Archive Page | Sakshi
Sakshi News home page

Eluru

  • రెడ్‌

    భీమవరం (ప్రకాశంచౌక్‌): రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ రాష్ట్రంలో అత్యధిక రక్త యూనిట్లు సేకరించిన సంస్థగా రెండో స్థానం సాధించింది. ఈ సందర్భంగా గుంటూరులోని భారతీయ విద్యాభవనన్‌లో జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తణుకు రెడ్‌క్రాస్‌ బ్లడ్‌సెంటర్‌కు పురస్కారం లభించడం అభినందనీయమని జిల్లా శాఖాధ్యక్షుడు రామ భద్రిరాజు అన్నారు.

    బస్సు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

    ఉండి: ఆసుపత్రికి వెళ్తున్న వృద్ధ దంపతులను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానికులు, బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం గణవరానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు తన భార్య సావిత్రితో కలసి బైక్‌పై భీమవరంలో ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే నర్సాపురం డిపోకు చెందిన బస్సు లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి బైక్‌ను ఢీకొట్టింది. వెనుక కూర్చున్న మహిళ పట్టుతప్పి ఆర్టీసీ బస్సు వెనక చక్రం కింద పడిపోయింది. ఇంతలో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో 108లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి వచ్చి వివరాలు సేకరించారు.

    వివాహిత ఆత్మహత్య

    ఆగిరిపల్లి: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వట్టిగుడిపాడులో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై శుభశేఖర్‌ వివరాల ప్రకారం వట్టిగుడిపాడుకు చెందిన రాంబాబు, నాగ తేజస్వినికి( 21) మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో 50 సెంట్లు కట్నంగా ఇచ్చారు. సంవత్సరం క్రితం తండ్రి కూతురి భూమి పట్టాలను బ్యాంకులో తనఖా పెట్టాడు. శుక్రవారం కూతురు తేజస్విని తండ్రి తనఖా పెట్టిన భూమిని విడిపించి ఇవ్వాలని అడగ్గా తండ్రి కొంత సమయం కావాలనడంతో తేజస్విని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • కొంతేరులో మహిళ ఆత్మహత్య

    యలమంచిలి: కొడుకు ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు ప్రియురాలి కుటుంబ సభ్యులు కోర్టు కేసులు వేసి తనను వేధిస్తున్నారని.. కడుపు కోతను, కోర్టు కేసులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్‌ నోట్‌ రాసి మహిళ శనివారం కొంతేరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మృతదేహాన్ని ప్రియురాలి ఇంటి ముందు ఉంచి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భీమవరం గ్రామానికి చెందిన చింతా లక్ష్మీ నర్సమాంబ భర్త చనిపోవడంతో పుట్టిల్లు కొంతేరు వచ్చి స్థిరపడింది. ఇద్దరు కుమారులను కష్టపడి ఇంజినీరింగ్‌ చదువించింది. వారిలో లికిల్‌ సాయి సమీపంలో ఉంటున్న అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరికి గొడవ జరగడంతో వీడియో కాల్‌లో ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉరి వేసుకుని గత డిసెంబరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో తన కుమార్తెను అల్లరిపాలు చేస్తున్నారంటూ ఆ అమ్మాయి తండ్రి వారిపై పోక్సో కేసు నమోదు చేయాలని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు కొడుకు మరణం, మరోవైపు కోర్టు కేసులతో నర్సమాంబ మనస్తాపం చెంది శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు అడ్డాల నాగేశ్వరరావు కుటుంబమే కారణమని ఆరోపిస్తూ నర్సమాంబ సూసైడ్‌ నోట్‌ రాసింది. ఈ సంఘటనపై ఎవరూ పిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

    కుమారుడి ప్రియురాలి ఇంటిముందు

    మృతదేహంతో ఆందోళన

  • నటుడు అల్లం గోపాలరావు మృతి

    భీమడోలు : సినీ, టీవీ ఆర్టిస్ట్‌ అల్లం గోపాలరావు(75) శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన ఆయన మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గోపాలరావుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్నేహితుడు. ఆయన సహకారంతో రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌ వెళ్లి టీవీ, సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. గోపాలరావు భీమడోలులోని సుగర్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పని చేసేవారు. గ్రామంలోని గురజాడ కళావేదిక వద్ద క్రీడా పోటీలు నిర్వహించేశారు. అభ్యుదయ వాదిగా అనేక చైతన్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేశారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాటికలు, ప్రదర్శనలు ఇచ్చారు.

    గోపాలరావు మృతికి నివాళి

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గోపాలరావు మృతికి సీపీఐ, ప్రజా నాట్యమండలి, బీకేఎంయూ జిల్లా సమితులు ఓ ప్రకటనలో సంతాపం తెలిపాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ప్రజానాట్యమండలి ఏలూరు ఏరియా కార్యదర్శి తమ్మా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గోపాలరావు తొలినాళ్లలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజానాట్యమండలిలో ప్రముఖ పాత్ర నిర్వహించారన్నారు. సమాజంలో మార్పునకు కృషి చేశారన్నారు. అభ్యదయ భావాలు కలిగిన గోపాలరావు మృతి కళా రంగానికి తీరని లోటన్నారు.

  • ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, అనివెట్టి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్‌ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. దేవస్థానం సిబ్బంది భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో నిరంతరాయంగా మజ్జిగ, మంచి నీటిని అందించారు. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. కొండపైన ఘాట్‌ రోడ్లు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

Guntur

  • కూటమి

    ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. సర్కారు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను చిన్నచూపు చూస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యకు పట్టం కడుతోంది. ఇటీవల అందజేసిన షైనింగ్‌ స్టార్‌ అవార్డులు దీనికి అద్దం పడుతున్నాయి. టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల నుంచి ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులను పక్కన పెట్టి కార్పొరేట్‌కు పెద్దపీట వేసింది.

    గుంటూరు ఎడ్యుకేషన్‌: గత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం షైనింగ్‌ స్టార్స్‌గా ఎంపిక చేసింది. ఈనెల 9న ఒక్కొక్కరికీ రూ.20వేలు చొప్పున నగదు అందజేసింది. గుంటూరు జిల్లాలో షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు అందుకున్న 150 మందిలో 116 మంది ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులే ఉండటం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కేవలం 34కు పరిమితమయ్యారు. అవార్డులు అందుకున్న 112 మంది టెన్త్‌ విద్యార్థుల్లో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 85 మంది ఉండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 27 మందే ఉన్నారు. అదే విధంగా 38 మంది ఇంటర్‌ విద్యార్థుల్లో 31 మంది ప్రైవేటు, ఏడుగురు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం వారిపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.

    జగనన్న పాలనలో ప్రభుత్వ విద్యార్థులకు పట్టం

    జగనన్న పాలనలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత లభించింది. విద్యార్థులను జగనన్న అణిముత్యాలు కార్యక్రమం ద్వారా సత్కరించి, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులను నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో సత్కరించి, నగదు ప్రోత్సాహకాలను అందించే మహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వారీగా టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన తొలి ముగ్గురు టాపర్లకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.ఐదు వేలు చొప్పున నగదు ప్రోత్సహాలను అందజేశారు. నియోజకవర్గ స్థాయిలో 23 మంది టెన్త్‌ విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్‌లో 15 మందితో పాటు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిధిలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రాసిన తొలి ముగ్గురు విద్యార్థుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపిక చేసి వారికి వరుసగా రూ.మూడువేలు, రూ.రెండువేలు, రూ.వెయ్యి చొప్పున అందించారు. జిల్లాస్థాయిలో టాపర్లుగా నిలిచిన 23 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.50వేలు, రూ.30వేలు, రూ.15వేలు చొప్పున మొత్తం రూ.8.20 లక్షలు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

    తల్లిదండ్రులే స్ఫూర్తి

    స్వస్థలం గుంటూరు. నాన్న భానుప్రకాష్‌ గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జువాలజీ అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అమ్మ విజయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకురాలు. నీట్‌ ఓపెన్‌ కేటగిరీలో 262 ర్యాంకు వచ్చింది. తాజాగా ర్యాంకుతో ఎయిమ్స్‌లో సీటు సాధిస్తా.

    – కారుమంచి విక్రాంత్‌,

    9వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ

    అమ్మానాన్నలు ప్రభుత్వ వైద్యులే

    స్వస్థలం గుంటూరు. నాన్న డాక్టర్‌ గోవిందనాయక్‌, అమ్మ డాక్టర్‌ కరుణ జీజీహెచ్‌లో వైద్యులు. ఓపెన్‌ కేటగిరీలో 2,135వ ర్యాంకు సాధించా. కళాశాలలో అధ్యాపకులు అందించిన సహకారం, సందేహాల నివృత్తి, వీక్లీ టెస్టుల ద్వారా సబ్జెక్టు పరంగా పట్టు సాధించా. ఇది మెరుగైన ర్యాంకు సాధనకు దోహదపడింది. మంగళగిరి ఎయిమ్స్‌లో చేరతా.

    – ఎం. అరవింద్‌, 13వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ

    షైనింగ్‌ స్టార్‌ అవార్డుల్లో ‘పచ్చ’పాతం ప్రభుత్వ విద్యార్థులను కాదని ప్రైవేటు, కార్పొరేట్‌కే పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన 34 మంది విద్యార్థులకే పురస్కారాలు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివిన 116 మందికి అధిక ప్రాధాన్యత గుంటూరు జిల్లాలో 150 మందికి రూ. 20వేలు చొప్పున నగదు అందజేత జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థులకే పట్టం

  • పేదిం

    నా పేరు గరిక ఝాన్సీ...మాది కొల్లిపర. కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తుంటాం. మాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. రెక్కల కట్టం చేస్తూనే ముగ్గురిని చదివిస్తున్నాం. ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీనిచ్చింది. శుక్రవారం తల్లికి వందనం పేరుతో ముగ్గురికి రూ.39 వేలు వస్తాయని ఎంతో సంబరపడ్డాం. తీరా చూస్తే ఒక్కరికీ కూడా రాలేదు. పదో తరగతి పూర్తిచేసిన ఇద్దరు పిల్లల పేర్లు లేవు. చిన్నది ప్రణతి లక్ష్మి పేరు అనర్హుల జాబితాలో ఉంది. సరైన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించలేదని కారణం చూపారు. చాలా బాధగా ఉంది. కూలి చేసుకునే జీవించే తమలాంటి పేదలకు ప్రభుత్వ పథకాల సాయం అందకపోతే ఎలా...ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయాలి.

    తెనాలి: అమ్మ ఒడి పథకాన్ని పేరుమార్చి తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కూటమి నేతలు ఎన్నికల సభల్లో ఇచ్చిన హామీని గతేడాది అమలు చేయనేలేదు. ప్రస్తుతం పథకం వర్తింపునకు పలు ఆంక్షలు విధించింది. ఫలితంగా ఎందరో మహిళలు అనర్హుల జాబితాలో చేరారు. సీబీఎస్‌ఈతోపాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు జాబితాల్లో కనిపించడం లేదు. 2024–25 విద్యా సంవత్సరంలో టెన్త్‌, ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకోలేదు. టెన్త్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌ వంటి కోర్సుల్లో చేరితేనే వారికి లబ్ధి కలుగుతుంది. సీనియర్‌ ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులను అనర్హులుగా తేల్చారు. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి సాయం అన్న కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం తెనాలి నియోజకవర్గంలో కనీసం 30 వేల మంది విద్యార్థులకు రూ.13 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. అధికారికంగానే 22,320 మందికి మాత్రమే వర్తింపజేశారు. వీరిలోనూ చాలామంది అనర్హతతో అవకాశం కోల్పోయారు.

    ఆదాయం ఉంటే పథకం దూరం

    విద్యుత్‌ వినియోగం, నెలసరి ఆదాయాన్ని పరిశీలనలోకి తీసుకుని లబ్ధిదారుల్లో కోతను విధించినట్టు స్పష్టమవుతోంది. గ్రామీణులకు నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించిన ఆదాయం ఉంటే పథకానికి దూరమయినట్టే. విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించిన వారినీ దూరం పెట్టారు. ఇలాంటి ఆంక్షలతో తెనాలి నియోజకవర్గంలో వందల సంఖ్యలో అనర్హులుగా మారారు.

    సాయంలో కోత

    తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున మాత్రమే జమచేశారు. మిగిలిన రూ.2 వేలను పాఠశాలల అభివృద్ధి నిధికి కేటాయించారు. ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ల ఆధీనంలో ఉంచారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ఇదే విధానాన్ని అమలుచేస్తే, అప్పట్లో ప్రతిపక్షంలోని నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ బాటనే అనుసరిస్తుండటం గమనించాల్సిన అంశం.

    సంవత్సరం లబ్ధిదారులు ఆర్థికసాయం

    2019–2020 25,850 రూ. 38,77,50,000

    2020–2021 25,471 రూ. 38,20,65000

    2021–2022 21,213 రూ. 31,81,95000

    2022–2023 20,857 రూ. 31,81,55,000

    అర్హతలున్నా అందని ‘తల్లికి వందనం’ ప్రభుత్వ ఆంక్షలతో అనర్హత వేటు పథకం సాయం అందని తల్లుల్లో నిరాశ

    జగన్‌ పాలనలో తెనాలి నియోజకవర్గంలో అందిన సాయం

    గ్రీవెన్స్‌లో పెట్టుకోమంటున్నారు

    నా కుమారుడు తెనాలిలోని మాంటిస్సోరి ఇంగ్లిష్‌ మీడియం స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం పథకానికి రేషను కార్డు సహా అన్ని అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ అర్హుల జాబితాలో పేరు లేదు. అదేమని అడిగితే గ్రీవెన్స్‌లో పెట్టుకోమని సమాధానం చెబుతున్నారు.

    – బొంత శ్రీనివాసరావు, కఠెవరం

    కారణం చెప్పడం లేదు

    నా కుమార్తె తెనాలిలోని సెయింట్‌జాన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో ఒకటో తరగతి చదివింది. ప్రస్తుతం రెండో తరగతి. తల్లికి వందనం పథకానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకనో మా పేరు అనర్హుల జాబితాలో ఉంది. ఎందుకని అడిగితే కారణం చెప్పటం లేదు.

    – కర్ర భవాని, కఠెవరం

  • నీట్‌

    గుంటూరు ఎడ్యుకేషన్‌ : వైద్య విద్యా కోర్సుల జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్‌–2025)లో గుంటూరుకు చెందిన పలువురు విద్యార్థుల వివిధ కేటగిరీల్లో అఖిల భారతస్థాయిలో ర్యాంకులు కై వసం చేసుకున్నారు.

    నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు జాతీయస్థాయి వైద్య విద్యా సంస్థల్లో (ఎయిమ్స్‌)తో పాటు దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో సీట్లు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.

    ఎయిమ్స్‌లో చేరడమే లక్ష్యం

    స్వస్థలం యర్రగొండపాలెం. నాన్న యేసానాయక్‌ జెడ్పీ హైస్కూల్‌ గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. టెన్త్‌ వరకూ నవోదయలో, ఇంటర్మీడియెట్‌ గుంటూరు వచ్చి చదివాను. సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో 981మార్కులు సాధించాను. తాజా ర్యాంకుతో ఎయిమ్స్‌లో చేరాలని భావిస్తున్నాను.

    – రమావత్‌ తరుణ్‌ కుమార్‌ నాయక్‌,

    51వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ

    వైద్యురాలిగా

    రాణించాలనే లక్ష్యం

    స్వస్థలం నరసరావుపేట. నాన్న షేక్‌ మహబూబ్‌ సుభానీ వార్డు సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఓపెన్‌ కేటగిరీలో 1,184వ ర్యాంకు సాధించా. ఎయిమ్స్‌లో చేరే లక్ష్యంతో ఉన్నాను.

    – షేక్‌ వసీమా, 80వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌

    డాక్టర్‌గా సమాజానికి సేవ

    స్వస్థలం గుంటూరు. నాన్న రత్నాకర్‌ ఆర్కిటెక్చర్‌. అమ్మ రెబెకా విద్య సివిల్‌ ఇంజినీర్‌. గతేడాది నీట్‌లో క్వాలిఫై అయ్యి పుదుచ్చేరిలోని జిప్‌మర్‌లో సీటు సాధించిన అన్నయ్య ప్రణయ్‌ విక్టర్‌ బాటలో వైద్య విద్య అభ్యసించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత కార్డియాలజిస్ట్‌గా ఎదిగి, సమాజానికి సేవ చేస్తా. – సోలే ప్రేమ్‌ జడ్సన్‌ ప్రసన్న,

    108వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ

    గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తా!

    స్వస్థలం నెల్లూరు. నాన్న కృష్ణారెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. వైద్య విద్యపై మక్కువతో రోజుకు 15 గంటల పాటు చదివాను. ప్రణాళికాబద్ధమైన కృషితోనే ఓపెన్‌ కేటగిరిలో 960 ర్యాంకు సాధ్యమైంది. ఎయిమ్స్‌లో వైద్యవిద్య అభ్యశించిన తరువాత గైనకాలజిస్ట్‌గా రాణించాలనే లక్ష్యంతో ఉన్నా.

    – నాగిరెడ్డి మనస్విని,

    49వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌

    జాతీయస్థాయి వైద్య విద్యాసంస్థల్లో సీటు సాధనే లక్ష్యం వివిధ కేటగిరీల్లో ప్రతిభ చాటిన విద్యార్థుల భావి ప్రణాళికలు

  • వైభవం

    అమరావతి: మల్లాది గ్రామంలోని వట వృక్షాంతర్గత వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజల అనంతరం శాంతి కల్యాణం నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, తులసీ మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులకు తొమ్మిది మంది దంపతులతో శాంతి కల్యాణ ప్రక్రియను ఆలయ యాజ్ఞికస్వామి పరుచూరు శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. మధ్యా హ్నం భక్తులకు అన్నదానం చేశారు.

    శ్రీవారి ఊయల సేవ

    పునఃప్రారంభం

    తెనాలి టౌన్‌ : శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి ఊయల సేవ శనివారం నుంచి పునఃప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడుతూ దేవస్థానంలో ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు ఊయల సేవ జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊయల సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించారు. కొండేపి వసుంధర బృందం ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

    రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం

    నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌) : మల్లారెడ్డినగర్‌ విఘ్నేశ్వరస్వామి సహిత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. రామలింగేశ్వర స్వామికి ఆలయ అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం రుద్రహోమం, నవగ్రహ, మండప దేవత హోమాలను చేపట్టారు. భక్తులకు తీర్థ్ధ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఫౌండేషన్‌ చైర్మన్‌ మెట్టు కృష్ణారెడ్డి దంపతులు, అన్నదాన కమిటీ చైర్మన్‌ గుంటూరు వేమారెడ్డి, కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు.

    జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి స్థలాల పరిశీలన

    బాపట్ల: జిల్లా కోర్టు భవన సముదాయం బాపట్ల పట్టణంలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి తెలిపారు. జిల్లా కోర్టు భవన సముదాయానికి అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. తొలుత తూర్పు బాపట్లలో ఖాళీగా ఉన్న 7.5 ఎకరాల ప్రభుత్వ భూమిని, అనంతరం ఇందిరానగర్‌లో ఖాళీగా ఉన్న 2.80 ఎకరాల భూమిని పరిశీలించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భూమి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలను పంపాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్‌ వెంట బాపట్ల తహసీల్దార్‌ సలీమా, సర్వేయర్లు వీఆర్వోలు తదితరులు ఉన్నారు.

  • ప్రత్తిపాడు: నల్ల బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి దైన్యంగా ఉంది. తినీ, తినక ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. అటు ఉన్న ధరకు తెగనమ్ముకోలేక.. ఇటు నిల్వ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ధర అమాంతంగా పడి పోయింది. కొనేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు.

    పొగాకును ఏమి చేసుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. పంటను ఇంటికి తరలించలేక, ఎక్కడా నిల్వ చేయలేక ఇదిగో పొలాల్లోనే కట్టలు కట్టి, వానలకు తడవకుండా పొలాల్లోనే పట్టాలు కట్టి భద్రపరుచుకున్నారు. నల్లబర్లీకి ధర కాస్తంత పలకకపోతుందా..? ప్రభుత్వం అయినా స్పందించి కొనుగోలు చేయదా ? అన్న ఆశతో కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.

    1,38,874 క్వింటాళ్ల నిల్వ

    ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, గుంటూరు రూరల్‌ మండలాల్లో 3,406 మంది రైతులు 11,704 ఎకరాల్లో నల్లబర్లీ సాగు చేశారు. 1,38,874 క్వింటాళ్ల నిల్వలున్నాయి. వ్యవసాయ వైకుంఠపాళిలో రైతును ఏటా ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ వైఖర్లు నిత్యం అల్ల్లకల్లోలం చేస్తూనే ఉన్నాయి. అయినా, మళ్లీ తొలకరి వానలు రావడం, కాడెద్దుల గంటల సవ్వడులు పిలవడం, హాలికుడి హలం పట్టి మళ్లీ కోటి ఆశల నిచ్చెనలు ఎక్కుతూ భూమిలో కాలిడటం ఆపడు.

  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ‘తల్లికి వందనం’

    తెనాలి టౌన్‌: విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. తెనాలిలోని జనసేన క్యాంప్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.67లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం తాలూకు నగదు జమ అవుతున్నట్లు స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 24,65,000 మందికి అదనంగా సాయం అందుతున్నట్లు వెల్లడించారు. తెనాలి నియోజకవర్గంలో 22,383 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. పట్టణంలో 12,157 మంది, తెనాలి మండలంలో 6,748, కొల్లిపర మండలం 4,409 లబ్ధిదారులు ఉండగా మొత్తం రూ.32,07,45,000 జమ అయినట్లు చెప్పారు.

  • తప్పిన పెను ప్రమాదం

    దాచేపల్లి: నగర పంచాయతీ పరిధిలోని కారంపూడి రోడ్డు సెంటర్‌లో శనివారం లారీ బీభత్సం సృష్టించింది. పిడుగురాళ్ల వైపు నుంచి అతి వేగంతో వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ ఇనుప గ్రిల్స్‌ని ఢీకొని దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మీటర్ల పొడవునా ఇనుప గ్రిల్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్‌లో లారీ బీభత్సం సృష్టించడంతో ప్రజలు పరుగులు తీశారు. గ్రిల్స్‌ను ఢీకొని లారీ నిలిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్రేన్‌ సాయంతో లారీని పక్కకు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

  • చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో పాత నేరస్తుడి అరెస్టు

    నగరంపాలెం: ఒంటరిగా వెళ్లే వృద్ధ మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లే పాత నేరస్తుడ్ని గుంటూరు సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. అతని నుంచి రూ.30 లక్షలు ఖరీదైన 300 గ్రాముల నగలు, బైక్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలుల్‌లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి గత నెల 28 వరకు జిల్లాలో వరుస బంగారు గొలుసు చోరీలు జరిగాయని తెలిపారు. దీంతో సీసీఎస్‌ సీఐలు అనురాధ, అల్తాఫ్‌ హుస్సేన్‌, బి.శ్రీనివాస్‌తో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. గత ఆరు నెలలుగా సుమారు 700 నిఘా కెమెరాలను నిశితంగా పరిశీలించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో ఆనందపేట ఒకటో వీధిలో ఉంటున్న నలభై ఏళ్ల షేక్‌ అమీర్‌బేగ్‌ అలియాస్‌ జోహారీని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎనిమిది బంగారు గొలుసు దొంగతనాలకు ఇతడే పాల్పడినట్లు విచారణలో గుర్తించామని వివరించారు. అమీర్‌ బేగ్‌ను అరెస్ట్‌ చేసి బంగారు నగలు, మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మరో రెండు బైక్‌లను గుర్తించాలని చెప్పారు. కేసులను త్వరితగతిన ఛేదించిన ఏఎస్పీ క్రైం సుప్రజ, డీఎస్పీ శివాజీరాజు, సీఐలు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు అందించారు.

    15 రోజులకు ఒకసారి చోరీ

    పెయింటర్‌గా పనిచేసే అమీర్‌ బేగ్‌ ఒంటరి మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో మంచి నేర్పరి. 2006లో మూడు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నాడు. 2014లో పాత గుంటూరు పీఎస్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. అతనిపై 2016లో పాత గుంటూరు పీఎస్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. అప్పటికే సుమారు 22 కేసులు నమోదవ్వగా, ఇటీవల చేసిన ఎనిమిది కేసులతో 30 వరకు నమోదయ్యాయి. పదిహేను రోజులకు ఒకసారి రెక్కీ చేసేవాడని, అది కూడా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చేసేవాడని పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. బాపట్ల జిల్లా వెళ్లి అక్కడ తాళం అరిగిపోయిన బైక్‌లను దొంగలించి, ఇక్కడికి వచ్చేవాడని చెప్పారు. చోరీలు చేసిన తర్వాత ఎక్కడపడితే అక్కడే వాటిని వదిలేసి వెళ్లేవాడని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, సీసీఎస్‌ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు జె.అనురాధ, ఎండీ.ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం పీఎస్‌ సీఐ జి.వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ సరస్వతి, హెడ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు వి.శ్రీకాంత్‌, ఎస్‌.కె.నజీర్‌ పాల్గొన్నారు.

    రూ.30 లక్షలు విలువైన

    బంగారు నగలు స్వాధీనం

  • సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ నరసింహారెడ్డికి అవార్డు ప్రద

    లక్ష్మీపురం: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 50కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ సాధు నరసింహారెడ్డికి భారత రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ ’అవార్డు అందజేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెం లోని భారతీయ విద్యాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ నరసింహారెడ్డి నాయకత్వ నైపుణ్యం, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. అవార్డు గ్రహీత నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నెలకొల్పిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో 2023లో 1,440 యూనిట్లు, 2024లో 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ కృషికి గానూ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తనకు గుర్తింపు కల్పించాయని తెలిపారు. ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం ద్వారా రక్తదాన సేకరణలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎ.కె.పరీద మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ఏర్పాటు, సామాజిక సేవల్లో నరసింహారెడ్డి అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సంస్థ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు, జీఎస్టీ అధికారులు నాగరాజు, రవికుమార్‌, ఈశ్వరరావు, గాదె శ్రీనివాసరెడ్డి, పూర్ణ సాయి, శాఖమూరి శ్రీనివాస్‌, బిల్లా ప్రశాంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

    రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

    యడ్లపాడు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. హైవే పరిరక్షణ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా వలపర్ల గ్రామస్తులు మొహమ్మద్‌, హసీరా దంపతులు, వారి ఇద్దరు పిల్లలు నహీరా, నసీర్‌లతో బైక్‌పై శనివారం గుంటూరు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, యడ్లపాడు సమీపంలోని నక్కవాగు వద్ద గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. వాహనం అదుపు తప్పి కిందపడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. గాయపడిన వారిని హైవే అంబులెన్స్‌ సిబ్బంది గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

    నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన షేక్‌ మహబూబ్‌ బాషా బైక్‌పై గుంటూరు వైపు ప్రయాణమయ్యాడు. మద్యం సేవించి ఆపై వేగంలో ఉన్నందున వాహనం అదుపుతప్పి యడ్లపాడు ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్‌ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టాడు. బాషా రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హైవే అంబులెన్స్‌ సిబ్బంది బాధితుడిని గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

  • కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

    చీరాల అర్బన్‌: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య అన్నారు. శనివారం స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో సీపీఎం బాపట్ల జిల్లా నాయకులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటి రోజు వర్తమాన రాజకీయ పరిణామాలుపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సుపరిపాలన అందించినట్లు చెప్పుకుంటుందని, ప్రజలు అటువంటి సంతృప్తి వ్యక్తం చేయడం లేదన్నారు. తల్లికి వందనానికి అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టారన్నారు. పిల్లల చదువులకు ఇచ్చే డబ్బుల్లో కోత వేయడం సరికాదన్నారు. అర్హులైన అందరికీ తల్లికి వందనం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. రాష్ట్రానికి వనరులు రాబట్టుకోవడం, విభజన హామీలు అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు భావించారన్నారు. ఆచరణలో మాత్రం ఆ ప్రయత్నం జరగలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ వంటి పథకాలు ఇంటింటికీ అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తోందని తెలిపారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యలపై జిల్లాలో సీపీఎం పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్‌, ఎన్‌.బాబూరావు, మణిలాల్‌, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, వి.వెంకటరామయ్య, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

    సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య

  • నీట్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయకేతనం

    గుంటూరు ఎడ్యుకేషన్‌ : నీట్‌–2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అఖిల భారతస్థాయిలో వివిధ కేటగిరీల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్‌ తెలిపారు. శనివారం గుంటూరులోని శ్రీచైతన్య క్యాంపస్‌లో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ గుంటూరు జోన్‌ నుంచి ఎం.అరవింద్‌ 13వ ర్యాంకు, జె. శ్రీ కీర్తన 109వ ర్యాంకు, ఎం.రోహన్‌ 133వ ర్యాంకు, షేక్‌ నిహాల్‌ పర్వేజ్‌ 180వ ర్యాంకు, జి. లక్ష్మీదివ్య శ్రీ 187వ ర్యాంకు, సీహెచ్‌ రీతికారెడ్డి 296వ ర్యాంకు, కె.సిరివెన్నెల 847వ ర్యాంకు, వి. లిదియా జాస్మిన్‌ పాల్‌ 976వ ర్యాంకుతో పాటు ఐదువేల లోపు 41 మంది, 10వేల లోపు 83 ర్యాంకులు సహా 195 మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు మెడికల్‌ సీట్లు సాధించేందుకు అర్హత సాధించారని వివరించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ అకడమిక్‌ డైరెక్టర్‌ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్‌ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్‌, డీన్స్‌ కిషోర్‌ కుమార్‌, చంద్రశేఖర్‌, కృష్ణ, అసోసియేట్‌ డీన్‌ హరిబాబు, ఏజీఎం ఎల్‌టీసీ శ్రీనివాస్‌, ఆయా క్యాంపస్‌ల ప్రిన్సిపాల్స్‌, అధ్యాకులు అభినందించారు.

  • డేటా సమీకరణలో ఆన్‌టాలజీల పాత్ర కీలకం

    చేబ్రోలు: వివిధ వనరుల నుంచి వచ్చిన డేటాను ఒకే ఫార్మాట్‌లో సమీకరించడానికి ఆన్‌టాలజీలు ఉపయోగపడతాయని మద్రాస్‌ ఐఐటీ సీఎస్‌ఈ ప్రొఫెసర్‌ పి.శ్రీనివాసకుమార్‌ అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ‘‘సెకండ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ సాఫ్ట్‌ కంప్యూటింగ్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను శనివారం ముగిసింది. ప్రొఫెసర్‌ శ్రీనివాసకుమార్‌ మాట్లాడుతూ ఏఐ సిస్టమ్‌లు ఒక నిర్దిష్ట పరిసరాన్ని అర్థం చేసుకోవడం, నిర్ణయం తీసుకోవడం లేదా సహాయపడే విధంగా రూపొందించడంలో ఆన్‌టాలజీలు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. భాషను అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా తర్జుమా, ప్రశ్నల సమాధానాలు, చాట్బాట్‌ల అభివృద్ధిలో ఉపయోగపడతాయని తెలిపారు. వాతావరణం, ట్రాఫిక్‌, విద్యుత్‌ వినియోగం వంటి డేటాను తెలివిగా ప్రాసెస్‌ చేయడంలో కూడా వినియోగిస్తారని చెప్పారు. జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ– సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రమేష్‌బాబు బత్తుల మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవస్థలు బ్యాంకింగ్‌లో వినియోగదారుల ప్రవర్తనలను విశ్లేషించి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగలవని తెలిపారు. పౌరుల భద్రతను పెంచేలా సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ఎమర్జెన్సీ సేవలను మరింత సమర్థంగా నడిపించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఐటీ– సిల్‌చార్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కె.సుగన్య దేవి, ఎన్‌ఐటీ వరంగల్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ యూ.ఎస్‌.ఎన్‌. రాజు, మెక్రోసాఫ్ట్‌ సీనియర్‌ సాఫ్టేవేర్‌ ఇంజినీర్‌ ఆదిత్య సాలాది, డీన్లు పాల్గొన్నారు.

    మద్రాస్‌ ఐఐటీ సీఎస్‌ఈ ప్రొఫెసర్‌ శ్రీనివాసకుమార్‌

  • అలరించిన వైద్యురాలి కూచిపూడి నృత్యం

    నగరంపాలెం: స్థానిక జిల్లా కోర్టు రోడ్డులోని గుంటూరు వైద్యకళాశాల (జీఎంసీ) ఆవరణలోని జింఖానా ఆడిటోరియంలో శనివారం వైద్యురాలు కంభంపాటి అపర్ణ కూచిపూడి నాట్య అరంగేట్రం చేశారు. వేదాంతం కళాక్షేత్రం (యూఎస్‌ఏ) వ్యవస్థాపకులు వేదాంతం రాఘవ, బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథశర్మ, బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచలశాస్త్రి, వైద్యులు హనుమంతురావు, కంభంపాటి మహాదేవ, వరలక్ష్మి దంపతుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేదాంతం రాఘవ శిష్యురాలైన డాక్టర్‌ అపర్ణ కూచిపూడి రంగప్రవేశం చేశారు. సంప్రదాయ ప్రార్థనతో మొదలై, పలు కూచిపూడి నృత్యాలకు ఆమె నాట్యం చేశారు. అమెరికాలో ఉంటున్న అపర్ణ దేశ సంస్కృతిని పరిరక్షిస్తూ, తొమ్మిదో ఏటనే నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిందని వక్తలు పేర్కొన్నారు. ఒకవైపు వైద్య వృత్తిని అభ్యసిస్తూ, నాట్యంపై అభిలాష పెంపొందించుకోవడం అభినందనీయమని తెలిపారు. విద్యలో రాణిస్తూ, కూచిపూడిలో ప్రతిభ చూపడం గొప్ప విషయమని కొనియాడారు.

  • మహిళపై కత్తితో దాడి

    నరసరావుపేట టౌన్‌: మంచినీటి పంపు వద్ద చోటు చేసుకున్న వివాదం మహిళపై కత్తితో దాడికి దారి తీసింది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దచెరువు రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌ వద్ద కుళాయిలో తాగునీరు పట్టుకునే విషయంలో చల్లా సుధారాణికి, గుంజి తిరుమలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సుధారాణిపై తిరుమల, అతని తండ్రి వెంకటేశ్వర్లు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jagtial

  • గోదావరిఖని: నాన్న పోత్సాహంతో ఐఎఫ్‌ఎస్‌లో 40వ ర్యాంకు సాఽ దించాను. సొంతంగా సివిల్‌కు ప్రిపేరై రెండో ప్రయత్నంలో విజ యం సాధించా. ఐఎఫ్‌ఎస్‌ సాధించడంలో సింగరేణిలో ఈపీ ఫిట్టర్‌గా పనిచేస్తున్న మా నాన్న నర్సింహారెడ్డి పోత్సాహం ఎంతగానో ఉంది. గ్రూప్‌–2లో డీఎస్పీ ఉద్యోగం లభించగా, ఐఎఫ్‌ఎస్‌ వైపే మొగ్గు చూపుతున్నా. – ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థి అవినాశ్‌రెడ్డి, గోదావరిఖని

    తండ్రి హమాలీ.. కొడుకు జడ్జి

    జగిత్యాల: ఇంటిపెద్ద హమాలీగా పనిచేస్తూ కొడుకును ఉన్నతస్థానాల్లో నిలబెట్టి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల మండలం హస్నాబాద్‌ గ్రామానికి చెందిన కనకయ్య–యాదవ్వ దంపతులది పేద కుటుంబం. అదే గ్రామంలో అద్దెకుంటూ కనకయ్య జగిత్యాలలో హమాలీగా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె భవాని పెళ్లి కాగా, భార్గవి ప్రైవేటు టీచర్‌. తండ్రి కూలీ పని చేసుకుంటూ నరేశ్‌ను హైదరాబాద్‌లో చదివించాడు. నరేశ్‌ పట్టుదలతో చదివి ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. కుమారుని చదువు కోసం కనుకయ్య హమాలీ పనిచేస్తూ రాత్రనక పగలనక కష్టపడి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాడు. తండ్రి తన కోసం ఎంతో కష్టపడి తనను ఈ స్థానంలో నిలబెట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని నరేశ్‌ పేర్కొన్నారు.

  • 2,426 కేసుల పరిష్కారం

    జగిత్యాలజోన్‌: లోక్‌ అదాలత్‌లో భాగంగా జిల్లాలోని వివిధ కోర్టుల్లో 2,426 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి తెలిపారు. జిల్లాకేంద్రంలో లోక్‌అదా లత్‌ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 50 సివిల్‌ కేసులు, 2,324 క్రిమినల్‌ కేసులు, 52 ప్రిలిటిగెంట్‌ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నా రు. 20 మోటార్‌ వాహనాల కేసుల్లో రూ.1.45 కోట్ల పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. లోక్‌అదాలత్‌ తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు. కేసులతో ఇబ్బంది పడే బదులు రాజీ చేసుకోవడం మేలన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్‌ జడ్జి వెంకట మల్లిక్‌ సుబ్రహ్మణ్య శర్మ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.లావణ్య, మొదటి అదనపు జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ శ్రీనిజ, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ చీఫ్‌ చంద్రమోహన్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ సతీష్‌, విజయ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మారుతి ఉన్నారు.

  • వామ్మో బడి ఫీజులు
    ● ఆందోళనలో తల్లిదండ్రులు ● ఏటేటా పెరుగుతున్న ఖర్చులు ● ఎల్‌కేజీకే తడిసిమోపెడు

    జగిత్యాల: పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉన్నప్పటికీ కొందరు ప్రైవేటు పాఠశాలలనే ఆశ్రయిస్తుంటారు. దీనిని ప్రైవేటు యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతుండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్‌మీడియంలో లేకపోవడంతో అధిక ఫీజులు చెల్లించయినా తమ పిల్లలను ప్రైవేట్‌కే పంపిస్తున్నారు. ఎల్‌కేజీకే ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి వస్తోంది. వీటికితోడు బుక్కులు, టై, షూస్‌, యూనిఫాం ఖర్చులు అదనం.

    మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన

    ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చూసి మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక స్కూల్‌ ఫీజే కాకుండా పుస్తకాలు, పిల్లలకు యూనిఫాంలతోపాటు, టై, బెల్ట్‌, షూలు కూడా యాజమాన్యాలే విక్రయిస్తూ వాటికి కూడా సపరేట్‌గా వసూలు చేస్తున్నారు. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వారికి ఫీజులు కట్టాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. కొంత మంది అప్పు చేసి మరీ చదివిస్తున్నారు. ఆటో, కారు డ్రైవర్‌ మొదలు.. ప్రైవేటు ఉద్యోగుల పిల్లలు కూడా ఎక్కువగా ప్రైవేటు పాఠశాల ల వైపే మొగ్గు చూ పుతున్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం అంటూ తల్లిదండ్రులు కూడా ఎంత ఫీజులైనా భరించి చెల్లిస్తున్నారు.

    ఆకర్షణీయమైన పేర్లతో..

    జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా వివిధ సిలబస్‌ అంటూ మభ్యపెడుతున్నారు. కొన్ని స్కూళ్లకు ఎలాంటి అనుమతులు లేకున్నా ఈ టెక్నో, ఐఐటీ అని, డీజీ ఇలా తోకపేర్లు తగిలిస్తూ.. అత్యధిక ఫీజు వసూలు చేస్తున్నారు. ఆకర్షణీయమైన రూపంలో ప్రింట్‌ చేసిన బ్రోచర్లతో ఉపాధ్యాయులను ఇంటింటికీ పంపిస్తూ.. ప్రచారం చేస్తూ స్కూళ్లలో జాయిన్‌ చేసుకుంటున్నారు.

    వసతులు అంతంతే..

    జిల్లాలోని కొన్ని పాఠశాలలో వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కొందరు సిటీ మధ్యలో ఏర్పాటు చేయగా.. కొందరు శివారు ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలలు కొనసాగిస్తున్నారు. ఇరుకు ఇరుకు గదుల్లోనే క్లాసులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో ఏకంగా సెల్లార్‌లోనే పాఠాలు బోధిస్తున్నారంటే వారి తీరును అర్థం చేసుకోవచ్చు. ఫైర్‌ సేఫ్టీగానీ, ప్లే గ్రౌండ్స్‌గానీ, ఇతరత్రా వసతులు ఏమీ ఉండకున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

    నియంత్రణ ఎక్కడ?

    ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు ఉత్తర్వులు జారీ చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

  • ఘనంగా

    ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం మహాగణపతి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

    ‘కేటీఆర్‌పై రాజకీయ కక్ష’

    జగిత్యాలరూరల్‌: మాజీమంత్రి కేటీఆర్‌పై ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్ష సా ధిస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. శనివారం జగిత్యాల రూరల్‌ మండలం గుల్లపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని కే టీఆర్‌పై కేసు పెట్టి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఫార్ములా ఈ రేసును కేటీఆర్‌ హైదరాబాద్‌కు తీసుకొచ్చి బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వం స్కామ్‌లు చేసిందని చెప్పుకుంటూ ప్రజలను వంచిస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన రేవంత్‌రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆనందరావు, కల్లెడ సింగిల్‌ విండో చైర్మన్‌ సందీప్‌రావు, మాజీ సర్పంచ్‌ తిరుపతి, యూత్‌ నాయకులు హరీశ్‌, మహేశ్‌, బాలె చందు పాల్గొన్నారు.

    గర్భాశయ క్యాన్సర్‌ నివారిద్దాం

    జగిత్యాల: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు కృషి చేద్దామని ఐఎంఏ అధ్యక్షుడు గూడూరి హేమంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో గైనకాలజీ అసోసియేషన్‌ వారు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించారు. ప్రతినెలా రెండో శనివారం శిబిరం ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. డాక్టర్‌ పద్మిని మాట్లాడుతూ.. క్యాన్సర్‌ మరణాలు పెరుగుతున్న తరుణంలో ప్రతిఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుధీర్‌కుమార్‌, వడ్డెపల్లి సాయి, నవీన్‌, పూర్ణచంద్ర, శ్రీలత పాల్గొన్నారు.

    ఐఐటీ కాన్పూర్‌లో సీటు సాధించిన యువకుడు

    జగిత్యాల: ప్రతిష్టాత్మక కాన్పూర్‌ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో జగిత్యాల సాయికిరణ్‌ అనే యువకుడు సీటు సాధించాడు. పట్టణంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన రాధాకృష్ణ, ఆకుల శ్రీలత దంపతుల కుమారుడు సాయికిరణ్‌. మొదటి నుంచే చదువులో చురుకుగా ఉన్న సాయికిరణ్‌ పదో తరగతిలో 10 జీపీఏ సాధించాడు. ఇంటర్‌లో 96.6 శాతం సాధించి ఎంసెట్‌లో 208 ర్యాంక్‌ సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో ఓబీసీలో 144 ర్యాంక్‌, జేఈఈ అడ్వాన్స్‌లో ఓబీసీలో 112 ర్యాంక్‌ సాధించాడు. అతనికి ఇండియాలోనే టాప్‌ కాలేజ్‌ అయిన ఐఐటీ కాన్పూర్‌లో సీటు రాగా పలువురు అభినందించారు.

  • క్రీడల్లో గెలుపోటములు సహజం

    జగిత్యాల: క్రీడల్లో గెలుపోటములు సహజమని, వి ద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ఉండాలని ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం జగిత్యాల జి ల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోటీలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్‌ స్టేడియం అభివృద్ధికి మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారని, ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ సెక్రటరి రాంగోపాల్‌రెడ్డి, అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి రాంమోహన్‌రావు, జాయింట్‌ సెక్రటరీ రమణ పాల్గొన్నారు.

    నిధులు మంజూరు చేయాలి

    జిల్లా కేంద్రంలోని 12వ వార్డులోని ఉప్పరిపేటలో సీసీరోడ్డు, విద్యుత్‌ స్తంభాలకు, డ్రెయినేజీలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.

    సంఘభవనానికి నిధుల మంజూరుకు వినతి

    జగిత్యాలరూరల్‌: మండలంలోని బాలపల్లిలో ము న్నూరుకాపు సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు గ్రామ మున్నూరుకాపు సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు.

    ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలని వినతి

    రాయికల్‌: మండలంలోని చెర్లకొండాపూర్‌ గ్రామానికి జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ శనివారం మాజీ సర్పంచ్‌ అల్లకొండ సుదర్శన్‌, మున్సిపల్‌ మాజీ కో–ఆప్షన్‌ మెంబర్‌ మహేందర్‌బాబు, మాజీ కౌన్సిలర్‌ మ్యా కల కాంతరావు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు

    ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

  • సొంతింటి కలను నెరవేర్చుతున్నాం

    ధర్మపురి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి 699 మందికి ప్రొసీడింగ్స్‌ అందించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇల్లు నిర్మించుకోవాలన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని వారికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణాన్ని ప్రభుత్వం అందిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారులు 45 రోజుల్లోగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, లేకుంటే రద్దు చేసి అర్హులకు ఇస్తామని తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు చోట్ల ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి ముగ్గు పోసి ప్రారంభించారు. అడిషనల్‌ కలెక్టర్‌ బిఎస్‌.లత, ఆర్డీవో మధుసూదన్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య, శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ చైర్మన్‌ జక్కు రవీందర్‌ తదితరులున్నారు.

    ధర్మపురిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

    ధర్మపురి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి అడ్లూరి అన్నారు. శ్రీలక్ష్మినరసింహ ఫంక్షన్‌ హాల్‌లో అభివృద్ధి పనులపై శనివారం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పెండింగ్‌లో ఉన్న తాగు, సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్‌, రోడ్ల భవనాలు, సివిల్‌ సప్‌లై, వ్యవసాయం, వసతి గృహాల శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌ పనుల ప్రగతికి కార్యాచరణ రూపొందించాలన్నారు.

  • ఇల్లు పూర్తి చేయండి.. రూ.10,116 అందుకోండి

    కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గం పరిధిలో ఇందిరమ్మ ఇంటిని మొదట పూర్తి చేసిన వారికి రూ.10,116 ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ప్రకటించారు. కోరుట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లో సుమారు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 62 గ్రామాల్లో భూమిపూజ పూర్తి చేశామని, చాలా ఇళ్లు పునాదుల స్థాయిలో ఉన్నాయని, అయితే ఎవరైతే ఇంటి నిర్మాణాన్ని ముందుగా పూర్తి చేసుకుంటారో వారికి తాను స్వయంగా రూ.10.116 కానుకగా ఇస్తానని ప్రకటించారు. ఇది రెండు మున్సిపాల్టీలు, రెండు మండలాల్లోని లబ్ధిదారులకు వర్తిస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు అన్నం అనిల్‌, కోరుట్ల పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్‌, కొంతం రాజం ఉన్నారు.

Kakinada

  • కళ్లు

    వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణమంటూ

    కుటుంబ సభ్యుల ఆందోళన

    ఇద్దరు నర్సుల సస్పెన్షన్‌

    తాళ్లరేవు: కళ్లు కూడా తెరవకుండానే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి.. గర్భిణిని వైద్యులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోక పోవడంతో బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి పురిటి నొప్పులు రావడంతో భర్త రాము తాళ్లరేవు సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బిడ్డ మృతి చెందాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు మాధురికి పురిటి నొప్పులు వచ్చినప్పటికీ డ్యూటీలో ఉన్న వైద్యురాలు డి.స్నేహలత గాని, నర్సులు ఇందిర, శైలజ గాని పట్టించుకోకపోవడంతో స్వీపర్‌ అనంత డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే బిడ్డ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్‌ చేశారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని, వైద్యురాలు స్నేహలత నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆమెను సస్పెండ్‌ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మద్దతు పలికారు.

    ఆరు గంటలపాటు ఆందోళన

    కాకినాడ – యానం రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌, నైట్‌ డ్యూటీ డాక్టర్‌ స్నేహలతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో ఆ రహదారిలో సుమారు 6 గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జనం అధిక సంఖ్యలో రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్నేహలతను సస్పెన్షన్‌ చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని చెప్పడంతో కాకినాడ రూరల్‌ సీఐ చైతన్యకృష్ణకు సమాచారం ఇచ్చారు. పెదపూడి ఎస్సై తులసీరామ్‌, ఇంద్రపాలెం ఎస్సై వీరబాబుతోపాటు, ఏపీఎస్పీ బలగాలను రప్పించారు. ఇలా ఉండగా అధికార పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్‌, వాడ్రేవు వీరబా బు, ధూళిపూడి బాబి, జక్కల ప్రసాద్‌ తదితరు లు ముమ్మిడివరం ఎమ్మె ల్యే దాట్ల సుబ్బరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ స్పందించి కాకినాడ ఆర్డీఓ ఎస్‌.మల్లిబాబు, ముగ్గురు వైద్యులు వినోద్‌కుమార్‌, సుజాత, సతీష్‌లతోకూడిన బృందంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి డ్యూటీలో ఉన్న నర్సులు ఇందిర, శైలజలను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆర్డీఓ మల్లిబాబు ప్రకటించారు. అయితే వైద్యురాలు స్నేహలతపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమైపె చర్యలు తీసుకోవడం తమ పరిధిలో లేదని, జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేసినట్లు తెలిపారు.

  • నాన్నా... నీ మనసే వెన్న

    ఫాదర్స్‌ డే రోజునే ఉద్యోగంలోకి..

    కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాలచర్ల అమ్మిరాజు స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో చిరుద్యోగి. తన భార్య సునీతతో కలసి తన ఇద్దరు పిల్లలను ప్రణాళికాబద్ధంగా చదివించారు. రోజూ న్యూస్‌ పేపర్‌లో ప్రచురితమైన విజయం సాధించిన వారి కథనాలను పిల్లలతో చదివించేవారు. అంచెలంచెలుగా పిల్లలు ఎదుగుతూ పెద్ద ప్యాకేజీలతో గూగుల్‌లో ఉద్యోగులయ్యారు. పెద్ద కుమారుడు శ్రీవినోద్‌ ఎంసెట్‌లో 289వ ర్యాంకు, గేట్‌లో 240వ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ సాధించాడు. ఐఐటీ చైన్నెలో ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి, అక్కడే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సామ్‌సంగ్‌ రీసెర్చ్‌ బెంగళూరుకు ఎంపికై రెండేళ్లపాటు రూ.22 లక్షల ఏడాది ప్యాకేజీలో ఉద్యోగం చేశాడు. 2023 సెప్టెంబర్‌లో గూగుల్‌ సంస్థలో రూ.50 లక్షల ప్యాకేజీకి ఎంపికై ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీసత్యనవీన్‌ జేఈ మెయిన్స్‌లో 1924వ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ సాధించాడు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లలో 100కి 100 మార్కులు రావడం అతని ప్రత్యేకత. మెయిన్స్‌ ఆధారంగా ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాడు. అక్కడే క్యాంపస్‌ ప్లేసమెంట్‌లో గూగుల్‌కి ఎంపికై రూ. 44 లక్షల ఏడాది ప్యాకేజీకి ఎంపికయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత స్థితికి చేరుకున్న శ్రీసత్యనవీన్‌ ఫాదర్స్‌ డే రోజునే గూగుల్‌లో ఉద్యోగంలో చేరుతుండటం విశేషం. తాము ఇలా స్థిరపడడానికి తన తండ్రి బాటలు వేశారని ఆ కుమారులు అంటున్నారు.

    నడిపించే దైవం ఆయనే

    కుటుంబానికి వెలుగునిచ్చే సారథి

    నేడు ఫాదర్స్‌ డే

    కపిలేశ్వరపురం/ బిక్కవోలు: వారధి లేకుండా నదిని దాటలేం... సారథి లేకుండా రథం నడపలేం.. ప్రతి కుటుంబానికి ఆ వారధి, సారథి నాన్నే. పిల్లలు తప్పటడుగులు వేసే వయసు నుంచి వారి వేలు పట్టుకుని నడక నేర్పి లోకాన్ని చూపే ప్రతి అడుగులోనూ నీడలా ఉండే దైవం నాన్న. అలాంటి నాన్న కన్నీటి కష్టాన్ని కనురెప్పల మాటున దాచుకుంటాడు. తాను చిరిగిన చొక్కా అయినా వేసుకోవడానికి ఇష్టం పడతాడు కానీ తన పిల్లలకు మంచి దుస్తులు కొని ఇవ్వాలని ఆరాటపడుతుంటాడు. గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసి తన పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చే త్యాగశీలుడు. మాట కాస్తా కటువుగా ఉన్నా మనసు వెన్నే.. శనివారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా, చిన్నారులు, నేటి యువతకు తమ తండ్రి పట్ల ఉండే అనుబంధం గురించి సాక్షి ప్రత్యేక కథనం ఇది.

  • నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా, మా తమ్ముడు శ్రీను అన్నా నాన్నకు ఎంతో ఇష్టం. నాకు ఏమి కావాలన్నా నాన్న కొనిస్తారు. మా నాన్న సప్పా సత్యనారాయణ మాకు మంచి స్నేహితుడు. మేము ఎప్పుడూ సరదాగా స్నేహితుడిలా ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం. స్నేహితుడిలా ఉంటూ మా భవిష్యత్‌ సలహాలు అందించారు.

    –తండ్రి సత్యనారాయణతో

    సప్పా నాగేశ్వరరావు,

    కొంకుదురు

    ఎంతో ప్రేమగా చూస్తారు..

    సాధారణంగా తల్లి దగ్గరకన్నా ఆడపిల్లలకు తండ్రి దగ్గరే చనువెక్కువగా ఉంటుందంటారు. నా విషయంలోనూ అది పూర్తిగా నిజమైంది. మా నాన్న గొలుగూరి నాగిరెడ్డి చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పెళ్లయి కూతురు ఉన్నప్పటికీ ఏ విషయమైనా మా నాన్నతోనే పంచుకుంటాను.

    –తండ్రి గొలుగూరి నాగిరెడ్డితో పడాల దేవి, పొలమూరు

  • నీట్‌

    బాలాజీచెరువు (కాకినాడ): నీట్‌–2025 ఫలితాల్లో 625/720 మార్కులతో వి.సాయి భవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకును సాధించారని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ ఏకేన దీపక్‌రెడ్డి తెలిపారు. ఎన్‌టీఏ ప్రకటించిన నీట్‌ ఫలితాల్లో దగ్గుమాటి శ్రవణ్‌ కార్తికేయ ఆలిండియా 109వ ర్యాంకు, వీరంరెడ్డి సాయిభవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకు, దంగేటి శ్రీనివాస రిషిత్‌ ఆలిండియా 890వ ర్యాంకులను సాధించారని అన్నారు. ఆలిండియా నీట్‌ ఫలితాల్లో 550 మార్కులు పైన 12 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో ఆంధ్రప్రదేశ్‌ విద్యా రంగంలో ‘ఆదిత్య’ను అగ్రగామిగా నిలిచిందని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ దీపక్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌కు అడ్మిషన్లు విశాఖపట్నం ఆదిత్య గంగరాజునగర్‌, మారికవలసలో ప్రారంభించారని తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల హాస్టల్‌ డైరెక్టర్‌ ఎ.లక్ష్మీరాజ్యం, డైరెక్టర్‌ శృతి, డైరెక్టర్‌ సుగుణ, ప్రిన్సిపాల్స్‌ జె.మొయిన, పి.సత్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్‌ కె.లక్ష్మీకుమార్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ ఎస్‌వీ రాఘవరెడ్డి, ఎస్‌పీ గంగిరెడ్డి, ఐఐటీ క్యాంపస్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.ఫణీంద్ర, ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్‌ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణ అందించిన అధ్యాపకవర్గాన్ని అభినందించారు.

  • నీట్‌ ఫలితాల్లో  తిరుమల ప్రభంజనం

    రాజమహేంద్రవరం రూరల్‌: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్‌ ప్రవేశ పరీక్ష నీట్‌లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో డి.కార్తీక్‌ రామ్‌కిరీటికి ఏపీ ఫస్ట్‌ ర్యాంకుతో పాటు ఆలిండియా 19వ ర్యాంకు సాధించాడన్నారు. వివిధ కేటగిరీల్లో కె.ఈప్సిత్‌ కశ్యప్‌ 12వ ర్యాంకు, డి.కార్తీక్‌రామ్‌ కిరిటీ 18వ ర్యాంకు, టి.సాహితి 32వ ర్యాంకు, కేవీవీ నాగసాయిపవన్‌ 154వ ర్యాంకు, ఎం.సూర్యసంతోష్‌రెడ్డి 880వ ర్యాంకు, ఎల్‌.అభిషేక్‌ 888 ర్యాంకు, టి.రామచంద్రన్‌ 1,145వ ర్యాంకు, ఎల్‌.వర్షిత్‌ 1,237వ ర్యాంకు, పి.ప్రశంస 1,851వ ర్యాంకు, కె.విన్షిత 1,909వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. వెయ్యిలోపు ఆరుగురు, ఐదు వేల లోపు 35 మంది, 10 వేల లోపు 71 మంది, 20 వేల లోపు 138 మంది, 30 వేల లోపు 189 మంది ర్యాంకులు సాధించారని, 250 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు సాధిస్తారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపల్‌ వి.శ్రీహరిలు అభినందించారు.

  • ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం

    కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఎస్‌బీఐ చీఫ్‌ అసోసియేట్‌ యానాల సాయికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అచ్చియ్యమ్మల ఏకై క కుమార్తె యానాల శుభశ్రీవల్లి ఆత్రేయి. చిరునవ్వుల ఈ చిన్నారికి చదువంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించిన నాన్న తగిన విధంగా ప్రోత్సహించారు. ఆత్రేయికి చిన్నతనంలో ఆశించిన మార్కులు వచ్చేవి కాదు. దీంతో నిరుత్సాహపడేది. తక్కువ మార్కులు వచ్చాయన్న విషయాన్ని నాన్న సాయికృష్ణ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చదువును ప్రేమించే మనస్తత్వం తన చిన్నారికి ఉందా లేదా అన్నదే గమనించేవారు. నిరుత్సాహంతో ఉన్న ఆమెకు జీవితంలో ఒడిదొడుకులు ఎలా వస్తాయో, ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పేవారు. మార్కుల ఆధారంగా జీవితాన్ని తూకం వేసుకోవద్దని అనేవారు. లక్ష్యం కోసం చేసే ప్రయత్నం స్థాయిని మరింత పెంచుకోమని ప్రోత్సహించేవారు. మూడేళ్ల ఆయన మాటలు ఫలితంగా ప్రేరణ పొందిన ఆత్రేయి ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ముందుకు దూసుకుపోయింది. రోజూ చదువుకునే క్రమంలో శారీరక, మానసిక సమస్యలను అమ్మ అచ్చియ్యమ్మ తీర్చి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు తోడ్పాటునిచ్చారు. ఇటీవల విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరీలో ఆత్రేయి 296వ ర్యాంక్‌ను సాధించింది. ఫిబ్రవరిలో విడుదలైన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 99.98 స్కోర్‌తో ప్రతిభ కనబర్చింది. ఏపీఈపీసెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌లో 91వ ర్యాంక్‌ సాధించింది. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు దక్కింది. అనంతరం సివిల్స్‌లో ఐఏఎస్‌ చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆత్రేయి తెలిపింది.

  • మొదటి

    ప్రతి ఒక్కరూ మంచి విలువలతో జీవించాలి. అలాంటి విలువలను మొదటి గురువులా చెప్పేది, నేర్పిందేది నాన్న మాత్రమే. మా నాన్న గొర్రిపోటి సత్యనారాయణ కష్టం గురించి తెలియకుండా పెంచారు. నేను నాన్న అయిన తరువాత మా నాన్న కష్టం నాకు తెలిసింది. మా అబ్బాయికి కూడా అదే విలువలు నేర్పిస్తున్నాను. తండ్రి ఒక్క రోజు ఉంటే సరిపోదు. ప్రతి రోజూ పిల్లల వెంట ఉండి సన్మార్గంలో నడిపించాలి.

    –తండ్రి సత్యనారాయణతో

    గొర్రిపోటి నాగేశ్వరరావు, పందలపాక

    ఆయనే కొండంత ధైర్యం

    ఏ సమస్య, కష్టం వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నేను, మా తమ్ముడు మణికంఠ కమల్‌ ఉన్నత స్థాయి చేరుకోవాలని మా నాన్న బండారు రాము కలలుకంటున్నారు. మాకు కొద్దిగా నలతగా ఉంటే తట్టుకోలేరు. ఆరోగ్యం బాగయ్యే వరకూ ఎంతో తపిస్తారు. తప్పకుండా నాన్న కోరిక నెరవేర్చేందుకు నా వంతు శ్రమిస్తా. ఆయనే మాకు ఆదర్శం.

    –తండ్రి బండారు రాముతో

    సంధ్య అఖిలదేవి, మణికంఠ కమల్‌, కొప్పవరం

  • 22న ద్విశత కవి సమ్మేళనం

    సఖినేటిపల్లి: కాకినాడలో ఈ నెల 22న శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో గోదావరి కవితా పండగ కాన్సెఫ్ట్‌లో జాతీయ స్థాయి ద్విశత కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు వేదిక అంతర్జాతీయ చైర్మన్‌ కత్తిమండ ప్రతాప్‌ అన్నారు. శనివారం సఖినేటిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పీఆర్‌ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న పై ద్విశత కవి సమ్మేళనంలో ఢిల్లీ, ఒడిశా, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల మందికి పైగా కవులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల పర్యావరణంపై ప్లాస్టిక్‌ భూతం అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు బహుమతులు గోదావరి కవితా పండగలో అందజేస్తామని కూడా ఆయన తెలిపారు.

    చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

    మామిడికుదురు: నగరం గ్రామంలోని తాడివారిమెరకకు చెందిన తాడి అశోక్‌కుమార్‌ (35) శుక్రవారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేశామని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్‌ శనివారం తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పెయింటర్‌గా పని చేసే అశోక్‌కుమార్‌ పిల్లలకు అనారోగ్యంగా ఉండడంతో బొండం కోసం చెట్టెక్కి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడన్నారు. అశోక్‌కుమార్‌ మృతితో అతని భార్య నాగమణి, 15 ఏళ్ల కుమార్తె స్వప్న, 13 ఏళ్ల కుమారుడు సంతోష్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  • శ్రీష

    ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): నీట్‌ ఫలితాల్లో శ్రీషిర్డీ సాయి జూనియర్‌ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్‌ టి.శ్రీవిద్య తెలిపారు. తమ దీక్ష్యా మెడికల్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న బి.సంజన ఆల్‌ ఇండియా 227వ ర్యాంకు, కె.పావన్‌ తనయ్‌ 308వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. 2 వేల లోపు ర్యాంకులు ఐదుగురు, ఐదు వేల లోపు 8 మంది, పది వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. విద్యా సంస్థల చైర్మన్‌ తంబాబత్తుల శ్రీధర్‌ మాట్లాడుతూ హాజరైన మొత్తం విద్యార్థుల్లో 20 శాతం మంది ఎమ్‌బీబీఎస్‌ సీట్లు సాధించగలరన్నారు. ఏటా తమ విద్యార్థులు నీట్‌, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్‌ శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, దీక్ష్యా అకాడమీ డీన్‌ పి.నరసింహారావు అభినందించారు.

Khammam

  • సంక్ష

    యోగాతోనే ఆరోగ్యం

    మధిర: ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడు వెంకట్‌ లాల్‌ తెలిపారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధిర ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు యోగా చేయాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయుష్‌ వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు కందుల రాంబాబు, గణేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

    ఎన్నికల హామీలు నెరవేర్చాలి

    కారేపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి టి.ఝాన్సీ అన్నారు. శనివారం మండలంలోని టేకులపల్లిలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులనే, కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలవంభిస్తున్నదన్నారు. జూన్‌ 21,22 తేదీల్లో నిజామాబాద్‌లో కార్మిక సమస్యలపై జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ మండల కార్యదర్శి ఉమ్మడి సందీప్‌, నాయకులు తేజ్యానాయక్‌, భాస్కర్‌, సక్రు, సత్తిరెడ్డి, సరోజిని, అనసూర్య, లఘుపతి, రంగ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

    రాజ్యాంగాన్ని మార్చే కుట్ర

    కొణిజర్ల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని సీపీఐ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎర్రా బాబు అన్నారు. శనివారం మండలంలోని చిన్నమునగాలలో నాగవరపు భద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. అనంతరం శాఖ కార్యదర్శిగా పాపగంటి సుదర్శన్‌, సహాయ కార్యదర్శిగా కొత్తపల్లి నాగయ్యలతో పాటు మరో 11మంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కోటేశ్వరరావు, సుదర్శన్‌, భద్రయ్య, సంసోన్‌, నాగయ్య, విజయ్‌కుమార్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    మహాసభలను జయప్రదం చేయండి

    మధిర: మధిర పట్టణంలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించే సీపీఐ జిల్లా 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు తెలిపారు. శనివారం స్థానిక రిక్రియేషన్‌ క్లబ్‌ కల్యాణ మండపంలో నిర్వహించిన సీపీఐ ఆహ్వాన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులపై చర్చించడం జరుగుతుందన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి మహాసభల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెజవాడ రవిబాబు, మందడపు రాణి, ఊట్ల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

    బాలాజీ మరణం పార్టీకి తీరని లోటు

    తల్లాడ: కిసాన్‌ మోర్చా జిల్లా కార్యదర్శి తేజావత్‌ బాలాజీ నాయక్‌ మరణం బీజేపీ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని అంజనాపురంలో నిర్వహించన ఆయన సంస్మరణ సభలో బీజేపీ నాయకులు పాల్గొని, బాలాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్‌ కన్వీనర్‌ నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, వెంకటేశ్వరరావు, మదుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    మెట్లు నిర్మించాలని వినతి..

    వైరారూరల్‌: మండలంలోని తాటిపూడిలో వైరా రిజర్వాయర్‌ కుడి కాలువ ఆధునికీకరణ పనులలో భాగంగా భక్తులు కార్తీక మాసాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కాలువకు ఇరువైపులా మెట్లు నిర్మించాలని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ వెంకటకృష్ణకు శనివారం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాగరాజు, జయరాజు, నిర్మల, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

  • బీమా

    వైరా: వైరా మున్సిపాలిటీలోని శాంతినగర్‌కు చెందిన ఎక్కిరాల వెంకటేశ్వర్లు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆయనకు బీఆర్‌ఎస్‌పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో ఆయన కుటుంబానికి మంజూరైన రూ.2 లక్షల చెక్కును వైరా మాజీ ఎమ్మెల్యే దివంగత బానోత్‌ మదన్‌లాల్‌ సతీమణి మంజుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వైరా మాజీ వైస్‌ ఎంపీపీ జ్యోతి, నాయకులు వెంకటేశ్వరరావు, కిరణ్‌, సురేష్‌, రాము, కిషోర్‌, ప్రేమ్‌, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    మదర్‌థెరిస్సా కళాశాలలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

    సత్తుపల్లిరూరల్‌: సత్తుపల్లి మదర్‌థెరిస్సా ఫార్మసీ కళాశాలలో శనివారం అపోలో ఫార్మసీ ఆధ్వర్యాన క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 35మంది విద్యార్థులు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చల్లా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల చైర్మన్‌ కంచర్ల సత్యనారాయణ, కళాశాల కరస్పాండెంట్‌ చలసాని సాంబశివరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కుమార్‌రాజా, ఐక్యూ కోఆ ర్డినేటర్‌ డాక్టర్‌ దాసరి ప్రవీణ్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ గంటా మానస, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

    నడవాలంటే నరకమే..

    – అధ్వానంగా మారిన సాగర్‌ కాల్వ బ్రిడ్జి రోడ్డు

    కల్లూరురూరల్‌: సాగర్‌కాల్వ బ్రిడ్జిపై నిర్మించిన రోడ్డుపై ప్రజలు ప్రయాణించాలంటే నరకయాతన పడాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. కప్పల బంధంలోని సాగర్‌ ప్రధాన కాలువపై నిర్మించిన బ్రిడ్జిపై రోడ్డు గుంటలు పడి నీరు నిల్వ ఉండడంతో దానిపై వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరామాపురం, ఎన్నెస్పీ కల్లూరు వెళ్లేందుకు ఈ బిడ్జియే ప్రధాన మార్గం కావడంతో ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు చెప్పలేనివి. కొత్త రోడ్డు దేవుడెరుగు ఉన్న రోడ్డుకై నా మరమ్మతులు చేయించి రాకాపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

    అధిక ఫీజులు వసూలు చేయొద్దు..

    బోనకల్‌: ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఎంఈఓ దామాల పుల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతి లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • రాజీ మార్గమే రాజమార్గం

    మధిర/సత్తుపల్లిటౌన్‌: కేసులను పరిష్కారంలోలో రాజీ మార్గమే.. రాజ మార్గమని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్‌, మధిర కోర్టు న్యాయమూర్తి ఎన్‌.ప్రశాంతి తెలిపారు. శనివారం మధిర కోర్టులో సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవా అధికార సంస్థ చైర్‌ పర్సన్‌ ఎన్‌.ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో.. మధిర కోర్టు ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి దీప్తి వేముల కూడా పాల్గొని పలు కేసులు పరిష్కరించారు. మధిర ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి పరిధిలో 289కేసులు పరిష్కారం కాగా రూ.1,32,900జరిమానా విధించారు. అదేవిధంగా అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పరిధిలో 240 కేసులు పరిష్కారం కాగా, రూ.3,86,800జరిమానా విధించారు. అదే విధంగా సత్తుపల్లి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో జడ్జి శ్రీనివాస్‌ పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌లో రాజీ అయితే సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని స్పష్టం చేశారు. రాజీ చేసుకుంటే ఇరువురు గెలుస్తారని, సమయం, డబ్బు ఆదాఅవుతుందన్నారు. క్షణికావేశంలో జరిగిన కేసులకు రాజీపడేందుకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ సందర్భంగా పలువురి బాధితులకు అవార్డులు సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌జడ్జి షేక్‌ మీరాఖాసీం సాహెబ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.సుమబాల, సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌లు జె.గోపాలరావు, అబ్రహం, బార్‌ అధ్యక్షులు బోజడ్ల పుల్లారావు, మల్లెపూల వెంకటేశ్వరరావు, ఏపీపీ భద్రయ్య, మధిర పట్టణ సీఐ రమేష్‌ ,ఎస్సై చంద్రశేఖర్‌, బ్యాంక్‌ అధికారులు, పోలీస్‌, కోర్టు సిబ్బందితో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.

  • ఘనంగా

    సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లిలోని శ్రీకోదండ రామాలయం 51వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలమూర్తులకు అభిషేక మహోత్సవం, పుష్పాలంకరణ, పట్టాభిషేక ఉత్సవం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అనుమోలు సురేష్‌, కొత్తూరు సత్యనారాయణ, మొరిశెట్టి సాంబశివగుప్తా, భక్తులు పాల్గొన్నారు.

    సెంట్రల్‌ డీఎస్పీగా

    మేకలతండా యువకుడు

    కారేపల్లి: మండలంలోని మేకలతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు బానోత్‌ రామ్మూర్తి నాయక్‌ – విజయ దంపతుల కుమారుడు బానోత్‌ లక్ష్మీవరప్రసాద్‌ సెంట్రల్‌ డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్‌ ఎక్జామ్‌లో 256వ ర్యాంక్‌ సాధించి సీఏపీఎఫ్‌ సెంట్రల్‌ డీఎస్పీగా సెలెక్ట్‌ అయ్యారు. దీంతో యువకుడి ని మండల ప్రజలు అభినందించారు.

    పోరాటాలతోనే

    సమస్యల పరిష్కారం

    తల్లాడ: పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. శనివారం తల్లాడలోని కుర్నవల్లి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సీపీఎం సత్తుపల్లి డివిజన్‌ రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్‌గా సత్తుపల్లి డివిజన్‌ సీపీఎం కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి వ్యవహరించగా.. రాజకీయాలు వాటి ఆవశ్యకతపై జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాద్యుడు మల్లెంపాటి వీరభద్రరావు బోదించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మాచర్ల బారతి, జిల్లా కమిటీ సభ్యులు రమేష్‌, విఠల్‌, పాండురంగారావు, రామలింగేశ్వరరావు, కృష్ణార్జున్‌రావు, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.

    మున్నూరు కాపు కార్పొరేషన్‌ కోసం కృషి చేస్తా

    వైరా: మున్నూరు కాపు కుల కార్పొరేషన్‌ ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తానని టీపీసీసీ కార్యదర్శిగా నియమితుడైన కట్ల రంగారావు అన్నారు. శనివారం వైరాలోని 12వ వార్డు రేచర్ల బజార్‌లో మున్నూరు కాపు కుల సంఘం ఆధ్వర్యంలో కట్ల రంగారావుకు ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, రేచర్ల నాగేశ్వరరావు, రాముడు, కట్ల నాగరాజు, కామిశెట్టి రవికుమార్‌, కట్ల సంతోష్‌, కుటుంబరావు, నాగేంద్రరావు, పుల్లయ్య, సీతారాములు, మహేష్‌, శ్రీకాంత్‌, అక్కిశెట్టి రవితేజ, సైదులు సత్యం వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

  • శాటిలైట్‌ టీవీతో విద్యాబోధన
    ●పెద్దతండా పాఠశాల హెచ్‌ఎం రాజాలిపాషా ప్రత్యేకత ●ఇన్నోవేషన్‌లో..రాష్ట్ర స్థాయి గుర్తింపు

    కారేపల్లి: మండలంలోని పెద్దతండా (భాగ్యనగర్‌తండా) ప్రాథమికోన్నత పాఠశాలలో శాటిలైట్‌ టీవీతో విద్యాబోధన పలువురిని ఆకట్టుకుంటుంది. ఆ పాఠశాల హెచ్‌ఎం ఎస్‌కే రాజాలిపాషా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వినూత్న బోధన విధానాన్ని అవలంభిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభకు పదును పెడుతున్నారు.

    విద్యార్థులను ఆకట్టుకునేలా..

    పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకునేలా శాటిలైట్‌ టీవీని వినియోగించి బోధన చేస్తున్నారు. హెచ్‌ఎం సారధ్యంలో విద్యార్థులు మల్టీశాటిలైట్‌ సిగ్నల్‌ రిసీవింగ్‌ యాంటినాను తయారు చేశారు. అదే రిసీవర్‌ యాంటినా ద్వారా 300లకు పైగా టీవీ చానల్స్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచి విద్యనందించటం ద్వారా పాఠశాలకు గుర్తింపు వచ్చింది. ప్రైవేట్‌ ధీటుగా విద్యాబోధన సాగుతుండడంతో పాఠశాలలో ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని హెచ్‌ఎం తెలిపారు.

    ఇన్నోవేషన్‌లో రాష్ట్రస్థాయి అవార్డు..

    రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్‌ సెల్‌ సైన్స్‌ ప్రొగ్రాంలో యూపీఎస్‌ పెద్దతండా (భాగ్యనగర్‌తండా) విద్యార్థి ఎం.ఉపాసన రాష్ట్రస్థాయి అవార్డు సాధించింది. మల్టీశాటిలైట్‌ సిగ్నల్‌ రిసీవింగ్‌ యాంటినా తయారు చేసినందుకు గాను ఈ అవార్డును అందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడిన 500ల మంది విద్యార్థుల్లో 20మంది ఎంపిక కాగా, వారిలో ఎం.ఉపాసన ఒకరు. దీంతో విద్యార్థినికి, ప్రోత్సహించిన హెచ్‌ఎం.. కలెక్ట ర్‌ చేతులమీదుగా అవార్డును సైతం అందుకున్నారు.

    ఆదర్శవంతంగా పాఠశాల నిర్వహణ..

    పిల్లల తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాల ఉపాధ్యాయుల కృషితో పెద్దతండా ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా బోధన చేస్తుండటంతో వారిలో నేర్చుకోవాలనే తపన పెరిగి బడికి ఉత్సాహంగా వస్తున్నారు. విద్యార్థుల మనోవికాసాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

    – ఎస్‌కే.రాజాలిపాషా, హెచ్‌ఎం, పెద్దతండా

  • రేపటి నుంచి మిర్చి కొనుగోళ్లు

    మధిర: మధిర వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మార్కెట్‌ చైర్మన్‌ బండారు నర్సింహారావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ రబీలో రైతులు సాగు చేసిన ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మూడు మండలాల్లో 1,035 మంది రైతుల వద్ద 51,207 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మద్దతు ధర రూ.12 కోట్లతో పాటు సన్నధాన్యానికి బోనస్‌ కూడా ఖాతాల్లో జమ అయిందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సహకారంతో మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ ఐలూరి సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్‌ అద్దంకి రవికుమార్‌, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

  • విద్య

    జూలై 7న స్నాతకోత్సవంలో అందజేత

    కొణిజర్ల: కాకతీయ యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన బీఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సు ఫలితాల్లో కొణిజర్ల మండలం అమ్మపాలెం పంచాయతీ పరిధిలోని బ్రౌన్స్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. యం ఫార్మసీ కోర్సులో వేముల సింధు (2018), 2019 సంవత్సరానికి గాను బీఫార్మసీలో సముద్రాల రచన 4 బంగారు పతకాలు సాధించింది. 2021 సంవత్సరానికి గాను బీఫార్మసీలో మద్దోజు తేజశ్విని, కాటేపల్లి శివానీలు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌ పారుపల్లి ఉషాకిరణ్‌కుమార్‌, సెక్రటరీ కరస్పాడెంట్‌ పారుపల్లి విజయలక్ష్మి బంగారుపతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. జూలై 7న కాకతీయ స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ పాత్రో, ఏఓ సీహెచ్‌ హనుమంతరావు, అధ్యాపక బృందం అభినందించారు.

  • జేవీఆర్‌ డిగ్రీ కళాశాల అభివృద్ధికి చర్యలు

    సత్తుపల్లి: సత్తుపల్లి జేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన షెడ్ల నిర్మాణంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటామని పూర్వ విద్యార్థి సంఘం బాధ్యుడు మట్టా దయానంద్‌ అన్నారు. శనివారం కళాశాలను సందర్శించి కళాశాల మైదానంలోని క్రీడాకారులతో మాట్లాడారు. ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వాకర్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.గోపి, దొడ్డా శ్రీనివాసరావు, ఇమ్మినేని ప్రసాద్‌, వెంకటరమణ, దిలీప్‌, జె.వంశీ, ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

  • మెకానిక్‌ తనయుడు న్యాయమూర్తి

    ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం బొమ్మన సెంటర్‌లో టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్న షేక్‌ చాంద్‌పాషా వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను ఉన్నతస్థాయికి చేర్చాడు. పెద్ద కుమారుడు ఆరిఫ్‌ డిగ్రీ అనంతరం టైప్‌ నేర్చుకుని కోర్టులో ఉద్యోగం సాధించాడు. అంతటితో ఆగకుండా లా పూర్తి చేసి జడ్జిగా ఎంపికయ్యాడు. తొలుత కాజీపేట రైల్వే కోర్టులో జడ్జిగా పనిచేశాక, ప్రస్తుతం నకిరేకల్‌ కోర్టులో జూనియర్‌ సివిల్‌జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక చాంద్‌ రెండో కుమారుడు ఆసిఫ్‌ హైదరాబాద్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయమై చాంద్‌ మాట్లాడుతూ ‘నాకొచ్చేది చాలీచాలని ఆదాయమే అయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా చదువుపై దృష్టి సారించాలని బిడ్డలకు సూచించా. అలా వారు శ్రద్ధగా చదివి ప్రయోజకులు అయ్యారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది’ అని వెల్లడించాడు.

  • తండ్రి ప్రోత్సాహంతో విదేశాలకు..

    సత్తుపల్లిటౌన్‌: ‘నాన్న ప్రోత్సాహంతోనే సింగపూర్‌లో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడ్డా.. ఆయన ఎన్ని కష్టాలు పడినా మాకు ఆనందాన్ని పంచుతూ జీవితంలో రాణించేలా తీర్చిదిద్దారు. అందుకే నాన్నే నా హీరో..’ అంటున్నారు సత్తుపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ కుమారుడు షేక్‌ తాబేర్‌ పర్వేజ్‌. 1996 నుంచి గఫార్‌ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా కుమారుడు పర్వేజ్‌ను విజయవాడలో ఇంటర్‌, హైదరాబాద్‌లో బీటెక్‌, ఎంటెక్‌ చదివించారు. ఆపై ఆయన సింగపూర్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ లాజిస్టిక్స్‌లో ఉద్యోగం సాధించి స్థిరపడ్డాడు. ‘నా కలలు సాకారం చేసేందుకు నాన్న ఎన్నో త్యాగాలు చేసి జీవితంలో బలమైన పునాది వేశారు.. అలాంటి తండ్రి ఉండడం నా అదృష్టం’ అని తాబేర్‌ ఫర్వేజ్‌ తెలిపారు.

  • రైతు ప్రయోజనాలే అంతిమ లక్ష్యం
    ● అందుకు అనుగుణంగా విత్తన చట్టం రూపకల్పన ● రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి

    ఖమ్మంవ్యవసాయం: రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా వారి సంపూర్ణ ప్రయోజనాల కోసం విత్తన చట్టం రూపొందిస్తున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి తెలిపారు. చట్టం ముసాయిదా బిల్లుపై కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు, ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొనగా అన్వేష్‌రెడ్డి మాట్లాడారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతున్నందున పకడ్బందీ చట్టాలు చేసేందుకు విత్తన చట్టం ముసాయిదా బిల్లు రూపొందించామని తెలిపారు. దీనిపై అభిప్రాయాల సేకరణ కోసం ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశాల్లో వచ్చే సూచనల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి చట్టం ఖరారు చేస్తామని అన్వేష్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.

    ఫిర్యాదు చేయొచ్చు....

    రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు ఆర్‌.గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో రైతులు సొంతంగా విత్తనం ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో మోసపోతున్నారని తెలిపారు. ఎవరికై నా నష్టం ఎదురైతే రైతు సంక్షేమ కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. న్యాయవాది సునీల్‌ మాట్లాడుతూ ఒప్పందం పేరిట వ్యవసాయం జరుగుతున్నందున విత్తన నాణ్యతలో లోపాలతో రైతుకు నష్టం ఎదురైతే పరిహారం పొందే విధానం ఉండాలన్నారు. రఘునాథపాలెంకు చెందిన రైతు రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే అమ్మేలా చూస్తే నష్టపోయే పరిస్థితి ఉండదన్నారు. వైరాకు చెందిన బి.రాంబాబు, భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రతినిధులు మాట్లాడగా, కొణిజర్ల ఏఓ నాగార్జున మాట్లాడుతూ విత్తన లోపాలతో నష్టపోయే రైతులకు పరిహారం అందేలా చట్టంలో పొందుపర్చాలని తెలిపారు. ఖమ్మం డీలర్ల అసోసియేషన్‌ ప్రతినిధి మనోహర్‌ మాట్లాడుతూ లైసెన్స్‌డ్‌ కంపెనీల నుంచే విత్తనాలు తెచ్చి అమ్ముతుండగా, పంట సరిగ్గా రాకపోతే డీలర్ల తప్పేం ఉంటుందని ప్రశ్నించారు. ఈమేరకు లైసెన్సింగ్‌ విధానంలోనే మార్పులుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బీన, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయాధికారులు డి.పుల్లయ్య, వి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

  • లోక్‌ అదాలత్‌తో శాశ్వత పరిష్కారం
    ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్‌ ● జిల్లా కోర్టుల్లో 6,220 కేసుల పరిష్కారం

    ఖమ్మంలీగల్‌: ఇరుపక్షాలు లోక్‌ అదాలత్‌లో రాజీ పడడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇక్కడి తీర్పుపై అప్పీల్‌కు సైతం అవకాశం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జి.రాజగోపాల్‌ తెలిపారు. ఖమ్మంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కె.ఉమాదేవి తదితరులతో కలిసి పాల్గొన్న జిల్లా జడ్జి రాజగోపాల్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో సివిల్‌, రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు పరిష్కరించుకోవాలని, తద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయని తెలిపారు. పెండింగ్‌ కేసులు సత్వర పరిష్కారమే కాకుండా ప్రీ లిటిగేషన్‌, సివిల్‌ తగాదాలు, చెక్‌ బౌన్స్‌ కేసులు ఇతరత్రా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కాగా, లోక్‌ అదాలత్‌ ద్వారా 62 మోటార్‌ వెహికల్‌ ప్రమాద కేసుల్లో రాజీ ద్వారా రూ.2.80 కోట్ల పరిహారం ఇప్పించామని వెల్లడించారు. జిల్లా కోర్టు పరిధిలోనే కాకుండా సత్తుపల్లి, మధిర కోర్టుల్లోనూ జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించామని తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన వృద్ధురాలు గొడ్ల రత్తమ్మ తరపున న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ కేసు దాఖలు చేయగా సత్వర పరిష్కారం చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.11.50 లక్షల అవార్డ్‌ జారీ చేశారు. అలాగే, భార్యాభర్తలైన భవాని – వీరభద్రం వివాదాన్ని కూడా రాజీ ద్వారా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దేవినేని రామప్రసాదరావు, వి.శీనయ్య, ఎం.అర్చన కుమారి, ఎంకల్పన, టి.మురళీమోహన్‌, కాసరగడ్డ దీప, బెక్కం రజని, ఏపూరి బిందుప్రియ, వి.మాధవి, బి.నాగలక్ష్మి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.వెంకటేశ్వరరావుతో పాటు న్యాయవాదులు గద్దల దిలీప్‌కుమార్‌, బండారుపల్లి గంగాధర్‌, పి.సంధ్యారాణి, కొత్తపల్లి రామారావు, స్వర్ణ రాంబాబు, మందడపు శీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

  • తండ్రి కృషి.. డాక్టర్‌గా బిడ్డ

    తిరములాయపాలెం: కుమారుడు జన్మించినప్పుడే డాక్టర్‌గా చూడాలని ఆ తండ్రి కల కన్నాడు. ఆ కల నిజమయ్యేలా కష్టపడి చదవడం అలవాటు చేయడంతో తండ్రి కోరికను నెరవేర్చిన బిడ్డ ఇప్పుడు పేదలకు వైద్య సేవలందిస్తుండడం విశేషం. తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన బత్తిని జగన్మోహన్‌రావు గ్రామాల్లో తిరుగుతూ వాయిదాల పద్ధతిలో వస్తువులు అమ్మే వ్యాపారం చేస్తాడు. పూసల కుటుంబంలో పుట్టిన ఆయనలాంటి ఇంకొందరు పిల్లలను సైతం అదే వ్యాపారం చేయిస్తున్నారు. కానీ జగన్మోహన్‌రావు చిన్న నాటి నుండే పిల్లలపై శ్రద్ధ వహిస్తుండగా కుమారుడు సాయికుమార్‌ ఎండీ(జనరల్‌ మెడిసిన్‌) పూర్తి చేసి కోదాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డాక్టర్‌గా సేవలందిస్తున్నాడు. అంతేకాక కుమార్తె రాణి బీటెక్‌ పూర్తిచేసింది. కుమారుడిని మెడిసిన్‌ చదివించే సమయాన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదల వీడని జగన్మోహన్‌రావు ఇప్పుడు సాయి ఎదుగుదలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

  • డ్రైవర్‌గా పనిచేస్తూనే...

    ఖమ్మంక్రైం: రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. పెద్ద చదువులు లేకున్నా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలన్న ఆయన కల నెరవేరుతోంది. ఖమ్మం మంచికంటినగర్‌–2లో నివాసముండే తమ్మనబోయిన శ్రీనివాస్‌ వ్యవసాయ మార్కెట్‌లో సరుకులను తరలించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె అయిన స్నేహ మృదుల చిన్నతనం నుంచే చదువులో మేటిగా ఉండటంతో భార్య విజయ సహకారంతో కష్టపడి చదివించాడు. స్నేహ ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 89వ ర్యాంక్‌ సాధించి హైదరాబాద్‌ ఐఐటీలో సీఎస్‌ఈ(ఏఐ) సీటు సాధించింది. ఈసందర్భంగా స్నేహ మృదుల మాట్లాడుతూ తాను కష్టపడుతున్నా బిడ్డలు ఉన్నత స్థాయికి చేరాలన్న నాన్న కలను నెరవేరుస్తుండడం ఆనందంగా ఉందని తెలిపింది.

  • ఒకరు ఐపీఎస్‌, ఇంకొకరు సీఐ

    ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడలోని పేద కుటుంబానికి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మ దంపతులకు ఇరువురు కుమారులు. చిన్నప్పటి నుండి కృష్ణయ్య పేదరికాన్ని అనుభవించారు. భీమవరంలోని పలువురు రైతుల వద్ద ఏటా రూ.3వేల జీతానికి పనిచేశాడు. ఆయన భార్య వజ్రమ్మ కూడా కూలీ పనులకు వెళ్లేది. అయినా రూపాయి రూపాయి పోగేసి పిల్లలు శ్రద్ధగా చదువుకునేలా చూశారు. తద్వారా ఓ కుమారుడు బాబురావు రామగుండం సీసీఎస్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్న కుమారుడు కిరణ్‌కుమార్‌ ఐపీఎస్‌ సాధించి ప్రస్తుతం బీహార్‌ రాష్ట్రంలో రోహఽథాస్‌ జిల్లాలో ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆది నుంచి కష్టాలను ఎదుర్కొన్నప్పుడు బిడ్డలు ఉన్నత స్థాయికి చేరడంతో కృష్ణయ్య దంపతులు ఆనందంలో ఉండగా.. స్థానికులు వారి కృషిని అభినందిస్తున్నారు.

  • ఎంవీఐగా రైతు బిడ్డ

    వైరా: తన కష్టం బిడ్డలు పడొద్దని తపించే వారిలో ఆచంట రామకృష్ణ ఒకరు. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన ఆయనకు ఐదెకరాల భూమి ఉంది. రామకృష్ణకు కుమారులు వరప్రసాద్‌, సురేష్‌ ఉండగా, బిడ్డలు మంచి ఉద్యోగాలు చేసి పేరు సాధించాలని భావించేవాడు. ఈక్రమంలోనే వరప్రసాద్‌ను బీటెక్‌ వరకు చదివించగా ప్రస్తుతం వైరా మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సురేష్‌ చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. ‘కష్టపడండి.. ఉన్నత ఉద్యోగాలు చేయండి.. పది మందికి సాయపడండి..’ అని చెప్పే తండ్రి మాటలే తమకు ఆదర్శమని వరప్రసాద్‌ చెబుతారు.

Dr B R Ambedkar Konaseema

  • తల్లి
    ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

    తల్లికి వందనానికి ని‘బంధనాలు’

    జిల్లాలో సుమారు 2.40 లక్షల

    మంది విద్యార్థులు

    పథకం వర్తించిన వారు 1,70,869 మంది

    69,131 మందికి కోత

    గత ఏడాది బకాయిల ఊసెత్తని సర్కార్‌

    సాక్షి, అమలాపురం: తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చినట్టే ఇచ్చి.. నిబంధనల పేరుతో లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టారు. రానివారు కంగారు పడవద్దని, ఇంకా సమయం ఉందని, అవకాశం ఇస్తామని అధికారులు చెబుతున్నా.. నిబంధనలు చూస్తూంటే చాలా మందికి తల్లికి వందనం అందే పరిస్థితి కనిపించడం లేదు.

    జిల్లాలో ఇలా..

    జిల్లావ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సుమారు 2.40 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కింద వీరిలో 1,70,869 మంది విద్యార్థులకు సంబంధించి 1,12,419 మంది తల్లుల ఖాతాల్లో రూ.250 కోట్లు జమ చేశారు. రకరకాల సాకులతో మిగిలిన 69,131 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. ప్రభుత్వం విధించిన పలు నిబంధనలతో చాలా మంది అనర్హులుగా మారారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే చదువుకుంటున్న ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం అమలు చేస్తామని ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు, కూటమి నేతలు ఊదరగొట్టారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద జిల్లాలోని తల్లులకు నాలుగేళ్లలో రూ.850.63 కోట్లు అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పథకం పేరును తల్లికి వందనంగా మార్చింది. అదే సమయంలో ఈ పథకం అమలులో అనేక ఆంక్షలు పెట్టారు. దీంతో పలువురు ఈ పథకానికి దూరమయ్యారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

    ఇవీ నిబంధనలు

    ● తల్లికి వందనం పథకానికి అర్హత పొందడానికి లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి.

    ● తల్లి, తండ్రి, పిల్లల ఆధార్‌ నంబర్లు చెల్లుబాటై ఉండాలి.

    ● నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు లోపు ఉండాలి.

    ● మూడెకరాల లోపు మాగాణి, 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు మాత్రమే అర్హులు.

    ● మున్సిపల్‌ పట్టణాల్లో 1,000 చదరపు అడుగులకు మించి స్థలం ఉండరాదు.

    ● కుటుంబ సభ్యులకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.

    ● నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించరాదు.

    ● ఆదాయ పన్ను చెల్లించే కుటుంబ సభ్యులు అనర్హులు.

    ● ట్రిపుల్‌ ఐటీ, పాలిటెక్నిక్‌ విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అనర్హులు.

    ● వచ్చే విద్యా సంవత్సరంలో మాత్రం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉంటేనే ఈ పథకం వర్తింపజేస్తారు.

    వీరికి తరువాత..

    అంగన్‌వాడీ నుంచి కొత్తగా ఒకటో తరగతికి వెళ్లే పిల్లలు, పదో తరగతి పూర్తి చేసుకుని, కొత్తగా ఇంటర్లో చేరే విద్యార్థుల పేర్లు ప్రస్తుతం అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 వరకూ వీరి నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 30న వెలువడే తుది జాబితాలో వీరి పేర్లు వస్తాయి. వీరికి వచ్చే నెల 5 తర్వాత తల్లికి వందనం డబ్బులు జమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇంటర్‌ సెకండియర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదని, వీరు విద్యా దీవెన పథకం కిందకి వస్తారని చెబుతున్నారు.

    నాడు తప్పు.. నేడు ఒప్పా?

    గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి నిధుల నుంచి తొలుత రూ.1,000, తదుపరి ఏడాది నుంచి రూ.2 వేల చొప్పున పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక ఖాతా ప్రారంభించి, దానికి ఈ నిధులు డిపాజిట్‌ చేయించారు. ఆ సొమ్ముతో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు అవసరమైన కెమికల్స్‌, ఇతర సామగ్రి కొనుగోలు చేసేవారు. ఆయాలను నియమించి, వారికి నెలకు రూ.6 వేల గౌరవ వేతనం అందించారు. దీనిపై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. వాటిని మరచిపోయారో ఏమో కానీ.. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో గొప్పగా చెప్పగా.. తీరా అమలులోకి వచ్చేసరికి రూ.13 వేలు మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.2 వేలకు పాఠశాల నిర్వహణ పేరుతో కోత పెట్టారు. దీంతో, నాడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో తప్పని చెప్పారని, ఇప్పుడు అదే విధానం ఎలా ఒప్పు అయిందని సోషల్‌ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు.

    నిబంధనలు సరళతరం చేయాలి

    ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయాలి. ఇన్ని నిబంధనలు విధిస్తే అధిక సంఖ్యలో అనర్హులవుతారు. పదో తరగతి పూర్తి చేసిన వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలి. నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ వాడకం నిబంధన తొలగించాలి.

    – బి.సిద్దు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ

  • పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

    21 నుంచి కౌన్సెలింగ్‌, సర్టిఫికెట్ల పరిశీలన

    25 నుంచి ఆప్షన్ల ఎంపిక

    జూలై 3న సీట్ల కేటాయింపు

    రాయవరం: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 30న నిర్వహించిన పాలిసెట్‌–2025లో జిల్లావ్యాప్తంగా 3,830 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,162 మంది బాలురు, 1,668 మంది బాలికలు ఉన్నారు. వీరు ర్యాంకుల వారీగా ఇచ్చిన తేదీల్లో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, వెబ్‌ ఆప్షన్లకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. దీని కోసం అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని శ్రీ వైవీఎస్‌ అండ్‌ బీఆర్‌బీఎం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు విద్యార్థులు వెళ్లి ఆప్షన్స్‌ ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు.

    షెడ్యూల్‌ మేరకు తమ ర్యాంకును బట్టి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. అనంతరం వారికిచ్చిన తేదీ ప్రకారం ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ పొందాలి. ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో ప్రాసెస్‌ ఫీజు చెల్లించాలి. ఆ రశీదు, పాలిసెట్‌ హాల్‌ టికెట్‌, ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్‌ అందజేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్‌ లేని వారు ఏడేళ్ల రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ వర్తించే వారు అర్హత ధ్రువపత్రం అందజేయాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నాన్‌ లోకల్‌ విద్యార్థులు మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌, పీడబ్ల్యూడీ, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, స్కౌట్‌, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్‌ వంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారు అర్హత ధ్రువీకరణ పత్రాలను కౌన్సెలింగ్‌ సమయంలో సబ్‌మిట్‌ చేయాలి. వీరికి ఈ నెల 25 నుంచి 28 వరకూ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు.

    జిల్లాలో 6 కళాశాలలు

    రామచంద్రపురంలో ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రైవే టు యాజమాన్యంలో మరో ఐదు పాలిటెక్నిక్‌ కళాశాల లు జిల్లాలో ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్‌, ఎలక్ట్రా నిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ తదితర కోర్సులున్నాయి. పలు కళాశాలల్లో ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ 33, మెకానికల్‌ 33 సీట్లు ఉండగా, ఐదు ప్రైవేట్‌ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 1,500 వరకూ సీట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కింద 10 శాతం అదనంగా సీట్లు పెంచి ప్రతి బ్రాంచిలో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ సైతం ఇస్తారు.

    షెడ్యూల్‌ ప్రకారం నిర్వహణ

    పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. పాలిసెట్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, షెడ్యూల్‌ ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ర్యాంకు, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది.

    – కేపీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, పాలిసెట్‌ జిల్లా

    కో ఆర్డినేటర్‌, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ

    పాలిటెక్నిక్‌ కళాశాల, ద్రాక్షారామ

    జిల్లాలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల వివరాలు

    ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, రామచంద్రపురం: డీఎంఈ–33, డీసీఈ–33.

    శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల: డీసీఈ–30, డీఎంఈ–30, డీఈఈ–60, డీఈసీఈ–60, డీసీఎంఈ–120, డీఏఐఎం–60.

    బీవీసీ, ఇంజినీరింగ్‌ కళాశాల: డీసీఎంఈ–180, డీఈసీఈ–60, మెకానికల్‌–30, ఈఈఈ–30.

    వీఎస్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ–120, సీసీఎన్‌–60, డీఈసీఈ–60, ఈఈఈ–60, మెకానికల్‌–60.

    శ్రీ వైవీఎస్‌ అండ్‌ శ్రీ బీఆర్‌ఎం పాలిటెక్నిక్‌ కళాశాల, ముక్తేశ్వరం: డీఈఈఐఈ–30, డీసీఎంఈ–54, డీఈసీఈ–60, డీఈఈఈ–108, డీఎంఈ–108.

    కై ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ–120, డీఈసీఈ–60, సివిల్‌–30, డీఈఈఈ–30, మెకానికల్‌–30, ప్యాకింగ్‌ టెక్నాలజీ–30.

    సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్‌ ఇలా..

    తేదీ సమయం ర్యాంకు

    జూన్‌ 21 ఉదయం 9.00 1–7,499

    మధ్యాహ్నం ఒంటిగంట 7,501–15,000

    22 ఉదయం 9.00 15,001–23,500

    మధ్యాహ్నం ఒంటిగంట 23,501–32,000

    23 ఉదయం 9.00 32,001–40,000

    మధ్యాహ్నం ఒంటిగంట 40,001–50,000

    24 ఉదయం 9.00 50,001–59,000

    మధ్యాహ్నం ఒంటిగంట 59,001–68,000

    25 ఉదయం 9.00 68,001–77,000

    మధ్యాహ్నం ఒంటిగంట 77,001–86,000

    26 ఉదయం 9.00 86,001–95,000

    మధ్యాహ్నం ఒంటిగంట 95,001–1,04,000

    27 ఉదయం 9.00 1,04,001–1,12,000

    మధ్యాహ్నం ఒంటిగంట 1,12,001–1,20,000

    28 ఉదయం 9.00 1,20,001–1,27,000

    మధ్యాహ్నం ఒంటిగంట 27,001–చివరి ర్యాంకు వరకూ

    ఆప్షన్ల ఎంపిక తేదీలు

    తేదీలు ర్యాంకులు

    జూన్‌ 25, 26 1–50,000

    27, 28 50,0001–90,000

    29, 30 90,0001–చివరి

    ర్యాంకు వరకూ

    అడ్మిషన్ల సమయంలో ఒరిజనల్‌ సర్టిఫికెట్లు డిపాజిట్‌ చేయాల్సిన అవసరం లేదు.

    జూలై 1న ఆప్షన్ల మార్పునకు అవకాశం.

    జూలై 3న సీట్ల కేటాయింపు.

  • శ్రీనివాసా... శ్రీపురుషోత్తమా...

    వాడపల్లికి పోటెత్తిన భక్తజన సంద్రం

    ఒక్కరోజే రూ.60.16 లక్షల ఆదాయం

    కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీపురుషోత్తమా.. శ్రీవేంకటే శా.. గోవిందా అంటూ వాడపల్లి క్షేత్రంలో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారిని చూసిన భక్తజ నం ఆనందంతో ఉప్పొంగింది.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి బాట పట్టారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోర్కెలు తీరిన అనేకమంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. మాఢ వీధులు, ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు. వేలాది గా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్‌లైన్‌, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి రూ.60.16 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్‌ ఐ ఎస్‌.రాము వాడపల్లిలో ట్రాఫిక్‌ను నియంత్రించా రు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

  • శనైశ్చరునికి ప్రత్యేక పూజలు

    కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చనానంతరం భక్తులు ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. సర్వ దర్శనాలు చేసుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టికెట్లు, వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ.1,65,420 వచ్చింది. అన్నప్రసాద పథకానికి భక్తులు రూ.39,691 విరాళాలు సమర్పించారు.

    ‘కూటమి’ ఏడాది వైఫల్యాలపై

    నేడు పుస్తకావిష్కరణ

    అమలాపురం టౌన్‌: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం ముద్రించిన పుస్తకాన్ని పార్టీ నేతలు అమలాపురంలో ఆదివారం ఆవిష్కరించనున్నారు. స్థానిక హైస్కూల్‌ సెంటర్‌లోని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌, పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్‌తో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాల్గొంటారు. ఆదివారం ఉదయం జిల్లా స్థాయిలోనూ, సోమవారం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోను, మంగళవారం మండల కేంద్రాల్లోను ఈ పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని జగ్గిరెడ్డి తెలిపారు.

Komaram Bheem

  • ఆడపిల్లలం అని బాధపడలే..

    కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి గ్రామంలో మాది నిరుపేద కుటుంబం. ఆమ్మానాన్న రామిళ్ల అంజమ్మ, సుధాకర్‌కు మేము ముగ్గురం రుచిత, రేష్మిత, తేజస్విని సంతానం. ఆడపిల్లలం అని బాధపడకుండా నాన్న కష్టపడి చదివించాడు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో దినసరి కూలీ పనిచేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాడు. మిల్లు మూతపడ్డాక కుటుంబ పోషణ కోసం మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్‌లో పనిచేసి మేము ఉన్నతస్థితికి వచ్చేలా కృషి చేశాడు. నా పదో తరగతి పూర్తికాగానే ఖమ్మంలో అగ్రికల్చర్‌ డిప్లొమా చేశా. ప్రస్తుతం వ్యవసాయ శాఖలో కౌటాల మండలంలో కన్నెపల్లి ఏఈవోగా పనిచేస్తున్నాను. అక్క రుచిత బీఎస్సీ నర్సింగ్‌ చేసి ప్రస్తుతం రెబ్బెన మండలం నౌగాంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. చెల్లి తేజశ్విని ఏడో తరగతి చదువుతోంది. అమ్మ ఇంటి వద్దే ఉంటుంది. నాన్న ఇప్పటికీ కుటుంబం కోసం హైదరాబాద్‌లో ఒంటరిగా పనిచేస్తూ.. నెలకు ఒకసారి పండుగలకు ఇంటికి వస్తాడు. – రేష్మిత, ఏఈవో, కన్నెపల్లి

  • నాన్న ప్రోత్సాహంతోనే

    పెంచికల్‌పేట్‌: మాది పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న దుర్గం లక్ష్మి, తులసీరాం వ్యవసాయం చేస్తూ ఉన్నత చదువులు చదివించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2010లో పదో తరగతి, బాసరలోని ట్రిపుల్‌ ఐటీలో 2 016లో బీటెక్‌ పూర్తిచేశాను. నాన్న ఇచ్చిన పోత్సాహంతో యూపీఎస్సీ పరీక్ష రాశాను. బెంగుళూరులోని మినిస్టరీ ఆఫ్‌ డిఫెన్సులో అడిటర్‌గా ఉద్యోగం సాధించాను. నా వెంటే ఉంటూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నాన్నకు ఈ విజయం సొంతం.

    – దుర్గం సాయికుమార్‌, అడిటర్‌ మినిస్టరీ ఆఫ్‌ డిఫెన్స్‌

  • ● గమ్యం నిర్దేశించి.. దిక్సూచిగా నిలిచి ● లక్ష్యసాధనలో

    – మరిన్ని కథనాలు 8లోu

    నాన్న.. రెండక్షరాల పదమే అయినా ప్రతీ ఒక్కరి జీవితంలో విడదీయరాని బంధం. బాల్యంలో వేలుపట్టి నడక నేర్పే తొలిగురువుగా.. తప్పట డుగులు సరిదిద్దే మార్గదర్శిగా.. లక్ష్యసాధనలో దిక్సూచిగా నిలిచే

    ఆ స్ఫూర్తి ప్రదాత పాత్ర అనిర్వచనీయం. కనుపాపలను తీర్చిదిద్దే ఆ కనురెప్పల మాటున కనిపించని త్యాగాలెన్నో. బిడ్డల విజయ తీరాన అది ఆనంద బాష్పమై వికసిస్తోంది. జీవిత పయనంలో బాధలెన్ని ఎదురైనా పిల్లల వికాసానికి బాటలు వేసే ఆ అలుపెరగని బాటసారికి సలాం చేయాల్సిందే. తాను సాధించని విజయాలను వారి రూపంలో చూసుకుని మురిసిపోయే ఆ ప్రేక్షకుడికి నీరాజనం పలకాల్సిందే. ఉన్నతస్థాయికి ఎదిగిన తమ విజయంలో ఆయనదే అగ్రస్థానమంటున్నారు ఆ బిడ్డలు. నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా తమ సక్సెస్‌లో నాన్న పాత్రపై పలువురి

    అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – కైలాస్‌నగర్‌

  • ‘గిరి’ గ్రామాలకు మహర్దశ
    ● ‘పీఎం జుగా’లో మౌలిక సదుపాయాల కల్పన ● ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ● విద్య, జీవనోపాధిలో కీలకమైన మార్పులు ● తొలివిడతలో జిల్లాలో 102 గిరిజన గ్రామాలు ఎంపిక ● 19 శాఖల ద్వారా అభివృద్ధి

    సాక్షి, ఆసిఫాబాద్‌: ప్రధాన మంత్రి జన్‌జాతీయ ఉన్నత్‌గ్రామ్‌ అభియాన్‌(పీఎం జుగా) మిషన్‌ ద్వారా సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 8.6 శాతం షెడ్యూల్డ్‌ తెగ(ఎస్టీ) ఉంది. ఇతరులతో పోలిస్తే వీరికి విద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు నేటికీ అందని ద్రాక్షగా మిగిలాయని అనేక స ర్వేలు, నివేదికలు తేల్చాయి. అందువల్లే సా మాజిక, ఆర్థిక అంతరాలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పీఎం జుగా మిషన్‌ ప్ర వేశపెట్టింది. ఈ మిషన్‌ ద్వారా వెనుకబడిన గి రిజన గ్రామాల్లో అన్నిరకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నారు.

    విద్య, మౌలిక సదుపాయాల కల్పన..

    ప్రధానంగా గిరిజన గ్రామాల్లో నివాసాలు లేని వారికి ఇళ్లు, రహదారులు, ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు, ఎల్పీజీ గ్యాస్‌ అందేలా చర్యలు తీసుకుంటారు. సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, పోషణ్‌ వాటికాస్‌, ఆయూష్మాన్‌ కార్డులు అందజేస్తారు. విద్య, నైపుణ్యాలకు దూరంగా ఉంటున్న గిరిజన గ్రామాల్లో విద్యార్థులకు ప్రత్యేక ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే విద్యుత్‌ సౌకర్యాలకు నోచుకోని గ్రామాలకు విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకుంటారు. ప్రత్యేకంగా ఆన్‌గ్రిడ్‌ పవర్‌ కనెక్షన్లు, ఆఫ్‌గ్రిడ్‌ సోలార్‌ కనెక్షన్లు అందిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, పాఠశాలపై రూప్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు జరగనున్నాయి. గిరిజనులు పండించే పంటలను మార్కెట్‌కు తరలించి, వారికి గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటారు. కమ్యూనికేషన్‌ మెరుగుపర్చేందుకు 4జీ నెట్‌వర్క్‌ సేవలు ఏర్పాటు చేయనున్నారు.

    జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలు

    మండలం గ్రామాలు

    తిర్యాణి 33

    జైనూర్‌ 15

    సిర్పూరు(యూ) 14

    లింగాపూర్‌ 8

    వాంకిడి 8

    కెరమెరి 7

    ఆసిఫాబాద్‌ 4

    బెజ్జూర్‌ 4

    కాగజ్‌నగర్‌ 4

    చింతలమానెపల్లి 3

    కౌటాల 1

    రెబ్బెన 1

    మిషన్‌ లక్ష్యాలు..

    జిల్లాలో గిరిజన జనాభా 500 మంది అంతకంటే ఎక్కువ లేదా కనీసం 50 శా తం అంతకంటే ఎక్కువ గిరిజన నివాసితులు ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం.. విద్య, ఆరోగ్య సంరక్షణ, నై పుణ్యాలను మెరుగుపర్చి గిరిజనుల పు రోగతికి తోడ్పడం ఈ మిషన్‌ లక్ష్యాలు.

    ఐదేళ్ల ప్రణాళిక...

    జిల్లాలో ఈ మిషన్‌ ద్వారా ఐదేళ్లలో వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 102 గ్రామాల్లో 19 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడతారు. సోమవారం నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఆ శిబిరాల్లో పాల్గొనే అధికారులు అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల కారణాలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సంరక్షణ సదుపాయాలను పరిశీలించి వాటిని నమోదు చేసి ఆయా శాఖల అధిపతుల ద్వారా అక్కడి పనులకు అయ్యే ఖర్చు ఎంత? అనే అంచనాలు రూపొందిస్తారు. అనంతరం జిల్లా గిరిజనాభివృద్ధి అధికారికి పంపుతారు. వాటన్నింటినీ కలెక్టర్‌ ద్వారా పీఎం జుగా మిషన్‌ అధికారులకు అందజేసిన అనంతరం వెనువెంటనే వాటికి అయ్యే ఖర్చును అందజేస్తారు. అనంతరం ఆయా అభివృద్ధి పనులు చేపడతారు. ఈ పనులన్నీ 2029 నాటికి పూర్తికానున్నాయి.

  • 36.3
    గరిష్టం/కనిష్టం

    వాతావరణం

    ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురుస్తుంది.

    నెన్నెల: మా నాన్న గడ్డం వెంకటస్వామి(కాకా) మా కుటుంబానికి రియల్‌ హీరో. ఆయన పెద్ద కొడుకుగా పుట్టడం నా అదృష్టం. తమ్ముడు వివేక్‌తోపాటు సోదరీమణులకు ఇంత చక్కటి జీవితాలను ఇచ్చినందుకు ఆయనకు ఎల్లకాలం రుణపడి ఉంటాం. వివేక్‌కు, నాకు ప్రస్తుతం సమాజంలో లభిస్తున్న గౌరవం, మర్యాదల క్రెడిట్‌ మొత్తం మా నాన్నగారికే పోతుంది. చిన్ననాడు నడక నేర్పిన నాటి నుంచి పాఠశాల, కళాశాల విద్య ఆయన మార్గనిర్దేశంలోనే కొనసాగాయి. నాన్న ఆశీర్వాదంతోనే రాజకీయాల్లోకి రాగలిగాను. ఎస్‌సీఏ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలు అందించగలిగాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వెంకటస్వామి చేసిన కృషి అందరికీ తెలుసు. ఆయన చివరి శ్వాస వరకు నిరుపేదల అభ్యున్నతి కోసం తాపత్రయ పడిన వ్యక్తి. కాకా సూచన మేరకు డాక్టర్‌ అంబేద్కర్‌ పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేసి 1.50లక్షల మందికి ఉన్నత చదువులు అందించగలిగాం. ఫాదర్స్‌డే సందర్భంగా నాన్నగారిని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తాను. అందరికీ ఫాదర్స్‌డే శుభాకాంక్షలు.

    – గడ్డం వినోద్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే

    కాకాతో వినోద్‌, వివేక్‌(ఫైల్‌)

    ‘కాకా’ మా రియల్‌ హీరో

  • జీవిత గమ్యాన్ని నిర్దేశించారు

    మాది రాజస్థాన్‌లోని సవాయి మాదాపూర్‌ జిల్లా మలర్నా చౌర్‌ గిరిజన గ్రామం. నాన్న సీతారాం మీనా. డీపీఆర్వోగా పనిచేశా రు. 1నుంచి 7వరకు హిందీ మీడియంలో, 8 నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో చదివాను. బీహెచ్‌యూలో ఐఐటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. నాన్న నాకు బాల్యం నుంచే క్రమశిక్షణతో కూడిన జీవిత గమ్యాన్ని నిర్దేశించారు. ఆ దిశగా ప్రోత్సహించారు. ఐఐటీ అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న సమయంలో ఇంట్లో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ విషయాన్ని నాకు తెలియనివ్వకుండా చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగంతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పేవారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేఽసేవారు. సివిల్స్‌లో ఐదు సార్లు నిరాశ ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే దిశగా మరింత కష్టపడాలని వెన్నుతట్టారు. ఆ ప్రోత్సాహంతోనే ఆరో ప్రయత్నంలో 458వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్‌గా ఎంపికయ్యా. నా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో మా నాన్నే నాకు రోల్‌మోడల్‌.

    – యువరాజ్‌ మర్మాట్‌,

    సబ్‌కలెక్టర్‌, ఉట్నూర్‌

    తల్లిదండ్రులతో యువరాజ్‌ మర్మాట్‌

  • అనుక్షణం అండగా నిలిచారు..

    మాది తలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన పల్సి(బి)తండా. నాన్న జాదవ్‌ గోవింద్‌ రావు హెడ్‌ కానిస్టేబుల్‌. మా ఊరిలో తొలి ప్రభు త్వ ఉద్యోగి నాన్నే. చదువుతోనే గొప్ప భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి. చిన్నతనం నుంచే నాకు విద్యా ప్రాధాన్యతను వివరించారు. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూర్‌లో, ఆరు నుంచి పదో తరగతి వరకు కాగజ్‌నగర్‌ నవోదయలో చదివాను. ఇంటర్‌ హైదరాబాద్‌లో, తిరుచ్చి ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా ను. నాన్న పోలీస్‌ శాఖలో పనిచేస్తుండటంతో జిల్లాకు వచ్చిన ఎస్పీ, కలెక్టర్ల గొప్పతనం, వారికి సమాజంలో ఉండే గౌరవం గురించి చెప్పేవారు. ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించేవారు. దీంతో బీటెక్‌ పూర్తికాగానే ఐఏఎస్‌ సాధించాలని నిర్ణయించుకున్నాను. తొలి నాలుగు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఐదో ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై నా అందులో చేరలేదు. 2024లో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణలో ఉన్నా. పోలీస్‌ ఉద్యోగమంటే సెలవులుండేవి కావు. కానీ నేను పరీక్షలు రాసే సమయంలో నాన్న నా వెంటే ఉండేవారు. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అనుక్షణం నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన పడిన కష్టం, అందించిన మార్గదర్శనంతోనే నేను విజయం సాధించగలిగాను.

    – జాదవ్‌ సాయి చైతన్య, ఐఏఎస్‌

  • నాన్నే.. రోల్‌మోడల్‌..

    నిర్మల్‌: మానాన్న బీఎన్‌.సర్కార్‌. జార్ఖండ్‌ కేడర్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌. మేం నలుగురం పిల్లలం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. మా అందరినీ నాన్న బాగా చదివించారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మా గురించి ప్రతిరోజు ఆలోచించేవారు. అందుకు తగ్గట్లుగానే ఈరోజు అందరం ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాం. న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చదివిన నాన్న మమ్మల్ని కూడా చదువులో ప్రోత్సహించారు. అందుకే పబ్లిక్‌ పాలసీలో డబుల్‌ మాస్టర్స్‌, సోషియాలజీలో మాస్టర్స్‌ చదివాను. సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకోవాలని నాన్నే నాకు సూచించారు. ఐఏఎస్‌ సాధించడంలోనూ నాన్న అడుగడుగునా వెన్నుతట్టి ప్రోత్సహించారు. నా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికీ చాలా విషయాల్లో నాన్నే రోల్‌మోడల్‌.

    – అభిలాష అభినవ్‌, కలెక్టర్‌, నిర్మల్‌

Jayashankar

  • బలోపే

    కాటారం: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతంచేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవడంతో పాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుంది. ప్రస్తుతం కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రాల నిర్వహణలో మార్పులు తీసుకురావడంతో పాటు సేవలను మరింత విస్తృత పరిచేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుంది. చిన్నారులకు ఎంతో ప్రాముఖ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను పక్కాగా అందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

    ఆటపాటలతో కూడిన విద్య..

    గ్రామాల్లో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఈ నెల 11నుంచి అమ్మ మాట–అంగన్‌వాడీ బాట పేరుతో పలు కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ మాట–అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో టీచర్లు, సిబ్బంది తమ కేంద్రాల పరిధిలో రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. కార్యక్రమం ముగింపులో భాగంగా ఈ నెల 17న సామూహిక అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై మానసిక ఒత్తిడి కలగకుండా నిపుణుల సూచన మేరకు ఆటలు, పాటలు, కథల ద్వారా చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా సెలబస్‌ రూపొందించి విద్యను బోధించడానికి సిద్ధమయ్యారు. చిన్నారులు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు నేర్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తుంది.

    బడిబాట పట్టేలా..

    అంగన్‌వాడీ కేంద్రాల్లోని 3నుంచి 6ఏళ్ల పిల్లలను బడిబాట పట్టించేందుకు అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్‌గా భావించే వారు. చిన్నారులు పాఠశాల వాతావరణానికి అలవాటుపడేలా, పౌష్టికాహారం అందించి ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టేలా తీర్చిదిద్దేవారు. గతేడాది నుంచి అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో పలు మార్పులు తీసుకొచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం, ఆటపాటలతో గడపడమే కాకుండా వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్క్‌బుక్కులు అందించి వారితో హోంవర్క్‌ చేయిస్తున్నారు. ఎల్‌కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరుతో ఐదు పుస్తకాలు రూపొందించి ఆటపాటలతో బోధించారు. ప్రస్తుతం నిపుణ్‌ భారత్‌ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యాబోధన చేపట్టనున్నారు. దీంతో చిన్నారుల మేథస్సు వికసించడంతో పాటు మానసిక మార్పులు చోటు చేసుకోనున్నాయి.

    చిన్నారుల సంఖ్య పెంచేలా..

    ఆరేళ్ల లోపు చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా ఐసీడీఎస్‌ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు చర్యలు చేపడుతున్నారు. కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడం కోసం కసరత్తు చేస్తున్నారు. అమ్మమాట–అంగన్‌వాడీ బాట కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరిస్తున్నారు. చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్య ఆవశ్యకత, అంగన్‌వాడీలకు పంపించడం ద్వారా వారికి చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు.

    చిన్నారుల సంఖ్య పెంచేలా

    కార్యక్రమాలు..

    అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ ఆదేశాలతో అమ్మమాట–అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అమలు తీరుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్‌వాడీకి పంపించడం ద్వారా వారిలో మేథాశక్తి పెంపొందుతుంది.

    – మల్లీశ్వరి, డీడబ్ల్యూఓ

    అంగన్‌వాడీలపై

    దృష్టి సారించిన ప్రభుత్వం

    అమ్మ మాట–అంగన్‌వాడీ బాట

    పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు

    చిన్నారుల సంఖ్య పెంచేలా కసరత్తు

    17వరకు పలు కార్యక్రమాల నిర్వహణ

    జిల్లా వివరాలు..

    మండలాలు 12

    ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు 2

    (భూపాలపల్లి, మహదేవపూర్‌)

    అంగన్‌వాడీ కేంద్రాలు 643

    చిన్నారుల సంఖ్య 10,364(సుమారు)

  • తండ్రి తాపీ మేసీ్త్ర.. కుమార్తె డాక్టర్‌

    కాజీపేట రూరల్‌: ఆయన చదువుకోలేదు. తనలా పిల్లలు కావొద్దని బాగా చదివించాడు. సమాజంలో గొప్ప స్థాయిలో కూతుళ్లను చూస్తూ మురిసిపోతున్నాడు కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన తాపీ మేసీ్త్ర లింగాల వీరస్వామి. వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు. 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. పెద్ద కూతురు హేమలతను వైద్య విద్య చదివించాడు. ఆమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రైమరీ వెటర్నరీ సెంటర్‌ పెగడపల్లిలో అసిస్టెంట్‌ సర్జన్‌గా పని చేస్తున్నారు. చిన్న కూతురు సు మలత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. నాన్న జీవితమే తమకు ప్రేరణనిచ్చిందని.. సుమలత, హేమలత చెబుతున్నారు.

  • నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..

    వరంగల్‌ క్రైం: చిన్నప్పటి నుంచి మా నాన్న జన్నేల్‌సింగ్‌ నాలో నింపిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. నాన్న ప్రిన్సిపాల్‌ కావడంతో చదువులో ప్రోత్సాహం అందించారు. సివిల్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే సమయంలో ఆయన మోటివేషన్‌ నాలో రెట్టింపు ఉత్సాహం నింపింది. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలో అవగాహన కల్పించేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా తీర్చిదిద్దారు. సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొంటున్న ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించారు. ప్రతీ దశలో వెన్నంటి ప్రోత్సహించారు. – సన్‌ప్రీత్‌సింగ్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

  • వందలా
    ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

    జఫర్‌గఢ్‌: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాధరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్‌ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలుపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు ఇన్నయ్యను నాన్న అంటూ అప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.

    న్యూస్‌రీల్‌

  • ఆపదకాలంలో ఆదుకునేందుకు రక్తదానం

    భూపాలపల్లి అర్బన్‌: ఆపదకాలంలో ఆదుకునేందుకు ప్రతి ఏడాది రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఐటీ మాస్టర్‌ నిర్వాహకుడు శంకర్‌ తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీ మాస్టర్‌ యాజమాన్యం, తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (ఐజేయూ జిల్లా కమిటీ) ఆధ్వర్యంలో శనివారం ఐటీ మాస్టర్‌ క్యాంపస్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. 2008వ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం ఐటీ మాస్టర్‌ యజమాన్యం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు, ప్రజలకు చికిత్స నిమిత్తం అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి జర్నలిస్టులతో పాటు ప్రజాసంఘాలు, స్టూడెంట్స్‌, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా 280 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు క్యాతం సతీష్‌ కుమార్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • భూమి

    నల్లబెల్లి: చదువు ఒక్కటే తరగని ఆస్తి అని బలంగా నమ్మారు వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల రవీందర్‌. కూలీ చేసి కొనుక్కున్న 4 ఎకరాల భూమిని కుమారుడు ప్రశాంత్‌ చదువు కోసం అమ్మేశారు. తండ్రి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రశాంత్‌ ఇష్టంగా చదివారు. ఎండీ జనరల్‌ మెడిసిన్‌ పూర్తి చేసిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌ విభాగంలో పని చేస్తున్నారు. ‘నాకోసం భూమి అమ్మి కుటుంబ పోషణ కోసం నాన్న 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. నాన్న ప్రోత్సాహమే నన్ను వైద్యుడిని చేసింది. నా విజయం నాన్నకు అంకితం’ అంటున్నారు ప్రశాంత్‌.

  • రాజీమార్గంతో వివాదాలకు దూరం

    భూపాలపల్లి అర్బన్‌: రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ సీహెచ్‌ రమేశ్‌ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని రాజీపడి కేసుల్లో నుంచి బయటపడాలన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. క్షమాగుణాన్ని కలిగి ఉండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరాభావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌కుమార్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌ రావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

    జిల్లా ప్రధాన న్యాయమూర్తి

    రమేష్‌ బాబు

  • విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధం

    ములుగు రూరల్‌: ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ డాక్టర్‌ శబరీశ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురిసినా లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు వచ్చినా, ముంపునకు గురైనప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు సహాయార్ధం బృందాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటే సమీప పోలీస్‌స్టేషన్‌కు గాని, 100కు కాల్‌ చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే అక్కడికి చేరుకుని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సులభంగా ఉంటుందని వివరించారు.

  • నడిచే దైవం.. నాకు తొలినేస్తం

    ఖిలా వరంగల్‌: వరంగల్‌ 34వ డివిజన్‌ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్‌ రిప్రసెంటేటివ్‌గా పని చేస్తూ పిల్లల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్‌ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్‌ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్‌ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈస్థానంలో నిలబెట్టింది.

Jogulamba

  • జోగుళ

    ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

    రియల్‌ హీరో..

    ‘మా నాన్న రఘునాథ్‌ గైక్వాడ్‌ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. కిరాణ షాపు నిర్వహిస్తూ మా చదువుల కోసం ప్రోత్సహించారు. ఆయన నుంచి కష్టపడే తత్వాన్ని, ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్చుకున్నా. ప్రతి ఒక్కరికీ నాన్నే రియల్‌ హీరోగా ఉంటారు.

    నాన్న రఘునాథ్‌ గైక్వాడ్‌తో నాగర్‌కర్నూల్‌ ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌

    నాన్నంటే ఓ ఆసరా.. ఓ భరోసా.. నాన్నంటే ఓ బాధ్యత.. ఓ ధైర్యం..

    నాన్నంటే ఓ స్ఫూర్తి..ఓ ఆర్తి.. బరువెక్కుతున్న గుండె భారంగా మారుతున్నా, కంటి నిండా నిద్ర కరువవుతున్నా కుటుంబ బరువు బాధ్యతలను భుజాన వేసుకునే సూపర్‌ హీరో. నవ మాసాలు మోసి అమ్మ జన్మనిస్తే.. బతుకంతా ధారపోసి జీవితాన్నిచ్చేది నాన్న. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడిస్తాడు. బుడిబుడి అడుగుల నుంచి ప్రతి చోట వెన్నంటి ఉంటాడు. కష్టాల్లో నిర్భరంగా.. ఆపదలో ధైర్యంగా నిలబడేలా భరోసానిస్తాడు. విజయంలో మెట్టుగా మారుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాన్ని కళ్లలో దాచిపెట్టి.. సంతోషాన్ని చేతినిండా పంచిపెట్టి.. తన కోసం ఏదీ దాచుకోకుండా.. కన్న బిడ్డలే సర్వస్వంగా బతుకుతాడు. అందుకే నాన్నంటే ప్రతి కుమారుడు, కుమార్తెకు కొండంత ధైర్యం. తండ్రి చేయి పట్టుకొని ఉన్నత గమ్యం వైపు నడిచిన వారు ఎందరో ఉన్నారు. ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..

    – సాక్షి నాగర్‌కర్నూల్‌/ నారాయణపేట రూరల్‌/ గద్వాల/ జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌)

  • నాన్న

    వెన్నుదన్నుగా నిలబడ్డారు..

    నా చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో మా నాన్నే ఆదర్శం. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న మహదేవ్‌ చిన్నపాటి వ్యాపారం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి చదువు ప్రాముఖ్యత తెలియజేశారు. నేను ఇంజినీరింగ్‌ అయిన తర్వాత ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. నేను నిర్దేశించుకున్న ఐఏఎస్‌ లక్ష్యాన్ని సాధించేందుకు అందులో చేరలేదు. ఆ సమయంలో నాన్నే నా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. సివిల్స్‌ రెండు ప్రయత్నాల్లో సాధించలేకపోయా. ఈ సమయంలో నీ వెనకాల నేనున్నా అంటూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించా.

    – బీఎం సంతోష్‌, కలెక్టర్‌, జోగుళాంబ గద్వాల

    జీవిత పాఠాల్లో తండ్రికి మించిన గురువు లేరు

    పిల్లల ప్రతి అడుగులో వెన్నంటి ఉంటూ భరోసా

    భవితకు మార్గదర్శిగా ఉంటూ.. వారి ఎదుగుదలకు అహర్నిశలు కష్టపడే శ్రమజీవి

    నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం

  • రాజీ మార్గంతో సమయం ఆదా

    గద్వాల క్రైం/అలంపూర్‌: రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడంతో సమయం ఆదా అవుతుందని జిల్లా న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత, అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి మిథున్‌తేజ అన్నారు. శనివారం గద్వాలలో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 8195 కేసులు, అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో 3701 కేసులు పరిష్కరించారు. క్రిమినల్‌, సివిల్‌, సైబర్‌ క్రైం, బ్యాంకు లిటిగేషన్‌, ప్రమాద తదితర పెండింగ్‌ కేసుల్లో ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చినట్లు జిల్లా న్యాయమూర్తి ప్రేమలత తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి. లక్ష్మీ, వెంకట హైమ పూజిత, ఏపీపీలు రెచ్చల్‌ సంజాన జాషువ, జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రెటరీ శ్రీనివాస్‌, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.

    ● కోర్టులో కేసులు నడుస్తున్నా రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని జడ్జి మిథున్‌ తేజ అన్నారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడం వలన కక్షిదారులకు ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి దూరం అవుతుందన్నారు. క్షక్షిదారులు లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలంపూర్‌ లోక్‌ అదాలత్‌లో సివిల్‌కు సంబంధించి ఒక కేసు, క్రిమినల్‌ కేసులు–31, ఎస్‌టీసీ కేసులు 3701 పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, సీనియర్‌ న్యాయ వాదులు నారాయణ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, కరుణాకర్‌ రావు, సీఐ టాటబాబు, ఏపీపీ, ఏజీపీ, ఎస్‌ఐలు, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.

    గద్వాల, అలంపూర్‌ లోక్‌ అదాలత్‌లో 11,896 కేసులు పరిష్కారం

  • తండ్రి బ్యాంకు ఉద్యోగి.. కొడుకు ఐఏఎస్‌

    వెల్దండ మండలం పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్యావత్‌ ఉమాపతినాయక్‌ తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. ఎస్‌బీఐలో ఉద్యోగిగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు కష్టపడ్డారు. పెద్ద కుమారుడు యశ్వంత్‌నాయక్‌ రెండో ప్రయత్నంలో 2024లో 627 ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌ సాధించారు. మహారాష్ట్ర ఐపీఎస్‌ కేడర్‌కు ఎంపికై హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణ పొందుతూనే మళ్లీ ఐఏఎస్‌ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యశ్వంత్‌నాయక్‌ ఇటీవల విడుదలైన ఫలితాల్లో 433 ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

  • నా తండ్రి సహకారంతోనే..

    మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. అమ్మ వసుంధర గృహిణి కాగా.. నాన్న శ్రీనివాసులు ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ.. మా ముగ్గురిని చదివించారు. ఆర్థిక స్థోమత లేకపోయినా ఆ విషయాన్ని మేం గుర్తించకుండా అవసరమైనవి సమకూర్చారు. చిన్నతనం నుంచి ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న నన్ను నిరుత్సాహపర్చకుండా ఎంత కష్టమైనా డబ్బులు పెట్టి చదివించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం గ్రూప్స్‌ పరీక్ష రాయగా తాజాగా వచ్చిన ఫలితాల్లో 484.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంకు, మల్టీ జోన్‌–2లో మూడో ర్యాంకు.. మహిళా కేటగిరిలో రెండో స్థానంతో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాను. నా తండ్రి సహకారంతోనే ఈ స్థాయికి చేరాను. – తల్లిదండ్రులతో వీణ

International

  • టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) తాజాగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై విస్తృత దాడులు చేశాయి. ఇరాన్ ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన టెహ్రాన్‌లోని లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. తమ లక్ష్యాలలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్‌ ప్రదేశం కూడా ఉందని ఐడీఎఫ్ తెలిపింది.

    ఇజ్రాయెల్‌ తమ దేశంపై జరిపిన దాడిలో టెహ్రాన్‌లోని షహ్రాన్ చమురు డిపోను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్ క్షేత్రంలో ఉత్పత్తిని ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ దాడులను ప్రారంభించిన తర్వాత జెరూసలేం- టెల్ అవీవ్ అంతటా వైమానిక దాడి సైరన్‌లు మోగించారు. ఇరాన్‌ సైన్యం ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

    ఇజ్రాయెల్ సైన్యం ‘రైజింగ్ లయన్’ ప్రారంభించి, ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ కొత్త దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ తాము జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమానికి చెందిన జనరల్స్, సీనియర్ శాస్త్రవేత్తలు, నిపుణులు మృతిచెందారని పేర్కొంది. తాజా దాడులకు ముందు ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి మాట్లాడుతూ ఈ దాడుల్లో 78 మంది మృతిచెందారని, 320 మందికి పైగా జనం గాయపడ్డారని చెప్పారు. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుండి ఎదురవుతున్న  ముప్పును తిప్పికొట్టడానికే ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ ముప్పు తప్పేవరకూ ఎన్ని రోజులైనా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

    ఇది కూడా చదవండి: ఇరాన్‌ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్‌ చిత్రాలలో.. 

Jangaon

  • ఘనంగా వార కల్యాణం

    చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావుల ఆధ్వర్యంలో వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులకు హైదరాబాద్‌కు చెందిన కొండ విష్ణుమూర్తి, శోభారాణి, దేవులపల్లి వెంకటేశ్వర్లు, అనురాధలు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గణగోని రమేష్‌, గోలి రాజశేఖర్‌, వేముల వెంకటేశ్వర్లు, జూనియర్‌ అసిస్టెంట్‌ కుర్రెంల మోహన్‌, భక్తులు పాల్గొన్నారు.

  • నడిచే దైవం.. నాకు తొలినేస్తం

    ఖిలా వరంగల్‌: వరంగల్‌ 34వ డివిజన్‌ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్‌ రిప్రసెంటేటివ్‌గా పని చేస్తూ పిల్లల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్‌ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్‌ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్‌ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈస్థానంలో నిలబెట్టింది.

  • నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..

    వరంగల్‌ క్రైం: చిన్నప్పటి నుంచి మా నాన్న జన్నేల్‌సింగ్‌ నాలో నింపిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. వృత్తిరీత్యా నాన్న ప్రిన్సిపాల్‌ కావడంతో చదువులో ప్రోత్సాహం అందించారు. ముఖ్యంగా సివిల్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే సమయంలో ఆయన చేసిన మోటివేషన్‌ నాలో రెట్టింపు ఉత్సాహం నింపింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా తిర్చిదిద్దారు. సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొంటున్న ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించారు. చదువుకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు ప్రతీ దశలో వెన్నంటి ప్రోత్సహించారు.

    – సన్‌ప్రీత్‌ సింగ్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

  • తండ్రి తాపీ మేసీ్త్ర.. కుమార్తె డాక్టర్‌

    కాజీపేట రూరల్‌: ఆయన చదువుకోలేదు. తనలా పిల్లలు కావొద్దని బాగా చదివించాడు. సమాజంలో గొప్ప స్థాయిలో కూతుళ్లను చూస్తూ మురిసిపోతున్నాడు కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన తాపీ మేసీ్త్ర లింగాల వీరస్వామి. వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు. 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. పెద్ద కూతురు హేమలతను వైద్య విద్య చదివించాడు. ఆమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రైమరీ వెటర్నరీ సెంటర్‌ పెగడపల్లిలో అసిస్టెంట్‌ సర్జన్‌గా పని చేస్తున్నారు. చిన్న కూతురు సుమలత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. నాన్న జీవితమే తమకు ప్రేరణనిచ్చిందని.. సుమలత, హేమలత చెబుతున్నారు.

  • ఆదివా

    జఫర్‌గఢ్‌: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్‌ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు కూడా ఆశ్రమంలో ఇన్నయ్యను నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.

    ఏళ్ల కష్టానికి.. విజయమే సమాధానం!

    బచ్చన్నపేట: భూమిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించారు. చదువును నమ్ముకుని పిల్లలను బాగా చదివించారు. ఆ తండ్రి ఇప్పుడు గర్వంగా చెబుతున్నాడు తమ పిల్లలు ప్రయోజకులయ్యారని. బచ్చన్నపేటకు చెందిన చిమ్ముల మల్లారెడ్డికి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. సేద్యం చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించాడు. పాడి పశువుల్ని సాకుతూ పాలు పితికి అమ్ముతూ, వ్యవసాయం చేస్తూ ఒక కొడుకు, ఒక కూతురును ఉన్నతంగా చదివించారు. కూతురు చిమ్ముల నవిత ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా జనగామ మండలం పెద్దపహాడ్‌లో విధులు నిర్వరిస్తున్నారు. కుమారుడు రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌–1లో స్టేట్‌ 272వ ర్యాంకు సాధించారు. ‘నా కలలు నిజమయ్యాయి. పిల్లలు ప్రయోజకులవ్వడం చూస్తే ఇన్నేళ్ల కష్టం మరిచిపోతున్నా’ అంటున్నారు చిమ్ముల మల్లారెడ్డి.

    న్యూస్‌రీల్‌

    వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న

  • ప్రైవ
    సర్కారు కాలేజీల్లో అత్యుత్తమ బోధన

    గ్రామాల్లో అధ్యాపకుల విస్తృత ప్రచారం

    30శాతం పెరగనున్న అడ్మిషన్ల సంఖ్య

    జనగామ రూరల్‌: ప్రైవేట్‌కు దీటుగా అత్యుత్తమ బోధన వసతులపై ఊరూరా ప్రచారం చేస్తూ సర్కారు కాలేజీలో విద్యార్థుల ప్రవేశాలు తీసుకోవాలని అధ్యాపకులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఏడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది మొత్తం 4,920 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 68 శాతంగా నమోదైంది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన విద్యాబోధన, ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వడంతో పాటు స్వేచ్ఛయుత వాతావరణం కల్పించడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.

    పెరుగుతున్న అడ్మిషన్ల సంఖ్య

    2019–20 విద్యాసంవత్సరంలో జనగామ జూనియర్‌ కళాశాలలో మొత్తం 2,418 విద్యార్థులు ఉంటే ప్రస్తుత విద్యాసంవత్సరానికి నెల రోజుల వ్యవధిలోనే 415 మంది అడ్మిషన్‌ తీసుకున్నారు. ఇంకా అడ్మిషన్ల గడువు ఉండడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుంది.

    ప్రవేశాలకు ప్రత్యేక చర్యలు

    ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన బోధన, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నా... కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్‌లో ఎక్కువ ఫీజులు చెల్లిస్తూ జేబులు చిల్లు చేసుకుంటున్నారు. ఈసారి అలా కాకుండా ఇంటర్‌ బోర్డు అధికారులు, కమిషనర్‌ కృష్ణ ఆదిత్య ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దాదాపు 50 రోజుల ముందునుంచే గ్రామాల్లో పర్యటించి కళాశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్లను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

    కళాశాలల వారీగా అడ్మిషన్ల సంఖ్య

    కళాశాల నమోదైన

    విద్యార్థుల సంఖ్య

    స్టేషన్‌ఘన్‌పూర్‌ 71

    దేవరుప్పుల 39

    జనగామ 81

    జఫర్‌గఢ్‌ 28

    కొడకండ్ల 26

    నర్మెట 75

    జనగామ

    (బాలికలు) 95

    ప్రభుత్వ కళాశాలల్లో కల్పించే వసతులు..

    ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకార వేతన సౌకర్యం.

    ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లో ఫీజు మాఫీ.

    బస్సు సౌకర్యం లేనటువంటి రూట్లను గుర్తించి రవాణా సౌకర్యం కల్పించడం.

    అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన.

    గ్రంథాలయాలు, క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వంటి గురించి వివరించడం.

    విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

    ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నిపుణులైన, క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులు బోధిస్తున్నారు. రాష్ట్రంలో గొప్పస్థాయిలో ఉన్నవారు, అనేక అవార్డులు పొందిన వారు జిల్లాలో పనిచేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం. నాలుగేళ్లుగా ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూవస్తుంది.

    – జితేందర్‌ రెడ్డి, ఇంటర్‌ విద్యాధికారి

  • సోమేశ

    పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ జడ్జి సందీప, ఆలయ ఈఓ సల్వాది మోహన్‌ బాబు, ఎస్సై దూలం పవన్‌కుమార్‌, ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, అనిల్‌కుమార్‌, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

    దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం

    జనగామ రూరల్‌: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే మోదీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొఫెషనల్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల అభ్యన్నతికి తోడ్పాటునందిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు అత్యధిక స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్‌ రెడ్డి, కేవీఎల్‌ఎన్‌ రెడ్డి, ఉడుగుల రమేష్‌, నందా రెడ్డి, తోకల ఉమారాణి, శివరాజ్‌ యాదవ్‌, శశిధర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    ఆర్యవైశ్య మహాసభ జోన్‌ చైర్మన్‌గా వేదకుమార్‌

    జనగామ/రఘునాథపల్లి: జిల్లా ఆర్యవైశ్య మహాసభ జోన్‌ చైర్మన్‌గా రఘునాథపల్లికి చెందిన కూరెళ్ల వేదకుమార్‌ నియామకమయ్యా రు. ఈ మేరకు శనివారం ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్య క్షుడు డాక్టర్‌ గంగిశెట్టి ప్రమోద్‌కుమార్‌ వెల్లడించారు. అనంతరం వేదకుమార్‌కు నియామకపత్రం అందించి శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని, ఈ నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగం భిక్షపతి, రీజన్‌ చైర్మన్‌ పడకంటి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

    ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి

    జనగామ రూరల్‌: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావు అధ్యక్షత జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం అవుతున్నప్పటికీ విద్యా రంగంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్‌ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్‌, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్‌, కన్వీనర్‌ గూడెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • నాన్న

    పిల్లల జీవితాలకు రంగులద్దుతున్న తండ్రులు

    త్యాగాలు చేస్తూ.. కన్నీళ్లు మోస్తూ.. శక్తికి మించి పనిచేస్తూ

    కడుపున పుట్టినవారు ఉన్నతంగా బతకాలని వారందరి తపన

    ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా ఫాదర్స్‌

    కష్టాలెన్నున్నా.. చిరునవ్వు ఒలకబోస్తాడు. కన్నీటి సుడులు ఉప్పైనె పొంగుతున్నా.. పంటి బిగువన అదిమి పడతాడు. తాను మాసిన గడ్డంతో ఉన్నా.. పిల్లల బట్టలు మెరవాలంటాడు. తన కోరికలు చంపుకునైనా.. పిల్లలు కోరినవేవైనా చిటికెలో పట్టుకొస్తాడు. తాను కడుపు నిండా తినకపోయినా.. కంటి నిండా నిద్రపోకపోయినా కుటుంబం కోసం అడ్జెస్ట్‌ అవుతాడు. పిల్లల జీవితాలకు రంగులద్దుతాడు. వారి కలలకు నిచ్చెనవుతాడు. ప్రతీ కుటుంబానికి నాన్న ఓ హీరో. నేడు(ఆదివారం) ఫాదర్స్‌ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.

    నేడు ఫాదర్స్‌ డే

  • శాంతి చర్చలు జరపాలి●

    ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన

    జనగామ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతిచర్చలు జరపాలని, ఆపరేషన్‌ కగార్‌ను నిలిపేయాలని శనివారం జిల్లా కేంద్రంలో అఖిలపక్షం, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, మేధావుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డిలు మాట్లాడుతూ అటవీ సంపద, ఖనిజాలను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఆపరేషన్‌ కగార్‌ అన్నారు. తక్షణమే బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే శాంతిచర్చలు జరపాలని, లేదంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్‌, బన్సీ నాయక్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు చెంచారపు కరుణాకర్‌ రెడ్డి, బక్క శ్రీనివాస్‌, జోగు ప్రకాష్‌, న్యాయవాది సాధిక్‌ అలీ, వేముల నర్సింగం, రాపర్తి రాజు పాల్గొన్నారు.

  • రేపటి నుంచి గిరిజన తండాల్లో సదస్సులు

    జనగామ: జిల్లాలోని గిరిజన తండాల్లో ఈ నెల 16 నుంచి పీఎం దర్తీ ఆభ జన్‌ భాగీ ధారి అభియాన్‌ పథకంపై సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. శనివారం కలెక్టర్‌ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆరు మండలాల పరిధిలో తొమ్మిది గిరిజన తండాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 16 నుంచి జూలై 2వ తేదీ వరకు సమస్యల పరిష్కారానికి తండాల పరిధిలో సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధార్‌, కిసాన్‌ క్రెడిట్‌, రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌, ఆయుష్మాన్‌ భవ, ఇన్సూరెన్స్‌ కవరేజ్‌, వృద్ధాప్య, వితంతు పెన్షన్‌ తదితర పథకాలకు సంబంధించి అర్హులైన వారికి అందించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో వినతులను స్వీకరించనున్నారు. తరిగొప్పుల మండలం భోజ్యా తండా గ్రామపంచాయతీ పరిధి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

    తేదీల వారీగా సదస్సుల వివరాలు

    ఈ నెల 16, 17న తరిగొప్పుల మండలం భోజ్యాతండా, 18, 19, 20 తేదీల్లో నర్మెట మండలం బొమ్మకూరు, మల్కపేట, 21, 23న చిల్పూరు మండలం ఫతేపూర్‌, 24, 25, 26న పాలకుర్తి మండలం కొండాపూర్‌, మైలారం, 27, 28, 30, జూలై 2న దేవరుప్పుల మండలం లకావత్‌తండా (తూర్పు), ధర్మాపురం, జూలై 2న కొడకండ్ల మండలం నీలిబండతండాలో సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

    ఆరు మండలాల్లో తొమ్మిది తండాలు ఎంపిక

    కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

  • వెలివేసినా.. విజయబావుటా!

    రఘునాథపల్లి: రఘునాథపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ ప్రభాకర్‌ 33 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాలు వెలివేశాయి. అయినా బెదరకుండా అద్దె ఇంట్లో ఉంటూ.. ప్రైవేట్‌ ఉపాధ్యాయుడిగా, ఆర్‌ఎంపీగా, రోజు వారీ కూలీగా పని చేశాడు. ముగ్గురు కుమారులు, ఒక కూతురిని చదివించారు. పెద్ద కుమారుడు ఉదయ్‌కుమార్‌ సింగరేణిలో పర్సనల్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ ఇటీవల గ్రూప్‌–1లోనూ ప్రతిభ చాటారు. రెండో కుమారుడు పృధ్వీకుమార్‌ హైదరాబాద్‌లో లా పైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మూడో కుమారుడు ప్రణయ్‌కుమార్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కూతురు మౌనశ్రీ ఓయూలో పీహెచ్‌డీ చేస్తోంది. ‘ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్న.. అద్దె ఇంట్లో ఉంటూ పడరాని కష్టాలు పడ్డా. గవర్నమెంట్‌ స్కూల్‌లో పిల్లల్ని చదివించి ఉన్నత స్థానాల్లో నిలిపినందుకు గర్వపడుతున్నా. ప్రణయ్‌కుమార్‌ ఐఏఎస్‌ సాధించిన రోజు మరువలేనిది. అనేక కష్టాలను అనుభవించిన మేం.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందు వరుసలో ఉంటాం’ అంటున్నారు ప్రభాకర్‌.

  • రాజీపడితేనే సమస్యల పరిష్కారం

    జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ

    జనగామ రూరల్‌: రాజీపడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారించుకోవాలన్నారు. లోక్‌ అదాలత్‌లో 6 బెంచ్‌ల ద్వారా సమస్యలను పరిష్కరించారు. మొత్తం సివిల్‌ కేసులు 82, మోటార్‌ యాక్సిడెంట్‌ కేసులు 4, క్రిమినల్‌ కేసులు 5160, ప్రీ లిటిగేషన్‌ 450 కేసులను పరిష్కరించగా రూ.1,03,17,307 వసూలు అయినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంచ్‌ జడ్జీలు విక్రమ్‌, ఈ సుచరిత, జి. శశి, సందీప, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Palnadu

  • పల్నా
    ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

    I

    నేడు వేంకటేశ్వర స్వామి శాంతి కల్యాణం

    దుగ్గిరాల: పసుపు యార్డు సమీపంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి శాంతి కళ్యాణ మహోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

    ముప్పాళ్ల: ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైంది. ముందస్తు రుతుపవనాల రాకతో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. రైతులు ముందస్తు సాగుకు సిద్ధమవుతున్నా పాలకులు నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది. సీజన్‌ ప్రారంభానికి ముందే రైతుకు కష్టాలు మొదలయ్యాయి. భూసారం పెరగాలంటే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలంటూ పెద్దఎత్తున వ్యవసాయశాఖ అధికారులు ప్రచారం చేస్తుంటారు. అయితే ఆ దిశగా రైతుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువులు పంపిణీలో మాత్రం చిత్తశుద్ధి కనపడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు సబ్సిడీపై అందించే ప్రోత్సాహకాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి. చివరకు వ్యవసాయ సీజన్‌కు ఆరంభంలో సాగు చేసే పచ్చిరొట్ట విత్తనాలు కూడా అందకుండా పోతున్నాయి.

    గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే విత్తనాలు

    వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సొంత గ్రామంలోనే అందించేవారు. సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలైన పిల్లి పెసర, మినుము, జీలుగ, జనుము గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా నేరుగా రైతుకు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక పచ్చి రొట్ట విత్తనాల ఊసే కరువైంది.

    వరి, పత్తి, మిరప విత్తనాల జాడే లేదు. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో మండలానికి సుమారు 400 క్వింటాళ్ల వరకు విత్తనాలు సరఫరా కావటంతో రైతుకు కావాల్సినంత, కావాల్సిన రకం సొంత గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలోనే తీసుకొని సాగు చేసుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది 120 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. ఎన్నికల సమయం కావటంతో రైతులు కూడా విత్తనాల పంపిణీపై ఆసక్తి కనపరచలేదు. ఇదే అదనుగా ఈ ఏడాది మరలా కోత విధిస్తూ 100 క్వింటాళ్లు మాత్రమే పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా అయినట్లు వ్యవసాయశాఖ సిబ్బంది చెబుతున్నారు. మండలానికి కేటాయించే సరఫరాలో కోత విధిస్తుండటంతో రైతులకు విత్తనాలు అందటం లేదు. అధికార పార్టీ సిఫార్సులు ఉన్న వారికే విత్తనాలు దక్కే దుస్థితికి చేరింది.

    గప్‌ చుప్‌గా పంపిణీ

    ప్రభుత్వం సరఫరా చేసే అరకొర కేటాయింపులతో వ్యవసాయశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. కేవలం కూటమి నాయకులు సిఫార్సు చేసిన వారికి మాత్రమే గప్‌చుప్‌గా వ్యవసాయ అధికారులు విత్తనాలు అందిస్తున్నారు. ఎవరైనా విత్తనాల కోసం వెళితే స్టాక్‌ లేదంటూ సమాధానం ఇచ్చి వెనక్కి పంపుతున్నారు. పచ్చిరొట్ట సాగు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టే అధికారులు ఆ దిశగా విత్తనాలు సరఫరా చేయాలనే కనీసం పరిజ్ఞానం లేకపోవటం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

    న్యూస్‌రీల్‌

    ఆరంభమైన ఖరీఫ్‌ సీజన్‌ నేటికీ అందని పచ్చిరొట్ట ఎరువులు సరఫరాలోనూ కోత ఆందోళనలో అన్నదాతలు

    మళ్లీ వస్తాయంటూ కుంటి సాకులు

    విత్తనాలు అరకొరగా రావడంతో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అడిగిన వారికి సమాధానం చెప్పుకోలేక తికమకపడుతున్నారు. రైతులు అడిగే ప్రశ్నలకు నోరు మెదపలేకపోతున్నారు. కొందరు కూటమి నేతలు సైతం విత్తనాల కోసం సిబ్బందిని వేధిస్తున్నారు. ఫోన్‌ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ తరుణంలో వారి కోపం నుంచి తప్పించుకునేందుకు మాయమాటలు చెప్పి తప్పించుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం కేటాయించిన వరకు రైతులకు అందిస్తామంటూ వ్యవసాయాధికారులు చేతులెత్తేస్తున్నారు.

    కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు అందించాలి. లేకుంటే రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పచ్చిరొట్ట సాగు పంటకు ఎంతో లాభదాయకం. రైతులు సబ్సిడీ ద్వారా అందించే విత్తనాలతోనే పచ్చిరొట్ట సాగు చేస్తుంటారు. విత్తనాలు అందివ్వకుంటే సాగు అదనపు భారమే అవుతుంది.

    – గుంటుపల్లి బాలకృష్ణ,

    రైతుసంఘం నాయకులు

  • నీట్‌

    గుంటూరు ఎడ్యుకేషన్‌ : వైద్య విద్యా కోర్సుల జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్‌–2025)లో గుంటూరుకు చెందిన పలువురు విద్యార్థుల వివిధ కేటగిరీల్లో అఖిల భారతస్థాయిలో ర్యాంకులు కై వసం చేసుకున్నారు.

    నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు జాతీయస్థాయి వైద్య విద్యా సంస్థల్లో (ఎయిమ్స్‌)తో పాటు దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో సీట్లు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.

    ఎయిమ్స్‌లో చేరడమే లక్ష్యం

    స్వస్థలం యర్రగొండపాలెం. నాన్న యేసానాయక్‌ జెడ్పీ హైస్కూల్‌ గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. టెన్త్‌ వరకూ నవోదయలో, ఇంటర్మీడియెట్‌ గుంటూరు వచ్చి చదివాను. సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో 981మార్కులు సాధించాను. తాజా ర్యాంకుతో ఎయిమ్స్‌లో చేరాలని భావిస్తున్నాను.

    – రమావత్‌ తరుణ్‌ కుమార్‌ నాయక్‌,

    51వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ

    తల్లిదండ్రులే స్ఫూర్తి

    స్వస్థలం గుంటూరు. నాన్న భానుప్రకాష్‌ గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జువాలజీ అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అమ్మ విజయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకురాలు. నీట్‌ ఓపెన్‌ కేటగిరీలో 262 ర్యాంకు వచ్చింది. తాజాగా ర్యాంకుతో ఎయిమ్స్‌లో సీటు సాధిస్తా.

    – కారుమంచి విక్రాంత్‌,

    6వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ

    అమ్మానాన్నలు ప్రభుత్వ వైద్యులే

    స్వస్థలం గుంటూరు. నాన్న డాక్టర్‌ గోవిందనాయక్‌, అమ్మ డాక్టర్‌ కరుణ జీజీహెచ్‌లో వైద్యులు. ఓపెన్‌ కేటగిరీలో 2,135వ ర్యాంకు సాధించా. కళాశాలలో అధ్యాపకులు అందించిన సహకారం, సందేహాల నివృత్తి, వీక్లీ టెస్టుల ద్వారా సబ్జెక్టు పరంగా పట్టు సాధించా. ఇది మెరుగైన ర్యాంకు సాధనకు దోహదపడింది. మంగళగిరి ఎయిమ్స్‌లో చేరతా.

    – ఎం. అరవింద్‌, 13వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ

    వైద్యురాలిగా

    రాణించాలనే లక్ష్యం

    స్వస్థలం నరసరావుపేట. నాన్న షేక్‌ మహబూబ్‌ సుభానీ వార్డు సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఓపెన్‌ కేటగిరీలో 1,184వ ర్యాంకు సాధించా. ఎయిమ్స్‌లో చేరే లక్ష్యంతో ఉన్నాను.

    – షేక్‌ వసీమా, 80వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌

    అన్నయ్య స్ఫూర్తి

    స్వస్థలం గుంటూరు. నాన్న రత్నాకర్‌ ఆర్కిటెక్చర్‌. అమ్మ రెబెకా విద్య సివిల్‌ ఇంజినీర్‌. గతేడాది నీట్‌లో క్వాలిఫై అయ్యి పుదుచ్చేరిలోని జిప్‌మర్‌లో సీటు సాధించిన అన్నయ్య ప్రణయ్‌ విక్టర్‌ బాటలో వైద్య విద్య అభ్యసించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత కార్డియాలజిస్ట్‌గా ఎదిగి, సమాజానికి సేవ చేస్తా. – సోలే ప్రేమ్‌ జడ్సన్‌ ప్రసన్న,

    108వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ

    గైనకాలజిస్ట్‌గా సేవలు

    స్వస్థలం నెల్లూరు. నాన్న కృష్ణారెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. వైద్య విద్యపై మక్కువతో రోజుకు 15 గంటల పాటు చదివాను. ప్రణాళికాబద్ధమైన కృషితోనే ర్యాంకు సాధ్యమైంది. ఎయిమ్స్‌లో వైద్యవిద్య అభ్యశించిన తరువాత గైనకాలజిస్ట్‌గా రాణించాలనే లక్ష్యంతో ఉన్నా.

    – నాగిరెడ్డి మనస్విని,

    49వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌

    జాతీయస్థాయి వైద్య విద్యాసంస్థల్లో సీటు సాధనే లక్ష్యం వివిధ కేటగిరీల్లో ప్రతిభ చాటిన విద్యార్థుల భావి ప్రణాళికలు

  • వైభవం

    అమరావతి: మల్లాది గ్రామంలోని వట వృక్షాంతర్గత వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజల అనంతరం శాంతి కల్యాణం నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, తులసీ మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు తొమ్మిది మంది దంపతులచే శాంతి కళ్యాణ ప్రక్రియను ఆలయ యాజ్ఞీకస్వామి పరుచూరు శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. మధ్యా హ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

    పునఃప్రారంభమైన

    శ్రీవారి ఊయల సేవ

    తెనాలి టౌన్‌: శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి ఊయల సేవ శనివారం నుంచి పునఃప్రారంభమైనది. ఆలయ కార్యనిర్వహణాధికారులు వి.అనుపమ మాట్లాడుతూ దేవస్థానంలో ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటల కు శ్రీస్వామి అమ్మవార్లకు ఊయల సేవ జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఊయల సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించారు. కొండేపి వసుంధర బృందం ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

    రామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక

    ఏకాదశ రుద్రాభిషేకం

    నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): మల్లారెడ్డినగర్‌ విఘ్నేశ్వరస్వామి సహిత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. రామలింగేశ్వర స్వామికి ఆలయ అర్చకులు పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం రుద్రహోమం, నవగ్రహ, మండప దేవత హోమాలను చేపట్టారు. భక్తులకు తీర్ధ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఫౌండేషన్‌ చైర్మన్‌ మెట్టు కృష్ణారెడ్డి దంపతులు, అన్నదాన కమిటీ చైర్మన్‌ గుంటూరు వేమారెడ్డి, కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు.

    జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి స్థలాల పరిశీలన

    బాపట్ల: జిల్లా కోర్టు భవన సముదాయం బాపట్ల పట్టణంలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి తెలిపారు. జిల్లా కోర్టు భవన సముదాయానికి అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. తూర్పు బాపట్లలో ఖాళీగా ఉన్న 7.5 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఇందిరానగర్‌లో ఖాళీగా ఉన్న 2.80 ఎకరాల భూమిని పరిశీలించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భూమి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలను పంపాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్‌ వెంట బాపట్ల తహసీల్దార్‌ సలీమా, సర్వేయర్లు వీఆర్వోలు తదితరులు ఉన్నారు.

  • నీట్‌ ర్యాంకర్‌ వసీమా అందరికీ స్ఫూర్తిదాయకం

    నరసరావుపేట: నీట్‌ ఎగ్జామ్స్‌లో ఆల్‌ ఇండియా 80వ ర్యాంకు సాధించిన షేక్‌ వసీమా అభినందనీయురాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆ పాప సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మండలంలోని చినతురకపాలెం గ్రామంలో షేక్‌ సాపమహబూబ్‌ సుభాని, సకిన దంపతుల కుమార్తె వసీమా శనివారం విడుదల చేసిన నీట్‌ ఎగ్జామ్‌ ఫలితాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఆల్‌ ఇండియాలో 80వ ర్యాంకు సాధించింది. శనివారం సాయంత్రం వసీమా గ్రామానికి చెందిన తన బంధువు షేక్‌ సుభానితో కలిసి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని పార్టీ కార్యాలయంలో కలిశారు. గోపిరెడ్డి ఆ విద్యార్థినిని సత్కరించి అభినందించారు. గోపిరెడ్డి మాట్లాడుతూ ఆల్‌ ఇండియాలో 80వ ర్యాంకు రావటం సామాన్యమైన విషయం కాదని అన్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ అమలుచేసిన నాలుగు శాతం రిజర్వేషన్‌ వల్ల ఎంతోమంది మైనార్టీ అమ్మాయిలు, అబ్బాయిలు మంచి ర్యాంకులతో డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారన్నారు. వసీమాను అందరూ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వసీమాను మునుముందు పీజీ, సూపర్‌ స్పెషాలిటీ విద్యను చదివించాలని సూచించారు. వారి కుటుంబంలో ఎనిమిది మంది డాక్టర్లు అంటే సామాన్య విషయం కాదని, ఓకే కుటుంబం ఎనిమిది మంది డాక్టర్లు కావటం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆ గ్రామంలో ఇప్పటికీ 30 మంది డాక్టర్లుగా డిగ్రీలు పొందారని, ఇంకా రెండు మూడు రోజుల్లో నీట్‌ విశ్లేషణ పూర్తయితే మరో ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు రావడానికి అవకాశం ఉందని అన్నారు. వారందరూ ఎన్నో విజయాలు సాధించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. షేక్‌ కరిముల్లా, అచ్చి శివకోటి, వై.రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

    అభినందించి సత్కరించిన

    మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

  • ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్‌

    బాపట్లటౌన్‌: రెప్పపాటులోనే ద్విచక్రవాహనాలను మాయం చేసే ఘరానా దొంగలను బాపట్ల పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వివరాలను అడిషనల్‌ ఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. బాపట్ల పట్టణం ఉప్పరపాలేనికి చెందిన రాజు నాగార్జునరెడ్డి, శారదాపురి కాలనీకి చెందిన ఉన్నాం వంశీ, మల్లావుల ధర్మతేజ, షేక్‌ చందు, జాలాది జాన్‌, మరో మైనర్‌ బాలుడు కలసి బాపట్ల పట్టణంతోపాటు, చీరాల రూరల్‌, చీరాల టూ టౌన్‌, వెదుళ్లపల్లి, బాపట్ల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆరు ద్విచక్ర వాహనాలను, మోటర్‌, రెండు సవర్ల బంగారం గొలుసును దొంగతనం చేశారు. బాపట్ల పట్టణంలోని జగనన్న కాలనీకి చెందిన పాలతోటి సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పట్టణంలోని గుంటూరు ఫ్లైఓవర్‌ వద్ద గల చిల్లర గొల్లపాలెం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తమ సిబ్బంది ఆరుగురులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగతనాలన్నీ తామే చేశామని అంగీకరించారు. ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రెండు సవర్ల బంగారపు గొలుసు, మోటర్‌ను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపిస్తామని తెలిపారు. కేసు ఛేదనలో ఎంతో కీలకంగా వ్యవహరించిన బాపట్ల పట్టణ సీఐ రాంబాబు, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, ఎస్సై చంద్రావతి, సిబ్బంది ప్రభాకరరావు, మనోజ్‌, శ్రీనివాసరావు, పోతురాజు, కృష్ణకిషోర్‌లను జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ అభినందించారు.

    ఆరు వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్‌ ఎస్పీ రామాంజనేయులు

  • యోగాత

    పిట్టలవానిపాలెం(కర్లపాలెం): యోగాసనాల వల్ల మానసిక ప్రశాంత కలుగుతుందని, ఆరోగ్యంగా ఉండొచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి చెప్పారు. యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలలో భాగంగా శనివారం పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన యోగాసనాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. కేర్‌ న్యాచురోపతి వైద్య కళాశాల విద్యార్థులు నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పిట్టలవానిపాలెంలో అవగాహన ర్యాలీ నిర్వహించి సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్పారు. వికసిత్‌ భారత్‌ దిశగా కేంద్రం, స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముదుకు వెళుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నదని వాటి ఫలాలను ప్రజలు అందుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం యోగాతోనే సాధ్యమవుతుందని యోగాసనాల వలన కలిగే ప్రయోజనాలను ప్రజలు గుర్తించాలని కలెక్టర్‌ చెప్పారు.

    సూర్యలంకలో 10వేల మందితో యోగాంధ్ర

    ఈనెల 21న విశాఖపట్నంలో చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్ధాయిలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రధానమంత్రి హాజరవనున్నారని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో సూర్యలంక తీరంలో 10వేల మందితో జరిగే యోగాలో ప్రజలంతా పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయమ్మ, డ్వామా పీడీ జయలక్ష్మి, మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, పశు సంవర్థ శాఖ అధికారి వేణుగోపాల్‌రావు, ఎకై ్సజ్‌శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ వవెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ ఎలీషాబాబు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

    వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన బాపట్ల జిల్లా కలెక్టర్‌ వెంకటమురళి పిట్టలవానిపాలెంలో జిల్లా స్థాయి యోగాసనాల కార్యక్రమం

  • చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో పాత నేరస్తుడి అరెస్టు

    నగరంపాలెం: ఒంటరిగా వెళ్లే వృద్ధ మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లే పాత నేరస్తుడ్ని గుంటూరు సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. అతని నుంచి రూ.30 లక్షలు ఖరీదైన 300 గ్రాముల నగలు, బైక్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలుల్‌లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి గత నెల 28 వరకు జిల్లాలో వరుస బంగారు గొలుసు చోరీలు జరిగాయని తెలిపారు. దీంతో సీసీఎస్‌ సీఐలు అనురాధ, అల్తాఫ్‌ హుస్సేన్‌, బి.శ్రీనివాస్‌తో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. గత ఆరు నెలలుగా సుమారు 700 నిఘా కెమెరాలను నిశితంగా పరిశీలించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో ఆనందపేట ఒకటో వీధిలో ఉంటున్న నలభై ఏళ్ల షేక్‌ అమీర్‌బేగ్‌ అలియాస్‌ జోహారీని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొ న్నారు. గతంలో జరిగిన ఎనిమిది బంగారు గొలుసు దొంగతనాలకు ఇతడే పాల్పడినట్లు విచారణలో గుర్తించామని వివరించారు. అమీర్‌ బేగ్‌ను అరెస్ట్‌ చేసి బంగారు నగలు, మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మరో రెండు బైక్‌లను గుర్తించాలని చెప్పా రు. కేసులను త్వరితగతిన ఛేదించిన ఏఎస్పీ క్రైం సుప్రజ, డీఎస్పీ శివాజీరాజు, సీఐలు, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, రివార్డులు అందించారు.

    15 రోజులకు ఒక చోరీ

    పెయింటర్‌గా పనిచేసే అమీర్‌ బేగ్‌ ఒంటరి మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో మంచి నేర్పరి. 2006లో మూడు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నాడు. 2014లో పాత గుంటూరు పీఎస్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. అతనిపై 2016లో పాత గుంటూరు పీఎస్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. అప్పటికే సుమారు 22 కేసులు నమోదవ్వగా, ఇటీవల చేసిన ఎనిమిది కేసులతో 30 వరకు నమోదయ్యాయి. పదిహేను రోజులకు ఒకసారి రెక్కీ చేసేవాడని, అది కూడా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చేసేవాడని పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. బాపట్ల జిల్లా వెళ్లి అక్కడ తాళం అరిగిపోయిన బైక్‌లను దొంగలించి, ఇక్కడికి వచ్చేవాడని చెప్పారు. చోరీలు చేసిన తర్వాత ఎక్కడపడితే అక్కడే వాటిని వదిలేసి వెళ్లేవాడని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, సీసీఎస్‌ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు జె.అనురాధ, ఎండీ.ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం పీఎస్‌ సీఐ జి.వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

    రూ.30 లక్షల విలువైన

    బంగారు నగలు స్వాధీనం

  • కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

    చీరాల అర్బన్‌: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య అన్నారు. శనివారం స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో సీపీఎం బాపట్ల జిల్లా నాయకులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటి రోజు వర్తమాన రాజకీయ పరిణామాలుపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సుపరిపాలన అందించినట్లు చెప్పుకుంటుందని, ప్రజలు అటువంటి సంతృప్తి వ్యక్తం చేయడం లేదన్నారు. తల్లికి వందనానికి అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టారన్నారు. పిల్లల చదువులకు ఇచ్చే డబ్బుల్లో కోత వేయడం సరికాదన్నారు. అర్హులైన అందరికీ తల్లికి వందనం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. రాష్ట్రానికి వనరులు రాబట్టుకోవడం, విభజన హామీలు అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు భావించారన్నారు. ఆచరణలో మాత్రం ఆ ప్రయత్నం జరగలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ వంటి పథకాలు ఇంటింటికీ అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తోందని తెలిపారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యలపై జిల్లాలో సీపీఎం పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్‌, ఎన్‌.బాబూరావు, మణిలాల్‌, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, వి.వెంకటరామయ్య, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

    సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య

  • సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ నరసింహారెడ్డికి అవార్డు ప్రద

    లక్ష్మీపురం: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 50కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ సాధు నరసింహారెడ్డికి భారత రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ ’అవార్డు అందజేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెం లోని భారతీయ విద్యాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ నరసింహారెడ్డి నాయకత్వ నైపుణ్యం, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. రక్తదాన కార్యక్రమాల్లో ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అవార్డు గ్రహీత నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నెలకొల్పిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో 2023లో 1,440 యూనిట్లు, 2024లో 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ కృషికి గానూ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తనకు గుర్తింపు కల్పించాయని తెలిపారు. ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం ద్వారా రక్తదాన సేకరణలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎ.కె.పరీద మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ఏర్పాటు, సామాజిక సేవల్లో నరసింహారెడ్డి అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సంస్థ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు, జీఎస్టీ అధికారులు నాగరాజు, రవికుమార్‌, ఈశ్వరరావు, గాదె శ్రీనివాసరెడ్డి, పూర్ణ సాయి, శాఖమూరి శ్రీనివాస్‌, బిల్లా ప్రశాంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

  • అదుపు

    దాచేపల్లి: నగర పంచాయతీ పరిధిలోని కారంపూడి రోడ్డు సెంటర్‌లో శనివారం లారీ బీభత్సం సృష్టించింది. పిడుగురాళ్ల వైపు నుంచి అతి వేగంతో వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ ఇనుప గ్రిల్స్‌ని ఢీకొని దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మీటర్ల పొడవునా ఇనుప గ్రిల్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్‌లో లారీ బీభత్సం సృష్టించడంతో ప్రజలు పరుగులు తీశారు. గ్రిల్స్‌ను ఢీకొని లారీ నిలిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్రేన్‌ సాయంతో లారీని పక్కకు తీశారు. హైవే అధికారులు కొత్త గ్రిల్స్‌ నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

    మహిళపై కత్తితో దాడి

    నరసరావుపేట టౌన్‌: మంచినీటి పంపు వద్ద చోటు చేసుకున్న వివాదం మహిళపై కత్తితో దాడికి దారి తీసింది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దచెరువు రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌ వద్ద కుళాయిలో తాగునీరు పట్టుకునే విషయంలో చల్లా సుధారాణికి, గుంజి తిరుమలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సుధారాణిపై తిరుమల, అతని తండ్రి వెంకటేశ్వర్లు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • డేటా సమీకరణలో ఆన్‌టాలజీల పాత్ర కీలకం

    మద్రాస్‌ ఐఐటీ సీఎస్‌ఈ ప్రొఫెసర్‌ శ్రీనివాసకుమార్‌

    చేబ్రోలు: వివిధ వనరుల నుంచి వచ్చిన డేటాను ఒకే ఫార్మాట్‌లో సమీకరించడానికి ఆన్‌టాలజీలు ఉపయోగపడతాయని మద్రాస్‌ ఐఐటీ సీఎస్‌ఈ ప్రొఫెసర్‌ పి.శ్రీనివాసకుమార్‌ అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ‘‘సెకండ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ సాఫ్ట్‌ కంప్యూటింగ్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను శనివారం ముగిసింది. ప్రొఫెసర్‌ శ్రీనివాసకుమార్‌ మాట్లాడుతూ ఏఐ సిస్టమ్‌లు ఒక నిర్దిష్ట పరిసరాన్ని అర్థం చేసుకోవడం, నిర్ణయం తీసుకోవడం లేదా సహాయపడే విధంగా రూపొందించడంలో ఆన్‌టాలజీలు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. భాషను అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా తర్జుమా, ప్రశ్నల సమాధానాలు, చాట్బాట్‌ల అభివృద్ధిలో ఉపయోగపడతాయని తెలిపారు. వాతావరణం, ట్రాఫిక్‌, విద్యుత్‌ వినియోగం వంటి డేటాను తెలివిగా ప్రాసెస్‌ చేయడంలో కూడా వినియోగిస్తారని చెప్పారు. జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ– సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రమేష్‌బాబు బత్తుల మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవస్థలు బ్యాంకింగ్‌లో వినియోగదారుల ప్రవర్తనలను విశ్లేషించి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగలవని తెలిపారు. పౌరుల భద్రతను పెంచేలా సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ఎమర్జెన్సీ సేవలను మరింత సమర్థంగా నడిపించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఐటీ– సిల్‌చార్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కె.సుగన్య దేవి, ఎన్‌ఐటీ వరంగల్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ యూ.ఎస్‌.ఎన్‌. రాజు పాల్గొన్నారు.