఆర్‌ఎస్‌ అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీతను నిలబెట్టిందని పేర్కొన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే చరిత్ర సృష్టిస్తారని సబితారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసానికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు. ర్యాలీలో మాజీ కార్పొరేటర్‌ మహేష్‌ యాదవ్‌, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • పత్తికి విపత్తు

    మోంథా తుపాన్‌ పత్తి పంటపై తీవ్రప్రభావం చూపింది. చేతికొచ్చినతెల్లబంగారం తడిసి ముద్దయింది.అనంతరం ఎండినా.. కాస్త తేమ,తూకంలో వచ్చిన తేడా.. రైతన్నలనునష్టాలు మూటగట్టుకునేలా చేసింది.

    యాచారం: పత్తి జిల్లాలో భారీగానే సాగయింది. 60 వేలకు పైగా మంది రైతులు.. లక్ష 40 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. దానికి తోడు ఎన్నడూ లేని విధంగా క్వింటాల్‌ పత్తికి రూ.8 వేలుగా సీసీఐ నిర్ణయించింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ.. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. వానలకు బాగా తడిసిన పత్తి.. ఆ తరువాత ఎండలకు ఎండినప్పటికీ.. ఉష్ణోగ్రతలకు పత్తితో పాటు గింజల్లో కూడా తూకంలో భారీ తేడా కనిపిస్తోంది. పత్తి తీత సమయంలో.. పల్చగా మారి నేలరాలి పోతోంది. గతంలో క్వింటాల్‌గా తూకమయ్యే పత్తి.. నేడు 80 కిలోలే అవుతోంది. వర్షం కారణంగా క్వింటాల్‌ 20 కిలోల తేడా రావడంతో రైతులు నష్టపోతున్నారు.

    కూలీ రేట్లు అధికం

    పత్తి తీత పనులు జోరందుకోవడంతో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో మాడ్గుల, తలకొండపల్లి, షాద్‌నగర్‌, నందిగామ, తలకొండపల్లి, ఆమనగల్లు తదితర మండలాలకు చెందిన రైతులు.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, శ్రీశైలం, నంద్యాల, అనంతపూర్‌ తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది కూలీలను రప్పించి, పత్తిని తీయిస్తున్నారు. గతంలో క్వింటాల్‌ పత్తి తీస్తే 11 కిలోల పత్తిని ఇచ్చేవారు. ప్రస్తుతం 15 నుంచి 20 కిలోల వరకు ఇవ్వాల్సి వస్తోంది. అదే స్థానిక కూలీలకై తే కూలీ డబ్బులు రూ.500 నుంచి రూ.700లతో పాటు.. రవాణా ఖర్చు చెల్లిస్తున్నారు. కల్లు, మద్యం తాగడానికి అదనంగా ముట్టజెపుతున్నారు. కాగా.. గతంలో నిత్యం కూలీలు.. 80 నుంచి 90 కిలోల పత్తిని తీస్తే.. తుపాన్‌ ప్రభావంతో 50 కిలోలే తీస్తున్నారు.

    సీసీఐ కొర్రీ.. దళారుల దందా

    సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) నిబంధనలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తేమ శాతం 8 లోపు ఉన్న పత్తి క్వింటాల్‌కు రూ.8,110 ధరగా నిర్ణయించింది. 11 శాతం ఉంటే రూ.7,866.70లుగా పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఒక రైతు పేరిట పట్టాదారు, పాసుపుస్తకాల్లోని ఎకరాలకు.. ఎకరాకు ఏడు క్వింటాళ్ల చొప్పున విక్రయించడానికి కపాస్‌ కిసాన్‌ యాప్‌లో నిబంధన పెట్టింది. జిల్లాలో మొత్తం లక్ష 40 వేల ఎకరాల్లో పత్తి సాగయితే.. ఎకరాకు సరాసరి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చినా.. మొత్తంగా 21 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే ఎకరాకు ఏడు క్వింటాళ్ల నిబంధనతో జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో కేవలం 9 లక్షల 80 వేల క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంటే సీసీఐ కొనుగోలు చేయని 11 లక్షల 20 వేల క్వింటాళ్ల పత్తిని.. రైతులు దళారులుకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఇదే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు.. క్వింటాల్‌ దిగుబడిని రూ.6,300 లోపు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాల్‌కు రూ.1,800 నష్టపోవాల్సి వస్తోంది.

    తుపాను ప్రభావంతో రైతన్న కుదేలు

    తూకంలో తగ్గుదల..భారమైన కూలీ రేట్లు

    ధర ఉన్నా.. తప్పని తిప్పలు

    సీసీఐ నిబంధనతో దిగాలు

    ఎకరాకు ఏడు క్వింటాళ్లుకొంటామని స్పష్టం చేసిన కార్పొరేషన్‌

  • కదలివ

    మంచాల: కార్తీక మాసంను పురస్కరించుకొని బుగ్గరామ లింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారు మోగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పారుతున్న సెలయేరు, షవర్ల వద్ద స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి భక్తిశ్రద్ధలతో వ్రతాలు, పూజలు చేశారు. మహిళలు కార్తీక దీపారాధన, తులసి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు తగిన చర్యలు తీసుకున్నారు.

    రామ లింగేశ్వరుడి సన్నిధిలో సేదతీరిన భక్తజనం

  • ఆయిల్‌ మిల్లు.. ఆరోగ్యానికి చిల్లు

    మంచాల: ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఆయిల్‌ మిల్లుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నోముల గ్రామ పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. ఆదివారం గ్రామంలో మిల్లుకు సంబంధించిన లారీని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థాల వలన కాలుష్యం బారిన పడుతున్నామన్నారు. దుమ్ము, ధూళితో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు. 25 టన్నుల లోడుతో రావాల్సిన లారీలు 60 నుంచి 70 టన్నులతో వస్తున్నాయని ఆరోపించారు. అధిక బరువు వలన రహదారులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శి సుభద్ర దేవికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు జయాసందం, నాయకులు వి.ఆంజనేయులు, ఎర్ర అశోక్‌, చక్రపాణి, రవిందర్‌, యాదయ్య, జంగయ్య, జైపాల్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, అరుణ్‌కుమార్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, గంట తదితరులు పాల్గొన్నారు.

    కాలుష్య కారక సంస్థపైచర్యలకు గ్రామస్తుల డిమాండ్‌

  • లారీ ఢీ.. నేలకూలిన విద్యుత్‌ స్తంభం

    మంచాల: లారీ ఢీకొట్టడంతో విద్యుత్‌ స్తంభం నేలకూలింది. ఈ సంఘటన మండల పరిధి ఆరుట్ల ఎస్సీ కాలనీ ఎలమ్మగుడి కూడలిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం రాఘవేంద్ర ఫర్టిలైజర్‌ దుకాణ యాజమాన్యానికి చెందిన లారీ(టీఎస్‌ 29టీఏ 0896) గ్రామంలో సిమెంట్‌ బస్తాలు అన్‌లోడ్‌ చేసింది. అనంతరం తిరుగు ప్రయాణంలో కూడలిలో కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టగా.. అది కూలిపోయింది. గమనించిన స్థానికులు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ఎవరికీ ఏమీ కాలేదు. ఘటనకు లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని, ప్రమాదం అనంతరం వాహనంతో పరారయ్యాడని కాలనీ వాసులు తెలిపారు. అధికారులు స్పందించి, డ్రైవర్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Sri Sathya Sai

  • సాయిన

    ముగిసిన అఖండ భజన

    పుట్టపర్తి అర్బన్‌: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్‌, భక్త మండళ్లు, భజన మండళ్ల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన అఖండ భజన ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ప్రశాంతి నిలయంలో వేలాదిమంది భక్తుల ఆధ్వర్యంలో సత్యసాయిని కీర్తిస్తూ భజనలు, గీతాలు ఆలపిస్తూ 24 గంటల పాటు అఖండ భజన సాగింది. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధి వద్ద ప్రార్థనలు చేశారు. మంగళ హారతి అనంతరం సాయికుల్వంత్‌ మందిరంలోని భక్తులకు ప్రసాదాలను అందజేశారు. భక్తులు చక్కెర పొంగళి, చిత్రాన్నం అక్కడే ఆరగించారు.

  • సీసీ రోడ్డు.. నాణ్యత ఉంటే ఒట్టు!

    చిలమత్తూరు: అభివృద్ధి పేరిట చేపడుతున్న పనుల్లో నాణ్యత కొరవడుతోంది. కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు డబ్బు వెనకేసుకునేందుకు నాసిరకంగా పనులు చేపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కొన్నేళ్లపాటు మన్నిక రావాల్సిన రోడ్డు కొంతకాలానికే దెబ్బతినేలా కనిపిస్తోంది. వివరాల్లోకెళ్తే... చిలమత్తూరు పంచాయతీలో జాతీయ రహదారి 544ఈ నుంచి తుమ్మలకుంట వరకు రూ.45 లక్షల నిధులతో సీసీ రోడ్డు మంజూరైంది. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌కు రోడ్డు పని దక్కింది. సాధారణంగా ఆరు ఇంచులు వెట్‌మిక్స్‌ వేసి రోలింగ్‌ చేస్తే మూడు నుంచి నాలుగు ఇంచులకు వస్తుంది. అయితే కాంట్రాక్టర్‌ కేవలం మూడు ఇంచులు వెట్‌మిక్స్‌ వేసి రోలింగ్‌ చేయడంతో రెండు ఇంచులకు వచ్చింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి వేసి మధ్యలో వెట్‌మిక్స్‌ వేయాలి. అయితే ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా వేశారు. పటిష్టత లేకుండా నిర్మాణం సాగుతోందని తెలుస్తున్నా అధికారులు కనీస పరిశీలన చేయకపోవడం గమనార్హం. ఈ విషయమై పంచాయతీరాజ్‌ ఈఈ మురళీమోహన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. మూడు ఇంచులు వెట్‌మిక్స్‌ వేయాలని తామే సూచించామని, నిబంధన కూడా అదేనంటూ చెప్పుకొచ్చారు.

    ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌

    తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

  • శ్మశానవాటిక కోసం పాదయాత్ర

    పుట్టపర్తి టౌన్‌: చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామం ఎస్సీ కాలనీలో శ్మశాన వాటిక లేక దళితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు ఉన్న శ్మశానంలోకి వెళ్లాలని చూస్తే చుట్టూ ఉన్న రైతులు దారి మూసేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కాలనీలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలు కూడా సరిగా చేయలేని దుస్థితి నెలకొంది. శ్మశానానికి దారి చూపాలని గతంలో తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లినా ఏమీ చేయలేకపోయారు. ఎస్సీలకు ప్రత్యేకంగా శ్మశానవాటిక కేటాయిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని భావించిన దళితులు దేమకేతేపల్లి రాజేష్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం ప్రారంభమైన పాదయాత్ర దేమకేతేపల్లి, చిలమత్తూరు, కొడికొండ, కోడూరుతోపు, శెట్టిపల్లి, బూదిలి, గుమ్మయ్యగారిపల్లి, పెడపల్లి, జగరాజుపల్లి మీదుగా 51 కిలోమీటర్ల దూరం సాగి ఆదివారం మామిళ్లకుంట క్రాస్‌కు చేరుకుంది. పాదయాత్ర బృందంలోని దళితులు అక్కడి కమ్యూనిటీ భవనంలో బస చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, సమస్య గురించి విన్నవిస్తామని చెబుతున్నారు. కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు నరేంద్ర, గోపాలకృష్ణ, నరసింహమూర్తి, రామాంజనేయమూర్తి, నాగరాజు, లక్ష్మీపతి, గోపాల్‌, నరసింహప్ప, తిమ్మప్ప, చిన్న ఆదెప్ప తదితరులు పాల్గొన్నారు.

  • సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం

    హిందూపురం: సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ, ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్య పేర్కొన్నారు. ఆదివారం జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎస్‌సీ బాలుర వసతి గృహం, కేజీబీవీ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. వారు మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఎవరికీ మినహాయింపు ఉండదన్నారు. చిన్నపాటి తగాదాలు, ఘర్షణలతో పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా అదనపు న్యాయమూర్తి శైలజ కేజీబీవీలో విద్యార్థినుల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావచ్చని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సుదర్శన్‌, మురళి, రవిచంద్ర, లైజనింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, లోక్‌ అదాలతో సిబ్బంది హేమావతి, పారా లీగల్‌ వలంటీర్లు, ఆయా హాస్టల్‌ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

  • నేరాల

    ● జిల్లాను కుదిపేస్తున్న వరుస కుంభకోణాలు

    ● గార ఎస్‌బీఐ వ్యవహారం నుంచి నకిలీ నోట్ల యవ్వారం వరకు రూ.కోట్లలో దోపిడీ

    ● జిల్లా కేంద్రంలో కొత్తగా నకిలీ రబ్బరు స్టాంపుల స్కామ్‌

    ● కుంభకోణాల దర్యాప్తులో పురోగతి శూన్యం

    శ్రీకాకుళం క్రైమ్‌ :

    ప్రశాంత సిక్కోలును వరుస కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. మొన్నటికి మొన్న గార, నరసన్నపేట, శిలగాం స్టేట్‌బ్యాంక్‌ బ్రాంచిల్లో నకిలీ, డ్వాక్రా రుణాలు, తాకట్టు బంగారం మాయం కేసులు విస్మ యం కలిగించాయి. నిన్నటికి నిన్న కాశీబుగ్గ, జి.సిగడాం, మెళియాపుట్టి, శ్రీకాకుళం నగరాల్లో నకిలీ నోట్ల మకిలీలు దడ పుట్టించాయి. తాజాగా జిల్లాకేంద్రంలో నకిలీ రబ్బరు స్టాంపుల యవ్వారం సామాన్యుడిని భయపెడుతోంది. ఈ కేసుల దర్యాప్తుల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది.

    నకిలీ నోట్ల మకిలీలు..

    ● 2023 జూలైలో కాశీబుగ్గ కేంద్రంగా అంబటి సంతోష్‌ అనే రౌడీషీటర్‌ మరికొందరితో కలసి నర సన్నపేటకు చెందిన వ్యాపారిని రూ. 50 లక్షలకు మోసం చేశాడు. రూ. 500 నోట్ల కట్టలు అందిస్తే అంతకు పదిశాతం రూ. 2000 నోట్ల కట్టలిస్తానని మభ్యపెట్టాడు. ఇదే వ్యక్తి ఈ ఏడాది జూన్‌లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మరో గ్యాంగుతో కలసి రూ. 2.5 కోట్ల డీల్‌ వేరే వ్యక్తితో చేసి రూ. 1 కోటి గుంజేశాడు.

    ● 2024 డిసెంబరు 12న ఒకే రోజు మెళియాపుట్టి మండలం పట్టుపురం, జి.సిగడాం మండలం పెనసాం వద్ద రెండు నకిలీ నోట్ల ముఠాలు పట్టుబడ్డాయి. రూ. 90.25 లక్షల నకిలీ కరెన్సీ, 1.50 లక్షల బ్లాక్‌ కరెన్సీ బయటపడ్డాయి.

    ● ఈ ఏడాది ఆగస్టు 12న ప్రింటర్‌ సహాయంతో నకిలీనోట్లను ముద్రించి అవి మార్చే క్రమంలో జిల్లాకేంద్రంలోని ఓ లాడ్జీలో తంపటాపల్లి నవీన్‌, బూరగాం శ్రీనివాస్‌లు పట్టుబడ్డారు.

    పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో..

    జిల్లాలో ఈ ఏడాది జూలైలో ఇచ్ఛాపురం కేంద్రంగా పోస్టాఫీస్‌లో రూ. 2.78 కోట్ల కుంభకోణం జరిగింది. కిసాన్‌ వికాస్‌ పత్ర్‌ కేంద్ర పథకంలో భాగంగా 34 ఖాతాల్లో ఉన్న ఈ సొమ్మును అక్కడి సిబ్బందే

    దుర్వినియోగం చేశారని యాజమాన్యం గుర్తించారు. ఐదుగురిని అక్కడికక్కడే సస్పెండ్‌చేయగా మరో 15మంది వరకు దీనిలో భాగస్వామ్య మున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు సీబీఐకి ఇస్తామని చెప్పినా.. ఇప్పటికీ కుంభకోణం వెనుక సూత్రఽ దారులెవ్వరు, ఎవరి ఖాతాల్లోకి సొమ్ము మళ్లిందన్నది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.

    నకిలీ రబ్బర్‌ స్టాంపులు..

    తాజాగా నకిలీ రబ్బరు స్టాంపుల యవ్వారం జిల్లాలో దుమారం రేపింది. ఆగస్టులో ప్రింటర్‌ ద్వారా నకిలీ నోట్ల తయారీ చేసిన తంపటాల శివకుమారే ఇందులోనూ సూత్రధారి కావడం, మరో ఇద్దరి చేత రబ్బరు స్టాంపులు తయారీ చేయించడంతో వారిని సీసీఎస్‌ పోలీసులు అరె స్టు చేశారు. ఉమ్మడి జిల్లాలోని రాజాం, చిలకపాలెం, హిరమండలం, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదాలవలస, సరుబుజ్జిలి, కోటబొమ్మాళి, పాతపట్నం, జలుమూరు ప్రాంతాల రెవెన్యూ, ఇతర విభాగాల అధికారుల రబ్బరుస్టాంపుల ద్వారా ఫోర్జరీ సంతకాలు చేసి రూ. 5 కోట్ల మేర రుణాలను 20 మంది పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిలో హిరమండలం, పాతపట్నం, కోటబొమ్మాళికి చెందిన టీచర్లు ఐదుగురు, పోలీసులు ఆరుగురు ఉండటం విశేషం. ఒక్కొక్కరు రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పైగా లోన్లు పొందినట్లు తెలుస్తోంది. వాస్తవానికి శివకుమార్‌ ఇంటిలో 600 పైగా డాక్యుమెంట్లు దొరికినా కొన్నే ఆధారాలతో చూ పించి కేసు ప్రాధాన్యతను తగ్గించేశారని, దీని వెనుక ఎంతో మంది హస్తముండటం, వారంతా ముగినిపోయే పరిస్థితి ఉండటంతో మెల్లిగా సద్దుమణిగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల ప్రతినిధులు, లోన్లు పొందినవారు, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ, పంచాయతీ విభాగాల అధికారులు దెబ్బయ్యే పరిస్థితులున్నాయి. కేసును సీబీసీఐడీకి అప్పగిస్తే రాష్ట్రంలోనే సంచలన కేసుగా నిలిచే పరిస్థితి ఉందని సర్వత్రా చర్చ సాగుతోంది.

    స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచుల్లో వరుసపెట్టి అక్రమాలు బయటపడ్డాయి. 2023 అ క్టోబరులో గార ఎస్‌బీఐలో తాకట్టు బంగారం మాయమై వేరే ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు డీఎస్పీలు దర్యాప్తు అధికారులుగా మారినా ఇప్పటికీ కేసు విచారణ దశలోనే ఉంది. అసలు ముద్దాయిల ను చేర్చే చార్జిషీటు ఇంతవరకు పడనే లేదు.

    గతంలో ఇదే గార బ్రాంచిలో రూ. 15 కోట్ల విలువైన నకిలీ రుణాల కుంభకోణం జరిగింది. రైతులు లేకుండానే వారి పేరు మీద అకౌంట్లు సృష్టించి అప్పటి సిబ్బందిలో కొందరు తమ సొంతఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ కేసులో బ్యాంకు మేనేజర్‌ సహా నలుగురు సస్పెండ్‌ అయ్యారు.

    నరసన్నపేట బజారు బ్రాంచిలో ఉద్యోగుల పేరుతో రూ.కోటికి పైగా రుణాలను నొక్కేసిన బాగోతం బయటపడింది. ఫిబ్రవరిలో ఈ కేసును సీఐడీకీ సైతం అప్పజెప్పారు. బ్రాంచి మేనేజర్‌ శ్రీకర్‌పై సస్పెన్షన్‌ వేటు పడగా ఆర్‌ఎం రాజును పోస్టింగ్‌ లేకుండా కొన్నాళ్లు ఉంచారు.

    ఈ ఏడాది మేలో కవిటి మండలం శిలగాం బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరుతో రుణాలను కాజేసిన వ్యవహారం బయటకు వచ్చింది. సంఘాలకు ఇచ్చింది కొంతైతే.. వాటి పేరున నకిలీ ఖాతాల్లో నొక్కేసింది మరికొంత. బ్యాంకు లెడ్జర్లలోను, డీఆర్‌డీఏ రికార్డులోనూ రుణాల లెక్కల్లోతేడా రావడంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. దీంతో నాలుగేళ్ల కిందట జరిగిన అవినీతి బయటపడింది.

    తాజాగా దశాబ్దంన్నర కిందట రైతుల పేరిట రుణాలనుకాజేసినట్లు అప్పటి అధికారులపై ఆరో పణ చేస్తూ ఇటీవల బారువ స్టేట్‌బ్యాంకు బ్రాంచిలో దుమారం రేగింది. భారీ స్కామ్‌ జరిగిందంటూ బయటకు ప్రచారం జరుగుతుండటంతో ఎంత మేర వాస్తవముందో తెలియాల్సి ఉంది.

    బ్యాంకుల్లో

    అక్రమాలివే..

  • ● సాయం అందేనా..?

    సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

    వైపు వరుణుడు ప్రకోపం ప్రదర్శిస్తున్నాడు. మరోవైపు సర్కారు అంతులేని నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇంకోవైపు నిబంధనలు ముందరి కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. కలగలిపి రైతుకు కష్టం.. నష్టం తప్ప ఇంకేమీ మిగలడం లేదు. ఎండనక, వాననక కష్టపడి పంటను కాపాడుకుంటూ వస్తే మోంథా తుఫాన్‌ నిండా ముంచేసింది. నేల కొరిగిన వరి చేనులు రైతుల వైపు దీనంగా చూస్తున్నాయి. తడిచిన మొక్కజొన్న కంకులు, తడిచిన పత్తి అన్నదాత కళ్లల్లో ఆందోళనను చూసి చలించిపోతున్నాయి. ఎటు చూసినా నష్టాలు మూటగట్టుకున్న రైతులే కన్పిస్తున్నారు. ముఖ్యంగా మోంథా తుఫాన్‌ రైతులను నట్టేట ముంచింది. కోత దశలో ఉన్న పంట ఎక్కడికక్కడ నేలపాలైంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు తీరని నష్టం వాటిల్లింది. తుఫాన్‌ మిగిల్చిన నష్టం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

    సాయం చేయాల్సిన ప్రభుత్వం ఆదుకుంటోందా అంటే అదీ లేదు. బయటకు కనబడని నష్టాన్ని గుర్తించడం లేదు. 33 శాతం కన్న తక్కువ నష్టం ఉందని జాబితాలో నుంచి తీసేసింది. జిల్లాలో 12,500 హెక్టార్లకు పైగా పంట నేలకొరగడమే కా కుండా ముంపునకు గురైంది. కానీ అధికారులు ప్రాథమిక దశలో 9050 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని గుర్తించారు. 23 మండలాలపై తుఫాన్‌ ప్రభావం చూపింది. 82 గ్రామాల్లో పంట కు నష్టం వాటిల్లింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా నష్టం జరగ్గా, మిగతా నియోజకవర్గాల్లో ఓ మాదిరి నష్టం సంభవించింది. అధికారిక ప్రాథమిక లెక్కలు ప్రకారం 6200 మంది రైతులకు సంబంధించి పొలాలు ముంపునకు గురయ్యాయి. 100 ఎకరాల వరకు పత్తి, 75ఎకరాల వరకు మొక్కజొ న్న, 100ఎకరాల వరకు ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయి.

    చి‘వరి’కి ఇలా..

    ఎన్యుమరేషన్‌ పూర్తి చేసేసరికి జిల్లాలో 4,205 ఎకరాల్లోని పంట మాత్రమే నష్టం వాటిల్లినట్టు యంత్రాంగం నిర్ధారించింది. హెక్టార్‌కు రూ.25వేలు చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.4కోట్ల 20లక్షల మేర పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. ఇక పత్తి, మొక్కజొన్న, ఉద్యానవన పంటల నష్టాలకై తే అతీగతి లేదు. ఏ మాత్రం నష్టం జరగలేదని తేల్చేసింది. అధికారుల సుదీర్ఘ అంచనాల తర్వాత కొండంత నష్టానికి గోరంతే గుర్తిస్తోంది. వాస్తవాలకు, లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. తమ పొలాల ముంపును పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ముందుకెళ్తామని చెబుతున్నారు. 33శాతం కన్న ఎక్కువ నష్టం జరిగిన పంటనే లెక్కలోకి తీసుకోవాలని చెప్పడంతో ఏం చేయలేకపోతున్నామని అధికారులు తప్పించుకుంటున్నారు. ఇక గుర్తించిన నష్టానికి పరిహారం కూడా అంతంతమాత్రమే. ఎకరాకు రూ. 25వేలకు పైగా పెట్టుబడి పెడితే ప్రభుత్వం 2.5 ఎకరాలకు రూ. 25వేలు ఇస్తామని చెబుతోంది. అంటే పెట్టుబడులు సైతం రాని పరిస్థితి నెలకొంది.

    విత్తు నుంచి పంట వరకు శాపాలే..

    కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. గత ఏడాది పంటలకు గిట్టుబాటు ధరలే కాదు మిల్లర్ల మాఫియాకు తలొగ్గి కొనుగోళ్లే సరిగా చేయలేదు. దీంతో దళారులకు తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది విత్తనాలు దొరక్క, యూరియా సమకూర్చక నానా కష్టాలు పడితే తాజాగా తుఫాన్‌ గాలులకు, వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షార్పణమైపోవడంతో రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందే సమయంలో నోటి కాడి కూడు లాక్కున్నట్టు అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కళ్లెదుటే నీటిపాలవ్వడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనల పేరుతో కాకి లెక్కలు కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి ఈసారైనా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

    అన్నదాతకు అడుగడుగునా ని‘బంధనాలు’

    అటు వరుణుడి కోపం, ఇటు ప్రభుత్వ

    నిర్లక్ష్యంతో రైతులకు నష్టాలు

    మోంథా తుఫాన్‌తో మరింత కుదేలు

    33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితేనే

    పరిహారం అంటూ నిబంధన

    ఎన్యుమరేషన్‌లోనే భారీగా తొలగింపు

  • వంశధా

    జలుమూరు: బాలియాత్ర ఉత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం వంశధార తీరంలో భక్తులు దీపోత్సవం నిర్వహించారు. కానీ స్థాని క ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి సుమారు గంటన్నరకు పైబడి ఆలస్యంగా రావడంతో భక్తులకు అసహనానికి గురై చాలా మంది వెనుదిరిగారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కా వాల్సి ఉండగా.. ఎమ్మెల్యే ఎంతకూ రాలేదు. దీంతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కు మార్‌తో అర్చకులు, నిర్వాహకులు కార్యక్రమం మొదలుపెట్టారు. కాసేపటికే ఆయన రావడంతో మళ్లీ యాత్రకు పూర్ణకుంభం సిద్ధం చేసి ప్రా రంభించారు. తర్వాత పూజల అనంతరం బాణసంచా కాల్చి వంశధార నదికి చేరుకున్నారు. దీనికి ముందు బాలి యాత్ర విశేషాలను నిర్వాహక కమిటీ ప్రతినిధి దువ్వాడ జీవితేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ పిరియా విజయ, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రామ్మోహనరావు దంపతులు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌, ఆమ దాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌, విశాఖ సిటీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి, కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, మాజీ కళింగ, వైశ్య కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్లు దుంపల రామారావు(లక్ష్మణరావు), అంధవరపు సూరిబాబు, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ తదితరులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

  • పక్షు

    టెక్కలి: టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో పెలికాన్‌, పెయింటెడ్‌ స్టార్క్‌ తదితర విదేశీ పక్షుల విడిది కేంద్రానికి ఇకపై వెళ్లాలంటే టికెట్‌ తీసుకోవాల్సిందే. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పక్షుల కేంద్రంలో గతంలో ఎన్నడూ టికెట్‌ వసూలు అనేది ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా ఒక్కో వ్యక్తి నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. పక్షుల కేంద్రంలో అభివృద్ధి కోసమే టికెట్‌ విధానం అమలు చేసినట్లు అటవీ శాఖాధికారులు చెబుతుండగా, పక్షుల కేంద్రం అభివృద్ధికి పర్యాటకుల నుంచి టికెట్‌ రూపంలో వచ్చిన నిధులను వెచ్చిస్తారా అంటూ కొంత మంది పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    ‘పెండింగ్‌ ప్రాజెక్టుల సంగతేంటి..?’

    టెక్కలి: జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న హామీని ఎప్పటిలోగా నెరవేరుస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు ప్రశ్నించారు. ఆదివారం టెక్కలి సీఐ టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రూ.600 కోట్లు కేటాయిస్తే, జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, కె.అచ్చెన్నాయుడు చిత్తశుద్ధిగా వ్యవహరించాలన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు నిధులు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. వంశధార లిఫ్ట్‌ కు రూ.150 కోట్లు, రిజర్వాయర్‌ పనుల కోసం రూ.150 కోట్లు, అదేవిధంగా ఆఫ్‌షోర్‌కు రూ. 300 కోట్లు కేటాయిస్తే శివారు వరకు నీరు అందుతుందని తెలిపారు. గొప్పలు చెప్పుకోవడం కాదని నేరడికి అనుకూలంగా తీర్పు వచ్చినా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు వేయించుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని ప్రశ్నించారు.

  • ‘కఠోర సాధనే విజయ మార్గం’

    వజ్రపుకొత్తూరు రూరల్‌: ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలంటే కఠోర సాధన అవసరమని బ్రహ్మపుత్ర నదిని ఈదిన ప్రపంచ రికార్డు గ్రహీత మేజర్‌ వాసుపల్లి కవిత అన్నారు. మండలంలో గల మోట్టూరులో ఆదివారం ఆమెను అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సంఘాల వారు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ చిన్న వయస్సులోనే వైద్య వృత్తిని పూర్తి చేసి భారత సైన్యంలో చేరి ఆర్మీ అధికారిగా నియమితులయ్యారని కొనియాడారు. బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని రాఫ్ట్‌ చేసిన తొలి మ హిళగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. అలా గే 6,488 మీటర్ల ఎత్తైన మౌంట్‌ గోరిచెన్‌ శిఖరాన్ని అధిరోహించమే కాకుండా అత్యంత ప్రతికూల పరిస్థితిలో సహచరుడి ప్రాణాలను కాపాడి విశిష్ట సేవా పథకాన్ని అమె అందుకున్నారని తెలిపారు. కవిత తల్లిదండ్రులైన వాసుపల్లి రామారావు, రమ్యలను కూడా సత్కరించారు. కార్యక్రమంలో అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షుడు పి.దిలీప్‌, కార్యదర్శి కృష్ణారావు, సంఘ పెద్దలు దుర్యోధన, ప్రకాశ్‌, కె.దుర్గారావు, ఎంపీటీసీలు తిర్రి గుణ, కె.సురేఖ, సర్పంచ్‌ తిర్రి కామేశ్వరి, ఖండ్లా సంఘ అధ్యక్షులు ప్రకాశ్‌, సూరాడ మోహన్‌రావు, తిర్రి లక్ష్మీనారాయణ, శేషయ్య, యువకులు, మహిళలు తదితరులు ఉన్నారు.

Narayanpet

  • గుప్ప

    నారాయణపేట: జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. యువతే లక్ష్యంగా వీరు అమ్మకాలు చేపడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి జిల్లాకు రైళ్లలో గుట్టుగా గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గంజాయి తరలింపు, వినియోగాన్ని అరికట్టేందుకు ఇటు పోలీసులు, అటు ఎకై ్సజ్‌ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి విక్రయదారులను పట్టుకుంటున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. దీంతో యువతతో పాటు మైనర్లు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. గంజాయి, డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలని ప్రభుత్వ సంకల్పంతో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ దిశానిర్ధేశంతో ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ఆదేశాల మేరకు ఇటీవల విస్తృత దాడులు చేశారు. పలువురిని పట్టుకోవడంతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని 14 కేసులు నమోదు చేశారు.

    ప్రత్యేక టీంలతో సరిహద్దులో నిఘా

    జిల్లాకు సరిహద్దులో కర్ణాటక ఉండడంతో అటు నుంచే గంజాయి తరలిస్తున్నారు. దీంతో ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీ వినిత్‌ గంజాయి విక్రయాల అడ్డుకట్టపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు ఓ ప్రత్యేక టీంను ఏర్పాటుచేశారు. జిల్లా పరిధిలోని మక్తల్‌లో కృష్ణా చెక్‌పోస్టు, నారాయణపేటలో జలాల్‌పూర్‌ చెక్‌పోస్టు, దామరగిద్దలో కానుకుర్తి చెక్‌పోస్టు, ఊట్కూర్‌లో సంస్థపూర్‌ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అయినా సరిహద్దులు దాటి తెలంగాణలోకి గంజాయి వస్తుండడంతో పోలీసులకు మరింత సవాల్‌గా మారింది. దామరగిద్ద మండలంలోని సజానాపూర్‌, మాగనూర్‌ మండలంలోని ఉజ్జెలి, కృష్ణా మండలంలోని చేగుంటా, కున్షి, హిందూపూర్‌, నారాయణపేట మండలంలోని ఎక్లాస్‌పూర్‌, ఊట్కూర్‌ సమీపంలోని ఇడ్లూర్‌, కొల్లూర్‌ గ్రామాలు సైతం కర్ణాటకకు సరిహద్దులో ఉన్నాయి. ఆ మార్గాల గుండా గంజాయిని తీసుకువస్తుండడంతో పోలీసులు నిఘా పెంచారు. ఇదిలాఉండగా, ధన్వాడకు అటు హైదరాబాద్‌లోని దూల్‌పేట నుంచి, ఇటు ముంబాయి నుంచి గంజాయి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మండలంలోని పలు తండాల నుంచి ముంబాయికి వలస వెళ్లే వారు తిరిగి తమ ప్రాంతాలకు వచ్చే సమయంలో అక్కడ గంజాయికి అలవాటు పడిన యువత తమ వెంట గంజాయి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

    గంజాయి కేరాఫ్‌ యాద్గీర్‌, షోలాపూర్‌

    కర్ణాటకలోని యాద్గీర్‌, మహారాష్ట్రలోని షోలాపూర్‌ గంజాయికు కేరాఫ్‌గా దందా కొనసాగుతున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో పది మంది పట్టుబడిన వారిలో షోలాపూర్‌, యాద్గీర్‌కు చెందిన వారు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండే అశోక్‌నగర్‌లో ఉండే ఓ యువకుడు గత రెండేళ్లుగా గంజాయి వ్యాపారం చేసి ఇటీవల పట్టుబడడం.. తీగలాగితే డొంక కదలింది. గంజాయి రాకేట్‌లోని మరో తొమ్మిది మందిని పోలీసులు పట్టుకొని జిల్లా ఎస్పీతో శభాష్‌ అనిపించుకున్నారు.

    కర్ణాటకలోని యాద్గీర్‌, మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి గుట్టుగా తరలింపు

    ఎకై ్సజ్‌, పోలీస్‌శాఖ ప్రత్యేక నిఘా.. విస్తృత దాడులు

    పదుల సంఖ్యలో కేసులు నమోదు

    జిల్లాలో ఎకై ్సజ్‌శాఖ దాడుల్లో పలు గంజాయి కేసులు నమోదుఅయ్యాయి. కృష్ణా మండలంలోని కున్సిలో ఇద్దరిపై, మూరారిదొడ్డిలో ఒకరు, దామరగిద్ద మండలంలో ఒకరిపై కేసులు నమోదు అయ్యాయి. మాగనూర్‌ మండలంలోని కొత్తపల్లిలో ఒకరు, చందాపూర్‌లో మస్తీపూర్‌కు చెందిన వ్యక్తి, సింగారం చౌరస్తాలో గుర్మిట్కల్‌ తాలూకా గుంజనూర్‌కు చెందిన వ్యక్తి ఒకరు పట్టుబడ్డారు. అదే విధంగా పోలీసు శాఖ దాడుల్లో 8 కేసులు నమోదు అయ్యాయి. ఊట్కూర్‌ మండలంలోని ఎడవేళ్లిలో ఊట్కూర్‌ పీఎస్‌ పరిధిలో 400 గ్రాములు గంజాయి, గంజాయి మొక్కలు పట్టుబడడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అలాగే, కృష్ణా మండలంలో 500 గ్రాముల గంజాయి ఒక ప్లాంట్‌ పట్టుబడడంతో ఒకరిపై, ధన్వాడ పీఎస్‌ పరిధిలో 50 గ్రాముల పట్టుబడడంతో ఒకరిపై కేసు నమోదు చేశారు. మక్తల్‌ పీఎస్‌ పరిధిలో 500 గ్రాముల గంజాయి పట్టుబడడంతో ముగ్గురిని అరెస్టు, మద్దూర్‌ పీఎస్‌ పరిధిలో 1.3 కేజీ డ్రై గంజాయి, 89 ప్లాంట్స్‌ పట్టుబడడంతో ఒకరిపై కేసు నమోదు అయింది. గత ఆగస్టు 15న ఊట్కూర్‌ శివారులో గంజాయి విక్రయిస్తూ 125 గ్రాములతో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. నవంబర్‌ 2 కృష్ణా పీఎస్‌ సరిహద్దులో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో 12.4 కిలోల గంజాయి పట్టబడడం గమనార్హం.

  • అమ్రా

    జనవరి 17 నుంచి 23 వరకు

    కొనసాగనున్న ప్రక్రియ

    ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం

    స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల

    నుంచి దరఖాస్తుల ఆహ్వానం

    ఈ నెల 22తో ముగియనున్న

    స్వీకరణ గడువు

    అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్‌ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు.

    ప్రతి వలంటీర్‌ అటవీ సిబ్బందితో కలిసి 7 రోజులపాటు అడవిలో కాలినడకన నడుస్తూ.. పులుల జాడలు, పాదముద్రలు, మల విసర్జితాలు, ఇతర అవశేషాలను సేకరించి జంతువుల గణన చేపడతారు. ఈ లెక్కల ఆధారంగానే భవిష్యత్‌లో పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో గణన జరుగుతుంది. ప్రతి బీట్‌కు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున లెక్కింపులో పాల్గొంటారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలోని 11 రేంజ్‌ల పరిధిలో 220 బీట్లలో పులుల లెక్కింపునకు అటవీశాఖ సిబ్బంది 150 మందితోపాటు మరో 50 మంది వాచర్లు ఉన్నారు. వీరితోపాటు సుమారు 460 మంది వలంటీర్లు అవసరమవుతారు. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఇప్పటి వరకు 700 పైగా వచ్చాయి. వీటిలో అర్హత మేరకు వలంటీర్లను తీసుకుంటారు.

    దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్‌ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్‌ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్‌ జోన్‌. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్‌, మద్దిమడుగు, మన్ననూర్‌, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్‌ రేంజ్‌లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్‌ ద్వారా సేకరించిన ప్లగ్‌ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు.

    మ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జీవవైవిధ్యంతోపాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర కీలకం. ఒకప్పుడు కేవలం మూడు పులులకు నిలయంగా ఉన్న ఏటీఆర్‌లో ఇప్పుడు వాటి సంఖ్య 36కు పెరిగింది. 2017 వరకు కూడా పులుల సంఖ్య అరకొరగానే ఉండేది. అమ్రాబాద్‌ అభయారణ్యంలో కేవలం 10 పులులే ఉండేవి. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించి.. వాటి పరిరక్షణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఫలితంగా ఆరేళ్లలో అమ్రాబాద్‌లో పులుల సంఖ్య 36కు పెరిగింది.

    ల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్‌–6 ఆడపులి, ఫరాహా ఎఫ్‌–6, తారా ఎఫ్‌–7, భౌరమ్మ ఎఫ్‌–18, ఎఫ్‌–26, ఎఫ్‌–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి.

    ఈసారి పులులు, ఇతర జంతువుల గణన పకడ్బందీగా కొనసాగుతుంది. గతంలో అరకొర సిబ్బందితో చేపట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అటవీ సిబ్బంది 150 మందితోపాటు సమర్థవంతంగా పనిచేసే 50 మంది వాచర్లు ఉన్నారు. అలాగే వలంటీర్ల కోసం ఆన్‌లైన్‌లో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అటవీ, పులులపై అవగాహన కలిగిన అర్హులు, పనితీరు మెరుగ్గా ఉన్న యువతను వలంటీర్లుగా తీసుకుంటాం. – రోహిత్‌ గోపిడి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్‌

  • జూరాల రహదారికి మోక్షం

    అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రహదారి మరమ్మతులకు పీజేపీ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నందిమళ్ల క్యాంపు నుంచి ప్రాజెక్టు మీదుగా గద్వాల, రాయచూర్‌ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది తమ వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. వీటితోపాటు జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల పర్యాటకులు సైతం వస్తుంటారు. 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాజెక్టు ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు రహదారిపై గద్వాలకు వెళ్తుండటంతో అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన పీజేపీ అధికారులు.. నేటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులకు పూనుకోకపోవడంతో రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడం.. మరమ్మతుకు నోచుకోవడంతో రాకపోకల కష్టాలు తొలగిపోనున్నాయి.

    అడుగుకో గుంత..

    పీజేపీ నందిమళ్ల క్యాంపు నుంచి రేవులపల్లి వరకు జూరాల జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. అడుగడుకో గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల చిన్న గుంతలు, మరికొన్ని చోట్ల రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకల సమయంలో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని భారీ వాహన డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు ఎదురుగా వస్తున్న ద్విచక్ర, ఆటోలను తప్పించబోయి ప్రమాదాల బారినపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టు రూపురేఖలు మారుతాయని ఈ ప్రాంత ప్రజల ఆశలు నేటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతున్నాయి. ప్రస్తుతం రహదారి మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    మరమ్మతుకు

    రూ.30 లక్షలు మంజూరు

    బాగుపడనున్న 4.50 కిలోమీటర్ల రోడ్డు

    టెండర్ల ఆహ్వానానికి సిద్ధమవుతున్న అధికారులు

    తీరనున్న ప్రయాణికుల కష్టాలు

    కుడి, ఎడమ కాల్వల పరిధిలో..

    ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు సైతం వ్యయ ప్రయాసాలకోర్చి రాకపోకలు సాగించే దుస్థితి నెలకొంది. దీనికితోడు ఎడమ కాల్వ వద్ద చేప వంటకాల విక్రయ కేంద్రాలు ఉండటంతో పర్యాటకులతో పాటు చేప వంటకాలు ఆరగించేందుకు ప్రజలు రోజు వేలాదిగా సొంత వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. వాహనాలన్నీ కాల్వ సమీపంలోని ప్రధాన రహదారిపై నిలుపుతుండటంతో వచ్చి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • నేడు

    కోస్గి: మండలంలోని సర్జఖాన్‌పేట సబ్‌ స్టేషన్‌లో విద్యుత్‌ మరమ్మతు పనుల కారణంగా సోమవారం సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ వెంకటేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తోగాపూర్‌, పోతిరెడ్డిపల్లి, సర్జఖాన్‌పేట, హకీంపేట గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి విద్యుత్‌ సిబ్బందికి సహకరించాలని కోరారు.

    రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

    మద్దూరు: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఆటో డ్రైవర్లకు సూచించారు. ఆదివారం పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌ నిబంధనలపై, వాహన పత్రాలు, హెల్మెట్‌ వినియోగం, మధ్యం సేవించి డ్రైవింగ్‌ చేయరాదని సూచిస్తూ అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణ భద్రత మనందరి బాధ్యతగా ఆటో డ్రైవర్లు ఎల్లపూడూ జాగ్రత్తంగా వాహనాలు నడపాలని అదేశించారు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలు దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆటో డ్రైవర్లు, పోలీసులు పాల్గొన్నారు.

    ఘనంగా మాతా

    మాణికేశ్వరి వార్షికోత్సవం

    నారాయణపేట రూరల్‌: జిల్లా కేంద్ర సమీపంలోని పగడిమారి రోడ్డులోని సద్గురు రూపరహిత అహింసా యోగేశ్వరి వీరధర్మజ మాతా మాణికేశ్వరి ఏడో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ధ్వజారోహణం, గోమాత పూజ, నాగ సింహాసన అభిషేకం, అమ్మవారి పాదుకల అభిషేక పూజలు, మహా గాయత్రి యజ్ఞము భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మంగళహారతి, మహిళలచే ఓంకారం త్రిశూలాకార కార్తీక దీపాలంకరణోత్సవం, తీర్థ ప్రసాద, అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌ రెడ్డి, మాధవరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాత ఆశ్రమ కమిటీ సభ్యులు మందార, లత, శివరాంరెడ్డి, రాజేశ్వరి, వాల్వేకర్‌ నికేతన్‌, దశరథ్‌, విటల్‌ బిలాల్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • విస్త

    నారాయణపేట రూరల్‌: జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆదివారం గూడ్స్‌ వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పట్టవా..? అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షిశ్రీలో ఫొటో వార్త ప్రచురితమవగా.. పోలీసు శాఖ స్పందించింది. గూడ్స్‌ వాహనాల్లో సరుకు రవాణాను బదులు ప్రమాదకర పరిస్థితుల్లో జనాలను తీసుకు వెళ్లడం, ప్యాసింజర్‌ ఆటోల్లో సైతం పరిమితికి మించి కూలీలను ఎక్కించుకోవడం, బడిఈడు పిల్లలను పనులకు తీసుకుని వెళ్లడం వంటి వాటిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో నారాయణపేట రూరల్‌ పోలీసులు ఎస్‌ఐ రాముడు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి 8 వాహనాలపై జరిమానా విధించారు. అదేవిధంగా పలువురు కూలీలు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాలకు కారణాలు తెలియచేశారు. సురక్షిత ప్రయాణానికి ప్రతిఒక్కరు సహకరించాలని, పునరావృతం అయితే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

  • కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

    దామరగిద్ద: వరి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధరను అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు విండో అధ్యక్షుడు ఈదప్ప సమక్షంలో ఆదివారం మండలంలోని పిడెంపల్లి, మల్‌రెడ్డిపల్లి, కాన్‌కుర్తి గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం సేకరించి సకాలంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు బాల్‌రెడ్డి, ఈదప్ప, శ్రీనివాస్‌, ఖాజామియా, వెంకట్రామారెడ్డి, నీలిమాణిక్యప్ప, శ్రీనివాస్‌, టి రఘు, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

  • బీటీ

    నందిమళ్ల క్యాంపుకాలనీ నుంచి రేవులపల్లి వరకు కొత్తగా బీటీ రహదారి ని ర్మించాలి. రహదారికి తా త్కాలిక మరమ్మతు చేస్తే చిన్నప ాటి వర్షాలకే మ రోమారు దెబ్బతినే అవకాశం ఉంది. అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మ తు పక్కాగా చేపట్టాలి. – వెంకటేష్‌, నందిమళ్ల

    రూ.30 లక్షలతో మరమ్మతు..

    జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ పరిధిలోని మొత్తం 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారి మరమ్మతుకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధులు మంజూరవుతాయి. వెంటనే టెండర్లు ఆహ్వానించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

    – ఖాజా జుబేర్‌ అహ్మద్‌, ఈఈ, గద్వాల

Nalgonda

  • రామగిరి (నల్లగొండ) : పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి పురుషోత్తంరావు అన్నారు. నల్లగొండలో ఆదివారం నిర్వహించిన న్యాయసేవా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వివరిస్తామన్నారు. లోక్‌ అదాలత్‌ నిర్వహిచడం వివాదాలను పరిష్కరించవచ్చన్నారు. న్యాయ సహాయం అవసరం ఉన్న వాళ్లు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 15న నిర్వహించే లోక్‌ అదాలత్‌లో సివిల్‌ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కట్ట అనంతరెడ్డి, ఎన్‌.భీమార్జున్‌రెడ్డి, కట్ట వెంకట్‌రెడ్డి, ఎం.లెనిన్‌ బాబు, న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

    సమాజంలో విలువలను పరిరక్షించేది సాహిత్యం

    రామగిరి (నల్లగొండ) : సమాజంలో విలువలను పరిరక్షించేదే సాహిత్యమని సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సాహిత్యం అభ్యుదయ సమాజాన్ని కాంక్షించేలా ఉండాలన్నారు. పాఠశాల స్థాయి పిల్లలనుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల వరకు తెలంగాణ సాహిత్య సమావేశంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. గ్రంథాలయ ఉద్యమకారుడుగా, పుస్తక ప్రచురణ కర్తగా, ఆంధ్ర మహాసభ నాయకుడిగా వట్టికోట ఆల్వార్‌ స్వామి కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు మునాస్‌ వెంకట్‌, బెల్లి యాదయ్య, తండు కృష్ణకౌండిన్య, కుకుడాల గోవర్ధన్‌, చొల్లేటి ప్రభాకర్‌, కృష్ణమాచార్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    అంగన్‌వాడీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    నకిరేకల్‌ : అంగన్‌వాడీ టీచర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం నకిరేకల్‌లో జరిగిన జిల్లా మహాసభలో ఎనుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా పొడిచేటి నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.పార్వతి రెండోసారి ఎన్నికయ్యారు. జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఇంద్రవల్లి సైదమ్మ, దాడి అరుణ, మణెమ్మ, ఎల్‌.రాజు, సహాయ కార్యదర్శులుగా సముద్రమ్మ, పద్మ, ఫాతిమా, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా అవుట రవీందర్‌, ప్రచార కార్యదర్శిగా సుభాషిని, కోశాధికారిగా సునంద, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా రషీదా, జిల్లా కమిటీ సభ్యులుగా చంద్రమ్మ, ఎల్లమ్మ, లలిత, రాధాబాయి, అప్పనబోయిన మంగమ్మ, కృష్ణవేణి, అండాలు, కల్యాణి, యాద మ్మ, పరిపూర్ణమ్మ, శ్రీదేవిలు ఎన్నికయ్యారు.

    శ్రీనృసింహుడికి విశేష పూజలు

    యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు జరిపించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్యన ఊరేగించారు.

    పొడిచేటి నాగమణి, జిల్లా అధ్యక్షురాలు

    పార్వతి, జిల్లా ప్రధాన కార్యదర్శి

  • ముంచు

    తిప్పర్తి, కనగల్‌ మండలాల్లోని జూనియర్‌ కళాశాలల్లో డిప్యూటేషన్‌ మీద అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక కాలేజీలో మూడు రోజులు, మరో కాలేజీలో మూడు రోజులు పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. విద్యా సంస్థల ప్రారంభ దశలోనే పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయిస్తే దానికి తగ్గట్లుగా సిలబస్‌ పూర్తి చేసేందుకు అధ్యాపకులు ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారు. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ ముంచుకు వస్తుండడంతో అధ్యాపకులతో పాటు విద్యార్థులకు సైతం ఒత్తిడి పెరుగుతుంది.

    నల్లగొండ టూటౌన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరిలో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ ఓ వారం ముందుకు జరపడంతో విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 140 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉండగా, వాటిలో 12వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని కాలేజీల్లో 50 శాతం సిలబస్‌ పూర్తి కాగా, మరికొన్ని చోట్ల 60 శాతమే పూర్తయినట్లు అధ్యాపకులు చెబుతున్నారు. కాలేజీలు జూన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ఐదు నెలల్లో సిలబస్‌ 60 శాతమే పూర్తి కావడంతో మిగతా 40 శాతం పూర్తి కావడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇంటర్‌ సిలబస్‌ పూర్తయ్యేది ఎలా అనే చర్చ జరుగుతోంది.

    రెండు నెలల్లో సిలబస్‌ పూర్తి అసాధ్యం...

    ఇంటర్మీడియట్‌ పరీక్షల తేదీల ప్రకారం చూసుకుంటే నవంబర్‌ నెలాఖరులోగా సిలబస్‌ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. జవనరిలో ప్రాక్టికల్స్‌ ఉన్నందున డిసెంబర్‌లో విద్యార్థుల చేత ప్రాక్టికల్స్‌ చేయించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో అయితే ప్రాక్టికల్స్‌ ముందుగానే చేయిస్తున్నా.. నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్‌ కాలేజీల్లో ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాబోధన మాత్రమే ముందుగా చేస్తారు. ఆయా కాలేజీల్లో ఇప్పటి వరకు విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ చేయించలేని తెలుస్తోంది. గురుకుల కాలేజీల్లో ప్రాక్టికల్‌ చేయడానికి సామగ్రి లేకపోవడంతో విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలకు తీసుకెళ్లి చేయించాల్సి ఉంది. కానీ ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. పరీక్షలకు ముందు ప్రాక్టికల్స్‌ మమ అనిపించే అవకాశం ఉందనే చర్చ లేకపోలేదు. 100 మందికిపైగా విద్యార్థులు ఉంటే వారి కాలేజీల్లోనే సెంటర్‌ పడే అవకాశం ఉండడంతో ఇది వారికి బాగా కలిసి రానుంది.

    ఫ ఇంటర్మీడియట్‌ సిలబస్‌ 60 శాతమే పూర్తి

    ఫ వచ్చేఏడాది ఫిబ్రవరి 25 నుంచి

    పరీక్షలు.. జనవరిలో ప్రాక్టికల్స్‌

    ఫ డిసెంబర్‌లో మిగతా సిలబస్‌ పూర్తికావడం కష్టమే..

    ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఫిబ్రవరిలో ఉన్నందున అన్ని కాలేజీల్లో డిసెంబర్‌లోగా సిలబస్‌ పూర్తి అవుతుంది. ప్రతి కాలేజీలో తప్పనిసరిగా సిలబస్‌ డిసెంబర్‌లోగా పూర్తి చేయాల్సిందే. ఇప్పటికే 90 శాతం సిలబస్‌ పూర్తయినట్లు కాలేజీల యాజమాన్యం చెబుతోంది.

    – దస్రూనాయక్‌, ఇంటర్మీడియట్‌ అధికారి

  • ఇందిరమ్మ ఇల్లు జీప్లస్‌ వన్‌!

    నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పేదలకు ఊరట లభించింది. ఇందిరమ్మ ఇంటిని కనీసం 600 చదరపు అడుగుల స్థలంలో నిర్మించుకోవాలనే నిబంధన ఉండడంతో గ్రామాలతోపాటు పట్టణాల్లోని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు సరిపోయేంత స్థలం లేక ఆసక్తిచూపడం లేదు. దీంతో ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు కూడా జీ ప్లస్‌ వన్‌ విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని నిబంధన సడలించింది. 400 చదరపు అడుగుల స్థలం ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు. ఈ మేరకు ఇటీవల జీఓ 69ని విడుదల చేసింది.

    323 చదరపు అడుగులకు తగ్గకుండా..

    ప్రభుత్వ నిర్ణయంతో 50 గజాల స్థలం ఉన్న వారు కూడా జీప్లస్‌వన్‌ విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. ఈ నిర్ణయంతో పేదలకు మేలు చేకూరుతుంది. అయితే ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో కేంద్రం వాటా ఉన్నందున కనీసం 323 చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుండా నిర్మించుకోవాల్సి ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 200 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగుల ఇంటిని నిర్మించుకోవచ్చు. జీప్లస్‌ వన్‌ విధానంలో పెద్ద గది, కార్పెట్‌ ఏరియా, వంట గది, మరుగుదొడ్డి, స్నానాల గది నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంటిని ఆర్‌సీసీ స్లాబ్‌తో మాత్రమే నిర్మించాలి. ఇంటి ప్లాన్‌ రెడీ చేసుకున్నవారు.. హౌసింగ్‌ డీఈఈని కలిసి ప్లాన్‌ చూపించి.. ఆయన అనుమతితో ఇంటి నిర్మా ణం చేపట్టవచ్చు. జీప్లస్‌ వన్‌ పద్ధతిలో నిర్మించే ఇంటికి రూ.5 లక్షల సాయాన్ని 4 విడతల్లో అందజేయనున్నారు. దిగువ అంతస్తు పైకప్పు పూర్తయ్యాక రూ.లక్ష, మొదటి అంతస్తులో కాలమ్స్‌ పూర్తయ్యాక రూ.లక్ష, పైఅంతస్తు పైకప్పు, 2 అంతస్తుల గోడలు పూర్తయ్యాక రూ.2లక్షలు, పూర్తి నిర్మా ణం అయ్యాక మిగతా రూ. లక్ష విడుదల చేయనున్నారు.

    ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల పేదలకు మేలు కలుగుతుంది. 50 గజాల స్థలం ఉన్న వారు కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవచ్చు. చాలా మంది కొద్ది స్థలం ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురుచూసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంతో మరింత మంది పేదలకు లబ్ధి చేకూరనుంది.

    – రాజ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ, నల్లగొండ

    ఫ ఇంటి నిర్మాణానికి నిబంధనల సడలింపు

    ఫ 50 గజాలలోపు స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోవచ్చు

    ఫ ఇటీవల జీఓ 69 విడుదల చేసిన ప్రభుత్వం

    జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ

    వివరాలు ఇలా..

    కేటాయించినవి 19,697

    మంజూరైనవి 17,246

    గ్రౌండింగ్‌ 13,499

    బేస్‌మెంట్‌ లెవల్‌ 7,452

    రూఫ్‌ లెవల్‌ 1808

    స్లాబ్‌ లెవల్‌ 624

    పూర్తయినవి 5

    వివిధ దశల్లో

    నిర్మాణంలో ఉన్నవి 9787

    రూ.లక్ష అందినవి 6,000

    రూఫ్‌లెవల్‌ బిల్లు వచ్చినవి 2,800

    స్లాబ్‌ లెవల్‌ బిల్లు వచ్చినవి 1,765

  • ట్రక్

    మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అడ్డదారుల్లో ట్రక్‌ షీట్‌ జారీ చేయడంపై జిల్లా కోఆపరేటివ్‌ అధికారి (డీసీఓ) ఎం.పత్యానాయక్‌ ఆదివారం విచారణ చేపట్టారు. ఆదివారం ‘సాక్షిశ్రీలో శ్రీబోనస్‌ కాజేసేందుకు పన్నాగం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన డీసీఓ పత్యానాయక్‌ అవంతీపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు వివరాలను సేకరించారు. కొనగోలు కేంద్రానికి ధాన్యం రాకుండానే నేరుగా రైతు కల్లం వద్దకు బస్తాలు ఇవ్వడం, పచ్చి ధాన్యాన్ని నేరుగా పట్టణ పరిధిలోని శ్రీ శివసాయి రైస్‌ ఇండస్ట్రీస్‌కు తరలించడం, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్‌ షీట్‌ జారీ చేయడంపై ప్రశ్నించారు. పీఏసీఎస్‌ సీఈఓ సైదులును విచారించి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయని, మరో 75 కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 96వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.158 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఏడీఏ సైదానాయక్‌, ఆలగడప పీఏసీఎస్‌ చైర్మన్‌ వెలిశెట్టి రామకృష్ణ తదితరులు ఉన్నారు.

  • రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగ సవరణ చేయాలి

    నల్లగొండ : బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ చైర్మన్‌ మునాస ప్రసన్నకుమార్‌ అన్నారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్జీవో భవన్‌లో 40 కుల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 10 నుంచి జిల్లా వ్యాప్తంగా బీసీలంతా ఉద్యమించాలన్నారు. డిసెంబర్‌ 1 నుంచి నిర్వహించే పార్లమెంట్‌ సమావేశాలలో బీసీ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో అపాయిట్‌మెంట్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో గుంటోజు వెంకటాచారి, చిలుకరాజు చెన్నయ్య, వైద్యుల సత్యనారాయణ, పాల్వాయి రవి, ఎరుకల శంకర్‌గౌడ్‌, కర్నాటి యాదగిరి, చెన్నూరి భరద్వాజ్‌యాదవ్‌, నవీన్‌ కుమార్‌, దుడ్డు కష్ణమూర్తి, అంబటి శివకుమార్‌, ఖదీర్‌, పందుల సైదులుగౌడ్‌, గండిచెరువు వెంకన్నగౌడ్‌, అయితగోని జనార్దన్‌గౌడ్‌, పుట్ట వెంకన్నగౌడ్‌, మార్గం సతీష్‌కుమార్‌, శంకర్‌, దుర్గ, విజయ్‌చారి, చెన్నోజు రాజు, గిరి, నాగరాజ్‌గౌడ్‌, యాదగిరి, అంజయ్య పాల్గొన్నారు.

  • సెయిం

    నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండ పట్టణంలోని సెయింట్‌ ఆల్ఫోన్సస్‌ పాఠశాలలో మోలిక్యూల్‌ ఫెస్ట్‌ సందర్భంగా ఆదివారం విద్యార్థుల సాంస్క్రతిక కార్యక్రమాలు అలరించాయి. మూడు రోజులు గా నిర్వహిస్తున్న వేడుకల ముగింపు కార్యక్రమానికి హై కోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. నాటి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ఏఎస్పీ రమేష్‌, ప్రిన్సిపాల్‌ రెవరెండ్‌ బ్రదర్‌ హృదయ్‌కుమార్‌రెడ్డి, శాజన్‌ ఆంథోని, షైని అలెక్స్‌, విన్సెంట్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌, బాల ఇన్నా, సెబాస్టియన్‌, వినోద్‌రెడ్డి, శ్యాంపాల్‌రెడ్డి, సీతారాంగోరే, విజయకుమార్‌రెడ్డి, బాలశౌరిరెడ్డి పాల్గొన్నారు.

SPSR Nellore

  • ప్రజా సంక్షేమం ఊసేలేని పాలన

    వెంకటాచలం: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ఊసే లేని పాలన సాగుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండలంలోని చెముడుగుంటలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్‌ వంటి విపత్తుల పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులు సమర్థవంతంగా పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాయన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే గొప్ప లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 కొత్త మెడికల్‌ కళాశాలలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. మెడికల్‌ కళాశాలల నిర్మాణాలు పూర్తయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే కుట్రతో చంద్రబాబు నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాడని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టితే రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఆనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు.

    చంద్రబాబు సూపర్‌ మోసాలు

    ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలియజేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పథకాలకు పేర్లు మార్చి ప్రజలను మభ్యపెట్టడం తప్ప, చంద్రబాబు మార్క్‌ ఉన్న పథకం ఒక్కటైనా అమలు చేశారానని ప్రశ్నించారు. చంద్రబాబు ఉచిత బస్సు పథకం ద్వారా జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు చేయూతనివ్వకుండా మొక్కబడిగా వ్యవహరించడంతో ఆటో డ్రైవర్లు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతులకు అవసరమైన యూరియా పంపిణీలోనూ ఆంక్షలు విధిస్తూ, యూరియా కార్డులు పంపిణీ చేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వమని మండిపడ్డారు. సర్వేపల్లి ప్రజల సమస్యలను సోమిరెడ్డి గాలికి వదిలేసి దోచుకోవడం, దాచుకోవడంపైనే దృష్టి సారించారని ఆరోపించారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు సోమిరెడ్డి వద్దకు వెళితే ప్రజలను తిట్టడం, అసభ్య పదజాలంతో తూలనడటం తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. నిత్యం ఇసుక, గ్రావెల్‌, మట్టి, బూడిద రూపంలో రూ.కొట్లు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కూటమి వైఫల్యాలను ప్రశ్నించిన దళితుల గొంతు కోస్తూ దుర్మార్గపు పాలన కొనసాగించడం గతంలో ఎన్నడూ లేదన్నారు. కాకుటూరులో రూ.కోటి విలువైన శివాలయం భూమి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అమ్మేయడం, వెంకటాచలంలో కోట్ల విలువ చేసే 20 సెంట్ల భూమిని కోట్టేసేందుకు స్కెచ్‌ వేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, దుంపల మన్మదకుమార్‌, గంగాల శంకరయ్య, సతీష్‌, బలరామిరెడ్డి, నితీష్‌ తదితరులు పాల్గొన్నారు.

    యూరియా పంపిణీకి ఆంక్షలు విధించడం సిగ్గుచేటు

    ఉద్యమంలా కోటి సంతకాల

    సేకరణ కార్యక్రమం

    మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

  • నెల్లూరు (వీఆర్సీ సెంటర్‌): విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం సోమవారం ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ డయల్‌ యువర్‌ సీఎండీ నిర్వహించనున్నారు. తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్‌ వినియోగదారులు పాల్గొని విద్యుత్‌ సమస్యలపై నేరుగా సీఎండీతో మాట్లాడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారం చేసుకోవచ్చని సంబంధిత కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమంలో పాల్గొనేందుకు 89777 16661 ఫోన్‌ నంబరుకు కాల్‌ చేయాలని కోరారు.

    రూ.121 కోట్లతో

    అండర్‌పాస్‌ ఆమోదం

    నెల్లూరు సిటీ: నగరంలోని చింతారెడ్డిపాళెం క్రాస్‌ వద్ద జాతీయ రహదారిపై రూ.121 కోట్లతో అండర్‌పాస్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతం మీదుగా నేషనల్‌ హైవేతోపాటు నెల్లూరు నుంచి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యతోపాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయి. అండర్‌ పాస్‌తో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోంది.

    రాష్ట్ర ఉత్తమ ఉర్దూ

    ఉపాధ్యాయినిగా హాజీరా

    ఉదయగిరి: రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయినిగా ఉదయగిరి మండలం మసాయిపేటకు చెందిన షేక్‌ హాజీరా ఎంపిక అయ్యారు. డాక్టర్‌ మౌలనాఅబ్దుల్‌ కలాం అజాద్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ విభాగంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరిస్తోంది. విజయవాడలో మంగళవారం జరిగే జయంతి కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయునున్నారు. ఎంఈఓలు టి.వెంకటేశ్వర్లు, టి.శ్రీనివాసులు, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

    ఐదుగురు

    పేకాటరాయుళ్ల అరెస్ట్‌

    వరికుంటపాడు: మండలంలోని ఇసుకపల్లి పంచాయతీ అన్నపూర్ణ కాలనీలో ఆదివారం సాయంత్రం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. కొంత కాలంగా ఇక్కడ విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉదయగిరి సీఐ వెంకట్రావు నేతృత్వంలో దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి ఎస్సైలు ఆదిలక్ష్మి, ఇంద్రసేనారెడ్డి, ఎం.రఘునాథ్‌తో కలిసి దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయళ్లను అరెస్ట్‌ వారి నుంచి రూ. 4,710 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.

    కోడి పందేలపై..

    విరువూరు పంచాయతీ కోటవర్ధనపల్లి సమీపంలో కోడి పందేలు ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 3 పందెం కోళ్లు, ఐదు సెల్‌ ఫోన్లు, 3 బైక్‌లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    శ్రీవారి దర్శనానికి

    24 గంటలు

    తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 80,560 మంది స్వామి వారిని దర్శించుకోగా 35,195 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

    117వ దఫా రక్తదానం

    నెల్లూరు(అర్బన్‌): రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ కన్వీనర్‌ సీహెచ్‌ అజయ్‌ బాబు ఆదివారం 117వ దఫా రక్తదానం చేశారు. ఎనెల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌కు అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో ఆయన (ఎస్‌డీఏపీ) ప్లేట్‌లెట్స్‌ దానం చేశారు. అజయ్‌బాబు మాట్లాడు తూ రక్తనిధి కేంద్రంలో నిల్వలు తగ్గిపోయాయన్నారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. రెడ్‌క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ చమర్తి జనార్ధన్‌రాజు పాల్గొన్నారు.

  • ● గోతుల్లేని రోడ్లంటూ సర్కారు గప్పాలు

    జిల్లాలో గ్రామీణ రోడ్లలో ప్రయాణం సర్కస్‌ ఫీట్లను తలపిస్తోంది. గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు సంక్రాంతి నాటికి గోతుల్లేని రోడ్లను నిర్మిస్తామంటూ గప్పాలు కొట్టింది. అయితే ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌ రహదారుల్లో రూ.కోట్లు ఖర్చు చేసి గతుకులకు అతుకులు వేసి చేతులు దులుపుకుంది. తూతూ మంత్రంగా గుంతలకు మట్టి పోసి పూడ్చడంతో తిరిగి యథావిధిగా గోతులు ప్రత్యక్షం అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం చేపట్టలేదంటూ టీడీపీతోపాటు పచ్చమీడియా విష ప్రచారం చేసింది. ఆ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన రోడ్లను కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆపేసింది.

  • అరకు చూసొద్దామని..

    రైలెక్కిన 8వ తరగతి విద్యార్థులు

    అనకాపల్లిలో పట్టుకున్న పోలీసులు

    ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

    కందుకూరు: ముగ్గురు విద్యార్థులు అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. పోలీసులు వారిని పట్టుకుని క్షేమంగా ఇంటికి చేర్చారు. ఈ ఘటన కందుకూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం కేసు వివరాలను వెల్లడించారు.

    స్టడీ అవర్‌ పేరుతో..

    కందుకూరు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాలురు పామూరు రోడ్డులోని ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. గత శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్‌కు అని చెప్పి స్కూల్కి వెళ్లారు. స్కూల్‌ యాజమాన్యం కూడా రాత్రి 8:30 గంటల వరకు జరుగుతుందని తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. ముగ్గురిలో ఒకడు మాత్రమే వెళ్లాడు. ఇద్దరు బయటే ఉండిపోయారు. ఇంటర్వెల్‌ సమయంలో స్టడీ అవర్‌లో ఉన్న పిల్లవాడిని ఇద్దరు బయటకు రప్పించారు. అటు నుంచి వెళ్లిపోయారు. విద్యార్థులు కనిపించకపోవడంతో స్కూల్‌ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. వారు ఆందోళన చెంది అర్ధరాత్రి వరకు పట్టణంలోని పలు గ్రౌండ్‌లు, పార్కులు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు.

    రెండు బృందాల ఏర్పాటు

    ఒకేసారి ముగ్గురు విద్యార్థులు అదృశ్యమవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కందుకూరు సీఐ అన్వర్‌బాషా, పట్టణ ఎస్సై శివనాగరాజు ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వెతకడం ప్రారంభించారు. స్కూల్‌ దగ్గర మొదలు పెట్టి పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించారు. చివరికి ముగ్గురూ ఆర్టీసీ బస్టాండ్‌ వైపు వెళ్లినట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే ఏ బస్సు ఎక్కారనేది అర్థం కాని పరిస్థితి. పారిపోయిన ముగ్గురిలో ఒకరి వద్ద సెల్‌ఫోన్‌ ఉన్నట్లు తెలుసుకుని సిగ్నల్‌ ట్రాక్‌ చేయడం మొదలుపెట్టారు.

    రాజమండ్రి రైలు ఎక్కారు

    సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా మొదట ఒంగోలుకు, అక్కడి నుంచి విజయవాడకి వెళ్లినట్లు గుర్తించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే రైలు ఎక్కారు. అక్కడ దిగి విశాఖపట్నం వెళ్లే ట్రెయిన్‌ ఎక్కినట్లు తెలుసుకున్నారు. సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా విశాఖపట్నం వైపు వెళ్లే రైల్లో పిల్లలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అన్ని స్టేషన్ల రైల్వే పోలీసులను సమాచారం అందిచారు. అయితే అదే సమయంలో విశాఖ వైపు దాదాపు 10 రైళ్ల వరకు వెళ్తుండటంతో వీళ్లు ఎందులో ఉన్నారో తెలియలేదు. చివరికి ఒక్కో ట్రైన్‌లో వెతికారు. శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో అనకాపల్లిలో ఆగిన రైల్లో పిల్లలను గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో కందుకూరు పోలీసులు అనకాపల్లి వెళ్లి విద్యార్థులను క్షేమంగా కందుకూరుకు తీసుకొచ్చారు.

    సరదాగా తిరిగొద్దామని..

    పిల్లలతో పోలీసులు మాట్లాడగా దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చారు. సరదాగా తిరిగొద్దామని స్కూల్‌ నుంచి వెళ్లిపోయారు. పారిపోయిన ముగ్గురిలో ఒకడు గతంలో ఓసారి తల్లిదండ్రులతో కలిసి అరకు వెళ్లాడు. దీంతో స్కూల్‌ డుమ్మాకొట్టి ముగ్గురూ అరకు వెళ్లాలనేది ప్లాన్‌గా చెబుతున్నారు. వాస్తవానికి విద్యార్థుల వద్ద కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో చెప్పకుండా ఎందుకెళ్లారని అడిగితే బిక్కమొఖం వేశారు. విద్యార్థులను ఆదివారం డీఎస్పీ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

  • షాపులు మాకొద్దు బాబోయ్‌..

    తెరుచుకోని దుకాణాలు

    నెల్లూరు సిటీ: స్మార్ట్‌ స్ట్రీట్‌ పేరుతో మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కొంతకాలంగా హడావుడి చేశారు. ఇది అద్భుతమైన ప్రాజెక్ట్‌ అంటూ ఊదరగొట్టారు. నెల్లూరును పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని, రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తీరా చూస్తే వ్యాపారాల్లేక దుకాణదారులు లబోదిబోమంటున్నారు.

    టీడీపీ వారికే..

    నెల్లూరు నగరంలోని మైపాడుగేటు సెంటర్‌లో స్మార్ట్‌ స్ట్రీట్‌కు శ్రీకారం చుట్టారు. రూ.కోట్లు ఖర్చు చేసి సుమారు 30 కంటైనర్లలో 120 దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు కట్టబెట్టారు. పనులు జరుగుతున్న సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రావడం.. పరిశీలించడం.. గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. గత నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు వీటిని వర్చువల్‌గా ప్రారంభించారు. అహా.. ఓహో కూటమి ప్రభుత్వం పెద్ద ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిందని సోషల్‌ మీడియాలో పోస్టులు, రీల్స్‌తో డబ్బా కొట్టించారు. నెల్లూరును ఆదర్శంగా తీసుకుని వేర్వేరు ప్రాంతాల్లో స్మార్ట్‌ స్ట్రీట్‌ను ప్రారంభిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అయితే నెలరోజులకే పరిస్థితి తలకిందులైంది.

    నేడిలా..

    టీ కేఫ్‌లు, పండ్లు, నిత్యావసర వస్తువులు, దుస్తుల దుకాణాలు, చిన్నపాటి హోటళ్లు తదితర వాటిని ప్రారంభించారు. అయితే కొద్దిరోజులకే వ్యాపారం జరగకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగా వ్యాపారాల్లోకి దిగడం, అనుభవం లేకపోవడం తదితర కారణాలున్నాయి. కస్టమర్లు రాక అంతంతమాత్రంగా ఉంది. ఈ క్రమంలో రోజూ 30 నుంచి 40 శాతం వరకు దుకాణాలు తెరవడం లేదు. కొందరైతే ఈ షాపులు మాకొద్దని వాపోతున్న పరిస్థితి ఉంది.

    మంత్రి నారాయణ ఆగ్రహం

    స్మార్ట్‌ స్ట్రీట్‌ పేరుతో కంటైనర్లలో

    దుకాణాల ఏర్పాటు

    వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం

    హడావుడి చేసిన మంత్రి నారాయణ

    వ్యాపారాలు లేక లబోదిబోమంటున్న నిర్వాహకులు

    షాపులు తెరవకపోవడంపై మంత్రి ఆగ్రహం

    దుకాణాలు రోజూ తెరవడం లేదనే విషయం మంత్రి నారాయణ దృష్టికి వెళ్లింది. శనివారం ఆయన దుకాణ నిర్వాహకులు, కస్టర్‌ ఇన్‌చార్జిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంత సొంత డబ్బు ఇచ్చి, మెప్మా ద్వారా రుణాలిప్పించి దుకాణాలు అందజేస్తే వాటిని తెరవకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిరోజూ షాపులు తీయని వారితో పార్టీ క్లస్టర్‌ ఇన్‌చార్జిలు మాట్లాడాలని ఆదేశించారు. దుకాణాలను తెరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే ఓ ఉదాహరణగా ప్రారంభిస్తే ఇలా చేస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. పెద్ద ప్రాజెక్ట్‌ అని చెప్పుకొంది అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో టీడీపీ నేతల్లో చర్చనీయాంశమైంది.

  • బ్లేజ

    నెల్లూరు(పొగతోట): నెల్లూరు కేంద్రంగా ఏఐ ప్లాట్‌ఫాం బ్లేజ్‌అప్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టెర్రాలాజిక్‌ సీఈఓ రెనిల్‌ కోమిట్ల మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి నగరంలో సాఫ్ట్‌వేర్‌ రంగానికి ఇది పెద్ద మలుపన్నారు. ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానికంగా ఉండే యువతలో ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహిస్తుందన్నారు. బ్లేజ్‌అప్‌ సాధారణ ఐఏ కాదన్నారు. ఇది వ్యాపారం కోసం ఇంటెలిజెంట్‌ పార్టనర్‌ అన్నారు. అమెరికాలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం బ్రిజన్‌ హోల్టర్‌ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. బ్లేజ్‌అప్‌ అనేది యూనిఫైడ్‌, ఇంటెలిజెంట్‌ ఏజెంట్‌కు సొల్యూషన్‌ అన్నారు. హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించడం జరిగిందని తెలిపారు. రాబోవు 4, 5 సంవత్సరాల్లో వందల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.

    ఆరు కేజీల

    గంజాయి స్వాధీనం

    నెల్లూరు(క్రైమ్‌): పలాస నుంచి గంజాయిని తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు లాడ్జీలు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా సంతపేట ఇన్‌స్పెక్టర్‌ వైవీ సోమయ్య తన సిబ్బందితో కలిసి నెల్లూరు బృందావనంలోని రాజేష్‌ లాడ్జీలో తనిఖీ చేస్తున్నారు. ఓ గదిలో అనుమానాస్పదంగా ఉన్న నగరానికి చెందిన జగదీష్‌ కుమార్‌, మునిరాజేష్‌, శ్యామ్‌సుందర్‌, సంతోష్‌, అభిషేక్‌, సాయిని అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగ్‌లో ఆరు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి విచారించగా పలాసలో కేజీ రూ.5 వేలకు కొనుగోలు చేసి నెల్లూరు నగరంలో రూ.20 వేల చొప్పున విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో వారిని అరెస్ట్‌ చేశామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

    అనారోగ్యంతో బాధపడుతూ..

    వృద్ధురాలి ఆత్మహత్య

    ఆత్మకూరు: తీవ్ర మోకాళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హజరత్తమ్మ (65) అనే వృద్దురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలంలోని జంగాలపల్లిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన హజరత్తమ్మ గతంలో వ్యవసాయ కూలీ పనికి వెళ్లేది. కొంతకాలంగా తీవ్ర మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. నొప్పులు భరించలేక శనివారం ఇంటి వద్దనే ఉన్న గడ్డి మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని వారు గమనించి చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ

    ఆత్మకూరురూరల్‌: ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీతో ఓ ప్రయాణికుడికి పర్సు అందింది. ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో వివరాలను ఆదివారం అధికారులు తెలిపారు. డిపోకు చెందిన ఏపీ 39 టీజీ 1978 నంబర్‌ బస్సులో నెల్లూరులో ఎక్కిన ప్రయాణికులు కడప వైపు వెళ్లే నిమిత్తం నెల్లూరుపాళెం సెంటర్‌లో దిగారు. బస్సు డిపో చేరిన వెంటనే డ్యూటీలో ఉన్న కండక్టర్‌ జయరామిరెడ్డి అందులో దొరికిన పర్సును కంట్రోల్‌ పాయింట్‌లో డ్యూటీలో ఉన్న ఎన్‌ఎస్‌ రెడ్డికి అందజేశాడు. పర్సులో రూ.3,464 నగదు ఉంది. సంబంధిత వ్యక్తి వచ్చి టికెట్లు తదితర ఆధారాలు చూపడంతో ఆన్‌డ్యూటీలో ఉన్న ఏడీసీ సమక్షంలో పర్సు, నగదు అందజేశారు. కండక్టర్‌ నిజాయితీని డిపో అధికారులు, సిబ్బంది అభినందించారు.

Nagarkurnool

  • కొండె

    ఏది కొనాలన్నా..

    కిలో రూ.80 పైగా ధర

    అదే దారిలో ఆకుకూరలు

    వారంలోనే అమాంతం పెరుగుదల

    ధరలు బాగా పెరిగాయి..

    వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గతవారం వరకు రూ. 300 తీసుకొని మార్కెట్‌కు వెళ్తే వారానికి సరిపడా కూరగాయల వచ్చేవి. ఆ డబ్బులతో ప్రస్తుతం రెండు, మూడు కిలోలు కూడా రావడం లేదు. గతంలో కిలోకు తగ్గకుండా కొనేదాన్ని. ప్రస్తుతం పావుకిలో, అర్ధకిలోతో సరిపెట్టుకుంటున్నాం. – అరుణ,

    గృహిణి, ఈశ్వర్‌కాలనీ, నాగర్‌కర్నూల్‌

    పెద్దగా గిరాకీ లేదు..

    ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిగుబడి తగ్గింది. దాని వల్ల కూరగాయల ధరలు పెరిగాయి. గతంలో రోజుకు రూ. 2వేల వరకు అమ్మేవాడిని. ప్రస్తుం రూ.వెయ్యి కూడా రావడం లేదు. ప్రజలు పావుకిలో, అర్ధకిలో తీసుకెళ్తున్నారు. ధరలు పెరగడం వల్ల పెద్దగా గిరాకీలు లేవు. – రాములు,

    కూరగాయల వ్యాపారి, నాగర్‌కర్నూల్‌

    కూరగాయలు సెప్టెంబర్‌ నవంబర్‌

    టమాటా 20 30–40

    పచ్చిమిర్చి 70 80

    బెండకాయ 60 100

    కాకరకాయ 70 100

    బీన్స్‌ 80 120

    క్యారెట్‌ 60 120

    బీట్‌రూట్‌ 50 100

    క్యాబేజీ 60 100

    క్యాప్సికం 70 120

    గోకరికాయ 60 100

    వంకాయ 50 100

    దొండకాయ 60 100

    కందనూలు: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, దిగుబడి లేకపోవడం.. అధిక వర్షాల ప్రభావంతో వారం, పది రోజుల వ్యవధిలోనే ధరలు అధికమయ్యాయి. మార్కెట్‌లో ఏది కొనాలన్నా కిలో రూ. 80 పైగా ధర పలుకుతోంది. ధరలు అమాంతం పెరగడంతో పావుకిలో, అర్ధకిలోతో సరిపెట్టుకుంటున్నారు. వారం రోజుల క్రితం రూ. 300కు వచ్చిన సరుకులు.. ఇప్పుడు రూ. 600 పట్టుకెళ్లినా సంచి నిండటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్లలో కూరగాయల ధరలు చూసి జనం బేజారవుతున్నారు.

    దిగుమతి చేసుకోవాల్సిందే..

    జిల్లాలో చాలా వరకు కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తుంటారు. అందులో టమాటా, కాకరకాయ, బీరకాయ, చిక్కుడు, దోసకాయ, క్యారెట్‌, క్యాబేజీ, ఆలుగడ్డ, బీన్స్‌ ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిందే. టమాటా ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె, కర్నూలు నుంచి ఎక్కువగా దిగుమతి చేస్తున్నారు. క్యాప్సికం, బీన్స్‌, బెంగళూరు నుంచి వస్తుంటాయి, కాలీప్లవర్‌, క్యాబేజీ, బీట్‌రూట్‌, కీరా హైదరాబాద్‌, షాద్‌నగర్‌, శంషాబాద్‌ మార్కెట్ల నుంచి తెస్తుంటారు.

    ఆకుకూరలు సైతం..

    కూరగాయల ధరలు అధికమని భావిస్తున్న తరుణంలో ఆకుకూరల ధరలు కూడా అమాంతం పెరిగాయి. పాలకూర, మెంతంకూర, గోంగూర, తోటకూర, చుక్కకూరల రేట్లు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

    దిగుబడి లేక..

    జిల్లాలో కూరగాయల సాగు నామమాత్రంగానే ఉంటుంది. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు అధికమై ధరల పెరుగుతున్నాయని అమ్మకందారులు చెబుతున్నారు.

  • వలంటీర్లను తీసుకుంటాం..

    ఈసారి పులులు, ఇతర జంతువుల గణన పకడ్బందీగా కొనసాగుతుంది. గతంలో అరకొర సిబ్బందితో చేపట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అటవీ సిబ్బంది 150 మందితోపాటు సమర్థవంతంగా పనిచేసే 50 మంది వాచర్లు ఉన్నారు. అలాగే వలంటీర్ల కోసం ఆన్‌లైన్‌లో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అటవీ, పులులపై అవగాహన కలిగిన అర్హులు, పనితీరు మెరుగ్గా ఉన్న యువతను వలంటీర్లుగా తీసుకుంటాం.

    – రోహిత్‌ గోపిడి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్‌

  • కార్మ

    తెలకపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి కార్మికుడు ఉద్యమబాట పట్టాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం తెలకపల్లిలో నిర్వహించిన సీఐటీయూ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కార్మికుల పని గంటలు, ఉద్యోగ భద్రత కోసం పోరాడేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ నెల 30న సీఐటీయూ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభల్లో కార్మిక ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని.. కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షుడు వర్దం పర్వతాలు, పొదిలి రామయ్య, శంకర్‌ నాయక్‌, శివవర్మ, పసియొద్దీన్‌, దశరథం, పార్వతమ్మ ఉన్నారు.

    సంక్షేమ హాస్టళ్లలో

    సమస్యలు పరిష్కరించాలి

    కందనూలు: సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగారుబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలా హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల తలుపులు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. సంబంధిత అధికారులు హాస్టళ్లను పరిశీలించి.. సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదే విధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రసాద్‌, రమేశ్‌, శివ, బాబు, శ్రీకాంత్‌, మల్లేష్‌, జీవన్‌ పాల్గొన్నారు.

    నేడు అప్రెంటీస్‌షిప్‌ మేళా

    వనపర్తి రూరల్‌: మండలంలోని రాజపేట శివారులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమ వారం అప్రెంటీస్‌షిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రమేష్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని.. నిజ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.

    సర్వీస్‌ ఉపాధ్యాయులకు ‘టెట్‌’ పెట్టొద్దు

    మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా చూస్తామని టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీపీఆర్టీయూ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెట్‌ అనేది కేవలం ఉపాధ్యాయులకు ఒక అర్హత పరీక్ష అని, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వెంటనే టెట్‌ అర్హత సాధించాలని రాష్ట్రం కూడా చెప్పడంతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. పరీక్ష అవసరం లేకుండా ఉండాలంటే ఆర్టీఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అందుకోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జీఓ 317లో భాగంగా వేరే జిల్లాలకు వెళ్లిన స్కూల్‌ అసిస్టెంట్‌లు సొంత జిల్లాలకు వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించి.. 40 వేల పోస్టులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, పండిట్‌, పీఈటీలను కూడా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌, నాయకులు శ్యాంబాబు, భూపతిసింగ్‌ పాల్గొన్నారు.

  • అదిగో.. పులి
    అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం

    అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్‌ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు.

    జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ

    ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం

    స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

    ఈ నెల 22తోముగియనున్న స్వీకరణ గడువు

  • సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యం

    కందనూలు: సమాజాన్ని ఏకం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమని ముఖ్యవక్త, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో పథ సంచలన్‌ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కలిగించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సమాజంలో ధర్మపరిరక్షణ కోసం హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు. కుల ప్రస్తావన లేకుండా సామాజిక సమరసతతో సమాజం ఏకం కావాలన్నారు. హిందూ సమాజం గొప్పదనం చాటడంతో పాటు వసుదైక కుటుంబ వ్యవస్థ, సనాతన ధర్మాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

    ఆకట్టుకున్న పథ సంచలన్‌..

    స్వయం సేవకులు జిల్లా కేంద్రంలో చేపట్టిన పథ సంచలన్‌ ఆకట్టుకుంది. స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని వేంకటేశ్వర ఆలయం నుంచి ఒక గ్రూపు, పాత బజారులోని ఈదమ్మ గుడి నుంచి రెండో గ్రూపు పట్టణంలోని పురవీధుల గుండా బయలుదేరి.. నల్లవెల్లి రోడ్డులో కలుసుకున్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా, ప్రధాన రహదారి మీదుగా బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకున్నారు. పథ సంచలన్‌లో పాల్గొన్న స్వయం సేవకులపై స్థానికులు పూలవర్షం కురిపించారు. కార్యక్రమంలో విభాగ్‌ సంఘచాలక్‌ వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సంఘచాలక్‌ నారాయణ, విభాగ్‌ కార్యవాహ పత్తికొండ రాము, జిల్లా సహ కార్యనిర్వవాహ నాగయ్య, నగర కార్యవాహ వేముల సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • క్రీడల్లో సత్తా చాటాలి : డీవైఎస్‌ఓ

    కల్వకుర్తి రూరల్‌: ప్రభుత్వం క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోందని.. తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని డీవైఎస్‌ఓ సీతారాం నాయక్‌ అన్నారు. ఆదివారం కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో కబడ్డీ జిల్లా జూనియర్‌, సీనియర్‌ జట్ల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి ఆసక్తిగల క్రీడలో ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. కబడ్డీ జిల్లా జూనియర్‌, సీనియర్‌ జట్ల ఎంపిక పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను డిసెంబర్‌ 5 నుంచి 8వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి యాదయ్య, రమేశ్‌, భాస్కర్‌, జంగయ్యగౌడ్‌, శ్రీనివాసులు, మోహన్‌, డాక్య, రామన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

  • అడవిని నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

    కొల్లాపూర్‌: మండలంలోని ఎల్లూరు సమీపంలో అడవిని నరికి గుట్టలను చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ్మ డిమాండ్‌ చేశారు. ఎల్లూరు శివారులోని సర్వేనంబర్‌ 359, 360, 364, 365లో గల 45 ఎకరాల భూమిని సురభి రాజవంశ వారసుడు ఆదిత్య లక్ష్మారావు, ఆయన సోదరి హైదరాబాద్‌కు చెందిన వారికి కొన్ని నెలల క్రితం విక్రయించారు. ఈ భూమి స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి కూడా అడవిగానే ఉండేది. ఈ భూమిని ఇటీవలే కొందరు కొనుగోలు చేసి చెట్లన్నీ నరికేశారు. గుట్టలను చదునుచేసి.. లోయలను పూడ్చివేస్తున్నారు. దీనిపై స్థానిక రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో సీపీఐ బృందం ఆ భూమిని పరిశీలించింది. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాల్‌నర్సింహతో పాటు జిల్లా కార్యదర్శి ఫయాజ్‌ విలేకర్లతో మాట్లాడారు. 1995 వరకు సర్కారీ ఇనాంగా రికార్డుల్లో నమోదైన భూమి.. ఆ తర్వాతి కాలంలో సురభి రాజవంశస్థుల పేరిట పట్టా భూమిగా ఎలా మారిందో అధికారులు చెప్పాలన్నారు. ఫారెస్టు, వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ అడవిని నరికేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. సామాన్యులు ఎక్కడైనా కొన్ని చెట్లు నరికితే కేసులు పెట్టే అటవీ అధికారులు.. కొల్లాపూర్‌కు అతి సమీపంలోని అడవిని నరికేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని వారు కోరారు. రాజ కుటుంబీకులకు సీలింగ్‌ యాక్టును వర్తింపజేయాలన్నారు. సదరు భూమిని తిరిగి ఫారెస్టుకు అప్పగించాలని.. లేదంటే పేదలకు పంచాలని వారు కోరారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఏసయ్య, ఇందిరమ్మ, తుమ్మల శివుడు, వెంకటయ్య, ఆనంద్‌, ప్రకాశ్‌, కురుమయ్య ఉన్నారు.

  • ప్రణాళికాబద్ధంగా తరగతులు నిర్వహించండి

    కందనూలు: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్‌ స్కూళ్లలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ తరగతులను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ జాయింట్‌ డైరెక్టర్‌ సోమిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కొనసాగుతున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల నమోదు, హాజరు వివరాలను పరిశీలించారు. రెండో శనివారం, ఆదివారం నిర్వహించే తరగతులకు విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా కృషి చేయాలని ఓపెన్‌ స్కూల్‌ సెంటర్‌ కోఆర్డినేటర్లకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యాపీఠం జారీ చేసే సర్టిఫికెట్లతో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందేందుకు అర్హత ఉంటుందన్నారు. జిల్లాలో 18 ఓపెన్‌ స్కూల్‌ సెంటర్లు కొనసాగుతున్నాయని.. 2025–26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతిలో 403 మంది, ఇంటర్మీడియట్‌లో 996 మంది అడ్మిషన్లు పొందినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్షలు రాసే అవకాశం ఉందన్నారు. మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇదొక సువర్ణావకాశమని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ శివప్రసాద్‌, నిర్వాహకులు రవిప్రకాశ్‌, తిరుపతయ్య, అహ్మద్‌, యాదగిరి, బాలరాజు ఉన్నారు.

Business

  • జనగామ: బంగారం ధరలకు రెక్కలొచ్చినా, మహిళలు అలంకరణలో తగ్గడం లేదు. ధరలు ఆకాశాన్ని తాకినా అందం మీద మక్కువ మాత్రం తీరడం లేదు. గోల్డ్‌కు ప్రత్యామ్నాయంగా వన్‌ గ్రామ్‌ ఆభరణాలతో ఆడపడుచులు తమ అందాన్ని మరింత చిగురింపజేసుకుంటున్నారు. చవక ధరలో చక్కని మెరుపు, బంగారానికే పోటీగా మెరిసే డిజైన్లు ప్రతీ మహిళ మెడలో కొత్త కాంతి నింపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.లక్షా 27 వేలు దాటింది. దీంతో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు ఆభరణాలు కొనడం కలగా∙మారింది.

    పెళ్లిళ్లు, పుట్టినరోజులు, శుభకార్యాలు ఎన్ని ఉన్నా బంగారం ధరలు అలంకారాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే, అందం మీద మక్కువ మాత్రం తగ్గలేదు. అలా బంగారం స్థానాన్ని వన్‌గ్రామ్‌  ఆభరణాలు ఆక్రమిస్తున్నాయి. కొన్నేళ్లుగా కొంత మేరకే∙ఆదరణ పొందిన ఈ వన్‌గ్రామ్‌ ఆభరణాలు ఇప్పుడు పూర్తిగా మార్కెట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఎనిమిది నెలల్లో అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.  బంగారం ధరల పెరుగుదలతో పాటు చోరీల భయం కూడా ప్రజలను వన్‌గ్రామ్‌ వైపు మళ్లిస్తోంది. మహిళలు తమ బంగారు నగలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుని, బయటకు వెళ్లేటప్పుడు వన్‌గ్రామ్‌ ఆభరణాలతో మెరిసిపోతున్నారు.

    బంగారానికి పోటీగా మెరిసేవ  గ్రామ్‌ ..
    కంపెనీలు కూడా ఈ ధోరణిని అందిపుచ్చుకుని ఫ్యాషన్‌ డిజైన్లలో కొత్తదనం చూపుతున్నాయి. వజ్రాల్లాంటి రాళ్లు, ముత్యాలు, రంగు రాళ్లతో అద్భుతంగా మెరిసే డిజైన్లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. బంగారం లాంటి ఫినిషింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఆభరణాలు అసలు బంగారం కంటే ఎక్కువ మెరుస్తూ, చూసే వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

    వ్యాపారం రూ. లక్షల నుంచి కోట్ల దాకా..  
    గతంలో కేవలం చిన్న షాపుల్లో మాత్రమే అమ్ముడయ్యే వన్‌గ్రామ్‌ ఆభరణాలు ఇప్పుడు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా విస్తరించింది. ఆన్‌లైన్‌ మార్కెట్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, బ్యూటీ పార్లర్లు, గృహిణిలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వామ్యులవుతున్నారు. జనగామ జిల్లాలో ప్రతీ నెల వ్యాపారం రూ. కోటికి పైగా ఉంటుందని అంచనా. రూ. 1,000 నుంచి రూ.1,500, రూ. 2,500, ఇలా రూ.20 వేలకు పైగా ధరల్లో  లభించే ఈ ఆభరణాలు ఇప్పుడు ప్రతీ మహిళను ఆకర్షిస్తున్నాయి. వివాహాలు, పండుగలు, పార్టీలు, సెలబ్రేషన్లలో వన్‌గ్రామ్‌ ఆభరణాలు తళుక్కుమంటున్నాయి. బంగారంలా కనిపించే, అందరికీ అందుబాటులో ఉండే వన్‌గ్రామ్‌ ఆభరణాలు ప్రస్తుతం ఫ్యాషన్‌ సింబల్‌గా మారాయి. విద్యార్థినుల నుంచి ఉద్యోగిణుల వరకు, గ్రామీణుల నుంచి పట్టణ మహిళల వరకు అందరి మెడలో, చేతుల్లో ఈ నగలు మెరిసిపోతున్నాయి. తక్కువ ధర.. ఎక్కువ ఆకర్షణ.. ఈ రెండు అంశాలే వన్‌గ్రామ్‌ ఆభరణాల విజయ రహస్యం. మార్కెట్‌ అంచనాల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఈ వ్యాపారం మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

    వ్యాపారం పెరిగింది
    గతేడాదితో పోలిస్తే ఈ సారి వన్‌గ్రామ్‌ ఆభరణాల వ్యాపారం  పెరిగింది. ప్రస్తుతం ఒక్కో కుటుంబం నాలుగు నుంచి ఐదు రకాల ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. నెలవారీ వ్యాపారం బాగానే ఉంటోంది. హోల్‌సేల్‌గా ప్రతీ నెల ఆర్డర్‌పై తెప్పిస్తాం.
    ఉత్తమ్, వ్యాపారి, జనగామ

    మహిళలు మక్కువ చూపుతున్నారు 
    ప్రస్తుతం వన్‌ గ్రామ్‌ ఆభరణాలకు క్రేజ్‌ ఉంది. బంగారం రూ.లక్షా 30వేలకు పైగా ఉండడంతో చాలా మంది మహిళలు వన్‌ గ్రామ్‌ ఆభరణాలపై మక్కువ చూపుతున్నారు. బంగారం చేయించుకుంటే ఎక్కువ ఖర్చుతో పాటు దొంగల భయం ఉంది. అందుకే వన్‌ గ్రామ్‌ ఆభరణాలు చేయించుకున్నాం. శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఈ ఆభరణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
    శానబోయిన కల్యాణి, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌

    వన్‌ గ్రామ్‌ ఆభరణం బెటర్‌
    రోజురోజుకూ బంగారం ధర పెరుగుతూ మాలాంటి సామాన్య కుటుంబాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోతోంది. బంగారం ధర పెరగడంతో ఇటీవల చోరీలు, దాడులు జరుగుతున్నాయి. దీంతో బంగారం బదులు వన్‌ గ్రామ్‌ ఆభరణాలు ఉత్తమమని కొనుగోలు చేయాలనుకుంటున్నా. నిరుపేద, సామాన్య కుటుంబాలు బంగారానికి ప్రత్యామ్నాయంగా వన్‌ గ్రామ్‌ ఆభరణాలు కొనుగోలు చేయడం మంచిది.
    మేకల సునీత, రామన్నగూడెం,కొడకండ్ల 

Orissa

  • గుప్‌
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
    భువనేశ్వర్‌లో త్వరలో ప్రత్యేక

    భువనేశ్వర్‌: గుప్‌ చుప్‌ (పాణీ పూరి) నోరూరించే ప్రముఖ చిరు తిండి. పట్టణ, నగర ప్రాంతాలలో ఎక్కడికక్కడ జన సంచార వీధుల్లో సైకిలు, తోపుడు బండ్లపై విక్రయిస్తారు. ఆబాల గోపాలం గుమిగూడి గుప్‌ చుప్‌ కోసం ఎగబాకుతారు. ఇటీవల గుప్‌ చుప్‌ వివాహాది శుభ కార్యాలయాల్లో తొలి నోరూరించే పదార్థంగా అతిథుల్ని ఆకట్టుకుంటుంది. క్రమంగా గుప్‌ చుప్‌కు ఆదరణ పెరగడంతో ఇంటికి వచ్చిపోయే అతిథులకు అందజేసి రుచికరంగా ఆకట్టుకుంటున్నారు. వీధుల్లో రోడ్డు పక్కన ఈ అమ్మకాలను క్రమబద్ధీకరించేందుకు స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ నడుం బిగించింది. ప్రసిద్ధ వీధి చిరుతిండిని (గుప్‌ చుప్‌) ఆస్వాదించడానికి అనుకూలమైన, పరిశుభ్రమైన స్థలం కేటాయిస్తుంది. అనధికార తాత్కాలిక అమ్మకపు కేంద్రాలు ట్రాఫిక్‌ రద్దీని ప్రేరేపిస్తున్నాయి. ఈ సమస్య నివారణకు ప్రయోగాత్మకంగా గుప్‌ చుప్‌ అంగడి సముదాయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నగర మేయర్‌ సులోచన దాస్‌ తెలిపారు. దీని కోసం నగర పాలక సంస్థ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎదురుగా బహిరంగ స్థలం గుర్తించింది. మేయర్‌ సులోచనా దాస్‌ ఆ స్థలాన్ని పరిశీలించి ప్రతిపాదిత ప్రణాళికను సమీక్షించారు. సాహిద్‌ నగర్‌ స్క్వేర్‌, నిక్కో పార్క్‌ మధ్య పనిచేస్తున్న అన్ని గుప్‌ చుప్‌ విక్రేతలను గుర్తించి కొత్త వెండింగ్‌ జోన్‌ కిందకు తీసుకు వస్తారు. ప్రతి విక్రేతకు ప్రత్యేకంగా రూపొందించిన ట్రాలీని ఉచితంగా అందిస్తారు.

    ఓపెన్‌ వెండింగ్‌ జోన్‌ మోడల్‌ కింద అభివృద్ధి చేసిన ఈ వెండింగ్‌ జోన్‌ 30 నుండి 40 స్టాల్స్‌కు వసతి కల్పించగలదని భావిస్తున్నారు. ఈ ప్రాంగణం అందంగా తీర్చిదిద్ది వినియోగదారుల కోసం పార్కింగ్‌, ఇతర సౌకర్యాల్ని అందుబాటులోకి తేనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రేతలు పనిచేయడానికి అనుమతిస్తారు. సాయంత్రం వేళల్లో తగినంత లైటింగ్‌ ఏర్పాటు చేస్తారు. పరిశుభ్రత పరిరక్షణ ప్రాధాన్యత దృష్ట్యా విక్రేతలు చేతి తొడుగులు ధరించి గుప్‌ చుప్‌ విక్రయిస్తారు. ఈ ప్రాంగణంలో దహీ గుప్‌ చుప్‌, పుదీనా గుప్‌ చుప్‌ వంటి బహుళ రుచులతో గుప్‌ చుప్‌ లభిస్తాయి.

    నోరూరించే గుప్‌ చుప్‌ ఇదే..

  • బురదల

    రక్షించిన అటవీ సిబ్బంది

    భువనేశ్వర్‌: అంగుల్‌ జిల్లా శ్యామసుందర్‌పూర్‌ గ్రామం సమీపంలో ఆహారం కోసం వెతుకుతూ బురదతో నిండిన వరి పొలంలో మగ గున్న ఏనుగు చిక్కుకుంది. 22 ఏనుగుల గుంపు నుంచి ఒంటరై దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఏనుగు పరిస్థితి పట్ల స్థానికులు స్పందించారు. అటవీ శాఖ అంగుల్‌ రేంజ్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. చికిత్స కోసం పురుణాగొడొ సమీపం కులసింఘ జంతు చికిత్స కేంద్రానికి తరలించారు. రాత్రంతా చలిలో గడపడంతో గున్న ఏనుగు బలహీనమైందని అధికారులు తెలిపారు. ఇది సుమారు 15 రోజుల వయస్సు మగ గున్న ఏనుగు అని అంగుల్‌ డీఎఫ్‌వో నితీష్‌ కుమార్‌ తెలిపారు. చికిత్సతో ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు.

    వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

    జయపురం: జయపురం–కొరాపుట్‌ 26వ జాతీయ రహదారి ఘాట్‌ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఘాట్‌ రోడ్డుపై వ్యక్తి పడిఉండటం చూసిన స్థానికులు బరిణిపుట్‌ సర్పంచ్‌ పద్మ నందబాలయ్యకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వగా.. ఆయన జయపురం సదర్‌ పోలీసుస్టేషన్‌ అధికారికి విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కొరాపుట్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని వవ సంరక్షతల గృహంలో ఉంచారు. మృతుని వివరాలు తెలియక పోతే దహన సంస్కారాలు పూర్తిచేస్తామని పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్‌ వెల్లడించారు.

    సాగరతీరంలో గుర్తు తెలియని మృతదేహం

    భువనేశ్వర్‌: పూరీ సముద్ర తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. సముద్రంలో ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు భావిస్తున్నారు. బలిహర్‌చండి సముద్ర ముఖద్వారం వద్ద మృతదేహం బయటపడింది. శరీరంపై గాయాలు ఉండడంతో హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నాయి. బ్రహ్మగిరి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ఎల్‌ఈడీ లైట్లు అందజేత

    పర్లాకిమిడి: నువాపడ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జయడోల్కియా తరఫున గత వారం రోజులుగా పర్లాకిమిడి మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మబంద పంచాయతీలోని కాలనీ వాసులు వీధి లైట్లులేక రాత్రివేల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ విషయం తెలిసి 18 ఎల్‌ఈడీ లైట్లను అక్కడి ప్రజలకు కోడూరు అందజేశారు. నువాపడ అసెంబ్లీ నియోజకవర్గంలో 23 కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

  • కళా ర

    ప్రతిభను కనబరిచేందుకు సరైన వేదిక సురభి

    కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉలక

    రాయగడ: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే కార్యక్రమమే సురభి అని కొరాపుట్‌ లోక్‌సభ ఎంపీ సప్తగిరి ఉలక అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్‌ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిశు మహోత్సవాలను సురభి పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. చదవుతో పాటు విద్యార్థులు కళా రంగాల్లో కూడా రాణించాలని అన్నారు. మన రాష్ట్రం కళలకు పుట్టినిళ్లన్నారు. ఎంతో మంది కళాకారులు తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్ర గౌరవాన్ని పెంపోందించారని అన్నారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లా కూడా కళామతల్లిని ఆరాధించే ఎంతోమంది కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటున్నారని చెప్పారు. అయితే వారికి సరైన వేదిక లేకపోవడంతోనే వారు ఆయా రంగాల్లో రాణించలేకపొతున్నారని అన్నారు. అయితే సురభి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారికి ఆశా దీపాలుగా మారుతుండడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇటువంటి తరహా కార్యక్రమాలను సద్వినియోగపరుచుకొని తమ సత్తాను చాటుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాయగడ ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక మాట్లాడుతూ.. ప్రయత్నం తొనే విజయాన్ని సాధించవచ్చని అన్నారు. ఒటమి మన విజయానికి సోపానాలుగా మార్చుకోవాలని హితవు పలికారు. నవంబర్‌ 14వ తేదీన చిల్డ్రన్స్‌ డే ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య నిర్వహించిన వివిధ పొటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల ద్వారా బహుమతులను అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాహక్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ రమేష్‌ చంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

  • సర్దా

    భువనేశ్వర్‌: గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్‌తా నగర్‌ (కెవాడియా)లోని ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగిన భారత్‌ పర్వ్‌–2025 వేడుకలో ప్రసంగిస్తూ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరి బాబు కంభంపాటి భారత దేశం అంతటా ఉన్న ప్రజలు ఒడిశాను సందర్శించాలని ఆహ్వానించారు. ఒడిశా సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన భూమిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడుతూ భారత్‌ పర్వ్‌ ఏకత్వంలో భిన్నత్వంతో దేశాన్ని ఏకం చేసే వేడుకగా వెలుగొందుతుందన్నారు. ఐక్యత విగ్రహం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు.

    భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఏటా నిర్వహించే వార్షిక జాతీయ ఉత్సవం భారత్‌ పర్వ్‌. ఇది ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌ స్ఫూర్తిని రంగరించుకుంది. ఈ కార్యక్రమం వివిధ రాష్ట్రాల నుంచి ప్రదర్శనలు, వంటకాలు, హస్తకళలు, సంగీతం, నృత్య ప్రదర్శనల ద్వారా భారత దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారత దేశ సంప్రదాయాల ఐక్యత, గొప్పతనాన్ని ఒకే చోట అనుభవించడానికి ఇది ఒక వేదికగా ఆకట్టుకుంటుంది.

    ఒడిశా చరిత్ర, వారసత్వం, ప్రకృతి సౌందర్యం అందంగా కలిసిపోయే రాష్ట్రం అని గవర్నర్‌ అన్నారు. స్వర్ణ త్రిభుజాన్ని ఏర్పరిచే ప్రసిద్ధ భువనేశ్వర్‌, పూరీ, కోణార్క్‌ దేవాలయాలు, చాందీ పూర్‌, గోపాల్‌ పూర్‌ యొక్క ప్రశాంతమైన బీచ్‌లు, సిమిలిపాల్‌, కొరాపుట్‌ పచ్చని అడవులు, సుందరమైన చిలికా సరసు, మయూరభంజ్‌ యొక్క గొప్ప గిరిజన సంస్కృతి గురించి ఆయన మాట్లాడారు. ఒడిశాలో అడుగుడుగున భక్తి, సృజనాత్మకత తారసపడుతుందన్నారు.

    ఈ కార్యక్రమం పురస్కరించుకుని భారత దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ కింద నిలబడటం గర్వకారణమైన క్షణం అని అన్నారు. భారత్‌ పర్వ్‌లో పాల్గొనే ముందు గవర్నర్‌ సర్దార్‌ సరోవర్‌ ఆనకట్టను సందర్శించారు. ఇది భారత దేశం యొక్క దార్శనికత, పురోగతికి చిహ్నంగా గవర్నర్‌ పేర్కొన్నారు. గవర్నర్‌తో ఒడిశా శాసన సభ స్పీకర్‌ సురమా పాఢి, రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం మరియు సంస్కృతి విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్‌ పాల్గొన్నారు.

  • ఘనంగా

    జయపురం: స్థానికంగా ఒక కల్యాణ మండపంలో బ్లాక్‌ స్థాయి మత్స్య, పశుపాలన మేళా–2025 ఆదివారం నిర్వహించారు. బ్లాక్‌ పశు చికిత్సాధికారి డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ నాయిక్‌ అధ్యక్షతన జరిగిన మేళాలో ముఖ్య అతిథిగా జయపురం సబ్‌ కలెక్టర్‌ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యవక్తగా పశుసంపద విభాగ చీఫ్‌, జిల్లా పశు చికిత్సాధికారి డాక్టర్‌ లక్ష్మీధర బెహరా, జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, జిల్లా పరిషత్‌ సభ్యులు తిపతి పట్నాయిక్‌, ఎంపీ ప్రతినిధి కృష్ణ చంద్ర నేపక్‌, ఏబీడీఓ మనోజ్‌ కుమార్‌ నాయిక్‌, ఎస్‌డీబీఓ బిశ్వజిత్‌ రాయ్‌, మత్య్స అధికారి సునీల్‌ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. సబ్‌ కలెక్టర్‌ జ్యోతిని వెలిగించి మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకాల గురించి వివరించారు. నలుగురు ఉత్తమ రైతులు, మరో నలుగురు పాడి రైతులను సత్కరించారు.

  • శ్రమదానంతో రోడ్డు నిర్మాణం

    కురుకుటి గ్రామస్తుల ఆదర్శం

    రాయగడ: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ గ్రామానికి శ్రమ దానంతో రహదారిని నిర్మించుకుని రాకపోకలకు మార్గం సుగమమం చేసుకున్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ సమితి పరిధిలోని సెరిగుమ్మ పంచాయతీ కురుకుటి గ్రామంలో 50 కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో సరైన రోడ్డు లేక అత్యవసర సమయంలో స్థానికులు ఇబ్బందులు పడుతుండేవారు. తమ గ్రామానికి రహదారి నిర్మించండి మహాప్రభో అని రాజకీయ నాయకులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో గ్రామస్తులంతా ఏకమై శ్రమదానానికి పూనుకున్నారు. కాయా కష్టం చేసుకుని జీవనోపాధి పొందే గ్రామస్తులు రెండు రోజులుగా పనులకు వెళ్లకుండా చిన్నాపెద్ద అంతా కలిసి శ్రమదానంతో రహదారిని నిర్మించుకొని ఆదర్శంగా నిలిచారు.

  • చిత్రలేఖనం పోటీలకు అనూహ్య స్పందన

    రాయగడ: స్థానిక స్పందన సాహితీ, సాంసృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. జూనియర్‌ విభాగానికి 86 మంది, సీనియర్‌ విభాగానికి 42 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచే విధంగా సృజనాత్మకమైన చిత్రాలను గీచారు. ప్రముఖ చిత్రకారుడు ఎం.జనార్దన ఆచారి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. విజేతలకు వార్షికోత్సవం రోజున బహుమతులను అందజేయనున్నట్టు సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరి ప్రసాద్‌ తెలిపారు.

  • ● ఈ ఏడాది సెప్టెంబరు 27న శ్రీకాకుళం పెదపాడు హైవేపై రెండు వ్యాన్లతో తరలిస్తున్న పశువులను రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. జలుమూరు మండలం నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదుచేశారు.

    ● ఏప్రిల్‌ 16న కొత్తూరు మండలం బలద సంత నుంచి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను సరుబుజ్జిలి పోలీసులు పట్టుకున్నారు. రెండు వ్యాన్‌లలో తరలిస్తుండగా భజరంగదళ్‌ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదుచేశారు.

    ● మే 25న ఎచ్చెర్ల మండలం నవభారత్‌ జంక్షన్‌ వద్ద రెండు వ్యాన్‌లలో 18 పశువులు పోలీసులకు పట్టుబడ్డాయి. తిలారు సంత నుంచి విజయనగరం జిల్లా అలమండకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదుచేశారు.

    హిరమండలం: జిల్లా నుంచి పశువులు అక్రమంగా తరలిపోతున్నాయి. ప్రధానంగా వారపు సంతలను లక్ష్యంగా చేసుకొని మూగజీవాలను తరలిస్తున్నారు. రైతుల ముసుగులో దళారులు ఈ దందాకు పాల్పడుతున్నారు. వయసుపైబడిన పశువులు, ఎక్కువ ఈతలు అయిపోయిన పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో పశువుల అవసరం తగ్గింది. అందుకే ఖరీఫ్‌, రబీలో అతి ముఖ్యమైన సమయంలో పశువులను వినియోగిస్తున్నారు. ఆ సమయంలో కొనుగోలు చేసి మిగతా సమయాల్లో విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా దళారులు, వ్యాపారులు రంగప్రవేశం చేసి పశువులను తరలించుకుపోతున్నారు.

    వారపు సంతల్లో..

    జిల్లాలో వారపు సంతలు అధికం. అందునా పశువుల క్రయ విక్రయాలు జరిగే సంతలే ఎక్కువ. ఆమదాలవలస మండలంచింతాడ, కోటబొమ్మాళి మండలం తిలారు–నారాయణవలస, లావేరు మండలం బుడుమూరు, బూర్జ మండలం కొల్లివలస, కంచిలి మండలం అంపురం, మఖరాంపురం, ఒడిశాలోని బరంపూర్‌, పర్లాకిమిడి, చీకటిలో వారపు సంతలు ఉన్నాయి. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. కొంతమంది దళారులను ఏర్పాటుచేసుకొని పశువులను సేకరిస్తున్నారు. వాటి రవాణాకు మరికొంతమందితో మాట్లాడుకొని వారి సహకారంతో వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీటిలో కబేళాలకే ఎక్కువగా తరలిపోతున్నాయి. సాగు అవసరాలకు తక్కువగానే ఉంటున్నాయి.

    నేతల చేతుల్లోనే..

    జిల్లాలో వారపు సంతలు ఎక్కువగా రాజకీయ పార్టీల నేతల చేతుల్లో ఉంటున్నాయి. ఒక్కో సంతలో వారానికి కోట్ల రూపాయల పశు క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ప్రధానంగా ఖరీఫ్‌ ప్రారంభానికి ముందు మే, జూన్‌.. సంక్రాంతి, దసరా సమయాల్లో వీటి క్రయ విక్రయాలు అధికం. గత రెండేళ్లలో 2,683కుపైగా పశువులను పట్టుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అంతకు మించి తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలో సంతల నుంచి వారానికి 2 వేల వరకూ పశువులు అక్రమంగా తరలిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసే అధికారం పశుసంవర్థక, రెవెన్యూ, పోలీస్‌, రవాణా శాఖకు ఉన్నప్పటికీ తూతూమంత్రపు చర్యలకు పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో పర్యవేక్షణ లేక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది.

    జాడలేని గోశాలలు..

    పోలీసులతో పాటు ఇతర శాఖల తనిఖీల్లో పట్టుబడుతున్న పశువులను సంరక్షించేందుకు జిల్లాలో గోశాల లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో మెళియాపుట్టి మండలంలో ఓ గోశాల నిర్వహించారు. దాని నిర్వహణపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే గోశాల లేకపోవడం కూడా పశువుల తరలింపునకు అడ్డుకట్ట పడకపోవడానికి కారణమనే వాదన ఉంది. ఎందుకంటే పట్టుకుంటే పశువులను ఎక్కడ సంరక్షించాలన్నది ఒక ప్రశ్న. ఆరేళ్ల కిందట సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో ప్రభుత్వం గోశాల నిర్మాణానికి నిర్ణయించింది. అయినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గోవులను పట్టుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస, గుర్జింగివలస ప్రాంతాల్లో ఉన్న గోశాలలకు తరలించాల్సి వస్తోంది. ఇప్పటికై నా జిల్లాలో ఉన్న వారపు సంతలపై దృష్టి సారించడంతో పాటు గోశాలల ఏర్పాటుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

    తరలింపు

    పశువులను అక్రమంగా తరలిస్తే నేరం. నిబంధనలను అనుసరించి, అన్నిరకాల అనుమతులు తీసుకున్న తర్వాతే పశువులను తరలించాలి. పోలీస్‌ శాఖపరంగా ప్రత్యేకంగా దృష్టిసారించాం. అక్రమంగా తరలిస్తే కేసులు నమోదుచేస్తాం.

    – సీహెచ్‌ ప్రసాద్‌, సీఐ, కొత్తూరు

  • మరదలిపై మాజీ వీఆర్‌ఓ దాడి

    వజ్రపుకొత్తూరు: ఆస్తి తగాదాల నేపథ్యంలో సుంకర జగన్నాథపురం గ్రామానికి చెందిన మాజీ వీఆర్‌ఓ వంకల లోహిదాసు తన మరదలు వంకల దానమ్మపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సుంకర జగన్నాథపురంలో మాజీ వీఆర్‌ఓ వంకల లోహిదాసుడు, అతని తమ్ముడు తవిటినాయుడు (లేటు) భార్య వంకల దానమ్మకు పక్కపక్కనే వారసత్వంగా వచ్చి జీడి తోట ఉంది. ఆస్థి విషయంలో తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తమ భాగంలో ఎందుకు దుక్కి దున్నుతున్నారని దానమ్మ ప్రశ్నించడంతో లోహిదాసు, కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలతో బాధితురాలు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా లోహిదాసు తనకు శ్రీకాకుళంలో బంధువైన టీడీపీకి చెందిన బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తెలుసునని, ఏ కేసు పెట్టుకున్నా తనకు ఏమీ కాదని బెదిరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు దానమ్మ ఫిర్యాదు మేరకు వంకల లోహిదాసు, సరస్వతి, ప్రసాద్‌లపై వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ బి.నిహార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి

    కవిటి : జమేదారుపుట్టుగ గ్రామానికి ఇటుకల లోడుతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ఆదివారం కొజ్జీరియా జంక్షన్‌ సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటనలో కార్తీక్‌దాస్‌ (16) అనే యువకుడు తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. కవిటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం మండలం రత్తకన్న నుంచి కవిటి మండలం జమేదారుపుట్టుగకు ట్రాక్టర్‌తో ఇటుకల లోడును తీసుకువచ్చే ప్రయాణంలో కొజ్జిరీయా జంక్షన్‌ వద్ద ట్రాక్టర్‌ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కార్తీక్‌దాస్‌ ట్రాక్టర్‌ కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రయత్నం చేశారు. అప్పటికే కార్తీక్‌దాస్‌ మృతిచెందాడు. ఎస్‌ఐ వి.రవివర్మ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హింజలిఘాట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కార్తీక్‌దాస్‌ వ్యక్తిగత పని కోసం వచ్చాడా.. ట్రాక్టర్‌పై పనిచేసేందుకు వచ్చాడా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు.