Archive Page | Sakshi
Sakshi News home page

Sri Sathya Sai

  • జవాన్

    గోరంట్ల: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్‌ మురళీనాయక్‌ కుటుంబానికి జనసేన తరఫున రూ.25 లక్షల ఆర్థికసాయం అందిస్తానని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. అధినేత ఆదేశాల మేరకు తిరుపతి ఎమ్మేల్యే అరని శ్రీనివాసరావు, అహుడా చైర్మన్‌ టీసీ వరుణ్‌, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి తదితరులు శనివారం కల్లితండాకు చేరుకుని రూ.25 లక్షల చెక్కును జవాన్‌ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జవాన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. భారత్‌ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు.

    రోడ్డు ప్రమాదంలో

    దంపతులకు తీవ్రగాయాలు

    కనగానపల్లి: రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. రామగిరి మండలం కలికివాండ్లపల్లికి చెందిన వడ్డే ముసలప్ప, ముత్యాలమ్మ దంపతులు శనివారం ధర్మవరానికి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. కనగానపల్లి మండలం దాదులూరు వద్దకు రాగానే వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొంది. బైకులోంచి ఎగిరిపడ్డ ముసలప్ప, ముత్యాలమ్మకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు 108 అంబులెన్సులో అనంతపురంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ముసలప్ప పరిస్థితి విషమంగా ఉంది.

    ద్విచక్రవాహనదారుడి మృతి

    గోరంట్ల: రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు దుర్మరణం చెందాడు. బుగానిపల్లికి చెందిన నంజుండప్ప (55) శనివారం గోరంట్ల నుంచి గుమ్మయ్యగారిపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. ఇదే సమయంలో గుమ్మయ్యగారిపల్లి వైపు నుంచి ప్రకాష్‌ అనే వ్యక్తి వస్తున్నాడు. స్థానిక హిందూపురం – గోరంట్ల ప్రధాన రహదారిపై బజాజ్‌ షోరూమ్‌ సమీపంలోకి రాగానే రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నంజుండప్ప తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాష్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

    బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణం

    అనంతపురం: బీటెక్‌ ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అనంతపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న నాగలింగమయ్య కూతురు సునీత (25) బీటెక్‌ చదువుతోంది. మూడేళ్లుగా సబ్జెక్టులు ఫెయిలవుతూనే ఉంది. తాజా ఫలితాల్లో కూడా పాస్‌ కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఎవరూ లేని సమయంలో బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

    అప్పుల బాధతో మరొకరు..

    కళ్యాణదుర్గం రూరల్‌: అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణదుర్గానికి చెందిన వన్నూరుస్వామి (32) నర్సరీ నిర్వహిస్తూ భార్య, కొడుకు, కూతురును పోషించుకుంటున్నాడు. నర్సరీ నిర్వహణ కోసం రూ.7లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక శనివారం ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. అప్పటికే వన్నూరుస్వామి మృతి చెందాడు.

  • కండక్

    కదిరి అర్బన్‌: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అప్పగించి కండక్టర్‌ నిజాయితీ చాటుకున్నాడు. తుమ్మల జెడ్పీ హైస్కూలులో ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న డి.ఖానమ్‌ శుక్రవారం సాయంత్రం విధులు ముగిశాక కదిరికి వచ్చేందుకు బిల్లూరులో ఆర్టీసీ బస్సు ఎక్కింది. ప్రయాణిస్తున్న సమయంలో ఆమె మెడలోని బంగారు చైన్‌ బస్సులోని పడిపోయింది. ప్రయాణికులందరూ దిగిపోయాక బస్సులో పడి ఉన్న బంగారు చైన్‌ను కండక్టర్‌ సుధీంద్ర గమనించి.. డిపో అధికారులకు సమాచారం అందించారు. ఇంటికి వెళ్లాక టీచర్‌ తన మెడలో చైన్‌ లేకపోవడాన్ని గమనించి.. వెంటనే బస్‌ డిపో వద్దకు వెళ్లి సిబ్బందిని ఆరా తీయగా బస్సులో దొరికిన విషయం తెలిపారు. అనంతరం కండక్టర్‌ను పిలిపించి అందరి సమక్షంలో బాధిత టీచరుకు బంగారు చైనును అప్పగించారు. తన చైను తిరిగి వచ్చినందుకు బాధితురాలు కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

    ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

    గంట వ్యవధిలోనే గుర్తించిన పోలీసులు

    ముదిగుబ్బ: ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి గంటలోనే పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. నాగలగుబ్బ గ్రామానికి చెందిన గొడుగు అమీర్‌ కుమారులు గొడుగు బాబా (6వ తరగతి), గొడుగు జోష్‌ (3వ తరగతి) ముదిగుబ్బలోని రమణ పబ్లిక్‌ స్కూలులో చదువుతున్నారు. వీరు హాస్టల్‌లో ఉంటూ పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. అయితే శనివారం సాయంత్రం స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పిల్లలు ఇద్దరూ కనిపించకుండా పోయారు. అనంతరం పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ముదిగుబ్బ పోలీసులకు తెలియజేశారు. సీఐ శివరాముడు వెంటనే స్పందించి పిల్లల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నాగలగుబ్బ వైపు నడుచుకుంటు వెళ్లుతున్నట్లు తెలుసుకున్న సీఐ సిబ్బందితో వెళ్లి గంట వ్యవధిలోనే వారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

  • ప్రియురాలిని చంపిన ప్రియుడు

    ఆలస్యంగా వెలుగులోకి..

    తలుపుల : ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో ఆమెను కడతేర్చిన ప్రియుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ నరసింహుడు తెలిపిన వివరాల మేరకు... గాండ్లపెంట మండలం సాదులవాండ్లపల్లికి చెందిన ఆంజినేయులు, సరస్వతి (35) దంపతులు. భర్తతో విభేదాలు రావడంతో ఆమె తన ఇద్దరు కుమారులను తీసుకుని ఎనిమిదేళ్ల కిందట తలుపులకు వచ్చేసింది. బలిజపేటలో నివాసముంటూ కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే బేల్దారి సికిందర్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. అయితే ఆమె ఇటీవల మరొకరితో చనువుగా మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న సికిందర్‌ పలుమార్లు గొడవపడ్డాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత చెడింది. ఏప్రిల్‌ 22న పిల్లలు కదిరిలో ఫంక్షన్‌కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన సికిందర్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న సరస్వతితో మరోమారు గొడవపడి.. నైలాన్‌ దారంతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడు. అదే రోజు మధ్యాహ్నం ద్విచక్రవాహనంలో తలుపుల గండి రోడ్డు సమీపంలో గల జమ్ముగడ్డవంక గడ్డ కింద పూడ్చేసి, రాళ్లు పేర్చేశాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సరస్వతి ఇంటికి యథావిధిగా రాకపోకలు సాగించేవాడు. నెలన్నర దాటినా తల్లి జాడ కనిపించకపోవడంతో పెద్దకుమారుడు తలుపుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితునిగా సికిందర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం చెప్పాడు. తానే సరస్వతిని చంపానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శనివారం శవాన్ని వెలికి తీసి.. పంచనామా చేశారు. ఘటనా స్థలాన్ని రూరల్‌ సీఐ నాగేంద్ర పర్యవేక్షించారు.

  • వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య

    కదిరి టౌన్‌/ కనగానపల్లి: వేర్వేరు కారణాలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కదిరి పట్టణంలోని కుటాగుళ్లకు చెందిన రమణ (35) బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసై విపరీతంగా అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. జీవితంపై విరక్తి చెందిన రమణ శనివారం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా పరిస్థితి విషమించడంతో రమణ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    ● రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన రైతు కూలీ వెంకటేష్‌ (54)కు కనగానపల్లి సమీపంలో మారెమ్మ గుడి వద్ద వ్యవసాయ పొలం ఉంది. అయితే అందులో పంటలు సరిగా పండకపోవటంతో కుటుంబ సభ్యులంతా కూలి పనులు చేసుకొంటూ జీవించేవారు. ఈ సందర్భంలో అతనికి అనారోగ్య సమస్యలు రావటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భరించలేకపోయిన వెంకటేష్‌ తన పొలంలోనే నేరేడుచెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. ఇతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

Rangareddy

  • మామిడ

    కొత్తూరు: మామిడి పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌ చేగూరు కూడలి జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌ జిల్లా నుంచి మామిడిపండ్ల లోడ్‌తో ఢిల్లీ వెళ్తున్న లారీ చేగూరు కూడలి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా తిమ్మాపూర్‌ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్లే రోడ్డులో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లారీ బోల్తా పడగానే పలువురు వాహనదారులు, ప్రజలు మామిడి పండ్లను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్‌ సాయంతో లారీను తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఈ ప్రమాదంపై ఏలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నర్సింహ్మారావు తెలిపారు.

    పెంజర్ల కూడలిలో..

    షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ లారీ పెంజర్ల కూడలి సమీపంలో అదుపు తప్పి, బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నర్సింహ్మారావు తెలిపారు.

    డ్రైవర్‌కు గాయాలు

    నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

  • పేదలకు ఫీజులో రాయితీ కల్పించాలి

    తుక్కుగూడ: విద్యార్థులు ఇష్టపడి చదువుకుని ఉన్నతంగా రాణించాలని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మెదక్‌ ఎంపీ ఎం.రఘునందన్‌రావుతో కలిసి మున్సిపల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్లోక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ గుత్తా మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా విద్యాసంస్థలు విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను ప్రారంభిస్తుందన్నారు. యాజమాన్యాలు సేవా దృక్పథంతో పాఠశాలలు నడిపించాలన్నారు. పేదలకు ఫీజులో రాయితీ కల్పించి కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించాలని సూచించారు. అనంతరం ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి పెంచొద్దన్నారు. వారికి ఇష్టమైన రంగం, అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌ గుప్తా, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌, నాయకులు అందెల శ్రీరాములు యాదవ్‌, దేప భాస్కర్‌రెడ్డి, ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, శ్లోక విద్యా సంస్థల చైర్మన్‌ బిట్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ చింతల సంగమేశ్వర్‌గుప్తా, డైరెక్టర్‌ తేలుకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

    శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

  • అక్రమ

    షాబాద్‌: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని షాబాద్‌ తహసీల్దార్‌ ఎండీ అన్వర్‌ హెచ్చరించారు. మండల పరిధిలోని హైతాబాద్‌ గ్రామ శివారు సర్వే నంబర్‌ 8లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం ఆయన కూల్చివేయించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ భూమి లో కొంతమంది వ్యాపారాలకు అనుగుణంగా కమర్షియల్‌ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. మండలంలో ఎక్కడైనా ప్రభు త్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కనిపిస్తే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 111 జీవోలో కూ డా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై ఎంపీడీఓ, ఎంపీఓకు సమాచారం అందించామని స్పష్టంచేశారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

    షాబాద్‌ తహసీల్దార్‌ ఎండీ అన్వర్‌

    హైతాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

  • ఇద్దరు బైక్‌ దొంగల అరెస్ట్‌

    శంకర్‌పల్లి: ద్విచక్ర వాహనాలు చోరీ చేసి డూప్లికేట్‌ ఆర్‌సీలతో బైక్‌లు విక్రయిస్తున్న ఇద్దరు దొంగల ఆటకట్టించారు శంకర్‌పల్లి పోలీసులు. వారి వద్ద నుంచి 11 బైక్‌లను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శంకర్‌పల్లి ఠాణాలో నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌, శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ విలేకరులకు వెల్లడించారు. శంకర్‌పల్లితోపాటు పరిసర ప్రాంతాల్లో బైక్‌ దొంగతనాలకు ప్పాడుతూ తప్పించుకు తిరుగుతన్న దొంగలపై పోలీసులు స్పెషల్‌ టీంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు శంకర్‌పల్లి డబుల్‌ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉండే బొగ్గు శ్రీనివాస్‌కు చెందిన మూడు బైక్‌లను తనిఖీ చేశారు. బైక్‌ నంబర్లు, చాయిస్‌ నంబర్లు తేడా ఉండటంతో పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడిందన్నారు. శ్రీనివాస్‌ నాలుగు నెలలుగా మెహదీపట్నం, అత్తాపూర్‌, గుడిమల్కాపూర్‌, నార్సింగి, శంకర్‌పల్లి తదతర ప్రాంతాల్లో మొత్తం 11 బైక్‌లను చోరీ చేసినట్లు తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల బాగోతం బట్టబయలైందన్నారు. చోరీ చేసిన బైక్‌లను పోలిఉండే కంపెనీ, కలర్‌, మాడల్‌ ఇతర బైకుల నెంబర్‌ ప్లేటు, చాయిస్‌ నంబర్లు ఫోటోలు తీసి ఆర్టీఏ వ్యాలెట్‌ ద్వారా డూప్లికెట్‌ ఆర్‌సీనీ తయారు చేసి నకిలీ ఆర్‌సీతో తన స్నేహితుడు నాగరాజు ద్వారా బైక్‌లను అమ్మించి డబ్బులు తీసుకునేవాడనని తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస్‌ను, నాగరాజును రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును ఛేదించిన శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ను, దొంగలను పట్టుకునేందుకు పనిచేసిన టీంను ప్రత్యేకంగా అభినందించారు.

    11 ద్విచక్ర వాహనాల రికవరీ

  • ‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు

    కొత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ మినీ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి రాజ్‌భూపాల్‌గౌడ్‌, అందెబాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్శిస్తుందన్నారు. ఈ ఘటన తర్వాత ప్రపంచంలోనే 4వ ఆర్థిక దేశంగా తయారు కావడం గొప్ప విషయమన్నారు. ఉగ్రవాద చర్యలతో దేశంలో అస్థిరత, ఘర్షణ, ఆర్థికంగా దెబ్బతీయాలని చూసిన పాకిస్తాన్‌కు మనసైన్యం తగిన గుణపాఠం చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు అశోక్‌గౌడ్‌, మాణిక్యం, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు

    పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌

  • బీజాపూర్‌ హైవే పరిశీలన

    ప్రమాదాలకు నిలయంగా మారిందని సీపీఐ నాయకుల మండిపాటు

    చేవెళ్ల: హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కె.రామస్వామి అన్నారు. శనివారం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘ప్రమాదాలకు హైవే’ కథనంపై స్పందించిన సీపీఐ నాయకులు గుంతల రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏళ్లు గడుస్తున్నా పాలకులు రోడ్డు మరమ్మతులపై దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య నిత్యం ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్న అధికారులతో మాట్లాడి బాగు చేయించాలనే సోయి లేకపోవడం బాధాకరమన్నారు. స్థానిక కేజీఆర్‌ గార్డెన్‌ ఎదుట ఏర్పడిన గుంతలు చెరువులను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లేదంటే రహదారి దిగ్భంధం చేస్తామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సీపీఐ నాయకులు ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, సత్తిరెడ్డి, మక్బుల్‌, మంజుల, లలిత, పెంటయ్య, యాదగిరి, తదితరులు ఉన్నారు.

  • గంజాయి విక్రేతకు రిమాండ్‌

    నందిగామ: కార్మికులకు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన శనివారం నందిగామ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం బాక్సుర్‌ జిల్లాకు చెందిన రవీందర్‌ పాశ్వాన్‌ కొంతకాలం క్రితం నందిగామకు వలస వచ్చి స్థానిక పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన సొంతూరునుంచి గంజాయి తీసుకువచ్చి స్థానికంగా ఉంటున్న కార్మికులకు విక్రయిస్తూ అక్రమ సంపాదనకు అలవాటుపడ్డాడు. ఉదయం పారిశ్రామిక వాడ సమీపంలోని చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఆయన వద్ద 500 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. దీంతో నిందుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

  • అంగన్

    షాద్‌నగర్‌: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించేందుకు అంగన్‌వాడీ టీచర్లు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

    సులువైన బోధన

    అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసి చిన్నారుల ప్రవేశాలను పెంచేందుకు ఐసీడీఎస్‌ (సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. బడిబాట కార్యక్రమం పూర్తైన తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో బడికి రాకుండా మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి వారిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించనున్నారు. వారికి అక్షరాలు, అంకెలు, పాటలతో కూడిన విద్యను భోదించనున్నారు.

    కార్యక్రమాలు ఇలా

    అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు, సమావేశాలు, సామూహిక కార్యక్రమాలు, స్వచ్ఛ అంగన్‌వాడీ, పెరటి తోటల పెంపకంతో పాటుగా సామూహిక అక్షరాభాస్యాలు వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

    ప్రీ ప్రైమరీ విద్యపై

    అవగాహన కార్యక్రమాలు

    ప్రవేశాలు పెంచేందుకు స్పెషల్‌ ఫోకస్‌

    17 వరకు ‘అమ్మమాట–అంగన్‌వాడీబాట’

    సేవల పై ప్రచారం

    గ్రామాల్లో, పట్టణాల్లో మూడేళ్లు పైబడిన చిన్నారులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్తగా పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పిస్తున్నారు. ఐదేళ్లు దాటిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

    భాగస్వాములు కావాలి

    అంగన్‌వాడీల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు రోజుకు ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తున్నాం. కార్పొరేట్‌కు దీటుగా చిన్నారుల వయసుకు తగిన విధంగా సులువైన పద్దతుల్లో బోధిస్తున్నాం. ఇందులో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి.

    – షబానా బేగం, సీడీపీఓ, షాద్‌నగర్‌

    జిల్లాలో 7 ప్రాజెక్టులు

    షాద్‌నగర్‌, ఆమన్‌గల్లు, మహేశ్వరం, శేరిలింగంపల్లి, హయత్‌నగర్‌, చేవేళ్ల, ఇబ్రహీంపట్నంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 1,600 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పెద్దవి 1,380, చిన్నవి 220 ఉన్నాయి. ఇందులో సుమారు 1.30లక్షల మంది చిన్నారులకు విద్యతో పాటు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుంది.

  • ● తండ్రి కష్టాలు చూస్తూ పెరిగాం

    యాలాల: ఒక వైపు పేదరికం.. మరోవైపు కుటుంబ భారం.. అయినా బెదరకుండా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తండ్రి. నాన్న పడిన కష్టానికి ప్రతిఫలంగా నేడు ఆయన పిల్లలు ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నారు. యాలాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ, భారతి దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కూతురు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, పాల బూత్‌ను నిర్వహిస్తూ పిల్లలను చదివించారు. నేడు నలుగురూ ఉన్నత స్థాయిలో నిలిచారు. పెద్ద కొడుకు కేశవ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా, శివ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, కమల్‌ హాసన్‌ పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈగా, విజయ్‌ రతన్‌ కొండాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రి కంటి విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. నాన్న పడ్డ కష్టానికి ప్రతిఫలమే తాము అని నలుగురు కుమారులు పేర్కొన్నారు.

  • ● ఆయన కష్టమే ఈ జీవితం

    దుద్యాల్‌: మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య –మాసనమ్మ దంపతులకు కొద్దిపాటి భూమి ఉంది. దీన్ని సాగు చేసుకుంటూ మరోవైపు వీఆర్‌ఏ ఉద్యోగం చేస్తూ ముగ్గురు కుమారులను బాగా చదివించారు. ప్రస్తుతం వారు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు తిరుపతి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. రెండో కుమారుడు గోపాల్‌ విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా బొంరాస్‌పేట్‌ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కొడుకు శ్రీనివాస్‌ అబ్కారీ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. నాన్న కష్టమే ఈ రోజు తాము ఉన్నతమైన జీవనం సాగిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు.

  • అక్రమ

    ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

    8లోu

    షాద్‌నగర్‌: వేలు పట్టి నడిపించాడు... అక్షర ప్రపంచాన్ని పరిచయం చేశాడు.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అండగా నిలిచాడు.. తాను ప్రస్తుతం లేకపోయినా నా నీడగా ఉంటూ నన్ను గెలిపించాడు.. అంటూ తన తండ్రి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు సివిల్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఐఆర్‌ఎస్‌ సాధించిన కొర్రావత్‌ శశికాంత్‌. తన తండ్రి ప్రస్తుతం భౌతికంగా లేకున్నా తన హృదయంలో తనకు జీవితాన్ని, భవితవ్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుంటాడని చెబుతున్నాడు ఈ ఐఆర్‌ఎస్‌ అధికారి.

    సొంతూరిని విడిచి..

    మాది మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పరిధిలోని చాకలిదాని తండా. తల్లిదండ్రులు రాములు నాయక్‌, సీతమ్మలకు రెండవ సంతానం. తనకు అన్న నీలిమ, తమ్ముడు శ్రీకాంత్‌ ఉన్నారు. ఉన్నత చదువుల కోసం షాద్‌నగర్‌కు తీసుకొచ్చాడు. హాస్టల్‌లో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తూ చదివించాడు. తమను భవిష్యత్‌లో ఉన్నత స్థానంలో చూడాలన్నది ఆకాంక్ష. అందుకు ఆయన ఎంతో శ్రమించారు.

    అపుడే నిర్ణయం తీసుకున్నా

    నాన్న ప్రతి రోజు నా వెంట పాఠశాలకు వచ్చేవారు. చదువుల్లో రాణించి మంచి మార్కులు సాధించాలని చెప్పేవారు. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే ఉపాధ్యాయులను అడగాలని సూచించేవారు. ఎంతో గారాబంగా పెంచారు. 8వ తరగతి వరకు షాద్‌నగర్‌లో పూర్తి చేసిన తర్వాత 9,10 వట్టెం నవోదయలో చేర్పించాడు. అప్పుడే నేను సివిల్స్‌ వైపు దృష్టి సారించాను. నాన్న ఆశయాలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాను. అనంతరం ఇంటర్‌ హైదరాబాద్‌ వికాస్‌లో, బీటెక్‌ విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పూర్తి చేశా.

    న్యూస్‌రీల్‌

    నాన్న నడిపించాడు..

    నన్ను గెలిపించాడు

    గెలుపు చూడకుండానే విడిచి వెళ్లిపోయాడు

    తనను ఉన్నత స్థానంలో నిలిపేందుకు నాన్న అన్నివిధాలా ప్రోత్సహించారు. 2008 బీటెక్‌ చదువుతుండగా ఆయన అకాల మరణం కలిచివేసింది. నాన్న లేరనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మ ప్రోత్సాహంతో సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఇండియన్‌ రైల్వే సర్వీస్‌లో ఉద్యోగం సాధించా. నేను సాధించిన లక్ష్యాన్ని నాన్న చూసి ఉంటే ఎంతో సంతోష పడేవాడు.

  • దరఖాస

    హుడాకాంప్లెక్స్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని బాలుర, బాలికల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పో స్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు జోన్‌–6 జోనల్‌ అధికారిణి నిర్మల శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న చైతన్యపురి మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1570 సమీపంలోని సరూర్‌నగర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో రిజిస్ట్రేషన్‌, డెమో ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్‌, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత సబ్జెక్టుల్లో డెమో నిర్వహించనున్నట్లు వివరించారు. ఇంగ్లిష్‌, హిందీ, గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయోసైన్స్‌, సాంఘికశాస్త్రం, లైబ్రేరియన్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ కళాశాలకు సంబంధించి గణితం, బోటని, జువాలజీ, ఫిజక్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులకు రిజిస్ట్రేషన్‌, డెమోలో ఉంటాయని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

    క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్స్‌

    4వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు హకీంపేట్‌– కరీంనగర్‌, ఆదిలాబాద్‌లలో 2025–26 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశానికి బాలబాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ మొబైల్‌ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు ఎంఈఓను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 23న సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ ఎంపిక ఉంటుందన్నారు. 2016.9.1 నుంచి 31.8.2017 మధ్య జన్మించిన విద్యార్థులు జనన, కుల ధ్రువీకరణ, ఆధార్‌, ప్రోగెస్‌ కార్డు, కొత్త బోనాఫైడ్‌ సర్టిఫికెట్‌, పాస్‌ఫొటోలతో హాజరవ్వాలన్నారు. విద్యార్థుల ఎత్తు, బరువు పరిగణనలోకి తీసుకుని 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌జంప్‌, 800 మీటర్ల రన్‌, షటిల్‌ రన్‌, మెడిసిన్‌ బాల్‌త్రో, వర్టికల్‌ జంప్‌, ప్లెక్సిబిలిటీ టెస్టులు నిర్వహించనున్నామని, ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

    కార్పొరేషన్‌ అభివృద్ధికి నిధులు కేటాయించండి

    సీఎంను కోరిన మాజీ మేయర్‌ దంపతులు

    బడంగ్‌పేట్‌: కార్పొరేషన్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చూడాలని మాజీ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వారి వెంట ఏఐసీసీ విచార్‌ విభాగ్‌ కోఆర్డినేటర్‌ బోయపల్లి రాఘవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

    మాలలు ఐక్యంగా పోరాడాలి

    మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్‌

    షాద్‌నగర్‌రూరల్‌: రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకునేందుకు మాలలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్‌ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పల్లెపల్లెకు మాలల చైతన్యయాత్ర కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాలలపై వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. రోజురోజుకు మాలలపై దాడులు పెరిగిపోతున్నాయని.. విషప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మౌనంగా ఉంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సమస్యల పరిష్కారంకోసం మాలలంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడాలన్నారు. గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసుకొని సంఘాన్ని బలోపేతం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మహేశ్‌, నర్సింలు, శేఖర్‌, అశోక్‌, జగన్‌ పాల్గొన్నారు.

  • కేసుల
    సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిలు దశరథరామయ్య, శ్యాంకుమార్‌

    చేవెళ్ల: రాజీమార్గం ద్వారా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిలు దశరథరామయ్య, జె.శ్యాంకుమార్‌, రిటైర్డ్‌ జడ్జి కె.లక్ష్మణ్‌ అన్నారు. శనివారం చేవెళ్ల కోర్టు ఆవరణలో మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షణికావేశంలో గొడవలు, ఘర్షణల కారణంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. భార్యాభర్తల కేసులు, కుటుంబ తగాదాలు, భూ సంబంధిత విషయాలను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని చెప్పారు.

    1,271 కేసులకు రూ.16.62లక్షల జరిమానాలు

    చేవెళ్ల కోర్టు ఆవరణలో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన లోక్‌ అదాలత్‌లలో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించామన్నారు. ఆరు రోజుల్లో 1,271 కేసులు పరిష్కరించగా రూ.16,62,690 జరిమానా విధించామన్నారు. ట్రాఫిక్‌ విభాగానికి సంబంధించి 766 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. సివిల్‌, క్రిమినల్‌, పిట్టి కేసులకు పరిష్కారం చూపామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సూపరింటెండెంట్‌లు ఈ.మహిపాల్‌, బి.కృష్ణవేణి, లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ కె.కుమార్‌. సీఐ భూపాల్‌శ్రీధర్‌, ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ చందర్‌నాయక్‌, అడ్వకేట్స్‌ బి.కృష్ణ గౌడ్‌, బి.మల్లేశ్‌గౌడ్‌, నర్సింలు, ఉపేందర్‌, శేఖర్‌, సిబ్బంది అనిల్‌కుమార్‌, నర్సింలు, ఆనంద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

    152 కేసులకు పరిష్కారం

    ఆమనగల్లు: పట్టణంలోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో 152 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్‌ స్వరూప కాటం మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌లో ఇరువర్గాలు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలన్నారు. కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీపడి పరిష్కరించుకుంటే ఇరువర్గాలు గెలిచినట్లేనన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ కార్తీక్‌, సీఐ జానకీరాంరెడ్డి, గంగాధార్‌, వేణుగోపాల్‌, ఎకై ్సజ్‌ సీఐ బద్యానాథ్‌ చౌహాన్‌, ఎస్‌ఐలు వెంకటేశ్‌, శ్రీకాంత్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యాదీలాల్‌, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    ట్రాఫిక్‌ పోలీస్‌ కేసులు

    డ్రంకెన్‌ డ్రైవ్‌ 544 రూ.10,76,500

    లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ 222 రూ.2,96,500

  • ● ‘సెవెన్‌ స్టార్‌’ బిచ్చన్న

    కొడంగల్‌ రూరల్‌: పట్టణానికి చెందిన బిచ్చన్న – విజయలక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. దర్జీ వృత్తి చేస్తూ పిల్లలను చదివించారు. ఆ కాలంలో ఏడుగురిని చదివించడమంటే ఆషామాషీ కాదు.. కానీ బిచ్చన్న బెదరలేదు.. పేదరికాన్ని జయించి కొడుకులను ఉన్నత స్థానంలో నిలిపారు. మొదటి కుమారుడు సత్యకుమార్‌ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ, ఐఐసీటీ.., సౌత్‌ఆఫ్రికాలో పోస్టు డాక్‌ చేశారు. ప్రస్తుతం మస్కట్‌ దేశంలో యూనివర్సిటీ ఆఫ్‌ నిజ్వాలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ రీసర్చ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ ఐఐటీ బాంబే, ఎంఎస్‌సీ గణితం పూర్తి చేసి ప్రస్తుతం మస్కట్‌ దేశంలో హలీ బ్యాంకులో పని చేస్తున్నారు. మూడో కుమారుడు రవికుమార్‌ దౌల్తాబాద్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నాల్గో కుమారుడు అనిల్‌కుమార్‌ మద్రాస్‌ ఐఐటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రస్తుతం కెనడియన్‌ కంపెనీలో రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వాటర్‌ టెక్నాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఐదో కుమారుడు శివకుమార్‌ ఎంబీఏ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఓ ప్రముఖ నగల దుకాణంలో సీనియర్‌ హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. ఆరో కుమారుడు మనోజ్‌కుమార్‌ ఐఐఐటీ పూర్తి చేసి ఫీడెక్స్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా రాణిస్తున్నారు. ఏడో కుమారుడు నవీన్‌కుమార్‌ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ పూర్తి చేసి అపెక్స్‌ కోవంటెజ్‌ ఎల్‌ఎల్‌సా, యూఎస్‌ కంపెనీలో డాటా ప్రోగ్రామర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో బిచ్చన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • ● తల్

    కుల్కచర్ల: అదో మారుమూల గ్రామం.. అందులో ఒక నిరుపేద రైతు కుటుంబం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో నాన్నే సర్వంగా మారి తనను ఉన్నత స్థానంలో నిలిపాడు.. ఆయనే నాకు స్ఫూర్తి అని కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్‌ పేర్కొన్నారు. కొందుర్గు మండలం కాస్లాబాద్‌కు చెందిన వన్నెగూడ సత్యయ్యకు ఒక కుమారుడు. భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది.. కొడుకు రమేష్‌ను బాగా చదివించి ఉన్నత స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అందుకోసం ఎంతో శ్రమించారు. తండ్రి శ్రమను గుర్తించిన రమేష్‌ అంతే పట్టుదలతో చదివి ఎస్‌ఐ ఉద్యోగం సాధించారు. తన ఎదుగుదలకు నాన్నే కారణమని, ఆయన స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెప్పారు. రమేష్‌ ప్రస్తుతం కుల్కచర్ల ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. నాన్న చూపిన మార్గంలోనే ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

  • నాన్నే.. మా హీరో

    ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం నాన్న.. తాను కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిషలు కష్టపడే శ్రామికుడు నాన్న.. జీవన ప్రయాణంలో తన స్వార్థం కోసం చూసుకోకుండా.. బిడ్డలను ఒడ్డున చేర్చేందుకు పరితపించే నావికుడు నాన్న.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే తపనతో.. చివరి శ్వాస వరకూ రక్తమాంసాలను కరిగించే యోధుడు నాన్న.. ఎన్ని జన్మలైనా.. ఎంత సేవ చేసినా తీర్చుకోలేని రుణం నాన్న.. అందుకే నాన్నా.. మీరే మా హీరో. ఆదివారం జాతీయ పితృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..

Rajanna

  • పేదల డాక్టర్‌..

    ముస్తాబాద్‌కు చెందిన డాక్టర్‌ చింతోజు శంకర్‌ 1971–72లో పదో తరగతి ఇక్కడే చదివారు. తన తండ్రి డాక్టర్‌ చింతోజు బ్రహ్మం, సోదరుడు చింతోజు రాజారాం స్ఫూర్తిగా కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌, ఉస్మానియాలో గైనకాలజీ కోర్సు చదివారు. 1982లోనే ముస్తాబాద్‌లో పీపుల్స్‌ హాస్పిటల్‌ స్థాపించారు. వేలాది మందికి చికిత్స అందించారు. ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీల్లో శంకర్‌ అందెవేసిన చేయి అని అందరూ అంటుంటారు. లక్షకు పైగా ఆపరేషన్లు చేసిన ఘనత డాక్టర్‌ శంకర్‌ సొంతం. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ 50 ఏళ్లుగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇటీవల రూ.2లక్షలు వెచ్చించి తాను చదువుకున్న పాఠశాలలో కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయించారు.

  • పోలీస్‌ సంఘం అధ్యక్షుడు

    ముస్తాబాద్‌ పాఠశాలలో చది విన చీకోడుకు చెందిన కరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి డీఎస్పీ స్థాయికి ఎదిగారు. చీకోడు నుంచి ముస్తాబాద్‌ స్కూల్‌కు రోజూ నడిచి వచ్చి చదువుకున్న శ్రీని వాస్‌రెడ్డి పోలీస్‌శాఖలో ఉమ్మడి రాష్ట్ర పోలీస్‌ అధి కారుల సంఘం అధ్యక్షుడిగా, ప్రస్తుతం తెలంగాణ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. టీజీఎస్‌పీలో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా వెల్ఫేర్‌ లైజన్‌ ఆఫీసర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తన పుట్టిన ఊరు చీకోడులో అనేక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

  • నాన్న

    గోదావరిఖని: నాన్న పోత్సాహంతో ఐఎఫ్‌ఎస్‌లో 40వ ర్యాంకు సాఽ దించాను. సొంతంగా సివిల్‌కు ప్రిపేరై రెండో ప్రయత్నంలో విజ యం సాధించా. ఐఎఫ్‌ఎస్‌ సాధించడంలో సింగరేణిలో ఈపీ ఫిట్టర్‌గా పనిచేస్తున్న మా నాన్న నర్సింహారెడ్డి పోత్సాహం ఎంతగానో ఉంది. గ్రూప్‌–2లో డీఎస్పీ ఉద్యోగం లభించగా, ఐఎఫ్‌ఎస్‌ వైపే మొగ్గు చూపుతున్నా. – ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థి అవినాశ్‌రెడ్డి, గోదావరిఖని

    తండ్రి హమాలీ.. కొడుకు జడ్జి

    జగిత్యాల: ఇంటిపెద్ద హమాలీగా పనిచేస్తూ కొడుకును ఉన్నతస్థానాల్లో నిలబెట్టి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల మండలం హస్నాబాద్‌ గ్రామానికి చెందిన కనకయ్య–యాదవ్వ దంపతులది పేద కుటుంబం. అదే గ్రామంలో అద్దెకుంటూ కనకయ్య జగిత్యాలలో హమాలీగా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె భవాని పెళ్లి కాగా, భార్గవి ప్రైవేటు టీచర్‌. తండ్రి కూలీ పని చేసుకుంటూ నరేశ్‌ను హైదరాబాద్‌లో చదివించాడు. నరేశ్‌ పట్టుదలతో చదివి ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. కుమారుని చదువు కోసం కనుకయ్య హమాలీ పనిచేస్తూ రాత్రనక పగలనక కష్టపడి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాడు. తండ్రి తన కోసం ఎంతో కష్టపడి తనను ఈ స్థానంలో నిలబెట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని నరేశ్‌ పేర్కొన్నారు.

  • ఆలనా.
    మా తాత బంగారం

    నాన్న.. ఒక ధైర్యం.. ఆరాధించే దైవం.. అమ్మ మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే.. నాన్న ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాడు. చిన్నతనంలో బుడిబుడి అడుగులు ఎలా వేయాలో నేర్పిస్తాడు. యుక్తవయసులో తప్పటడుగులు వేయకుండా సలహాలిస్తాడు. పిల్లలు స్థిరపడేందుకు జీవితకాలం కష్టపడే తండ్రి పిల్లల విజయాన్ని తన విజయంగా గర్వపడతాడు. పిల్లల జీవితాల్లో వెలుగునిచ్చేందుకు కొవ్వొత్తిలా కరిగిపోతాడు నాన్న.. ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చాలా మంది తండ్రులు తమ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరేందుకు కష్టపడ్డారు. తాము పేదింట్లో పుట్టినా.. పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకుని చదివించి, కొలువు కొట్టేలా చేశారు మరికొందరు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తూ.. నాన్న అని పిలిపించుకుంటున్నారు మరికొందరు.. నేడు ఫాదర్స్‌డే సందర్భంగా ఆదర్శ తండ్రులపై సండే స్పెషల్‌.

    అమెరికాలోని జార్జియాలో

    స్థిరపడిన జగదీశ్‌, సతీశ్‌ దంపతులు

    పిల్లలకు స్నానం చేయిస్తున్న

    వీరస్వామి

    జమ్మికుంట(హుజూరాబాద్‌): తల్లిదండ్రుల అకాలమరణంతో అనాథలైన పిల్ల లను అక్కున చేర్చుకొని చేరదీసి ఆదరిస్తున్నారు జమ్మికుంట మున్సిపల్‌ పరిధి కొత్తపల్లికి చెందిన ఆదర్శ దంపతులు గోపరాజు వీరస్వామి, శోభారాణి. వీరస్వామి చదువుకునే రోజుల్లో విప్లవ పార్టీలో పని చేశారు. తర్వాత వీరస్వామి, శోభారాణి ఆదర్శ వివాహం చేసుకున్నారు. అనాథ, నిరుపేద పిల్లలకు ఆశ్రయం కల్పించి, సేవ చేయాలనే సంకల్పంతో 2008లో ఏడుగురు పిల్లలతో స్పందన అనాథ బాలబాలికల సేవా సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆశ్రమంలో 25 మంది అనాథ, నిరుపేద పిల్లలు ఉంటున్నారు. వారికి భోజనం, విద్య, వైద్యం, వసతి కల్పిస్తున్నారు. దాతలు చేయూత అందిస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, వారు జీవితంలో స్థిరపడేలా సేవలు అందిస్తూ సేవ దృక్పథాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఆశ్రమం నిర్వహిస్తుండగా, ప్రభుత్వం స్థలం ఇస్తే స్థిర నివాసం ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు అన్నీతామై, అమ్మానాన్న లోటు లేకుండా సేవ చేస్తామని నిర్వాహకులు వేడుకుంటున్నారు.

    ధర్మపురి: కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు కొడుకును దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించి అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకే యజమాని కావడం మా తాత చేసిన పుణ్యమే అంటున్నారు మనువలు. ధర్మపురికి చెందిన తన్నీరు నారాయణ తాపీమేసీ్త్ర. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు కొడుకు జగదీశ్‌ను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించాడు. జగదీశ్‌తో పాటు చిన్న మనువడు సతీశ్‌ను ప్రయోజకులను చేశా డు. కూతురు బిడ్డలే తన బిడ్డలుగా భావించి ఇద్దరు మనుమలను ఎంసీఏ వరకు చది వించాడు. తాత చదివించిన ఉన్నత చదువులతో జగదీశ్‌ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి అధిపతి అయ్యాడు. సతీశ్‌ కూడా జార్జియాలో టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తూ నెలకు రూ.4 లక్షల వరకు సంపాదిస్తున్నారు. తమ తాత మృతిచెందినా ఆయన కృషి వల్లే ఉన్నతస్థాయికి ఎదిగామని పేర్కొన్నారు ఇద్దరు మనువలు.

    అనాథలకు అన్నీ తామై..

    – వివరాలు 8లోu

  • రాజన్

    సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గోశాలలో సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలను శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. 40 పోస్టులకు 250 మంది దరఖాస్తు చేసుకోగా 200 మంది హాజరయ్యారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్‌, జిల్లా అధికారులు కలిసి అభ్యర్థులకు నిర్వహించారు. అర్హత కలిగిన 40 మందిని ఎంపికచేసి వారికి నియామకపత్రాలు అందజేస్తామని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రకటించారు.

    రక్తదానం ప్రాణదానంతో సమానం

    సిరిసిల్ల: రక్తదానం ప్రాణదానంతో సమానమని, మనం ఇచ్చే రక్తం వేరొకరి ప్రాణాలను కాపాడుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌.రజిత పేర్కొన్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ రక్తదానంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, పెద్ద పేగు క్యాన్సర్లు, సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ అనిత, డాక్టర్‌ అభినయ్‌, డాక్టర్‌ నయిమా జహా పాల్గొన్నారు.

    మెడికల్‌ కాలేజీలో..

    సిరిసిల్ల మెడికల్‌ కాలేజీలోనూ రక్తదాతల దినో త్సవం నిర్వహించారు. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.లక్ష్మీనారాయణ రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ఆ యన మాట్లాడుతూ రక్తం మానవ శరీరంలోనే ఉత్పత్తి అవుతుందని ఏ ఫ్యాక్టరీలోనూ రక్తం లభించదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు రక్తదానం చేయాలని సూచించారు. జిల్లా జనరల్‌ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ ఎం.లక్ష్మీనారాయణ, మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.అరుణ్‌, బి.స్వాతి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

    ఉద్యమ పాఠ్యాంశం తొలగింపు దుర్మార్గం

    సిరిసిల్లటౌన్‌: పాఠ్యపుస్తకాల్లో నుంచి తెలంగాణ ఉద్యమ పాఠ్యాంశాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ శనివారం సిరిసిల్లలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పదో తరగతి పుస్తకంలో తెలంగాణ ఉద్యమచరిత్ర పాఠ్యాంశాన్ని కాంగ్రెస్‌ సర్కారు తొలగించడం నాలుగున్నర కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. తొలగించిన పాఠ్యాంశాన్ని వెంటనే చేర్చాలని డిమాండ్‌ చేశారు. నాయకులు ఎస్‌.కే.బాబా, మెట్టల సాయి, దీపక్‌, వెంకటరమణ, అశోక్‌, భరత్‌, విజయ్‌ పాల్గొన్నారు.

  • సర్కార్‌ బడి..సేవకుల గుడి
    ● సమాజ సేవలో ముస్తాబాద్‌ హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు ● వైద్యులు..ఉపాధ్యాయులుగా సేవలు ● బడి రుణం తీర్చుకుంటున్న పలువురు

    ముస్తాబాద్‌(సిరిసిల్ల): సర్కార్‌ బడి.. ఈ పదమే నేడు చులకనగా మారింది. కానీ ప్రస్తుతం సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్న వారందరూ అక్కడే అక్షరాలు దిద్దినవారు. ముస్తాబాద్‌ ప్రభుత్వ హైస్కూల్‌లో చదివిన వారెందరో వైద్యులు.. ఉపాధ్యాయులుగా ఎదిగారు. ప్రభుత్వ బడిలో చదివి.. ఎదిగిన వారు తమ పిల్లలను రంగురంగుల భవనాలతో ఆకర్షిస్తున్న ప్రైవేట్‌ స్కూళ్లకు పంపుతూ.. వారు చదువుకున్న సర్కార్‌ బడిని చిన్నచూపు చూస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివి మార్గదర్శకులుగా నిలిచిన వారి విజయాల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముస్తాబాద్‌ సర్కార్‌ బడిలో చదువుకుని నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుంటే మనసు ఉప్పొంగుతుంది. విజేతలను అందించిన ఘనత ముస్తాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలది. ఈ బడికి 75 ఏళ్ల చరిత్ర ఉంది. వైద్యులు చింతోజు శంకర్‌, చింతోజు రాజారాం, రాజకీయ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి, డీఎస్పీ కరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, జేఎన్‌టీయూ రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ తాండ్ర విఠల్‌, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ నర్సింహారెడ్డి, డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పాపాలాల్‌, హైకోర్టు అడ్వకేట్‌ రాజమల్లారెడ్డి, ప్రొఫెసర్‌ ఆనందరెడ్డి, ఆర్డీవో గూడ సురేందర్‌రెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా అధికారి చిన్ని సంజీవ్‌రెడ్డి.. ఇలాంటి వారు ఎందరో ఇక్కడే అక్షరాలు దిద్దారు. వారి స్ఫూర్తిగా ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

  • ఫూలే దంపతుల జీవితం ఆదర్శనీయం
    ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ● ఫూలే దంపతుల విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ

    సిరిసిల్లటౌన్‌: మహాత్మా జ్యోతిబాఫూలే దంపతుల జీవితం అన్ని తరా లకు, వర్గాలకు ఆదర్శనీయమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఫూలే దంపతుల విగ్రహ ప్రతిష్ఠకు శనివారం భూమి పూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే హైదరాబాద్‌ ప్రగతిభవన్‌కు మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టినట్లు తెలిపారు. మహా నుభావులను స్మరించుకోవడం జాతి బాధ్యతగా భావించి సిరిసిల్లలో ఫూలే దంపతుల విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సమాజంలో అసమానతలు తొలగించడంలో ఆ పుణ్యదంపతుల కృషి ఎనలేనిదని కొనియాడారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెల్ముల స్వరూపరెడ్డి, ముదిరాజ్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్‌, బొప్ప దేవయ్య, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, కాముని వనిత, వంకాయల కార్తీక్‌ పాల్గొన్నారు.

  • చిన్న

    సిరిసిల్లకల్చరల్‌: జీవితం చాలా చిన్నది. వీలైనంత ప్రశాంతంగా జీవించాలే తప్ప చిన్న చిన్న తగా దాలు, స్పర్థలకు పోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచించారు. సిరిసిల్లలోని జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్‌ అదాలత్‌లో మాట్లాడారు. పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించాలన్నారు. మెగా లోక్‌ అదాలత్‌లో 12,856 కేసుల్లో కక్షిదారులు రాజీమార్గాన్ని అనుసరించారు. రూ.3,88,50,607 విలువైన కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి. ఫస్ట్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి బి.పుష్పలత, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.లక్ష్మణాచారి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.ప్రవీణ్‌, ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కావేటి సృజన, సెకండ్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గడ్డం మేఘన, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, ప బ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాస్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు ఆడెపు వేణు, చింతోజు భాస్కర్‌ పాల్గొన్నారు.

    సామరస్యంగా మెదలుకోవాలి

    వేములవాడ: చిన్నచిన్న తగాదాలతో కేసులు పెట్టుకోవద్దని, సామరస్యంగా మెదలుకోవాలని వేములవాడ సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి అనిల్‌కుమార్‌ జా దవ్‌ సూచించారు. వేములవాడ కోర్టులో లోక్‌ అదాలత్‌లో మాట్లాడారు. లోక్‌అదాలత్‌ మెంబర్లు తిరుమల్‌గౌడ్‌, అనిల్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుండ రవి పాల్గొన్నారు.

    జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ

    లోక్‌అదాలత్‌లో 12,856 కేసుల పరిష్కారం

  • దశాబ్దాల కల.. ఫలిస్తున్న వేళ
    ● వేములవాడలో 80 ఫీట్ల రోడ్ల విస్తరణ ● 343 మంది నిర్వాసితులకు పరిహారం సిద్ధం ● ఇప్పటికే 50 మందికి చెక్కులు పంపిణీ

    సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయం ఎదుట రోడ్ల విస్తరణకు తొలి అడుగు పడింది. మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు ఉన్న ఇరుకురోడ్డుతో భక్తులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుడి ముందు రోడ్లను 80 ఫీట్ల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. ఈమేరకు షాపులు, ఇళ్లను కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పటికే 40 మందికి శుక్రవారం చెక్కులను పంపిణీ చేయగా.. తాజాగా శనివారం పది మంది నిర్వాసితులకు చెక్కులను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, వేములవాడ ఆర్డీవో, ఆలయ ఇన్‌చార్జి ఈవో రాధాబాయి అందించారు. రోడ్డు విస్తరణతో 343 మంది తమ ఇళ్లను, షాపులను కోల్పోతున్నారు. ప్రజాప్రయోజనాల కోసం భూములు, ఇంటి స్థలాలను ఇస్తున్న నిర్వాసితులకు చెక్కులను అందించడంతో రోడ్డు విస్తరణకు మార్గం సుగమమైంది. పరిహారం తీసుకోకుండా కోర్టుకు వెళ్లే వారి సొమ్మును కోర్టులో డిపాజిట్‌ చేసే అవకాశం ఉంది. నిర్వాసితులు పరిహారం చెక్కులు తీసుకోవడంతో రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇక పనులు చకచక సాగనున్నాయి.

Telangana

  • సనత్‌నగర్‌(హైదరాబాద్): ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.  ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా అడ్డగిద్దల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజు, కొక్కిణి శ్రావణి (30) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు నడుస్తుండడంతో మానసికంగా కుంగిపోయింది. 

    ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం శ్రావణిని ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్‌మెంట్స్‌లో ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస్, దుర్గాలు తమ వద్దకు తీసుకువచ్చారు. గత ఆరు నెలలుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటూ స్థానికంగా హౌస్‌ కీపింగ్‌ పనులు చేస్తుంది. మూడు రోజుల క్రితం వీరు ఊరిలో ఉన్న అల్లుడు రాజు వద్దకు వెళ్లి తమ కూతురు కాపురం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒప్పించి అతనిని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. 

    అయితే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపం చెందిన శ్రావణి శనివారం ఉదయం 8.30 గంటలకు జనప్రియా అపార్ట్‌మెంట్స్‌ ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Prakasam

  • కార్య

    వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

    అక్రమ కేసుల్లో అరెస్టయిన కార్యకర్తలకు పరామర్శ

    పొదిలి: కూటమి నేతలు అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు వెన్నంటి అండగా ఉంటామని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి భరోసా ఇచ్చారు. పోలీస్‌ స్టేషన్‌లో, వైద్యశాలలో, కోర్టు వద్ద అరెస్ట్‌ అయిన కార్యకర్తలను వారు పరామర్శించారు. అరెస్ట్‌ చేసిన ప్రతి కార్యకర్త వివరాలను, కుటుంబ పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు, భార్యా పిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. అరెస్ట్‌ అయిన కార్యకర్తలకు సంబంధించి గ్రామాల్లో మిగిలిన నాయకులు, కార్యకర్తలు వారి కుటుంబాలకు అండగా ఉండి, ధైర్యం చెప్పాలన్నారు. లీగల్‌ టీమ్‌ సభ్యులతో తాము అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, వారి కేసులు తేలేంత వరకు లీగల్‌ టీం పనిచేస్తుందని చెప్పారు. కార్యకర్తల కుటుంబాలకు కూడా తాము అండగా ఉంటామని చెప్పారు. కార్యకర్తలకు లీగల్‌ టీం ద్వారా న్యాయ సహాయం అందేలా చేస్తామన్నారు. అరెస్ట్‌ అయిన కొందరి వివరాలు తీసుకుని వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఎటువంటి సమస్య వచ్చినా తాము నిత్యం అందుబాటులో ఉంటామని వారు చెప్పారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ అక్రమంగా కేసులు నమోదు చేయటం ద్వారా, జగన్‌మోహన్‌రెడ్డి పోరుబాట కార్యక్రమం సూపర్‌ సక్సెస్‌ కావటంతో ఓర్చుకోలేక పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. చివరికి న్యాయం గెలుస్తుందని అన్నారు. తాము ఎప్పటికప్పుడు చర్చించుకుని ఐక్యంగా కార్యకర్తల కోసం పనిచేస్తామని చెప్పారు. కార్యకర్తలను పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ.రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కొనకనమిట్ల ఎంపీపీ మోరబోయిన మురళి, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, వైస్‌ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, తర్లుపాడు అధ్యక్షుడు మురారి వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు షేక్‌.మస్తాన్‌వలి, శ్రీధర్‌రెడ్డి, శింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.

  • ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

    రెండెకరాలకు పది ఎకరాలుందని చూపి..

    రెండు ఎకరాలున్న ఓ రైతుకు ఆన్‌లైన్‌లో పది ఎకరాలు ఉందని తప్పుగా చూపి వారి పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టారు. కొండపి మండలం కే ఉప్పలపాడు గ్రామానికి చెందిన కొల్లి వీరనారాయణమ్మ, రామకృష్ణారెడ్డి దంపతులకు కుమార్తె గీతికరెడ్డి, కుమారుడు వెంకట దీపక్‌ రామిరెడ్డి ఉన్నారు. గీతిక రెడ్డి స్థానిక జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి, వెంకట దీపక్‌ రామిరెడ్డి పాపారావు హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. సామాన్య మధ్యతరగతి కుటుంబం కావడంతో కుటుంబ పోషణ అంతంత మాత్రమే ఉండడంతో కూలీ నాలి చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా కుమార్తె గీతికా రెడ్డికి అమ్మ ఒడి నిధులు జమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మెట్ట భూమి 10 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉందంటూ అనర్హుల జాబితాలో చేర్చారు. అయితే వారికి తల్లిదండ్రులు ఇచ్చిన రెండు ఎకరాల పొలం తప్పితే ఎటువంటి భూమి లేదు. ఆన్‌లైన్‌లో తప్పుగా వచ్చిందని..అర్హులైన తమకు పథకం అందేలా చూడాలని వారు కోరుతున్నారు.

  • నీట్‌లో జాతీయ స్థాయి ర్యాంక్‌ సాధించిన లాస్యప్రియ

    ఒంగోలు టౌన్‌: నేషనల్‌ ఎలిజిబులిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) యూజీలో ఒంగోలుకు చెందిన లాస్యప్రియ ప్రతిభ చాటింది. మొత్తం 558 మార్కులతో ఆల్‌ ఇండియా స్థాయిలో 9031 ర్యాంక్‌ సాధించింది. లాస్య తండ్రి ములుకుట్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రామ్‌నగర్‌ మున్సిపల్‌ హైస్కూలులో ప్రధానోపాధ్యాయుడిగా చేస్తున్నారు. తల్లి ఉషారాణి కొత్తపట్నం జెడ్పీహెచ్‌ స్కూలులో ఫిజిక్స్‌ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. లాస్య ప్రియ నీట్‌ లో ర్యాంక్‌ సాధించడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలువురు అభినందనలు తెలిపారు.

  • ఇంటి పేరు తప్పు పడినందుకు..

    తల్లి ఇంటి పేరు తప్పుపడినందుకు ఏలూరివారిపాలెం గ్రామంలో ఒకే ఇంటిలో ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం అనర్హత వేటు పడింది. చీమకుర్తికి చెందిన పేరుబోయిన శ్యామ్‌ ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో తన్విక అదే గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి, జాస్మిన్‌ గొట్లగట్టులో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువున్నారు. అయితే శ్యామ్‌ ప్రసాద్‌ భార్య భారతికి ఇంటి పేరు ఆమె తల్లిదండ్రుల రేషన్‌ కార్డులో వడ్లమాను భారతిగా నమోదైంది. ఇటీవల రేషన్‌ కార్డులో నుంచి భారతి పేరును శ్యామ్‌ ప్రసాద్‌ రేషన్‌ కార్డులోకి మార్చుకోవడానికి చర్యలు తీసుకున్నారు. కానీ ఇంకా రేషన్‌ కార్డులో పేరు మారకపోవడంతో ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన తల్లికి వందనం లిస్ట్‌లో శ్యామ్‌ ప్రసాద్‌కు చెందిన ఇద్దరు పిల్లల పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

  • కొందర
    గ్రామాల్లో భయం..భయం

    సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు సిటీ: ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమలు విషయంలో తాత్సారం చేస్తూ వచ్చింది. వీలైనంత మంది విద్యార్థుల సంఖ్యకు కొత పెట్టేందుకు రకరకాల నిబంధనలు తెచ్చింది. అంతేకాదు రూ.15 వేలు జమచేస్తామంటూ చెప్పి రూ.13 వేలు మాత్రమే వారి అకౌంట్లుల్లో జమచేస్తామని చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశ చెందారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడనున్నాయి.

    జిల్లాలో 1.9 లక్షల మందికి కోత..

    జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 2,991 ఉన్నాయి. వీటిల్లో 3,32,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు 42,439 మంది ఉన్నారు. మొత్తంగా సుమారు 3,74,939 మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారు. అయితే ప్రభుత్వం పలు రకాల నిబంధనలు అమలు చేసి 2,65,559 మంది విద్యార్థులను మాత్రమే అర్హులుగా చేర్చింది. 1,68,603 మంది తల్లుల ఖాతాలో రూ.215.23 కోట్లు (రూ.13 వేలు చొప్పున) జమ కానుందని ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. మిగతా వారికి సుమారు 1,09,380 మంది విద్యార్థులను అనర్హులుగా చేర్చింది. దీంతో అనర్హులుగా ఉన్న సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

    సచివాలయాల్లో జాబితాలు చూసి..

    జిల్లాలోని 719 గ్రామ, వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. 597 గ్రామ, 122 వార్డు సచివాలయాల్లో ఉంచిన జాబితాలను చూసి చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. పలు నిబంధనలు పేరుతో అనర్హుల జాబితాల్లో తమ పేర్లు ఉండడంతో వారు నిర్ఘాంత పోతున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే ఇటీవల టెన్త్‌ పరీక్షలు రాసి ఇంటర్లో చేరిన విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరనుంది. పాలిటెక్నిక్‌, ఐటీఐ చదివిన వారు, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిన వారిని అనర్హులుగా ప్రకటించారు. అలాగే తల్లి ఇంటి పేరు మారినా, ఇంట్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్నా.. పది ఎకరాలకు మించి పొలాలు ఉన్నా.. కొందరికి అసలు పొలాలు లేకపోయినా పొలాలు ఉన్నట్టు చూపించి అనర్హులుగా చేర్చారు. 75 కంటే తక్కువ హాజరు శాతం ఉన్నా ఈ పథకాన్ని వర్తింపజేయలేదని తెలిసింది.

    డ్రౌపౌట్స్‌ పేరుతో 35 వేల మందికి మంగళం

    ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సుమారు రూ.45,807 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావడం లేదని జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చారు. అందులో 12,202 మంది తిరిగి పాఠశాలకు వచ్చినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో 33,605 మంది విద్యార్థులు పాఠశాలలకు రావడలేదని చెబుతూ వారిని ఈ పథకానికి అనర్హులుగా తేల్చారు.

    తల్లికి వందనానికి కొర్రీలు జిల్లాలో లక్ష మందికి మొండిచెయ్యి మొత్తం 3,74,939 మంది విద్యార్థులు 2,65,559 మందికే లబ్ధి 1,09,380 మందికి ఎగనామం డ్రౌపౌట్స్‌ పేరుతో 35 వేల మందికి మంగళం సచివాలయాల్లో జాబితాలు చూసి అవాక్కు

    బాబును నమ్మితే భవిష్యత్తు గాలికే

    చంద్రబాబు మాటలు నమ్మితే పిల్లల భవిష్యత్తు గాలిలో కలిసిపోయినట్లే. మాది చిన్న రైతు కుటుంబం. ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది పదో తరగతి చదువుతున్నాడు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం వచ్చింది. కానీ గత ఏడాది ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు. అయినా మా బాబును కూలినాలి చేసి చదివించుకుంటాం. చంద్రబాబును నమ్మి మా అబ్బాయి జీవితం పాడుచేసుకోలేం.

    – ఎగ్గోని లక్ష్మి, చందవరం, దొనకొండ మండలం

    నమ్మించి మోసగించారు

    నాకు ఇద్దరు పిల్లలు. కుందురు హారిక రెడ్డి 8వ తరగతి, కుందురు చందనాథరెడ్డి 7వ తరగతి చదువుతున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ, చిన్నపాటి బడ్డీ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. గతంలో అమ్మ ఒడి వచ్చింది. కానీ ఈసారి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి తల్లికి వందనం ఆపేశారు. పిల్లలు బాగా చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పి మా ఆశలపై నీళ్లు చల్లారు. నమ్మించి మోసగించారు. అప్పులు చేసి చదివించలేము, అమ్మటానికి ఆస్తులు లేవు. ప్రభుత్వం ఎలాగైనా సహకరించాలి.

    – కుందురు నాగదుర్గ, కురిచేడు

Nizamabad

  • యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి

    నిజామాబాద్‌నాగారం: యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి రక్త నిధి కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కావ్య అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని శనివారం జోయ్‌ ఆలుక్కాస్‌ జ్యువెలరీ షోరూం నిజామాబాద్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి రక్తనిధి కేంద్రం సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ కావ్య విచ్చేసి మాట్లాడారు. జోయ్‌ ఆలుక్కాస్‌ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి రక్త నిధి కేంద్రానికి రక్తదానం చేయడం వలన నిరుపేద రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. యువత అపోహలకు తావివ్వకుండా రక్తదానం చేయాలని సూచించారు. సామాజిక స్పహతో సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్‌ మేనేజర్‌ సంజయ్‌, అకౌంట్స్‌ మేనేజర్‌ జితిన్‌, ఫ్లోర్‌ మేనేజర్‌ మణికందన్‌, సిబ్బంది సనూప్‌, పీఆర్‌వో పిప్పెర నరేందర్‌, రక్త నిధి కేంద్రం సిబ్బంది ప్రేమ్‌ చంద్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు .

  • జీపీ కార్మికులకు అందని వేతనాలు

    నందిపేట్‌(ఆర్మూర్‌): మండలంలోని అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదు. మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడం కోసం ప్రభుత్వం ఆయా జీపీల పరిధిలో మల్టీపర్పస్‌ వర్కర్ల పేరున 110 మంది పంచాయతీ కార్మికులను నియమించింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో విశేష కృషి చేస్తున్న కార్మికులకు గత మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబందించి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అరకొర వేతనాలు అవికూడ నెలనెలా రాకపోవడంతో ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికై న అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని పంచాయతీ కార్మికులు కోరుతున్నారు.

    నందిపేటలో 110 మంది..

    ఆర్థిక ఇబ్బందుల్లో కార్మికులు

    నిధులు విడుదల చేయాలని వినతి

  • నర్సయ్య పోరాటస్పూర్తితో బలమైన ఉద్యమాలను నిర్మిద్దాం

    డిచ్‌పల్లి: అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు, అమరుడు కామ్రేడ్‌ నాయక్‌వాడి నర్సయ్య పోరాటస్ఫూర్తితో బలమైన రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దామని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ మండల కార్యదర్శి జేపీ గంగాధర్‌ పేర్కొన్నారు. డిచ్‌పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో కామ్రేడ్‌ నర్సయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేపీ గంగాధర్‌ మాట్లాడుతూ.. నిజాంసాగర్‌ ఆయకట్టు కోసం జరిగిన రైతు ఉద్యమం, సారంగపూర్‌ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభించాలని జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. నర్సయ్య మరణం రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీవైఎల్‌ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్‌, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుప్రియ, ఎన్‌.లక్ష్మి, శాంత, మేకల రాజమణి, పాండు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

  • అనాథ బాలికకు ఆర్థిక సహాయం

    నందిపేట్‌(ఆర్మూర్‌): మండలంలోని బజార్‌కొత్తూర్‌లో త ల్లిదండ్రులను కోల్పోయిన అ నాథ బాలికకు ఆదివాసి నా యక్‌పోడు కులస్తులు ఆర్థిక స హాయం అందించారు. భవాని అనే బాలిక ఏడాది వ్యవధిలోనే తలిదండ్రులను కోల్పోయింది. దీంతో జిల్లా నాయక్‌పోడు కులస్తులు శనివారం గ్రామానికి వచ్చి భవానికి రూ. 90 వేల ఆ ర్థిక సహాయాన్ని, నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందజేశారు. నిజామాబాద్‌లో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ బండారి భోజన్న తన వంతుగా రూ. 50 వేలతో పాటు కులసంఘం సభ్యులు పోగు చేసి రూ.40 వేలు అందజేశారు. ఇందులో నుంచి రూ. 75 వేల భవాని పేరు బ్యాంకులో డిపాజిట్‌ చేసి మిగతా రూ. 15 వేల నగదును నిత్యవసర జీవనోపాధి ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసి నాయకపోడు గౌరవ అధ్యక్షులు బండారి భోజన్న, జిల్లా అద్యక్షులు గాండ్ల రాంచందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోలం గంగాధర్‌, ఉద్యోగుల సేవాసంఘం అధ్యక్షులు కోండ్రు నవీన్‌, పీజీ హెచ్‌ఎం సింగం వనిత, మండల నాయకులు మన్నె సాగర్‌, దుంపల శ్రీనివాస్‌, మేడిపల్లి గౌతం, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • క్రిక

    నిజామాబాద్‌నాగారం : నిజామాబాద్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–19 క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ను శనివారం అర్సపల్లిలో శైలేజా మైదానంలో ప్రారంభమయ్యాయి. కోచ్‌ నయూమ్‌, ఫారస్‌లు టాస్‌ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. మొదటి మ్యాచులో గ్రీన్‌ వర్సెస్‌ ఏల్లో మధ్య జరిగింది. టాస్‌ గెలిచి గ్రీన్‌జట్టు బ్యాటింగ్‌ చేయగా 10 వికెట్లకు గాను 255 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏల్లో జట్టు 150 పరుగులకే అలౌట్‌కావడంతో గ్రీన్‌ జట్టు గెలిచింది. రెండో మ్యాచ్‌లో బ్లాక్‌ వర్సెస్‌ బ్లూ బ్లాక్‌ మధ్య పోటీ జరిగింది. ఇందులో టాస్‌ గెలిచిన బ్లూ బ్లాక్‌జట్టు నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బ్లాక్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 105 పరుగులు చేసి అలౌట్‌కావడంతో బ్లూ బ్లాక్‌జట్టు గెలిచింది.

    ఆలయాల పరిరక్షణ

    మన బాధ్యత

    నిజామాబాద్‌ రూరల్‌: ఆలయాలను పరిరక్షించుకోడం మన బాధ్యత అని జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. శనివారం నగరంలోని కబ్జాకు గురువుతున్న బోధన్‌ రోడ్‌లోని ఆటోనగర్‌ హనుమాన్‌ మందిరాన్ని రక్షించటానికి సహకరించాలని శ్రీ హనుమాన్‌ మందిర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఇందల్వాయి కిషన్‌ గంట్యాల వెంకటేశ్‌, అంబదాస్‌ రావు, మల్లేశ్‌ గౌడ్‌, దోర్నాల రవి, శాతాల లింబాద్రి, మధు తదితరులు అర్బన్‌ బీజేపీ క్యాంపు ఆఫీసులో అర్వింద్‌ కు వినతి పత్రం అందించారు.

    గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు

    నిజామాబాద్‌ అర్బన్‌ : గౌడ అఫీషియల్స్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్‌ గౌడ్‌ ప్రకటనలో తెలిపారు. 2024– 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఆదివారం న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో ఉదయం 10 గంటలకు ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

    దేశవ్యాప్త సమ్మెను

    విజయవంతం చేయాలి

    నిజామాబాద్‌ సిటీ : కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, వాటిని రద్దుచేసేవరకు కార్మికులు ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని నాందేవ్‌వాడలోని పార్టీకార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమ మాట్లాడారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించేందుకు, ప్రాథమిక హక్కులను రక్షించుకొనేందుకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు చేయబోయే సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని కోరారు. జులై 9న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు రమేష్‌ బాబు, శంకర్‌ గౌడ్‌, నూర్జహాన్‌, గంగాధర్‌, నన్నేసావ్‌, శ్రీనివాస్‌, రాజ్‌, విజయ, మోహన్‌, గణేష్‌ , రమేష్‌, గంగాధర్‌, మహేష్‌ , జాదవ్‌, మురళి, రాములు, షేక్‌ అబ్దుల్‌, విమలమ్మ పాల్గొన్నారు.

    వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

    వేల్పూర్‌ : వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామంలోని పీకేటీపీ బీడీ సెంటర్‌లో టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభల వాల్‌పోస్టర్లను నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈనెల 19న సిరికొండ మండల కేంద్రంలో జరిగే నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా మహాసభ , 21,22 తేదీలలో నిజామాబాద్‌లో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి జి.అరవింద్‌, నాయకులు గంగాధర్‌, లింబాద్రి, అన్వర్‌, పద్మ, హేమలత, సాయన్న, రాజేందర్‌, ఆనంద్‌, కావేరి తదితరులు పాల్గొన్నారు.

  • నెరవే

    ధర్పల్లి: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పైలట్‌ గ్రామంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిరుపేద కుటుంబాల సొంతింటి కళను సహకారం చేయాలని సంకల్పంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టింది.

    వేగవంతంగా నిర్మాణ పనులు

    మండలంలోని సీతాయిపేట్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి విడత పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికై న సీతాయిపేట గ్రామానికి 113 ఇళ్లు మంజూరయ్యాయి. 400 నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటిని నిర్మించాలని నిబంధన మేరకు అధికారులు 55 ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఇందులో 32ఇళ్లు బేస్‌ మెంట్‌ వరకు,12 ఇళ్లు రూఫ్‌లెవెల్‌ వరకు , మరో రెండు ఇళ్లుకు స్లాబ్‌ పోయడం పూర్తయింది. 28 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చొప్పున, రూఫ్‌ వరకు గోడలు కట్టిన లబ్ధిదారులకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. ఇళ్ల నిర్మాణ పనులను గహ నిర్మాణ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

    నాలుగు దఫాలుగా బిల్లులు..

    ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో బేస్‌మెంట్‌ వరకు పూర్తి చేసిన వెంటనే అధికారులు ఏఐ టెక్నాలజీతో ఫోటోలను అప్లోడ్‌ చేయగానే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్ష నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. రూఫ్‌లెవెల్‌ గోడల వరకు నిర్మాణం పూర్తి చేస్తే రూ.లక్ష, స్లాబ్‌ పూర్తయ్యాక రూ.2 లక్షలు, ప్లాస్టరింగ్‌, డోర్‌ ఫిట్టింగ్‌, కలర్‌ పూర్తయ్యాక చివరి బిల్లు రూ.లక్ష అందిస్తారు. ఇలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎంత వేగంగా పూర్తి చేస్తే బిల్లులు కూడా అంతే వేగంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    స్లాబ్‌ దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు

    కొనసాగుతున్న ఇందిరమ్మ

    ఇళ్ల నిర్మాణం

    పైలట్‌ ప్రాజెక్టు కింద ధర్పల్లి

    మండలం సీతాయిపేట్‌ ఎంపిక

    సకాలంలో బిల్లులు చెల్లింపు

    హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

  • జనావా
    నేటి చిత్రం

    గౌతంనగర్‌లో జనావాసాల మధ్య నిలిచిన మురుగు

    నిజామాబాద్‌అర్బన్‌ : నగరంలో 40వ డివిజన్‌లోని గౌతంనగర్‌లో జనావాసాల మధ్య మురుగు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు స్వైర విహరం చేస్తున్నాయి. మురుగు దుర్వసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – మెతుకు శివకుమార్‌, 40వ డివిజన్‌

    మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.

    నిజామాబాద్‌ అర్బన్‌ – 95531 30597

    నిజామాబాద్‌ రూరల్‌ – 97053 46541

    మాకు ఫొటో పంపండి

  • రక్తద

    సిరికొండ: రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని హెల్పింగ్‌ హర్ట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అయినాల శ్రీకాంత్‌ పేర్కొన్నారు. మండలంలోని తూంపల్లి గ్రామంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాతలకు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రశంసపత్రాలు అందజేశారు. పలుమార్లు రక్తదానం చేస్తు ప్రాణదాతలుగా నిలుస్తున్న హరీష్‌గౌడ్‌, బాలరాజ్‌, రాజు, కిషన్‌, , రవి, మహేష్‌, శేఖర్‌, రాజేశ్వర్‌, గోపాల్‌లను అభినందించారు. శ్రీకాంత్‌ మాట్లాడుతు రక్తదానం చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నారు. వీడీసీ చైర్మన్‌ లక్ష్మణ్‌గౌడ్‌, ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ రాజేందర్‌, రవి, ప్రశాంత్‌, యశ్వంత్‌, బాలరాజ్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

    మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    నిజామాబాద్‌రూరల్‌ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మోపాల్‌ ఎస్సై యాదగిరిగౌడ్‌ అన్నారు. శనివారం మండలంలోని కంజర్‌ గ్రామంలో గంజాయి, మత్తుపదార్థాలపై అవగాహన క

    ల్పించారు. గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

    కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం

    కక్ష సాధింపు చర్య

    నిజామాబాద్‌ రూరల్‌: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జెడ్పీ మాజీ చైర్మన్‌ దాదాన్న గారి విఠల్‌ రావు పేర్కొన్నారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు.

  • ఇసుక
    సినిమాలు

    వేల్పూర్‌: మండలంలోని జాన్కంపేట్‌, సాహేబ్‌పే ట్‌, అమీనాపూర్‌, లక్కోర, పడగల్‌ గ్రామాలలో ఇ సుక లేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుందని ప్రక టించినా, ఇసుక సరఫరా కావడం లేదని వాపోతున్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తొందరగా పనులు ప్రారంభించాలని అధికారులు చెప్పగా గుంతలు తీసి సిద్ధం చేశామన్నారు. ఇసుక కోసం అధికారులను అడిగితే రెవెన్యూ సదస్సుల్లో బిజీగా ఉన్నామని, ఉన్నత అధికారుల నుంచి కూపన్‌ బుక్‌ లు రావాల్సి ఉందని చెబుతున్నారని వాపోయారు. వర్షాకాలం కావడంతో పిల్లర్‌ గుంతల్లో నీళ్లు నిండుతున్నాయని, ఇసుక ఉంటే ఈపాటికే అడుగు పిల్ల ర్లు పూర్తయ్యేవని పేర్కొంటున్నారు. వాగు సరిహ ద్దు ఉన్న గ్రామాల వారికి ఎటువంటి ఆటంకం లే కుండా ఇసుక లభిస్తుండగా, వాగు సరిహద్దు లేని తమ గ్రామాలకు ఇసుక లభించడం లేదన్నారు. రె వెన్యూ సదస్సులు ముగిసినందున వెంటనే ఇసుక సరఫరా చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సహకరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

  • ప్రభుత్వం తక్షణమే పీఆర్‌సీని ప్రకటించాలి

    నిజామాబాద్‌ అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్‌సీని ప్రకటించి, పెండింగ్‌ డీఏ, బిల్లులను తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మల్లుస్వరాజ్యం ట్రస్టు కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటును పూర్తిగా నిలిపివేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిని, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, 317 జీవో బాధితులను వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు కేటాయించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరారు. అన్ని కేటగిరిల పాఠశాల విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ అందజేయాలని, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనం అందజేయాలని డిమాండ్‌ చేశారు. విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం జాప్యం చేస్తే టీఎస్‌యూటీఎఫ్‌ పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్‌, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌, ఉపాధ్యక్షులు, మల్లేష్‌, ట్రెజరర్‌ రాజారామ్‌, జిల్లా కార్యదర్శులు జనార్దన్‌, సాయన్న, బాబులు, శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు రఘు, రాజేశ్వర్‌, ప్రభాకర్‌, లింగం, బాలరాజు, లింబగిరి స్వామి, రవీందర్‌, భూమేశ్వర్‌, బాజన్న, సుధాకర్‌ శ్యామ్‌ రావ్‌, తదితరులు పాల్గొన్నారు.

  • కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య

    నందిపేట్‌(ఆర్మూర్‌): మండలంలోని బాద్గుణ గ్రామానికి చెందిన అల్లూరి లింగారెడ్డి (57) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. అల్లూరి లింగారెడ్డి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కాగా, శుక్రవారం నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో ఉన్న తన చెల్లి వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. కానీ, చెల్లెలి ఇంటికి వెళ్లకుండా మార్గమధ్యలో ఉమ్మెడ శివారులోని బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అల్లుడు తాటిపల్లి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

    మనస్తాపంతో ఒకరు..

    నిజామాబాద్‌ రూరల్‌: మోపాల్‌ మండలంలోని మంచిప్ప తండాకు చెందిన గోవర్ధన్‌(38) మంచిప్ప పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై యాదగిరి గౌడ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గోవర్ధన్‌కు అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతాయి. మద్యానికి బానిసయ్యాడని శనివారం ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గోవర్ధన్‌ మంచిప్ప పెద్ద చెరువులో దూకడాన్ని మృతుడి కుమారుడు శ్రీనివాస్‌ చూసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

  • ప్రశ్నే ప్రగతికి మెట్టు

    నిజామాబాద్‌నాగారం:. ప్రశ్నించడమే ప్రగతికి మెట్టని, రాజ్యాంగ చట్టాలపై అందరికీ అవగాహన అవసరమని వక్తలు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పెన్షనర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కోయేడి నర్సింహులు అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు నర్రా రామారావు హాజరై మాట్లాడారు. జనవిజ్ఞాన వేదిక 1988 ఫిబ్రవరి 28 జాతీ య సైన్స్‌ దినోత్సవం రోజు ఆవిర్భవించిందని తెలిపారు. ఆవిర్భావం కంటే ముందు సమాజ మార్పు కోరే ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు కలిసి భారత జన విజ్ఞాన జాత ద్వారా గ్రామాన్ని తెలుసుకో గ్రామాన్ని మార్చుకో అనే అంశంపై కళాజాత నిర్వహించారని గుర్తు చేశారు. అనంతరం మన విశ్వం అనే అంశంపై సురేశ్‌ కావాల్లా ప్రసంగించారు. రాజ్యాంగ ఆవశ్యకత, హక్కులు, చట్టాలు తదితర అంశాలపై సాయన్న అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి గంగాకిషన్‌, వెంకట మల్లయ్య, విజయ ఆనంద రావు, రామకృష్ణ, పెద్ది వెంకట్రాములు, జేవీవీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    ● చట్టాలపై అవగాహన అవసరం

    ● జన విజ్ఞాన వేదిక ప్రత్యేక తరగతుల్లో వక్తలు

  • మహదేవ
    మీకు తెలుసా?

    దోమకొండ గడికోటలోని మహదేవుని ఆలయ నిర్మాణానికి అప్పట్లో వరంగల్‌ సంస్థానంను పరిపాలించిన రాణి రుద్రమదేవి వచ్చినట్లు శిలాఫలకం ఉంది. ప్రస్తుతం ఏదైనా కార్యక్రమాన్ని మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభించినప్పుడు ఏ విధంగానైతే శిలా ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ రోజుల్లో సైతం ఆమె ఆలయ నిర్మాణానికి వచ్చినప్పుడు శిలాఫలకం ఏర్పాటు చేసినట్లు పురావస్తుశాఖ ప్రతినిధులు గుర్తించారు. వరంగల్‌లోని వేయి స్థంభాల ఆలయాన్ని పోలిన విధంగా అదే శిల్పాకళా నైపుణ్యంతో ఇక్కడి మహదేవుని ఆలయ నిర్మాణం ఉంటుంది.

    –దోమకొండ

  • నెట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

    నిజామాబాద్‌ నాగారం: నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని వినాయక్‌నగర్‌ అభ్యాస స్కూల్‌లో నిర్వహించిన ఎన్నికలకు పరిశీలకులుగా కామారెడ్డి జనరల్‌ సెక్రెటరీ రఘురాం, నిజామాబాద్‌ యూత్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ముత్తెన్న, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఎన్నికల అధికారిగా నాగేశ్వరావు వ్యవహరించారు. నూతన కార్యవర్గం 2029 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారి ప్రకటించారు. అధ్యక్షుడిగా జీ వెంకటేశ్వర్‌ రావు, ప్రధాన కార్యదర్శిగా ఏ రమేశ్‌, కోశాధికారిగా పీ గంగాధర్‌, చైర్మన్‌గా రవీందర్‌, వైస్‌ ప్రెసిడెంట్లుగా సీహెచ్‌ అన్నపూర్ణ, నాగేశ్‌, రమేశ్‌, జాయింట్‌ సెక్రెటరీలుగా నాగరాజు, కృష్ణంరాజు, ఆశాజ్యోతి, అనిల్‌కుమార్‌, ఈసీ మెంబర్లుగా కుమార్‌, ప్రవీణ్‌, రాజు, సాగర్‌ , అప్పారావు , మధుకర్‌, ప్రసన్న ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం నెట్‌బాల్‌ పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చేలా ప్రోత్సహిస్తామన్నారు.

  • ప్రైవేటు బస్సుల నిలువు దోపిడీ

    మోర్తాడ్‌(బాల్కొండ): నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల నుంచి ముంబైకి వెళుతున్న ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ముంబైకి టీజీఎస్‌ ఆర్‌టీసీ ఒకటే బస్సు నడపడంతోపాటు ప్రయాణికుల సంఖ్యకు సరిపడా రైళ్లు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. వేసవి సెలవులు ముగియడం, విద్యా సంస్థలు పున: ప్రారంభం కావడంతో ముంబై నుంచి తెలంగాణ జిల్లాలకు వచ్చిన వారు తిరుగు పయనమవుతున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు టికెట్‌ ధరలను అమాంతం పెంచడంతో తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

    ఆర్టీసీ సీట్లు ఫుల్‌..

    వేములవాడ డిపో నుంచి లహరి బస్సు ఒక్కటే ముంబైకి ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ బస్సులో స్లీపింగ్‌ బెర్త్‌కు రూ.1,700లు, సీటు కోసం రూ.1,300ల చార్జీ వసూలు చేస్తున్నారు. ఒకే బస్సు ఉండటంతో రెండు, మూడు రోజుల టిక్కెట్లు ముందుగానే బుకింగ్‌ అయిపోతున్నాయి. కాగా, నిజామాబాద్‌ నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌(రైలు) ఒక్కటే ముంబైకి ప్రతి రోజూ వెళుతుంది. దీంతో ఆ రైలు కాస్తా ప్రయాణికులకు కిక్కిరిసిపోతుంది.

    ముంబైకి వెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లు

    ట్రావెల్‌ బస్సుల్లో అడ్డగోలు చార్జీలు

    ఆర్టీసీ బస్సు ఒకటే నడపడంతో ఇబ్బందులు

    ఒక్క టికెట్‌ రూ.2,500

    సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇదే అదనుగా భావిస్తున్న టావెల్స్‌ ఆపరేటర్లు టికెట్ల ధరలను పెంచేశారు. గతంలో స్లీపింగ్‌ బస్సులో ఒక్కో టిక్కెట్‌కు రూ.1,200 ల నుంచి రూ.1,300 ల చార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.2,500 లకు టిక్కెట్‌ ధర పెంచారు. సీటులో కూర్చొని ప్రయాణించేవారికి రూ.900 ల చార్జీ ఉండగా రూ.1,700 లకు పెంచారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ బుకింగ్‌ పాయింట్‌ల నుంచి ముంబైకి ప్రయాణం సాగుతుంది.

    ఎక్కడి నుంచి బస్సు ఎక్కినా ఒక్కటే చార్జీని వసూలు చేస్తున్నారు. నిత్యం ఆరు, ఏడు ప్రయివేటు బస్సులు రెండు జిల్లాల నుంచి ముంబైకి ప్రయాణికులను తరలిస్తున్నాయి. కాగా, ముంబై నుంచి వచ్చే వారికి కూడా ఇదే విధమైన చార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలిపారు. ప్రైవేటు బస్సుల చార్జీల నియంత్రణకు చర్యలు తీసుకునేవారు లేకపోవడంతో ఆపరేటర్లు చెప్పినంత ధరకు టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

    ఇద్దరికి రూ.5 వేలు

    ముంబైకి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంది. చార్జీలు పెరిగినా తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్‌లను కొనుగోలు చేసి బయల్దేరాం. నేను, నా భార్య ఇద్దరికే స్లీపర్‌ సీట్లకు రూ.5 వేలు ఖర్చు చేశాం. ఆర్‌టీసీ సంస్థ బస్సులను నడిపితే ప్రయాణికులకు ప్రయోజనంతోపాటు ప్రైవేటు బస్సుల్లో చార్జీలు నియంత్రణలోకి వచ్చేవి. – రాజన్న, తొర్తి(ముంబై)

  • ఉచిత

    డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ఏసీ రిపేరింగ్‌ (30 రోజులు), సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ (30 రోజులు) శిక్షణ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ రవికుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కో ర్సుల్లో చేరేందుకు పురుషుల నుంచి మాత్ర మే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్‌, యూనిఫామ్‌, శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ధ్రువీకరణ పత్రం అందజేస్తామన్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన సదుపాయం, హాస్టల్‌ వసతి కల్పిస్తామని తెలిపారు. 19 నుంచి 40 సంవత్సరాల వయసు గల నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌ , రేషన్‌ కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 08461– 295428 నంబర్‌లో సంప్రదించాలని డైరెక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు.

    ఇన్‌చార్జి మంత్రిని కలిసిన

    పీసీసీ అధికార ప్రతినిధి

    కమ్మర్‌పల్లి: జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన పంచాయతీ రాజ్‌, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను టీపీసీసీ అధికార ప్రతినిధి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పరిశీలకుడు బాస వేణుగోపాల్‌ యాదవ్‌ కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు వేణుగోపాల్‌యాదవ్‌ తెలిపారు.

    సాలూరలో కమ్యూనిటీ కాంటాక్ట్‌

    బోధన్‌రూరల్‌: సాలూర మండల కేంద్రంలో బోధన్‌ రూరల్‌ పోలీసులు శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని సాయినగర్‌ కాలనీలో బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ నేతృత్వంలో సమావేశం నిర్వహించి గ్రామస్తులకు శాంతి భద్రతలు, చట్టాలు, పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

    రక్తదానం అభినందనీయం

    రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి

    నిజామాబాద్‌ రూరల్‌: మానవత్వంతో ఆలో చించి రక్తదానం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు ముందుకు రావడం అభినందనీయమని నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ భూపతి రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కంఠేశ్వర్‌ బైపాస్‌లో ఉన్న రూరల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రైన ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడంలాంటిదేనని అ న్నారు. శిబిరం నిర్వహించిన రూరల్‌ యువ జన కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుంపల్లి మహేందర్‌, ఉమ్మజి నరేశ్‌లను అభినందించారు. కార్యక్రమంలో రూరల్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆకాశ్‌ రెడ్డి, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ వినోద్‌, బైండ్ల ప్రశాంత్‌, వంశీ, వెంకటేశ్‌, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • భూభారతిని సమర్థవంతంగా అమలు చేయాలి

    నిజామాబాద్‌ అర్బన్‌: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. శనివారం ఆయన నిజామాబాద్‌ ఆర్డీవో, సౌత్‌, నార్త్‌ తహసీల్‌ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. తప్పిదాలకు ఆస్కారం లేకుండా, భూ భారతి చట్టంలోని నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తూ, పెండింగ్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకుని, క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలని అన్నారు. కలెక్టర్‌ వెంట నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, సౌత్‌, నార్త్‌ తహసీల్దార్లు బాలరాజు, విజయ్‌కాంత్‌, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

    రైతు వేదికలను ముస్తాబు చేయాలి

    ఈ నెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లాలోని అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించా రు. డిచ్‌పల్లి మండలం నడిపల్లి, మోపాల్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలను సందర్శించి, అందు బాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రై తు నేస్తం కార్యక్రమానికి ఆదర్శ రైతులతోపాటు స్థా నిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. సీఎం వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి జరుపనున్నందున ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసా య అధికారి వీర స్వామి తదితరులు ఉన్నారు.

    కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

    ఆర్డీవో, తహసీల్‌ కార్యాలయాల తనిఖీ

    మోపాల్‌, నడిపల్లి రైతు వేదికలు పరిశీలన

  • జీపీఎస్‌ ట్రాకర్‌తో వాహనం సేఫ్‌

    ఖలీల్‌వాడి: రూ. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనం చోరీకి గురైతే ఎవరికై నా బాధగా ఉంటుంది. అదే వాహన కొనుగోలు సమయంలో కొంత ఖర్చుపెట్టి జీపీఎస్‌ ట్రాకర్‌ను బిగిస్తే వాహనానికి భద్రత ఉంటుంది. ఇటీవల బైక్‌లకు జీపీఎస్‌ ట్రాకర్‌లు బిగించుకునేందుకు యజమానులు ఆసక్తి చూపుతున్నారు. వాహన జీపీఎస్‌ ట్రాకర్‌ వాడకంతో హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరంలో వాహనాల చోరీల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.

    జీపీఎస్‌ పని చేసేది ఇలా..

    జీపీఎస్‌(గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) ట్రాకర్‌ శాటిలైట్‌ సిగ్నల్స్‌ ద్వారా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా వాహనం కచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తుంది. మొబైల్‌ యాప్‌, వెబ్‌ ప్లాట్‌ఫాం ద్వారా వినియోగదారుడికి సమాచారం చేరుతుంది. వాహనంలో బయటికి కనిపించని ప్రాంతాల్లో జీపీఎస్‌ను బిగించి బ్యాటరీకి అనుసంధానం చేస్తారు. మరికొన్ని స్వ తంత్ర బ్యాటరీతో పనిచేస్తాయి. కంపెనీలు జీపీఎస్‌ ట్రాకర్‌లను అమర్చేందుకు రూ. 1500 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇందులో ఉండే సిమ్‌ కార్డును రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

    ఉపయోగాలివి..

    రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌: జీపీఎస్‌ బిగించిన వాహనం చోరీకి గురైతే కచ్చితమైన స్థానాన్ని చూపిస్తుంది. పార్క్‌ చేసిన ప్రాంతం నుంచి కదిలిస్తే సెల్‌ఫోన్‌కు (మెసేజ్‌) హెచ్చరిక వెళుతుంది. మరికొన్ని ట్రాకర్లలో ఉన్న చోటి నుంచే వాహన ఇంజిన్‌ను ఆపేయవచ్చు.

    రికవరీ వేగవంతం: బైక్‌ను ఎత్తుకెళ్లితే వారు ఎక్కడికి తీసుకువెళ్లారో స్పష్టంగా తెలియడంతోపాటు జీపీఎస్‌ సాయంతో పోలీసులు వాహనాన్ని త్వరగా గుర్తించి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.

    చోరీ చేస్తే సులభంగా గుర్తించే వీలు

    పరికరం బిగించుకునేందుకు ఆసక్తి చూపుతున్న వాహనదారులు

    స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి

    వాహనాలు చోరీకి గురైతే వెంటనే స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేయాలి. వాహన తనిఖీల్లో దొరికే అవకాశం ఉంటుంది. వాహనంపై ఏ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయినదో స్పష్టంగా తెలుస్తుంది. వాహనాల తనిఖీల్లో జీపీఎస్‌తో ఉన్న బైక్‌ దొరికితే అసలు యజమానిని సులభంగా తెలుసుకోవచ్చు.

    – ప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐ, నిజామాబాద్‌

  • దేశీద

    నిజాంసాగర్‌(జుక్కల్‌): మద్నూర్‌ మండలం రుశేగావ్‌ చౌరస్తా వద్ద శనివారం 10 దేశీదారు మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు బిచ్కుంద ఎక్సైజ్‌ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. రుశేగావ్‌ నుంచి ద్విచక్ర వాహనంపై దేశీదారు మద్యం తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు చౌరస్తా వద్ద ద్విచక్ర వా హనదారుడుని పట్టుకొని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశీదారు తరలిస్తున్న బండి సురేశ్‌తోపాటు దిగంబర్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

    ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

    ఇందల్వాయి: మండలంలోని లోలం వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తు న్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్‌ శనివారం తెలిపారు. వాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మే రకు వెళ్లి చూడగా ట్రాక్టర్‌ డ్రైవర్ల వద్ద అ నుమతి పత్రాలు లేవన్నారు. దీంతో కేసు న మోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి చ ర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

  • చోరీ కేసులో ఒకరి అరెస్టు

    ఎల్లారెడ్డి: పట్టణంలోని సత్యం కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్‌ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని భిక్కనూర్‌ గ్రామానికి చెందిన కోడేనోళ్ల రాజు ఈ నెల 11న రాత్రి సత్యంకు చెందిన కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. శనివారం ఎల్లారెడ్డిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న రాజును పట్టుకొని విచారించగా కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

    కంటైనర్‌, టీవీఎస్‌ ఎక్సెల్‌ ఢీ

    ఇద్దరికి గాయాలు

    నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో జాతీయ రహదారిపై కంటైనర్‌, టీవీఎస్‌ ఎక్సెల్‌ ఢీకొని ఇద్దరు గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఒడ్డె గాలయ్య, సిద్ధవ్వ టీవీఎస్‌ ఎక్సెల్‌పై గోపాల్‌పేటలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా మెదక్‌ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాలయ్య, సిద్ధవ్వ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

  • చెరువులో పడి మత్స ్యకారుడి మృతి

    బీబీపేట: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మణ్‌ (35) శుక్రవారం స్థానిక పెద్ద చెరువులో చేపలవేటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి చూడగా లక్ష్మణ్‌ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

    కేజ్‌వీల్‌ ట్రాక్టర్‌ ఢీకొని ఒకరు..

    బోధన్‌రూరల్‌: మండలంలోని సంగం గ్రామంలో నాయకం ఎర్ర సాయిలు (48) కేజ్‌వీల్‌ ట్రాక్టర్‌ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందినట్లు బోధన్‌ రూరల్‌ ఎస్సై మచ్చేందర్‌ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాయకం ఎర్ర సాయిలు గ్రామంలోని చౌరస్తా వద్ద గల హోటల్‌లో టీ తాగి నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన సూర శ్రీనివాస్‌ కేజ్‌వీల్‌ ట్రాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సాయిలును ఢీకొట్టాడు. దీంతో దమ్ము చక్రాల కింద పడిపోవడంతో సాయిలు తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్‌ రెడ్డి పేర్కొన్నారు.

SPSR Nellore

  • నీట్‌

    నెల్లూరు (టౌన్‌): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 4వ తేదీన నీట్‌ను ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో మొత్తం 10 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,913 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. ఎస్‌ఇ.కవిన్‌ 161వ ర్యాంకు, శ్రీరామ్‌ 253, యోగేష్‌ కార్తీక్‌ 323, వెంకట శ్రీనివాస్‌ 515, వైష్ణవ్‌కుమార్‌ 546, లలిత్‌ శ్రీహాస్‌ 563, సుభాష్‌ శంకర్‌ 804, విశ్వక్‌ 955, కత్రివేల్‌ 962 ర్యాంకులు సాధించారు. అదే విధంగా జాహ్నవి 588 మార్కులు భానుశ్రీసులోచన 543, హరిణి 542, చేతన్‌ 531 మార్కులు సాధించారు.

    రేడియాలజీ చేస్తా

    స్థానిక ఉస్మాన్‌సాహెబ్‌పేటలో విశ్వక్‌ నివాసం ఉంటున్నారు. తండ్రి వంశీకృష్ణ, తల్లి లావణ్య ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఉత్తమ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించి రేడియాలజిస్టుగా పనిచేయడమే లక్ష్యంగా విశ్వక్‌ చెబుతున్నారు.

    – ఎం.విశ్వక్‌ (955 ర్యాంకు)

    న్యూరాలజిస్టునవుతా

    స్థానిక భక్తవత్సలనగర్‌లో జాహ్నవి నివాసం ఉంటున్నారు. తండ్రి రవికుమార్‌, తల్లి శ్రీలక్ష్మి. మంచి మెడికల్‌ కళాశాలలో పీజీ చేసి న్యూరాలజిస్టుగా పనిచేయాలన్నదే లక్ష్యంగా జాహ్నవి చెబుతోంది.

    – జాహ్నవి (2505 ర్యాంకు)

    వైద్య సేవే లక్ష్యం

    స్థానిక హరనాథపురంలో లలిత్‌శ్రీహాస్‌ నివాసం ఉంటున్నారు. తండ్రి రాజశేఖర్‌, తల్లి శ్రీలక్ష్మి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మెడిసిన్‌ చదివి ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యమని లలిత్‌శ్రీహాస్‌ చెబుతున్నారు.

    – లలిత్‌ శ్రీహాస్‌ (563 ర్యాంకు)

Nalgonda

  • నడిపి

    ఆటో నడుపుతూ..

    కొడుకును ఎంబీబీఎస్‌ చదివిస్తూ..

    భువనగిరి : భువనగిరి పట్టణంలోని పహడీనగర్‌కు చెందిన షేక్‌ జహంగీర్‌, నసీం దంపతులకు కుమారుడు అద్నాన్‌, కుమార్తె ఉన్నారు. తన కొడుకును డాక్టర్‌ చేయాలని జహంగీర్‌ సంకల్పించాడు. వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు భువనగిరి నుంచి చౌటుప్పల్‌కు వెళ్లి అక్కడ వెల్డింగ్‌ వర్క్‌షాపులో పనిచేస్తూ తమ పిల్లలను చదివిస్తూ, కుటుంబాన్ని పొషించాడు. కొన్ని సంవత్సరాల క్రితం వలిగొండ నుంచి భువనగిరికి బైక్‌పై వస్తుండగా అనాజీపురం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న అనంతరం ఆటో కొనుగోలు చేసి భువనగిరిలో నడుపుకుంటూ పిల్లల చదువును కొనసాగించాడు. పిల్లల చదువుల కోసం అప్పులు సైతం చేశాడు. ఇంటర్‌ పూర్తయిన వెంటనే నీట్‌ ర్యాంకు రాలేదు. రెండేళ్లు కోచింగ్‌ ఇప్పించాడు. అద్నాన్‌ 2023లో నీట్‌ ర్యాంకు సాధించి ప్రస్తుతం జనగాంలోని ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె ఓ ప్రైవేట్‌ కళాశాలలోనే బీటెక్‌ చదువుతోంది. పిల్లల చదువు కోసం రూ.లక్షలు అప్పు చేశాడు. అప్పులను తీర్చేందుకు ఆటో నడుతుతూనే ఉన్నాడు జహంగీర్‌.

    కొడుకు కలను నెరవేర్చి

    చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌కు చెందిన వీరమళ్ల శ్రీమన్నారాయణ–విజయ దంపతులకు కుమారుడు దయాకర్‌, కుమార్తె రాజ్యలక్ష్మి ఉన్నారు. శ్రీమన్నానారాయణకు ఆరుగురు అన్నదమ్ముళ్లు. ఉమ్మడి కుటుంబంలో మొదలైన కష్టాలు వారికి ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. తాము అనుభవించిన కష్టాలు తమ బిడ్డలకు రావొద్దన్న ఆలోచనతో ఈ దంపతులు ఎంతో శ్రమించారు. ప్రస్తుతం గ్రామాల్లోని కిరాణా దుకాణాలకు మార్కెటింగ్‌ చేస్తున్నాడు. దయాకర్‌ చిన్నతనం నుంచి కోరుకున్న విధంగా డాక్టర్‌గా తీర్చిదిద్దాడు. తనకు వచ్చిన సంపాదనతో ఉన్నంతలోనే ఖర్చు చేసుకొని కొంత మొత్తాన్ని కుమారుడి ఎదుగుదల కోసం వెచ్చించాడు. అలా వైద్య విద్య పూర్తి చేసుకున్న దయాకర్‌ చౌటుప్పల్‌లోనే తల్లిదండ్రుల వద్ద ఉంటూనే స్థానికంగా ఉన్న నాలుగు పరిశ్రమల్లో ఫ్యాక్టరీ మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం డాక్టర్‌గా మంచిస్థానంలోనే ఉన్నాడు.

    పిల్లల విజయాన్ని తమ గెలుపుగా భావిస్తున్న నాన్నలు

    సంతానాన్ని సమాజంలో ఉన్నతంగా నిలబెట్టేందుకు కృషి

    బిడ్డల ఆశలే ఆయువుగా.. వారి గెలుపే లక్ష్యంగా ముందుకు

    నేడు

    ఫాదర్స్‌ డే

    నాన్న ఎంతో శ్రమించారు

    మాది పేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. నన్ను చిన్నతం నుంచి హైదరాబాద్‌లోనే హాస్టల్‌ ఉంచి చదివించాడు. డాక్టర్‌ కావాలన్న నా చిన్ననాటి కోరికను నెరవేర్చేందుకు అమ్మానాన్నలు పడిన కష్టం ఎన్నటికీ మరువలేను. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా నాకు ఏ లోటూ రాకుండా చూశారు. చదువు పూర్తవ్వగా ప్రస్తుతం ఫ్యాక్టరీ మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. ఇకపై నా తల్లితండ్రులకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాను. – వీరమళ్ల దయాకర్‌

    పెద్దవూర: మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన చినపాక లక్ష్మీనారాయణ–మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు రాకేష్‌, రితీష్‌ ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన లక్ష్మీనారాయణ ఆర్థిక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయాడు. కార్మిక నాయకుడిగా పనిచేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. దీంతో తన కుమారులనైనా ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చిన్నప్పటినుంచే చదువుతో కలిగే ప్రయోజనాలను వివరించేవాడు. చదువుకు పేదరికం అడ్డుకాదని, ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు.. ఆ అన్నదమ్ములు. గత విద్యాసంవత్సరంలో ఇద్దరూ ఒకేసారి ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించారు. విద్యాభ్యాసాన్ని అంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్‌ సీట్లు సాధించి తమ తండ్రికి బహుమతిగా ఇచ్చారు. చినపాక రాకేష్‌ ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మహేశ్వరంలో, రెండో కుమారుడు చినపాక రితీష్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కుత్బుల్లాపూర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. వైద్యం అంటే వ్యాపారంగా మారిన నేపథ్యంలో మంచి డాక్టర్లుగా తయారై ప్రజలకు సేవ చేస్తామని వారు పేర్కొంటున్నారు.

    ముగ్గురు పిల్లలను డాక్టర్లు చేసిన నాన్న..

    మిర్యాలగూడ : పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందని ఎస్‌కె.సుబాని తొలుత ప్రైవేట్‌ టీచర్‌గా పని చేశారు. తర్వాత కలెక్టరేట్‌లో ఉద్యోగం సాధించి డిప్యూటీ తహసీల్దార్‌ బాధ్యతలు నిర్వహించారు. నిబద్ధతతో పని చేసి పలుమార్లు ఉత్తమ అవార్డులను సైతం అందుకున్నారు. ఆయనకు తమ నలుగురు పిల్లలను డాక్టర్లను చేయాలన్న లక్ష్యంతో వారిని ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులు, ఒక కూతురు ప్రభుత్వ డాక్టర్లుగా కొనసాగుతుండగా మరో కుమారుడు ఎఫ్‌సీఐలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్య మహమూబాబేగంతో కలిసి ఎస్‌కె.సుబాని పిల్లలను సమాజంలో ఆదర్శంగా నిలిపారు.

    నాన్న ప్రోత్సాహంతోనే..

    మర్రిగూడ : మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్‌యాదవ్‌ ఆండాలు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పదో తరగతి పూర్తి చేసిన శ్రీనివాస్‌ వ్యవసాయం చేసుకుంటూ.. లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం మాల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పదవిలో ఉన్నారు. నలుగురు సంతానంలో పెద్ద కుమార్తె అయిన నక్క సంధ్య బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసి ఉద్యోగానికి సన్నద్ధమవుతోంది. రెండవ కుమార్తె స్వాతి బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం మెట్రో పాలిటిన్‌ జలమండలి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కుమార్తె ప్రియాంక డిగ్రీ పూర్తి చేసి రాచకొండ కమిషనరేట్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. కుమారుడు సాయితేజ పెండెకంటి లా 4వ సంవత్సరం చదువుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన స్వాతి, ప్రియాంక మాట్లాడుతూ తండ్రి ప్రోత్సాహంతోనే ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధించామని తెలిపారు.

    తల్లి లేని లోటు తెలియనీయకుండా..

    మోత్కూరు: భార్య చనిపోయినప్పటికీ మరో వివాహం చేసుకోకుండా తన పిల్లలకు తల్లి లేని లోటు తెలియనీయకుండా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు మోత్కూరులోని అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన కురుమిళ్ల రమేష్‌. రమేష్‌కు మంజులతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీకళ, కుమారులు దేవేందర్‌, కరుణాకర్‌ ఉన్నారు. మంజుల అనారోగ్యంతో 18ఏళ్ల క్రితం మృతిచెందింది. పిల్లలు చిన్న వయస్సులోనే ఉండగానే భార్య చనిపోవడంతో రమేష్‌ తన బాధను దిగమింగుకుంటూ మేసీ్త్రగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు శ్రీకళ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి సౌదీ అరేబియాలో నర్సింగ్‌ ఉద్యోగం చేస్తోంది. పెద్ద కుమారుడు దేవేందర్‌ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు కరుణాకర్‌ డీఎంఎల్‌టీ కోర్సు చదువుతున్నాడు. తన పిల్లలకు తల్లి లేని లోటును తీర్చడంతో పాటు వారిని బాగా చదివించి ప్రయోజకులుగా చేస్తున్న రమేష్‌ను పలువురు అభినందిస్తున్నారు.

    అన్నదమ్ములిద్దరూ వైద్య విద్య

  • ప్రభు

    యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే వ్యక్తి గంధమల్ల రవి(30) శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్‌, మృతుడి భార్య నవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి తన భార్య నవిత, పిల్లలతో కలిసి యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇక్కడకు రాక ముందు రవి సైదాపురం గ్రామంలోనే హోటల్‌ నిర్వహిస్తుండేవాడు. మద్యానికి బానిసైన రవి గురించి అతడి భార్య నవిత బీర్ల ఐలయ్యకు చెబితే ఆయన తన ఇంట్లోనే సహయకుడిగా పనిచేయాలని, మద్యం తాగడం మానేయాలని సూచించారు. దీంతో యాదగిరిగుట్టలోని ఐలయ్య ఇంట్లో రవి పనిలో చేరి పిల్లలను చదివిస్తున్నాడు.

    హోం లోన్‌ కట్టలేక..

    అయితే మూడేళ్ల క్రితం రవి ప్రైవేట్‌ బ్యాంక్‌ నుంచి హోమ్‌ లోన్‌ తీసుకున్నాడు. ఈఎంఐలు సరిగ్గా కట్టకపోవడంతో బ్యాంక్‌ అధికారులు రవి ఇంటికి తాళం వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సైదాపురం గ్రామంలో సైతం రవి పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో రవి మళ్లీ మద్యం తాగడం ప్రారంభించాడు. రెండు రోజుల క్రితం రవి ఇంటికి బ్యాంక్‌ అధికారులు ఈఎంఐ కట్టడం లేదని నోటీసులు అంటించి వెళ్లారు.

    ఫోన్‌ చేస్తే లిఫ్టు చేస్తలేడని..

    శుక్రవారం రాత్రి 9గంటలకు రవికి భార్య నవిత ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో రవి తల్లికి నవిత ఫోన్‌ చేయగా.. రవి సైదాపురం వచ్చి వెంటనే యాదగిరిగుట్టకు వచ్చాడని ఆమె తెలిపింది. దీంతో మరోసారి ఫోన్‌ చేసినా రవి లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చి నవిత బీర్ల ఐలయ్య ఇంటి పైన పెంట్‌ హౌజ్‌లోకి వెళ్లి చూడగా.. రవి శాలువాతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఆమె గన్‌మెన్లు, బీర్ల ఐలయ్యకు సమాచారం ఇచ్చింది. వారు వెంటనే రవిని భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రవి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవి భౌతికకాయానికి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో బీర్ల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించారు. పోస్టుమార్టం అనంతరం రవి మృతదేహాన్ని సొంత గ్రామమైన సైదాపురానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. రవి అంత్యక్రియలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.

    భార్య ఫిర్యాదుతో కేసు నమోదు..

    మద్యానికి బానిస కావడంతో పాటు అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు రవి భార్య నవిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు యాదరగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్‌ తెలిపారు. రవి భార్యతో పాటు కుటుంబ సభ్యులు వాగ్మూలం సైతం నమోదు చేశామని, ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఎవరైనా సోషల్‌ మీడియాలో నిరాధారమైన ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

    నాల్గో అంతస్తులో ఉరేసుకున్న సహాయకుడు

    అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి

    భార్య ఫిర్యాదు

  • నీట్‌

    నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్‌ కళాశాల విద్యార్థులు శనివారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో సత్తాచాటారు. కళాశాలకు చెందిన కె. ఉజ్వల జాతీయ స్థాయిలో 501 మార్కులు, కె. ఇందు 428, ఎం. అశ్రిత 427, ఎం.శైని 407, అరిబా తబస్సుమ్‌ 385, మహీన్‌ 379 మార్కులు సాధించారని కాలేజీ చైర్మన్‌ చందాకృష్ణమూర్తి తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను డైరెక్టర్లు ఎ. నరేందర్‌బాబు, ఎన్‌. శశిధర్‌రావు, చందా శ్రీనివాస్‌, పైళ్ల రమేష్‌రెడ్డి అభినందించారు.

    ‘గౌతమి’ విద్యార్థుల ప్రతిభ

    నీట్‌ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎండీ ఉజేర్‌కు 519 మార్కులు, పావని 472, యాస్మిన్‌ 467, పసుపులేటి లేఖన 428, అలీఖాన్‌ 397, తస్నీమ్‌ 385, హీబామైరుక్‌కు 347 మార్కులు పొందారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకట్‌రెడ్డి, చల్లా వెంకటరమణ, రఘుపాల్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి అభినందించారు. అదేవిధంగా జోసా మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌లో కళాశాలకు చెందిన ఆర్‌. శ్రీకర్‌ ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సీటు సాధించాడని, తేజస్వినికి ఎన్‌ఐటీ కాంచిపురంలో ఈసీఈ, ఎం. శివాజీకి ఎన్‌ఐటీ అగర్తలలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో సీట్లు పొందినట్లు యాజమాన్యం పేర్కొన్నారు.

    ‘జాస్రిత’ ప్రభంజనం

    నల్లగొండ : నీట్‌లో నల్ల గొండలోని జాస్రిత అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆఫియా సదాఫ్‌ 429మార్కులు, ఫహాద్‌ 416, రుమానా మారియ 412, వర్షిత 410, మారియ్‌ 410, సిరి 403 మార్కులు సాధించారు. ఆర్షియా తబస్సుమ్‌ 401, పల్లవి 381, అక్షర 380, దానియా 380, ఫరియా మేహవీష్‌ 377, బృందా 371, అనన్య శరోణ్‌ 360, రేష్మ 348, దీక్షిత 344, అక్షిత 331 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు.

  • నృసిం

    యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. రెండో శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, ముఖ మండపం, మాడ వీధులు, కొండ కింద భక్తులు కిటకిటలాడారు. ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. 40వేలకు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.49,88,217 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.

    యాదగిరీశుడిని దర్శించుకున్న

    ఛత్తీస్‌గఢ్‌ పీఎస్‌సీ చైర్‌పర్సన్‌

    లక్ష్మీనరసింహస్వామిని ఛత్తీగఢ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(సీజీపీఎస్‌సీ) చైర్‌పర్సన్‌ రీటా శాండిల్య శనివారం దర్శించుకున్నారు. ఆమెకు అర్చకులు, తహసీల్దార్‌ గణేష్‌ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.

    రమణేశ్వరంలో నమక

    మంత్రాల ప్రవచనాలు

    భువనగిరి: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలో గల శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠంలో శనివారం సిద్ధ గురు రమణానంద మహర్షి 66 నమక మంత్రాలపై ప్రవచించారు. అనంతరం మహాపీఠం ఆవరణంలో రుద్ర హవనం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

    సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు

    నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌లోని పైలాన్‌కాలనీలో గల జెన్‌కో కార్యాలయం వద్ద శనివారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను విజయపురిటౌన్‌ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన జస్విత(28) భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శనివారం ఆమె కారులో ఒంటరిగా బయల్దేరి మధ్యాహ్నానానికి నాగార్జునసాగర్‌లోని పైలాన్‌కాలనీ జెన్‌కో కార్యాలయం వద్ద గల ఏటీఎం వద్దకు చేరుకుంది. అక్కడ తనతో పాటు తెచ్చుకున్న విషయం తాగి కారులోనే కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తాను విషం తాగినట్లు చెప్పింది. హైదరాబాద్‌లోనే ఉంటున్న జస్విత తండ్రి సూర్య కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు నాగార్జునసాగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సంపత్‌ తన సిబ్బందితో కలిసి టెక్నాలజీ సహాయంతో జస్విత ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని కారులో అపప్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానిక కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సకాలంలో స్పందించిన పోలీసులకు జస్విత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

  • బైక్‌లు చోరీ చేస్తున్న  బాలుడి అరెస్ట్‌

    మిర్యాలగూడ అర్బన్‌: బైక్‌లు చోరీ చేస్తున్న బాలుడిని మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్‌ సీఐ మోతీరాం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం చింతపల్లికి చెందిన నందిపాటి తరుణ్‌ మిర్యాలగూడలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. తన బైక్‌ను గత నెల 29న రాత్రి హాస్టల్‌లో పెట్టి నిద్రించాడు. మరుసటిరోజు చూసేసరికి బైక్‌ కనిపించలేదు. దీంతో వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. అటుగా బైక్‌పై వచ్చిన బాలుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్‌లు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు గతంలోనూ హైదరాబాద్‌లో, ఏపీలోని పెనుగంచిప్రోలులో బైక్‌లు చోరీ చేశాడని, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అతడి అరెస్ట్‌ చేసి నాంపల్లిలోని జువైనల్‌ కోర్టులో హాజరుపరిచే క్రమంలో కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సీఐ తెలిపారు. అతడి వద్ద నుంచి రూ.11.50 లక్షల విలువైన ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

  • ఆటోలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

    మిర్యాలగూడ టౌన్‌: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పరిధిలోని కొత్తూరు(బొద్దుగుట్ట)కు చెందిన అందుగుల సైదులు మూడు నెలల క్రితం కొత్త ఆటో కొన్నాడు. తన ఆటోలో దివ్యాంగులకు ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాడు. గతంలో పాత ఆటో నడిపే సమయంలో ఓ దివ్యాంగుడు రోడ్డుపై ఎండలో నిలబడగా, అతడిని వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలని అడగానని.. దానికి అతడు తన వద్ద డబ్బులు లేవు అని చెప్పడంతో ఎంతో బాధ అనిపించిందని సైదులు పేర్కొన్నాడు. దీంతో అప్పటి నుంచి దివ్యాంగులజీ తన ఆటోలో వారిని గమ్యస్థానాలకు ఉచితంగానే చేరవేస్తున్నట్లు సైదులు తెలిపాడు.

  • ‘జయ’

    సూర్యాపేటటౌన్‌: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్‌ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు శనివారం వెలువడిన నీట్‌ ఫలితా ల్లో జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌ తెలిపారు. కళాశాలకు చెందిన వి. నీతు 22,360, అవనీష్‌ 31,548, డి. వంశీ 80,101, జి. రాహుల్‌ 1,55,808, టి. తరుణ్‌ 1,61,298వ ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. 13 మంది విద్యార్థుల్లో ఐదుగురు మెడికల్‌ సీట్లు పొందినట్లు చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు.

Movies

  • నందమూరి బాలకృష్ణ స్పీచ్‌ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడినా.. దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో అసలు అర్థమే కాదు. ఏదో చెప్పబోయి.. మరేదో చెబుతుంటారు. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులను అవలీలగా చెప్పినా.. బయట మాత్రం చిన్న చిన్న పదాలను కూడా సరిగ్గా పలకలేక తడబడుతుంటారు. 

    ఆ మధ్య దేశభక్తి గేయం ‘సారే జహాసె అచ్చా’కూడా సరిగ్గా పాడలేక ట్రోలింగ్‌కి గురయ్యారు. ఇక తాజాగా మరోసారి బాలయ్య నవ్వుల పాలయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరు మర్చిపోయి.. దాన్ని కవర్‌ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట బాగా వైరల్‌ అయింది.

    (చదవండి: సీఎం రేవంత్‌ సమక్షంలో అల్లు అర్జున్‌ మాస్‌ డైలాగ్‌..వీడియో వైరల్‌)

    శనివారం సాయంత్రం హైటెక్స్‌లో జరిగిన గర్దర్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌  అవార్డుని ఇచ్చి సన్మానించింది. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ అవార్డును అందజేశారు. 

    అనంతరం బాలకృష్ణ వారికి ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో భట్టి పేరుని మర్చిపోయారు. ఆర్థిక, విద్యుత్‌ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి..(గ్యాప్‌ తీసుకున్నాడు).. మల్లు..(గ్యాప్‌ తీసుకున్నాడు) అంటూ పూర్తి పేరుని పలకడానికి తడబడ్డారు.   చాలాసేపు నీళ్లు నములుకున్న తర్వాత పక్కనే ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి అందించడంతో భట్టి పేరుని స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

Family

  • రశ్మిరేఖ రచయిత్రి. ఇప్పటికి వరకు నాలుగు నవలు రాశారు. మొదటిది 2013లో. నాల్గవది 2023లో. అస్సామీ భాషలో ఉండే ఆ పుస్తకాలలో ఏముందో, ఆ పుస్తకాల టైటిల్స్‌కు అర్థం ఏమిటో అస్సామీని చదవటం రాని వారికి తెలియకపోవచ్చు. కానీ, రశ్మిరేఖ జీవితం గురించి తెలుసుకుంటే మాత్రం ఆ పుస్తకాల్లో ఆమె ఏం రాసి ఉంటారో కొంతైనా ఊహించవచ్చు.

    రశ్మి వయసు 39. రోజంతా వీల్‌ చెయిరే ఆమెను తిప్పుతూ ఉంటుంది. ఉత్తర అస్సాంలోని సూటీ ప్రాంతంలో తను పాఠాలు చెబుతుండే ఖానగురి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు తిప్పుతుంటుంది, అస్సాంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతుండే సాహితీ సభలూ సమావేశాలకూ తిప్పుతుంటుంది. 

    చిన్నప్పుడే చెప్పేశారు!
    రశ్మి ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ’ (ఎస్‌.ఎం.ఎ.) పేషెంట్‌. అందుకే వీల్‌ చెయిర్‌ ఆమె శరీరంలో ఒక భాగం అయిపోయింది. చిన్నప్పుడే ఆమె గురించి వైద్యులు ఆమె తల్లిదండ్రులకు చెప్పేశారు... మీ అమ్మాయికి పెద్దయ్యాక ఎస్‌.ఎం.ఎ. వస్తుందని, అందుకు ఆమెను మానసికంగా సిద్ధం చేయమనీ! ఆ ఎరుకతో రశ్మి తన జీవితంలో పూర్తి ‘పాజిటివిటీ’ని అలవాటు చేసుకుంది. ‘అంతా మన మంచికే’ అనే ధోరణి అది. 

    టీచర్లు ప్రోత్సహించారు
    ఖానగురికి కాస్త దగ్గర్లో ఉండే రశ్మి ఇల్లు, ఇంటి పరిసరాలు ఆమె చిన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉండేవి. 
    అందమైన భావాలు రశ్మిలో అక్కడ పూతలు వేసేవి. ఆమె ఆలోచనల్లోని మార్దవాన్ని, సృజనశీలతను ఆమె తల్లిదండ్రులతో పాటు, టీచర్లూ గమనించి ఆమెను రచన వైపు ప్రోత్సహించారు. ఆ తర్వాత నెమ్మదిగా అస్సామీ దినపత్రికల్లో, వార పత్రికల్లో, మేగజీన్స్‌ లలో ఆమె వ్యాసాలు రావటం మొదలైంది. చివరికి అవి ఆమెను నవలా రచనకు ప్రేరేపించాయి. ఆమె రాసిన ‘మేఘే ధోక అకక్సార్‌ జూన్స్‌ ’, ‘జీబన్స్‌  మీనార్‌ సుర్‌’, ‘గిగోలో’, ‘మటి ఈశ్వర్‌’ అనే నవలలు అస్సాంలో ఆమెను ప్రముఖ రచయిత్రిని చేశాయి. 

    పుస్తకాలు స్ఫూర్తినిచ్చాయి
    ఇంటి వాతావరణంతో పాటు, 750 వరకు పుస్తకాలు రాసిన 72 ఏళ్ల అస్సామీ రచయిత రంజూ హజారికా కూడా రశ్మికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన పుస్తకాలను, 88వ యేట 2021లో కన్నుమూసిన అస్సామీ రచయిత హోమెన్స్‌  బోర్గోహెయిన్స్‌  రచనల్ని కూడా రశ్మి ఇష్టంగా చదివేవారు. హోమెన్స్‌ ను ఆమె పెదనాన్న అని పిలిచేవారు. ఆమెను ఆత్మకథ రాయమని ప్రోత్సహించింది ఆయనే. ‘‘మమోని బైద్యు (ఇందిరా గోస్వామి) పుస్తకాలు కూడా నాలో రాసే ధైర్యాన్ని నింపాయి’’ అంటారు రశ్మి. హోమెన్, బైద్యు 2011లో చనిపోయినప్పుడు ఆ విషాదం నుంచి త్వరగా తేరుకోలేకపోయారు రశ్మి. 

    రాష్ట్రం మొత్తం మీద నలుగురే!
    రశ్మి గువాహటి యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ ్సలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్స్‌  చేశారు. ఆ సమయంలోనే బైద్యు, హోమెన్, రంజూ హజారికా పుస్తకాలను ఎక్కువగా చదివారు. తర్వాత టీచర్‌గా ఉద్యోగం. ఆ తర్వాత 2020లో రశ్మి పెళ్లి. ఇప్పుడు ఎనిమిది నెలల కూతురు. ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ’ ఉండి, తల్లి అయిన తొలి అస్సామీ మహిళ రశ్మి. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ‘డిఫరెంట్లీ ఏబుల్డ్‌’ వ్యక్తులు నలుగురు మాత్రమే ఉన్నారు. తక్కిన ముగ్గురిలో ఒకరు రశ్మి చెల్లెలు ఛాయానిక. ఇంత పెద్ద కష్టంలోనూ మామూలు జీవితాన్ని గడుపుతున్నారు ఈ అక్కచెల్లెళ్లు. 

    ‘‘ఆ మాటే నాకు నచ్చదు’’
    అయితే ఈ మాటే అనొద్దంటారు రశ్మి! ‘‘మామూలు జీవితం అంటే ఏంటి? వీల్‌ చెయిర్‌లో ఉంటే మాత్రం మామూలు జీవితం కాకుండా పోతుందా? ‘డిఫరెంట్‌లీ ఏబుల్డ్‌’ అనే మాటైతే నాకు అస్సలు నచ్చదు. వికలాంగుల్ని వికలాంగులు అనకుండా ఆ సొగసైన భాష ఏమిటి.. కృత్రిమంగా!’’ అంటారు రశ్మిరేఖ. ‘‘ఎవరైనా సరే సానుభూతి చూపకూడదు. సానుభూతి కోరుకోకూడదు’’ అన్నది ఆమె భావన. ఆమె అభ్యర్థన. 
    ∙సాక్షి, స్పెషల్‌ డెస్క్‌  

  • మ్యూజియంలు సాధారణంగా పగలు తెరుచుకుంటాయి. రాత్రి మూతబడతాయి. ఒక్కో ప్రదేశంలో ఉన్న మ్యూజియంలకు ఒక్కో నిర్దిష్ట వేళలు ఉంటాయి. వేళ ముగిశాక మ్యూజియంలలో ఎవరినీ ఉండనివ్వరు. అలాంటిది మ్యూజియంలలో బస చేయడమేంటి? అవేమైనా హోటళ్లా, లాడ్జింగులా అనుకుంటున్నారా? ప్రపంచంలో తొమ్మిది మ్యూజియంలు మాత్రం రాత్రి బస చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో, వాటి విశేషాలేమిటో తెలుసుకుందాం.

    స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ
    ఈ మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. రాత్రి ఇక్కడ బస చేసేవారు ఇందులోని డేవిడ్‌ కోచ్‌ హాల్‌ ఆఫ్‌ ఫాసిల్స్‌లోను, దానికి దగ్గరలోనే ఉన్న సాంట్‌ ఓషన్‌ హాల్‌లోను థీమ్‌ పార్టీలు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. రాత్రంతా ఇక్కడ బస చేయాలంటే, ఒక్కొక్కరు 150 డాలర్లు (సుమారు రూ.12,900) చెల్లించాల్సి ఉంటుంది. పదిమంది లేదా అంతకు మించిన జనాలు బృందాలుగా వెళితే, ఒక్కొక్కరికి 120 డాలర్లు (సుమారు రూ.10.300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అవకాశం అన్నిరోజుల్లోనూ ఉండదు. ఈ ఏడాది జూన్‌ 20, 28 తేదీల్లోను; జూలై 11, 19 తేదీల్లోను; ఆగస్టు 1, 8 తేదీల్లోను మాత్రమే ఇక్కడ బస చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.

    మేరీలండ్‌ సైన్స్‌ సెంటర్‌
    అమెరికాలోని మేరీలండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌ నగరంలో ఉంది ఈ మ్యూజియం. ఏడాదిలో రెండుసార్లు రెండేసి రోజుల చొప్పున రాత్రివేళ బస చేసేందుకు ఈ మ్యూజియం అనుమతిస్తుంది. ఏటా మే, జూన్‌ నెలల్లో ‘స్టార్‌వార్స్‌’ థీమ్‌ నైట్‌ పార్టీ నిర్వహిస్తుంది. అలాగే, ‘పైజమా పార్టీ’ నిర్వహిస్తుంది. ఏటా రెండేసి రోజులు సాగే ఈ పార్టీలలో ఐదేళ్లకు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొనవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయవచ్చు. ఈ పార్టీలలో పాల్గొనే పిల్లలకు స్లైమ్, బ్లాక్‌ బిల్డింగ్‌ సహా రకరకాల హస్త కళలు, ప్లానెటేరియం షో, ఐమాక్స్‌ షో కూడా ఉంటాయి. ఇందులో బస చేసేవారు ఒక్కొక్కరు 71 డాలర్లు (రూ.6,104) చెల్లించాల్సి ఉంటుంది.

    ఇంట్రెపిడ్‌ మ్యూజియం
    ఇది అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉంది. ఇందులోని విమానవాహక నౌకలో డిన్నర్‌ పార్టీలు చేసుకోవడానికి, రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు వయసు గల పిల్లలు ఆస్వాదించడానికి అనువుగా ఇందులో రకరకరాల వినోద విజ్ఞాన కార్యక్రమాలను రూపొందించారు. ఫ్లాష్‌లైట్‌ గైడెడ్‌ టూర్లు, అపరిమితంగా రకరకాల సిమ్యులేషన్‌ రైడ్లు ఇందులోని ప్రత్యేక ఆకర్షణలు. బస చేసేవారికి ఇక్కడ అల్పాహారం, చిరుతిళ్లు, భోజనం అన్నీ ఉచితం. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఒక్కొక్కరు 130 డాలర్లు (రూ.11,182), బసతో పాటు పార్టీలు చేసేకునేవారు ఒక్కక్కరు 145 డాలర్లు (రూ.12,472) చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వచ్చేటట్లయితే, ఒక్కొక్కరు 99 డాలర్లు (రూ.8,515) చెల్లించాల్సి ఉంటుంది. 

    ఫీల్డ్‌ మ్యూజియం
    ఇది అమెరికాలోని షికాగో నగరంలో ఉంది. పురాతన డైనోసార్ల శిలాజాలను భద్రపరచిన ఈ మ్యూజియం రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. భూగ్రహ పరిణామానికి చెందిన అనేక ఆధారాల అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరచారు. రాత్రివేళ బస చేసే వారికి ఇక్కడ పలు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఉపన్యాసాలు, వైల్డ్‌లైఫ్‌ డిటెక్షన్‌ పోటీలు, థీమ్డ్‌ చాలెంజెస్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలతో కలసి కుటుంబాలు, పదిహేను మంది లోపు బృందాలు ఇందులో రాత్రి బస చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్‌ 5 నుంచి నవంబర్‌ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఇందులో వారు ఎంపిక చేసుకునే ప్యాకేజీలను బట్టి ఒక్కొక్కరు 95–200 డాలర్లు (రూ.8,171–రూ.17,203) వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బస చేసేవారికి అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మరునాటి ఉదయం మ్యూజియం సందర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం.

    యూఎస్‌ఎస్‌ హార్నెట్‌ మ్యూజియం
    ఈ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యాలమీడాలో ఉంది. ఇది ఏటా ఒకరోజు ‘హిస్టరీ మిస్టరీ ఓవర్‌నైట్‌’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కుటుంబాలు, బృందాలు పాల్గొనవచ్చు. పదహారేళ్ల వయసు పైబడిన వారికోసం ఇందులో అర్ధరాత్రివేళ రెండో ప్రపంచయుద్ధం నాటి విమానవాహక నౌక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మ్యూజియం ప్రతినిధులు సందర్శకులకు దీని విశేషాలను వివరిస్తారు. రాత్రివేళ ఇందులో నిద్రించే అవకాశం కూడా కల్పిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అతీంద్రియ శక్తుల అన్వేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వినోదాత్మక వైజ్ఞానిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు పదిమంది వరకు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ.86 వేలు), పదిమందికి పైబడి ఇరవైమంది వరకు ఉంటే రెండువేల డాలర్లు (సుమారు రూ.1.72 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.

    ఓరెగాన్‌ మ్యూజియం ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ
    ఇది అమెరికాలోని పోర్ట్‌లండ్‌ నగరంలో ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక అభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరించే రకరకాల వస్తువులను ఇందులో భద్రపరచారు. విద్యార్థులు బృందాలుగా వారి ఉపాధ్యాయులతో కలసి ఈ మ్యూజియం సందర్శించడంతో పాటు రాత్రివేళ ఇక్కడే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కో విడతలో యాభైమందికి లోపుగా వచ్చే బృందాలను మాత్రమే అనుమతిస్తారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఇందులోకి అనుమతి ఉంటుంది. మ్యూజియం సందర్శనకు వచ్చే బృందాలు తమకు అనువైన తేదీలను చెప్పి, ముందుగానే బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. బృందంలో ముప్పయి మంది వరకు ఉంటే 3300 డాలర్లు (రూ.2.83 లక్షలు), ముప్పయి మందికి మించి ఉంటే, అదనంగా ఉండేవారు ఒక్కొక్కరికి 90 డాలర్ల (రూ.7,737) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బృందంలోని సభ్యుల సంఖ్య యాభైమందికి మించరాదనే పరిమితి ఉంది. ఇక్కడ బస చేసేవారికి అల్పాహారం, భోజనం ఉచితం. ఆరుబయట నిద్రించేవారికి టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగులు కూడా ఉచితంగానే అందిస్తారు.

    మ్యూజియం ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ
    ఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఉంది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకునే స్కౌట్స్‌ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అనుమతిస్తుంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన రకరకాల ఆవిష్కరణలను పొందుపరచిన ఈ మ్యూజియంలో బస చేయడానికి ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో అనుమతి ఉంటుంది. బస కోసం బృందాలుగా వచ్చేవారు ముందుగానే సంప్రదించి, బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముప్పయి మంది వరకు ఉండే బృందాలు 1300 డాలర్లు (రూ.1.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. బృందంలో ముప్పయిమందికి అదనంగా ఉంటే పిల్లలు ఒక్కొక్కరికి 48 డాలర్లు (రూ.4,126), పెద్దలు ఒక్కొక్కరికి 36 డాలర్లు (రూ.3,094) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

    ప్లిమత్‌ ప్యాటక్సెట్‌ మ్యూజియం
    ఇది అమెరికాలోని బోస్టన్‌ నగరానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్‌లోని పదిహేడో శతాబ్దినాటి జనజీవనానికి అద్దంపట్టే వస్తువులను భద్రపరచే ఈ మ్యూజయంలో అప్పటి కాలంలో మాదిరిగానే గడపడానికి వీలుగా వసతులు ఉన్నాయి. ఇందులో రాత్రి బస చేయడానికి స్కౌట్స్‌కు, పాఠశాలల విద్యార్థి బృందాలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియంలో హిస్టారిక్‌ ప్యాటక్సెట్‌ హోమ్‌సైట్, ప్లిమత్‌ కాలనీ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఇరవైమందికి పైబడిన బృందాలు ఇక్కడ బస చేయవచ్చు. ఇందులోని ఒకే విభాగంలో గడపాలనుకునే బృందాల్లో కనీసం ఇరవైమంది ఉండాలి. నలభై మందికి పైగా ఉండే బృందాలకు రెండు విభాగాల్లోనూ గడిపేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో బసకు ఒక్కొక్కరు 81 డాలర్లు (రూ.6,963) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బస చేసేవారికి అల్పాహారం, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితం.

    నేచురల్‌ హిస్టరీ మ్యూజియం
    రాత్రి బసకు వీలు కల్పించే మ్యూజియంలు ఎక్కువసంఖ్యలో అమెరికాలో ఉంటే, ఇది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రాజధాని లండన్‌లో ఉంది. డైనోసార్ల శిలాజాలు సహా ప్రకృతి పరిణామాలకు, చరిత్రకు సంబంధించిన పలు వస్తువులను భద్రపరచిన ఈ మ్యూజియం విద్యార్థులకు రాత్రి బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియం పిల్లల కోసం ప్రత్యేకంగా ‘డైనోస్నోర్స్‌’ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఏడేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు వయసుగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలసి ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. రాత్రి బస చేసే విద్యార్థులకు ఈ మ్యూజియంలో పలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో బస చేయడానికి పిల్లలు ఒక్కొక్కరికి 114 డాలర్లు (రూ.9,800), పెద్దలు ఒక్కొక్కరికి 197 డాలర్లు (రూ.16,935) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ ఏడాది జూన్‌ 13, జూలై 4, జూలై 18, ఆగస్టు 1, ఆగస్టు 22, సెప్టెంబర్‌ 30 తేదీల్లో ఈ అవకాశం కల్పిస్తోంది.స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీఈ మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. రాత్రి ఇక్కడ బస చేసేవారు ఇందులోని డేవిడ్‌ కోచ్‌ హాల్‌ ఆఫ్‌ ఫాసిల్స్‌లోను, దానికి దగ్గరలోనే ఉన్న సాంట్‌ ఓషన్‌ హాల్‌లోను థీమ్‌ పార్టీలు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. రాత్రంతా ఇక్కడ బస చేయాలంటే, ఒక్కొక్కరు 150 డాలర్లు (సుమారు రూ.12,900) చెల్లించాల్సి ఉంటుంది. పదిమంది లేదా అంతకు మించిన జనాలు బృందాలుగా వెళితే, ఒక్కొక్కరికి 120 డాలర్లు (సుమారు రూ.10.300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అవకాశం అన్నిరోజుల్లోనూ ఉండదు. ఈ ఏడాది జూన్‌ 20, 28 తేదీల్లోను; జూలై 11, 19 తేదీల్లోను; ఆగస్టు 1, 8 తేదీల్లోను మాత్రమే ఇక్కడ బస చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.

    మేరీలండ్‌ సైన్స్‌ సెంటర్‌
    అమెరికాలోని మేరీలండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌ నగరంలో ఉంది ఈ మ్యూజియం. ఏడాదిలో రెండుసార్లు రెండేసి రోజుల చొప్పున రాత్రివేళ బస చేసేందుకు ఈ మ్యూజియం అనుమతిస్తుంది. ఏటా మే, జూన్‌ నెలల్లో ‘స్టార్‌వార్స్‌’ థీమ్‌ నైట్‌ పార్టీ నిర్వహిస్తుంది. అలాగే, ‘పైజమా పార్టీ’ నిర్వహిస్తుంది. ఏటా రెండేసి రోజులు సాగే ఈ పార్టీలలో ఐదేళ్లకు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొనవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయవచ్చు. ఈ పార్టీలలో పాల్గొనే పిల్లలకు స్లైమ్, బ్లాక్‌ బిల్డింగ్‌ సహా రకరకాల హస్త కళలు, ప్లానెటేరియం షో, ఐమాక్స్‌ షో కూడా ఉంటాయి. ఇందులో బస చేసేవారు ఒక్కొక్కరు 71 డాలర్లు (రూ.6,104) చెల్లించాల్సి ఉంటుంది.

    ఇంట్రెపిడ్‌ మ్యూజియం
    ఇది అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉంది. ఇందులోని విమానవాహక నౌకలో డిన్నర్‌ పార్టీలు చేసుకోవడానికి, రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు వయసు గల పిల్లలు ఆస్వాదించడానికి అనువుగా ఇందులో రకరకరాల వినోద విజ్ఞాన కార్యక్రమాలను రూపొందించారు. ఫ్లాష్‌లైట్‌ గైడెడ్‌ టూర్లు, అపరిమితంగా రకరకాల సిమ్యులేషన్‌ రైడ్లు ఇందులోని ప్రత్యేక ఆకర్షణలు. బస చేసేవారికి ఇక్కడ అల్పాహారం, చిరుతిళ్లు, భోజనం అన్నీ ఉచితం. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఒక్కొక్కరు 130 డాలర్లు (రూ.11,182), బసతో పాటు పార్టీలు చేసేకునేవారు ఒక్కక్కరు 145 డాలర్లు (రూ.12,472) చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వచ్చేటట్లయితే, ఒక్కొక్కరు 99 డాలర్లు (రూ.8,515) చెల్లించాల్సి ఉంటుంది. 

    ఫీల్డ్‌ మ్యూజియం
    ఇది అమెరికాలోని షికాగో నగరంలో ఉంది. పురాతన డైనోసార్ల శిలాజాలను భద్రపరచిన ఈ మ్యూజియం రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. భూగ్రహ పరిణామానికి చెందిన అనేక ఆధారాల అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరచారు. రాత్రివేళ బస చేసే వారికి ఇక్కడ పలు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఉపన్యాసాలు, వైల్డ్‌లైఫ్‌ డిటెక్షన్‌ పోటీలు, థీమ్డ్‌ చాలెంజెస్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలతో కలసి కుటుంబాలు, పదిహేను మంది లోపు బృందాలు ఇందులో రాత్రి బస చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్‌ 5 నుంచి నవంబర్‌ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఇందులో వారు ఎంపిక చేసుకునే ప్యాకేజీలను బట్టి ఒక్కొక్కరు 95–200 డాలర్లు (రూ.8,171–రూ.17,203) వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బస చేసేవారికి అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మరునాటి ఉదయం మ్యూజియం సందర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం.

    యూఎస్‌ఎస్‌ హార్నెట్‌ మ్యూజియం
    ఈ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యాలమీడాలో ఉంది. ఇది ఏటా ఒకరోజు ‘హిస్టరీ మిస్టరీ ఓవర్‌నైట్‌’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కుటుంబాలు, బృందాలు పాల్గొనవచ్చు. పదహారేళ్ల వయసు పైబడిన వారికోసం ఇందులో అర్ధరాత్రివేళ రెండో ప్రపంచయుద్ధం నాటి విమానవాహక నౌక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మ్యూజియం ప్రతినిధులు సందర్శకులకు దీని విశేషాలను వివరిస్తారు. రాత్రివేళ ఇందులో నిద్రించే అవకాశం కూడా కల్పిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అతీంద్రియ శక్తుల అన్వేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వినోదాత్మక వైజ్ఞానిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు పదిమంది వరకు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ.86 వేలు), పదిమందికి పైబడి ఇరవైమంది వరకు ఉంటే రెండువేల డాలర్లు (సుమారు రూ.1.72 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.

    ఓరెగాన్‌ మ్యూజియం ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ
    ఇది అమెరికాలోని పోర్ట్‌లండ్‌ నగరంలో ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక అభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరించే రకరకాల వస్తువులను ఇందులో భద్రపరచారు. విద్యార్థులు బృందాలుగా వారి ఉపాధ్యాయులతో కలసి ఈ మ్యూజియం సందర్శించడంతో పాటు రాత్రివేళ ఇక్కడే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కో విడతలో యాభైమందికి లోపుగా వచ్చే బృందాలను మాత్రమే అనుమతిస్తారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఇందులోకి అనుమతి ఉంటుంది. మ్యూజియం సందర్శనకు వచ్చే బృందాలు తమకు అనువైన తేదీలను చెప్పి, ముందుగానే బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. బృందంలో ముప్పయి మంది వరకు ఉంటే 3300 డాలర్లు (రూ.2.83 లక్షలు), ముప్పయి మందికి మించి ఉంటే, అదనంగా ఉండేవారు ఒక్కొక్కరికి 90 డాలర్ల (రూ.7,737) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బృందంలోని సభ్యుల సంఖ్య యాభైమందికి మించరాదనే పరిమితి ఉంది. ఇక్కడ బస చేసేవారికి అల్పాహారం, భోజనం ఉచితం. ఆరుబయట నిద్రించేవారికి టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగులు కూడా ఉచితంగానే అందిస్తారు.

    మ్యూజియం ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ
    ఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఉంది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకునే స్కౌట్స్‌ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అనుమతిస్తుంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన రకరకాల ఆవిష్కరణలను పొందుపరచిన ఈ మ్యూజియంలో బస చేయడానికి ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో అనుమతి ఉంటుంది. బస కోసం బృందాలుగా వచ్చేవారు ముందుగానే సంప్రదించి, బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముప్పయి మంది వరకు ఉండే బృందాలు 1300 డాలర్లు (రూ.1.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. బృందంలో ముప్పయిమందికి అదనంగా ఉంటే పిల్లలు ఒక్కొక్కరికి 48 డాలర్లు (రూ.4,126), పెద్దలు ఒక్కొక్కరికి 36 డాలర్లు (రూ.3,094) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

    ప్లిమత్‌ ప్యాటక్సెట్‌ మ్యూజియం
    ఇది అమెరికాలోని బోస్టన్‌ నగరానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్‌లోని పదిహేడో శతాబ్దినాటి జనజీవనానికి అద్దంపట్టే వస్తువులను భద్రపరచే ఈ మ్యూజయంలో అప్పటి కాలంలో మాదిరిగానే గడపడానికి వీలుగా వసతులు ఉన్నాయి. ఇందులో రాత్రి బస చేయడానికి స్కౌట్స్‌కు, పాఠశాలల విద్యార్థి బృందాలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియంలో హిస్టారిక్‌ ప్యాటక్సెట్‌ హోమ్‌సైట్, ప్లిమత్‌ కాలనీ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఇరవైమందికి పైబడిన బృందాలు ఇక్కడ బస చేయవచ్చు. ఇందులోని ఒకే విభాగంలో గడపాలనుకునే బృందాల్లో కనీసం ఇరవైమంది ఉండాలి. నలభై మందికి పైగా ఉండే బృందాలకు రెండు విభాగాల్లోనూ గడిపేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో బసకు ఒక్కొక్కరు 81 డాలర్లు (రూ.6,963) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బస చేసేవారికి అల్పాహారం, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితం.

    నేచురల్‌ హిస్టరీ మ్యూజియం
    రాత్రి బసకు వీలు కల్పించే మ్యూజియంలు ఎక్కువసంఖ్యలో అమెరికాలో ఉంటే, ఇది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రాజధాని లండన్‌లో ఉంది. డైనోసార్ల శిలాజాలు సహా ప్రకృతి పరిణామాలకు, చరిత్రకు సంబంధించిన పలు వస్తువులను భద్రపరచిన ఈ మ్యూజియం విద్యార్థులకు రాత్రి బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియం పిల్లల కోసం ప్రత్యేకంగా ‘డైనోస్నోర్స్‌’ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఏడేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు వయసుగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలసి ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. రాత్రి బస చేసే విద్యార్థులకు ఈ మ్యూజియంలో పలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో బస చేయడానికి పిల్లలు ఒక్కొక్కరికి 114 డాలర్లు (రూ.9,800), పెద్దలు ఒక్కొక్కరికి 197 డాలర్లు (రూ.16,935) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ ఏడాది జూన్‌ 13, జూలై 4, జూలై 18, ఆగస్టు 1, ఆగస్టు 22, సెప్టెంబర్‌ 30 తేదీల్లో ఈ అవకాశం కల్పిస్తోంది. 

  • మంచం మీద అసహనంగా కదులుతున్నాడు నిమ్మయ్‌. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావటం లేదు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యాపారి మనసులో మెదులుతున్నాడు. ఓ పెద్ద రాజకీయ నేతను ఎదిరించి ధైర్యంగా అతను మాట్లాడటం నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంకెవరయినా ఈ విషయం చెబితే నమ్మేవాడు కాదేమో, కాని తన కళ్ల ముందు జరిగిన సంఘటనను ఎలా కాదనగలడు?  ఆ నిమిషంలో తన ఆఫీసు గుర్తొచ్చింది. తను రోజూ గాడిద చాకిరీ చేసినా స్పెషల్‌ సెక్రటరీ తనను అవమానకరంగా ఏదో ఒక మాట అంటుంటాడు. 

    ఆ రోజు కూడా తన మహిళా పీఏ ఎదుట తనను అతను తిడుతుంటే, ఆమె చిరునవ్వులు చిందిçస్తుండటం చూసి తలకొట్టేసినట్టయ్యింది. ‘అసలు ఆ అధికారిగాడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? వెధవ హైడ్రా మొహం వాడూనూ– ఉదయం 11 గంటలకు తాపీగా ఆఫీసుకొచ్చి కాఫీలు, టీలు, సిగరెట్లతో మధ్యాహ్నం 1 వరకూ కాలక్షేపం చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి తగలడి మళ్లీ 3 గంటలకు ఆఫీసు మొహం చూస్తాడు. సాయంత్రం 5 గంటలకు స్టెనోని పిలిచి డిక్టేషన్‌ మొదలుపెడతాడు. సరిగ్గా ఆ సమయానికే నిమ్మయ్‌ని పిలిచి ఏదో ఒక సాకుతో తిట్టటం మొదలుపెడతాడు’ ఆలోచించసాగాడు నిమ్మయ్‌.  

    ఆ అధికారి ఆఫీసులో మరెవరినీ ఇలా తిట్టటం లేదన్న విషయం నిమ్మయ్‌ దృష్టికి వచ్చింది. ‘నువ్వెలా పరీక్ష రాసి ఈ ఉద్యోగానికి ఎంపికయ్యావో నేను కూడా పోటీ పరీక్షలు రాసి ఈ ఉద్యోగానికి వచ్చాను. నన్ను తిట్టటానికి నీకేం అధికారం ఉందని నిలదీయాలని అనిపించేది. కాని, భార్యా పిల్లలు, ఊళ్లో మంచం పట్టిన నాన్న కళ్ల ముందు మెదిలేవారు. దాంతో ఆ తిట్లన్నింటినీ మౌనంగా భరించడం అలవాటయ్యింది. కాని ఎంత చిత్రం! ఓ మామూలు కూరగాయల వ్యాపారి తనలా కాదు. నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థి కృపాసాగర్‌ పట్నాయక్‌పైన తిరగబడ్డాడు. ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయాడు తప్ప వ్యాపారిని ఏమనలేదు. బహుశా ఈ కూరగాయలతని దగ్గర ఏవో శక్తులు ఉండొచ్చు. అదేమిటో తెలుసుకుంటే తనకు కూడా ఉపయోగపడతాయన్న ఆలోచన వచ్చింది. ‘ఇప్పుడు బాగా పొద్దు పోయింది.

    రేప్పొద్దున వెళ్లి ఆ రహస్యం తెలుసుకోవాలి’ అనుకున్నాడు. దాంతో ప్రశాంతంగా నిద్రపట్టింది.మరుసటి రోజు దినచర్య పూర్తి చేసి, కాయగూరల బ్యాగు డిక్కీలో పెట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు నిమ్మయ్‌. కాలనీ మార్కెట్లో అతను కూరగాయలు అమ్ముతున్నాడు. తలచుట్టూ తువ్వాలు చుట్టుకుని ఉన్నాడు. ఎదురుగా తట్టల్లో రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఎవరి కోసమో బంగాళదుంపలు త్రాసులో తూస్తున్నాడు. పక్కకు చూడనయినా చూడకుండా, ‘అలా బెండకాయల చివర్లని విరవకండి. అలా చేస్తూపోతే సరుకు అమ్ముడుపోవటం కష్టం’ గట్టిగా అరిచి చెప్పాడు. బహుశా ఇతనికి ఒళ్లంతా కళ్లు ఉన్నాయేమో అని మనసులో అనుకుని బెండకాయల మీద నుంచి చేతులు వెనక్కి తీశాడు నిమ్మయ్‌. గబగబా ప్లాస్టిక్‌ బుట్టలో కొన్ని బెండకాయలు వేసి అతని చేతికిచ్చాడు.

    ‘ఎంత కావాలి?’‘పావు కేజీ’ నిమ్మయ్‌ చెప్పాడు.అతను వాటిని తూచి బుట్ట అందించాడు. పర్సులోంచి డబ్బులు తీసి అతని చేతికందిస్తూ కాస్తంత దగ్గరగా జరిగాడు నిమ్మయ్‌. ‘మీ దగ్గర ఏదో మంత్రం ఉంది’ అన్నాడు నర్మగర్భంగా. ‘అలాంటిదేమీ లేదు’ తేలిగ్గా నవ్వేస్తూ చెప్పాడు ఆ వృద్ధుడు. ‘అయితే నీ ఒంటి మీద ఏదైనా ఉంగరమో, తాయెత్తో, లేకపోతే మంత్రించిన నెక్లెస్సో ఏదో ఒకటి ఉండి తీరాలి’ అన్నాడు.‘సార్‌! అలాంటివేవీ లేవు. ఏదో కూరగాయలు అమ్ముకునేవాడిని.’‘ఇవేం లేకపోతే కృపాసాగర్‌ని ఎలా ఎదిరించగలవు? ఆయన మామూలు వాడా? వందలాది అనుచరులున్న పెద్ద రాజకీయ పార్టీ నేత. అలాంటి వాడిని ఎదిరించేవంటే, నీ దగ్గర ప్రత్యేకమైనది ఏదో ఉండి ఉండాలి. లేకపోతే ఈ పాటికి నిన్ను అతను శవంగా మార్చి ఉండేవాడు’ అన్నాడు.

    అంతలోనే ఆఫీసు వాతావరణం గుర్తొచ్చి, ‘నేను పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. నువ్వే నన్ను కాపాడాలి’ అన్నాడు దీనంగా.దాంతో ఆ కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌ సింగ్‌ చలించిపోయాడు. ‘నిన్ను చూస్తే 30, 35 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావు. నీకు నాలాంటి వృద్ధుడు ఏం సాయం చేయగలడు. నువ్వేదో కష్టాల్లో ఉన్నావన్న విషయం మాత్రం అర్థమైంది. అదేంటో చెప్పు?’ అనడిగాడు.నిమ్మయ్‌ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆఫీసులో బాస్‌ వేధింపుల గురించి వివరించాడు. అంతా విన్న తర్వాత, ‘సాయంత్రం మా ఇంటికి రా! ఆ ఫ్లాట్‌ వెనకాల మామిడి చెట్టు పక్కనున్న ఇంట్లో ఉంటా. ఈ లోపుగా నేను నీకు ఏదైనా పరిష్కారం ఆలోచించి ఉంచుతా’ హామీ ఇచ్చాడు రామేశ్వర్‌. నిమ్మయ్‌కి ఏదో బరువు దించుకుంటున్నట్టుగా అనిపించింది. కచ్చితంగా రామేశ్వర్‌ ఏదో మంత్రదండం ఇస్తాడు. దానితో స్పెషల్‌ సెక్రటరీకి తను గుణపాఠం చెబుతాడు. ‘నీ పని నువ్వు చేసుకో’ అని ఆయన మొహం మీదనే తను అంటే ఆయన మొహం ఎలా మాడిపోతుందో ఊహిస్తే గమ్మత్తుగా అనిపించింది.

    నిమ్మయ్‌ రౌత్‌  మనసారా నవ్వాడు చాలారోజుల తర్వాత. బ్యాగును ఊపుకుంటూ స్కూటర్‌ దగ్గరకు నడిచాడు. ఆ తర్వాత ఆఫీసుకు వెళుతుంటే రోడ్డుకిరువైపులా ఉన్న ప్రపంచం అంతా కొత్తగా కనిపించింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గరకు రాగానే ఎర్రలైటు వెలిగింది. దానితో తలమీద ఉన్న హెల్మెట్‌ను తీసి ఆకాశం వైపు తలెత్తి చూశాడు. పక్షులు రివ్వున ఎగురుతూ కనిపించాయి. ‘రేపటి నుంచి నేను కూడా మీలాగే స్వేచ్ఛగా విహరిస్తాను. రెక్కలు లేకపోయినా’ అని మనసులో అనుకున్నాడు.సెక్రటేరియట్‌ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. సిగ్నల్‌ లైటు ఎరుపు నుంచి ఆకుపచ్చకు మారి ట్రాఫిక్‌ కదులుతూండగా, స్పెషల్‌ సెక్రటరీ కారు పక్కనుంచి సాగిపోయింది. అందులో వెనక సీట్లో కూర్చున్న జీనా సాహెబ్‌ను చూడగానే అతనిలో ఉత్సాహం నీరుగారిపోయింది.

    సాయంత్రం 4 గంటలకు జీనా సాహెబ్‌ నుంచి పిలుపు వచ్చింది. ‘ఎలక్షన్‌ రోజులు దగ్గర పడుతున్నాయి. మన ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్‌లు ఎందరికి అందాయో వాటి వివరాలు నాకు కావాలి’ అన్నాడు. ఓ నిమిషం ఆగి మళ్లీ అన్నాడు. ‘పదిహేను రోజుల క్రితం ఈ పని పూర్తి చేయమని నీకు చెప్పాను. ఇంత వరకూ ఎందుకు పూర్తి చేయలేదు?’ నిలదీశాడు. 
    నిమ్మయ్‌ మౌనంగా నిలబడ్డాడు.‘నీ మొహం చూపించటానికి ఇక్కడకు వచ్చావా?’ గట్టిగా అరిచాడు స్పెషల్‌ సెక్రటరీ. నిమ్మయ్‌ నోరు మెదపలేదు. ‘ఎక్కడ చదువుకుని వచ్చి తగలబడ్డావ్‌?’నిమ్మయ్‌ జవాబు చెప్పలేదు. ‘నీలాంటి పనికిమాలిన వెధవలంతా ప్రభుత్వం పరువు తీస్తున్నారు. మా ఖర్మ’నిమ్మయ్‌లో దుఃఖం తన్నుకొచ్చింది.

    ‘గెటవుట్‌’ సెక్రటరీ ఉరుము ఉరిమినట్టుగా అన్నాడు. ‘రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ వివరాలు నా ముందు ఉండాలి. అర్థం అయ్యిందా ఈడియట్‌..’నిమ్మయ్‌ కాళ్లు వణికాయి. స్పెషల్‌ సెక్రటరీ చాంబర్‌ నుంచి నిస్సత్తువగా బయటకు వచ్చాడు. తలుపు దగ్గర పీటమీద కూర్చుని కనిపించాడు ప్యూన్‌. అతనికి కన్నీళ్లు కనిపించకుండా వాటిని దాచుకుంటూ మెల్లగా వాష్‌రూంలోకి అడుగుపెట్టాడు. అద్దంలో తన ముఖం ఓడిపోయిన వ్యక్తిలా వాడిపోయి కనిపించింది. గట్టిగా రెండుసార్లు శ్వాస విడిచి వదిలాడు. సెక్రటరీ మాటలు గుర్తొచ్చాయి. నిజానికి ఆ పని అప్పగించింది తనకు కాదు. ఆ పని చేయవలసింది బలరాంబాబు. అది తెలిసి చెప్పలేని తన బలహీనతను తిట్టుకున్నాడు.  నిమ్మయ్‌ తన సీటు దగ్గరకు వచ్చాడు. ఈవెంట్‌ మేనేజర్‌ ఎవరో తన డిపార్టుమెంట్‌కు వచ్చాడు.

    అందరికీ వడ, సమోసా, టీ సిద్ధం చేసి ఉంచాడు.తనను ఎవరో పిలిచారు. ‘వడ తీసుకోండి’ అన్నారు. ‘నాకు తినాలని లేదు’ నిమ్మయ్‌ బలహీనంగా చెప్పాడు. ‘అవునవును. ఇప్పుడే జీనా చాంబర్‌కి వెళ్లొచ్చాడు. ఆయన కడుపు నిండా పెట్టుంటాడు. ఇక మిగతావి ఏం తినగలడు’ అని ఎవరో వేళాకోళమాడితే మిగతావాళ్లంతా ఫక్కుమని నవ్వారు. ఇక అక్కడ ఉండలేక బయటకొచ్చేశాడు.  ‘నీ కోసం నేను ప్రత్యేకంగా ఒకటి సిద్ధం చేశాను. నీకు కావలసినన్ని రోజులు దాన్ని ఉంచుకోవచ్చు’ అన్నాడు రామేశ్వర్‌ తన ఇంటికి వచ్చిన నిమ్మయ్‌ని చూడగానే. ‘కానీ నీ పనయిన తర్వాత మాత్రం నువ్వు దాన్ని తిరిగి ఇవ్వాలి’‘అలాగే తప్పకుండా’ అన్నాడు నిమ్మయ్‌.

    ‘ఇది మా నాన్న ఆస్తి. తను నమ్ముకున్న ఆస్తి’‘నాన్నా! ఆయన ఎక్కడున్నారు?’ గబుక్కున అడిగాడు నిమ్మయ్‌. అంతలోనే తను ఎంత పిచ్చి ప్రశ్న వేశాడో అర్థమైంది. ఓ 70, 75 ఏళ్ల వ్యక్తి తండ్రి జీవించి ఉండే అవకాశం ఉంటుందా?’అంతలోనే అతని భార్య టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. అప్పుడు నిమ్మయ్‌ గది అంతా పరికించి చూశాడు. రెండు గదుల ఇల్లు. ఒక ఇంట్లో ఉన్న ఔట్‌ హౌస్‌ అది. ‘ఇంతకీ ఆ వస్తువు ఎక్కడ?’ ఎప్పుడెప్పుడు దాన్ని తీసికెళదామా అన్న ఆత్రంగా ఉంది. ‘ఒక్క నిముషం. ఆ మనిషికి కబురుపెట్టాను, ఈపాటికి వస్తూండాలి’ అన్నాడు రామేశ్వర్‌. ‘మీరు ఎంత ఇవ్వమన్నా అంత ఇస్తాను. నా జీవితకాలంలో మీరు చెల్లించమన్న మొత్తం చెల్లించేస్తా’. ‘అదేం అవసరం లేదు. మీ పని అయ్యాక నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. టైగర్‌ మంత్రంతో అది తయారయ్యింది. ఆ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు’ హెచ్చరించాడు రామేశ్వర్‌. ‘అయితే ఒక్క విషయం. మీరు దాన్ని దుర్వినియోగం చేస్తే అది ప్రతికూలతలకు దారి తీస్తుంది’‘టైగరా?’ ఆశ్చర్యానికి లోనయ్యాడు నిమ్మయ్‌.

    ‘అవును. టైగరే!’ 
    అంతలో ఎవరో బయట నుంచి పిలిచారు. రామేశ్వర్‌ బయటకు వెళ్లి ఓ పాలిథీన్‌ బ్యాగ్‌తో లోపలకు వచ్చాడు. ‘ఈ బ్యాగును ఇంటికి తీసికెళ్లు. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆఫీసుకు వెళ్లేటప్పుడు వేసుకో. మార్పు నీకే అర్థం అవుతుంది’మళ్లీ చెబుతున్నాను. ఇందులో ఓ మనిషి గాని, మంత్రంగాని, తంత్రంగాని ఏవీ లేవు. ఇదంతా నడిపేది ఓ టైగర్‌ మాత్రమే’ అని ఇంకోసారి చెప్పాడు. 

    ఇంటికి వెళుతూ టైగర్‌.. టైగర్‌.. టైగర్‌ అని మనసులో అనుకోసాగాడు.మరుసటి రోజు ఆఫీసుకు వెళుతుండగా, దారిలో ఓ గుంపు కనపడింది. ట్రాఫిక్‌ పోలీసు ఎవరో సైక్లిస్టు చొక్కా కాలర్‌ పట్టుకుని బూతులు తిడుతున్నాడు. కొట్టటానికి సిద్ధం అవుతున్నాడు.‘దయచేసి నన్ను వదిలేయండి. రెడ్‌ సిగ్నల్‌ చూసుకోలేదు’ ఆ సైకిలు కుర్రాడు బతిమాలుతున్నాడు.‘కళ్లు పోయాయా?’ కానిస్టేబుల్‌ అరిచాడు.అది చూస్తూ ఊరుకోలేకపోయాడు నిమ్మయ్‌. ‘ఎందుకు అంత గట్టిగా అరుస్తారు. చూసుకోలేదని చెబుతున్నాడు కదా, వదిలెయ్యండి. కావాలంటే అతనికి జరిమానా వేయండి’ స్కూటర్‌ మీద కూర్చునే గద్దించినట్టుగా అన్నాడు.పక్కన ఉన్న నలుగురైదుగురు నిమ్మయ్‌కి మద్దతిచ్చారు. దాంతో కానిస్టేబుల్‌ ఆ కుర్రాడిని వదిలేశాడు.

    హఠాత్తుగా నిమ్మయ్‌కి ఓ విషయం అర్థమైంది. తను కోపాన్ని ప్రదర్శించగలిగాడు. తనలో మార్పు వచ్చింది. రామేశ్వర్‌ తనకిచ్చిన జాకెట్‌ను చూసుకున్నాడు. ఖాదీ, గోధుమరంగు, కింద కొంచెం ఎర్రగా ఉంది. అది రక్తమా? లేకపోతే పెయింటా? అనేది నిమ్మయ్‌కి అర్థం కాలేదు.అతను ఆఫీసుకు వెళ్లేసరికి 10.30 అయ్యింది. తన విభాగంలో ఉన్న సీనియర్‌ క్లర్క్‌ ప్రతిమా మొహంతి ఎవరినో గట్టిగా తిడుతోంది. ఆ వ్యక్తి ఏదో చెప్పాలని ప్రయత్నించినా ఆమె వినటం లేదు. ఆమె మొహం తను రోజు చూసే జీనా సాహెబ్‌లాగా ఉంది. ‘మేడమ్‌’ గట్టిగా పిలిచాడు నిమ్మయ్‌. కుర్చీని వెనక్కి లాక్కుని కూర్చుంటూ ‘మనకు జీతం ఇచ్చేది సామాన్యులకు సేవలందించటానికే తప్ప వాళ్లను తిట్టటానికి కాదు’ అన్నాడు.ఆ మాటలకు ప్రతిమా మొహంతి  మొహం మాడిపోయింది. తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని కూర్చోమని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి నిమ్మయ్‌ వంక కృతజ్ఞతగా చూశాడు. మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు సెక్షన్‌ ఆఫీసరు పలకరించాడు.

    ‘నిమ్మయ్‌.. కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వు వేసుకున్న జాకెట్‌ నీ ఒంటికి అతికినట్టు సరిపోయింది. ఎక్కడ తీసుకున్నావ్‌?’‘టైగర్‌’ అని చెప్పబోయి గబుక్కున ఊరుకున్నాడు. ‘సర్‌! వ్యక్తిగత విషయాలు ఆఫీసులో అవసరమా?’ అని గట్టిగా అన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నిమ్మయ్‌ ఇలా మాట్లాడటం అతను చూడలేదు.మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో నిమ్మయ్‌కి చీఫ్‌ సెక్రటరీ నుంచి పిలుపొచ్చింది. నిమ్మయ్‌ జాకెట్‌ను నెమ్మదిగా స్పృశించాడు. ఒక చేత్తో పాడ్, పెన్ను, రెండో చేత్తో జాకెట్‌ను పట్టుకుని తలుపు నెట్టుకుంటూ లోపలకు అడుగుపెట్టాడు.నిమ్మయ్‌ని చూడగానే స్పెషల్‌ సెక్రటరీ గట్టిగా కేకలు ప్రారంభించాడు. ‘పొద్దున 11 గంటలకల్లా లబ్ధిదారుల జాబితా ఇవ్వమని అడిగాను కదా? ఇంతకీ ఆ ఫైల్‌ ఎక్కడ?’‘మీరు ఆ పనిని అప్పగించింది నాకు కాదు’ నిమ్మయ్‌ కూల్‌గా అన్నాడు. బలరాం నాయక్‌.. అతన్ని పిలిచి మాట్లాడితే మీకు సరైన సమాధానం లభిస్తుంది’‘నాకే ఎదురు సమాధానం చెబుతావా? ఈడియట్‌’

    నిమ్మయ్‌ అంతరంగంలో పులి నిద్ర లేచింది. ‘నాకు అదేం తెలియదు. ముందు ఆ ఫైల్‌ పట్టుకొచ్చి చావు’ గద్దింపుగా అన్నాడు స్పెషల్‌ సెక్రటరీ. నిమ్మయ్‌ ఇక నిగ్రహించుకోలేకపోయాడు. స్పెషల్‌ సెక్రటరీ ఎదురుగా ఉన్న కుర్చీల్లో ఒకదాన్ని వెనక్కి లాక్కుని దర్జాగా కూర్చున్నాడు. ఆ తర్వాత స్వరాన్ని పెంచి స్పెషల్‌ సెక్రటరీ వంక చూస్తూ ‘మీరు కావాలనే నన్ను అవమానిస్తున్నారు. మీకు అలా మాట్లాడే హక్కులేదు’ అన్నాడు సూటిగా.  దాంతో కోపంతో ఊగిపోయాడు స్పెషల్‌ సెక్రటరీ. ‘ఒక సాధారణ క్లర్క్‌ నన్ను సవాల్‌ చేస్తాడా? వీడికి బుద్ధి చెప్పాలి’ అనుకున్నాడు. ‘ఇంటికి పోయి నీ పెళ్లాం ముందు ఈ ఫోజులు కొట్టు.

    నా దగ్గర కాదు’ఆ మాటలకు నిమ్మయ్‌ లొంగలేదు సరికదా, ‘మీరు మాట్లాడేది చాలా దురుసుగా ఉంది’ అని ఓ నిముషం ఆగి, ‘నా భార్య దగ్గర ప్రదర్శించటానికి కొత్తగా నా దగ్గర  ఏదీ లేదు. మీ ఇంట్లోలా నా భార్య నన్ను వదిలి వెళ్లలేదు. భగవంతుడి దయవల్ల మేం ఇద్దరం సుఖంగా జీవిస్తున్నాం’ అన్నాడు.  ‘మీ విడాకుల కేసు విచారణ సందర్భంగా మీ అబ్బాయిని మీతో కలిసి జీవించాలని అడిగారు. దానికి వాడు మీ కొడుకేనని నమ్మకం ఏమిటని మీ ఆవిడ మిమ్మల్ని నిలదీశారు. అదృష్టవశాత్తు నా జీవితంలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి లేదు’ అని కూడా అన్నాడు.దీనితో జీనా సాహెబ్‌  హతాశుడయ్యాడు. అతనికి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది. కోపం, బాధ ఒకేసారి అతనిపై దాడిచేశాయి. వెంటనే కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. అదీ ఆపకుండా. ఒక అంబులెన్స్‌ ప్రాంగణలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ ఏర్పడింది.

    దాంతో గది బయట నిలబడిన ప్యూన్‌ ఒక్క అంగలో లోపలకొచ్చాడు. నిమ్మయ్‌ని బయటకు పంపమని సైగ చేసి చెప్పాడు జీనా సాహెబ్‌. ప్యూన్‌ నిమ్మయ్‌ చేతిని పట్టుకుని వెళ్లమని మెల్లగా బతిమాలాడు. ఆ చేతుల్ని విదుల్చుకుని స్పెషల్‌ సెక్రటరీ వంక చూస్తూ అన్నాడు నిమ్మయ్‌.  ‘నీలాంటి ఆఫీసర్లు ఎందుకూ కొరగారు. అందరూ తాడిచెట్లలాంటి వాళ్లు. ఇతరులకు ఫలాలు ఇవ్వరు లేదా కోరుకున్నట్టుగా చెట్టు నీడా దొరకదు’ అని, కాసేపు ఆగి, ‘ఇతరులను గౌరవించటం నేర్చుకో. అప్పుడు కూడా నీకు గౌరవం లభిస్తుంది. మన దేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. దాని ద్వారా అందే హక్కులకు సుప్రీం కోర్టు నుంచి రక్షణ లభిస్తుంది. ఆ సంగతి మరిచిపోకు’ పులిలా గర్జిస్తూ జీనా సాహెబ్‌ చాంబర్‌ నుంచి బయటపడ్డాడు నిమ్మయ్‌. ఎన్నో సంవత్సరాల నుంచి దిగమింగుకుంటున్న కోపం, అసహనం ఆ నిమిషంలో ఆవిరైపోయి, శరీరం బాగా తేలికగా అనిపించింది. మళ్లీ తన సీటు దగ్గరకు వెళ్లి యథావిధిగా పనిలో లీనమయ్యాడు.

    ఆ రోజు సాయంత్రం ఆఫీసు ముగిసే సమయానికి ఓ వార్త దావానలంలా సెక్రటేరియట్‌ అంతా వ్యాపించింది.పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంటులో పనిచేసే క్లర్క్‌ నిమ్మయ్‌ రౌత్‌  స్పెషల్‌ సెక్రటరీకి మాటకి మాట సమాధానం చెబితే ఆయన వారం రోజులు సెలవు మీద వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని అందరూ విచిత్రంగా చెప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఆఫీసు మొత్తానికి హీరో అయిపోయాడు. ప్యూన్‌ నుంచి ఆఫీసర్ల వరకూ అందరూ అతన్ని గౌరవించటం మొదలుపెట్టారు. ఏదయినా పని మీద వేరే డిపార్టుమెంటులోకి అడుగుపెడితే వాళ్లంతా లేచి నిలబడి స్వాగతం చెప్పటం మొదలుపెట్టారు.ఇదంతా రామేశ్వర్‌ అందించిన టైగర్‌ జాకెట్‌ మహిమ అని గుర్తించాడు  నిమ్మయ్‌. వారం రోజుల తర్వాత సెలవు నుంచి తిరిగొచ్చిన స్పెషల్‌ సెక్రటరీ నిమ్మయ్‌ని  పిలిపించాడు. తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు కోరటమే కాదు. బీపీ కారణంగా తను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయేవాడినని, నిమ్మయ్‌ ఇదంతా మరచిపోవాలని ప్రాధేయపడ్డాడు.

    బయట, మార్కెట్లో కూడా నిమ్మయ్‌కి సరికొత్త అనుభవాలు  ఎదురయ్యాయి. ఆ ఊళ్లోనే పెద్ద గూండాగా, అందరినీ చందాలు ఇవ్వమని పీక్కుతినే వాడుగా పేరున్న యువ సంఘ సెక్రటరీ అతని దగ్గరకు వచ్చి వినయంగా చేతులు జోడించి, ‘ఈ ఏడాది చందాలు వసూళ్లను నిలిపివేయమని డీజీపీ చెప్పారు. దసరా సంబరాలకు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేకపోతే లేదు’ అంటూ వెళ్లిపోయాడు.నిమ్మయ్‌ జీవితం పూర్తిగా పరివర్తన చెందింది.ఇప్పుడతను పెద్ద నాయకుడయిపోయాడు. ఊళ్లో ఏ చిన్న పని కావాలన్నా నిమ్మయ్‌ని కలిస్తే చాలు అన్న అభిప్రాయం బలపడిపోయింది. కాలనీ యువకులంతా అతని ప్రభావంలో పడిపోయారు. పూజ కమిటీ అతన్ని నాయకునిగా ఎంచుకోవాలని నిర్ణయించింది. రామేశ్వర్‌ని కలిసి అప్పటికి మూడు నెలలు గడిచాయి. పని పూర్తి కాగానే జాకెట్‌ను తిరిగి ఇవ్వమని అతను చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అతనికి దాన్ని ఇచ్చేయాలనే అనిపించింది. వెంటనే కొన్ని స్వీట్లు కొని, జాకెట్‌ ధరించి రామేశ్వర్‌ ఇంటికి వెళ్లాడు.  

    అది పౌర్ణమి రాత్రి. చందమామ వెలుగు ముందు వీధి దీపాలు వెలవెలపోతున్నాయి. వాన కురిసి వెలిసింది. భాద్రపద మాసపు గాలులు చల్లగా వీస్తున్నాయి. ‘నేనెక్కడికీ పోవటం లేదు. ఈ జాకెట్‌ను ఇంకో నెలా రెండు నెలలు ఉంచుకో’ రామేశ్వర్‌ సలహా ఇచ్చాడు. ‘ఈ జాకెట్‌ లేకపోయినా ధైర్యంగా ఉండగలనని నువ్వు భావించినప్పుడు దాని తిరిగి ఇవ్వు’‘నేను మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. అడగొచ్చా?’‘దానిదేం ఉంది. అడుగు. నాకు తెలిస్తే సమాధానం చెబుతాను’ ‘నిజంగా ఇది పులి జాకెట్టేనా?’‘అవును. ఎందుకంత సందేహం?’ రామేశ్వర్‌ నవ్వుతూ అడిగాడు. ఆ తర్వాత ‘మాది బిహార్‌. మా తండ్రి చనిపోయేనాటికి నాకు రెండేళ్లు’ తన కథ చెప్పటం ప్రారంభించాడు. ‘అప్పట్లో మా తండ్రి లాల్‌గఢ్‌ జమీందారు దగ్గర పని చేసేవాడు. 

    ఆ జమీందారు అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రైతులకు అప్పులిచ్చి వాళ్లు సకాలంలో చెల్లించకపోతే వాళ్లను వేధించేవాడు. అలాగే వాళ్ల కూతుళ్లను, కోడళ్లను, భార్యలను ఇలా ఆడవాళ్లందరినీ లైంగికంగా లొంగతీసుకునేవాడు. నిమ్మయ్‌ చెవులు రిక్కించి వింటున్నాడు. ‘ఒకసారి ఎందుకో ఆ జమీందారుకు మా నాన్నపైన కోపం వచ్చిందట. దానితో పులికి ఆహారంగా వేయమని ఆదేశాలిచ్చాడట. రెండు రోజులపాటు పులికి ఎలాంటి ఆహారం పెట్టలేదు. ఒక పంజరంలో నుంచి మా నాన్నను, ఇంకో పంజరంలో నుంచి మేకను ఒకేసారి పులి ఉన్న ప్రదేశంలోకి వదిలారు. పులి ఇద్దరినీ తింటుందా? ఒక్క మా నాన్ననేనా అనేది ఆసక్తిగా చూశారు.

    అయితే అక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది.పులి మేకను ఆహారంగా చేసుకుని మా నాన్నను వదిలేసిందట. అప్పటికే చిగురుటాకులా వణికిపోతూ బిక్కచచ్చిపోయిన మా నాన్న దగ్గరకు వచ్చి మేకరక్తంతో తడిసిన తన పంజాను మా నాన్న జాకెట్‌కు తాకించింది. ఆ జాకెట్‌ మరేదో కాదు. ఇప్పుడు నువ్వు వేసుకున్నదే! ఆ తర్వాత జమీందారు మనుషులు మా నాన్నను వదిలి పెట్టారు. కాని, ఆయన ఇంటికి తిరిగి రాలేదు. 

    అడవుల్లోకి వెళ్లిపోయి సాధువుగా మారాడని కొందరు, పిచ్చి పట్టిందని కొందరు, చనిపోయాడని మరి కొందరు చెప్పుకున్నారు గాని, ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన ధరించిన జాకెట్‌ మాత్రం మా ఇంటికి చేరింది. తర్వాత మేం ఆ గ్రామం విడిచి వచ్చేశాం. ఈ జాకెట్‌ను నాకందిస్తూ మా అమ్మ ఈ కథ అంతా నాకు చెప్పింది.‘అప్పుడు ఏమైంది?’ ఆసక్తిగా అడిగాడు నిమ్మయ్‌.‘నేను ఆ జాకెట్‌ను ధరించినప్పుడల్లా నాలోకి కొత్త శక్తి ప్రవేశించేది. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి.

    నీకు కూడా అనుభవం అవుతోంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు,‘అంతే కాకుండా ఈ జాకెట్‌కి అతీంద్రయ శక్తులు ఉన్న మాట నిజం. కానీ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా? దాన్ని నిందించావంటే దాని శక్తి హరించుకుపోతుంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా వినియోగించుకో. పనయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వు’ అని ముగించాడు రామేశ్వర్‌.

    సరికొత్త జీవనోత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చాడు నిమ్మయ్‌. ఆ రోజు నుంచి సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం భార్యా, పిల్లలతో గడుపుతున్నాడు. కాలనీలోనూ, ఆఫీసులోనూ అందరికీ ఇష్టుడయ్యాడు. అలా రోజులు గడుస్తున్నాయి.అంతలో మునిసిపల్‌ ఎన్నికల ప్రకటన విడుదలయ్యింది.ఆ రోజు ఆదివారం. ఉదయం టీ తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు నిమ్మయ్‌. అంతలోనే ఓ పదిమంది యువకులు కార్లు దిగి గబగబా గేటు తోసుకుని లోపలకు వచ్చారు.

    వాళ్లు కూర్చోవటానికి కూడా ఆ ఇంట్లో తగినన్ని కుర్చీలు లేవు. ఇంటి ప్రాంగణంలోనే పెద్ద జామచెట్టు ఉంది. దానికి చుట్టూతా చప్టా చేసి ఉంది. వాళ్లను అక్కడే కూర్చోమని చెప్పాడు. ‘నిమ్మయ్‌ భాయ్‌. మేం మీ సమయం ఎక్కువ తీసుకోం. రాజు భాయ్‌ ఓ విషయం చెప్పి రమ్మని మమ్మల్ని పంపారు’ బ్లూ జీన్స్, తెల్ల చొక్కా ధరించి ఉన్న వ్యక్తి మాట్లాడటం ప్రారంభించాడు. ‘వచ్చే మునిసిపల్‌ ఎన్నికల్లో నువ్వే మా పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి దిగాలి. ఈ పరగణాలో నీలాంటి సమర్థుడు మరొకడు లేడు. అందుకే నిన్ను ఎంపిక చేశాం. 

    నువ్వు కాదనుకూడదు. ఇదిగో నా కార్డు. నువ్వు ఎప్పుడు ఫోన్‌ చేస్తే అప్పుడు వచ్చి నిన్ను పార్టీ అధ్యక్షుని దగ్గరకు తీసికెళతాను’అతనికి ఎలా సమాధానం చెప్పాలో నిమ్మయ్‌కి అర్థం కాలేదు. ఆలోచనలో పడ్డాడు. తను ఓ పేద కుటుంబంలో పుట్టాడు. సాధారణమైన క్లర్క్‌గా జీవిస్తున్నాడు. తన నెలజీతం రూ.40వేలు కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని కోతలు పోను తన చేతికి వచ్చేది కేవలం రూ.26 వేలు మాత్రమే. గ్రామంలో తనకి భూమిలాంటి ఆస్తిపాస్తులేం లేవు. మొత్తం కుటుంబం– ఆఖరికి మంచం పట్టిన తండ్రితో సహా అందరూ తన నెలజీతంపైనే  ఆధారపడి ఉన్నారు. తనలాంటి వాడికి రాజకీయాలు అవసరమా?  అనిపించింది.

    ‘నాకు ఆలోచించుకోవటానికి కొంత సమయం ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపేశాడు. ఈ రాజకీయాలు తనకు నప్పేవి కాదనిపించింది. అంతలోనే రామేశ్వర్‌ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. జాకెట్‌ను కనుక దుర్భాషలాడితే శక్తులు మొత్తం నశిస్తాయి. ఇప్పటి వరకూ జరిగింది చాలు. ఈ జాకెట్‌ను తిరిగిచ్చే సమయం వచ్చేసింది అనుకున్నాడు. ఒంటి పైన టీషర్టు ధరించి స్కూటర్‌ బయటకు తీశాడు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆలోచనలన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి.రామేశ్వర్‌ సమావేశంలో కృపాసాగర్‌ పైన తిరగబడటం, ‘నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావని నిందించటం, తన రోజువారీ జీవితం హీనంగా సాగటం, తనకు రామేశ్వర్‌ పరిచయం కావటం, చివరకు టైగర్‌ జాకెట్‌తో తన జీవితం మొత్తం మారిపోవటం అంతా అద్భుతంగా అనిపించింది.మనసు అంతరాంతరాల్లో రామేశ్వర్‌ పట్ల అభిమానం, కృతజ్ఞత పెల్లుబికింది. ఓ రకంగా అతను తనకు అకస్మాత్తుగా తారసపడిన గురువుగా అనిపించాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ జాకెట్‌ తిరిగిచ్చే సమయం వచ్చేసింది.

    రామేశ్వర్‌ ఇంటి ముందు జనం గుంపుగా కనిపించారు. నిమ్మయ్‌ స్కూటర్‌ ఆపి అక్కడున్న వ్యక్తిని పలకరించే ప్రయత్నం చేశాడు. అతను వినిపించుకోనట్టు అక్కడి నుంచి కదిలిపోయాడు. నిమ్మయ్‌ స్కూటర్‌ను పక్కన నిలిపివేసి, హడావుడిగా రామేశ్వర్‌ ఇంట్లోకి పరుగుపెట్టాడు.వరండాలో రామేశ్వర్‌ భార్య ఏడుస్తూ కనిపించింది. ఆమె ఎదురుగా నేల మీద నిర్జీవంగా రామేశ్వర్‌ శరీరం. తెల్లటి దుప్పట్లో చుట్టి ఉంది. నిమ్మయ్‌ నిర్ఘాంతపోయాడు. మౌనంలోకి జారిపోయాడు. ‘ఇప్పుడు తను ఆ జాకెట్‌ను ఎవరికి అందించాలి?’ మనసులో గుంజాటన మొదలయ్యింది.     

    ∙ఒడియా మూలం: గౌరహరి దాస్‌
    ∙అనువాదం: డాక్టర్‌ పార్థసారథి చిరువోలు 

  • ఎలాంటి నిఘా హెచ్చరికలు లేవు, ఎలాంటి అనుమానాస్పద ఉదంతాలు జరగలేదు; పోలీసు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రయత్నించలేదు. అయినా 2004 ఆగస్టులో భారీ కుట్రను సిటీ టాస్క్‌ఫోర్స్‌ భగ్నం చేయగలిగింది. సికింద్రాబాద్‌లోని గణేశ్‌ దేవాలయం పేల్చివేతతో పాటు నగరాన్ని సందర్శిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌ టూరిస్టుల హత్యకు ఉగ్రవాదులు పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. ఓ వాహనచోరుడి వద్ద యాదృచ్ఛికంగా లభించిన చిన్న కాగితం ఈ పెద్ద కుట్రను బట్టబయలు చేసింది.

    నగర టాస్క్‌ఫోర్స్‌ విభాగం నిత్యం అసాంఘికశక్తులపై నిఘా ఉంచి, నేరగాళ్లను పట్టుకోవడానికి పని చేస్తుంటుంది. భారీ నేరాల కోసమే కాదు, కొన్ని సందర్భాల్లో చిన్నా చితకా కేసుల కోసమూ ఈ టీమ్స్‌ పరుగులు పెడుతుంటాయి. 2004 ఆగస్టులో సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు– అది నెలలో ఆఖరి వారం కావటంతో ఏదో ఒక ముఠా లేదా నేరగాడిని పట్టుకుని ఉన్నతాధికారులకు చూపించడానికి కసరత్తులు చేస్తున్నారు. అప్పుడే ఓ వేగు ద్వారా అందిన చిన్న సమాచారం అధికారుల్లో కోటి ఆశలు రేపింది. ఓ వాహనచోరుడి సంబంధించిన ఆ సమాచారం ఆధారంగా టీమ్‌ వర్కౌట్‌ చేయడం మొదలెట్టింది. 

    నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్‌లోని హఫీజ్‌బాబానగర్‌లో మెకానిక్‌గా స్థిరపడిన సయ్యద్‌ అబ్దుల్‌ ఖదీర్‌కు పలు వాహన చోరీలతో ప్రమేయం ఉందన్నది ఆ వేగు అందించిన సమాచారం. దీంతో టాస్క్‌ఫోర్స్‌ అతడి కోసం ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకుంది. అప్పటి వరకు తాను చేసిన వాహనచోరీలను అతడు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేయాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ తతంగంలో భాగంగా చోరీ వాహనాలతో పాటు నిందితుడి వద్ద లభించిన వస్తువులను సీజ్‌ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఖదీర్‌ను తనిఖీ చేసిన అధికారులు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. అన్నీ మామూలుగానే ఉన్నా, ఓ చిన్న స్లిప్‌లోని వివరాలు మాత్రం అనుమానాస్పదంగా కనిపించాయి. 

    అతడి వద్ద లభించిన స్లిప్‌లో కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన నంబర్లు ఉండటమే పోలీసుల అనుమానానికి కారణం. దీంతో లోతుగా విచారించగా, అతడి స్నేహితుడైన ఒమర్‌ ఫారూఖ్‌ షరీఫ్‌ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్‌హౌస్‌లకు చెందిన అబ్దుల్‌ అజీజ్‌ అలియాస్‌ గిడ్డా అజీజ్‌ పేర్లు వెలుగులోకి రావడంతో పాటు వారిద్దరూ బండ్లగూడలోని గౌస్‌నగర్‌లో ఓ ఇంట్లో డెన్‌ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. తాను చోరీ చేసిన వాహనాల్లో కొన్ని వారికి ఇచ్చానని, ఆ నంబర్లు వారికి సంబంధించినవే అని అంగీకరించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో విషయం ‘పెద్దదని’ అనుమానించిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు హుటాహుటిన గౌస్‌నగర్‌లోని డెన్‌పై దాడి చేశాయి. 

    అక్కడ ఫారూఖ్‌ చిక్కగా, అజీజ్‌ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్‌ ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్ధారించుకున్నారు. ఖదీర్, ఫారూఖ్‌లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. సిటీలో ఘర్షణలు రెచ్చగొట్టాలని పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ పథకం వేసినట్లు బయటపడింది. గణేశ్‌ నిమజ్జనం రోజు సికింద్రాబాద్‌లోని గణేశ్‌ దేవాలయం పేల్చివేతకు కుట్ర పన్నినట్లు బయటపడింది. 

    దీనికోసం ‘లష్కరే తోయిబా’ నగరానికి చెందిన తెహరీక్‌ తెహఫూజ్‌ షరియా ఓ ఇస్లామీ (టీటీఎస్‌ఐ) నేత మౌలానా నసీరుద్దీన్‌ (2020లో చనిపోయాడు), గులాం యజ్దానీలతో (2006లో ఢిల్లీ ఎన్‌కౌంటర్‌లో హతుడయ్యాడు) పాటు మరో 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. వినాయక నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్‌కు చెందిన కొందరు ఇతర మతస్థులుగా వేషం వేసుకుని గణేశ్‌ దేవాలయంలోకి ప్రవేశించి బాంబు పెట్టాలని పథకం సిద్ధం చేసుకున్నారు. గులాం యజ్దానీ ఆదేశాల మేరకు ఈ పేలుడు హడావుడి సద్దుమణగక ముందే సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌ టూరిస్టులనూ చంపాలని భావించారు. 

    అందుకు అవసరమైన పేలుడు పదార్ధాలు, వాహనాలు సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుస దాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కొందరు నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ కేసు తొలుత నగర నేర పరిశోధన విభాగంలో నమోదైంది. దీనికి సంబంధించి అప్పట్లో టాస్క్‌ఫోర్స్‌ విభాగం అత్యంత వివాదాస్పదమైంది. అమాయకులను కేసుల్లో ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీసిన సీఐడీ పోలీసులు అరెస్టుల్లో ఎలాంటి కుట్ర లేదని తేల్చారు. ఆపై కేసు సీఐడీకే బదిలీ అయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో తుది విచారణలో ఉంది. భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్‌ తండ్రి మెహతబ్‌ అలీ హెడ్‌–కానిస్టేబుల్‌గా పని చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి గిడ్డా అజీజ్‌ తృటిలో తప్పించుకున్నాడు. 

    అప్పటికే తన వద్ద ఉన్న బోస్నియా పాస్‌పోర్ట్‌ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్‌ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్‌ పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్‌ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్‌కు బలవంతంగా తిప్పి పంపించారు. 2001 నాటి విధ్వంసాల కుట్ర కేసులో అజీజ్‌కు 2022లో పదహారేళ్ల శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు.  

National

  • అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయినవారిని పోగొట్టుకున్నవారి ఆవేదన వర్ణనాతీతం. అయితే ఈ ప్రమాదాన్ని తొలుత ఎవరు చూశారు? ఎలా స్పందించారు?.. అనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు.

    108 అంబులెన్స్ డ్రైవర్ సతీందర్ సింగ్ సంధు మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ మెస్‌లో భోజనం చేస్తుండగా, అతనికి భారీ పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే క్యాంపస్‌లోని హాస్టళ్లవైపు దృష్టి సారించి, హడలెత్తిపోయాడు. దట్టమైన నల్లటి పొగ  కమ్ముకోవడాన్ని గమనించాడు.  ఆ ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, విమానం కూలిపోయి మంటల్లో దగ్ధమవడాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమై, అంబులెన్స్ సర్వీస్ మేనేజర్ జితేంద్ర షాహికి ఫోన్‌ చేశాడు. ‘ఇక్కడ విమాన ప్రమాదం జరిగినట్లుంది. అగ్నిమాపక దళాన్ని వెంటనే పంపండి’ అని కోరాడు.

    ప్రమాద స్థలంలో తీవ్రంగా కాలిపోయిన భద్రతా సిబ్బందిని సంధు తొలుత చూశాడు. అలాగే విమాన ప్రమాదం  నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి (విశ్వాస్ కుమార్ రమేష్)ని కూడా చూశాడు.. రమేష్‌ అదే విమానంలో ఉన్న తన బంధువును కాపాడేందుకు ప్రయత్నించడాన్ని కూడా తాను చూశానని సంధు మీడియాకు తెలిపారు. తరువాత అతనిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.46 గంటలకు ఐదు 108 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయని, తొలుత తాము హాస్టల్ నుండి బయటకు వస్తున్న  20 మంది బాధితులను  ఆస్పత్రులకు తరలించామని షాహి తెలిపారు.

    ఇది కూడా చదవండి: ఇరాన్‌ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్‌ చిత్రాలలో.. 

Sports

  • సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్ష‌ణ ముగిసింది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2023-25 విజేత‌గా నిలిచిన ద‌క్షిణాఫ్రికా.. 27 ఏళ్ల త‌ర్వాత రెండో ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన సఫారీలు.. టెస్టు ఛాంపియన్‌షిప్‌ గదను సొంతం చేసుకుకున్నారు.

    ఆసీస్ నిర్ధేశించిన 282 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్రోటీస్ 5 వికెట్ల కోల్పోయి చేధించింది. మ్యాన్ ఆప్‌ది మ్యాచ్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌(136) సౌతాఫ్రికా చారిత్ర‌క విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అత‌డితో పాటు బావుమా(66) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా బౌల‌ర్లు కూడా రెండు ఇన్నింగ్స్‌లలో అద్బుతంగా రాణించారు.

    కగిసో ర‌బాడ ఓవ‌రాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి 9 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెస‌న్ నాలుగు వికెట్లు సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టెంబా బావుమా స్పందించాడు. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని బావుమా తెలిపాడు.

    "ఈ విజయం మాకు చాలా ప్రత్యేకం. ముందుగా మాకు ఇక్కడ సపోర్ట్‌గా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి మద్దతు నాకు దక్షిణాఫ్రికాలో ఆడుతున్న అనుభూతిని కలిగించింది. ఈ క్షణం కోసమే మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము. అందుకోసం చాలా కష్టపడ్డాము. మా కంటూ ఒక రోజు వస్తుందని అని నమ్మకంతో ముందుకు సాగాము.

    కానీ అదే సమయంలో చాలా సందేహాలు కూడా ఉండేవి. కానీ వాటన్నంటిని ఈ రోజు మేము జయించాము. ఒక జట్టుగా మాకు ఇది గర్వించదగ్గ విజయం. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ప్రయత్నిస్తున్నాము. సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌లో ఓడిపోయి హృదయ వేదన అనుభవించాము. కానీ ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయలేదు. 

    అదే ఎనర్జీ, అదే పోరాట పటిమతో మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఎట్టకేలకు మా లక్ష్యాన్ని చేరుకున్నాము. కగిసో రబాడ ఇక అద్బుతమైన ఆటగాడు. రెండు రోజుల క్రితం నేను ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్‌కు వెళ్లాను. రాబోయే కాలంలో రబాడ కచ్చితంగా ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంటాడని భావిస్తున్నాను.

    అతడు ఈ మ్యాచ్‌కు ముందు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికి ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఛాంపియన్ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు మార్‌క్రమ్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే. మార్‌క్రమ్‌ టెస్టు జట్టులో ఎందుకు అని చాలా మంది ప్రశ్నించారు. వారిందరికి మార్‌క్రమ్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

    రెండో ఇన్నింగ్స్‌లో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాము. ఆ బాధ్యతను మార్‌క్రమ్ తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇటువంటి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. మా దేశ ప్రజలు కూడా మా సెలబ్రేషన్స్‌లో భాగం అవుతారని భావిస్తున్నాను" అని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బావుమా పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో టెంబా బావుమా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. సౌతాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్ అందిచిన కెప్టెన్‌గా బావుమా చరిత్ర పుటలెక్కాడు.
    చదవండి: WTC Final 2025: ఛాంపియ‌న్ ద‌క్షిణాఫ్రికాకు ప్రైజ్‌మ‌నీ ఎన్ని కోట్లంటే?

Annamayya

  • చెరువుకు చెర

    టాక్స్‌ఫోర్స్‌: సాగుకు, పట్టణ ప్రజలకు పర్యాటక ప్రాంతంగా ఉన్న చెరువులను అక్రమార్కులు చెరపడుతున్నారు. రాయచోటి పట్టణ సమీపంలోని ఇనాయత్‌ ఖాన్‌ చెరువు ఆక్రమణకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమీప బంధువులు సిద్ధమయ్యారు. మట్టి, ఇసుక మాఫియా, రియల్టర్ల దెబ్బకు చెరువులే మాయమవుతున్నాయి. పట్టణ పరిధిలో ఉన్న రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఈ చెరువు ఉంది. అధికారమే అండగా, సంపాదనే ధ్యేయంగా ప్రకృతి వనరులను దోచుకుతింటున్న కూటమి నాయకులు నేడు కోట్ల రూపాయలు విలువచేసే ఈ చెరువు ఆక్రమణకు సిద్ధమయ్యారు. చెరువు ఎగువ భాగాన సర్వే నంబరు. 509/2లో మిలటరీ పట్టా పేరుతో 2.5 ఎకరాల భూమిని ఆక్రమించగా సమీపంలోనే ఉన్న మరికొంత భూమిని చదును చేస్తున్నారు. ఇందుకోసం టిప్పర్లతో మట్టిని తోలారు. ఇప్పటికే చెరువులోకి పైభాగం నుంచి వచ్చే వాగులను ఆక్రమించి సిమెంటు కాంక్రిట్లతో అడ్డుకట్టలు వేసి ప్లాట్‌లు వేసి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి.

    ● రాయచోటి పట్టణం రింగ్‌ రోడ్డు పరిధిలోని పెమ్మాడపల్లి మార్గంలో ఉన్న ఇనాయత్‌ ఖాన్‌ చెరువు పట్టణానికి ఎగువ భాగంలో ఉన్న కంచాలమ్మ గండి చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ నాయకులు వీటిని ఆక్రమించేందుకు సిద్ధపడటంపై స్థానికులు మండిపడుతున్నారు.

    రికార్డులు మాయం

    రాయచోటి తహసీల్దార్‌ కార్యాలయంలో డీకేటీ, మిలటరీ పట్టాలకు సంబంధించిన ప్రధాన రికార్డులు మాయమైనట్లు సమాచారం. రాయచోటి పట్టణం చుట్టూ కోట్ల రూపాయలు విలువచేసే భూములను ఆక్రమించి వాటికి నకిలీ డికేటీ పట్టాలు, నకిలీ మిల్ట్రీ పట్టాలను సృష్టించి దర్జాగా ఆక్రమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పట్టాల విషయంపై స్థానిక మీడియా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులను గతంలో పలుమార్లు ప్రశ్నించిన సందర్భంలో పట్టాలిచ్చిన రికార్డులు కనిపించడం లేదన్న సమాధానాలు ఇచ్చారు.

    మిలటరీ పట్టా పేరుతో ఆక్రమణకు పాల్పడుతున్న మంత్రి బంధువులు

    పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలు

  • కూచిపూడిలో ప్రతిభ

    రాయచోటి జగదాంబసెంటర్‌: కూచిపూడి నృత్య ప్రదర్శనలో రాయచోటికి చెందిన హేమశ్రీ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించారు. 2023 డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో జరిగిన నృత్య ప్రదర్శనలో హేమశ్రీ విశేష ప్రతిభ కనబరిచారు. ఈనెల 13న హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్ట్‌కు సంబంధించిన ప్రశంసాపత్రం అందుకున్నారు. దళిత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కోలాప్రసాద్‌, జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆదిలు హేమశ్రీకి ప్రశంసాపత్రం అందజేశారు. హేమశ్రీకి పలువురు రాయచోటి అభినందనలు తెలిపారు.

    జులై 14 నుంచి బీఈడీ,

    ఎంఈడీ సెమిస్టర్‌ పరీక్షలు

    కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కళాశాలల విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షలు జూలై 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఈడీ 2వ సెమిస్టర్‌, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ విద్యార్థులకు, అలాగే ఎంఈడీ రెండు, నాలుగు సెమిస్టర్ల సప్లిమెంటరీ, రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి జరగాల్సిన బీఈడీ, ఎంఈడీ పరీక్షలను డీఎస్సీ (ఉపాధ్యాయ ఉద్యోగ నియామకపు పరీక్ష) రాసే విద్యార్థుల అభ్యర్థన దృష్ట్యా, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలై 14వ తేదీకి వాయిదా వేశామన్నారు. రీషెడ్యూల్‌ అయిన తేదీల టైం టేబుల్‌ విద్యార్థులు చదువుతున్న కళాశాల నుంచి పొందాలని సూచించారు.

  • గిట్ట

    ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, అధికారులు స్పందించి మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించడంపై రైతులతో సంప్రదించాలి. పంటకు తగ్గట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలి. మామిడి జ్యూస్‌ ఫ్యాక్టరీ యజమానులతో ప్రభుత్వం సంప్రదింపులు చేసి నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి. – బి.వెంకటరమణ,

    రైతు, కొండమూల, చిన్నమండెం

    రైతుసంక్షేమం పట్టని ప్రభుత్వం

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమంపై శ్రద్ధ చూపడం లేదు. ఖరీఫ్‌ సాగుకు అవసరమైన విత్తనాల పంపిణీలో, సాగుకు అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడంతో విఫలమైంది. మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక పెట్టిన పెట్టుబడులు రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తెలియని స్థితిలో ఉన్నారు.ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – రెడ్డప్పరెడ్డి, నేరెళ్లవంక,

    రాయచోటి, మామిడి రైతు

  • – జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్‌

    రాజంపేట రూరల్‌ : జిల్లా పరిధిలోని గొర్రెలకు నీలి నాలుక బ్లూ టంగ్‌ వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందించనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ గుణశేఖర్‌ తెలియజేశారు. మండల పరిధిలోని హెచ్‌ చెర్లోపల్లి గొల్లపల్లి గ్రామంలో శనివారం గొర్రెలకు నీలి నాలుక (బ్లూ టంగ్‌) వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందజేశారు డాక్టర్‌ గుణశేఖర్‌ గొర్రెల యజమానులకు నీలి నాలుక వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. అలాగే టీకాల ఆవశ్యకతను, తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో రాజంపేట ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్‌ ప్రతాప్‌, హెచ్‌ చెర్లోపల్లి పశువైధ్యాకారి డాక్టర్‌ కే.భాగ్యావతి, జూనియర్‌ వెటర్నటీ అధికారి ఎం.వరదయ్య, గోపాల మిత్రలు ఎం.బాస్కర్‌, సీ.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

    బైక్‌ ప్రమాదంలో బొగ్గు కూలీ మృతి

    మదనపల్లె రూరల్‌ : జీవనోపాధి కోసం నెల్లూరు జిల్లా నుంచి వలస వచ్చి బైక్‌లో వెళుతూ ప్రమాదంలో బొగ్గుకూలీ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో జరిగింది. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన ఎం.అంకయ్య(30) తన భార్య ప్రశాంతి, కుటుంబంతో సహా ఉపాధి నిమిత్తం కలకడ సమీపంలోని మల్లిగుట్టపల్లెకు వచ్చి రెండేళ్లుగా ఉంటున్నాడు. స్థానికంగా కలప కాల్చి బొగ్గు తయారీ కూలిగా పనిచేస్తున్నాడు. 11వతేదీ బుధవారం కలప కోసేందుకు వినియోగించే యంత్రం మరమ్మతుకు గురికావడంతో రిపేరీ చేసుకునేందుకు గుర్రంకొండకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తూ వాహనం అదుపుతప్పి మార్గమధ్యంలో రోడ్డుపక్కన ఉన్న బోర్డును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్సలు చేయడంతో కోలుకుని ఇంటికి వెళ్లాడు. గురువారం ఒంట్లో నలతగా ఉంటే మదనపల్లెకు వచ్చి ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. ప్రమాదం లేదని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే శరీరంలోని లోపలి గాయాలు తిరగబెట్టడంతో శనివారం తీవ్రంగా కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన మదనపల్లెలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సొసైటీకాలనీలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు తిరుపతికి తీసుకెళ్లాలని రెఫర్‌ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 108 అంబులెన్స్‌ ఉచితంగా అందుబాటులో ఉంటుందని సూచించడంతో, అంకయ్యను శనివారం సాయంత్రం తీసుకువచ్చారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించినా అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. అంబులెన్స్‌లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగానే అంకయ్య మృతి చెందాడు. కాగా మృతునికి ముగ్గురు కుమార్తెలు పవిత్ర, కళావతి, గౌతమి ఉన్నారు.

  • ఆరుగురు పగటి దొంగలు అరెస్ట్‌

    మదనపల్లె రూరల్‌ : తాళం వేసిన ఇళ్లను గుర్తించి, పగటిపూట దొంగతనాలకు పాల్పడే ఆరుగురు దొంగలను అరెస్ట్‌ చేసి, సుమారు రూ.20 లక్షల విలువచేసే నగలు, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. శనివారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ముదివేడు, మదనపల్లె వన్‌,టూ, తాలూకా పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన ఆరు కేసులకు సంబంధించి నిందితులను అరెస్ట్‌ చూపారు. మదనపల్లె తాలూకా సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌తో కలిసి డీఎస్పీ చోరీలకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ మందబండకు చెంది ప్రస్తుతం కొండామర్రిపల్లె టీఎన్‌ఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న షేక్‌ మౌలాలి అలియాస్‌ బాబు(52), కర్ణాటక చింతామణి తాలూకా జోగులగడ్డ బూరగమాకులపల్లెకు చెందిన కేఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌ కం కండక్టర్‌ ఎన్‌.శంకర(48), కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె పంచాయతీ గౌనువారిపల్లెకు చెందిన పాలెం నరసింహులు(45), మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ పాకాలవారిపల్లెకు చెందిన వరగాని నవీన్‌కుమార్‌(30), కురబలకోట మండలం తెట్టు పంచాయతీ, చింతమాకులపల్లెకు చెందిన అనంత విశ్వనాథరెడ్డి(65), చిత్తూరుజిల్లా గంగవరం మండలం మడుగూరుకు చెందిన నీరుగట్టి రమేష్‌(44)..ఆరుగురు ఓ టీ హోటల్‌లో కలుసుకున్నారు. డబ్బులు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ముదివేడు, మదనపల్లె పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పగటిపూట ద్విచక్రవాహనాలపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. కాసేపు అక్కడే రెక్కి నిర్వహించారు. ఎవరూ గమనించడం లేదని తెలుసుకుని ఇద్దరు తాళాలు పగలగొట్టి లోనికి వెళితే ఇద్దరు ఇంటి వద్ద, మిగిలిన ఇద్దరు వీధి ప్రారంభంలో కాపలా కాసేవారు. దొంగతనం పూర్తిచేసుకుని బయటకు వచ్చాక దర్జాగా ద్విచక్రవాహనాల్లో అక్కడ నుంచి వెళ్లిపోయేవారు. దొంగతనం చేసిన నగలు, వస్తువులను కర్ణాటకలోని చింతామణిలో విక్రయించి, వచ్చిన సొమ్ములతో విలాసాలకు ఖర్చుచేయడం, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వెళ్లడం చేసేవారు.

    సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా..

    దొంగతనాలకు సంబంధించి ముదివేడు, మదనపల్లె పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా లభించిన వేలిముద్రలు, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నేరస్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు..శనివారం ఉదయం 7 గంటల సమయంలో కురబలకోట మండలం చేనేతనగర్‌ బస్‌స్టాప్‌ వద్దకు చేరుకోగా, అప్పటికే అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్న ఆరుగురు మగ వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని విచారించగా చేసిన దొంగతనాలను అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి సుమారు 150 గ్రాముల బంగారు నగలు, 762 గ్రాముల వెండివస్తువులు, రూ.5,28వేల రూపాయల నగదుతో పాటుగా నేరానికి ఉపయోగించిన రెండు ఇనుపరాడ్లు, ఒక స్క్రూడ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆరుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. నిందితుల్లో ఏ1 అయినటువంటి షేక్‌ మౌలాలిపై బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో రెండు ఎర్రచందనం కేసులు, ఏ4 వరగాని నవీన్‌కుమార్‌పై తాలూకా పోలీస్‌స్టేషన్‌లో అనుమతి లేకుండా ట్రాక్టర్‌లో ఇసుక తరలింపు, ఏ5 అనంత విశ్వనాథరెడ్డిపై ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో లిక్కర్‌ కేసు ఉందన్నారు. ఏ2 అయినటువంటి ఎస్‌.శంకర, కేఎస్‌ఆర్టీసీలో డ్రైవర్‌ కం కండక్టర్‌గా పనిచేస్తూ, అదనపు ఆదాయం కోసం దొంగతనాలను ఎంచుకున్నాడన్నారు. చోరీ చేసిన సొత్తును విక్రయించి నగదు చేయడంలో ముఠాలో కీలకంగా వ్యవహరించేవాడని తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనపరిచి ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ నరసింహులు, శంకర్‌, పీసీలు రాఘవరెడ్డి, శివ, శంకర, దొరబాబు, చలపతి, ముదివేడు పోలీసులు హరి, శ్రీనివాసులు, వెంకటేష్‌, కే.శ్రీనివాసులు, శాంతకుమార్‌, ప్రేమ్‌కుమార్‌, బ్రహ్మేష్‌, రాజేష్‌, రెడ్డిశేఖర్‌, సిద్ధేశ్వర్‌లను అభినందించారు.

    రూ.20లక్షల విలువచేసే నగలు, నగదు, వెండి స్వాధీనం

    నిందితుల్లో ఒకరు కేఎస్‌ఆర్టీసీ

    డ్రైవర్‌ కం కండక్టర్‌

    చోరీ వివరాలు వెల్లడించిన డీఎస్పీ మహేంద్ర

Bhadradri

  • మెడికోలుగా ఆటో డ్రైవర్‌ కుమార్తెలు

    ఇల్లెందు: ఇల్లెందు మండలం మసివాగు గ్రామానికి చెందిన కిన్నెర రమేష్‌ – రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆటో నడుపుతూ జీవనం సాగించే రమేష్‌.. కుమార్తెలు అంజలి, భవానీలను ఉన్నత విద్య చదివిస్తున్నాడు. ఇద్దరూ ఐదో తరగతి వరకు ముత్తారపు కట్ట ప్రాథమిక పాఠశాలలో, ఆ తర్వాత కిన్నెరసాని, సుదిమళ్ల గురుకులాల్లో చదవగా.. ఇంటర్‌ ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఉచిత సీటు సాధించారు. ప్రస్తుతం అంజలిని హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదివిస్తుండగా, భవాని ఫిజియోథెరపీ కోర్సులో ప్రథమ సంవత్సరంలో ఉంది. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కలలను సాకారం చేయడమే తమ లక్ష్యమని ఈ భావి డాక్టర్లు చెబుతున్నారు.

  • ‘ఖాకీ’లుగా పేద రైతు బిడ్డలు

    గుండాల : మండల కేంద్రానికి చెందిన గడ్డం మోహన్‌ ఓ సన్నకారు రైతు. కొద్దిపాటి వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివించాడు. కొడుకులు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసి, వారి కలలను సాకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు సాగర్‌ ఖమ్మలో ఏఆర్‌ ఎస్సైగా, చిన్న కుమారుడు సంపత్‌ కొత్తగూడెంలో స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా సాగర్‌, సంపత్‌ మాట్లాడుతూ తమ విజయం నాన్న మోహన్‌కే అంకితమని చెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నామని, సమాజ సేవలోనూ ముందుంటూ యువతకు ఆరద్శంగా నిలుస్తామని చెప్పారు.

  • తండ్రి కల సాకారం..

    ఇల్లెందురూరల్‌ : పంచాయతీ వర్కర్‌గా, వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఇద్దరు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు మండలంలోని నిజాంపేటకు చెందిన రావెళ్ల మోహన్‌రావు, జ్ఞాన దంపతులు. ఇద్దరూ నిరంతరం శ్రమిస్తూ కుమారుడు దయాకర్‌, కూతురు కరుణకుమారిని ఇంటర్‌ వరకు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదివించారు. ఆ తర్వాత ఇద్దరూ బీటెక్‌లో ఉచిత సీట్లు సాధించి ఉన్నత విద్యావంతులయ్యారు. ప్రస్తుతం దయాకర్‌ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా, కరుణకుమారి ఎంటెక్‌ పూర్తి చేసి ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ.. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా కష్టపడి చదివించానని, ఇప్పుడు ఇద్దరూ ప్రయోజకులు కావడం ఆనందంగా ఉందని అన్నారు.

  • తన కష్టం తనయుడికి రావొద్దని..

    పాల్వంచరూరల్‌ : తాను పడుతున్న కష్టాలు కుమారుడికి రావొద్దనే ఆశయంతో ట్రాలీ ఆటో నడుపుతూ జీవనం సాగించే ఓ తండ్రి కొడుకును లండన్‌లో ఎంఎస్‌ చదివిస్తున్నాడు. పాల్వంచ ఇందిరానగర్‌ కాలనీకి చెందిన మూడు లక్ష్మణ్‌ పగలూ, రాత్రి తేడా లేకుండా ఆటో నడుపుతూ కొడుకు నవీన్‌నాయక్‌ను చిన్నప్పటి నుంచి ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చదివించాడు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఇంటిని తాకట్టు పెట్టి ఉన్నత విద్య కోసం గతేడాది లండన్‌ పంపించాడు. ప్రస్తుతం నవీన్‌ లండన్‌లోని న్యూ క్యాజిల్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఉన్నత చదువు పూర్తిచేసి ఉద్యోగం సాధిస్తే తన కష్టానికి ఫలితం దక్కుతుందని అంటున్నాడు లక్ష్మణ్‌.

Bapatla

  • ఉరి వేసుకుని మహిళ మృతి

    వేటపాలెం: ఇంట్లో ఉరి వేసుకొని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రామన్నపేట పంచాయతీ బాపయ్యనగర్‌లో చోటు చేసుకుంది. డొక్కా శ్రావణి (40) అనే మహిళ ఆరు నెలలుగా అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఇంటి ఓనర్‌ అద్దె అడగడానికి శనివారం వెళ్లి చూడగా.. ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ జనార్దన్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

    మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి గాయాలు

    నాదెండ్ల: మద్యం తాగిన ఇరువురు యువకులు ఘర్షణకు దిగటంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గణపవరం గ్రామంలో నివాసం ఉండే ఇరువురు ఒడిశా యువకులు స్థానిక స్పిన్నింగ్‌ మిల్లులో రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటారు. శనివారం ఉదయం వారు షాపులో మద్యం తాగారు. మాటామాటా పెరగటంతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

  • యోగాత

    పిట్టలవానిపాలెం(కర్లపాలెం): యోగాసనాల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆరోగ్యంగా ఉండొచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి చెప్పారు. యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలలో భాగంగా శనివారం పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన యోగాసనాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. కేర్‌ న్యాచురోపతి వైద్య కళాశాల విద్యార్థులు నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పిట్టలవానిపాలెంలో అవగాహన ర్యాలీ నిర్వహించి సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్పారు. వికసిత్‌ భారత్‌ దిశగా కేంద్రం, స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముదుకు వెళుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నదని వాటి ఫలాలను ప్రజలు అందుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం యోగాతోనే సాధ్యమవుతుందని యోగాసనాల వలన కలిగే ప్రయోజనాలను ప్రజలు గుర్తించాలని కలెక్టర్‌ చెప్పారు.

    సూర్యలంకలో 10వేల మందితో యోగాంధ్ర

    ఈనెల 21న విశాఖపట్నంలో చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్ధాయిలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రధానమంత్రి హాజరవనున్నారని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో సూర్యలంక తీరంలో 10వేల మందితో జరిగే యోగాలో ప్రజలంతా పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయమ్మ, డ్వామా పీడీ జయలక్ష్మి, మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, పశు సంవర్థ శాఖ అధికారి వేణుగోపాల్‌రావు, ఎకై ్సజ్‌శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ వవెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ ఎలీషాబాబు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

    వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన బాపట్ల జిల్లా కలెక్టర్‌ వెంకటమురళి పిట్టలవానిపాలెంలో జిల్లా స్థాయి ‘యోగాంధ్ర’

  • చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో పాత నేరస్తుడి అరెస్టు

    నగరంపాలెం: ఒంటరిగా వెళ్లే వృద్ధ మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లే పాత నేరస్తుడ్ని గుంటూరు సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. అతని నుంచి రూ.30 లక్షలు ఖరీదైన 300 గ్రాముల నగలు, బైక్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలుల్‌లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి గత నెల 28 వరకు జిల్లాలో వరుస బంగారు గొలుసు చోరీలు జరిగాయని తెలిపారు. దీంతో సీసీఎస్‌ సీఐలు అనురాధ, అల్తాఫ్‌ హుస్సేన్‌, బి.శ్రీనివాస్‌తో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. గత ఆరు నెలలుగా సుమారు 700 నిఘా కెమెరాలను నిశితంగా పరిశీలించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో ఆనందపేట ఒకటో వీధిలో ఉంటున్న నలభై ఏళ్ల షేక్‌ అమీర్‌బేగ్‌ అలియాస్‌ జోహారీని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొ న్నారు. గతంలో జరిగిన ఎనిమిది బంగారు గొలుసు దొంగతనాలకు ఇతడే పాల్పడినట్లు విచారణలో గుర్తించామని వివరించారు. అమీర్‌ బేగ్‌ను అరెస్ట్‌ చేసి బంగారు నగలు, మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మరో రెండు బైక్‌లను గుర్తించాలని చెప్పా రు. కేసులను త్వరితగతిన ఛేదించిన ఏఎస్పీ క్రైం సుప్రజ, డీఎస్పీ శివాజీరాజు, సీఐలు, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, రివార్డులు అందించారు.

    15 రోజులకు ఒకసారి చోరీ

    పెయింటర్‌గా పనిచేసే అమీర్‌ బేగ్‌ ఒంటరి మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో మంచి నేర్పరి. 2006లో మూడు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నాడు. 2014లో పాత గుంటూరు పీఎస్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. అతనిపై 2016లో పాత గుంటూరు పీఎస్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. అప్పటికే సుమారు 22 కేసులు నమోదవ్వగా, ఇటీవల చేసిన ఎనిమిది కేసులతో 30 వరకు నమోదయ్యాయి. పదిహేను రోజులకు ఒకసారి రెక్కీ చేసేవాడని, అది కూడా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చేసేవాడని పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. బాపట్ల జిల్లా వెళ్లి అక్కడ తాళం అరిగిపోయిన బైక్‌లను దొంగలించి, ఇక్కడికి వచ్చేవాడని చెప్పారు. చోరీలు చేసిన తర్వాత ఎక్కడపడితే అక్కడే వాటిని వదిలేసి వెళ్లేవాడని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, సీసీఎస్‌ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు జె.అనురాధ, ఎండీ.ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం పీఎస్‌ సీఐ జి.వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ సరస్వతి, సిబ్బంది పాల్గొన్నారు.

    రూ.30 లక్షలు విలువైన

    బంగారు నగలు స్వాధీనం

  • కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

    చీరాల అర్బన్‌: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య అన్నారు. శనివారం స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో సీపీఎం బాపట్ల జిల్లా నాయకులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటి రోజు వర్తమాన రాజకీయ పరిణామాలుపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సుపరిపాలన అందించినట్లు చెప్పుకుంటుందని, ప్రజలు అటువంటి సంతృప్తి వ్యక్తం చేయడం లేదన్నారు. తల్లికి వందనానికి అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టారన్నారు. పిల్లల చదువులకు ఇచ్చే డబ్బుల్లో కోత వేయడం సరికాదన్నారు. అర్హులైన అందరికీ తల్లికి వందనం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. రాష్ట్రానికి వనరులు రాబట్టుకోవడం, విభజన హామీలు అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు భావించారన్నారు. ఆచరణలో మాత్రం ఆ ప్రయత్నం జరగలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ వంటి పథకాలు ఇంటింటికీ అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తోందని తెలిపారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యలపై జిల్లాలో సీపీఎం పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్‌, ఎన్‌.బాబూరావు, మణిలాల్‌, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, వి.వెంకటరామయ్య, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

    సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య

  • సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ నరసింహారెడ్డికి అవార్డు ప్రద

    లక్ష్మీపురం: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 50కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ సాధు నరసింహారెడ్డికి భారత రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ ’అవార్డు అందజేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెం లోని భారతీయ విద్యాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ నరసింహారెడ్డి నాయకత్వ నైపుణ్యం, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. రక్తదాన కార్యక్రమాల్లో ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అవార్డు గ్రహీత నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నెలకొల్పిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో 2023లో 1,440 యూనిట్లు, 2024లో 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ కృషికి గానూ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తనకు గుర్తింపు కల్పించాయని తెలిపారు. ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం ద్వారా రక్తదాన సేకరణలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎ.కె.పరీద మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ఏర్పాటు, సామాజిక సేవల్లో నరసింహారెడ్డి అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సంస్థ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు, జీఎస్టీ అధికారులు నాగరాజు, రవికుమార్‌, ఈశ్వరరావు, గాదె శ్రీనివాసరెడ్డి, పూర్ణ సాయి, శాఖమూరి శ్రీనివాస్‌, బిల్లా ప్రశాంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Tamil Nadu

  • ఆటోడ్రైవర్‌పై గొడ్డలితో దాడి

    పళ్లిపట్టు: ఆటోడ్రైవర్‌పై గొడ్డలితో అన్నదమ్ములు దాడి చేశారు. ఈ ఘటన తిరుత్తణిలో చోటుచేసుకుంది. తిరుత్తణి చెరువుకట్ట వీధికి చెందిన మహేష్‌కుమార్‌ (34) ఆటోడ్రైవర్‌. శనివారం ఉదయం ఇంటి వద్ద వుండగా, ఇతని సోదరుడి కూతురు ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో ఇంట్లో ప్రవేశించేందుకు ఎగువ తిరుత్తణికి చెందిన గురు(35) ప్రయత్నించాడు. ఇది చూసిన మహేష్‌కుమార్‌ గురును హెచ్చరించి దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన గురు, అతని తమ్ముడు శరణ్‌(18)తో కలిసి ఎగువ తిరుత్తణిలో ఆటోలో ప్రయాణికులను తీసుకెళుతున్న మహేష్‌కుమార్‌ ఆటోను వెంబడించి గొడ్డలితో ఆటోను ధ్వంసం చేసి డ్రైవర్‌ తలపై గొడ్డలితో నరికి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహేష్‌కుమార్‌ను స్థానికులు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు గురు, శరణ్‌ కోసం గాలిస్తున్నారు.

  • టికెట

    తమిళసినిమా: నటుడు, నిర్మాత అరుణ్‌ పాండ్యన్‌ తాజాగా తన ఏఎన్‌పీ గ్రూప్స్‌ పతాకంపై నిర్మించి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అక్కేనం. ఆయన వారసురాలు నటి కీర్తి పాండియన్‌ కథానాయకి నటించిన ఈ చిత్రానికి కే ఉదయ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇంతకుముందు షార్ట్‌ ఫిలిమ్స్‌ రూపొందించిన ఈయన దర్శకత్వ వహించిన తొలి చిత్రం ఇదే అన్నది గమనార్హం. కాగా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న అక్కేనం చిత్రం జూలై 4వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ శనివారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. నటి కీర్తి పాండియన్‌ మాట్లాడుతూ చిత్రం కథను చెప్పే ముందు దర్శకుడు ఉదయ్‌ తాను తెరకెక్కించిన యాకై ్క త్రీ అరే షార్ట్‌ ఫిలింలో చూపించారన్నారు. అది తనకు ఎంతో నచ్చిందన్నారు. ముఖ్యంగా ఆయన రూపొందించిన విధానం, క్వాలిటీ, టెక్నికల్‌ అంశాలు ఇంప్రెస్‌ చేశాయన్నారు. అలాగే అక్కేనం చిత్రాన్ని తన టీమ్‌తోనే పని చేస్తానని చెప్పారన్నారు. కొత్త వారిలో ఫ్యాషన్‌, ఫైర్‌, కాన్ఫిడెంట్‌ ఉంటుందన్నారు. అందుకే తాను ఉదయ్‌ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సిద్ధమైనట్లు చెప్పారు. అలాగే అంతకుమించిన ఫ్యాషన్‌, కాన్ఫిడెంట్‌ తన తండ్రి అరుణ్‌ పాండియన్‌లో చూశానన్నారు. నాన్న ఇనైంద కై గళ్‌, ఊమై విళిగళ్‌ చిత్రాల్లో నటించినప్పుడు తాను పుట్టలేదని, అయితే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులైన ఆ గ్యాంగ్‌ ఆఫ్‌ బాయ్స్‌ ఎలా చేశారన్నది ఈ చిత్రంలో నాన్న పనిని చూసి ఊహించుకున్నానన్నారు. ప్రస్తుతం సమాజంలో ఏవేవో ఉపద్రవాలు జరుగుతున్నాన్నారు. అయితే ఒక కళాకారునిగా తాను సినిమా ద్వారా ఒక మంచి విషయాన్ని ప్రేక్షకులకు చెప్పాలని చూస్తానన్నారు. అలాంటి చిత్రమే ఈ అక్కేనం అని కీర్తి పాండియన్‌ పేర్కొన్నారు. నటుడు నిర్మాత అరుణ్‌ పాండ్యన్‌ మాట్లాడుతూ తాము ఒక మంచి చిత్రాన్ని చేసామన్న సంతృప్తి కలిగిందని, ఇది ప్రేక్షకులు కొన్న టికెట్‌ డబ్బు వృథా కాదన్నారు.

  • క్లుప

    మహిళ నుంచి

    తుపాకీ స్వాధీనం

    అన్నానగర్‌: కోవై విమానాశ్రయంలో ఓ మహిళ నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నా రు. కోయంబత్తూరు విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు శనివారం ఉ దయం సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ స్థితిలో బెంగళూరుకు విమానంలో శిక్షణ కోసం వచ్చిన మహిళా ప్రయాణికురాలు సర ళా రామకృష్ణన్‌ లగేజీని తనిఖీ చేశారు. ఆ స మయంలో ఆమె బ్యాగులో 9 ఎంఎం తుపాకీ ఉన్నట్టు గుర్తించారు. సరళా రామకృష్ణన్‌ను పీలమేడు పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆమె కోయంబత్తూరులోని రెడ్‌ఫీల్డ్‌ ప్రాంతానికి చెందిన మహిళ అని, కోయంబత్తూరులోని ఒక ప్రసిద్ధ కార్పొరేట్‌ గ్రూప్‌ ట్రస్టీ భార్య అని తెలిసింది. బెంగళూరుకు వెళ్లేటప్పుడు ఆమె గమనించకుండా తుపాకీ తీసుకెళ్లిందని తేలింది. ఈ విషయంపై పీలమేడు పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    వర్షపు నీటిని తొలగించండి

    పళ్లిపట్టు: పళ్లిపట్టు బజారువీధిలో గాంధీ విగ్రహం వద్ద వర్షపు నీటితో పాటు మురుగునీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పళ్లిపట్టు టౌన్‌ పంచాయితీలోని బజారులో వందకు పైబడిన దుకాణాలు వున్నాయి. నిత్యం రద్దీగా వున్న ప్రాంతంలో నివాసాలు సైతం అధిక సంఖ్యలో ఉన్నాయి. బజారులోని మురుగునీటి కాలువను పట్టణ పంచాయతీ పారిశుధ్య కార్మికులు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో మురుగునీటి కాలువ నిండి పొంగి రోడ్డులో ప్రవహిస్తోంది. ఈక్రమంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీటితో పాటు మురుగునీరు కలిసి రోడ్డులో పేరుకుపోయింది. అందులో దోమలు వ్యాప్తి చెంది దుర్వాసన చోటుచేసుకోవడంతో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. పట్టణ పంచాయతీ నిర్వాహకులు పారిశుధ్య పనులు చేపట్టి మురుగునీటి కాలువలు శుభ్రం చేసి వర్షపు నీరు రోడ్డులో నిల్వచేరకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఒకే వేదికపైకి

    క్యాన్సర్‌ విజేతలు

    సాక్షి, చైన్నె: క్యాన్సర్‌ను జయించిన వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే విధంగా శనివారం చైన్నెలో క్యాన్సర్‌ సర్వైవర్స్‌ మీట్‌–2025 కార్యక్రమం జరిగింది. వీఎస్‌ మెడికల్‌ ట్రస్ట్‌ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి క్యాన్సర్‌ విజేతల 200 మందికి పైగా హాజరయ్యారు. మురుగప్ప గ్రూప్‌ మాజీ చైర్మన్‌ ఎంఎం.మురుగప్పన్‌, రామ్‌రాజ్‌కాటన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ కేఆర్‌ నాగరాజన్‌, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి కార్యక్రమానికి హాజరై క్యాన్సర్‌ విజేతలను సత్కరించారు. వీఎన్‌సీటీ గ్లోబల్‌కు చెందిన నాగు చిదంబరం, గీత, ఎమరాల్డ్‌ టైర్స్‌కు చెందిన తిరుపతి, కన్నగి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మద్రాసుకు చెందిన రవి సుందరేశన్‌లకు హార్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌ అవార్డులను ప్రదానం చేశారు. డాక్టర్‌ ఎస్‌ సుబ్రమణియన్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయదని, ఇది ఆత్మను కూడా భారంగా మార్చేస్తుందన్నారు. ఈ రుగ్మతను జయించి ప్రాణాలతో బయటపడిన వారిని చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.

    పోలీసు అధికారి ఇంటిపై

    ఏసీబీ దాడులు

    అన్నానగర్‌: ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఫిర్యాదు మేరకు, అవినీతి నిరోధక శాఖ పోలీసులు ఒక స్పెషల్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఇంటిపై దాడులు చేశారు. సోదాలు చేసి, పలు పత్రాలను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. హోసూరు మత్తం అగ్రహారం ప్రాంతంలో చందిరాయన్‌ నగర్‌ నివాసి కృపానందం (53) నార్కోటిక్స్‌ కంట్రోల్‌ యూనిట్‌లో 32 ఏళ్లుగా స్పెషల్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని స్వస్థలం ధర్మపురి జిల్లాలోని సెక్కరపటి. కృపానందం తన ఆదాయం కంటే అధిక ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదుల నేపథ్యంలో కృష్ణగిరి, సేలం జిల్లా అవినీతి నిరోధక శాఖ పోలీసులు శుక్రవారం అతని ఇంటిపై దాడులు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన సోదాల్లో, అతని ఇంట్లో రూ.60 వేల నగదు, 20 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత డబ్బు, ఆభరణాలను వారికి అప్పగించారు. అలాగే, కృపానందం, అతని భార్య, పిల్లల పేర్లపై స్థిర, చరాస్తులను కొనుగోలు చేశారా? అని విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై జరుగుతున్న దర్యాప్తు కోసం కృపానందంను వ్యక్తిగతంగా హాజరు కావాలని అవినీతి నిరోధక పోలీసు అధికారులు కోరారు.

Chittoor

  • పరామర

    వెదురుకుప్పం: కర్ణాటక రాష్ట్రం, హోస్కోట వద్ద గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో విషాద ఛాయలు అలముకున్నాయి. వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ, గంగాధరనెల్లూరు మండలంలోని మారేడుపల్లె గ్రామాల్లో బాధిత కుటుబాలు పుట్టెడు దుఃకంలో మునిగిపోయారు. మృతదేహాలు శుక్రవారం ఆయా గ్రామాలకు చేరుకోగా.. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయా బాధిత కుటుంబాలను మాజీ డెప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి పరామర్శించారు. వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు గ్రామంలో శనివారం పర్యటించిన ఆయన కేశవులురెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదే గ్రామంలో జనార్దన్‌కు గాయాలయ్యాయి. ఆయన కుమారుడు (45 రోజులు) చనిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగలో పర్యటించి తలసీ మృతదేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. జీడీ నెల్లూరు మండలంలోని మారేడుపల్లె గ్రామంలో శారద పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అదేవిదంగా గాయాలైన వారిని కూడా పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి(వెదురుకుప్పం), ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ భాస్కర్‌, మాజీ ఎంపీటీసీలు ధనంజయరెడ్డి, ఎర్రయ్య, మాజీ సర్పంచ్‌ రామచంద్రారెడ్డి, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ లోకనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దేవరాజారెడ్డి, హరినాఽథ్‌ ఉన్నారు.

    మాజీ సీఎం దృష్టికి తీసుకెళతా!

    బస్సు ప్రమాద ఘటనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులతో మాట్లాడి బాధిత కుటుంబాల పరిస్థితి, ఇతరత్రా విషయాలపై ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

    ప్రభుత్వం ఆదుకోవాలి

    బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు, ప్రమాదంలో గాయపడిన వారికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

  • చివరి దశకు అయ్యోర్ల బదిలీలు
    ● బదిలీల్లో పలువురు టీచర్లకు అన్యాయం ● సమస్యల పరిష్కారానికి కుప్పలు తెప్పలుగా గ్రీవెన్స్‌లు ● నేటితో ప్రక్రియ ముగించేలా విద్యాశాఖ కసరత్తు

    చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు చివరి అంకానికి చేరింది. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియ అయ్యోర్లకు చుక్కలు చూపించింది. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టడంతో పలువురు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు నిబంధనలను బదిలీల ప్రక్రియలో అమలు చేశారు. స్పౌజ్‌ల విషయంలో అనేక ఇబ్బందులు సృష్టించారు.

    నేటితో ముగియనున్న ప్రక్రియ

    జిల్లా కేంద్రంలోని షర్మన్‌ బాలికోన్నత పాఠశాలలో బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. ఈ నెల 14వ తేదీన సీరియల్‌ నం.2000 నుంచి 3000 వరకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. అనంతరం మైనర్‌ మీడియా ఎస్జీటీల కౌన్సెలింగ్‌కు తక్కువ మంది ఉండడంతో ఆదివారంతో ప్రక్రియ ముగించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలు, వింత నిబంధనల వల్ల మెజారిటీ శాతం ఉపాధ్యాయులు బదిలీల్లో నష్టపోయారు. కూటమి సర్కారు పాలనలో నష్టపోయామంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు మండిపడుతున్నారు.

    కుప్పలు తెప్పలుగా గ్రీవెన్స్‌

    బదిలీల ప్రక్రియలో నష్టపోయిన టీచర్లకు న్యాయం చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బాధిత టీచర్ల నుంచి గ్రీవెన్స్‌ తీసుకోవాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో దాదాపు 180 ఎస్జీటీ, 75 దాకా స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి గ్రీవెన్స్‌కొచ్చాయి. వీటిని ఎప్పుడు పరిష్కరిస్తారో తెలియని పరిస్థితి.

  • వరసిద

    కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర వెల్ఫేర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజశేఖర్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీ.ఆర్‌ మధుసూదన్‌రావు, రాష్ట్ర సీబీఐ డీఐజీ మురళిరంభ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేయగా ఈవో పెంచలకిషోర్‌ వారికి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

    వెండి దీపం.. నైవేద్య పాత్రల వితరణ

    కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి శనివారం ఓ దాత కుటుంబీకులు వెండి పాత్రలు విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన చంద్రశేఖర్‌ కుటుంబీకులు రూ.3.80 లక్షల విలువ చేసే 3.5 కిలోల వెండి దీపం, నైవేద్య పాత్రలు విరాళంగా ఈవో పెంచల కిషోర్‌కు అందజేశారు. అనంతరం వారికి దర్శన భాగ్యం కల్పించారు.

    మెకానిక్‌ ఆత్మహత్యాయత్నం

    చౌడేపల్లె: మండలంలోని గోసులకురప్పల్లె గ్రామానికి చెందిన రమణ కుమారుడు ప్రకాష్‌(36) మెకానిక్‌షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రకాష్‌ పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పుల వారి వేధింపులు అధికం కావడంతో శనివారం పంట పొలాలకు ఉపయోగించే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. కుటుంబీకులు అతన్ని పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

    వ్యక్తి ఆత్మహత్యాయత్నం

    పుంగనూరు(చౌడేపల్లె) : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘట న పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లె గ్రా మంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అగస్తీ కుమారుడు కుమార్‌(30) శనివా రం పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    రేపటి నుంచి డిగ్రీ, పీజీ తరగతులు

    తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఆయా కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కళాశాలలతో పాటు అదే రోజు వసతి గృహాలు సైతం తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. పద్మావతి మహిళా వర్సిటీలో సైతం తరగతులు ప్రారంభం కానున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్లూ, ఎస్‌జీఎస్‌, ఎస్వీ ఆర్ట్స్‌, ఎస్వీ ఓరియంటల్‌ కళాశాలలు సోమవారం నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

  • భాషా పండితుల బదిలీల్లో చిత్ర విచిత్రాలు

    – నేడు డీఈవో కార్యాలయం వద్ద ధర్నా

    చిత్తూరు కలెక్టరేట్‌ : చాలా సంవత్సరాలుగా డీఈవో పూల్‌లో పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఈ బదిలీల్లో అయినా దరఖాస్తు చేసుకుని అనుకూలమైన ప్రాంతాలకు వెల్దామని ఆశపడ్డారు. విద్యాశాఖ అధికారులు జారీ చేసిన సీనియారిటీ జాబితా ప్రకారం ఆన్‌లైన్‌లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న భాషా పండితుల బదిలీల ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు శనివారం విడుదల చేశారు. ఆ ఉత్తర్వులను చూసిన భాషాపండితులు నివ్వెరపోయారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ఉత్తర్వులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ బదిలీలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని భాషాపండితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు.

    నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీ ఉత్తర్వులు

    ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని డీఈవో పూల్‌లో ఉన్న తెలుగు 123, హిందీ 30 మంది భాషాపండితుల ఉత్తర్వులు నిబంధనలకు వ్యతిరేకంగా విడుదల చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఫైనల్‌ సీనియారిటీ జాబితాలో సీరియల్‌ నెంబర్‌ 15లో ఉన్న వ్యక్తి తన స్పౌజ్‌ తిరుపతిలో పనిచేస్తున్నారు. ఆన్‌లైన్‌ బదిలీల్లో ఆ టీచర్‌ తిరుపతిని ఆప్షన్‌గా పెట్టుకున్నారు. అయితే ఆ టీచర్‌ తన ప్రాధాన్యత క్రమంలో పెట్టిన 30వ ప్లేస్‌ పెనుమూరుకు పోస్టింగ్‌ ఇచ్చారు. అదేవిధంగా సీరియల్‌ నెంబర్‌ 17లో ఉన్న మరో భాషాపండితుని స్పౌజ్‌ తిరుపతిలో పనిచేస్తుండగా ప్రాధాన్యత క్రమంలో తిరుపతిని రెండవ ప్లేస్‌లో పెడితే చివరగా పెట్టిన వరదయ్యపాళ్యంకు బదిలీ చేశారు.

    దారుణం

    తుది సీనియారిటీ జాబితాలో 79వ నెంబర్‌లో ఉన్నటువంటి భాషాపండితునికి తన ప్రాధాన్యత క్రమం ప్రకారం కాకుండా ఇంటికి దగ్గరలో ఉన్న తిరుపతిలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇదేవిధంగా చాలా మందికి తుది సీనియారిటీ జాబితాల్లో కింద ఉన్న వారికి దగ్గరలో, మొదట్లో ఉన్న వారికి దూరంగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ సమస్యలపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నష్టపోయిన భాషాపండితులు కూటమి టీడీపీ నిలువునా ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారుణం అంటూ సామాజిక మాధ్యమాల్లో తమ వ్యతిరేకతను వెల్లడిస్తున్నారు. సీనియారిటీ జాబితాల్లో 1, 2 స్థానాల్లో ఉన్న వారికి 30, 40వ ప్లేసుల్లో బదిలీ చేయడం వింతగా ఉందని మండిపడుతున్నారు. న్యాయం కోసం ఆదివారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు భాషా పండితులు సిద్ధపడ్డారు.

  • రోడ్డ

    గంగాధర నెల్లూరు: గిట్టుబాటు ధర కోసం మామిడి రైతులు రోడ్డెక్కారు. కర్మాగారాల యాజమాన్యాల తీరుపై శనివారం నిరసనకు దిగారు. చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిలోని జైన్‌ మామిడి గుజ్జు పరిశ్రమ తీరుపై విరుచుకుపడ్డారు. తోతాపురి కిలో రూ.8కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించానా ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.6 కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టోకెన్‌ వ్యవస్థను రద్దుచేసి సీరియల్‌గా ముందు వచ్చే రైతుల మామిడి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఫారసుల టోకన్లే అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. కాయ కుళ్లిపోక ముందే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారుల స్పందిస్తూ సోమవారం నుంచి సీరియల్‌గా ఎవరు ముందు వస్తే వారి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

  • కాణిపాకం కిటకిట

    కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు పోటెత్తారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శనాలతో ఆలయమంతా భక్త జన సందడి కనిపించింది. క్యూలైన్లు నిండి ఆలయ ఆవరణలో భక్తులు బారులుతీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు ఆలయ ఆవరణలో స్వామి వారి దర్శనానికి గంటల కొద్దీ నిరీక్షించారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్‌ చర్యలు చేపట్టారు.

  • కారు

    రొంపిచెర్ల: కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం, బోనంవారిపల్లె వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రాం, చింతమణి నరిసింగపేటకు చెందిన ఎన్‌వీ. సవిత (56), చందర్‌ (38) ద్విచక్ర వాహనంలో తిరుపతికి బయల్దేరారు. అక్కడ శనివారం రాత్రి జరగనున్న శుభాకార్యంలో పాటల కచ్చేరి కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో తిరుపతి వైపు నుంచి కారు పీలేరు వైపు వెళ్తూ బోనంవారిపల్లె వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సవిత(56) అక్కడికక్కడే మృతి చెందగా.. చందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో చికిత్స కోసం అన్నమ్మయ్య జిల్లా పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రొంపిచెర్ల ఎస్‌ఐ సుబ్బారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ప్రాణ

    – మురికి గుంతలో పడి చిన్నారి మృతి

    రొంపిచెర్ల: మురుగు నీటి గుంత ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈఘటన రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని లక్ష్మీనారాయణ కాలనీలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన ఆసిఫ్‌, ఉస్మా కుమార్తె ఆజూమిర్హ(3) పిల్లలతో వీధిలో అడుకుంటున్నారు. వీరు ఆడుకుంటున్న రోడ్డు పక్కనే మురుగు నీటి గుంత ఉంది. ప్రమాదవశాత్తు ఆ గుంతలో చిన్నారి పడింది. పిల్లలు కేకలు వేయడంతో గ్రామస్తులు హుటాహుటిన గుంత వద్దకు చేరుకున్నారు. అప్పటికే చిన్నారు ప్రాణాలు వదిలింది. గుంత ఆరు అడుగుల లోతు ఉండడంతో ఊపిరాడక మృతిచెందింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలాన్ని రొంపిచెర్ల పోలీసులు సందర్శించి వివరాలను సేకరించారు. ఇదిలావుండగా వారం క్రితమే ఈ గుంతను జేసీబీతో మరింత పెద్దది చేశారు. అయినా పూడ్చకపోవడంతో చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది.

Eluru

  • రూ.15 కోట్ల బిల్లులు పెండింగ్‌

    నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్న మెస్‌ నిర్వాహకులకు రూ.కోట్ల మెస్‌ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తుండంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. నెలల తరబడి మెస్‌ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయడంతో.. అప్పుల పాలవుతున్నామని లబోదిబోమంటున్నారు. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లోని మెస్‌ నిర్వాహకులకు దాదాపు రూ.15 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనిపై నిర్వాహకులు పలుమార్లు ఆర్జీయూకేటీ అధికారులను కలిసి బిల్లులు విడుదల చేయాలని విన్నవించుకున్నా రూపాయి కూడా విడుదల చేయడం లేదు. దీంతో జూలై 1 నుంచి వేసవి సెలవుల అనంతరం ట్రిపుల్‌ ఐటీల్లో తరగతులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో మెస్‌ల నిర్వహణ ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఉన్న 26,400 మంది విద్యార్థులకు 11 మంది మెస్‌ నిర్వాహకులు భోజనాన్ని తయారు చేసి అందజేస్తున్నారు. ఈ మెస్‌లలో కొన్నింటికి గతేడాది సెప్టెంబరు నుంచి మరికొన్నింటికి నవంబరు నుంచి, ఇంకొన్నిటికి జనవరి నుంచి ట్రిపుల్‌ ఐటీలకు వేసవి సెలవులు ఇచ్చే నాటి వరకు మెస్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రతి రోజూ ఒక్కొక్క మెస్‌ కనిష్టంగా 2 వేల మంది నుంచి 6 వేల మందికి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంకాలం స్నాక్స్‌ అందిస్తోంది. ఇంత భారీ మొత్తంలో మెస్‌లు నిర్వహిస్తున్న వీరికి పెట్టుబడి సైతం ఎక్కువగానే ఉంటుంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి సరుకులు తెచ్చి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వండి పెడుతున్నారు. అయినప్పటికీ ఆర్జీయూకేటీ అధికారులు మెస్‌ నిర్వాహకులకు బిల్లులు సకాలంలో చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు.

    ట్రిపుల్‌ ఐటీల మెస్‌ నిర్వాహకుల గగ్గోలు

    బిల్లుల అప్‌లోడ్‌లో తీవ్ర జాప్యం

    నెల గడవగానే ఆ నెలకు సంబంధించిన బిల్లులను సీఎంఎఫ్‌ఎస్‌లో అప్‌లోడ్‌ చేయడంలో ట్రిపుల్‌ ఐటీల సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తున్నారని మెస్‌ నిర్వాహకులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ బిల్లుల అప్‌లోడ్‌ బాధ్యతలను అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌కు అప్పగించడంతో వారు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలలు, ఎనిమిది నెలల పాటు బిల్లులు చెల్లించకపోవడంతో మెస్‌ నిర్వాహకులు కోట్లాది రూపాయల అప్పుల్లో మునిగిపోయారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కేఎంకే సంస్థకు దాదాపు రూ.2.50 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో రూ.1.75 కోట్లు, ఎస్‌ఎస్‌ క్యాటరర్స్‌కు రూ.2.10 కోట్లు, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌సూత్ర హాస్పటాలిటీకి రూ.2.10కోట్లు, శ్రీదేవి క్యాటరర్స్‌కు రూ.1.40కోట్లు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో సరోజ క్యాటరర్స్‌కు రూ.1.50 కోట్లు, ప్రిజం హాస్పటాలిటీకి రూ.1.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంకా పలువురు నిర్వాహకులకు మెస్‌ బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎప్పుడు చెల్లిస్తారో అంతుబట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా మెస్‌ బిల్లులు చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

  • పోషకా

    చింతలపూడి: పాడి పశువులకు పుష్టికరమైన మేత అందించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. నాణ్యమైన మేత అందించడం కారణంగా పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పాల ఉత్పత్తి కూడ గణనీయంగా పెరుగుతుందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.లింగయ్య తెలిపారు. సాధారణంగా పాడి పశువుల్లో విటమిన్‌ ఎ, కాల్షియం, ఫాస్పరస్‌ వంటి పోషక పదార్థాల లోపం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. చాలామంది రైతులు వర్షాకాలం, చలికాలంలో పచ్చిమేతలు, ఎండాకాలంలో ఎండు గడ్డిని దాణాగా అందిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. పచ్చిమేత ఎక్కువగా దొరికే కాలంలో దానికి పాతర వేసి నిల్వ చేసుకోవాలని.. అన్ని కాలాల్లో పచ్చిమేత అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

    ఎంత మేత అవసరం..

    రోజూ ఒక్కో పశువుకు 8 కిలోల వరిగడ్డి, లేదా ఎండు చొప్ప(మొక్కజొన్న, జొన్న) 8 కిలోల లెగ్యూమ్‌ జాతి పచ్చిమేత(పిల్లిపెసర, అలసంద, గోరు చిక్కుడు) 16 కిలోల గింజ జాతి పచ్చి మేతలు ఇస్తే.. పశువులకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. పాల దిగుబడిని బట్టి పశువులకు దాణా అందించాలి. పోషకాలతో కూడిన గడ్డిని ఇస్తే సకాలంలో ఎదకు వస్తాయి. పాల ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది.

    గొడ్డుమోతు సమస్య ఉంటే..

    పశువుల్లో గొడ్డుమోతు సమస్యకు సకాలంలో ఎదకు రాకపోవడం, గర్భకోశ వ్యాధులు, అండంలో లోపాల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. పశువులు ఈనిన తరువాత పశువులు 60 నుంచి 90 రోజుల్లో ఎదకు వచ్చి చూలు కట్టాలి. ఎదకు రాని పశువులను సకాలంలో పశు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళి పరీక్ష చేయించాలి. ప్రతీ రోజు ఎద లక్షణాలను పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి.

    దూడలకు చూడి కట్టించడం సరికాదు

    యుక్త వయసు రాని దూడల్ని కత్రిమంగా చూడి కట్టించే పనిని రైతులు మానుకోవాలి. తగిన వయసు, బరువు లేని పశువుల్ని చూడి కట్టించడం వల్ల పశువుల్లో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఆవులకు 18 నెలలు, గేదెలకు 24 నెలల వయసు వచ్చిన తరువాత మాత్రమే చూడి కట్టించాలి. ఆవులు 200 కిలోలు, గేదెలు 250–300 కిలోలు బరువు ఉన్నప్పుడు మాత్రమే చూడికట్టించాలి. శారీరకంగా పూర్తిగా ఎదగని పశువులను చూడి కట్టించడం వల్ల కటి వలయం సరైన రీతిలో నిర్మాణం కాక ఈనిక కష్టమవుతోంది. ఒక్కోసారి తల్లి లేదా దూడ లేదా రెండూ మరణించే ప్రమాదం ఉంది. అందు వల్ల రైతులు అశాసీ్త్రయమైన పద్ధతులకు స్వస్తి పలికితే పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని పశు వైద్యాధికారి సూచించారు.

    పాడి – పంట

  • కల్తీ

    బుట్టాయగూడెం : తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాలు కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కల్తీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లు ఎరువుల నియంత్రణ చట్టం– 1985 ప్రకారం నిబంధలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

    విత్తనాల కొనుగోలులో..

    వ్యవసాయ శాఖ లైసెన్స్‌ పొందిన డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన సంస్థల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్‌ వేసిన ధృవీకరణ పత్రం ఉన్న విత్తన బస్తాలనే కొనుగోలు చేయాలి. విత్తనాల సంచిపై విత్తనాల రకం, ల్యాబ్‌ నెంబర్‌, గడువు తేదీ, తదితర విషయాలను గమనించాలి. కొనుగోలు చేసిన బిల్లుపై డీలర్‌ సంతకం తప్పనిసరిగా ఉండాలి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. హైబ్రిడ్‌ విత్తనాల కొనుగోలుకు విత్తన రకం, స్వచ్ఛత, మొలకెత్తే స్వభావం, జన్యు నాణ్యత వంటి వివరాలు పరిశీలించాలి. మొలకెత్తిన దశ, పూత దశలో లోపం కనిపిస్తే స్థానిక వ్యవసాయ అధికారులను, సిబ్బందిని సంప్రదించాలి.

    మొలకలను పరీక్షించే విధానం

    రైతులు విత్తుకోవడానికి ఒకరోజు ముందు విత్తనాలను కొనుగోలు చేయడం వల్ల మొలక పరీక్షలు చేయించుకోవడం లేదు. విత్తనం కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా మొలకలను పరీక్ష చేయించుకోవాలి. రైతు కొనుగోలు చేసిన విత్తనాల సంచి నుంచి 100 గింజలను 24 గంటలపాటు నీటిలో నానబెట్టి అనంతరం ఒక గుడ్డలో గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉంచాలి. 24 గంటల తర్వాత తీసి చూస్తే 100 గింజలకు 75 గింజలపైనే మొలక వస్తే మంచి విత్తనంగా నిర్ధారించుకుని నారుమడులు సిద్ధం చేసుకోవాలి. మొలక శాతం కనీసం 75 శాతం వరకూ ఉంటే విత్తనాలు నాణ్యమైనవని భావించి పంటలు విత్తుకోవాలి.

    గడువు దాటితే కొనుగోలు చేయొద్దు

    కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్‌, సీసా డబ్బాపై సీలు ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోవాలి. అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.

    మంచి విత్తనాలతోనే నారు కట్టాలి

    సొంతంగా తయారు చేసిన విత్తనాలు నారుకు శ్రేయస్కరం. కొనుగోలు చేస్తే మంచి విత్తనాలను ఎంపిక చేయాలి. నారుపోసే ముందు మొలక శాతం గుర్తించి నారు పోయాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.

    – పీజీ బుచ్చిబాబు,

    సహాయ వ్యవసాయ సంచాలకుడు, కేఆర్‌పురం

    రైతులకు వ్యవసాయాధికారుల సూచన