‘2029లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యం’ | Kodali Nani Says YS Jagan Will Become AP Chief Minister in 2029 Elections | Sakshi
Sakshi News home page

‘2029లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యం’

Mar 1 2026 7:34 PM | Updated on Mar 1 2026 7:33 PM

Kodali Nani Says YS Jagan Will Become AP Chief Minister in 2029 Elections

సాక్షి,గుంటూరు: 2029లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఆదివారం  కొడాలి నాని, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు.

అనంతరం, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ‘కూటమి బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారు.అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి వైఎస్సార్‌సీపీ భయపడదు. 2029లో వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యం’అని స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement