breaking news
YS Jagan Mohan Reddy
-
పలాసలో కిడ్నీ మార్పిడి విజయవంతం
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో తొలిసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శుక్రవారం సోంపేటకు చెందిన సీహెచ్ హేమశ్రీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆమె తండ్రి మోహనరావు కిడ్నీ దానం చేశారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసిన అనంతరం ఆస్పత్రి వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేజీహెచ్ నెఫ్రాలజిస్టు డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ పలాస వంటి మారుమూల చిన్నపట్టణంలో మెడికల్ కళాశాల లేనిచోట కిడ్నీ మార్పిడి చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు.ఉద్దానం ప్రాంతంలో చాలా ఏళ్ల నుంచి ఎక్కువగా కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పారు. కిడ్నీ మార్పిడిని 15 ఏళ్ల కిందట కేజీహెచ్లో తానే ప్రారంభించినట్లు తెలిపారు. కర్నూలు, గుంటూరు వంటి నగరాల్లోని ఆస్పత్రుల్లో ఈ సదుపాయాలున్నాయని చెప్పారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి, ఆస్పత్రి నిర్మించడంతో ఈ ప్రాంత ప్రజలకు ఈ సదుపాయాలు కలుగుతున్నాయన్నారు. రెండు కిడ్నీలు పాడైపోయిన హేమశ్రీకి ఆమె తండ్రి కిడ్నీ ఇచ్చారని చెప్పారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఆపరేషన్ మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయిందన్నారు.మార్పిడి తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ బాగానే ఉందని చెప్పారు. ఎనీ్టఆర్ వైద్యసేవ, ఆస్పత్రి నిధుల నుంచి ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. కిమ్స్, జెమ్స్ ఆస్పత్రుల నుంచి వచ్చిన డాక్టర్లు ఉమామహేశ్వరరావు, పూర్ణచంద్ర, వివేకానంద, అశోక్వర్ధన్, జోగినాయుడు, స్థానిక వైద్యులు రాకే‹Ù, జ్యోత్స్న, ఆస్పత్రి సూపరింటెండెంట్ జె.కిశోర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.ఆస్పత్రి కట్టించినవారికి అభినందనలు నెఫ్రాలజిస్టు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత చక్కటి ఆస్పత్రి నిర్మించిన వారిని, అన్ని సదుపాయాలు కల్పించినవారిని ముందుగా అభినందించాలన్నారు. ఇలాంటి మారుమూల ప్రాంతంలో అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారని చెప్పారు.వైఎస్ జగన్ హయాంలో ఆస్పత్రి నిర్మించి, ప్రారంభించారు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో ఈ ఆస్పత్రి నిర్మించి ప్రారంభించారని చెప్పారు. మరిన్ని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు ఈ ఆపరేషన్ పునాది అవుతుందని ఆమె పేర్కొన్నారు. – గౌతు శిరీష, టీడీపీ ఎమ్మెల్యే -
మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారిగా హెచ్జే దొర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు.పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. -
జగన్ విలువ ఇప్పుడు తెలుస్తుంది.. YSRCP పేరు వింటేనే బాబుకు గజ గజ
-
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
-
ఊరూ వాడా ఘనంగా 16 ఏళ్ల పండుగ
సాక్షి నెట్వర్క్: ఆవిర్భావం నుంచి ప్రతి అడుగులోనూ విలువలు, విశ్వసనీయతతో రాజకీయ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో గ్రామాల్లోనూ పండుగలా కార్యక్రమం కొనసాగింది. ప్రజా సంక్షేమం కోసం పురుడు పోసుకున్న పార్టీ జెండాను రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా పండుగ వాతావరణంలో కార్యకర్తలు, నేతలు, అభిమానుల కోలాహలం నడుమ ఎగురవేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా సందేశాన్ని చాటారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కేక్లు కట్ చేసి కోట్ల మంది సంబరాన్ని పంచుకున్నారు.వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఉరిమే ఉత్సాహంతో బైక్ ర్యాలీలు.. జై జగన్.. జై వైఎస్సార్సీపీ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జెండా రెపరెపల నడుమ తమ గుండె చప్పుడు వైఎస్సార్సీపీ అని చాటి చెప్పారు. పలుచోట్ల వైఎస్ జగన్ హయాంలో అమలైన నవరత్నాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలను ప్రదర్శించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతిని«ధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. నల్లకాలువలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట కోసం 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిందని గుర్తు చేసుకున్నారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. అబద్ధపు హామీలతో మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారును తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. పులివెందుల బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా, న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఢిల్లీలో వైఎస్సార్సీపీ సంబరాలుసాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలు ఢిల్లీలో గురువారం ఘనంగా జరిగాయి. పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం చెబుతూ వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని ఎంపీలు పేర్కొన్నారు.తెలంగాణలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలుకూకట్పల్లి/అల్వాల్/ఖమ్మం మయూరి సెంటర్: వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు గురువారం కేక్ కట్చేసి వేడుకలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని రమ్యా గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అరి్పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కూకట్పల్లి, నేరేడ్మెట్ ఆర్కేపురం, ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ.. 'కోట్లాది మంది అభిమానులది': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు.. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది.. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నా..’’ అని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలిరావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులనుద్దేశించి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నల్లకాలువలో ఇచ్చిన మాటతో..మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తయింది. 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితుల్ని మార్చింది. రాష్ట్రం దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుంది..ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు... కానీ జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, దేశంలోనూ అధికారంలో ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతా. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుందని మరొక్కసారి మీ అందరికీ వినమ్రంగా, వినయపూర్వకంగా చెబుతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. -
ఫిషింగ్ హార్బర్ పోయింది.. ‘జువ్వలదిన్నె’ ప్రైవేట్ పరం!
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల నుంచి ఒక్కో రంగాన్ని ప్రైవేట్పరం చేసి సంపద సృష్టించకపోగా ఆస్తులను తెగనమ్ముతూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు తాజాగా గత ప్రభుత్వ కృషితో సాకారమైన ఫిషింగ్ హార్బర్లపై కన్నేసింది. మన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు వేట కోసం వలస వెళ్లి అవస్థలు పడకూడదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్ను చంద్రబాబు సర్కారు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. 2024 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించిన నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూటమి సర్కారు ఇంతవరకూ అందుబాటులోకి తేకుండా మత్స్యకారుల ఆశలను నీరుగార్చింది. తాజాగా దీన్ని నౌకా నిర్మాణ కేంద్రంగా మారుస్తూ ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు 29.58 ఎకరాలు కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్ ల్యాండ్కు నిర్దేశించారు. మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా తన తనయుడు లోకేశ్తో శంకుస్థాపన చేయించడం గమనార్హం. ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ జువ్వలదిన్నెలో అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్ యూనిట్ సిస్టమ్స్ సెంటర్ను అభివృద్ధి చేయనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే మానవ రహిత ఉపరితల వాహనాలు, నీటి అడుగున తిరిగే వాహనాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం తొలి దశలో కేవలం రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొదట 29.58 ఎకరాలు కేటాయించగా మొత్తం 150 ఎకరాలు అప్పగించనున్నట్లు శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. అంటే రానున్న కాలంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మొత్తం సాగర్ డిఫెన్స్కు కేటాయించనున్నట్లు స్పష్టమవుతోంది. మత్స్యకారుల నోట్లో మట్టి.. రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్గా ప్రారంభించినా చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తేలేదు. రెండేళ్లలో ఏ ఒక్క ఫిషింగ్ హార్బర్నూ అందుబాటులోకి తేకపోగా గత ప్రభుత్వం చేపట్టిన వాటిని సైతం ప్రైవేట్పరం చేస్తోంది. జువ్వలదిన్నె హార్బర్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ప్రాంత మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో మన తీర ప్రాంతంలో వేటాడుతున్న విషయాన్ని కొద్ది రోజుల క్రితం నెల్లూరు కలెక్టర్ సీఎం చంద్రబాబు దృష్టికి తెచి్చనా తనకు పట్టనట్లే వ్యవహరించారు. ఇప్పుడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థానంలో షిప్యార్డ్కు శంకుస్థాపన ద్వారా మత్స్యకారుల ఆశలను శాశ్వతంగా నీరుగార్చారు. మత్స్యకారుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కేవలం చేపలు పట్టడానికి ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారంటూ నమ్మబలుకుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పెద్ద నౌకల తయారీతోపాటు సముద్ర జలాల్లో పరీక్షలు నిర్వహించడం స్థానిక మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బందరు ఫిషింగ్ హార్బరు వద్ద కూడా..ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా మన జలాల్లోనే చేపల వేట చేపట్టేలా మాజీ సీఎం వైఎస్ జగన్ జువ్వలదిన్నె హార్బర్కు శ్రీకారం చుడితే ఇప్పుడు షిప్యార్డ్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుగరాజపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్లో కాకుండా జువ్వలదిన్నె వద్ద షిప్ యార్డు నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే రీతిలో మచిలీపట్నం ఫిషింగ్ హార్బరు వద్ద కూడా మరో షిప్ యార్డు నిర్మాణం చేపట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటం మత్స్యకారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. -
18న వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు గురువారం ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏటా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనార్టీలకు అన్ని విధాలా అండగా నిలిచి మేలు చేశారని చెప్పారు. -
YS Jagan: మీరే నా ధైర్యం, బలం
-
ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. -
తాడేపల్లి : వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
నా ధైర్యం మీరే .. నా బలం మీరే : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మన పార్టీకి అసలైన బలం.. నా బలం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు. నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించినమన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం… pic.twitter.com/avdEzEGkjg— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2026గురువారం పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో పార్టీ కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన వైఎస్ జగన్, ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తి. 2011, మార్చి 12న పుట్టిన మన పార్టీ, ఈరోజుకి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు మార్చింది. రాష్ట్రంలో దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్ధం చెబుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నాను.ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ, దేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు. కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.ఈరోజు నేను చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి, మరొక్కసారి మీ అందరికి కూడా వినమ్రంగా, వినయపూర్వకంగా, మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.ఈరోజు మరొక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు. -
ఆరోజు జగన్ ఒక్కడే.. ఇప్పుడు కోట్ల మంది.. దేశ రాజకీయాలనే మార్చేసిన YSRCP
-
వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని’ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం (మార్చి 12) వైఎస్సార్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన వైఎస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించింది. నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చింది. వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది. మొదట్నుంచీ ప్రజలు,దేవుడినే నమ్ముకున్నా. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు’ తెలిపారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. -
Watch Live: వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు
-
పేదల గుండెచప్పుడు.. జగన్ నేతృత్వంలో పార్టీ ప్రయాణం
-
చంద్రబాబు మార్క్ మోసాలపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం
-
ఉరుసు ఉత్సవాలకు ఆహ్వానం
-
చంద్రబాబు ఉప ప్రధానా! రెండు గంటలు ఎడాపెడా వాయించిన జగన్
-
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
అప్పులు దాచి.. ఆదాయం దోపిడీ
రాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి, డీవోపీటీకి లేఖ రాస్తాం. కాగ్ నివేదికలో పేర్కొన్న అప్పులు.. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అప్పులను చూపించి.. చంద్రబాబు కోసం కిందామీదాపడి దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంలో పాలుపంచుకున్నందుకు ఆ అధికారులపై లేఖ రాస్తున్నాం.ప్రభుత్వ గ్యారంటీతో ఎన్నో అప్పులు తీసుకున్నారు. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. వీటిని బడ్జెటేతర అప్పులని కాకుండా ఏమంటారు? వీటిని మాత్రం చెప్పడం లేదు. అన్నీ దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు.. ఇవి మినహా ఏమైనా మంచి జరిగిందా అని చూస్తే ప్రజలకు ఒరిగింది సున్నా.చంద్రబాబు అధికారంలోకి వస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు (అప్పులు) ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అందరూ కలిసి జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో..! అంటూ దోచుకుంటున్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే. ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి? ఎంత అప్పులు తెచ్చినా ఎలా సరిపోతాయి? సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఆర్థిక విధ్వంసం సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అంతా కలిసి దోచుకుంటుండడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పడిపోతున్నాయని, మరోవైపు రాష్ట్ర అప్పులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులున్నప్పటికీ, ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి అదనంగా భారీ ఎత్తున ఖర్చు చేయాల్సివ చ్చినప్పటికీ.. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించామని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి విపత్కర పరిస్థితులేవీ లేనప్పటికీ.. కేంద్రం విధించిన పరిమితి (నెట్ బారోయింగ్ సీలింగ్)కి మించి ఎడాపెడా అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ తాను పరిపాలనా దక్షుడినంటూ చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులపై అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇ చ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శిపై చర్యలు కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)కి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కాగ్ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక.. బడ్జెట్ ప్రతులు.. అసెంబ్లీకి ప్రభుత్వం రాతపూర్వకంగా ఇ చ్చిన సమాచారం ప్రతులను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కార్ ఆర్థిక విధానాలను ఎండగట్టారు. 2026–27 బడ్జెట్లో లోపాలను ప్రస్తావిస్తూ.. మేనిఫెస్టోలో ఇ చ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ తాను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తండ్రీ, కుమారుడు పరస్పరం జాకీలు ఎత్తుకుంటే.. వారిద్దరి జాకీలను పవన్కళ్యాణ్ ఎత్తడమే సరిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. విధ్వంసానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు సర్కారుకు ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇక రెండు మాత్రమే ప్రవేశపెట్టే అవకాశముంది. గతనెల 19న జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని సవివరంగా చెప్పా. ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలను ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. మా ప్రభుత్వంలో చివరి ఆర్థిక ఏడాది (2023–24)ని.. కాగ్ ఆడిటింగ్ జరిగిన చంద్రబాబు నాయుడు తొలి ఏడాది (2024–25)తో పోలిస్తే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2023–24లో ప్రభుత్వ వ్యయం రూ.2,36,486 కోట్లు. ఇందులో రాష్ట్ర ఆదాయం (సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్–ఇన్–ఎయిడ్) రూ.1,73,767 కోట్లు. చంద్రబాబు సర్కార్ తొలి ఏడాది 2024–25లో ప్రభుత్వ వ్యయం రూ.2,49,096 కోట్లు. ఇందులో రాష్ట్ర ఆదాయం రూ.1,68,024 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 2024–25లో రూ.1,68,024 కోట్లకు పడిపోయింది. అంటే మా ప్రభుత్వం కంటే బాబు తొలి ఏడాదిలో రాబడులు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రెవెన్యూ లోటు ఏకంగా 56 శాతం పెరిగి రూ.38,682 కోట్ల నుంచి రూ.60,285 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు.. అంటే చేసిన అప్పులు 30 శాతం పెరిగి రూ.62,719 కోట్ల నుంచి రూ.81,071 కోట్లకు చేరింది. అయినా కూడా మొదటి ఏడాది సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకపోగా గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024–25 తర్వాత కూడా రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెంచుకుంటూనే పోతున్నారు. 2019–20లో మా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ఐదేళ్ల కాలంతో ఇప్పటి ప్రభుత్వంలో 2024–25, 2025–26లోని పది నెలలతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా అప్పులు ఏ విధంగా పెరిగాయో తెలుస్తుంది. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా, ప్రజలను కాపాడుకోవడానికి అదనంగా వ్యయం చేయాల్సి వ చ్చినా మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలను కూడా అమలు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాం. కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా, ఎలాంటి స్కీమ్లు అమలు చేయకున్నా అప్పులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2023–24లో రాష్ట్రం మొత్తం వ్యయంలో అప్పులు 26.52 శాతంగా ఉంటే అదే చంద్రబాబు తొలి ఏడాది 2024–25లో 32.55 శాతానికి, 2025–26లో మొదటి పదినెలల్లో 39.74 శాతానికి ఎగబాకాయి. అంతేకాకుండా మా ఐదేళ్ల పరిపాలనలో జీఎసీడీపీలో అప్పులు సగటున 4.11 శాతంగా ఉంటే 2024–25లో జీఎసీడీపీలో అప్పులు 5.08 శాతానికి చేరాయి. చంద్రబాబు ఆర్థిక విధ్వంసానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.. ఆధారాలు!! దోచుకో.. పంచుకో.. తినుకో.. చంద్రబాబు అధికారంలోకి వస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు (అప్పులు) ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అందరూ కలిసి జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో..! అంటూ దోచుకుంటున్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్ ్జ, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే. ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి? ఎంత అప్పులు తె చ్చినా ఎలా సరిపోతాయి? విశాఖలో అత్యంత విలువైన 54 ఎకరాలను, రూ.5,000 కోట్ల విలువైన భూమిని బాబు దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? రియల్ ఎస్టేట్ కంపెనీలకు శనక్కాయలు, బెల్లానికి భూములు ఇస్తున్నాడు. అంతేకాదు.. నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈయన ఎదురు ఇస్తున్నాడు. ఇలాంటి స్కామ్లు జరుగుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనడానికి ఇంకో ఉదాహరణ.. ట్రెజరీలో మినిమమ్ క్యాష్ బ్యాలెన్స్(కనీస నగదు నిల్వ) చూస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో కనీస నగదు లేకపోతే ముందుగా ఎస్డీఎఫ్ తీసుకుంటారు. ఇదికూడా దాటితే వేస్ అండ్ మీన్స్.. అది కూడా దాటితే ఓవర్ డ్రాఫ్ట్కు వెళుతుంది. ఇవన్నీ వడ్డీతో కూడినవి. కోవిడ్ లాంటి ఏ కష్టాలూ బాబు హయాంలో లేనప్పటికీ 2024–25లో కనీస నగదు నిల్వ ఉన్నవి కేవలం 8 రోజులు మాత్రమే. 365 రోజుల్లో 357 రోజులు కనీస నగదు నిల్వ కూడా ఉంచలేదు. చంద్రబాబు పరిపాలనకు, బిల్డప్కు తేడా స్పష్టంగా చూపించే మరో చిత్రపటం.. ట్రెజరీలోని ఈ కనీస నగదు నిల్వలు! ఒకవైపు మామీద తప్పుడు ప్రచారం చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ వాటిని బయటకు రానివ్వకుండా దాచేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024–25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు రూ.81,082 కోట్లు అని కాగ్ నివేదిక స్టేట్మెంట్ సిక్స్లో పేర్కొంది. కానీ అసెంబ్లీలో రూ.60,485 కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు సర్కార్ తప్పుడు లెక్కలతో కూడిన సమాచారం ఇ చ్చింది. అంటే రూ 20,000 కోట్ల అప్పులు దాచిపెట్టి చూపిస్తున్నారు. ఆత్మస్తుతి.. పరనిందేరాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇ చ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తాం.. డీవోపీటీకీ లేఖ రాస్తాం. కాగ్ నివేదికలో పేర్కొన్న అప్పులు.. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అప్పులను చూపించి.. చంద్రబాబు కోసం కిందామీదాపడి దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంలో పాలుపంచుకున్నందుకు ఆ అధికారులపై డీవోపీటీకి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరికీ, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాస్తున్నాం.ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు కాకుండా బడ్జెటేతర అప్పుల వివరాలు ఇవ్వాలని మండలిలో రాతపూర్వకంగా కోరితే ప్రభుత్వం దాటవేసే యత్నం చేస్తూ వివరాలు ఇవ్వలేదు. ప్రభుత్వ గ్యారంటీతో ఎన్నో అప్పులు తీసుకున్నారు. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. వీటిని బడ్జేటేతర అప్పులని కాకుండా ఏమంటారు? వీటిని మాత్రం చెప్పడం లేదు. అన్నీ దొంగచాటు వ్యవహారాలే. బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, దుష్ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు మినహా ఏమైనా మంచి జరిగిందా? అని చూస్తే ప్రజలకు ఒరిగింది సున్నా. చంద్రబాబు తన కొడుకును జాకీ పెట్టి ఎత్తుతాడు. బాబు కొడుకేమో ఆయన్ను జాకీపెట్టి ఎత్తుతాడు.. వీళ్లిద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీ ఎత్తుతాడు. పరనింద.. ఆత్మస్తుతి మినహా 16 రోజుల సభలో ఏం జరిగింది? విలేకరుల సమావేశం నిర్వహించి బడ్జెట్పై గతంలో మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలేమయ్యాయి? పరిమితికి మించి అప్పులు..ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ)కి లోబడి అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన ప్రతిసారీ ఓవైపు ఎన్బీసీని ఉల్లంఘిస్తూ మరోపక్క పరిపాలనా దక్షుడిగా బిల్డప్ ఇస్తారు. 2014–19లో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్బీసీ పరిమితి కంటే రూ.29,099 కోట్లు అధికంగా అప్పు చేశారు. అదే మా హయాంలో రెండేళ్ల పాటు కోవిడ్ ఉన్నా, ఆదాయాలు తగ్గినా, ప్రజలను కాపాడుకోవడం కోసం భారీగా ఖర్చు చేసినా, ఇ చ్చిన హామీలు అమలు చేసినా కూడా ఎన్బీసీ పరిమితి కంటే రూ. 12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. ఇది మా ఐదేళ్ల ట్రాక్ రికార్డు. బాబు అధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్. తొలి ఏడాది ఎన్బీసీ కంటే రూ.17,953 కోట్లు అప్పులు ఎక్కువగా తీసుకొచ్చారు. 2025–26లో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. రెండేళ్లలో తె చ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. మా ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.31 లక్షల కోట్లు అయితే అప్పుడే ఈ రెండేళ్లలోనే రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారన్నదానికి ఇదే నిదర్శనం. ఆర్థిక సంఘం ఆదేశాలూ లెక్కలేదు అయినా దుష్ప్రచారమే..! మహిళలను వేధించినా చర్యలు తీసుకోరా?చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మహిళల జోలికొస్తే ఆ రోజే ఆఖరు రోజంటూ బిల్డప్ ఇస్తారా? సామాన్య మహిళలు, ఉద్యోగులను వేధించిన టీడీపీ, జనసేన నాయకులపై చర్యలు ఏవి? బాధిత మహిళలు స్వయంగా మీకే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదేం? టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి మహిళను మోసం చేసి అడ్డంగా దొరికితే ఏం చేశావు?సాక్షి, అమరావతి: ‘మహిళల జోలికి వస్తే తాట తీస్తా... మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు అవుతుంది.. అని డైలాగులు వేసి వెళ్లిపోతున్నారు. స్వయంగా బాధిత మహిళలు మిమ్మల్ని కలిసి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి పార్టీ నేతల్లో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?’ అని సీఎం చంద్రబాబు వైఖరిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పారబట్టారు. చంద్రబాబు ఏలుబడిలో రక్షణ కోసం ప్రాధేయపడిన బాధిత మహిళలపైనే తిరిగి పోలీసు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతకు సంబంధించి సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీ ఎమ్మెల్యేలపై చర్యలెక్కడ బాబు?» రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేసి మోసం చేశారంటూ బాధిత మహిళ నేరుగా సీఎంకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? » కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్పై ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పడితే చర్యలు ఎక్కడున్నాయి? » మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసి, అసభ్యంగా ప్రవర్తించిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై చర్యలు ఎక్కడ? » టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఎక్కడున్నారు? » మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏను కూడా శిక్షించలేదు. ఇక్కడ ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు కనీసం రాజకీయ నాయకుల పీఏలపైనా చర్యలు తీసుకోవట్లేదు. తిరిగి బాధితురాలిపైనే కేసు పెట్టారు. బాబుకు భయం, భక్తి లేదు చంద్రబాబు పాలన అంటేనే.. మహిళలపై పాశవిక దాడులు, దారుణాలు, అఘాయిత్యాలకు కేరాఫ్గా మారిపోయింది. సాక్షాత్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో అడ్డంగా దొరికిపోతే చంద్రబాబు ఏం చేశారు? టీటీడీ చైర్మన్ను ఎందుకు వదిలేశారు? ఇక్కడ విచిత్రం ఏమంటే.. తనను మోసం చేసిన వ్యక్తికి పదవులు ఇవ్వొద్దని, విచారించి చర్యలు తీసుకోవాలని బాధితురాలు గతంలోనే బాబుకు లేఖ రాశారు. అదిప్పుడు అక్నాలెడ్జ్మెంట్తో పాటు బయటకు వ చ్చింది. అయినా చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. మహిళలను వంచించే వ్యక్తులకు దేవుడి పట్ల భయం, భక్తి ఉండదు.దేవాలయాల్లో భక్తుల మృత్యువాత!చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన తర్వాత ఆలయాల్లో భక్తులకు కనీస రక్షణ కల్పించట్లేదు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు, పలాసలో తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోగా.. మొన్న కదిరి రథోత్సవంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప నిజంగా వీళ్లకు శ్రద్ధ ఎక్కడ ఉంది? -
తప్పు తాను చేసి.. నిందలు , స్కామ్లు!
సాక్షి, అమరావతి: ‘ఒకవైపు చంద్రబాబే తప్పు చేసి.. వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండోవైపున ఆ దుమారంలోనే స్కామ్లు చేస్తారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను కిలోకి రూ.351 నుంచి రూ.716కు పెంచేసి.. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపుర్ డెయిరీ నుంచి సరఫరా చేశారు. రూ.200 కోట్ల స్కామ్కు పాల్పడ్డారు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇలాంటి వాళ్లను ఏమనాలి? రెండున్నర గంటల సినిమాలో విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే..!’ అంటూ చంద్రబాబును తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి వ్యవహారంలో మా పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం కూడా చెప్పలేదు. ఇందాపూర్ డెయిరీ, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్కు మధ్య బంధంపై నోరు ఎత్తలేదు. సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపరు. ఇక్కడ నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూనే మరోవైపు నెయ్యిలో స్కామ్లకు పాల్పడుతున్నారు. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. 2024 ఆగస్టులో కిలో నెయ్యి రూ.351కి టీటీడీకి సరఫరా జరిగితే అక్టోబర్ 2025 నాటికి.. కేవలం ఏడాదిలోనే రూ.716కు పెంచేశారు. ఏడాదిలో కేజీ నెయ్యి ధరను రూ.365 చొప్పున పెంచేసి దోపిడీకి పథకం వేశారు. నెయ్యి స్కామ్ కోసం చంద్రబాబు అండ్ కో దోపిడీ మందలా (కాటెల్) ఏర్పడి దేవుడి సొమ్మును కొల్లగొడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు రూ.351కే కిలో నెయ్యి టీటీడీకి సరఫరా అయితే.. ఆ తర్వాత 2025 జనవరి 31 నాటికి అమాంతం రూ.513కి ఎగబాకింది. 2025 అక్టోబర్ నాటికి రూ.599 దూసుకెళ్లి.. అదే నెలలో రూ.716కి చేరుకుంది. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదీ చంద్రబాబు కుట్ర..! తిరుమల హుండీలో డబ్బులు లెక్కించే పరకామణి నుంచి 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం దొంగతనంపై కేసు నమోదైంది. చంద్రబాబు హయాంలో ఇంతటి ఘోరమైన తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించారు. పైగా మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా హయాంలో రూ.75 వేల విలువైన డాలర్ నోట్లు దొంగతనం జరిగితే.. ఏకంగా రూ.15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ దేవాలయానికి రాయించారు. దేవుడి సొమ్ముతో ఎవరైనా చెలగాటం ఆడితే అది తప్పని, క్రమశిక్షణ ఉండాలంటూ అప్పటి టీటీడీ బోర్డు ఆ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీటీడీ పరకామణి లెక్కింపుల సమయంలో 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం చోరీ జరిగింది. ఈ ఘటనను బయటకు రానివ్వకుండా దాచిపెట్టారు. మరోవైపున 2025 సెపె్టంబర్లో చంద్రబాబు కుట్ర పూరితంగా.. ఎప్పుడో 2023లో పరకామణిలో రూ.75వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసి.. పశ్చాత్తాపంతో రూ.15 కోట్లు దేవుడికి రాసిచ్చిన ఘటనను తప్పుపడుతూ దు్రష్పచారం చేశారు. కానీ, చంద్రబాబు ఆరోపణ కంటే ముందు, ఆయన హయాంలో నమోదైన చోరీని మాత్రం కావాలనే బయటకు రాకుండా కప్పెట్టేశారు. నెయ్యి రేట్లు అమాంతం పెంచేసి.. చంద్రబాబు నెయ్యి వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా ఆరోపణలు చేశారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మే 15న నెయ్యి టెండర్లు ఖరారయ్యాయి. జూన్ 4న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. జూన్ 12న నెయ్యి సరఫరా ప్రారంభమైంది. వాటిల్లో జూన్–జూలైలో 4 నెయ్యి ట్యాంకులు టీటీడీ టెస్టులు పాసయ్యాయి. అదే జూలై 6, 8వ తేదీల్లో వ చ్చిన మరో 4 ట్యాంకుల టెస్టులు టీటీడీ ల్యాబ్లో నెగిటివ్ వ చ్చింది. మళ్లీ చంద్రబాబు హయాంలోనే ఆ నాలుగు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు ఆగస్టు, సెపె్టంబర్లో వేరే కంపెనీ పేరుతో మళ్లీ టీటీడీలోకి వచ్చాయి. వాటిని టీటీడీ అనుమతించింది. వాటిని లడ్డూల తయారీలో ఉపయోగించారు. ఇదంతా దాచిపెట్టిన చంద్రబాబు.. కుట్ర పూరితంగా సెపె్టంబర్ 18న తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఎదురు ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే మాపై నెట్టేశారు. అసలు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు వెనక్కి రాకూడదు. అలాంటి వాటిని వెనక్కి రప్పించి వినియోగించారు. ఇక్కడ వైష్ణవి డెయిరీ, సంగం డెయిరీ సంబంధాలు అందరికీ తెలుస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు తప్పు చేసి వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండో వైపున దుమారంలోనే స్కామ్లు చేస్తారు. హెరిటేజ్ వెబ్సైట్లో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని రాసుకున్నారు. అదే క్రమంలో హెరిటేజ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ను వాళ్లే ఫైర్ చేస్తారు. ఏడాదిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కి పెంచేసి స్కాములు చేసుకుంటారు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? సినిమాలో రెండున్నర గంటల విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే!శ్రీవారి సొమ్ము.. అయినవారికి దోచిపెట్టేందుకు..బాబును సీఎంగానే భరించలేకపోతున్నారుఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు?.. వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలుసాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియా ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు బుధవారం అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘చంద్రబాబును ముఖ్యమంత్రిగానే రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు..?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1,100 మందిలా మాట్లాడుతున్నారంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన మరో ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలు అంత నిబద్ధతతో ఉన్నారు. బలంగా పని చేస్తున్నారు. అది మంచి విషయమే’ అని పేర్కొన్నారు. -
నమ్మించి నిండా ముంచి.. దగా పాలన
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబు తన పాలనలో అన్ని వర్గాల వారిని నిండా ముంచారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులను సైతం తన అబద్ధాలతో వంచించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరును కడిగి పారేశారు. ‘పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏప్రిల్లో సున్నా వడ్డీ ఇచ్చేవాళ్లం. మేం ఐదేళ్లలో రూ.4,900 కోట్లు ఈ పథకానికి ఇచ్చాం. చంద్రబాబు మేనిఫెస్టోలో వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. పెంచడం కథ దేవుడెరుగు.. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేశారు. ఈయన మేనిఫెస్టోలో చెప్పిన రూ.10 లక్షల ప్రకారం చూస్తే ఈయన ఇవ్వాల్సింది ఏటా రూ.3,500 కోట్లు. ఈ మూడేళ్లలో కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇస్తారని అక్కచెల్లెమ్మలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పొదుపు సంఘాల పరిపతి తగ్గిపోయింది. ఏకంగా రూ.10 వేల కోట్ల రుణాలు తగ్గిపోయాయి. నాబార్డు డేటా ప్రకారం రూ.40 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు తగ్గిపోయాయి. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. వీళ్లు ఇస్తామన్నా సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎగ్గొట్టేశారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు» విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని సీఎం చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడిగాం. కానీ ఒక్క మాట లేదు. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫై చేసి ఇచ్చే వాళ్లం. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. అక్కడి నుంచి పిల్లల కష్టాలు మొదలయ్యాయి. » అసెంబ్లీ జరుగుతుండడంతో ఎక్కడ గొడవవుతుందో అని బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) రూ.1,200 కోట్లు ఇచ్చారు. బీఆర్వో ఇస్తే డబ్బులు ఇచ్చినట్టు కాదని ఆరోజే చెప్పాను. కానీ ఇచ్చింది రూ.300 కోట్లే అంటున్నారు. మొత్తంగా వీళ్లు ఇచ్చింది రూ.2,071 కోట్లు మాత్రమే. అంటే రూ.6,428 కోట్లు ఈ రెండేళ్లకే బాకీ పడ్డారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 4 క్వార్టర్స్కు రూ.700 కోట్ల చొప్పున రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఏప్రిల్ 2026లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి ఈ ఏడాది రూ.3,900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. తొలి రెండేళ్లూ బాకీపడ్డ రూ.6,428 కోట్లు కలిపితే మొత్తంగా రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది బడ్జెట్లో వీళ్లు జరిపిన కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. » ఒక్కో త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.700 కోట్లు ఖర్చవుతుంది. 9 క్వార్టర్స్కు రూ.6,300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతీ ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఎన్నికల కోడ్ రాకతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025.. అంటే రెండేళ్లలో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. ఈ రెండు కలిపితే విద్యా దీవెన కింద రూ.6,300 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు కలిపి మొత్తంగా రూ.8,500 కోట్లు ఇవ్వాలి. కానీ 2024–25 బడ్జెట్లో రూ.1,771 కోట్లు విడుదల చేసినట్టు చూపించారు. » ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? కళాశాల యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు కట్టించుకుంటున్నాయి. కట్టలేని పిల్లలు చదువులు మానేస్తున్నారు. తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. చదువులు మానేస్తున్న పరిస్థితి. అయినా సరే చంద్రబాబుకు మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలైన తర్వాత కూడా ఇవి ఎప్పుడు ఇస్తావని అడిగితే చంద్రబాబు నోటి నుంచి మాట రావడం లేదు. ఆరోగ్యశ్రీకి భారీ బకాయిలు» ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ఆగిపోయింది. 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో నిరసన తెలిపారు. ఆ ఆధునిక దేవాలయాలైన బోధనాస్పత్రులను పూర్తి చేయాలని కోరితే చంద్రబాబు దగ్గర నుంచి స్పందన లేదు. ఆరోగ్యశ్రీ కింద రూ.3,150 కోట్ల బకాయిలు పెట్టారు» 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే మరో రూ.4 వేల కోట్లు కావాలి. అంటే, బకాయిలతో కలిపి చూస్తే రూ.7,150 కోట్లు రాబోయే ఆర్థిక ఏడాదిలో ఖర్చు చేయాలి. చంద్రబాబు బడ్జెట్ కేటాయింపులు మాత్రం రూ.4 వేల కోట్లు చేశారు గానీ, అంతకు ముందు సంవత్సరాలు చూస్తే ఎప్పుడూ కూడా రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నెట్వర్క్ ఆస్పత్రులు ఒకవైపు బంద్ ప్రకటిస్తున్నాయి. తాము అగ్రిమెంట్లు చేసుకోమని నోటీసులు ఇస్తున్నాయి. దీనిపై చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా అనిపించట్లేదు.బాబు కేరాఫ్ క్రెడిట్ చోరీ!» చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రెండే పనులు చేస్తారు. ఒకటి పింఛన్ పంపిణీలో ప్రచారం చేసుకోవడం.. రెండు ఏదో గ్రామానికి వెళ్లిన చోట రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తానని బిల్డప్ ఇస్తారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, టెక్నాలజీ వినియోగం, క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు, భూములను జియో కో ఆర్డినేట్స్తో హద్దులు నిర్ణయిస్తున్నానంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవే.» జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకు థ్యాంక్స్ కూడా చెప్పరు. వాస్తవానికి సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జీయో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? ఇవన్నీ చంద్రబాబు చెప్పరు. » సచివాలయ వ్యవస్థలో 15 వేల మంది సర్వేయర్లు, వారితో పాటు రెవెన్యూ, డిజిటల్ అసిస్టెంట్లు లేకుండా ఈ పనులన్నీ అయిపోయాయా? అంత కష్టపడి పని చేసిన ఉద్యోగులకు కనీసం ప్రోత్సాహకం కల్పించకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏకంగా 50–60 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిపై కనీసం సానుభూతి ప్రదర్శించట్లేదు. సర్వేయర్లకు సస్పెన్షన్లు, వేధింపులు బహుమానంగా ఇస్తున్నారు. చిక్కటి చిరునవ్వులతో ప్రోత్సహించి పనులు చేయించుకోవాల్సిన చోట చావులకు పురిగొల్పుతున్నారు. ఇదీ చంద్రబాబు పాలన.సున్నా వడ్డీకిదిక్కు లేదు» ఒకవైపు సున్నా వడ్డీకి దిక్కు లేదు. మరొకవైపు ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. ఇంకోవైపు హామీలన్నీ మోసాలుగా తేలాయి. ఇవేమీ చేయకుండా మహిళా దినోత్సవం రోజున అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ చంద్రబాబు కోతలు కోస్తున్నారు. మహిళా సాధికారత కోసం మా హయాంలో అమూల్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్, ఐటీసీ, రిలయన్స్ వంటి బహుళ జాతి సంస్థలను తీసుకొచ్చాం.» బ్యాంక్ లింకేజ్తో టై అప్ చేసి ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారి చేయడం కోసం మా ప్రభుత్వ హయాంలో ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర, సున్నా వడ్డీ.. ఇలా అనేక పథకాలు అమలు చేసి అక్కచెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే.. చంద్రబాబు ఇవన్నీ రద్దు చేసి వాళ్లను మోసగించారు. » మా హయాంలో అక్కచెల్లెమ్మలకు రుణాలు ఏటా పెరిగాయి. 2020–21లో రూ.20,808కోట్లు, 2021–22లో రూ.33,568 కోట్లు, 2022–23లో రూ.38,014 కోట్లు, 2023–24లో రూ.49,626 కోట్లకు పెంచుకుంటూ పోతే.. చంద్రబాబు హయాంలో రూ.41,623 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది రూ.30,698 కోట్లకు దిగజారిపోయింది. మహిళా సాధికారత కాదు.. మహిళలను నాశనం చేస్తున్నారు.» త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. కనీసం మేము మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగితే మాట్లాడడు. కానీ, త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్క అక్కచెల్లెమ్మకు ఒక్క గజం స్థలం ఇచ్చాడా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని మంజూరు చేయలేదు. » మేము 31 లక్షల పట్టాలిచ్చి, 21 లక్షల ఇళ్లు మంజూరు చేసి, 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్లకు ఇవ్వకుండా ని«ధులు మళ్లించాడు. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. ఉన్న ఇళ్లను పూర్తి చేయమంటే.. త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటాడు. మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి ఆదివాసీలకు రూ.లక్ష, కొండ ప్రాంతంలో కాకుండా కిందనున్న ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలు, చేనేతలకు రూ.50 వేలు చొప్పున అదనంగా ఇస్తామన్నాడు. రెండేళ్లలో ఒక్కరికైనా ఒక్క పైసా అయినా ఇచ్చాడా? ఇవ్వలేదు. దీనిపై గట్టిగా అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఆయన నోట్లో నుంచి ఒక్క మాట రాలేదు.ఐఆర్ ఏదంటే ఉలకట్లేదు అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటికీ అతీగతీ లేదు. అసలు పీఆర్సీ ప్రస్తావన తేవట్లేదు. నాలుగు పెండింగ్ డీఏలు, డీఆర్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుచేయాలంటూ విజయవాడలో ధర్నా చేస్తుంటే.. అర్ధరాత్రి పూట పోలీసులతో దాడి చేయించి అక్కడి నుంచి ఎత్తించేశారు.పాలు, నీళ్లు తాగినా చావులే!» చంద్రబాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. స్కూళ్లు, హాస్టళ్లల్లో నాణ్యమైన భోజనం కూడా పెట్టట్లేదు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. నాడు–నేడు ఎత్తేయడంతో కలుషితమైన తాగు నీరు, ఆహారం తిని పిల్లలు చనిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థతి. జీరో వెకెన్సీ పాలసీ గాలికి వదిలేశారు. 17 కొత్త బోధనాస్పత్రులను స్కాముల కోసం పనులు నిలిపివేశారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆస్పత్రుల్లో జీఎంపీ మందుల మాట దేవుడెరుగు సాధారణ మందుబిళ్ల కూడా దొరకట్లేదు.కళ్లార్పకుండా అబద్ధాలు » ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేశారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఆపేశారు. గోరుముద్దకు అన్యాయం చేశారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే ప్రభుత్వ స్కూళ్లలో జీఈఆర్ శాతం తగ్గిపోయింది. 2023–24లో దాదాపు 43 లక్షల మంది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తే.. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏకంగా 33 లక్షలకు పడిపోయింది. అంటే 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు.» సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అమలు చేయరు. మా ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. » ఇంత విధ్వంసాన్ని సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ప్రతి జంట ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. చివరికి చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రతి జంటకు రూ.లక్ష ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తారట! చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు.కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేయడంలో చంద్రబాబుకు తగ్గ తనయుడు పుట్టాడు. -
హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్ జగన్
మహిళలకు మళ్లీ మోసం.. సూపర్ సిక్స్, సెవెన్ అని మోసం చేశావ్.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మళ్లను అన్ని విధాలా దగా చేశావ్.. మహిళలకు అందించిన పథకాలన్నీ రద్దు చేశావ్. ఆఖరికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచించావ్.. ఇప్పుడు మరోసారి మభ్యపెడుతున్నావ్.. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలుఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఐఆర్’ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. నాలుగు పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా పోలీసులతో దాడి చేయించారు.నెయ్యిపై దుమారం రేపి.. స్కామ్లుతిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదేనా తాట తీయడం? తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబూ! టీటీడీ చైర్మన్ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో దొరికిపోతే ఏం చేశావ్ బాబూ? కేజీబీవీ ప్రిన్సిపాల్పై టీడీపీ ఎమ్మెల్యే కూన వేధింపుల మీద చర్యలేవి? – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉద్యోగులకు మీరు బకాయి పడిన నిధులు ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదెందుకు?’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ అడుగుతున్నా.. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు. హామీల పేరిట బాకీ పడ్డ సొమ్ములు ఎప్పుడిస్తావు? అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు’ అంటూ నిలదీశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటలు.. పాటలు.. స్కిట్లతో కాలక్షేపం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శిస్తూ.. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. ఆ హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులను వివరిస్తూ.. ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా చూపుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అన్నదాత సుఖీభవ.. నిలుపునా మోసం⇒ పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేలు ఇస్తామన్నాడు (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రూ.6 వేలు కాకుండా ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ప్రదర్శించారు). తొలి ఏడాది ఎగ్గొట్టాడు. రెండో ఏడాది రూ.20 వేలకు గాను అప్పుడో రూ.ఐదు వేలు.. అప్పుడో రూ.ఐదు వేలు ఇచ్చాడు. అంటే రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. మా హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వారి సంఖ్యను 46.85 లక్షల మందికి కుదించేశారు. దాదాపు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఈ బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావు అని అడిగితే అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదు. ⇒ 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూ రెన్స్ ప్రీమియం కట్టి ఉంటే.. కేంద్రం ఇవ్వాల్సింది జత చేసేది. ఆ వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించేవి. ఈ పెద్దమనిషి 2024 జూన్లో ప్రీమియం డబ్బులు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్లు నష్టపోయారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 సీజన్లలో రూ.3,500 కోట్ల మేర బీమా పరిహారం నష్టపోయారు. ఇది ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ అక్టోబర్లో మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే వీళ్ల నోటి నుంచి ఒక్క మాట రాదు. ⇒ మా ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు పెట్టి.. రూ.7,500 కోట్లు వెచ్చించి అండగా నిలిచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. ఏ రైతుకు అయినా తాను వేసిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా పర్యవేక్షిస్తూ ధరలు పడిపోయినా ప్రతిసారీ ఆదుకున్నాం. పైగా ప్రతీ ఆర్బీకేలో ప్రతి పంటకు నిర్దేశించిన మద్దతు ధరలతో బోర్డులు పెట్టి దళారుల వెన్నులో వణుకు పుట్టించేవాళ్లం. అంతకంటే తక్కువ రేటుకు కొనేందుకు సాహసిస్తే.. వెంటనే స్పందించేవాళ్లం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమా.. రైతులంటే ఇంత చులకనేంటయ్యా.. అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు.ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు⇒ గతేడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, శనగలు, మిర్చి, టమాటా, చీనీ, పత్తి అన్ని పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్లీ మిర్చి, శనగ, అరటి, మొక్కజొన్న పంటలకు ధరలు పడిపోయాయి. నెల క్రితం క్వింటా రూ.26 వేలున్న మిర్చి.. ఈ రోజు రూ.18 వేలకు పడిపోయింది. శనగ కనీస మద్దతు ధర రూ.5,875.. రైతులకు రూ.5 వేలకు మించి రావడం లేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 అయితే, రైతులు కేవలం రూ.1400–1500కు అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క పంటపైనే రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు.⇒ అరటి ఈ ఏడాది కూడా టన్ను రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో టన్ను రూ.30 వేలు పలుకగా, ఈ రోజు రూ.5 వేలకు తెగనమ్ముకుంటున్నారు. టమాటా కిలో రూ.2కు అమ్ముకోవాల్సి వస్తోంది. బత్తాయి, పుచ్చకాయ, మస్క్మెలన్, సజ్జలు ఇలా అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి రైతులకు తోడుగా నిలవాల్సింది పోయి బడ్జెట్లో రూ.300 కోట్లు పెట్టారు. ఇంత తక్కువ ఎందుకు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు.⇒ రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. అసెంబ్లీలో వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉందంటే.. వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. వీరికి పరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగితే అసెంబ్లీలో ఒక్క మాట చెప్పలేదు. కనీసం వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించడం, వారికి భరోసా కల్పించడం మచ్చుకైనా చేయలేదు. మరో 7.46 లక్షల పింఛన్లు కోత వేయబోతున్నారు⇒ 2024 ఎన్నికల షెడ్యూల్ నాటికి మార్చిలో మేము ఇచ్చిన పింఛన్ల సంఖ్య 66,34,372. ఈ నెలలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య 60,69,664. అంటే ఇప్పటికే 5,64,708 పింఛన్లు కట్ చేశారు. 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి పింఛన్లు ఇస్తే.. మార్చిలో 60,69,664 మందికి ఇచ్చారు. అంటే ఈ ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ఇలా ప్రతీ నెలా పింఛన్లు కట్ చేసూ్తనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.⇒ కొత్త పింఛన్ల మంజూరు కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా హయాంలో ప్రతి ఆర్నెల్లకోసారి జూన్, డిసెంబర్లలో పింఛన్లు అప్డేట్ చేసే వాళ్లం. ఈరోజు ఆ పరిస్థితి కన్పించడం లేదు. కనీసం మార్చిలో ఇచ్చిన పింఛన్ల సంఖ్యను బట్టి చూసినా ఈ ఏడాది బడ్జెట్లో రూ.31,554 కోట్లు పెట్టాలి. కానీ బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.27,719 కోట్లు. అంటే మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బడ్జెట్లో ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో చెప్పాలని అడిగాం. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా లేదు.తల్లికి వందనం పేరిట దగా⇒ తల్లికి వందనం కింద చదువుకునే ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని కత్తిరించారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ–యూడైస్) ప్రకారం 2023–24లో బడికి వెళ్లే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. కానీ ఇచ్చింది 67 లక్షల మందికే.తల్లికీ వంచనే.. యూడైస్ ప్లస్ ప్రకారం 87,41,885 మంది పిల్లలకు తల్లికి వందనం కింద రూ.13,112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.8,456.48 కోట్లు మాత్రమే ⇒ పైగా ఏ ఒక్కరికి రూ.15 వేలు ఇవ్వలేదు. కొంత మందికి రూ.8 వేలు, మరికొంత మందికి రూ.9 వేలు, ఇంకొంత మందికి రూ.10 వేలు, అక్కడక్కడా అతి కొద్ది మందికి రూ.13 వేలు చొప్పున ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులతో పాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. తీరా ఇప్పుడు షరతులు పెట్టారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు. ⇒ దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్కే ఇచ్చి మిగిలిన రెండు సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టారు. గ్యాస్ కంపెనీల డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 59 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్కు రూ.855 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తొలి ఏడాది రూ.786 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్లో రూ.2,199 కోట్లుగా చూపించారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఈ బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. మరి రూ.12 వేల కోట్లకు గానూ ఇచ్చింది సగం కూడా లేదు. ఈ పథకం కింద మహిళలకు రూ.6,144 కోట్లు బాకీ పడ్డారు. ఈ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని అడిగితే నోరు మెదపడం లేదు.నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైంది?⇒ యువగళం పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా రూ.36 వేల చొప్పున మూడేళ్లకు ప్రతి నిరుద్యోగికి బాకీపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే నోరు మెదపడం లేదు. ఆడబిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు 1,78,99,440 మంది ఉండగా.. ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు ⇒ సూపర్ సిక్స్లో రెండో కీలకమైన హామీ..18 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1,78,99,440 మంది అర్హులు. వీరికి ప్రతి నెలా రూ.1,500.. ఏడాదికి రూ.18 వేలు చొప్పున మూడేళ్లకు బాకీ పడ్డ రూ.54 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ⇒ మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ పథకం. ఈ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు..ఇలా మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మాట్లాడటం లేదు.ప్రతినెలా 25 వేలకు పైగా పింఛన్ల కోత వైఎస్ జగన్ 2024 మార్చిలో 66,34,372 మందికి పింఛన్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పింఛన్లు ఇచ్చినది 60,69,664 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే బకాయిలతో కలిపి రూ.7,150 కోట్లు కావాలి. బడ్జెట్లో రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు గతంలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లైనా లేదు. పిల్లల చదువులెలా సాగుతాయి? ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద బకాయిలతో కలిపి మొత్తం రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. పెన్షన్లు కటింగ్...50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. మరోవైపు సామాజిక పెన్షన్లు ఇప్పటికే 5,64,708 కట్ చేశారు. ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ప్రతీ నెలా పింఛన్లు కట్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛనూ ఇవ్వలేదు. పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను బట్టి మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇంకెప్పుడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు పచ్చ పత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన అన్నదాతకు దగా...పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నాడు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి తూట్లు పొడిచారు. రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆటపాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఇళ్లపై దొంగ మాటలు..మేం 31 లక్షల పట్టాలిచ్చి 21 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. కనీసం మేం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్క అక్క చెల్లెమ్మకైనా గజం స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు.ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకూ థ్యాంక్స్ చెప్పరు. సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? -
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే మార్గాలను పార్టీ రంగుల తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్పీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా పార్టీ పతాకాలు ఎగుర వేయాలని కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో నేతలు, అభిమానులు, కార్యకర్తలు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. -
'ప్రజాహితమే' పరమావధి
ప్రజాహితమే పరమావధిగా, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్సీపీ. 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద ఒక్కడితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలు, నిరు ద్యోగ వర్గాల సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ వచ్చారు. మొగ్గలోనే తుంచేసేందుకు కుట్రలు నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది జగన్ సిద్ధాంతం. వైఎస్సార్సీపీలో ఎవరైనా చేరాలంటే... వారు ఉంటున్న పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్ర మించిన పదవులకు రాజీనామా చేసి... వైఎస్సార్సీపీలో చేరారు. ఖాళీ అయిన 19 శాసనసభ, నెల్లూరు లోక్సభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి 2012 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన కాంగ్రెస్, టీడీపీ అధిష్ఠానాలు కుమ్మక్కై కుట్రకు తెరతీశాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ను విచారణ పేరుతో పిలిపించిన సీబీఐ 2012 మే 27న అరెస్టు చేసింది. జగన్ ను అక్రమంగా నిర్బంధించడం ద్వారా ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించాలన్నది ఆ పార్టీల పన్నాగం. ఏ కేసులోనైనా అరెస్టయిన వారికి 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలన్నది నిబంధన. కానీ 16 నెలల పాటు జైలులో అక్రమ నిర్బం«ధం వల్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్సీపీని జగన్ బరిలోకి దించారు. 67 శాసనసభ స్థానాలు, ఏడు లోక్సభ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ బలమైన ప్రతి పక్షంగా అవతరించింది. టీడీపీ అరాచకాలను నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా ఇటు శాసనసభలో, అటు బయటా రాజీలేని పోరాటాలు చేశారు. వైఎస్సార్సీపీ బలీయమైన శక్తిగా మారుతుండటాన్ని చూసి ఓర్వలేని నాటి సీఎం చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా కుట్రలు చేశారు. ఫిరా యించిన ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువలకు సమాధి కట్టారు. దీన్ని నిరసిస్తూ... ప్రజల్లోనే తేల్చుకుంటానని ప్రకటిస్తూ 2017 అక్టోబర్ 26న శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో, మండుటెండలో, కుంభ వృష్టిలో 14 నెలలపాటు 3,648 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాలను ఒక పార్టీ దక్కించుకున్న దాఖలాలు ఇదివరకు లేవు. సువర్ణాక్షరాల సుపరిపాలనవైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించడంతో 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్న ఏకైక పార్టీగా వైఎస్సార్సీపీ నిలిచింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసు కొచ్చారు. వికేంద్రీకరణతో సుపరిపాలన అందించారు.తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి... 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరించారు. నామి నేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. దేశ చరిత్రలో సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చెప్పింది వైఎస్సార్సీపీ ఒక్కటేనని సామాజిక వేత్తలు ప్రశంసించారు.అనునిత్యం ప్రజల్లోనే...అయితే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కట్టడం... ‘సూపర్ సిక్స్’తో పాటు 143 హామీలు ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయింది. అయినా అనునిత్యం వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ తమ విధానం ప్రజాపక్షమని చాటి చెబుతున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే కక్ష సాధింపు చర్యలు, విధ్వంసం, హత్యాకాండకు దిగింది. ఈ అరాచక పాలనను దేశానికి చాటి చెప్పేందుకు 2024 జూలై 24న ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా నిర్వహించారు. గత 22 నెలలుగా రైతు సమస్యలు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున పోరాటాలు చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పాటుపడుతున్నారు.– సాక్షి, అమరావతి బ్యూరో -
భవానీపురం దర్గా ఉరుసు ఉత్సవాలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: విజయవాడ భవానీపురంలో దర్గా ఉరుసు ఉత్సవాలు రేపటి నుంచి (గురువారం) జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దర్గా ముజావర్ల కమిటీ ఆహ్వానించింది. సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్, చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ కూడా ఉన్నారు. -
కదిరి రథోత్సవం తొక్కిసలాటపై జగన్ రియాక్షన్
-
చంద్రబాబు ఉప ప్రధానా..! ఓ రేంజ్ లో ఇచ్చి పడేసిన జగన్
-
కావూరి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు.Deeply saddened by the passing of former Union Minister and senior leader Sri Kavuri Sambasiva Rao Garu. My heartfelt condolences to his family members. May his soul rest in peace. pic.twitter.com/uhnHH6ljNG— YS Jagan Mohan Reddy (@ysjagan) March 11, 2026 -
మా 11 మంది దమ్ము ఏంటో అర్థమైందా.. వెళ్తూ వెళ్తూ పవన్ కి ఇచ్చిపడేసిన జగన్
-
బాబును సీఎంగానే భరించకపోతున్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని అన్నారు.ఇక, అంతకుముందు.. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. వైఎస్ జగన్ స్పందిస్తూ.. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పుకొచ్చారు. -
BR నాయుడు రాసలీలలుపై వైఎస్ జగన్ రియాక్షన్
-
ఎదో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు.. ఆటలు, పాటలు, డాన్సులు.. రఘు రామ వేషాలు..
-
బీఆర్ నాయుడు, జనసేన శ్రీధర్పై చర్యలేవి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్యలేవి? అని నిలదీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.లిస్ట్ ఇదే.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్ఐ, పాస్బుక్ క్యూఆర్ కోడ్ భూమలు జియో ట్యాగింగ్ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
అన్నదాత సుఖీభవ 20 వేలు ఇస్తా.. లైవ్ లో చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వైఎస్ జగన్..
-
15 వేల మాట దేవుడెరుగు.. తల్లికి వందనం డబ్బులు ఎక్కడ అని అడిగితే..
-
చంద్రబాబు, పవన్ కలిసి లోకేష్ ను జాకీలు పెట్టి మరీ లేపుతారు.. కానీ ఏం లాభం..
-
YSRCP ఐదు ఏళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు 2 ఏళ్లలో చేసేసాడు
-
బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
టీడీపీ ఏడాదిలో చేసిన అప్పులు.. ఆధారాలతో బయట పెట్టిన వైఎస్ జగన్
-
చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని చంద్రబాబు ఉల్లంఘిస్తూనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?. బడ్జెట్లో మోసాలు కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పింది. నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది. 2023-24లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,36,486 కోట్లు. 2023-24లో రాబడులు రూ.1,70,767 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు రూ.32,680 కోట్లు. ద్రవ్యలోటు రూ.62,719 కోట్లు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,096 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వంలో రాబడులు 1,68,024 కోట్లు మాత్రమే. చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లు.అప్పుల్లోనూ ఉల్లంఘనలే.. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయి. రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. కూటమి వచ్చాక ద్రవ్య లోటు 32.5 శాతం పెరిగింది. చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే. 2024-25లో జీఎస్డీపీలో అప్పుల శాతం 5.89 శాతం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం 4.1 శాతమ మాత్రమే. మేము తూచా తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నాం. అయినా అప్పులు 4.1 శాతం మాత్రమే చేశాం. ఎన్బీసీకి లోబడే ఎవరైనా అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య అనుమతించిన దాని కన్నా అధికంగా అప్పులు చేశారు. చంద్రబాబు రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు చేశారు. మా హయాంలో పరిమితి కన్నా తక్కువగా అప్పులు చేశాం. రూ.12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. కరోనా పరిస్థితులు కూడా తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు రాగానే మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. 2024-25లో పరిమితికి మించి 17,953 కోట్లు అధిక అప్పులు. 20 నెలల్లో బాబు తెచ్చిన అప్పులు 3.20 లక్షల కోట్లు దాటాయి. మేము ఐదేళ్ల కాలంలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. మేము ఐదేళ్లలో చేసిన అప్పు.. బాబు రెండేళ్లలోనే చేశారు. ఏపీని దోచుకుంటున్నారు కాబట్టే ఆదాయం పెరగడం లేదు.కేంద్రానికి లేఖ రాస్తాం..బినామీలు, ఎల్లో మీడియా సహచరులు దోచుకుంటున్నారు. విశాఖలో రూ.5000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. చంద్రబాబు సమీప బంధువుకు భూములు కట్టబెట్టారు. ఇలా దోచిపెడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదు. చంద్రబాబు పాలన చేయడం లేదు.. బిల్డప్ మాత్రమే. 2024-25 కాగ్ రిపోర్టు ప్రకారం అప్పు రూ.81,082 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా రూ.60,485 కోట్లు అని బాబు తప్పుడు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు సమాచారంపై కేంద్రానికి లేఖ రాస్తాం. డీవోపీటీకి, కేబినెట్, ఫైనాన్స్ సెక్రటరీలకు లేఖ రాస్తాం' అని అన్నారు. -
చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. కాగ్ నివేదికే సాక్ష్యం
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆర్థిక విధ్వంసంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయినేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు 2023-2024లో రాబడులు రూ.1,70,767 కోట్లు చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906కోట్లు చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,285కోట్లు రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవిన్యూ లోటు 56శాతం పెరిగిందిచంద్రబాబు వచ్చాక రాబడులు తగ్గాయిచంద్రబాబు వచ్చాక ద్రవ్య లోటు 30శాతం పెరిగిందికోవిడ్ ఉన్నా.. ఆదాయాలు తగ్గినా నెరవేర్చుతూ హామీలు నెరవేర్చాం.కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిందిచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అమాంతం పెంచారునెట్ బారో సీలింగ్ పరిధి దాటిందిరాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి నెట్ బారో సీలింగ్ పరిధి దాటిందిచంద్రబాబు అండ్ కో దోచిపెట్టడమే సరిపోతుందిమట్టిని,ఇసుక,భూములు,లిక్కర్ దేన్ని వదలడం లేదుఅన్నీంట్లో దోపిడీయేప్రభుత్వానికి ఆదాయానికి ఎలా వస్తుందిప్రజలకు సంక్షేమం ఎలా అందుతుందివీళ్ల దోపిడికి వైజాగ్లో జరిగిన భూదోపిడీయే నిదర్శనంఇలా చేస్తే ఆదాయాలు వస్తాయి.చంద్రబాబు పాలనకు ఆయన బిల్డప్కు తేడా చూపించే మరో చరిత్రఓవైపు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తారుఅప్పులు చేస్తారుఆ అప్పులు బయట పడకుండా దాచేస్తే ప్రయత్నం చేస్తారుకాగ్ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లుకానీ అసెంబ్లీలో రూ.60,485.40 కోట్లు సుమారు 20వేల కోట్లు వ్యత్యాసం ఉంది16రోజుల అసెంబ్లీ సమావేశాలతో ప్రజలు ఒరిగింది సున్నాచంద్రబాబుఅధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్:2024-25లోనే పరిమితికి మించి రూ.17,953కోట్లు అధికంగా అప్పులు తీసుకువచ్చారు:ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి ఇంతకన్నా కూడా ఘోరంగా ఉంది.ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ.3.2లక్షల కోట్లు:మా హయాంలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ రెండేళ్లలోనే చేశారు: మా ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమే : ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు, ఎవరు ఆర్థిక వ్యవస్థను Damage చేశారన్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది:రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు: విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయాలు రావడంలేదు:వనరులన్నింటినీ కూడా దోచేసి సొంత జేబులు నింపుకుంటున్నారు:ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్స్, లెటరైట్, గ్రానైట్, లిక్కర్, భూములు, అధిక రేట్లకు పీపీఏలు దేన్నీ వదిలిపెట్టడంలేదు:దోపిడీ జరిగితే, ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తుంది?విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను కారుచవకగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు:రూ.5వేల కోట్ల విలువ చేసే 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు కబ్జాచేస్తున్నారు:పొక్లెయిన్లతో లెవల్ చేసి, ప్రభుత్వం పెట్టిన బోర్డులను పీకేసి ఆక్రమించుకుంటున్నారు:ఇంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి, ఆయన బంధువు, లోక్సభ ఎంపీ కలిసి ప్రజల ఆస్తులను దోచేస్తున్నారు:ప్రభుత్వంతోపాటు వ్యవస్థలన్నీ చోద్యం చూస్తున్నాయి:ప్రజల ఆస్తులను రాబందుల్లా కొల్లగొడుతున్నారుఆర్బీఐ అడ్వాన్స్లమీద ఆధారపడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో,మినిమం బ్యాలెన్స్ నగదు నిల్వ ఉండే రోజులు పడిపోయాయి:ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో నగదు నిల్వలున్న సమయం కేవలం 8 రోజులకు పడిపోయింది. 365 రోజుల్లో 357 రోజులు మినిమం బ్యాలెన్స్ కూడా ట్రెజరీల్లో లేవు. చంద్రబాబు తాను చేస్తున్న పరిపాలనకు, ఆయన ఇస్తున్న బిల్డప్కు మధ్య తేడా కనిపిస్తోంది:వైయస్సార్సీపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారుచేస్తున్న అప్పుల్ని బయటకు రానీయకుండా దాచేసే ప్రయత్నంచేస్తున్నారు.2024-25లో చేసిన బడ్జెట్ అప్పులు రూ.60,485 కోట్లని వీళ్ల ప్రభుత్వం చెప్తోంది, కాని కాగ్ మాత్రం ఆ ఏడాదిలో చేసిన అప్పులు రూ.81,071 కోట్లని తేల్చిచెప్పింది. దాదాపుగా రూ.20 వేల కోట్ల అప్పులను, వాస్తవంకంటే తక్కువ చేసి చూపించారు. 2024-25లో బడ్జెట్ వెలుపల చేసిన అప్పులపై వివరాలు ఇవ్వమని మండలిలో రాతపూర్వకంగా ప్రశ్నించాం: అలాంటి అప్పులేవీ చేయలేదంటూ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నంచేసింది: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు, ప్రభుత్వ గ్యారంటీతో, పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటన్నింటినీకూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనక ఏమంటారు? కాని వాటి లెక్కలను చెప్పడం లేదుసభను తప్పుదోవ పట్టించిన అధికారులపై డీవోపీటికి ఫిర్యాదు చేస్తాం మొత్తం 16 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చూస్తే, తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్డబ్బాలు తప్ప ప్రజలకు ఒరిగింది సున్నా చంద్రబాబు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే, చంద్రబాబుకి ఆయన కొడుకు జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్లిద్దరికీ పవన్కళ్యాణ్ మరొక జాకీ పెట్టి లేపుతాడు ఆత్మస్తుతి... పరనింద మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టారుసూపర్ సిక్స్,సూపర్ సెవన్లు లేవు నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు 18ఏళ్లు నిండిన 60ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధికింద రూ.1500ఇస్తామని హామీ ఇచ్చారు మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావన లేదుప్రతి నిరుద్యోగికి రూ.1.08లక్షల బకాయి పడ్డారుఈ బడ్జెట్లలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు ఇదే విషయం గురించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా50ఏళ్లు నిండిన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు నెలకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామన్నారు. హామీ అమలు చేశారా?మా హయాంలో 66,34,372 మందికి పెన్లను ఇచ్చాం2026ఫిబ్రవరి నాటికి 60,96,108 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు2026 మార్చి నాటికి 60,69,664 పెన్షన్లు మాత్రమే ఇచ్చారుఒక్క నెలలో 25వేల పెన్షన్లు కట్ చేశారుమా హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాంపెన్షన్ల కోసం బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లుబడ్జెట్లో పెట్టింది రూ.27,719కోట్లు మాత్రమే భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉందిపెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదుudisc ప్రకారం 87,41,885 మందికి అమ్మ ఒడి ఇచ్చాంతల్లికి వందనం పేరుతో 20లక్షల మంది పిల్లలను తొలగించారుఉచిత బస్సు హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయారు ఆ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పడంలేదు:పిల్లల సంఖ్యకు తగినట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవని గట్టిగా ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపలేదు ఉచిత బస్సు ప్రయాణానికి దారుణమైన షరతులు పెట్టారు16 రకాల సర్వీసులు ఉంటే 5 రకాల సర్వీసులకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నిస్తే… నోరుమెదపలేదు. “రైతు భరోసా’’ కింద మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే మాట్లాడలేదు. రెండేళ్లకు గాను ఇవ్వాల్సింది రూ.40వేలు, ఇచ్చింది పదివేలే:ఈ పథకానికి దూరంచేసిన 7 లక్షలమంది రైతుల పరిస్థితి ఏమిటి అని అడిగితే నోరు మెదపలేదు:కౌలు రైతులకు ఒక్కరూపాయికూడా ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే దానిగురించి కూడా మాట్లాడలేదు.ప్రీమింయ కట్టకపోవడం వల్ల 2023-24, 2024-25 వ్యవసాయ సీజన్లలో రూ.3,500 కోట్లు రైతులు నష్టపోయారు:వీరికి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే.. ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మాటకూడా మాట్లాడలేదు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు:ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా? ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు:వైఎస్సార్సీపీహయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు ఛైర్మన్ ద్వారా ఇచ్చారు:ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి:నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5 వేలలోపే అమ్ముకుంటున్నారు:మొక్కజొన్న ఎంఎస్పీ రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి:ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు: అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది:మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు:వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం: రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు:ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు:వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాటలాడలేదు ఫీజు రియింబర్స్ మెంట్, విద్యాదీవెన పథకానికి పెట్టిన బకాయిలు, వసతి దీవెన కింద పెట్టిన బకాయిలు ఎప్పుడు ఇస్తారన్నదానిపై ఒక్క మాటకూడా ముఖ్యమంత్రికాని, మంత్రులుకాని మాట్లాడలేదు.2024-26 రెండేళ్లకు విద్యాదీవెన, వసతి దీవెన బకాయలు రూ. 6,428కోట్లు.26-27 ఏడాదీ కలిపితే కలిపితే మొత్తం ఈ ఏడాది ఖర్చు చేయాల్సింది రూ.10,328 కోట్లు. కాని 2026-27 బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.2,766 కోట్లుమరి పిల్లల చదువులు ఎలా సాగుతాయని అడితే దానిపై ఎవ్వరూ మాట్లాడలేదు. తల్లిదండ్రులమీద తీవ్ర ఒత్తిడి ఉంది, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థి, పిల్లలు చదువులు మానుకోవాల్సిన పరిస్తి : ఉద్యోగులకు ఇస్తానన్న పీఆర్సీపైనా, ఐఆర్పైనా ప్రశ్నిస్తే దానిపైనా మట్లాడలేదు:ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.36వేల కోట్ల బకాయిలపైనా మాట్లాడలేదు:ఆశ వర్కర్స్, అంగన్వాడీల కు ఇచ్చిన హామీల ఊసు కూడా లేదు: సచివాలయాలు పెట్టి, రీసర్వే మొదలు పెట్టింది మేం:రీ సర్వే కోసం 40వేల మంది సిబ్బందిని పెట్టంది మేం:అన్నీ తానే చేశానన్నట్టుగా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు:బేసిక్ పే ఇస్తానన్న హామీని అమలు చేయాలని సర్వేయర్లు డిమాండ్ చేస్తే వారిమీద కక్షసాధింపులకు దిగుతున్నాడు:డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన, ఎగరగొట్టిన సున్నావడ్డీ గురించి మాట్లాడలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబుగారు ఒకవైపు వెన్నుపోటు పొడుస్తూ మరోవైపు వారిని మభ్యపెడుతున్నారు:మహిళా సాధికారితపై చంద్రబాబు కోతలు కోస్తున్నాడు:మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ 2014-19లో కూడా చంద్రబాబు మాట్లాడారు:ఎంతమందిని మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాడో చంద్రబాబు చెప్పగలడా? మా ప్రభుత్వంలో మహిళా సాధికారితకోసం, స్వయం ఉపాధి పథకాలను రద్దుచేశారు:ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, జగనన్నతోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహనమిత్ర, సున్నావడ్డీలను రద్దుచేశారు:ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానంటూ చంద్రబాబు దొంగ మాటలు చెప్తున్నాడు. ఈ రెండేళ్లలో కొత్తగా అక్క చెల్లెమ్మలకు ఒక్క గజం స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇంటిపట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక ఇంటినికూడా మంజూరుచేసి ఇవ్వలేదు. మా హయాంలో 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చి, అందులో 21 లక్షల ఇల్లు మంజూరు చేశాం:10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం: వివిధ దశల్లో ఉన్న, పూర్తయ్యే దశలో ఉన్న ఆ ఇళ్లకు డబ్బులుకూడా ఇవ్వడంలేదు. స్కూళ్లు, ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు గురించి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క మాటకూడా మాట్లాడలేదు:ఆ 17 మెడికల్ కాలేజీలను ఏంచేస్తారో చెప్పడంలేదు :ఆరోగ్యశ్రీకి రూ.3,150కోట్లు బకాయిలు పెట్టారు:బకాయిలు ఇవ్వకపోతే అగ్రిమెంట్లు చేయబోమని నెట్వర్క్ ఆస్పత్రులు అల్టిమేటం ఇస్తున్నాయి. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రాబు కనమంటున్నాడు: చంద్రబాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూళ్లలో, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మంచి చదువు ఇవ్వకుండా, మంచి వైద్యం ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా, ఎడాపెడా పిల్లల్ని కనమంటున్నాడు.పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. 1లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు.ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?హిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు? బాధితురాలిమీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారుప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు,అయినా చంద్రబాబు ఏం చేశాడుతనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖరాసింది:దేవుడిపట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్లాంటి పోస్టులో పెట్టాలని తెలిసికూడా, చంద్రబాబునాయుడు బి.ఆర్.నాయుడికే అప్పగించాడు. దేవుడిగురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించి మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా?ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు:కదిరి రథోస్త్సవంలో భక్తులు గాయపడ్డారుప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందిచివరకు తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు.ఇందాపూర్ డెయిరీ - హెరిటేజ్ మధ్య సంబధాల గురించి నిలదీశాం. సమాధానం చెప్పలేదు. సంగం-వైష్ణవిల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించాం. కాని నోరుమెదపలేదు. నెయ్యిపై దుమారం రేపుతూ మరోవైపు భయంకరమైన స్కాంకు పాల్పడుతున్నారు. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటివరకూ రూ.200 కోట్ల స్కాం బయటపడుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఏడాది కాలంలో కేజీ నెయ్యిరేటు రూ.351 నుంచి రూ.716కు పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్లారు:తిరుమల హుండీ డబ్బు లెక్కించే పరకామణి నుంచి ఏకంగా కోటి రూపాయలు విలువైన బంగారాన్ని చోరీ అయ్యింది:చంద్రబాబుగారి హయాంలో ఘోరమైన తప్పు జరిగింది:దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించి, మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో రూ.75వేల విలువ చేసే డాలర్ నోట్లు దొంగతనం జరిగితే, రూ.15కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి రాయించారు. కాని, కోటి రూపాయల విలువైన బంగారం చోరీచేస్తూ పట్టుబడితే ఆ కేసును బయటకు రానీయకుండా గూడుపుఠాణీ చేసి, తొక్కిపెట్టారు. జనవరి, 2025లో పరకామణిలో బంగారం దొంగతనాన్ని దాచిపెట్టిట్టారు: ఉద్దేశ పూర్వకంగా 2023లో జరిగిన వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు:రూ.75వేల విలువైన అమెరికన్ డాలర్ల చోరీ జరిగితే, మా హాయంలో గుడికి రూ.15కోట్లు విలువైన ఆస్తులు రాయించాం:2025 జనవరి నాటి భారీ దొంగతనాన్ని, మహాపచారాన్ని దాచిపెట్టేందుకు 2023 నాటి వ్యవహారాన్ని 2025 సెప్టెంబరు నుంచి తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు: నెయ్యి వ్యవహారంలో కూడా అంతే :టెండర్లు ఖరారైందీ, సప్లై జరిగిందీ, టెస్టుల్లో ట్యాంకర్లు ఫెయిల్ అయ్యిందీ, వాటిని రిజెక్ట్ చేసిందీ, రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ లడ్డూ ప్రసాదంలోకి వెళ్లిందీ చంద్రబాబుహయాంలోనే:ఇది తెలిసికూడా, తప్పు తానుచేసి సెప్టెంబరు18, 2024న వైయస్సార్సీపీ మీదకు చంద్రబాబు నెట్టేశాడు:చంద్రబాబుగారు కుట్రలుమీద కుట్రలు చేశారు: -
Watch Live: YS జగన్ ప్రెస్ మీట్
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. -
YSRCPలో భారీ ప్రక్షాళన 18 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తున్న జగన్
-
టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు
-
T20 World Cup 2026: టీమిండియా కు వైఎస్ జగన్ అభినందనలు
-
మహిళలకు మోసం? బాబు డ్రామాలపై జగన్ ఫైర్!
-
గుంటూరు ఇఫ్తార్ విందుకు వైఎస్ జగన్.. ఏర్పాట్లు పరిశీలించిన అంబటి
-
చీకటి కాలం.. దుశ్శాసన పర్వం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ 50 ఏళ్లకే పింఛన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఏటా రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?⇒ ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ సూపర్ సిక్స్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి కుటుంబాన్ని, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?⇒ అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. దీని కోసం ఒక్క గజం కూడా స్థలం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ⇒ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు.. వైఎస్సార్ ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి రూ.2,029 కోట్లు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?⇒ మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్య పెట్టి.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్న వారికి కానీ లేదు.⇒ ఇలా ఇవ్వక పోవటం కూడా మీకున్న విజన్లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!⇒ అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత. అదే మీకు తెలిసిన మహిళా భద్రత.⇒ దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గనిపించడం లేదా?⇒ మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే. దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా వారికే.⇒ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చింది కూడా మా పాలనలోనే. అందుకే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ⇒ ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం. -
భారతీయులు గర్వపడే విజయమిది : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడి మళ్లీ చాంపియన్లుగా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. తుదిపోరులో ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ బాగా ఆడారని, చివరి విజయ క్షణాలు భారతీయులందరినీ గర్వపడేలా చేశాయని అభివర్ణించారు. వరల్డ్ కప్ కిరీటం తిరిగి మన ఇంటిలోనే ఉందంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా ప్రదర్శించిన అద్భుత ఆటతీరు దేశ ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని రేవంత్ అన్నారు. -
టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ ప్రశంస
సాక్షి, తాడేపల్లి: టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు మొత్తం టీమ్ ఇండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by YS Jagan Mohan Reddy (@ysjagan)అద్భుతమైన ఆటతీరు కనబరిచిన అభి, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు ప్రత్యేక అభినందనలు. దేశం అంతా గర్వపడే లాంటి విజయం సాధించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అని పేర్కొన్నారు. భారత్ జట్టు కృషి, పట్టుదల, జట్టు స్పూర్తి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని జగన్ అన్నారు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
జగనన్నను మళ్లీ సీఎం చేయాలి.. మహిళలకు రోజా పిలుపు
-
YS Jagan: ప్రతి మహిళకూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాంకాక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది, వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న ప్రతి మహిళకూ పేరు పేరున హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.’అని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది, వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2026 -
మహిళల అభ్యున్నతే సమాజ ప్రగతికి కొలమానం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మహిళలతోపాటు యావత్ మహిళలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లని పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని, తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటాయని తెలిపారు. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేసిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని చెప్పారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకుమించిన పాత్ర పోషిస్తున్న మహిళల అభ్యున్నతే... ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
మహిళలందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది.. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం...అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాం. దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించాం. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారు. మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని బాబు అసత్య ఆరోపణలు
-
వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్ కలిపారని దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్. వైఎస్సార్సీపీ హయాంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ను తీసుకొచ్చాం. మార్కెట్లో ఫిబ్రవరి 24న కేజీ హెరిటేజ్ నెయ్యి రూ.541 ఉంది. అదే రోజు మార్కెట్లో ఇందాపూర్ నెయ్యి రూ.578గా ఉంది. కేజీ అమూల్ నెయ్యిని రూ.525కే ఇస్తున్నారు’ అని సజ్జల తెలిపారు.అడ్డగోలుగా దోపిడీ చేయటానికే.. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘నెయ్యి కాంట్రాక్టును కైవసం చేసుకోవటానికే ఇష్టానుసారం మాట్లాడారు. అధిక ధరలతో నెయ్యి కాంట్రాక్టు తీసుకుని స్వామి వారి సొమ్మును కాజేస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ చేయటానికే లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వెనుక పెద్ద స్కాం ఉంది.స్వామి వారి డబ్బును దోచుకోవటానికి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. లడ్డూ ఇష్యూలో ప్లాన్ ప్రకారమే మా పార్టీపై బురద చల్లారు. లడ్డూ కాంట్రాక్టు వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలి. అప్పుడే కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. అమరావతిలో జరుగుతున్న స్కాం మదరాఫ్ ఆల్ స్కామ్స్. నెయ్యి ఇష్యూ అంతకంటే పెద్ద స్కాం. సెప్టెంబరు 18న నెయ్యి గురించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.జంతువుల కొవ్వు ఉందని అనడమే దారుణం అనుకుంటే బాత్రూమ్ కెమికల్స్ కలిపారని కూడా చంద్రబాబు మళ్లీ మాట్లాడారు. సాధారణ మనుషులు ఎవరూ ఊహించని మాటలతో అందరినీ ఆందోళనకు గురి చేశారు. దీనంతటి వెనుక భారీ స్కాం చేయటానికి పన్నిన కుట్ర దాగి ఉంది. 2023లో జగన్ తిరుమలలో అత్యాధునిక ల్యాబులను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటిది ఒక్కటీ చేయలేదు. బీఆర్ నాయుడి వ్యవహారం బయటపడినా ఆయనను చంద్రబాబు ఎందుకు తొలగించలేదు? మా హయాంలో పృథ్వీ విషయం తెలియగానే రాజీనామా చేయించాం. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. భక్తుల విశ్వాసాలంటే చంద్రబాబుకు లెక్క లేదని అర్థం అయింది’ అని ధ్వజమెత్తారు. -
తిరుమల లడ్డూపై అపచారం.. నిజాల్ని చూపిస్తున్న గోవిందుడు
-
వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)
-
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్..
-
Proddatur: వైఎస్ జగన్ కాన్వాయ్ విజువల్స్
-
ప్రొద్దుటూరులో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశ్వీరాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లా పర్యటించారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలో నవ దంపతులు కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలను వైఎస్ జగన్ ఆశ్వీరదించారు.ఇక, వైఎస్ జగన్ ప్రొద్దుటూరు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు హెలీప్యాడ్, కల్యాణ మండపం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ అభిమాన నేతలకు స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. దీంతో, అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. -
విశాఖలో వైఎస్ జగన్.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)
-
నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
బాబుకి భక్తి లేదు.. భయం లేదు.. BR నాయుడు పై వైఎస్ జగన్ సీరియస్
-
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
వైఎస్ జగన్ ఆపన్నహస్తం
సాక్షి, విశాఖపట్నం: బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడేళ్ల పాపకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆపన్నహస్తం అందించారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ను 39వ వార్డుకు చెందిన ఎండీ హఫీజ్ కలిసి తన పాప దయనీయ స్థితిని విన్నవించారు. దీంతో చలించిపోయిన వైఎస్ జగన్ తక్షణమే పాప చికిత్స నిమిత్తం వైఎస్సార్సీపీ నుంచి రూ.2 లక్షల సాయం అందజేశారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డి(నంద్యాల), ఎస్ఈసీ సభ్యునిగా వైసి గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి (పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ (పార్లమెంటు) పోరెడ్డి నరసింహారెడ్డి (ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.కాగా, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. -
వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన (ఫొటోలు)
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్
-
BR నాయుడు రాసలీలలు.. వైఎస్ జగన్ రియాక్షన్
-
వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
వైఎస్ జగన్ విశాఖ పర్యటన అప్డేట్స్.. 👉విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబసభ్యులను వైఎస్ జగన్ కలిశారు. విశాఖ రాణాప్రతాప్ నగర్లోని ఆయన నివాసంలో ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి గణేష్ రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుఅరకు వ్యాలీ తుంగల్గూడ గ్రామంలోని రాధాక్రిష్ణ ఆలయంలో వివాహా వేడుకవివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని, చాణక్యలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్ జగన్ వైఎస్ జగన్కు స్వాగతం అరకు చేరుకున్న వైఎస్ జగన్అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరు కానున్న వైఎస్ జగన్.గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో వైఎస్ జగన్కు స్వాగతం పలకనున్న మహిళలు..👉విశాఖ బయలుదేరిన వైఎస్ జగన్. 👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు.👉గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.👉మధ్యాహ్నం అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్నగర్కు చేరుకుని అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. -
మీకు సిగ్గనిపించడం లేదా..? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
చిన్నారులకు వైఎస్ జగన్ అన్నప్రాసన
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల కోరిక మేరకు ఇద్దరు చిన్నారులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నప్రాసన చేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట 18వ వార్డు మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు.వారి విజ్ఞప్తి మేరకు వారి కుమారుడు ఆర్యన్కు వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావ్య రెడ్డి, జీవన్ రెడ్డి దంపతుల కోరిక మేరకు వారి కుమారుడు శ్రియాన్ రెడ్డికి వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. దీంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్ నియామకం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని ఆ పార్టీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్గా నియమించారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసింది. -
హామీలు అమలు చేయాలని అడిగితే తప్పా..?
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై చంద్రబాబు సర్కారు ప్రదర్శించిన దమనకాండ అత్యంత హేయమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు తరలివచ్చిన అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ఈ మేరకు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని కూడా చూడకుండా వారిపై లాఠీఛార్జీ.. పోలీసుల చేత బలప్రయోగం.. ఎక్కడికక్కడ నిర్బంధం.. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే... ఈరోజు ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క అంగన్వాడీలకే కాదు.. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచి్చన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా!! -
ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా?: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, అమరావతి: అంగన్ వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైరయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వెంటనే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పేలా అవుతుందని నిలదీశారు. రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని నిలదీయడం నేరం అవుతుందా? అని ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయమని ట్వీట్ చేశారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగంచేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారని వెఎస్ జగన్ మండిపడ్డారు.ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా?వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగ్గొట్టి పచ్చి మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఒక్క అంగన్వాడీలకే కాదు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని.. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వైఎస్ జగన్ ప్రశ్నించారు. .@ncbn గారూ.. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2026 -
వైఎస్ జగన్ను కలిసిన మల్లు భట్టి విక్రమార్క
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి భట్టి విక్రమార్క ఈరోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. దీనిలో భాగంగా తన కుటుంబ సన్నిహితుడు విక్రమార్కకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు.అనంతరం తన కుమారుడి వివాహానికి సంబంధించి విషయాన్ని వైఎస్ జగన్కు తెలియజేశారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్కు అందించారు భట్టి విక్రమార్క. -
రేపటి నుంచి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న బుధవారం విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం అరకు చేరుకుని తంగుల్గూడాలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.అనంతరం విశాఖ చేరుకుని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్తారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ నెల 5న గురువారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. -
యుద్ధ నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ కోరుతూ YS జగన్ ట్వీట్
-
ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి: వైఎస్ జగన్
తాడేపల్లి: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ల యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా తీసుకురావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ అంశానికి సంబంధించి వైఎస్ జగన్ ప్రకటన చేశారు.‘ఏపీకి చెందిన వేలాదిమంది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి. యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొనడంతో పాటు భద్రత కొరవడింది. పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలామంది ఎక్కడికక్కడి చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ ఇక్కడకి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఆంధ్రుల భద్రత, సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సంక్షోభ సమయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. అక్కడి వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ప్రత్యేక కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసి, హెల్ప్లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. -
‘2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’
సాక్షి,గుంటూరు: 2029లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఆదివారం కొడాలి నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.అనంతరం, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ‘కూటమి బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారు.అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీ భయపడదు. 2029లో వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’అని స్పష్టం చేశారు. -
ఎంకే స్టాలిన్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు సీఎం స్టాలిన్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Warm birthday greetings to Thiru @mkstalin Avargal. Wishing you good health and continued happiness.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2026 -
భారీ విస్ఫోటనం.. మాటలకందని విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు. పైగా మల్లిశాలలో జాతర కోసం సిద్ధమైన మందు గుండును కూడా ఇక్కడున్న గోడౌన్లోనే నిల్వ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ భోజనాలకు బయటకు వచ్చారు. 1.30 గంటలకంతా భోజనం ముగించుకున్న కూలీల్లో 30–40 మంది తిరిగి ఆ నాలుగు షెడ్లలోకి వెళ్లి పనిలో నిమగ్నం అయ్యారు. మరికొందరు బయటే సేద తీరారు. ఇంకొందరు సమీపంలోనే ఊరు ఉండటంతో భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వస్తున్నారు. వేట్లపాలెం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు పేద్ద శబ్దం.. ఎగిరిపడ్డ దేహాలుమధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. శరీరాలు గుర్తు పట్టలేని రీతిలో చిధ్రమైపోయాయి. కొందరి తలా, మొండెం, కాళ్లు, చేతులు వేర్వేరు ప్రాంతాల్లో, సమీపంలోని పంట కాలువలు, పచ్చని వరి పొలాల్లో దూరంగా పడ్డాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. సంఘటన ప్రాంతమంతా మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో హృదయ విదారకరంగా మారింది. భీతావహ దృశ్యంపేలుడు ధాటికి ఘటన స్థలి ఎటుచూసినా మంటల్లో కాలిపోయిన కూలీల మృతదేహాలతో భయానక వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పనిలో ఉన్నవారెవరు, ఎంత మంది మృతి చెందారు, ఎవరు మిగిలి ఉన్నారనేది తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. చుటు్టపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. పేలుడు ధాటికి సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరాన సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న గూడపర్తిలోని ఇళ్లల్లో ఉన్న వారు భూకంపం వచ్చినట్టు భయపడి బయటకు పరుగులు తీశారు. ఇంటిపై ఉన్న ఇనుప రేకుల నుంచి సైతం శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వేట్లపాలెం, గూడపర్తి, పెదబ్రహ్మదేవం, జి.మేడిపాడు గ్రామాలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా, మృతదేహాలను సేకరించేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కాలువలు, చేలల్లో గాలింపు చేపట్టి నుజ్జునుజ్జు అయిన శరీర భాగాలను సేకరించి ఒక చోటకు చేర్చారు. ఏది ఎవరి అవయవమో గుర్తించలేక కొన్నింటిని మూటలు కట్టారు. ఇలా అన్ని మృతదేహాలను, మూటలను అతి కష్టం మీద సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా బాణసంచా నాణ్యత కోసం అధిక మోతాదులో సల్ఫర్, సూరేకారం కూరడం వల్లే ఒత్తిడికి గురై విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 11 మంది క్షతగాత్రులు వీరేసప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీను, దర్శిపాటి లోవరాజు, పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్, వేట్లపాలేనికి చెందిన పచ్చిగళ్ల నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో వీరు కాకినాడ జీజీహెచ్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .20 మంది మృతులు వీరేవేట్లపాలేనికి చెందిన గంధి మంగ (43), వల్లూరి రవి (35), కడింపల్లి కృపమ్మ, గంపల మంగ, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడతా నాని (26), సంకుమళ్ల రాఘవ (50), ఫైర్క్స్ యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీనివాసరావు (55), దుర్గానగర్కు చెందిన తుంపల లోవ (38), నూకెళ్ల దేవి (45), జొన్నలదొడ్డికి చెందిన చింతల రమణ (60), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), గొడత వీర వెంకట రమణ (48), కడింపల్లి ధనరాజు (55), కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి నాని (38), యేడిద సంపత్ కుమార్ (25), పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన మాకర రాఘవమ్మ (55) మృతి చెందారు.ఫైరింజన్లు వెళ్లలేక... పెరిగిన ప్రమాద తీవ్రతసంఘటన స్థలానికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నుంచి వెళ్లాలంటే సింగిల్ రోడ్డు. అది చాలా ఇరుకుగా ఉండటంతో ఆ సమయానికి అంబులెన్సులు చేరుకోలేకపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉండటం, రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా ఘటన స్థలి దగ్గరి వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. చివరకు ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడకు ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురద మయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా జీజీహెచ్లో క్షతగ్రాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు హోం మంత్రి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరు చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్పై కేసు నమోదు చేశారు. శ్మశానంలా మారిన ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన వేట్లపాలెం ప్రాంత ప్రజలు నా మనసును కలచివేసింది సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి, పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’లోనూ పోస్టు చేశారు. -
అవినీతి ఊబిలో ఏపీ పాలన!
ఊపిరాడనివ్వని అవినీతి కంపు నేడు ఆంధ్రావనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. పాలనా యంత్రాంగం లంచాల మత్తులో జోగుతున్నదని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిన్నాచితకా పనులు కూడా చేతులు తడపందే కావడం లేదని లోకవాణి కోడై కూస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, కాణీ ఖర్చు లేకుండా ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన సచివాలయ వ్యవస్థ ఇప్పుడు కోమాలోకి జారి పోయింది. రెండున్నర లక్షల మంది వలంటీర్లను నమ్మించి గొంతులు కోసింది కూటమి ప్రభుత్వం. సర్వేల పేరుతో పనిభారం పెంచి సచివాలయ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారు. ఉద్యోగాలు వదిలేసి పారిపోయేలా ప్రేరేపిస్తు న్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వారి ఆత్మహత్యలు, అకాల మరణాలు రికార్డయ్యాయి.నిస్సంకోచంగా, యథేచ్ఛగా, బరితెగించి సాగుతున్న లంచ గొండి దర్బార్లకు ప్రజాప్రతినిధులే గాడ్ఫాదర్లుగా వ్యవహ రించడం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. కీలక శాఖల్లో పనిచేసే అధికారులను ఏరికోరి నియమించుకొని వారి నుంచి నెలవారీ వాటాలను ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు పదేపదే వినవస్తున్నాయి. అందుకు సంబంధించి కొందరు అధికారుల ఆడియోలు కూడా అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహార శైలితో ప్రజాప్రతినిధులే స్వయంగా ఉద్యోగస్వామ్యాన్ని అనినీతి మేత కోసం ఉసిగొల్పు తున్నారు. ఈ పని చేస్తున్న సదరు ప్రజాప్రతినిధులకు నదురూ లేదు... బెదురూ లేదు. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెతను వారు శిరోధార్యంగా స్వీకరిస్తున్నారు.‘ఉద్యోగాల కల్పన’ అనే దేవతావస్త్రం పేరు చెబుతూ ఉర్సా, లుల్లూ అండ్ అదర్స్కు ఖరీదైన భూముల్ని కట్టబెడు తున్న ప్రభుత్వ పెద్దల దూకుడు నుంచి ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందుతున్నారు. పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్న కల్తీ మద్యం కార్ఖానాల నుంచి పారుతున్న కరెన్సీ చూసి ఉత్తేజం పొందుతున్నారు. అధినాయకుడు తమ బంధుత్వాలను గౌరవించి వేలకోట్ల విలువైన భూముల్ని చుట్టబెట్టడం క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పులకింపజేస్తున్నది. సొంత పాల కంపెనీ, దాని అనుబంధ సంస్థల లాభాల కోసం దేవదేవుడినే రాజకీయాల్లోకి లాగగలిగిన ఆ లాఘవం జూనియర్ నాయకులకు నిజంగా ఒక పాఠ్యాంశమే!పై స్థాయి నుంచి పొంగిపారిన స్ఫూర్తిని కింది స్థాయి కూడా అందిపుచ్చుకోవడంతో అవినీతి ప్రవాహం రాష్ట్ర మంతటా కట్టలు తెంచుకున్నది. దాని ఫలితమే కల్తీ పాల చావులు, కలుషిత జలాల మరణాలు, కృత్రిమ మద్యపు మరణ మృదంగం! పోషక బలాన్నిచ్చే పాలే కాటేస్తాయని ఎప్పుడైనా ఊహించామా? ప్రాణావసరమైన మంచినీళ్లే ప్రాణాలు తీస్తా యని కలగన్నామా? పాలూ, నీళ్లే కాదు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో తింటున్నదీ, తాగుతున్నదీ సమస్తం కల్తీయేనని పాలక కూటమి నేతలే చెబుతున్నారు. గుంటూరు జిల్లా ‘జనసేన’ అధ్యక్షుని వీడియో ఒకటి ఈ మధ్యనే సంచలనం సృష్టించింది. ‘‘ఉద్యోగులు భయంకరంగా లంచాలు వసూలు చేస్తున్నారు. ఊహించని స్థాయిలో అవినీతి పెరిగింది. పాస్బుక్కులో పొరపాట్లు సరిదిద్దడానికి కూడా వేల రూపాయలు సమర్పించుకోవలసి వస్తున్నది. చిరంజీవి ఠాగూర్ సినిమాను మించి ఇవాళ ఆంధ్ర ప్రదేశ్లో లంచావతారాలున్నాయి. అవినీతి అధికారుల నుంచి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పడానికి సిగ్గేస్తు న్నది. అసలీ రాష్ట్రంలో కల్తీ లేకుండా ఏదైనా తింటున్నామని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలమా?’’ పాలక కూటమి లోని ఓ పార్టీ జిల్లా స్థాయి అధ్యక్షుని మాటలివి!రాజకీయ నాయకులు – అధికారులు లంచాల కోసం కుమ్మక్కు కావడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ తినేదీ తాగేదీ సమస్తం కల్తీ అయిందనే అభిప్రాయం జన సామాన్యంలో బలపడింది. అదే అభిప్రాయాన్ని జనసేన నాయకుడు బహిరంగంగా ప్రకటించారు. పైస్థాయిలో అవినీతి ఉండకపోతే కింది స్థాయిలో ఇంత బరితెగింపు ఉండేది కాదు. అవినీతి వాటాల ఫలితంగా పాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం అట కెక్కింది. ప్రభుత్వ పాలన పూర్తిగా పట్టాలు తప్పింది. శాంతి– భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి దనిపిస్తుంది. రక్షక భటులు పొలిటికల్ పోలీసింగ్కు మాత్రమే పరిమితం కావడంతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగు తున్నాయి. ఈ శక్తులకు రాజకీయ నాయకత్వం అండ దండిగా లభిస్తున్నది.‘పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో...’ అంటూ మురిసిపోయాడు ఒక కవి. ఆ భవితవ్యాన్ని పసితనంలోనే మసి చేస్తున్న కీచకసేనల పదఘట్టనలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో ఓ మైనర్ దళిత బాలికను బెదిరించి 14 మంది యువకులు కొన్ని నెలలపాటు అత్యాచారాలు చేసిన ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. తండ్రి లేని ఆ బాలిక బయటికి చెబితే చంపేస్తారన్న భయంతో నోరు మెదపలేకపోయింది. బయటపడిన తర్వాత కూడా అధికార పార్టీ మద్దతుదారులైన నిందితులను పట్టుకోవడానికి చట్టం తటపటాయించింది. కర్నూలు జిల్లాలో చిన్నారి బాలికలను బెదిరించి మద్యం తాగించి పాలక పార్టీ యువకులు అత్యా చారాలు చేసి వీడియోలు కూడా తీశారు. చిన్నారులపై జరిగిన ఇటువంటి అత్యాచారాలే డజన్కు పైగా ఇప్పటివరకు వెలుగు చూశాయి. అత్యాచారాలు సగటున రెండు రోజులకొకటి జరుగుతున్నాయని అధికారిక గణాంకాలే చెబు తున్నాయి.హత్యలైతే సగటున రోజుకొకటి. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, రెడ్ బుక్ అరాచకాలు నేడు జగమెరిగిన సత్యాలు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని బాబు సర్కార్ ఎత్తివేసింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కోరుకున్న చోటుకి, కోరుకున్న సమయంలో డ్రగ్స్, మద్యం డోర్ డెలివరీ చేసే విధానం అమల్లో ఉందట! డబ్బులు వెదజల్లితే జరగని పాడు పని ఏదీ లేదని చెప్పుకుంటున్నారు. పైనున్న అధినేతల స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకూ ఈ దురవస్థకు అందరూ బాధ్యులే. తిలాపాపం తలా పిడికెడు! నిరాటంకంగా సాగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూదందాలు, అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు దాచేస్తే దాగేవి కాదు. అందుకని వాటిని అంగీకరిస్తూనే అందుకు బాధ్యతను అధికార యంత్రాంగంపైనో, కొందరు ప్రజాప్రతినిధులపైనో నెట్టేయడానికి యెల్లో మీడియా పడరాని పాట్లు పడుతున్నది. అధినేత హెచ్చరించినా అనుచరులు దారికి రావడం లేదంటూ వాపోతున్నది. అసలు అధినేత సుద్దపూసైతే కదా! ఎవరైనా దారిలోకి వచ్చేది.ఆవు పాలు, గేదె పాలే కాదు... రాష్ట్రంలో ‘మిక్సీ పాలు’ అనే మాట కూడా బాగా పాపులరైంది. అంటే పాలే లేకుండా పాలను తయారు చేయడమన్నమాట! పాల తయారీకి రసాయ నాలను ఉపయోగించడమన్నది విచ్చలవిడిగా జరుగుతున్నదనీ, అవి మోతాదు మించడం వల్లనే రాజమండ్రి దుర్ఘటన జరిగిందనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. అధికార యంత్రాంగం చిత్తశుద్ధి చూపెడితే వీటిని నియంత్రించడం అసాధ్యమేమీ కాదు. కానీ, వ్యవస్థీకృతమైన అవినీతి అందుకు అవకాశమివ్వదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికీ, పలువురు అస్వస్థతకు గురి కావడానికీ ఈ వ్యవస్థీకృత అవినీతే కారణం. మంచినీటి పైపులైన్లు మురుగు నీటితో కలుషితమై, డయేరియా ప్రబలి శ్రీకాకుళంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఆందోళన కలిగించింది. రెండొందల మంది వరకు అస్వస్థులయ్యారు. ఇటువంటి దుర్ఘటనలను నివారించే ప్రయత్నం చేయకపోగా ఈ విషాద తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కల్తీ పాలు, కలుషిత నీటి విషాద ఘటనలపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మీ నిర్లక్ష్యంతో ఇంకెంత మంది ప్రాణాలు తీస్తార’ని ఆయన ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పరిపాలనపై ముఖ్యమంత్రి పట్టుకోల్పోవడం వల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరో పించారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా పలుమార్లు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో వందలాది మంది అస్వస్థులయ్యారు. కురుపాంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోయిన విషయాన్ని, రాష్ట్రవ్యాప్తంగా 900 మందికి పైగా అస్వస్థులైన సంగతిని కూడా జగన్ ప్రస్తావించారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడానికి కారణం రాజకీయ నాయకులు – కొందరు అధికారుల అవినీతి మిలాఖతే!విచ్చలవిడి అవినీతి కారణంగా పాలనా యంత్రాంగానికి పక్షవాతం సోకినా, పైకి మాత్రం బాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదనే భజనను యెల్లో మీడియా యథాశక్తి కొనసాగిస్తూనే ఉన్నది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసి డర్ తానేనంటూ సెల్ఫ్ ప్రమోషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అభివృద్ధి పేరుతో తన ఖాతాలో వేసుకున్న చాలా కార్యక్రమాలు ‘క్రెడిట్ చోరీ’ ద్వారా జగన్ ఖాతాలోంచి తెచ్చుకున్నవేనని జనానికి కూడా బాగా అర్థమైంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో కాదు తిరోగమనంలో ఉన్నదని పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తే నిరూపిస్తున్నది. ‘కాగ్’ లెక్కల ప్రకారమే రాష్ట్ర జీఎస్టీ రాబడి నానాటికీ తగ్గుతున్నది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీల్లో అత్యంత ముఖ్యమైన, అధిక వ్యయమయ్యే రెండు పథకాలను (నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి) పూర్తిగా ఎగవేసి మిగతా వాటిని అరకొరగా అమలుచేసి... ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశారని పదేపదే చెప్పుకోవడం ముఖ్యమంత్రికే చెల్లింది. అత్యున్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి కారణంగా పాలనా యంత్రాంగంలో అవినీతి పెచ్చ రిల్లింది. ప్రజాపాలన పడకేసింది. కనీసావసరాల కోసం,వైద్యం కోసం, మెరుగైన విద్య కోసం పేద ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. లేని అభివృద్ధి పేరుతో భజన బృందం చేస్తున్న కృత్రిమ సందడిలో వారి ఆర్తనాదాలు వినిపించక పోవచ్చు. కానీ సరైన సమయంలో అవి దీర్ఘశ్రుతితో శంఖా రావమై వినపడవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వేట్లపాలెం అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
రెడ్ బుక్ లో జగన్ పేరు..! అంబటి మాస్ రియాక్షన్
-
వేట్లపాలెం అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై ఆవేదన వ్య క్తం చేశారు వైఎస్ జగన్.‘వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2026 కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం -
ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి..? కల్తీ పాలు, కలుషిత నీటిపై జగన్ ఫైర్
-
ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి?
సాక్షి, అమరావతి : ఏపీలో పాలు, నీళ్లు కల్తీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంత మంది ప్రాణాలు పోవాలంటూ చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించారు. ‘ఎవరైనా బతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలుచోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దంపడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పనిచేస్తూ.. ప్రజారోగ్యం, ప్రజా రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు. హాస్టళ్ల పరిస్థితిని ఎండగట్టిన జాతీయ మీడియా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యారి్థనులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చ కామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్నా, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత 14 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతవల్ల వ్యాధుల వంటి ఘటనలు దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటివల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. పూర్తిగా కొరవడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టళ్లలో దారుణ పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టింది. ఐదుగురు మృతి.. 200 మంది ఆస్పత్రుల పాలు రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టళ్లపై పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యల్లో వైఫల్యానికి అద్దంపడుతున్నాయి. గత వారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లాయి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్ష, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో వైఫల్యాన్ని స్పష్టంగా చూపాయి. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం.. రాజమహేంద్రవరం ఘటనే సాక్ష్యం రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన పాలు చివరకు మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కాదు. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి, నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించాలి. వాటన్నింటినీ సరిచేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వీడాలి. సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలుచేయాలి. వీటన్నింటిపై చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని మాత్రమే ప్రజలంతా ఆశిస్తున్నారు. Hello India,People of Andhra Pradesh are dying after drinking milk and water. What should be, the most basic necessities of life, have turned into sources of fear. Under the TDP-led coalition government and Chief Minister @ncbn, repeated outbreaks of diarrhoea and food… pic.twitter.com/YaOts9IUcB— YS Jagan Mohan Reddy (@ysjagan) February 27, 2026 -
అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూత.. వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ సేవలో అంకితభావంతో పనిచేశారని.. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారన్న వైఎస్ జగన్.. సౌందరరాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ అన్నారు. -
బాధితులను పరామర్శించడమే నేరమా? వైఎస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి
-
‘సెకీ’కి సెల్యూట్!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు (విద్యుత్ షెడ్యూలింగ్, ఆఫ్ టేక్ ప్రారంభం) ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది చాలా ఉపయోగకర ఒప్పందమని ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) చేసిన సూచనపై సానుకూలంగా స్పందించింది. తద్వారా ఇన్నాళ్లూ చంద్రబాబు అండ్ కో ‘సెకీ’ ఒప్పందంపై చేసిందంతా విష ప్రచారమేనని తేటతెల్లమైంది. 2021 డిసెంబర్ 1న కుదిరిన పవర్ సేల్ అగ్రిమెంట్ (పీఎస్ఏ) ప్రకారం ఈ విద్యుత్ సరఫరా జరుగుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ (కనెక్టివిటీ ఆపరేషనలైజేషన్) పూర్తయిన అనంతరం విద్యుత్ తీసుకునే ప్రక్రియ (షెడ్యూలింగ్) ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రక్రియలో ఏపీపీసీసీతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ఏపీఆర్ఏపీఎల్, ఏపీఎస్ఎల్డీసీ సంస్థలు ఎస్ఈసీఐ, సీటీయూఐఎల్, ఆర్ఎల్డీసీలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పీఎస్ఏ నిబంధనలకు అనుగుణంగా వాణిజ్య లావాదేవీలు (కమర్షియల్ సెటిల్మెంట్) నిర్వహించాలని సూచించింది. దీర్ఘకాలిక విద్యుత్ వినియోగం కోసం జనరల్ నెట్వర్క్ యాక్సెస్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ(జిఎన్ఏ–ఆర్ఈ) వెసులుబాటును పొందాలని కూడా స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం విద్యుత్ స్వీకరణ జరుగుతుందని, ఏపీ సరిహద్దు వరకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్విుషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్–అంతర్రాష్ట్ర ప్రసారం) చార్జీలు, నష్టాలపై రాష్ట్రానికి ఎలాంటి బాధ్యతా ఉండదని తెలిపింది. ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్ సరఫరా చేస్తామంటూ గతప్రభుత్వానికి సెకీ రాసిన లేఖ అదీ విజన్ అంటే.. » రైతులు పడుతున్న అవస్థలను చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వారికి ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలని సంకల్పించారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్లపాటు రోజుకు 9 గంటల చొప్పున పగటిపూటే ఇవ్వాలని దృఢంగా భావించారు. దానికి తగ్గట్టుగానే ముందుచూపుతో ఆలోచించి సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. » అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు (ఐఎస్టీఎస్) మినహాయించి, యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. » ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్విుషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుందని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. అయినా ఈ ఒప్పందం వల్ల ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు ఉండదని అప్పట్లో చంద్రబాబు అదే పనిగా దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఆయనకు వంత పాడుతూ పుంఖానుపుంఖాలుగా తప్పుడు కథనాలు ప్రచురించింది. » కానీ అవన్నీ అవాస్తవాలని ఒప్పుకుంటూ.. ఇప్పుడు అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు, నష్టాలు సెకీ విద్యుత్కు వర్తించవని అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లూ వారు చేసిందంతా అసత్య ప్రచారమని వారే అంగీకరించినట్లయింది. -
Nellore: కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లా పర్యటనకు YS జగన్
-
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి (రైల్వే కోడూరు) కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు సిద్దు సుష్మా, ప్రతుల్య రెడ్డిలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వారిద్దరికీ వివాహ శుభాకాంక్షలు తెలిపారు.ఇక, అంతకుముందు.. వైఎస్ జగన్ నెల్లూరుకు చేరుకున్న సందర్బంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. దీంతో, భారీ జనసందోహానికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. -
అధైర్య పడొద్దు.. నేనున్నా.. టీడీపీ అరాచకాలపై ప్రజలకు జగన్ భరోసా
-
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన నెల్లూరుకు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు. -
టన్నుల్లో చంద్రబాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: మరో ‘క్రెడిట్’ చోరీకి సిద్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం సభ వేదికగా వెలి‘కొండంత’ అసత్యాలు వల్లె వేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో తానే శంకుస్థాపన చేశానని.. 2014–19 మధ్య పనులను పరుగులు పెట్టించానని.. కానీ 2019–24 మధ్య పనులు మూలన పడ్డాయని తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు చెప్పుకొచ్చారు. నిజానికి 1996 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వెలిగొండ పనులకు చేసిన వ్యయం అక్షరాలా రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిందే. ఇక 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పనుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లు దోచిపెట్టింది. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు) వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో కడిగిపారేయడమే అందుకు తార్కాణం. అలాంటి అవినీతి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి రోజుకు సగటున 10 మీటర్ల పొడవున సొరంగం తవ్వేందుకు టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.68.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కానీ మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు రోజుకు సగటున ఒకటి రెండు మీటర్ల పొడవున కూడా సొరంగాలను తవ్విన దాఖలాలు లేకపోవడం గమనార్హం..! ఇక సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ కెనాల్లో చేసిన పనులూ నాసిరకమే. 2017.. 2018.. 2019.. ఇలా వెలిగొండను పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చంద్రబాబు ముహూర్తాలు మార్చుకుంటూ వచ్చారు. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టారు. అనంతరం కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆక్షేపించడం గమనార్హం. గతేడాది కురిసిన వర్షాలకు ఫీడర్ కెనాల్ బలహీనంగా ఉన్న చోట్ల కోతకు గురవడంతో ఇప్పుడు దానికి రిటైనింగ్ వాల్, కాంక్రీట్ లైనింగ్ పనులకు రూ.456 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఆ పనులను తనకు అత్యంత సన్నిహితుడైన గన్నమనేని దొరయ్యకు చెందిన జీడీఆర్ ప్రాజెక్ట్స్కు కట్టబెట్టారు. రూ.992 కోట్లతో పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఆగస్టులోనే నల్లమలసాగర్కు కృష్ణా జలాలుదశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసియాలోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. రూ.992 కోట్లు వ్యయం చేసి పునరావాసం కల్పించింది. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే దుగ్ధతోనే నల్లమలసాగర్ నిర్వాసిత కుటుంబాలకు 21 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం రాగా.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని గుర్తు చేస్తున్నారు. అదే చంద్రబాబు సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే 2024–25తోపాటు 2025–26లోనూ కృష్ణా వరదను ఒడిసి పట్టి నల్లమలసాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూరికార్డు వేగంతో జంట సొరంగాలు పూర్తి» వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను వైఎస్ జగన్ 2021లోనే పూర్తి చేయించారు. » రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ కూడా పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేసి రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. » ఇక 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.‘కొండంత’ కలను సాకారం చేసిన వైఎస్సార్..» శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1993–94లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు.» జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమల సాగర్తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్, తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు» మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శ్రీకారం చుట్టారు. -
28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ పంపిణీని ఈ నెల 28న దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 3.45 లక్షలమంది బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సమాచారం ప్రకారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది, అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారు. 1,683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ను ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. సుమారు మూడు నెలలు జరిగే వ్యాక్సిన్ డ్రైవ్కు తొలివిడత కింద కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ వెయిల్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి అని నిబంధన ఉంది. పీహెచ్సీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ పంపిణీ వివరాలను యూవిన్ డిజిటల్ పోర్టల్లో నమోదు చేస్తారు. వైఎస్ జగన్ హయాంలో కీలక ముందడుగు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే కీలక ముందడుగు పడింది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను తెచ్చారు. క్యాన్సర్ను ప్రారంభదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని తప్పించడంతో పాటు, చికిత్స వ్యయాలకు అడ్డుకట్ట వేసేదిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో స్క్రీనింగ్ కూడా చేశారు. 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టేందుకు విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రితో ఎంవోయూ కుదుర్చుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే గ్రామాల్లో వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులకు శిక్షణనిచ్చారు. సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడానికి సర్వం సన్నద్ధం చేసిన సమయంలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్క్రీనింగ్ వాయిదా పడింది. ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సీడీ–ఎన్సీడీ–3.0) సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటూ హడావుడి చేసింది. స్క్రీనింగ్ నిర్వహణలో ఘోరంగా విఫలం అయింది. వైద్యశాఖ తప్పులతడకగా స్క్రీనింగ్ చేపట్టడంతో మరోమారు స్క్రీనింగ్ చేయాల్సి వచ్చింది. -
అధైర్య పడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే
సాక్షి ప్రతినిధి కడప : ‘ఎవరూ అధైర్య పడొద్దు.. మంచి రోజులు వస్తాయి.. సమస్యలు శాశ్వతం కాదు.. వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని.. అకారణంగా దాడులు చేస్తోందని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. అందుకు ఆయన స్పందిస్తూ ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని, హింసాత్మక రాజకీయాలకు పాల్పడటం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్ట కాలంలో కార్యకర్తలకు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమస్యలు వింటూ.. ధైర్యం చెబుతూ.. వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు విన్న ఆయన స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఒక్క మేలు కూడా జరగలేదని వచ్చిన వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్న దివంగత వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మను ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సింగిల్ విండో మాజీ చైర్మన్ ఈశ్వరయ్యను కూడా ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రత్యేక పూజలువేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామి), కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి హోమాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి పెంపొందుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని తెలిపారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని, శ్రీ నందీశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగింది. భాకరాపురంలో క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు.ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు.ఆపన్నులకు అండగా..వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.దీంతో పాటు పులివెందుల పర్యటనలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మను ఆమె ఉంటున్న జీసస్ ఛారిటీస్కు వెళ్ళి వైఎస్ జగన్ పరామర్శించారు, కమలమ్మ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్ విండో మాజీ ఛైర్మన్ ఈశ్వరయ్యను కూడా ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. -
రేపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు( ఫిబ్రవరి 26, గురువారం) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు వైఎస్సార్ కడప పులివెందుల భాకరాపురం నివాసం నుంచి బయలుదేరి 8.50 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుంటారు.9 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గంలో గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు 10.20 గంటలకు చేరుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుగు పయనమవుతారు. -
హోమంలో పాల్గొన్న జగన్
-
కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ కు వేద పండితుల ఆశీర్వచనం
-
నందిపల్లిలో వైఎస్ జగన్ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)
-
Exclusive Visuals: నందిపల్లి నందీశ్వరాలయం..
-
జగన్ పర్యటనలో వెల్లువెత్తిన ప్రజాభిమానం
-
నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు..
-
జగన్ ను చూసేందుకు పరుగులు తీసిన జనం
-
వై.ఎస్ రాజా రెడ్డి సోదరి కమలమ్మను పరామర్శించిన వైఎస్ జగన్
-
Watch Live: నందిపల్లె లో నందీశ్వర ఆలయం ప్రారంభోత్సవం
-
నందీశ్వర ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల్లో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని.. భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలో రెండో రోజు పర్యటన సందర్బంగా వైఎస్ జగన్.. నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి, స్వామివారికి భక్తి శ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది’ అని అన్నారు. ఈ క్రమంలోనే నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. నేనున్నా.. భయపడకండి..
-
బెడిసికొట్టిన బాబు కపట నాటకం
-
‘అన్నదాత సుఖీభవ’లో కోత
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలులో రైతులను నిలువునా మోసంచేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హయాంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద లబ్దిపొందిన రైతులతో పోలిస్తే భారీగా కోత పెట్టింది. ఈ విషయం శాసనసభ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో బట్టబయలైంది. పైగా తొలి ఏడాది ‘అన్నదాత సుఖీభవ’ను ఎగ్గొట్టడమే కాకుండా... రెండో ఏడాది రెండు విడతల్లో రూ.5వేల చొప్పున మాత్రమే చెల్లించింది. మూడో విడత అసలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేసినట్టు ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరి ఏడాది 2023–24లో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద 53.18 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించిందని ఈ ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 46.86 లక్షలకు తగ్గినట్లు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానంతో తేటతెల్లమైంది. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు బి.విరూపాక్షి, ఆకేపాటి అమరనాథ్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దఫాల్లో రూ.4,685.84 కోట్లు మాత్రమే చెల్లించగా, శాసనసభకు ఇచ్చిన సమాధానంలో మాత్రం రూ.8,862.89 కోట్లు ఇచ్చినట్లు పేర్కొనడం గమనార్హం. ఒక్కో రైతుకు రూ.30వేలు ఎగనామం ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఊసే ఎత్తలేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయాలని నిలదీయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో ఏడాది అన్నదాత సుఖీభవను అమలు చేశారు. అది కూడా రాష్ట్ర వాటా రూ.14 వేలు, పీఎం కిసాన్ కింద మరో రూ.6 వేలు కలిపి రూ.20 వేలు.. అంటూ చంద్రబాబు మాట మార్చారు. అయితే, గత ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యతో పోలిస్తే 6.32 లక్షల మందికిపైగా రైతులను తగ్గించి అరకొరగా రెండు విడతల్లో రూ.5వేలు చొప్పున కేవలం రూ.4,685.84 కోట్లు మాత్రమే ఇచ్చింది. మొత్తంగా రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.30 వేలు చొప్పున చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మూడో విడత ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం రాష్ట్రం వాటా రూ.4,685.84 కోట్లు, కేంద్రం వాటా రూ.4,177.05 కోట్లు కలిపి రూ.8,862.89 కోట్లు విడుదల చేసినట్టు అసెంబ్లీలో సమాధానం ఇవ్వడం విస్తుగొలుపుతోంది. -
వైఎస్ జగన్ పేరు చెప్పాలని రఘురామ టార్చర్!
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు తనపై బనాయించిన అక్రమ కేసులో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని తనపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన వాస్తవాలను బహిర్గతం చేశారు. రఘురామకృష్ణరాజు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని.. ఆయన ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఫోన్కు మెస్సేజ్ చేశారని వెల్లడించారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పకపోతే నిన్ను నిందితుడిగా చేరుస్తాం..’ అని ఆ మెస్సేజ్లో బెదిరించారని పేర్కొన్నారు. అవాస్తవాలను చెప్పేందుకు సమ్మతించకపోవడం వల్లే తనపై అక్రమ కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు కాల్ డేటా తీస్తే అవన్నీ బయటపడతాయని, చాలామందిని ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్నది వెల్లడవుతుందన్నారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు చూపిస్తానని ప్రకటించారు. ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ తన తల్లి పట్ల అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించారని సునీల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? చిన్న కులాల వారు కష్టపడి చదివి ఐపీఎస్ లాంటి ఉన్నత స్థానాలకు చేరితే జీర్ణించుకోలేరా?..’ అని సునీల్ నాయక్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం బిహార్లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు పట్నాలో సోమవారం హల్చల్ చేసిన విషయం విదితమే. గతంలో డిప్యూటేషన్పై ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్పై అక్రమంగా బనాయించిన కేసులో కనీసం అరెస్టు వారెంట్, కేసు డైరీ లేకుండా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు యత్నించారు. అయితే ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఏపీ పోలీసుల అరాచకాన్ని బిహార్ పోలీసులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఏపీ పోలీసులు అవమాన భారంతో తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తనపట్ల వ్యవహరించిన తీరుపై సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం సంచలన పోస్టు పెట్టారు. అందులో ఏమన్నారంటే.. » ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..? గిరిజన లంబాడి కుటుంబంలో పుట్టి చెన్నై ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యా. చిన్న కులాల వాళ్లు ఉన్నత స్థానంలో ఉంటే జీరి్ణంచుకోలేరా..? రఘురామకృష్ణరాజు కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. 2021లో జరిగినట్లు చెబుతున్న సంఘటనపై 2024లో కేసు నమోదు చేశారు. అందులో నా పాత్ర ఏమాత్రం లేకపోయినా ఇరికించారు. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు మహిళా మేనేజర్ను అడ్డు పెట్టుకుని ఆయన (ఎస్పీ దామోదర్) ఎన్నో భూ దందాలకు పాల్పడితే ఇప్పటికీ విచారణ లేదు. ఇసుక, గ్రానైట్, మైనింగ్ దందాలకు పాల్పడితే విచారణ లేదు. ధోతీ కార్యక్రమం నిర్వహించి రూ.4 కోట్లు విలువైన బంగారం, బహుమతులు పొందితే నేటికీ విచారణ లేదు. కానీ లంబాడీ కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారిని కావడమే నేను చేసిన నేరమా..? అందుకే నాపై అక్రమ కేసు పెట్టారా? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్ పేర్లు చెప్పమని ఎంతోమంది నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నాతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. తగిన సమయంలో ఆ ఆధారాలన్నీ బయటపెడతా. లంబాడీ కులంలో పుట్టిన నాకు మాట్లాడే హక్కు ఉండదనే అహంకారంతో వారు అలా వ్యవహరించారు. » పట్నాలో నా నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన ఏపీ పోలీసు అధికారి (ఎస్పీ దామోదర్) నిబంధనలకు విరుద్ధంగా, దురుసుగా వ్యవహరించారు. తన దగ్గర బాడీ కెమెరా ఉందంటూ మా ఇంట్లో అల్లరి చేశారు. ఆయనతో వచ్చిన పోలీసు అధికారులు నా తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అవమానపరిచారు. నా తల్లిని అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా. -
ధైర్యంగా ఉండండి..: వైఎస్ జగన్
సాక్షి కడప ప్రతినిధి: మంచి రోజులు ముందున్నాయని, అందరూ ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను కలిసి కష్టాలు చెప్పుకున్న వారికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలతో నష్టపోయిన వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ రాకతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల కోలాహలంగా మారింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులకు చేరుకున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. నేరుగా తన క్యాంపు కార్యాలయానికి విచ్చేసి మూడు గంటలకు పైగా ప్రజలతో మమేకమై మాట్లాడారు. క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. కార్యకర్తల కష్టసుఖాలు ఆరా తీస్తూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల కష్టాన్ని వింటూ.. నేనున్నానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత ఇంటి వద్ద వేచి ఉన్న నాయకులతోనూ చర్చించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాక ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కొంత మంది యువకులు జగన్ను దగ్గరి నుంచి చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని అభిమానంతో ముందుకు రాగా, వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూ వారితో మాట్లాడారు.వైఎస్ జగన్ను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు కార్యాలయం వద్ద జన సందోహంవైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ఆవరణమంతా జన సంద్రంగా మారింది. పార్టీ అభిమానులు, కేడర్తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. యువకులు వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్ వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ.. కరచాలనం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ ముందుకు కదిలారు. కాగా, పార్టీనేతలు తదితరులు వైఎస్ జగన్ను కలిశారు. -
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెందడంతో పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. వెంటిలేటర్పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలి.ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ది చెబుతారు. మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
-
పులివెందుల చేరుకున్న జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) వైఎస్ జగన్ పులివెందులకు బయల్దేరి వెళ్లారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. పులివెందులలోని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. -
జగన్ చేతుల మీదుగా రేపే నందీశ్వరాలయం ఓపెనింగ్
-
జీవో 746,747 జగన్ ప్రశ్నకు పలాయనం.. దొరికిన చంద్రబాబు
-
అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం
సాక్షి, అమరావతి: తిరుమల ఏడు కొండలు జీవో రద్దు హామీపై చంద్రబాబు అడ్డంగా దొరికేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం చిత్తగించి అభాసుపాలయ్యారు. వైఎస్ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేశారు.జీవోలు 746, 747 రద్దు చేస్తానంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించే జీవోను రద్దు చేస్తానని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అయితే, సభలో తాను చేసిన ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను వైఎస్ జగన్ ఇటీవలే ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం బట్టబయలైంది. -
YS జగన్ పులివెందుల టూర్ షెడ్యూల్ ఇదే
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం పైన పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. -
పులివెందులలో YS జగన్ ప్రజా దర్బార్
-
కల్తీ పాల మరణాలపై YS జగన్ రియాక్షన్
-
రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు(మంగళవారం) పులివెందుల చేరుకున్నారు. ఈ క్రమంలో పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్లో పాల్గొంటారు. అలాగే, ఎల్లుండి(బుధవారం) వేంపల్లి మండలం నందిపల్లికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. అనంతరం, మధ్యాహ్నం పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్కు వైఎస్ జగన్ హాజరు అవతారు. -
కల్తీ పాల ఘటన.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడం విచారకరం. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిండి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని సూచించారు. అలాగే, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
జగన్ వర్సెస్ డర్టీ డజన్!
ఒక లక్ష్యం, దాన్ని సాధించడానికి అనుసరించే మార్గం... ఈ రెంటినీ చెట్టూ, విత్తుతో పోల్చారు మహాత్మాగాంధీ. మంచి విత్తు నాటితే ఆరోగ్యకరమైన చెట్టు ఎదుగుతుంది. విషపూరిత విత్తనం నాటితే ఆ చెట్టూ విషపు కాతే కాస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ ప్రధాన లక్ష్యమైనా అధికార సాధనే కావచ్చు. దాన్ని సాధించే ప్రయత్నం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. అడ్డదారిలో అధికారాన్ని అందుకునే ప్రయత్నాలను సహిస్తే కుక్క మూతి పిందెల పాలన చవిచూడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడీ దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద ఉదాహరణ ఇంకేదీ లేదు!అప్పటివరకూ తాము బండబూతులు తిట్టిన రాజకీయపక్ష నేతల చరణకమలాలనే కళ్లకద్దుకొని అవకాశవాద కూటమిని ఏర్పాటు చేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అంతటితో ఆగలేదు. అమలు చేయడం సాధ్యం కాదని తెలిసికూడా మోస పూరిత హామీలతో ‘సూపర్సిక్స్’ మేనిఫెస్టో ప్రకటించడం, ప్రజలను నమ్మించడం కోసం వీధివీధినా, గడపగడపనా గారడీ విద్యలు ప్రదర్శించడం కూడా తెలిసిన విషయాలే. వీటికంటే ఇంకో అతి భయంకరమైన విషయం కూడా ఉన్నదనే ఆరోపణలు, సహేతుకమైన అనుమానాలు క్రమక్రమంగా వెలుగు చూస్తున్నాయి.ఓట్ల పండుగ నాటి నిశిరాత్రి చీకటిలో ప్రజాస్వామ్యంపై క్రూరమైన అత్యాచారం జరిగిందనడానికి తార్కికమైన ఆధారా లను ఎన్నికల సంఘం సమాచార స్రవంతిలో నుంచే విశ్లేషకులు వెలికి తీస్తున్నారు. పోలింగ్ రోజు ప్రకటించిన ఓట్ల శాతం కంటే ఆ తర్వాత అసాధారణంగా ఓట్ల శాతం పెరగడంలోని అసంగతత్వాన్ని ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే స్వచ్ఛంద సంస్థ అప్పుడే ప్రశ్నించింది. ఈ ఓట్ల తేడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 12.5 శాతంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండటాన్ని గురించి కూడా ప్రశ్నించింది. అంతేకాదు, మరో స్వచ్ఛంద సంస్థ ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్’ (ఏడీఆర్)తో కలిసి ఢిల్లీలో ఒక సెమినార్ను కూడా నిర్వహించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.‘ఓట్ చోరీ’ అనే పేరుతో అడపాదడపా ప్రతిపక్ష పాత్ర పోషించే రాహుల్ గాంధీ కూడా వీఎఫ్డీ సమాచారంతో ఒకటి రెండుసార్లు హడావిడి చేశారు. అయితే ఆయన ‘పోరాటం’ నుంచి ఏపీని మాత్రం మినహాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి బలమైన బంధం ఉన్న కారణంగానే ఆయన ఓట్ చోరీ ఉద్యమంలోంచి ఏపీని డిలీట్ చేసి ఉంటారనే బలమైన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువైన బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్ అధినేతతో చుట్టరికం కొనసాగిస్తూ అవకాశవాదాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి చంద్రబాబు.వీఎఫ్డీ వెలికి తీసిన పోలింగ్ నాటి విడ్డూరాలపై ప్రముఖ రాజకీయ–ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పరకాల ప్రభాకర్ మరింత లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశీలనలో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన అంశాలతో ‘ది వైర్’ అనే స్వతంత్ర వెబ్సైట్కు ఒక వ్యాసం రాశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వ్యాసాన్ని బలపరిచే విధంగా ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ అదే వెబ్సైట్ కోసం పరకాల ప్రభాకర్ను ఇంటర్వ్యూ చేశారు. తాను ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనల్లోంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఆనాటి ఎన్నికల విజయం సందేహాస్పదమైనదనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రభాకర్ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘా నికి లేఖ రాసినప్పటికీ అక్కడ నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదని ఆయన వెల్లడించారు.పరకాల ప్రభాకర్ విశ్లేషించిన విషయాలు ఇలా ఉన్నాయి. 2024 మే 13వ తేదీన ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పది గంటల వ్యవధిలో 68.04 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. ఈ లోపల అంటే 5 గంటల 59 నిమిషాలు, అంతకంటే ముందే పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో క్యూలైన్లో నిలబడిన వారికి స్లిప్పులు ఇచ్చి ఓటు ఓసే అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పోలింగ్ పెరిగిందని ఈసీ ప్రకటించింది. ఇది 0.08 శాతం పెరుగుదల! ఓట్ల సంఖ్యలో చూస్తే 33,064 ఓట్లు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రకటించిన ఓట్ల శాతం దాదాపుగా ఫైనల్గా ఉంటుంది. మహా అయితే ఒకటీ, అర శాతం ఓట్ల పెరుగుదలతో మరుసటి రోజు ప్రకటించేవాళ్లు. కానీ, ఐదూ, ఎనిమిది గంటల మధ్య మహా మందకొడిగా అతి స్వల్పంగా ఓట్లు నమోదైనప్పటికీ ఇంకా పోలింగ్ కొనసాగుతున్నదని ఈసీ ప్రకటించింది.రాత్రి 11.45 నిమిషాల వరకు ఓట్ల శాతం 76.50 శాతానికి పెరిగినట్టు చెప్పారు. అంటే, 8.38 శాతం. 34,63,767 ఓట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో ఉన్నప్పుడు 8 గంటల లోపల ఓట్లు వేయకుండా ఏ ముహూర్తం కోసం ఎదురుచూసి ఒకేసారి ఎగబడ్డారో ఎన్నికల సంఘం వివరించలేదు. ఇంకా విడ్డూరమేమిటంటే ఆ తర్వాత కూడా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారట! ఒక్కో నియోజక వర్గానికి 20 బూత్ల చొప్పున లెక్క వేసుకొని ఓటర్లు బారులుతీరి నిలబడ్డారనుకోవాలి. ఈ బూత్లలో చివరి ఓటు 2 గంటలకు రికార్డయిందట! రెండు గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,482 మంది ఓటేశారట! ఈ ఓటర్లందరూ సాయంత్రం 6 గంటలలోపే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత అనుమతించరు కనుక!ఆ లెక్కన చివరి ఓటర్లు ఒకపూట ఉపవాసాన్ని పాటిస్తూ లఘుశంక కూడా తీర్చుకోకుండా 8 గంటలపాటు నడిరాత్రివేళ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరి వివరాలనూ, ఫొటోలనూ విడుదల చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. చివరి రెండు గంటల పదిహేను నిమిషాల పాటు పోలింగ్ జరిగిన 3500 పోలింగ్ బూత్లలో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. మొత్తం అన్ని బూత్లలో చూసుకుంటే సగటున 892 ఓట్లు పడ్డాయి. ఈ బూత్లలో నాలుగు వందల మంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.45 నిమిషాల మధ్యన ఓటు హక్కు వినియోగించుకుని 16 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఓట్లు వేస్తే, 491 మంది మాత్రం నడిరేయి దాటిన తర్వాత రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే ఓటేశారు. ఈ గారడీ లెక్కల్ని చూసిన తర్వాత కూడా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని విశ్వసిద్దామా?సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పది రోజుల్లోనే వీవీ ప్యాట్లను ఎందుకు ధ్వంసం చేసినట్టు? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలదాకా, 11.45 వరకు, కొన్నిచోట్ల రాత్రి 2 గంటల వరకూ పని చేసినా కూడా వోటింగ్ మిషన్ల బ్యాటరీ కౌంటింగ్ రోజున 90 నుంచి 99 శాతంగా ఎందుకు మిగిలినట్టు? ఈ సందేహాలపై స్పందించకుండా ఎన్నికల సంఘం ఎందుకు మడి కట్టుకున్నట్టు? భారత ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకర మైన మంత్రాంగం ఏదో ఆనాటి అర్ధరాత్రి ప్రధానంగా ఏపీలోనే కేంద్రీకృతమై నడిచిందనడానికి ఇవన్నీ ఆధారాలు.ఈ మంత్రాంగానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరై నప్పటికీ లబ్ధిదారులు మాత్రం ఏపీ కూటమి పార్టీలే! ఆ విషయం కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత పోలైన 51,83,249 ఓట్లను 175 నియోజక వర్గాల నడుమ సమానంగా విభజిస్తే ఒక్కో సీటుకు 29,618 ఓట్లవుతాయి. ఇంతకంటే తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ దాదాపు 80 సీట్లను కోల్పోయింది. వీటికి తోడు గెలిచిన సీట్లు 11. అన్ని నియోజక వర్గాల్లో ఇలా సమాన విభజన జరిగి ఉండకపోవచ్చు. అగ్ర నాయకులకు భారీ మెజారిటీల కోసం కొన్నిచోట్ల ఎక్కువ ఓట్లు, బాగా నమ్మకమున్న సీట్లలో తక్కువ ఓట్లు పడి ఉండ వచ్చు. సీట్లు తక్కువైనా సరే, స్ట్రయిక్ రేట్ ఎక్కువ వుండా లనుకున్న సీట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు. మొత్తంగా ఈ గణాంకాలు చెప్పేదేమిటంటే కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా వారికి ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టలేదనీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తిరస్కరించలేదనీ! సందేహాలు నివృత్తి చేసే బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నది.తాము ఓటమిని రుద్దినప్పటికీ జనంలో జగన్ మోహన్రెడ్డి బలంగానే ఉంటాడన్న అంచనాతోనే అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కూటమి సర్కార్ ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో పాయింట్ నెంబర్ వన్ – జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వ హననం. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా పార్టీ బలహీనపడుతుందని ఈ వ్యూహం. ఆయన పార్టీ పెట్టిన తొలిరోజు నుంచి గడచిన పదిహేనేళ్లుగా దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. రెండో అంశం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. దీని ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల నైతికబలాన్ని దెబ్బతీసే ప్రణాళిక. ఈ ఇరవై మాసాల్లో రెండు డజన్ల మంది పార్టీ అభిమానులు రాజకీయ హత్యలకు గురయ్యారు. కీలక నాయ కులతో సహా అనేక డజన్ల మంది జైళ్లకు వెళ్లారు. అనేకమంది పోలీసుల టార్చర్కు గురయ్యారు. వందలాది మంది అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ‘సాక్షి’ మీడియా సైతం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది.ఇక మూడో అస్త్రం – మతాన్నీ, దేవుడినీ రాజకీయ అవస రాలకు వాడుకొని మెజారిటీ ఓటర్లను జగన్కు దూరం చేయాలనే దిక్కుమాలిన ఎత్తుగడ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సరఫరా చేస్తూ అక్కడి నాణ్యతా పరీక్షలో విఫలమై వెనక్కు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ రప్పించి వాటి శాంపిళ్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వాడారని చేసిన అతి తెలివి ప్రచారం నెమ్మదిగా జనానికి అర్థమైంది. టీటీడీకి స్వయంగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఉన్నదనే సంగతి తెలిసినా, ఆ పరీక్షలో నెగ్గితేనే ట్యాంకర్లను అనుమతిస్తారని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను వివాదా స్పదం చేశారు. మరీ దారుణంగా పంది కొవ్వు కలిసిందనే నీతిబాహ్య ప్రచారానికి పాల్పడ్డారు. వ్యూహం బెడిసికొట్టింది. బాణం ఎదురు తిరిగి ముఖ్యమంత్రి ‘హెరిటేజ్’ కాంపౌండ్లోకే వెళ్లింది. ఇంకేయే విషయాలు బయటపడతాయో చూడాలి. దైవదూషణ ఫలితం మామూలుగా ఉండదు కదా! ముంబైలో కూడా ఏవో ‘హెరిటేజ్’ పేలుళ్లు వినబడుతున్నాయి.జగన్ మీద ఈ త్రిముఖ వ్యూహ దుష్ప్రచారంలో మూడు కూటమి పార్టీలు, ఒక పెంపుడు కాంగ్రెస్, నాలుగు ఛానెళ్లు,రెండు పత్రికలు, ఒక పెయిడ్ సోషల్ మీడియా, ఒక పేటీఎమ్ విశ్లేషణ బృందం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ పన్నెండు శక్తుల దాడులను జగన్మోహన్ రెడ్డి నిబ్బరంగా ఎదుర్కొంటున్న తీరు వైసీపీలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. రెండు గంటలైనా సరే, అంతకంటే ఎక్కువైనా సరే! ఎక్కడా అలసట లేకుండా తొట్రుపడకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాలతో కూటమి కుట్రలను ఆయన తుత్తునియలు చేయగలుగుతున్నారు. మొన్న ఒక్కరోజే త్రిముఖ వ్యూహపు పన్నాగాలతో పాటు బడ్జెట్ డొల్లతనాన్ని, మేనిఫెస్టో మోసాన్ని ఆయన ఎండగట్టారు. ఈమధ్య లడ్డూ బాణం ఎదురు తిరిగిన తర్వాత యావత్తు మంత్రిమండలి కొలువు తీరి ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో కనిపించిన విషణ్ణవదనాలను, ఆత్మవిశ్వాసంతో కూడిన జగన్ ప్రెస్మీట్లతో జనం పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక చాలు... రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పరుగు తీస్తున్నాయో తెలుసుకోవడానికి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వెరీ షేమ్.. కాంగ్రెస్ నేతలపై జగన్ ఫైర్
-
Bengaluru: నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, బెంగళూరు: ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం (రాజమహేంద్రవరం) కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. బెంగళూరులోని ది లీలా భారతీయ సిటీ(తిరుమేనహళ్ళి)లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్ఙిత, యశ్వంత్లను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. -
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఏఐ సమ్మిట్లో నిన్న(శుక్రవారం, ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. ‘‘అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి?. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మధ్య రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కాగా, ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్–5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడం కలకలం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా టీ–షర్టులు విప్పేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆయా టీ–షర్టులపై ముద్రించి ఉన్నాయి.Yesterday at the AI Summit, the Youth Congress made us all feel ashamed. Where is our politics heading! No one should ever demean our country. Whatever our political differences may be, we should always present a united face to the world.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు కూడా ఉన్నాయి. ‘ఎప్స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’అనే వాక్యాలు కూడా ముద్రించారు. నిరసన తెలియజేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. -
మేకపాటి గౌతమ్ని స్మరించుకున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్థంతి నేడు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. తన మిత్రుడు మేకపాటి గౌతమ్ని స్మరించుకున్నారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మన స్నేహం, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఒక స్నేహితుడిగా, సోదరుడిగా గుర్తుండిపోతారు’ అంటూ పోస్టు చేశారు. I will always cherish the fond memories of our friendship and camaraderie, dear Goutham. A friend and brother, you will always be remembered. pic.twitter.com/7IQQejf8gS— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026 -
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026 -
Vijayawada : జగన్ని కలిసిన బ్రహ్మానందం
-
నన్ను రాత్రి 2 గంటలకు నిద్రలేపి ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి సంచలన నిజాలు బయటపెట్టిన అంబటి
-
జగనన్న బయట అడుగుపెడితే .. అనితకు చెంపచెళ్లుమనిపించిన వరుదు కళ్యాణి
-
వైఎస్ జగన్ను కలిసిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బ్రహ్మానందాన్ని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. కొంత సమయం పాటు సరదాగా మాట్లాడుకున్న వారిద్దరూ కలిసి ఫోటో దిగారు. View this post on Instagram A post shared by Ysrcpchief (@ysrcpchief) -
జగన్ ను కలిసిన అంబటి రాంబాబు


