వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బ్రహ్మానందాన్ని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. కొంత సమయం పాటు సరదాగా మాట్లాడుకున్న వారిద్దరూ కలిసి ఫోటో దిగారు.


