సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, అంజాద్ బాషా, సాకే శైలజానాథ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం కార్యాచరణ నేతలు చర్చించారు.
చంద్రబాబు.. రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. చంద్రబాబు చర్యల వల్ల సీమకు తీరని నష్టం జరుగుతున్న వైఎస్సార్సీపీ.. కలిసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.


