Archive Page | Sakshi
Sakshi News home page

Sri Sathya Sai

  • వసతి గృహాల్లోని సమస్యలు పరిష్కరించండి

    ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమర్‌నాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాము నాలుగు రోజులుగా జిల్లాలోని పలు వసతి గృహాలను సందర్శించామన్నారు. ఏ వసతి గృహానికి వెళ్లినా సమస్యలే కనిపించాయన్నారు. మెనూ పాటించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వసతి గృహాల్లో తాము గుర్తించిన సమస్యలను వివరించి... పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు ఇవ్వాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి గృహాల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించాలని, మోనూ ప్రకారం భోజనం అందించాలని, పరుపులు, ప్లేట్లు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు అందివ్వాలని కోరామన్నారు. అలాగే విద్యార్థులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు కీలకమైన వార్డెన్‌ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగంగా జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, కదిరి రూరల్‌ అధ్యక్షుడు ఫయాజ్‌, నాయకులు మానేరు నరసింహులు, పవన్‌ కుమార్‌రెడ్డి, కౌశిక్‌ మేఘనాథ్‌ అనిల్‌ పాల్గొన్నారు.

    కలెక్టర్‌ను టీఎస్‌ చేతన్‌నుకోరిన

    వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు

  • దారిత

    పుట్టపర్తి అర్బన్‌: జాతీయ రహదారి–342 పనులు దారీతెన్నూ లేకుండా సా...గుతున్నాయి. ప్రజాప్రతినిధులు పట్టించుకోక... అధికారుల నిర్లక్ష్యం వెరసి రహదారి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే బెంగళూరు నుంచి జిల్లా కేంద్రం పుట్టపర్తికి రెండుగంటల్లో చేరుకోవచ్చు. సత్యసాయి జయంత్యుత్సవాల నేపథ్యంలో ఈ మార్గం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. బాబా శత జయంత్యుత్సవాలకు విదేశాల నుంచి వచ్చే భక్తులు విమానంలో బెంగళూరు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రశాంతి నిలయం చేరుకుంటారు. కానీ ఈ రహదారి బాబా జయంత్యుత్సవాలకు అందుబాటులో వచ్చేలా కనిపించడం లేదు.

    వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రారంభం..

    పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ పెంచి తద్వారా పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ హయాంలో ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం, పుట్టపర్తి, గోరంట్ల మీదుగా చిలమత్తూరు మండలం కోడూరు వరకూ నూతనంగా నాలుగు వరుసల రహదారికి (ఎన్‌హెచ్‌–342) రూపకల్పన చేసి పనులు కూడా ప్రారంభించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పనులు శరవేగంగా జరిగాయి. చిత్రావతిపై బ్రిడ్జి, గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌ వద్ద ప్‌లైవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో పాటు కర్ణాటకనాగేపల్లి వద్ద , వెంగళమ్మచెరువు ప్రధాన రహదారిపై బ్రిడ్జిల నిర్మాణం ఊపందుకుంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పనులు నెమ్మదించాయి.

    రూ.1,745 కోట్లతో రోడ్డు నిర్మాణం..

    ముదిగుబ్బ నుంచి ప్రారంభమయ్యే జాతీయ రహదారి–342 చిలమత్తూరు మండలం కోడూరు వరకు మొత్తం రోడ్డు 80 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇందుకోసం రూ.1,745 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముదిగుబ్బ – బుక్కపట్నం మధ్య 85 శాతం పనులు పూర్తికాగా, ఆ రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నాయి. రెండో విడత పనుల్లో భాగంగా జగరాజుపల్లి నుంచి కోడూరు వరకూ పనులు కొనసాగుతున్నాయి. 7 గ్రామాల్లో బైపాస్‌లతో పాటు బడేనాయక్‌ తండా వద్ద ఉన్న నల్లగుట్ట, పుట్టపర్తి వద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అలాగే గువ్వలగుట్టపల్లి వద్ద రైతుల భూములకు పరిహారం సకాలంలో అందక పోవడంతో అక్కడ పనులకు బ్రేక్‌ పడింది.

    బెంగళూరు నుంచి

    భారీగా భక్తులు వచ్చే అవకాశం

    సత్యసాయి శత జయంత్యుత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు. అలాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు విచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో నుంచి ఏ రాష్ట్రం నుంచి రావాలన్నా... విదేశాల నుంచి రావాలన్నా అందరూ బెంగళూరు విమానాశ్రయం వచ్చి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రశాంతి నిలయం చేరుకుంటారు. అంతేకాకుండా బెంగళూరులో సత్యసాయి బాబా ఆశ్రమం కూడా ఉంది. అందువల్ల ఈ మార్గమే అందరికీ అనుకూలంగా ఉంది. అలాగే తమిళనాడు నుంచి వచ్చే భక్తులు కూడా బెంగళూరు మీదుగానే ప్రశాంతి నిలయం వస్తారు. దీంతో బాబా శతజయంత్యుత్సవాల సమయంలో ఈ మార్గంపై రద్దీ పెరుగుతుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న రోడ్డు పూర్తి కాకపోతే డైవర్షన్లు, మట్టి రోడ్డు, అసంపూర్తి పనులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పుట్టపర్తి చుట్టూ నిర్మాణ పనులు సగం కూడా పూర్తి కాక పోవడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. బాబా శత జయంత్యుత్సవాల కోసం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ చేపట్టే పనులు శరవేగంగా సాగుతున్నా... ప్రధానమైన రహదారి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దీంతో భక్తులంతా కూటమి సర్కార్‌ను తప్పుపడుతున్నారు. కనీసం ఇప్పటికై నా స్పందించి బాబా శత జయంత్యుత్సవాల నాటికి వీలైనంత వరకూ రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

    సా...గుతున్న

    ఎన్‌హెచ్‌–342 పనులు

    వందరోజుల్లో సత్యసాయి

    శత జయంతి

    బెంగళూరు మార్గం నుంచే

    లక్షలాది మంది రాక

    అప్పటికై నా రోడ్డు నిర్మాణం

    పూర్తి చేయాలంటున్న స్థానికులు

  • ఉపశమన

    అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారుల అవగాహన రాహిత్యం రోగులకు నరకప్రాయంగా మారుతోంది. కోవిడ్‌ ముందస్తు చర్యల కోసం ఈఎన్‌టీ వార్డును కేటాయించి.. ఇక్కడి రోగులను బర్న్స్‌ వార్డుకు మార్పు చేశారు. ఇక కాలిన రోగుల వైద్య విభాగం (బర్న్స్‌ యూనిట్‌)లో చికిత్స పొందాల్సిన రోగులను సర్జికల్‌ విభాగంలోని ఎంఎస్‌ 1, 2, 3, 4, 5, ఎఫ్‌ఎస్‌ వార్డులకు మార్చారు. ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో ఉపశమనం పొందలేక.. హాహాకారాలు చేస్తున్నారు. కోవిడ్‌ కేసులు వస్తే చికిత్స అందించేందు కోసం ఖాళీ చేయించిన ఈఎన్‌టీ వార్డును రిజర్వ్‌ చేశారు. ఇదిలా ఉంటే సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆత్మారాం బర్న్స్‌ వార్డులోని ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ)ను అనస్తీషియా విభాగానికి కేటాయించడం పెద్ద దుమారం రేపింది. ఈ నిర్ణయంపై సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్‌ రామస్వామి నాయక్‌ అభ్యంతరం తెలిపారు. కాలిన రోగులకు ఉపయోగపడే ఓటీని మరో విభాగానికి కేటాయించడం సరికాదని, ఇప్పటికే కాలిన రోగులు ఇబ్బందులు పడుతున్నారని లేఖ రాశారు. సూపరింటెండెంట్‌ సొంత విభాగం ఆర్థో ఓటీలోనే అనస్తీషియాకు స్థలం కేటాయిస్తే బాగుంటుందని పలువురు వైద్యులు పేర్కొంటుండటం గమనార్హం.

    ఉక్కపోతతో కాలిన రోగుల అవస్థలు..

    ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నం చేసుకున్న కాలిన కేసులు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వస్తాయి. అందులోనూ 50 శాతం నుంచి 80 శాతం కాలి ప్రాణాంతకమైన స్థితిలో వస్తుంటాయి. అటువంటి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.2 కోట్లతో 20 పడకల సామర్థ్యంతో బర్న్స్‌ వార్డు ఏర్పాటు చేశారు. అందులో అధునాత ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయూ, ఏసీ గదులతో వార్డును తీర్చిదిద్దారు. కాలిన కేసులకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్జరీ వైద్యులకు ఢిల్లీలో శిక్షణ కూడా ఇచ్చారు. అత్యవసరమైన వార్డును ఈఎన్‌టీకి కేటాయించి, ఈఎన్‌టీ వార్డును ఖాళీగా ఉంచేశారు. సర్జరీ విభాగంలో ఉక్కపోత కారణంగా కాలిన రోగులు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికై నా రోగుల అవస్థలను గుర్తించి ఇదివరకు ఎలా ఉందో అలా సంబంధిత విభాగంలోనే వైద్య సేవలందించాలని పలువురు కోరుతున్నారు. అసంబద్ధ నిర్ణయాలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడ వద్దని ఉన్నతాధికారులకు సూచిస్తున్నారు.

    కాలిన రోగుల హాహాకారాలు

    వార్డుల కేటాయింపులో గందరగోళం

    ఇదీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో దుస్థితి

    ఈ వ్యక్తి పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి. ఎడమచేతికి కాలడంతో సర్వజనాస్పత్రికి వచ్చారు. కాగా ఓపీ నంబర్‌ 8లో సర్జరీ వైద్యులు చూసి సర్జికల్‌ వార్డుకు పంపించారు. వాస్తవంగా ఇటువంటి కేసులను బర్న్స్‌ వార్డులో ఉంచి మెరుగైన వైద్యం అందించవచ్చు. బర్న్స్‌ వార్డులో ఏసీలతో పాటు బయట వ్యక్తులు ఎవరూ లోపలికి రాకుండా అంతర్గతంగా సేవలందిస్తారు. తద్వారా గాయం త్వరగా మానే అవకాశం ఉంటుంది. ఇలా ఎంతోమంది రోగులు సర్జరీ వార్డుల్లో ఉక్కపోతతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.

  • విద్య

    సోమందేపల్లి: మండలంలోని మరుకుంట సమీపంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ నెమలి మృతి చెందింది. శుక్రవారం వ్యవసాయ పొలాల్లో మేత కోసం వచ్చిన నెమలి అక్కడి విద్యుత్‌ స్తంభంపై కూర్చొనే క్రమంలో షాక్‌కు గురై కుప్పకూలి మృతి చెందింది. గమనించి రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

    కిలో బంగారు ఆభరణాల సీజ్‌

    తాడిపత్రి టౌన్‌: మండలంలోని కడప రోడ్డులో గురువారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో కిలో బరువున్న బంగారు నగలతో పాటు రూ.1.48 లక్షల నగదు పట్టుబడింది. సరైన అనుమతి పత్రాలు లేకుండా తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకు కారులో నగలు, నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరుకు చెందిన నగల వ్యాపారి ఉభయ్‌దుల్లాతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, దాదాపు 1,123.92 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,48,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు, నగదును కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.

    తల్లి పాల ప్రాముఖత్యపై చైతన్య పరచండి

    ఐసీడీఎస్‌ పీడీ ప్రమీల

    పుట్టపర్తి అర్బన్‌: తల్లి పాల ప్రాముఖ్యతపై మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ఐసీడీఎస్‌ పీడీ ప్రమీల అన్నారు. శుక్రవారం పుట్టపర్తి మండలం బీడుపల్లి–1 అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను ఆమె ప్రారంభించి, మాట్లాడారు. గ్రామంలోని పలువురు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కలిగించారు. శిశువు జన్మించిన అనంతరం రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా తల్లి పాలను కచ్చితంగా తాపాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనత నుంచి బయటపడవచ్చునన్నారు. అనంతరం నవజాత శిశువుల ఇళ్లకు వెళ్లి అంగన్‌వాడీ సేవలను తెలుసుకున్నారు. ఆకు కూరలు, కాయగూరలతో భోజనం చేయాలని సూచించారు. తల్లి పాల వారోత్సవాలకు గుర్తుగా రెండు ఇళ్ల వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీడీపీఓ జయంతి, సూపర్‌వైజర్‌ సుజాత, అంగన్‌వాడీ కార్యకర్తలు మంజుల, జ్యోతి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    రైల్వే క్వార్టర్స్‌లో చోరీ

    రాయదుర్గం టౌన్‌: స్థానిక నూతన రైల్వే క్వార్టర్స్‌లో చోరీ జరిగింది. రైల్వే టీఆర్‌డీ (ట్రాక్షన్‌ అండ్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌) వర్కర్‌గా పనిచేస్తున్న నాగేంద్ర ఇంత కాలం తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి క్వార్టర్స్‌లో కేటాయించిన నూతన ఇంటికి గురువారం మొత్తం సామగ్రిని తరలించారు. అనంతరం శుక్రవారం నూతన గృహంలో చేరాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అద్దె ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలసి నిద్రించారు. ఇదే అదనుగా భావించిన దుండగులు క్వార్టర్స్‌లోని ఇంటి తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బ్యాగుల్లోని బంగారు, వెండి సామగ్రితో పాటు కొంత మేర నగదు అపహరించారు. శుక్రవారం ఉదయం నూతన గృహంలో పూజాదికాలు చేసేందుకు సిద్ధమై వచ్చిన నాగేంద్ర కుటుంబసభ్యులు చోరీ విషయాన్ని గుర్తించి ఆందోళనకు గురయ్యారు. మొత్తం రూ.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు అపహరించినట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • ●బయటప

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌, బూట్లు, ఇతర సామగ్రి ఏటా ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ఈ పథకంతో భారీగా ప్రజాధనం వృథా అవుతోందని, నాసిరకం కిట్లను పంపిణీ చేస్తున్నారని అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన కిట్‌ను అందజేస్తామని గొప్పలకు పోయారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థులకు అందజేసిన కిట్లలోని డొల్లతనం కాస్త బయటపడింది. విద్యార్థులకు అందజేసిన బ్యాగ్‌లు రెండంటే రెండే రోజుల్లో చిరిగిపోయి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.

    – సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

  • అంతర్

    హిందూపురం టౌన్‌: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక జీఆర్పీ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ధర్మవరం జీఆర్పీ సీఐ అశోక్‌ కుమార్‌, ఎస్‌ఐ సజ్జప్ప, ధర్మవరం ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ రోహిత్‌ గౌడ్‌, హిందూపురం ఎస్‌ఐ సాయినాథరెడ్డి వెల్లడించారు. రైళ్లలో చోటు చేసుకున్న చైన్‌స్నాచింగ్‌లకు సంబంధించి కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం హిందూపురంలోని రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం 2లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒడిశాలోని బారకం గ్రామానికి చెందిన బినోత్‌ నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చైన్‌స్నాచింగ్‌ల అంశం వెలుగు చూసింది. ధర్మరం సర్కిల్‌ పరిధిలోని హిందూపురం ఆర్‌పీఎస్‌లో మూడు కేసులు, ధర్మవరం ఆర్‌పీఎస్‌లో రెండు కేసులు, కదిరి ఆర్‌పీఎస్‌లో ఒక కేసులో నిందితుడిగా గుర్తించి 75 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

    ‘ఆ టీచర్‌ మా కొద్దు’

    ముదిగుబ్బ: మండలంలోని బ్రహ్మదేవరమర్రి గ్రామ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు వి. రోజారాణి తమకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి కేటాయించిన ఉపాధ్యాయురాలు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. సమయపాలన పాటించడం లేదన్నారు. పాఠశాలలోనే నిద్ర పోతుంటారన్నారు. గ్రామస్తులు ప్రశ్నిస్తే మా ఆయన పోలీస్‌, మీపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతోందని వాపోయారు. ఇలాంటి ఉపాధ్యాయులతో తమ పిల్లల విద్యాభివృద్ధి కుంటుపడుతుందని, ఆమెను బదిలీ చేసి, మరో ఉపాధ్యాయుడిని నియమించాలంటూ కోరారు. దీనిపై స్పందించిన ఎంఈఓ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.

    తేలు కుట్టి యువకుడి మృతి

    గుంతకల్లు రూరల్‌: మండలంలోని దంచర్ల గ్రామానికి చెందిన కొట్టం రామాంజనేయులు కుమారుడు శివ (30) తేలు కుట్టడంతో మృతిచెందాడు. వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా ఉన్న శివకు 18 నెలల క్రితం వివాహమైంది. శుక్రవారం పొలం పనులు చేస్తున్న సమయంలో తేలు కుట్టింది. గుర్తించిన బాధితుడు వెంటనే తేలును చంపేశాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు తెలపడంతో వారు గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స అందేలోపు శివ మృతి చెందాడు.

  • అక్కాతమ్ముడిపై దాడి

    రాప్తాడు రూరల్‌: రస్తా విషయంగా చోటు చేసుకున్న వివాదంలో అక్క, తమ్ముడిపై దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. సోములదొడ్డి గ్రామానికి చెందిన కె.నారాయణరెడ్డికి కుమారులు కె.రామసుబ్బారెడ్డి, కె.బ్రహ్మానందరెడ్డి, కుమార్తె కమలమ్మ ఉన్నారు. వీరు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే 22 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. వీరి ఇంటి వెనుక నాగిరెడ్డి, రామలక్ష్మి, మదన్‌మోహన్‌రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. నారాయణరెడ్డికి చెందిన 22 సెంట్ల స్థలంలో నుంచే ఆ ఇళ్లకు దారి ఉందంటూ ఆ కుటుంబాలు కొద్ది రోజులుగా గొడవ చేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఖాళీ స్థలంలో పెరిగిన కంపచెట్లన ు తొలిగించేందుకు నాగిరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి, రామలక్ష్మి, మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు కొడవళ్లు, గొడ్డ్డళ్లతో వెళ్లారు. సమాచారం అందుకున్న నారాయణరెడ్డి కుమారులు రామసుబ్బారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కమలమ్మ వెళ్లి అడ్డుకున్నారు. తమ స్థలంలో ఎందుకు చెట్లు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. ఆ స్థలం తమదంటూ మారణాయుధాలతో నాగిరెడ్డి కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారు. గొడ్డలితో దాడి చేయడంతో కమలమ్మ, బ్రహ్మానందరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. రామసుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంతలో గ్రామస్తులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి పంపారు. గాయాలపాలైన కమలమ్మ, బ్రహ్మానందరెడ్డి, రామసుబ్బారెడ్డిని సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    యూరోప్‌ భక్తుల సంగీత కచేరీ

    ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన యూరప్‌, యూకేలోని సత్యసాయి భక్తులు శుక్రవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత కచేరీ నిర్వహించి అలరించారు. సుమారు గంట పాటు భక్తిగీతాలతో వారు నిర్వహించిన కచేరీ భక్తులు మైమరచిపోయారు.

Sangareddy

  • కార్మ

    జిల్లాలో 25వేల మంది కార్మికులు

    మెదక్‌ కలెక్టరేట్‌: అసంఘటిత కార్మికులకు లేబర్‌కార్డు అండగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వ్యవసాయ ఆధారం లేకపోవడంతో పట్టణాలకు చేరుకుని భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ సరైన కూలీ గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు పట్టణంలోని పేదలు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే ప్రమాదవశాత్తు పనిచేస్తున్న చోట జరగరానిది జరిగి కాలు, చేయి విరగడం, ప్రాణాలుపోతే అతడిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కార్మికుల కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలబడి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లేబర్‌కార్డును అందజేస్తుంది.

    25 వేల మంది కార్మికులు

    జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట మూడు అసిస్టెంట్‌ లేబర్‌ కార్యాలయాలు ఉన్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు 25వేలు మంది ఉండగా, 87,607 మంది ఈ–శ్రమ్‌కార్డులు పొంది ఉన్నారు. అందులో 67,316 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు.

    పెళ్లికి, డెలివరీలకు..

    అసంఘటిత రంగ కార్మికుడు కూతురు పెళ్లికి రూ.30 వేలు, డెలివరీకి రూ.30 వేల చొప్పున రూ.60 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే అసంఘటిత కార్మికురాలి పెళ్లి కానుకగా రూ.30 వేలు, ఒక్కో డెలివరీ కానుకగా రూ.30 వేల చొప్పున రెండు డెలీవరీలకు రూ.60 వేలు ప్రభుత్వం అందజేస్తుంది.

    రూ.6.50 కోట్లు

    భవన నిర్మాణ కార్మికులు రోడ్డు ప్రమాదంలో గాని, పనిచేసే చోట ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు, సాధారణ మరణం సంభవిస్తే రూ.1.30 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు కార్మికుల పెళ్లిళ్లకు, డెలివరీలకు, ప్రమాదంలో గాయపడిన వారికి, మరణించిన వారికి మొత్తం రూ.6.50 కోట్లు ప్రభుత్వం అందజేసింది.

    ఒక్క ఏడాదిలో 256 వరకు..

    డెలివరీ బెనిఫిట్స్‌ 175

    మ్యారేజ్‌ కానుకలు 68

    సాధారణ మరణాలు 9

    యాక్సిడెంటల్‌ మరణాలు 4

    87,607 మందికి ఈ– శ్రమ్‌కార్డులు 67,316 మంది వ్యవసాయ కార్మికులు

    రూ.110 కొండంత అండ

    అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కేవలం రూ.110 చెల్లించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో లేబర్‌కార్డు లభిస్తుంది. అడ్డా కూలీలు, భవన నిర్మాణ కూలీలకు ఈ కార్డు ఆపద సమయంలో కొండంత అండగా నిలుస్తుంది. కూలీలు చేసే పనులన్నీ ప్రమాదాలతో కూడినవే. నిర్మాణ పనులు చేసే సమయంలో ఏదైన ప్రమాదానికి గురైతే ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులు విరగడంతో పాటు ఏదైనా తీవ్ర గాయం జరిగితే ప్రమాద తీవ్రతను బట్టి సుమారు రూ.3 లక్షల వరకు అందజేస్తుంది.

    ప్రాసెసింగ్‌లో 50 దరఖాస్తులు

    జిల్లాలో ప్రస్తుతం మరో 50 వరకు దరఖాస్తులు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పెళ్లిళ్లు, డెలీవరీలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే కార్మికుల అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం.

    – సత్యేంద్రనాథ్‌,

    జిల్లా కార్మికశాఖ ఇన్‌చార్జి

  • ఆరుతడి పంటల సాగుతో లాభాలు

    నర్సాపూర్‌ రూరల్‌: ఆరుతడి పంటల సాగుతో మంచి లాభాలు వస్తాయని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఉదయ్‌, మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు రైతులకు సూచించారు. శుక్రవారం అగ్రికల్చర్‌ విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మూసాపేటలో రైతులకు ఆరుతడి పంటల సాగు, బిందు సేద్యం, డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రయోజనాలను వివరించారు. దీంతోపాటు పంటల సంరక్షణ పాస్పరస్‌ సెల్యూబ్లిజిగ్‌ బ్యాక్టీరియా(పీఎస్‌బీ) గూర్చి వివరించారు. విత్తన శుద్ధి, భూసార పరీక్షల వంటి వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

  • జోరుగ

    అక్రమంగా

    మట్టిని తీసుకువచ్చి

    పోస్తున్న టిప్పర్‌

    అర్ధరాత్రి రిసార్ట్‌లకు తరలింపు

    నంబర్‌ ప్లేట్లు లేని టిప్పర్ల వినియోగం

    ఏడుపాయల టీ జంక్షన్‌ వద్ద తంతు

    పట్టించుకోని అధికారులు

    కొల్చారం(నర్సాపూర్‌): మండలంలోని పోతంశెట్టిపల్లి శివారు ఏడుపాయల వన దుర్గాదేవి సన్నిధికి వెళ్లే రహదారి పొడవున అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, వాటికోసం అవసరమైన మట్టిని తరలించేందుకు అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. తప్పుడు అనుమతుల పత్రాలతో, అర్ధరాత్రి మట్టి రవాణా చేయడం, అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్ఛగా అక్రమంగా మట్టి దందా చేస్తున్నారు. పైగా తాము ‘నాయకులమని‘, మమ్ములను ఎదిరించేవారు ఎవరంటూ.. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు పరిపాటిగా తయారయ్యాయి. అధికారుల అడ్డగోలు అనుమతులతో ఈ దందా కొనసాగుతోందన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

    20 ఎకరాల్లో రిసార్ట్‌కు...

    ఎప్పుడూ నీటితో పారే మంజీరా నదికి పక్కన పచ్చని పంటల పొలాలతో తులతూగుతున్న భూములపై కన్నుపడ్డ కొందరు.. ఇక్కడి రైతులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి పొలాలను లీజుకు తీసుకుని రిసార్ట్‌లు, భవనాలను నిర్మిస్తు న్నారు. ఇప్పటికే ఇక్కడ అనుమతులు లేని నిర్మాణాలు వెలిశాయి. ఇందులో కొన్ని బఫర్‌ జోన్‌ పరిధిలో కూడా ఉన్నాయి. ముడుపులకు ఆశపడ్డ అధికారులు, అటువైపు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మరిన్ని నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం పెద్ద మొత్తంలో మట్టి అవసరం ఏర్పడటంతో అక్రమ మట్టి రవాణా దందా నడుస్తోంది. రింగుగా ఏర్పడ్డ కొందరు పెద్ద మొత్తంలో దందా నిర్వహిస్తున్నారు. తాజాగా 20 ఎకరాల పరిధిలో రిసార్ట్‌ నిర్మాణానికి ’నేను నాయకున్ని, నాకెవరు అడ్డు చెప్పేదని చెప్పుకుంటున్న ఓ అక్రమార్కుడు ఈ మట్టి రవాణాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాపన్నపేట మండలం పరిధి నుంచి అర్ధరాత్రి తప్పుల తడకతో ఉన్న ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా మట్టిని టిప్పర్ల ద్వారా తీసుకెళ్తున్నారు. అనుమతి పత్రంలో చూపించినట్టుగా నంబర్‌ ప్లేటులేని టిప్పర్లను మట్టి రవాణాకు వినియోగించడం, పైగా అర్ధరాత్రి రవాణా చేస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో సర్కారు ఆదాయానికి సైతం గండి కొడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రిసార్ట్‌ ఏర్పాటు, అనుమతుల విషయమై పోతంశెట్టిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుంధతిని వివరణ కోరగా... ఎలాంటి అనుమతులు లేవని ఆమె సమాధానమిచ్చారు.

    కేసులు నమోదు చేస్తాం

    అర్ధరాత్రి మట్టి రవాణా చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా రవాణా చేసే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం.

    – శ్రీనివాస్‌చారి, తహసీల్దార్‌, కొల్చారం

  • ఉపాధ్యాయ పోస్టులకు  దరఖాస్తులు

    బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల పీఓ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజికల్‌ స్టడీస్‌, సోషల్‌ సబ్జెక్ట్‌లను ఇంగ్లిష్‌ మీడియంలో బోధించే ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఈడీతోపాటు టెట్‌ అర్హత సాధించిన వారు అర్హులని, ఈనెల 5 లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

    పేకాట రాయుళ్ల అరెస్టు

    గజ్వేల్‌రూరల్‌: పేకాట స్థావరంపై దాడిచేసి నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని పాత గ్రామపంచాయతీ సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లో కొందరు పేకాటాడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ. 28100 నగదుతో పాటు 4 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

    గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి..

    చేగుంట(తూప్రాన్‌): గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ గోపాల్‌ వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు నాగులమ్మ కాలనీలో జార్ఖండ్‌కు చెందిన అస్మవుల్‌షేక్‌ గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడు ఉంటున్న ఇంటిని తనిఖీ చేసి 160 గ్రాముల గంజాయిని, నిందితుడి ఫోనును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రామాయంపేట ఎస్‌హెచో కార్యాలయంలో అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ బాలయ్య, సిబ్బంది ఎల్లయ్య, చంద్రయ్య, రాజు, నరేశ్‌, హరీశ్‌, రవి, నవీన్‌ పాల్గొన్నారు.

    కత్తితో బెదిరించిన వ్యక్తికి

    మూడేళ్ల జైలు

    రూ.వెయ్యి జరిమాన

    మెదక్‌ మున్సిపాలిటీ: డబ్బులు దోచుకెళ్తూ కత్తితో బెదిరించిన వ్యక్తికి మూడేళ్ల జైలు, జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... 2024లో మెదక్‌ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శేకులు అనే వ్యక్తి నుంచి సిల్వేరి విల్సన్‌ డబ్బులు లాక్కొని వెళ్తుండగా బాధితుడు గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో అక్కడున్న భక్తులు పట్టుకునే ప్రయత్నం చేయగా విల్సన్‌ వారిని కత్తితో బెదిరించినట్లు తెలిపారు. ఈ మేరకు అప్పటి సీఐ కేసు నమోదు చేయగా శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ విల్సన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు విషయంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

    మందుబాబులకు జరిమాన

    సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 51మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,04,500 జరిమానా విధించారు.

  • పార్టీలకు అతీతంగా నిధులిచ్చాం

    సిద్దిపేటజోన్‌: పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సిద్దిపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు అప్పటి మంత్రి హరీశ్‌రావు సహకారంతో సమానంగా నిధులు కేటాయించామని బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్దిపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కనకరాజు, కౌన్సిలర్లు పేర్కొన్నారు. మేము ఇచ్చిందే కానీ, కాంగ్రెస్‌ వచ్చాక ఆ పార్టీ కౌన్సిలర్లు తెచ్చిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీల కౌన్సిలర్లు చేసిన ఆరోపణలను బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు కౌన్సిలర్లు ఏకపక్షంగా ఎజెండా రూపకల్పన చేసినట్టు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భార్యల పదవులను అడ్డం పెట్టుకుని భర్తలు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ.20 కోట్ల మేర అభివృద్ధి పనుల నిధులను ఆపివేసిందని ఆరోపించారు. సిద్దిపేటకు ఆపిన నిధులను గూర్చి మంత్రులను అడిగే ధైర్యం లేని నాయకులు విమర్శలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్‌డీఎఫ్‌) కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు ఉన్న ఐదు వార్డులకు మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. కలెక్టర్‌ స్పందించి అన్ని వార్డులకు ప్రభుత్వ నిధులు వచ్చేలా చూడాలన్నారు. అధికారం ఉందని, తమ వార్డులకు మాత్రమే నిధులను మంజూరు చేయడం సరికాదన్నారు. స్మార్ట్‌ సిటీ పథకం కింద ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్ని వార్డుల్లో అభివృద్ధి చేశారని, ప్రస్తుతం 90శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగతా 10 శాతం పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు లక్ష్మణ్‌, ప్రవీణ్‌, సుందర్‌, యోగి, నాగరాజురెడ్డి, మల్లికార్జున్‌, అరవింద్‌ రెడ్డి, సాయికుమార్‌,సతీశ్‌, కోఆప్షన్‌ సభ్యులు షాహిద్‌, సత్తయ్య, నాయకులు తిరుమల్‌ రెడ్డి, అక్తర్‌, మోహిజ్‌, రాజేశం, రాజు, శ్రీహరి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

    మీరేం తీసుకొచ్చారు?

    రూ.20 కోట్ల నిధులు ఆపేసిన కాంగ్రెస్‌

    ఆ పార్టీ నేతలవి

    అవగాహనలేని వ్యాఖ్యలు

    మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్ల ధ్వజం

  • ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి..

    కంది(సంగారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కౌలంపేటలో చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్సై రవీందర్‌ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జగన్మోహన్‌ (42) గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఊదం చెరువుకట్ట వద్దకు వెళ్లాడు. అక్కడే మద్యం తాగిన అతడు ప్రమాదవశాత్తు చెరువులోకి జారి పడ్డాడు. శుక్రవారం గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    బావిలో పడి కూలీ..

    కంగ్టి(నారాయణఖేడ్‌): కూలీ పనికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తుర్కవడ్‌గాం గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కిందిదొడ్డి సోపాన్‌(37) గురువారం స్థానిక రైతు శెట్కార్‌ ఏశప్పకు చెందిన పత్తి చేనులో కిందిదొడ్డి శంకర్‌, తులసీరాంతో కలిసి రసాయనాల పిచికారీకి నీరు మోసేందుకు మద్యం తాగి వెళ్లాడు. సమీపంలోని బావిలో నుంచి నీరు మోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. కాగా గమనించిన తోటి కూలీలు బావిలోని నీటిని మోటారు సాయంతో బయటకు తోడగా శుక్రవారం ఉదయం బావిలో మృతదేహం లభించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సిద్ధ దుర్గారెడ్డి తెలిపారు.

    అనారోగ్యంతో బీహార్‌ వాసి..

    పటాన్‌చెరు టౌన్‌: పడుకున్న చోటే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బీహార్‌కి చెందిన మురళి కుమార్‌ (32) బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారంలో ఉంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో పడుకున్న అతడు శుక్రవారం ఉదయం నిద్రలేవలేదు. దీంతో తోటి కార్మికులు, స్థానికులు మురళిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    బైక్‌పైనుంచి కిందపడి..

    కౌడిపల్లి(నర్సాపూర్‌): బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన మేకలకాడి నాగరాజు(37) గురువారం సాయంత్రం కౌడిపల్లిలో అంగడికి వెల్లి కూరగాయలు తీసుకువస్తానని ఇంట్లో చెప్పి తన బైక్‌పై వెళ్లాడు. రాత్రి తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతుండగా మండలంలోని ధర్మసాగర్‌ శివారులో రోడ్డుపై బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి

    దుబ్బాక: హోటళ్లలో నాణ్యతలేని ఆహారపదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌ జయరాం హెచ్చరించారు. దుబ్బాక పట్టణంలోని ఉడిపి శ్రీకృష్ణ హోటల్‌లో టిఫిన్‌ చేస్తుండగా సాంబార్‌లో పురుగులు రావడంతో గురువారం బాధితులు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విధితమే. ఈ విషయం తెలుసుకున్న ఫుడ్‌సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌ జయరాం శుక్రవారం ఉడిపి హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ వాడుతున్న ఆయిల్‌, పప్పు దినుసులు, కారంపొడి శాంపిల్స్‌ను సేకరించారు. అలాగే ప్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తొలగించారు. ఈ సందర్భంగా హోటల్‌ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించిన శాంపిల్స్‌ పరీక్షల ఫలితం వచ్చాక తగు చర్యలు తీసుకుంటామన్నారు. హోటళ్లలో నాణ్యతలేని ఆహారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని సూచించారు.

    రూ.5 వేల జరిమానా..

    ఉడిపి హోటల్‌లో వంటగదితో పాటు పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటంతో మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఆస రాజశేఖర్‌ యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు.

    జిల్లా ఫుడ్‌ సేప్టీ ఇన్‌స్పెక్టర్‌ జయరాం

    ఉడిపి శ్రీకృష్ణ హోటల్‌కు

    రూ.5 వేలు జరిమానా

  • బలవంతపు భూసేకరణ వద్దు

    కొండాపూర్‌(సంగారెడ్డి): పరిశ్రమల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం పేర్కొన్నారు. శుక్రవారం సీపీఎం నాయకులు మండల పరిధిలోని మాందాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ... గ్రామంలో గల సర్వే నం.22లో సుమారు 300 ఎకరాల భూమిని దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. అలాంటి రైతుల భూమిని ప్రభుత్వం బడా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని, ఒక వేళ భూములు ఇవ్వాల్సి వస్తే 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూమి కోల్పోయిన రైతుల ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి, వారి ఒప్పందంతో భూములు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వృద్ద్ధాప్య, వితంతు పెన్షన్‌లు రూ.4016, వికలాంగుల పెన్షన్‌ రూ.6016 ఇస్తామని వాగ్దానాలు చేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య మండల కమిటీ సభ్యులు బాబురావు, శాఖ కార్యదర్శి సుధాకర్‌, అమృతమ్మ, రమేశ్‌, సంజీవులు, మాజీ సర్పంచ్‌ శ్రీశైలం, విక్రం, రైతులు పాల్గొన్నారు.

    సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం

  • బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి

    సిద్దిపేటఅర్బన్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్‌ చేశారు. ఆ తరువాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల పరిపాలన స్తంభించిపోయిందని, సమస్యలు పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశంలో అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి తలుపులు బార్లా తెరిచారని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 25 శాతం టారిఫ్‌ను పెంచి దేశంపై సుంకాలు విధిస్తుంటే ప్రధాని నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అసహానానికి గురికాకముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్‌, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్‌, యాదగిరి, అరుణ్‌కుమార్‌, బాలనర్సయ్య, శ్రీనివాస్‌, నవీన, శారద, కృష్ణారెడ్డి, శిరీష, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

    సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు

    చుక్క రాములు

  • మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

    జహీరాబాద్‌ టౌన్‌: మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మొగుడంపల్లి మండలం పర్వతాపూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ.రాజేందర్‌రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఇజ్రాయిల్‌(42) సెంట్రింగ్‌ కూలీ పనులకు వెళ్తూ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. మూడు రోజుల క్రితం భార్యతో గొడవపడి ఇంటికి నిప్పంటించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    బాలిక అదృశ్యం

    కల్హేర్‌(నారాయణఖేడ్‌): ఇంటి నుంచి వెళ్లిన బాలిక అదృశ్యమైంది. కల్హేర్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం బ్రహ్మణపల్లికి చెందిన దుర్గ భవాని కల్హేర్‌లోని మేనమామ రమేశ్‌ వద్ద ఉంటోంది. గురువారం సాయంత్రం ఇంటి నంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Yadadri

  • చూసొద్దాం.. రండి

    నాగార్జునసాగర్‌ నుంచి ఏపీలోని మాచర్లకు వెళ్లే దారిలో 14 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతం ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం వద్ద 70 అడుగుల పైనుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. ఈ జలపాతం చూసేందుకు టిక్కెట్‌ ధర పెద్దలకు రూ.30 కాగా పిల్లలకు రూ.20. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం రాత్రి బస చేసేందుకు 8 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి.

    ప్రపంచ పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌

    చరిత్రకు సజీవ సాక్ష్యంగా

    నిలిచే నందికొండ, బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం

    చెప్పలేని అనుభూతిని మిగిల్చే

    లాంచీ విహారం

    గత ఆనవాళ్లకు

    చిరునామా అనుపు

    హిల్‌కాలనీకి 15 కిలోమీటర్ల దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ అలనాటి నాగార్జున విశ్వవిద్యాయం, ఇక్ష్వాకుల యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణా నది లోయలో లభించిన రంగనాథస్వామి ఆలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణా నది తీరంలో నిర్మించడం విశేషం. తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

    మనసు దోచే

    ఎత్తిపోతల

  • ఆండాళ్‌ అమ్మవారికి  ఊంజలి సేవ

    యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారికి శుక్రవారం ఊంజలి సేవను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. ఇక ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగాయి.

    బైక్‌ అదుపుతప్పి

    యువకుడి మృతి

    మరో ఇద్దరికి గాయాలు

    డిండి: బైక్‌ అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో జరిగింది. శుక్రవారం ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన లక్కు విజయభాస్కర్‌రెడ్డి(18), ఎం. సిద్దార్ధరెడ్డి, ప్రకాష్‌రెడ్డి గురువారం శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకుని రాత్రి బైక్‌పై ముగ్గురు కలిసి నాగార్జునసాగర్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో డిండి మండలం బొల్లనపల్లి గ్రామ స్టేజీ సమీపంలో వీరి బైక్‌ అదుపుతప్పడంతో మధ్యలో కూర్చున్న విజయభాస్కర్‌రెడ్డి రోడ్డుపై పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన సిద్దార్ధరెడ్డి, ప్రకాష్‌రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలించారు. శుక్రవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం విజయభాస్కర్‌రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొనిఽ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

  • దుకాణాల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

    మహిళకు తీవ్ర గాయాలు

    ఆలేరు: డ్రైవర్‌ మద్యం మత్తులో ట్రాక్టర్‌ నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలేరు పట్టణంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ వినయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని పెద్దవాగు నుంచి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక తరలించేందుకు జూకంటి సంపత్‌ ట్రాక్టర్‌కు తహసీల్దార్‌ ఆంజనేయులు పర్మిషన్‌ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం డ్రైవర్‌ కమల్‌హాసన్‌ వాగు వద్ద ట్రాక్టర్‌లో ఇసుక లోడ్‌ చేసుకుని కనకదుర్గ గుడి మార్గంలో ఆర్టీసీ బస్టాండ్‌ వైపు వెళ్తున్నాడు. ఆర్‌కే సినిమా థియేటర్‌ వెళ్లే దారి సమీపంలోకి రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ ఉడెన్‌ ఫర్నీచర్‌ వర్క్స్‌షాప్‌ పైకి దూసుకెళ్లింది. దీంతో షాపులోని వర్కర్లు బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో బస్టాండ్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్న కొలనుపాకకు చెందిన వల్లెపు రాజమణిని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫర్నీచర్‌ షాపు ఎదుట పార్కింగ్‌ చేసిన స్కూటీ నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. డ్రైవర్‌ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ తెలిపారు. ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి, డ్రైవర్‌ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అయితే ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రాంగ్‌రూట్‌లో ఎదురుగా రావడంతో అతడిని తప్పించే క్రమంలోనే ట్రాక్టర్‌ దుకాణాల పైకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

  • పచ్చం

    సాగర్‌ జలాశయ తీరంలో నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌, సాగర్‌–నల్లగొండ రహదారుల (సమ్మక్క–సారక్కల) వెంట రూ.1.5కోట్లతో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ వన్యప్రాణుల అటవీ కోర్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్కు పచ్చందాలను ఆరబోస్తోంది. 980 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్కు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలోని గుట్టల మధ్యన సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ అందాలను తిలకించేందుకు నెల్లికల్లు అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్‌ ఏర్పాటు చేశారు. అటవీ అందాలను వీక్షించేందుకు రెండు రకాల సఫారీ వాహనాలను ఏర్పాటు చేశారు. వాహనంలో 10 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1,000, 24 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1500 వసూలు చేస్తున్నారు. సిబ్బంది కొరత మూలంగా పర్యాటకులు అడిగితేనే సఫారీ వాహనాలను నడుపుతున్నారు.

  •  ఆతిథ్యమిస్తున్న హోటళ్లు

    నాగార్జునసాగర్‌లో పర్యాటకులకు అనుగుణంగా హోటళ్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో హోటల్‌ బిజినెస్‌ కూడా పెరిగింది. హిల్‌కాలనీలో విజయ్‌విహార్‌లో నడుస్తున్న హోటల్‌లో దేశ, విదేశీయులు తినే పలురకాల వంటకాలు లభ్యమవుతున్నాయి. అలాగే బుద్ధవనంలో సిద్థార్థ హోటల్‌, మనోరమ హోటల్‌, పైలాన్‌కాలనీలో ఇటీవల ఏర్పాటైన టైగర్‌ వ్యాలీ హోటళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొత్త బ్రిడ్జి అవతలి వైపున ఉన్న మాతా సరోవర్‌, రైట్‌ బ్యాంకులో మాతా సరోవర్‌ హోటళ్లు వెలిశాయి. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో హిల్‌కాలనీలో విజయ్‌విహార్‌ హోటల్‌లో 34 గదులు ఉన్నాయి. ముందస్తుగా ఆన్‌లైన్‌లో టీడీటీజీసీ.ఇన్‌ సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవాలి. వివరాలకు 08680–277362 నంబర్‌ను సంప్రందించాలి.

Medak

  • చినుక

    రామాయంపేట(మెదక్‌): రామాయంపేట పట్టణ ంలో మోస్తారు వర్షం కురిసిందంటే చాలు ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. ఏకంగా అక్కల బస్తీలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశిస్తుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పట్టణంలో గతంలో ఎప్పుడో నిర్మించిన రహదారులు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై యథేచ్ఛగా వదర నీరు రోడ్డుపై పారుతుంది. ఏ రోడ్డుపై ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు భయం, భయంగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

    ప్రధాన రహదారి జలమయం

    ఇటీవల కురిసిన వర్షాలకు సిద్దిపేట ప్రధాన రహదారిపై పెద్దఎత్తున వరద నీరు ప్రవహించింది. రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై కింద పడిన సంఘటనలు ఉన్నాయి. మున్సిపల్‌ సిబ్బంది రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను తొలగించినా, మళ్లీ వర్షం కురవడంతో రోడ్డుపై ఇసుక చేరింది. చిన్నపాటి వర్షం కురిసినా వరద నీరు నిలిచి ప్రయాణాలకు ఆటంకంగా మారుతుంది. డివైడర్‌ నిర్మించిన అధికారులు రోడ్డు మరమ్మతుల విషయమై పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. అలాగే మోస్తారు వర్షం కురిసినా పట్టణంలోని 11వ వార్డు అక్కల బస్తీలో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఏటా తమకు ఈ ఇబ్బందులు తప్పడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దఎత్తున వరద నీరు ఇళ్లలోకి చేరిందని, ఇళ్లలో ఉన్న దుస్తులు, నిత్యావవసర సరుకులు సైతం తడిసిపోయాయని వాపోయారు.

    పేటలో ముంపు ముప్పు తప్పేనా..?

    శాశ్వత చర్యలకు పడని ముందడుగు

    ఇళ్లలోకి చేరుతున్న వర్షం నీరు

    పట్టించుకోని అధికారులు

    ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు

    చర్యలు చేపడుతున్నాం

    వర్షాలు పడితే రహదారులపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాం. ఇటీవల తారు రోడ్డుపై భారీ వర్షం మూలంగా ఇసుక మేట వేయగా, పూర్తిగా తొలగించాం. అక్కల గల్లీలో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటాం.

    – దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌

  • మాకొద్దు.. జీపీఓ!

    పాత సర్వీస్‌ పోతుందని..

    త ప్రభుత్వం రెవెన్యూశాఖ నుంచి 562 మంది వీఆర్‌ఓలను తప్పించి వివిధ శాఖల్లోకి పంపింది. అయితే పని చేసిన సర్వీస్‌ను ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలో కలపాలని అప్పట్లో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు ఆందోళన చేసి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఐదేళ్లుగా కోర్టులో కొనసాగుతుంది. కాగా ప్రస్తుతం మళ్లీ ఈ శాఖను వదిలి గ్రామ పాలనాధికారి (జీపీఓ)గా చేరితే పాత సర్వీస్‌ పోతుందని, ఇప్పటికే రెవెన్యూలో ఒక్కొక్కరం రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తించామని, ఆ సర్వీస్‌ పోతే తీరని నష్టం జరుగుతుందని, అందుకే జీపీఓగా రావడానికి ఇష్టపడటం లేదని పలువురు వీఆర్‌ఓలు పేర్కొన్నారు.

    పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏల అనాసక్తి

    రెండుసార్లు నోటిఫికేషన్‌ ఇచ్చినా స్పందన కరువు

    పరీక్షకు హాజరైంది కేవలం142 మంది మాత్రమే

    మెదక్‌జోన్‌: గ్రామ పాలన అధికారి (జీపీఓ)గా పనిచేసేందుకు పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు అనాసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించినా వెనుకంజ వేశారు. జీపీఓలుగా చేరితే పాత సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోకపోవటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఫలితంగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

    జిల్లాలో 392 రెవెన్యూ గ్రామాలు

    జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయతీలు ఉండగా, 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో 562 మంది వీఆర్‌ఓలుగా జిల్లాలో విధులు నిర్వర్తించారు. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను తొలగించి వారిని వివిధ శాఖల్లోకి పంపింది. 2023లో అధికారంలోకి వచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు పూర్వవైభవం తెస్తామని, గ్రామానికో జీపీఓను నియమించి భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పేర్కొంది. గతంలో వీఆర్‌ఓలుగా పనిచేసిన వారు తిరిగి రావాలని కోరింది. అందుకోసం రెండుసార్లు రాత పరీక్షలు నిర్వహించింది. అయితే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదటిసారి జిల్లావ్యాప్తంగా 104 మంది దరఖాస్తు చేసినా, పరీక్షకు 79 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో ఉత్తీర్ణత సాధించింది 47 మంది మాత్రమే. రెండోసారి జూలై 27న పరీక్ష నిర్వహించగా, 73 మంది దరఖాస్తు చేశారు. పరీక్ష రాసింది మాత్రం 63 మంది మాత్రమే. ఈ ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. గతంలో జిల్లాలో సుమారు 562 మంది వీఆర్‌ఓలుగా విధులు నిర్వర్తించారు. వారు ప్రస్తుతం జీపీఓలుగా రావటానికి ఆసక్తి చూపటం లేదు.

  • నిబంధ

    చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, లేకపోతే బిల్లులు రావని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం చౌహాన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. చిలప్‌చెడ్‌లో 54 ఇళ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 15 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన పలువురికి రెండు విడతల బిల్లులు సైతం వచ్చాయన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి పనులు ప్రారంభించకపోతే మంజూరు పత్రాలు వెనక్కి తీసుకుంటామన్నారు. అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించేవారికి సైతం అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు ఉన్నారు.

    దరఖాస్తుల ఆహ్వానం

    చేగుంట(తూప్రాన్‌): పాలిటెక్నిక్‌లో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని 11 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 135 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. చేగుంట పాలిటెక్నిక్‌లో 9 పోస్టులు ఖాళీగా ఉండగా, టెక్నికల్‌ పోస్టులకు ఎంటెక్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

    విద్యారంగ సమస్యలు

    పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

    మెదక్‌ కలెక్టరేట్‌: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర కిరణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మెదక్‌లో నిర్వహించిన విద్యార్థి అధ్యయన యాత్రలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 5 వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా నర్సాపూర్‌లోని పీజీ కళాశాలకు సొంత భవనం, మెదక్‌కు ఇంజనీరింగ్‌, పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. తూప్రాన్‌, పెద్దశంకరంపేటలలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలు తక్షణమే పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు నవీన్‌, అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    హెచ్‌పీఎస్‌లో ఖాళీ సీట్లు

    మెదక్‌ కలెక్టరేట్‌: రామంతాపూర్‌, బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు విజయలక్ష్మి, నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1వ తరగతి ఇంగ్లీష్‌ మీడియంలో ఎస్సీ విద్యార్థులకు ఒక సీటు ఖాళీగా ఉండగా, ఎస్టీ విద్యార్థులకు ఆరు సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు కలెక్టరేట్‌లోని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కార్యాలయాల్లో లభిస్తాయని సూచించారు.

    నానో యూరియాతో

    అధిక దిగుబడి

    కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులు నానో ద్రవరూప ఎరువులు వాడటం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చని డీఏఓ దేవ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని తునికి వద్దగా రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్‌ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు నానో ఎరువులను తరలించడం సైతం సులభంగా ఉంటుందని చెప్పారు. అనంతరం కేవీకే హెడ్‌ అండ్‌ సైంటిస్ట్‌ శంభాజీ దత్తాత్రేయ నల్కర్‌ మాట్లాడుతూ పంట మార్పిడి చేయాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా తగిన మోతాదులో ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రాజ్‌నారాయణ, కోరామండల్‌ ప్రతినిధి రోషన్‌, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

  • జనహితకు జేజేలు

    వట్‌పల్లి(అందోల్‌): కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఆ పార్టీ కార్యకర్తలు కదంతొక్కారు. ఆందోల్‌ మండలంలోని సంగుపేట చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. మంత్రులు, దామోదర రాజనర్సింహ, వివేక్‌, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్న ఈ పాదయాత్రలో ఆద్యంతం కార్యకర్తలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించారు. పాదయాత్ర సందర్భంగా ‘జై కాంగ్రెస్‌ .. జై సోనియా, జై రాహుల్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దారి పొడవునా వారి పాదయాత్రకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భారీ సైజుల్లో ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.

    ప్రజాహితమే మా ధ్యేయం: దామోదర

    ప్రజాహితమే తమ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అధ్యక్షతన జోగిపేటలోని హనుమాన్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సోనియా గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు.

    బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు

    కట్టుబడి ఉన్నాం: పొన్నం

    మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమకు అప్పగించిందని విమర్శించారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించి రైతుల ఇళ్లల్లో పండగ వాతావరణం కల్పించిందని చెప్పారు. సన్న వడ్లకు బోనస్‌ అందించామని, రేషన్‌కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.

    వచ్చే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు: వివేక్‌

    కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో వివరించాలన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో డబుల్‌బెడ్‌రూంలు అందజేయలేదని కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్క వాగ్దానాన్ని పూర్తిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాబోయే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు.

    కాంగ్రెస్‌ పాదయాత్రకు అనూహ్య స్పందన

    ఆద్యంతం ఉత్సాహంగా.. ఉల్లాసంగా..

    దారిపొడవునా హోరెత్తిన నినాదాలు

  • రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ

    కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

    వెల్దుర్తి(తూప్రాన్‌)/చిన్నశంకరంపేట(మెదక్‌)/నర్సాపూర్‌: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో నూతనంగా మంజూరైన రేషన్‌ కార్డులను ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి ఆయా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 9,964 కుటుంబాలకు నూతన రేషన్‌కార్డులు అందజేశామని తెలిపారు.మహిళా సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ.. రేషన్‌కార్డు ప్రతి కుటుంబానికి అవసరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికమని, దానిని దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా మండలంలో విద్యార్థులకు రవాణా వ్యవస్థను మెరుగు పరచాలన్నారు. నిబంధనలు పెట్టకుండా అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో తూప్రాన్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేటలోని అగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించినా లైసెన్స్‌లు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే నర్సాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో కాటేజీలను పరిశీలించారు. నెలాఖరులోగా పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

  • అవగాహన, అప్రమత్తతే కీలకం
    ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

    మెదక్‌ మున్సిపాలిటీ: సైబర్‌ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్‌ అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో సైబర్‌ వారియర్స్‌కు సైబర్‌ క్రైం, నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలను నిరోధించేందుకు ప్రతి పోలీస్‌ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి కేసును సీరియస్‌గా తీసుకొని బాధితులకు తక్షణ న్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్స్‌ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎవరైనా సైబర్‌ నేరానికి గురైతే వెంటనే గోల్డెన్‌ అవర్‌లో సంప్రదిస్తే డబ్బులను తిరిగి తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు పూర్తి అవగాహన, అప్రమత్తతతో ఉండాలని సూచించారు. అనంతరం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్‌ నుంచి వచ్చిన టీషర్ట్స్‌ను సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్సీ మహేందర్‌, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • నాణ్యమైన బోధన అందించాలి
    డీఈఓ రాధాకిషన్‌

    చిన్నశంకరంపేట(మెదక్‌): విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి డీఈఓ రాధాకిషన్‌ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని మడూర్‌ జెడ్పీ పాఠశాలలో తెలుగు పండిత్‌లకు నిర్వహించిన కాంప్లెక్స్‌ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు బోధన విషయంలో నైపుణ్యతను చాటి చెప్పాలన్నారు. తెలుగు ఉపాధ్యాయులకు ఉన్న ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవాలన్నారు. పాఠ్యంశాలతో పాటు నీతి, ప్రేరణ కల్గించే కథలను విద్యార్థులకు చెప్పాలన్నారు. ప్రభుత్వం అందించిన డిజిటల్‌ బోర్డును ఉపయోగించుకోవా లని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ప్రతిభను పరిశీలించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక తో ముందుకు సాగాలని సూచించారు. ఆయన వెంట కాంప్లెక్స్‌ హెచ్‌ఎం రవీందర్‌రెడ్డి ఉన్నారు.

  • కార్పొరేట్‌కు దీటుగా  సంక్షేమ హాస్టళ్లు

    పాపన్నపేట(మెదక్‌): సంక్షేమ హాస్టళ్లు కార్పొరేట్‌కు దీటుగా ఉండాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన కొత్తపల్లి ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ముందుగా విద్యార్థులతో మమేకమై వారి సా మ ర్థ్యాలను పరిశీలించారు. వసతి సౌకర్యా లు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని స్వయంగా అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచిగా చదువుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

West Godavari

  • పెట్రోల్‌లో నీరు కలిసిందంటూ..

    తణుకు అర్బన్‌ : ద్విచక్ర వాహనంలో పెట్రోలు పో యించుకుంటే ట్యాంకు నుంచి నీళ్లు బయటపడ్డా యంటూ బాఽధితులు పెట్రోలు బంక్‌ వద్ద ధర్నా చే శారు. తణుకుకు చెందిన ఫణి, శంకర్‌ అనే యు వకులు శుక్రవారం స్థానిక హెచ్‌పీసీఎల్‌కు చెందిన తుమ్మలపల్లి పాపారావు బంకు వద్ద తమ వాహనంలో రూ.60లు పెట్రోలు పోయించుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే వాహనం మోరాయించడంతో తిరి గి బంకులోకి వచ్చి యజమానితో మాట్లాడి వా హనం ట్యాంకులోని పెట్రోల్‌ను బయటకు తీయించగా పెట్రోల్‌తోపాటు నీరు బయటపడటంతో అ వాక్కయ్యారు. దీంతో పాతవూరుకు చెందిన యువకులు భారీ సంఖ్యలో బంకు వద్దకు చేరి నిరసన తెలిపారు. పట్టణ ఎస్సై శ్రీనివాస్‌ వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. వాహనంలోని పెట్రోల్‌ ట్యాంకు నుంచి పెట్రోల్‌ బయటకు తీయిస్తే సగానికి పైగా నీరు వచ్చిందని, దీనిపై అడిగితే బంకు యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు అన్నారు. దీంతో ఆందోళనకు దిగినట్టు యువకులు చెప్పారు. విషయం తెలిసి డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీదేవి బంకు వద్దకు వచ్చి పరీక్షలు జరిపారు. బంకులో నిల్వ ఉన్న పెట్రోల్‌లో ఎలాంటి నీటి ఆనవాళ్లు లేవని, డెన్సిటీ పరీక్షలతో పాటు సాంకేతిక పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు.

  • ఎస్సీ వర్గీకరణపై మండిపాటు

    భీమవరం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భీమవరం అంబేడ్కర్‌ సెంటర్‌లో శుక్రవారం మాల సంఘాల జేఏసీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాలలు అన్ని రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. జాతీయ కన్వీనర్‌ చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ మాలలకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్‌ గంటా సుందరకుమార్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 3న కుప్పం నుంచి మాల సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, దీనిని మాల సంఘాల నాయకులు, సభ్యులు విజయవంతం చేయాలని కో రారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్‌, సోడదాసి జయపాల్‌, కొండేటి లాజర్‌, వర్ధనపు మోషే, పెట్టెం శుభాకర్‌, కర్ని జోగయ్య, ఉన్నమట్ల శామ్యూల్‌రాజ్‌, పరువు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

  • ఆలస్య

    చింతలపూడి: ఇటీవల వరి సాగులో ఖర్చులు బాగా పెరిగాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఏటా సకాలంలో వరినాట్లు పడటం లేదు. పోసిన నారు ముదిరిపోవడం, లేదా నారు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు ఖర్చును తగ్గించుకుని, కూలీల సమస్యను అధిగమించేందుకు దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తే పద్ధతిని ఆచరించడం మేలని చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకుడు వై సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో 18,384 హెక్టార్లల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో చింతలపూడి మండలంలో అత్యధికంగా 7,603 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 3,072 హెక్టార్లు, కామవరపుకోట మండలంలో 2,457 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 5,252 హెక్టారుల్లో వరి పంటను సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 50 శాతం నాట్లు మాత్రమే పూర్తయ్యాయి.

    రైతుకు లాభం

    దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తడం వల్ల నారు పోయడం, నారు తీత, నాట్లు వేసే పని ఉండదు. ఈ విధానం వల్ల ఎకరాకు రైతులకు సుమారు రూ.3,500 రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఎకరాకు 15–20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. మొక్కల మధ్య సాంద్రత ఉండటంతో ఎకరాకు 15 శాతం దిగుబడి పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో నాటుకోవడం మాత్రమేకాక , వారం పది రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది.

    సాగులో మెలకువలు

    సాధారణంగా అన్ని రకాల నేలల్లో దమ్ము చేసి వరివిత్తే పద్ధతిని అవలంభించవచ్చు. చౌడు, ఆమ్ల, క్షార నేలలు మాత్రం ఈ విధానానికి అనుకూలం కావు. రకాన్ని బట్టి ఎకరాకు 10 నుండి 15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరిసాగు ఆలస్యమయ్యే పరిస్ధితుల్లో స్వల్పకాలిక వరి విత్తనాలను ఎంచుకోవడం మేలు. విత్తనాలను 24 గంటలు నానబెట్టి, మరో 24 గంటలు మండెకట్టి దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం కాని, డ్రమ్ము సీడర్‌తో కాని విత్తుకోవాలి.

    డ్రమ్‌ సీడర్‌తో

    డ్రమ్‌ సీడర్‌తో లాగితే ఒకేసారి 8 వరుసల్లో విత్తనాలు పడతాయి. సాళ్ళ మధ్య 20 సెం.మీ, మొక్కల మధ్య 5–8 సెం.మీ ఎడంగా గింజలు పడతాయి. ప్రతి 16 వరసలకు ఒక అడుగు కాలిబాట వదలాలి. ఇద్దరు కూలీలు రెండు గంటల్లో ఎకరా విత్తనాలను విత్తవచ్చు.

    ఎరువుల వాడకం

    సాధారణ వరికి సిఫార్సు చేసిన విధంగానే దీనికి కూడ ఎరువుల వాడకం చేపట్టాలి. దమ్ములో మాత్రం నత్రజని ఎరువులు వేయకూడదు. వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. భాస్వరం, అర వంతు పొటాష్‌ను దమ్ములో వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసుకుని విత్తిన 15–20, 40–45, 60–65 రోజులకు వేయాలి. మిగిలిన సగభాగం పొటాష్‌ 60–65 రోజులకు నత్రజనితో పాటు వేసుకోవచ్చు.

    నీటి వాడకం

    విత్తిన దగ్గర నుండి పొట్ట దశ వచ్చే వరకు బురదగా ఉంచి పొట్టదశ నుంచి పంట కోత పది రోజుల ముందు వరకు పొలంలో 2 సెంమీ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వేరు వ్యవస్ధ బాగా బలపడి పిలకలు బాగా వస్తాయి.

    కలుపు నివారణ

    కలుపు నివారణకు ఎకరాకు 35 గ్రాముల ఆక్సా డయార్జిల్‌ లేదా 400 మిల్లీ.లీ ప్రిటిక్లాక్లోర్‌ లేదా 100 గ్రా పైరజో సల్ఫ్యూరాన్‌ మందును 20 కిలోల పొడి ఇసుకతో కలిపి విత్తిన 3–5 రోజుల మధ్య పొలంలో పలుచగా నీరుంచి చల్లాలి. విత్తిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య అధికంగా ఉంటే ఎకరాకు 80–100 మి.లీ బిస్‌ఫైరిబాక్‌ సోడియం, ఊద ఎక్కువగా ఉంటే 300–400 మి.లీ సైహలోఫాప్‌ బ్యూలైట్‌ను, వెడల్పాటి ఆకు ఎక్కువగా ఉంటే 4డి సోడియం లవణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

    వై.సుబ్బారావు, చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకులు

  • వర్షా

    బుట్టాయగూడెం: వర్షాకాలంలో గ్రామాల్లో ఎక్కువగా ఖాళీ స్థలాలు, బీడు భూముల్లో పచ్చని గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. పశువులు బీడు భూములు, ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మేతకు వెళ్ళినప్పుడు పశువుల పాక చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో గడ్డి ఎక్కువగా పెరుగుతుంది. ఈ సమయంలో వర్షాల కారణంగా పచ్చని గడ్డిలో విషసర్పాలు ఉండి పశువులను కాటు వేసే ప్రమాదం ఉంది. పాడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీలుగుమిల్లి పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్‌ మల్లంపల్లి సాయిబుచ్చారావు సూచించారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముకాటు నుంచి పశువులను కాపాడుకోవచ్చన్నారు.

    రక్తపింజర

    పశవులను రక్తపింజర కాటువేస్తే హీమోటాక్సిన్‌ విడుదలై రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో పశువు నోరు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. పాము కాటు వేసినచోట వాపు వచ్చి చర్మం రంగు మారుతుంది. మూత్రం ఎరుపురంగులోకి వస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే 10 గంటలలోపు పశువులు మృత్యువాత పడతాయి.

    తాచు, కట్ల పాములు

    తాచు, కట్లపాములు పశువులను కాటు వేసినప్పుడు న్యూరోటాక్సిన్‌ వాటి శరీరంలోకి వెళ్ళి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితో శ్వాస వ్యవస్థ స్థంభిస్తుంది. నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్తాయి. సరైన సమయంలో చికిత్స అందించకపోతే పశువు మృతి చెందుతుంది.

    విషరహిత పాముల్లో కాటు లక్షణాలు

    విషరహిత పాములు కాటు వేసినప్పుడు రెండు వరుస పళ్లు ముద్రలు ఉంటాయి. గాయాలు చిన్నగా ఉంటాయి. ఎక్కువగా పలుచని రేఖల వంటి ముద్రలుగా ఉంటాయి. కొద్దిగా రక్తం కారవచ్చు. కానీ ఇది ప్రమాదమైన స్థాయిలో ఉండదు.

    విషపూరిత పాము లక్షణాలు

    విషపూరిత జాతి పాములు కాటు వేసిన చోట ఉబ్బినట్టు, గాయంలా కనిపిస్తుంది. పశువు తినకుండా నీరసంగా ఉంటుంది. అదుపు తప్పడం(పిచ్చెక్కినట్టుగా అటూ ఇటూ తిరగడం), నోట్లో నురగరావడం, వేగంగా గుండె చప్పుడు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, పొట్ట ఉబ్బడం, కింద పడి కాళ్లు కొట్టుకోవడం వంటివి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 5 గంటల్లోపు కాటుకు గురైన పశువులు మృతి చెందుతాయి.

    వైద్యుల సూచనలు

    ● పాముకాటుకు గురైన పశువులను బయటకు పంపించవద్దు. ఎక్కువగా నడిపించకూడదు. కదలకుండా ఉండాలి.

    ● కాటు వేసిన ప్రాంతానికి పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఇది పాము విషాన్ని నరాల ద్వారా వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. 15 నిముషాలకు ఒకసారి నిమిషం పాటు విరమించాలి. లేదంటే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

    ● కాటు వేసిన చోట కడగవద్దు. కట్టు తియ్యొద్దు. ఇలా చేస్తే విషం వ్యాప్తి పెరుగుతుంది.

    ● పశువులను బాగా గాలి తగిలేటట్టు నీడలో ఉంచాలి.

    ● వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి పశువులను కాపాడుకోవచ్చు.

    సకాలంలో చికిత్స అందించాలి

    పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు తరచూ గమనించాలి. పాము కాటు వేస్తే కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టాలి. బ్లేడుతో కోసి రక్తం పిండాలి. 15 నిముషాలకు ఒకసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. స్నేక్‌ యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్‌, ఆట్రోసిన్‌ సల్ఫేట్‌, ఏవిల్‌ ఇంజక్షన్‌ను పశువు రక్తంలోకి ఎక్కించాలి. నొప్పి నివారణకు స్టైరాయిడ్‌, యాంటీ బయోటిక్స్‌, అవసరాన్ని బట్టి ఇతర మందులను ఇవ్వాలి.

    డాక్టర్‌ మల్లంపల్లి సాయి బుచ్చారావు, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జీలుగుమిల్లి

  • గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు ఆగేనా?

    ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు కాలువ ఇరిగేషన్‌ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం కాలువ గట్టుపై నుంచి గ్రామంలోకి వెళ్లే పలు మార్గాల్లో ట్రంచ్‌ (రోడ్డుకు అడ్డంగా) తవ్వకాలు జరిపారు. వివరాల్లోకి వెళితే. కొందరు టీడీపీ నాయకులు కాలువ గట్టును ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. రాత్రి వేళల్లో దొంగతనంగా గ్రావెల్‌ తవ్వకాలను జరిపి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో నాయకుడు ఈ మట్టిని అమ్ముకోవడం ద్వారా నెలకు రూ. 3 లక్షల వరకు కూడబెడుతున్నట్టు సమాచారం. అయితే ఈ పచ్చ ముఠా గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, ఏకంగా భూమిని తవ్వి గ్రావెల్‌ను అమ్మేస్తున్నారు. దాంతో కాలువ గట్టుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడి, అగాధాలను తలపిస్తున్నాయి. అవి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం సంబంధిత శాఖల అధికారులకు ప్రహసనంగా మారింది.

    దొంగ దారుల్లో ట్రంచ్‌లు..

    మట్టి దొంగలు అధికార పార్టీకి చెందినవారు కావడంతో కొందరు అధికారులు చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దాంతో వారి మట్టి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు.. జేసీబీలతో కాలువ గట్టుపైకి చేరి, తవ్వకాలు జరిపేస్తున్నారు. వీరి తవ్వకాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో కాలువ ఇరిగేషన్‌ అధికారులు అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకునేందుకు కాలువ గట్టు చివరన కాపలా కాస్తున్నారు. అయితే తెలివిమీరిన మట్టి దొంగలు పలు దొంగ మార్గాల గుండా మట్టిని తరలించేస్తున్నారు. దాంతో కాపలా కాసినా ప్రయోజనం లేదని భావించిన అధికారులు ట్రంచ్‌ తవ్వకాలను చేపట్టారు. గట్టుపై నుంచి గ్రామంలోకి అక్రమ మట్టి రవాణా జరుగుతున్న పలు మార్గాలను గుర్తించి, పీఐపీఆర్‌ఎంసీ జేఈ దూర్జటి పర్యవేక్షణలో ట్రంచ్‌ లను తవ్వారు.

    ఫలితం ఉంటుందా?

    ట్రంచ్‌లు తవ్వడం వల్ల ఫలితం ఉంటుందా అంటే.. గ్రామస్తులు కొందరు ఉండదనే అంటున్నారు. మట్టినే ఆదాయ వనరుగా ఎంచుకున్న ముఠాకు ట్రంచ్‌లు ఒక లెక్క కాదని చెబుతున్నారు. ట్రంచ్‌లను పూడ్చి, అక్రమ రవాణాను సాగించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే అధికారుల ప్రయత్నం ఏమేరకు ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

    అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న

    ఇరిగేషన్‌ అధికారులు

    పలు మార్గాల్లో ట్రంచ్‌ల తవ్వకాలు

  • రుణాలు అందక ఇబ్బందులు

    భీమవరం: రైతులకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు(సొసైటీ) పూర్తిస్థాయిలో త్రిసభ్య కమిటీలు, ప్రత్యేక అధికారులు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీలను నియమించకపోగా ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసిన సంఘాలకు అధికారులను నియమించకపోవడంతో సొసైటీలో రైతులు రుణం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 122 సొసైటీలున్నాయి. రైతులు ఎక్కువ శాతం సొసైటీల్లో రుణాలు తీసుకుని పంటలకు పెట్టుబడులు పెడతారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జీరో వడ్డీకే రైతులకు పంట రుణాలు ఇవ్వడంతో సొసైటీల ప్రాచుర్యం బాగా పెరిగింది.

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొసైటీలకు నియమించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించారు. కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటీవల కేవలం 50 సొసైటీలకు మాత్రమే త్రిసభ్య కమిటీలు నియమించారు. కూటమిలో పదవులు పందేరంలో తమకు ఎక్కువ శాతం పదవులు కావాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పంతాలకు పోవడంతోపాటు ఆయా సొంత పార్టీ నాయకుల మధ్యనే విభేదాలు తలెత్తంతో నామినేటెడ్‌ పదవుల భర్తీ సందిగ్ధంగా మారింది.

    ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన

    జిల్లాలో కేవలం 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం, మిగిలిన సొసైటీల ప్రత్యేక అధికారుల పాలన జూలై 31తో ముగియడంతో పాలకవర్గాలు లేని దాదాపు 70 సొసైటీల్లోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొసైటీల్లో రుణాలు ఇవ్వాలంటే రుణం పొందే రైతుల జాబితాపై సంఘం చైర్మన్‌గాని ప్రత్యేక అధికారి సంతకం తప్పనిసరి. ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసినా ప్రభుత్వం పొడిగించకపోవడంతో రైతులు రుణాలు ఎలా పొందాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సార్వా సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులకు రుణాలు ఎంతో అవసరం. ఇలాంటి సమయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో కమిటీలను నియమించకపోవడం రైతులు పూర్తి స్థాయిలో రుణాలు పొందే అవకాశం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    సొసైటీల్లో పూర్తి స్థాయిలో లేని త్రిసభ్య కమిటీలు

    ఇంత వరకు 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం

  • మావుళ

    భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రముఖ ఇలవేల్పు మావుళ్ళమ్మ వారిని ఇండియన్‌ క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్రా ప్రీమియం లీగ్‌ టీం లో భీమవరం బుల్స్‌ టీంకు నితీష్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో విజయం సాధించాలని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    రేపు జిల్లా అథ్లెటిక్స్‌ జట్ల ఎంపికలు

    తణుకు అర్బన్‌: జిల్లా అథ్లెటిక్స్‌ జట్ల ఎంపికలు ఈనెల 3న తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. అండర్‌ 14, 16, 18, 20 బాలుర, బాలికల విభాగాల్లో నిర్వహించనున్నామని, ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9 నుంచి 11 వరకు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని వివరించారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఆధార్‌ కార్డుతో ఉదయం 8 గంటలకు తణుకు క్రీడా ప్రాంగణంలో రిపోర్ట్‌ చేయాలని, ఇతర వివరాలకు 9989363978 నంబరులో సంప్రదించాలని కోరారు.

    చెరువులో పడి వ్యక్తి మృతి

    మండవల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని భైరవపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన పండు జోజి పెద్ద కుమారుడు తరుణ్‌ అలియాస్‌ చందు (23) 31న ఒంటి గంట సమయంలో బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. శుక్రవారం ఇంటి పక్కనే ఉన్న చేపల చెరువులో జారిపడి మృతిచెందాడు. పోలీసు సిబ్బంది కేసు నమోదు చేశారు.

    రోడ్ల ఆక్రమణలపై చర్యలు

    కొయ్యలగూడెం: పరింపూడి పంచాయతీ అంతర్గత రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోనున్నట్లు కార్యదర్శి కే.సురేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. జూలై 29 సాక్షిలో ప్రచురితమైన అంతర్గత రోడ్ల ఆక్రమణ విషయంపై ప్రజలతో మాట్లాడుతూ స్వమిత్వ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదు చేసుకోవచ్చనని సూచించారు. సాక్షిలో వచ్చిన కథనంపై విచారణ చేసి ఆక్రమణలను గుర్తించామని వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా స్వమిత్వ ద్వారా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.

  • వైఎస్

    ఆకివీడు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సోషల్‌ మీడియా జాయింట్‌ సెక్రటరీగా కమతం మహేష్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్సింహరాజు సూచనల మేరకు నియామకం జరిగినట్లు మహేష్‌ తెలిపారు.

    ఉంగుటూరు: వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎ.గోకవరానికి చెందిన మిద్దే వెంకటేశ్వరరావును నియమించారు. పార్టీ అధినేత జగన్‌, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

    చింతలపూడి: బీసీ విభాగం ఏలూరు జిల్లా కార్యదర్శిగా చింతలపూడి మండలం, రేచర్ల గ్రామానికి చెందిన పెరుగొండ్ర శివరామకృష్ణను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

    పెనుగొండ: వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఆచంట నియోజకవర్గం మార్టేరుకు చెందిన మండ విశ్వనాథ నారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

    దెందులూరు: వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా దెందులూరు నియోజవర్గం నుంచి చల్లారి హేమంత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నియామక ఆదేశాలు జారీ చేశారు.

    బుట్టాయగూడెం: వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగం రాష్ట్ర కమిటీ ప్రచార వింగ్‌ కార్యదర్శిగా పోలవరం నియోజకవర్గం నుంచి కొయ్యలగూడెంకు చెందిన తమిర్చి బ్రహ్మయ్యను నియమిస్తూ శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

    చింతలపూడి: చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంకు చెందిన త్సల్లాబత్తుల శ్రీనివాసరావును వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో గ్రంథాలయ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ చోడగిరి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఎన్నిక నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీ. రాంబాబు, అసోసియేట్‌ అధ్యక్షుడిగా పీ రంగారావు, ఉపాధ్యక్షులుగా ఎస్‌.వెంకటేశ్వరరావు, ఎస్‌డీ.లతీఫ్‌, ప్రధాన కార్యదర్శిగా ఎండీ జుల్ఫికర్‌ అలీ, సహాయ కార్యదర్శిగా కొండే వెంకటేశులు, జిల్లా కోశాధికారి ఎన్‌సీహెచ్‌ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం.శోభ, జీ అనిత, బంగారు పాప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్‌ బాబు, జేఏసీ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఆర్‌ఎస్‌.హరనాథ్‌, ఏపీ ఎన్‌జీఓ ఏలూరు తాలూకా అధ్యక్షుడు జీ శ్రీధర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Hanamkonda

  • సాంకేతిక పురోభివృద్ధి..

    టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న టీజీ ఎన్పీడీసీఎల్‌

    హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ మండలి (టీజీఎన్పీడీసీఎల్‌) సాంకేతిక పురోభివృద్ధిలో దూసుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా దిశగా పరుగులు పెడుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీగా కర్నాటి వరుణ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రధానంగా బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన వరుణ్‌ రెడ్డి టెక్నాలజీలో తన అనుభవాన్ని జోడిస్తూ ఆన్‌లైన్‌ సేవలను వినయోగదారుల ముందుకు తీసుకొచ్చారు. ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా కంపెనీలో టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. 17 జిల్లాల పరిధి కలిగి ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్‌ 72.35 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్‌లో ప్రవేశపెట్టిన టెక్నాలజీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

    సైది.. సైఫీ..

    సిస్టమ్‌ ఆవరేజ్‌ ఇంటరప్షన్‌ డ్యూరేషన్‌ ఇండెక్స్‌ (సైది) అనగా వినియోగదారులకు ఎదురయ్యే సగటు అంతరాయ వ్యవధిని, సిస్టమ్‌ ఆవరేజ్‌ ఇంటరప్షన్‌ ఫ్రిక్వెన్షీ ఇండెక్స్‌ (సైఫీ) అనగా సగటు అంతరాయాల సంఖ్యని విద్యుత్‌ అంతరాయాలకు కొలమానంగా తీర్చిద్దిదడం. సగటున వినియోగదారుడికి ఎన్ని సార్లు జరిగిన అంతరాయంపై రియల్‌ టైం డేటాను క్రోడీకరించి వాస్తవ గణాంకాల ఆధారంగా విశదీకరించి అంతరాయాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకుని అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకొచ్చారు. సైది, సైఫీ ద్వారా తరచూ విద్యుత్‌ అంతరాయాలు జరిగే ఫీడర్లపై దృష్టి సారించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

    హైపర్‌..

    ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించిన సమయంలో అతి తక్కువ సమయంలో విద్యుత్‌ పునరుద్ధరణ చేపట్టడానికి ‘హైపర్‌’ అనే కార్యాచరణను రూపొందించారు. ఉద్యోగులు పని చేసే చోట నివాసముండి, సిబ్బంది, సామగ్రిని సమీకరించుకోవడం, సమాచార సేకరణ చేరవేయడం, పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా విద్యుత్‌ సరఫరాను వేగంగా పునరుద్ధరించడం హైపర్‌ ఉద్దేశం.

    ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్ల ఏర్పాటు

    వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణం చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటెనెన్స్‌, ఇతరత్రా ఏదేని కారణాలతో ఒక లైన్‌లో సమస్య ఉత్పన్నమైతే మరో లైన్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ లైన్లు వేశారు. ప్రధానంగా 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల మధ్య ఈ ఇంటర్‌ లింక్‌ లైన్లు వేశారు. ఫలితంగా ఒక సబ్‌ స్టేషన్‌లో సమస్య ఉంటే మరో సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అవుతుంది.

    రియల్‌టైం మానిటరింగ్‌ సిస్టమ్‌..

    వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌ అందించడానికి రియల్‌ టైం ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టం ఎంతో దోహదపడుతుంది. ఇందులో రియల్‌ టైంలో కచ్చితమైన సమాచారం పొందడం ద్వారా వేగంగా చర్యలు చేపట్టొచ్చు. ఫీడర్ల పర్యవేక్షణ, త్వరితగతిన ప్రతిస్పందించడం ద్వారా అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి. రియల్‌ టైంలో విద్యుత్‌ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్‌ సిబ్బందికి అందించి అతి తక్కువ సమయంలో సరఫరాను పునరుద్ధరించడం దీని ద్వారా సాధ్యం.

    ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లు..

    విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లలో తలెత్తే సాంకేతిక లోపాలు వెంటనే తెలుసుకునేందుకు పొడవాటి విద్యుత్‌ లైన్లలో ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ లైన్‌లో లోపం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం వెళ్తుంది. లోపం ఏ ప్రాంతంలో తలెత్తిందో స్పష్టంగా తెలియడం ద్వారా వేగంగా ఆ లోపాన్ని సరిచేసి తక్కువ సమయంలో విద్యుత్‌ను పునరుద్ధరిస్తారు. దీని ద్వారా విద్యుత్‌ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చు.

    ఇ–స్టోర్‌..

    పేపర్‌ విధానంలో మెటీరియల్‌ విడుదలకు ఆలస్యమవుతుండడంతో ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఇ–స్టోర్‌ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో సంబంధిత సెక్షన్‌ ఏఈ పనికి కావాల్సిన మెటీరియల్‌ స్టాక్‌ ఉందో సాఫ్ట్‌వేర్‌లో పరిశీలిస్తారు. అవసరమైన స్టాక్‌ను రిజర్వ్‌ చేసుకుంటాడు. రిజర్వ్‌ చేసుకున్న మెటీరియల్‌ తాలూకు సమాచారం సంబంధిత ఏడీఈకి, తర్వాత స్టోర్స్‌కు ఆన్‌లైన్‌ ద్వారా వెళ్తుంది. మెటీరియల్‌ స్వీకరించే అధికారికి ఏ రోజు మెటీరియల్‌ విడుదల చేస్తారో ఆ తేదీని, సమయాన్ని ఎస్‌ఎంఎస్‌, సాప్‌ మెయిల్‌ రూపంలో సమాచారం చేరవేస్తారు. దీంతో నిర్ణీత సమయానికి స్టోర్స్‌కు చేరుకుని మెటీరియల్‌ తీసుకుంటారు. తద్వారా అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరముండదు. సమయం ఆదా అవుతుంది. వ్యయప్రయాసలు తగ్గుతాయి.

    వినియోగదారులకు మెరుగైన

    సేవలందించడమే లక్ష్యంగా ముందుకు

    అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా దిశగా పరుగులు..

    వాట్సాప్‌ చాట్‌బాట్‌

    విద్యుత్‌ వినియోగదారులు తమ సమస్యలు అధికారులకు తెలియజేసేందుకు యాజమాన్యం వాట్సాప్‌ చాట్‌ బాట్‌ను తీసుకొచ్చింది. ఇందులో ముందు వినియోగదారులు తమ మొబైల్‌ నుంచి వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు చాట్‌ చేయగానే అందులో రిజిస్టర్‌ కంప్లైంట్‌, ట్రాక్‌ కంప్లైంట్‌, చాట్‌ విత్‌ ఏజెంట్‌ అని వస్తుంది. అందులో రిజిస్టర్‌ కంప్లైంట్‌ ఎంటర్‌ చేయగానే విత్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌, విత్‌ అవుట్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌, ప్రీవియస్‌ మెను వస్తుంది. ఇలా విత్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే వినియోగదారుడి సర్వీస్‌ వివరాలు వస్తాయి. ఈ వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్‌కు సంబంధించిన వివిధ రకాలు మెనులో కనపిస్తాయి. ఇందులో కంప్లైంట్‌కు సంబంధించి సబ్‌ టైప్‌ లేదా చాట్‌ విత్‌ ఏజెంట్‌ వస్తుంది. ఇలా ఏజెంట్‌తో చాట్‌ చేయొచ్చు లేదా కంప్లైంట్‌ నమోదు చేయొచ్చు.

    ఎల్‌సీ యాప్‌..

    విద్యుత్‌ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఎల్‌సీ యాప్‌ను ప్రవేశపెట్టారు. మరమ్మతుల సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసేందుకు, పునరుద్ధరణకు సమాచారం ఇచ్చేందుకు ఎల్‌సీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్‌సీయాప్‌ ద్వారా మానవతప్పిదాలకు అవకాశముండదు. తద్వారా విద్యుత్‌ ప్రమాదాలు తగ్గుతాయి.

  • 34 రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు

    కాజీపేట రూరల్‌ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్‌ మీదుగా ప్రయాణించే చర్లపల్లి–పట్నా ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు.

    పొడిగింపు రైళ్ల వివరాలు..

    ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 29వ తేదీ వరకు పట్నా–చర్లపల్లి (03253) పట్నా ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ సోమ, బుధవారాల్లో 17 రైళ్ల సర్వీస్‌లు, ఆగస్టు 6వ తేదీ నుంచి ఆక్టోబర్‌ 1వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07255) పట్నా ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ బుధవారం 9 రైళ్ల సర్వీస్‌లు, ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 26వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07256) పట్నా ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ శుక్రవారం 8 రైళ్ల సర్వీస్‌లను పొడిగించి నడిపిస్తున్నట్లు తెలిపారు.

    హాల్టింగ్‌ స్టేషన్లు..

    కాజీపేట మీదుగా చర్లపల్లి–పట్నా అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో ప్రయాణించే రైళ్ల సర్వీస్‌లకు సికింద్రాబాద్‌, కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బల్హార్షా, నాగ్‌పూర్‌, గోండియా, దుర్గ్‌, రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, జర్సుగూడ, రూర్కెలా, హథియా, రాంచీ, బొకారో స్టీల్‌ సిటీ, గోమ్‌, కోడేమా, గయా, జెహన్‌బాద్‌ స్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించారు. ఈ రైళ్లకు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌ అండ్‌ జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌ల సౌకర్యం కల్పించారు.

  • కాంగ్

    బీఆర్‌ఎస్‌ పదేళ్లు తెలంగాణ దోచింది

    బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన

    కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారి

    మామునూరు: బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని, నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారి ఆరోపించారు. ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలలోని అడిటోరియంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ ఆధ్యక్షతన తొమ్మిది జిల్లాల మండల అధ్యక్షుల శిక్షణ తరగతులు శుక్రవారం రెండో రోజు కొనసాగాయి. ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ హాజరై రాష్ట్ర ఎన్నికల ప్రభారి తరగతులను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా చంద్రశేఖర్‌ తివారి హాజరై మాట్లాడారు. మండల అధ్యక్షులు పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ ఎన్నికల నిర్వహణ, ప్యూహం అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, డాక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, ప్రకాష్‌బాబు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ తీవారిలు కార్యాచరణ పద్ధతి, సమావేశాలు, సంభాషణ, సోషల్‌ మీడియా, స్వశక్తి మండల సంకల్పం అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం.ధర్మారావు, విజయ రామారావు, వన్నాల శ్రీరాములు, ఓ.శ్రీనివాస్‌రెడ్డి, గౌతమ్‌రావు, క్రాంతికుమార్‌, కొండేటి శ్రీధర్‌, కుసుమ సతీష్‌, రత్నం సతీష్‌షా, డాక్టర్‌ వన్నాల వెంకటరమణ, డాక్టర్‌ విజయచందర్‌రెడ్డి, మల్లాడి తిరుపతి రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, బండి సాంబయ్య యాదవ్‌, బన్న ప్రభాకర్‌ పాల్గొన్నారు.

    పారదర్శకంగా పదోన్నతులు

    ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలి

    కోఆర్డినేషన్‌ సమావేశంలో

    హనుమకొండ డీఈఓ వాసంతి

    విద్యారణ్యపురి: పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను కోరారు. ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి కల్పిస్తున్న నేపథ్యంలో శుక్రవారం హనుమకొండ డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ.. ఎస్జీటీల సీనియారిటీ జాబితాలను, వేకెన్సీల జాబితాలను పారదర్శకంగా ప్రకటించాలని డీఈఓను కోరారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అప్పీళ్లను వందశాతం పరిష్కరించి ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ నష్టం కలుగకుండా చూడాలని విన్నవించినట్లు సమాచారం. గత పదోన్నతులలో రెండు పదోన్నతులు లభించినా నాన్‌విల్లింగ్‌ ఇచ్చినవారిని, అలాగే రివర్షన్‌ వచ్చిన వారిని ఆయా సబ్జెక్టులలో సీనియారిటీ జాబితాల్లో నుంచి తొలగిస్తామని డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులకు తెలియజేశారు. విద్యార్థులకు, టీచర్లకు వందశాతం ఎఫ్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందేనన్నారు. కాగా, స్కూల్‌ అసిస్టెంట్‌ల సత్సమాన క్యాడర్ల హెచ్‌ఎంల పదోన్నతుల కోసం జిల్లాలో 151 వేకెన్సీలు సంబంధిత డీఈఓ వెబ్‌సైట్‌లో ప్రకటించారని సమాచారం. స్కూల్‌ అసిస్టెంట్‌లకు హెడ్మాస్టర్ల గ్రేడ్‌ 2 పదోన్నతులు కల్పించాక స్కూల్‌ అసిస్టెంట్‌ల వేకెన్సీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

  • నైపుణ

    ఖిలా వరంగల్‌: పోలీసులు విధి నిర్వహణతోపాటు నైపుణాలను పెంపొందించుకుంటేనే శాఖాపరమైన గుర్తింపు లభిస్తుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. వరంగల్‌ మామునూరు పోలీస్‌ శిక్షణ కళాశాల పరేడ్‌ గ్రౌండ్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌లో భాగంగా శుక్రవారం రెండో రోజు జరిగిన పోటీలను సీపీ ప్రారంభించి మాట్లాడారు. పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత లభిస్తుందన్నారు. పోలీసుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయన్నారు. శనివారం సాయంత్రం 5గంటల ముగింపు వేడుకలు జరగనున్నాయని, ముఖ్యఅతిఽథిగా డీజీపీ జితేందర్‌తోపాటు విశిష్ట అతిథిగా జైళ్ల విభాగం డీజీపీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా హాజరవుతున్నట్లు తెలిపారు. కాగా, డ్యూటీ మీట్‌ విజయవంతానికి కృషి చేస్తున్న అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులను సీపీ అభినందించారు.

    ఉత్కంఠగా కొనసాగుతున్న పోటీలు..

    రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. నువ్వా? నేనా అన్నట్లు విజయం కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బాంబ్‌ డిస్పోజల్‌, పోలీస్‌ జాగిలాలకు సంబంధించి నాలుగు విభాగాలు,కంప్యూటర్‌, వీడియో గ్రఫీ, సైంటిఫిక్‌ ఎయిడ్‌ విభాగాల్లో పోటీలు జరిగాయి.

    మోహన్‌ కృష్ణకు బంగారు పతకం..

    రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పీఆర్‌ఓ మన్నవ మోహన కృష్ణ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ విభాగంలో బంగారు పతకం సాధించారు. కాగా, ఆయనను సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ అభినందించారు.

    ఆటా..పాట

    డ్యూటీమీట్‌లో భాగంగా సాయంత్రం విందు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీపీ తన సహచరులతో కలిసి పా టలకు స్టెప్పులేసి అందరినీ అలరించారు.

    పోటీలతో మానసిక ఒత్తిడి దూరం

    వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌సింగ్‌

  • చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగిం

    ఖిలా వరంగల్‌ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్‌ ఏనుమాముల పోలీస్‌ స్టేషన్‌ పరిధి బాలాజీ నగర్‌లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రితేష్‌ సింగ్‌ ఠాకూర్‌ అలియాస్‌ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్‌ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్‌క్రీమ్‌ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్‌ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్‌, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్‌ క్రీమ్‌ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్‌ సింగ్‌ ఇద్దరు ఉత్తర్‌ ప్రదేశ్‌ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్‌ సింగ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్‌కు మార్చాడు. మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్‌ సింగ్‌ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్‌ సింగ్‌.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్‌పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ జే.సురేశ్‌ తెలిపారు.

    భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

    వివాహేతర సంబంధమే కారణం

    ఏనుమాముల బాలాజీనగర్‌లో ఘటన

  • బీసీల్లో సామాజిక విప్లవం వస్తుంది

    కేయూ క్యాంపస్‌ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పాలకులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని, ఆ వాటా సాధించుకునేందుకు బీసీల్లో సామాజిక విప్లవం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ పూలే ఆశయ సాధన సమితి (పాస్‌), నేషనల్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీసీడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యకేంద్రంలో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్స్‌ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రసాధన తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు న్యాయం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామన్నారు. ఆ పార్టీ బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉపక్రమించిందన్నారు. అయితే బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం మూడునెలలుగా ఆమోదించకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ బీజేపీ తోడుదొంగలేనన్నారు. బీఆర్‌ఎస్‌కు బీసీలపై ప్రేమ ఉంటే కరీంనగర్‌లో 8న జరగబోయే బీఆర్‌ఎస్‌ బీసీ శంఖారావం సభకు ముందు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎన్‌బీసీడబ్లూఏ బాధ్యుడు చలమల్లా వెంకటేశ్వర్లు, ‘పాస్‌’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ సంగనిమల్లేశ్వర్‌, రాష్ట్ర ఉద్యమకారులవేదిక చైర్మన్‌ కె. వెంకటనారాయాణ, ‘కుర్తా’ జనరల్‌ సెక్రటరీ వడ్డెరవీందర్‌, ‘పాస్‌’ జిల్లా అధ్యక్షుడు శాస్త్రి, వివిధ సంఘాల బాధ్యులు బాబుయాదవ్‌, చందా మల్ల య్య, గడ్డం కృష్ణ, ఆకుతోట శ్రీనివాస్‌, తిరునహరిశేషు, తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సదస్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాలని సదస్సు తీర్మానించింది. ఆ లేఖను రాష్ట్రపతికి ట్విటర్‌ ద్వారా పంపినట్లు సంగని మల్లేశ్వర్‌ తెలిపారు.

    బీసీ సంక్షేమ సంఘం జాతీయ

    అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

  • ఆరెపల్లి పాఠశాల తనిఖీ

    న్యూశాయంపేట: నగర పరిధిలోని ఆరెపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌, విద్యార్థుల పఠనాసామర్థ్యాలు, పాఠశాల ఆవరణ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఉండడంపై ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు తొలగించాలని, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వాచ్‌మన్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. కలెక్టర్‌ వెంట వరంగల్‌ తహసీల్దార్‌ మహ్మద్‌ ఇక్బాల్‌, ప్రధానోపాధ్యాయుడు వెంకన్న, ఉపాధ్యాయులు ఉన్నారు.

    రైతులతో ఆర్బిట్రేషన్‌

    గీసుకొండ మండలం ఊకల్‌ గ్రామరైతులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఆర్బిట్రేషన్‌లో కలెక్టర్‌ సత్యశారద పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన 15 మంది రైతులతో ఫైనల్‌ ఆర్బిట్రేషన్‌ నిర్వహించి అవార్డు ప్రదానం చేశారు. ఇందులో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ రియాజుద్దీన్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు శ్రీకాంత్‌, హైవే మేనేజర్‌, రైతులు పాల్గొన్నారు.

  • హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష

    వరంగల్‌ లీగల్‌ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమైపె కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్‌ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్‌ ఉన్నవ్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం ఊకల్‌కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్‌ ఊకల్‌కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్‌ 7న ఊకల్‌కు వచ్చిన అనిల్‌ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్‌.. పార్వతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్‌ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్‌ ఉన్నవ్‌ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్‌ అధికారులు ఎస్‌.శ్రీనివాస్‌, ఆర్‌.సంతోష్‌ పరిశోధించగా లైజన్‌ ఆఫీసర్‌ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్‌ సోమనాయక్‌, కానిస్టేబుల్‌ అనిల్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

    హన్మకొండ: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుంటే ఇప్పటికై నా రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు అని, కాంగ్రెస్‌ నాయకులు వక్రభాష్యం పలుకుతున్నారని విమర్శించారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంపై గౌరవం ఉంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు స్పీకర్‌ పెండింగ్‌లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తెలిపిందన్నారు. స్పీకర్‌కు నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమాంతర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, నాయకులు జోరిక రమేశ్‌, తాళ్లపల్లి జనార్దన్‌ గౌడ్‌, పులి రజినీకాంత్‌, రవీందర్‌ రావు, నయీముద్దీన్‌, బండి రజినీకుమార్‌, పోలెపల్లి రామ్మూర్తి, బొల్లికొండ వీరేందర్‌, బుద్దె వెంకన్న, మూటిక రాజు, రమేశ్‌, శ్రీకాంత్‌ చారి, మహేందర్‌, సతీశ్‌, దేవమ్మ, గౌస్‌ఖాన్‌, జేకే పాల్గొన్నారు.

    ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు

  • తల్లిపాలతో రోగ నిరోధకశక్తి

    జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి

    సాంబశివరావు

    ఎంజీఎం: తల్లిపాలతో బిడ్డలో రోగ నిరోధకశక్తి మెరుగవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వరంగల్‌ సీకేఎం ఆస్పత్రిలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ తల్లిపాలతో బిడ్డలు మానసికంగా అభివృద్ధి చెందడతోపాటు ఎదుగుదలకు దోహదపడుతాయని పేర్కొన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా బరువు తగ్గుతారని, గర్భాశయం సాధారణ స్థితికి వస్తుందని, క్యాన్సర్లు రాకుండా ఉండడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి బిడ్డ తన తల్లిపాలు తాగే హక్కును పొందేటట్లు చూడాలని సూచించారు. ఈనెల 7వ తేదీ వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్‌ సిబ్బంది సమన్వయంతో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ మురళి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రకాశ్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ అర్చన, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

Tamil Nadu

  • సాక్షి, చైన్నె : డాక్టర్‌ ఎంజీఆర్‌ జానకి మహిళా కళాశాలలో శుక్రవారం విద్యార్థినుల ఆడి పెరుక్కు సందడి కోలాహలంగా జరిగింది. నాలుగు వేల మంది విద్యార్థినులు తమిళ సంప్రదాయానికి అనుగుణంగా ఆడి పెరుక్కును జరుపుకున్నారు. తొమ్మిది రకాల ధాన్యాలు, చిక్కుళ్లు మొలకలతో నిండిన మట్టి కుండలను ఊరేగిస్తూ పూజలు చేశారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో దీపాలను వెలిగించారు. నదీ తీరాల్లో చేసే సంప్రదాయ పద్దతిని అనుసరిస్తూ నిమ్మకాయ, చింతపండు, కొబ్బరితో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ ఉత్సవంలో భాగంగా విద్యార్థినుల దేవరాట్టం, కరగాట్టం, పులియాట్టం, ఒయిలాట్టం, సకై ్కయాట్టం, పోయ్‌ కాల్‌ కుదిరై యాట్టం, మైలాట్టం, వంటి నృత్య రూపకాలు సంప్రదాయబద్ధంగా ప్రదర్శించారు. కళాశాల చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కుమార్‌ రాజేంద్రన్‌ మాట్లాడుతూ మానవ జాతి పురోగతి సాధించడానికి, శాంతియుతంగా, సంప్రదాయాన్ని పరిరక్షించుకునేందుకు ,మన మూలాలను తెలుసుకోవాల్సిన అవశ్యం ఉందన్నారు. 5 వేల సంవత్సరాల పురాతన సంప్రదాయాన్ని తెలుసుకోవడానికి, దాని భవిష్యత్తు తరానికి అందించడానికి దోహద పడే విధంగా తాము విద్యార్థినులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, తమిళ సంస్కృతి, సంప్రదాయ పద్ధతులు, సంగీత, నృత్య రూపకాల మేళవింపుతో ఆడిపెరుక్కును కోలాహలంగా విద్యార్థినులు జరుపుకున్నారని వివరించారు.

  • రోజువారీ చెత్త పన్నులు వసూలు చేయాలి

    తిరువళ్లూరు: ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉన్న భవనాలు, వ్యాపార సముదాయాలు, కట్టడాల నుంచి చెత్తకుప్పల సేకరణకు దినసరి పన్నులు వసూలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే తిరువళ్లూరులో అమలు చేయాలని కౌన్సిలర్‌ థామస్‌ సూచించారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ సాధారణ సమావేఽశఽం శుక్రవారం ఉదయం చైర్‌పర్సన్‌ ఉదయమలర్‌పాండ్యన్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి వైస్‌ చైర్మన్‌ రవిచంద్రన్‌, కమిషనర్‌ దామోదరన్‌ హాజరయ్యారు. సమావేశంలో కౌన్సిలర్‌ థామస్‌ మాట్లాడుతూ ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న హాటళ్లు, కల్యాణమండపాలు, షాపింగ్‌మాళ్లు, సూపర్‌మార్కెట్‌లు, ప్రైవేటు వైద్యశాలలు, వ్యాపార వాణిజ్య సముదాయాల నుంచి చెత్తసేకరణకు దినసరి పన్నులు వసూలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయని, వాటిని తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కమిషనర్‌ స్పందిస్తూ కౌన్సిలర్‌ కౌన్సిల్‌ దృష్టికి తెచ్చిన విషయాన్ని అమలు చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని వాటిని అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో కొన్ని పార్క్‌లను కొందరు అక్రమించుకుని కట్టడాలు నిర్మిస్తున్నారని, అయితే సంబంధిత కట్టడాలకు మున్సిపల్‌ ప్లానర్‌ లంచం తీసుకుని అనుమతి కూడా ఇస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ భూమిని అక్రమించుకుని కడుతున్న నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు ఎలా అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు శాంతి, సుమిత్ర, అరుణ, అయూబ్‌, సెల్వకుమార్‌, జాన్‌, ప్రభాకరన్‌ పాల్గొన్నారు.

  • అర్హులకు కలైంజ్ఞర్‌ ఆరోగ్యశ్రీ కార్డు

    వేలూరు: కలైంజ్ఞర్‌ ఆరోగ్యశ్రీ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హులైన వారికి అందజేయాలని కలెక్టర్‌ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు యూనియన్‌ పరిధిలోని సెంబేడు గ్రామ పంచాయతీ, గంగనల్లూరు గ్రామ పంచాయతీలో మీతో స్టాలిన్‌ పథకం ఆయా గ్రామ సర్పంచ్‌ల అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హజరై కలైంజ్ఞర్‌ ఆరోగ్య శ్రీకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అక్కడిక్కడే కార్డులను అందజేశారు. అలాగే అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ పథకంలో మొత్తం 15 శాఖలకు సంబంధించిన అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న వినతులపై వెంటనే విచారణ జరిపి, అర్హులైన వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వినతిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి అర్జీదారులకు రశీదు అందజేయాలన్నారు. అఽధికారులు ఆలసత్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ప్రజల రిజిష్టర్‌ నమోదు కేంద్రం, రశీదు అందజేసే కేంద్రం తదితర వాటిని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వేలూరు యూనియన్‌ చైర్మన్‌ అముద, బీడీఓ విన్‌సంట్‌ రమేష్‌బాబు, డీఎంకే యూనియన్‌ చైర్మన్‌ జ్ఞానశేఖరన్‌, సర్పంచ్‌ అన్బయగన్‌ పాల్గొన్నారు.

  • ● సీఎ

    సాక్షి, చైన్నె : స్వచ్ఛ తమిళనాడు లక్ష్యంగా ఒక ప్రత్యేక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రాసెసింగ్‌ రంగంలో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణలో స్వచ్ఛ తమిళనాడు సంస్థ కోసం ఒక కార్యాచరణ రూపకల్పనకు ఐఐటీ మద్రాసుతో సీఎం స్టాలిన్‌ సమక్షంలో శుక్రవారం ఒప్పందాలు జరిగాయి.

    తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాల్లో ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోజూవారీ ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను నిర్వహించడంలో కీలకమైన అంశంగా మారింది. ఇందుకోసం పరిశుభ్రత ఉద్యమం అనే ఐక్య ఉద్యమంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం స్వచ్ఛ తమిళనాడు ఉద్యమంపై దృష్టి పెట్టారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కింద స్థానిక సంస్థల ద్వారా రాష్ట్రానికి స్థిరమైన వ్యర్థ నిర్వహణ పరిష్కారాల కోసం ఈ కార్యకలాపాలను స్వచ్ఛ తమిళనాడు సంస్థ నిర్వహించే విధంగా దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా, స్వచ్ఛ తమిళనాడు సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను శాసీ్త్రయంగా, అధునాతన పద్ధతిలో శుద్ధి చేయడానికి టెక్నాలజీని ఉపయోగించేందుకు సన్నద్ధమైంది. రీసైకిల్‌ చేయడం, బలమైన ఇంటిగ్రేటెడ్‌ నిర్మాణాన్ని నిర్మించడం కోసం మద్రాసు ఐఐటీతో స్వచ్ఛతమిళనాడు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో సీఎం ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. నిబంధనలకు అనుగుణంగా పునర్వివినియోగం, రీసైక్లింగ్‌ కోసం ఈ అవగాహన ఒప్పందంలో అంశాలను వివరించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌ మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌ యాదవ్‌, స్వచ్ఛ తమిళనాడు కార్పొరేషన్చ్ఛెండీ డాక్టర్‌ ఎస్‌.ఉమ, ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కామకోటి పాల్గొన్నారు.

    జర్నలిజం:

    చైన్నె ఇన్‌న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం విద్యార్థుల దరఖాస్తుల తేదీని పొడిగిస్తూ సీఎం స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశం దరఖాస్తులకు ఈనెల 3వ తేదీ చివరి రోజు. అయితే, ఈ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులకు ఈనెల పదో తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టెలివిజన్‌, రేడియో , ఆన్‌న్‌లైన్‌ మీడియాలో పనిచేయడానికి అధిక–నాణ్యత విద్య పాఠ్యాంశాలు రూపొందించామని ప్రకటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైన్నె మహానగర అభివృద్ధి సంస్థ తరఫున 4 ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే 26 కొత్త ప్రాజెక్టులకు స్టాలిన్‌ శంకుస్థాపన చేశారు. మంత్రి శేఖర్‌బాబు పాల్గొన్నారు. తదుపరి జరిగిన కార్యక్రమంలో జాతీయ సహకార చక్కెర మిల్లుల సమాఖ్య ద్వారా మెరుగైన పనితీరు కోసం తమిళనాడులో 5 చక్కెర సహకార సంస్థలు, కర్మాగారాలకు లభించిన అవార్డులను సంబంధిత అధికారులు సీఎం స్టాలిన్‌కు అందజేశారు. మంత్రి రాజేంద్రన్‌ అన్ని అవార్డులను సీఎం స్టాలిన్‌కు సమర్పించారు. అలాగే, పర్యాటక రంగంలో 5 కొత్త ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే, ఎగ్మూర్‌ మ్యూజియం కాంప్లెక్స్‌లో నిర్మించిన కొత్త పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించారు. మంత్రులు స్వామినాథన్‌, రాజేంద్రన్‌ పాల్గొన్నారు. కాగా, గత నెల సీఎం స్టాలిన్‌ అనారోగ్యసమస్యతో తిరుప్పూర్‌ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. ఈ పర్యటన ఈనెల 11,12 తేదీ జరగనున్నట్టు అధికారులు ప్రకటించారు.

    తిరువణ్ణామలైలో మినీ టైడల్‌ పార్కు

    తిరువణ్ణామలైలో రూ.37 కోట్లతో కొత్త మినీ టైడల్‌ పార్క్‌ ఏర్పాటు పనులకు సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. 600 కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ఈ మినీ టైడల్‌ పార్కు రూపుదిద్దుకోనుంది. మంత్రులు ఏవీ వేలు, డాక్టర్‌ టీఆర్‌బీ రాజా, పరిశ్రమ శాఖ కార్యదర్శి వి.అరుణ్‌రాయ్‌ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 14 దేశాల్లో ‘తమిళ మూలాల అన్వేషణలో’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎన్‌ఆర్‌ఐ తమిళ యువత కోసం తమిళనాడు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రత్యేక పర్యటన నిమిత్తం ఎంపికై న 99 మంది తమిళ యువకులకు ప్రయాణం, నోట్స్‌, పుస్తకాలు, ఐడీ కార్డులు, వస్త్రాలు, ఇతర సామగ్రిని సీఎం స్టాలిన్‌ పంపిణీ చేశారు. ఇప్పటికే మూడు విడతల పయనం ముగియగా, తాజాగా మలి విడతగా నాలుగో విడతలో 14 దేశాల్లో 99 మంది తమిళుల యువత 16 రోజుల పాటు పర్యటించనున్నారు. మంత్రి నాజర్‌, అధికారులు పాల్గొన్నారు.

  • బాధ్య

    తమిళసినిమా: ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం సినీ కళాకారుల ప్రతిభను గౌరవవించేలా జాతీయ అవార్డులను ప్రకటించి, వారిని జ్ఞాపికలతో సత్కరిస్తోంది. ఈ క్రమంలో 2023వ ఏడాదికిగాను 71వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆ పట్టికలో తమిళ చిత్రపరిశ్రమ ఐదు జాతీయ అవార్డులను గెలుచుకోవడం విశేషం. పార్కింగ్‌ చిత్రం ఏకంగా మూడు అవార్డులఽను గెలుచుకుంది. ప్రాంతీయ భాషలో పార్కింగ్‌ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును, ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకుంది. అలాగే నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లభించింది. హరీశ్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం పార్కింగ్‌. రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ సంస్థల నిర్వాహకులు సుధన్‌ సుందరమ్‌, కేఎస్‌ శినీష్‌ కలిసి నిర్మించారు. నటుడు ఎంఎస్‌ భాస్కర్‌ ముఖ్య పాత్రను పోషించిన ఈ చిత్రం 2023లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి ఉత్తమ కథా చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ స్క్రిన్‌ప్లే అవార్డును దర్శకుడు రామ్‌ కుమార్‌ బాలకృష్ణన్‌కు, ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటుడు ఎంఎస్‌ భాస్కర్‌కు అవార్డు వరించింది. అలాగే నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్‌ కుమార్‌కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది. అలాగే వీటిల్‌ వింగ్స్‌ అనే డాక్యుమెంటరీ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. ఈ సందర్భంగా తనకు జాతీయ అవార్డును ప్రకటించిన జాతీయ అవార్డుల కమిటీకి సంగీత దర్శకుడు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వాత్తీ చిత్రానికి పని చేసే అవకాశం కల్పించినందుకు గాను నటుడు ధనుష్‌కు, ఆ చిత్ర దర్శక నిర్మాతలకు ఇతర యూనిట్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తాను అందుకోనున్న రెండో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

    భారత ఆర్మీ దక్షిణ భారత్‌ ఏరియా కొత్త జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ వి శ్రీహరి నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మెరీనా తీరంలోని వార్‌ మెమోరియల్‌వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఆర్మీ వర్గాలు గౌరవ వందనంతో ఆహ్వానం పలికాయి. – సాక్షి, చైన్నె:

  • కోలీవ
    ఆడి వెళ్లి కోలాహలం
    ● – అమ్మన్‌ సన్నిధుల్లో పూజలు

    సేలం : ఆషాఢమాసం మూడో శుక్రవారం అమ్మవారి ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. అమ్మవారి సన్నిధుల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అనేక చోట్ల మహిళలు 1008 పాల బిందెలతో ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లారు. ఆడి మాసం(ఆషాఢం) వస్తే చాలు తమిళనాడులో భక్తి భావం మిన్నంటుతుందన్న విషయం తెలిసిందే. ఈ మాసంలో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. భక్తి భావంతో మిన్నంటుతాయి. ఆడి అమావాస్య రోజున పితృదేవుళ్లకు తర్పణాలు వదిలి వారి ఆత్మల శాంతికి పూజలు చేస్తారు. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఇంటింటింటా ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఈ మాసంలో మూడో శుక్రవారం కావడంతో ఉదయం నుంచి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా చేశారు. వేకువ జామున అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు జరిగాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయాలకు తరలి వెళ్లి, మొక్కుల్ని తీర్చుకున్నారు.

    గ్రామ దేవతల ఆలయాల్లో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇళ్లల్లోను ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం చైన్నె, శివారుల్లోని ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండాయి. మైలాపూర్‌ ముండకన్ని అమ్మన్‌ ఆలయంలో ఉదయాన్నే అభిషేకం, పసుపు కుంకుమలతో అమ్మవారి అలంకరణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తిరువేర్కాడు కరిమారియమ్మన్‌ ఆలయం, మాంగాడు కామాక్షి అమ్మవారి ఆలయం, పురసై వాక్కం పాతాల పొన్నియమ్మన్‌ ఆలయం, కందన్‌ చావడి కన్నియమ్మన్‌ ఆలయాల్లోను ప్రత్యేక పూజలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీ నగర్‌లోని వేంబులి అమ్మవారి ఆలయానికి ఆ పరిసరాల్లోని మహిళా భక్తులు 1008 మంది తలపై పాల బందెల్ని ఉంచుకుని ఊరేగింపుగా తరలివచ్చారు. సేలం మారియమ్మన్‌ ఆలయంలో గాజుల పండుగ జరిగింది. ఆ పరిసరాలలోని అమ్మన్‌ ఆలయాల్లోని దేవతా మూర్తులను ఒక చోట చేర్చి గాజులతో అలంకరించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

  • ఉద్యోగ విరమణ రోజే సస్పెన్షన్‌

    సాక్షి, చైన్నె: అన్నావర్సిటీ మాజీ వీసీ వేల్‌రాజ్‌పై ఆ విద్యా సంస్థ సిండికేట్‌ కన్నెర్ర చేసింది. నాగర్‌కోయిల్‌కు చెందిన వేల్‌రాజ్‌ 1992 నుంచి గిండిలోని అన్నావర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 20024 నుంచి 2010 వరకు డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2021లో అన్నావర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈ పదవీ కాలం 2024లో ముగిసినప్పటికీ, ఉద్యోగ విరమణకు సంబంధించిన నిర్ణీత వయస్సు రాక పోవడంతో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ వచ్చారు. అదే సమయంలో ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. కొన్నింటిపై విచారణ సాగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో జూలై 31న ఆయన ఉద్యోగ విరమణ రోజు. అయితే, అదే రోజున అన్నావర్సిటీ సిండికేట్‌ సమావేశం జరిగింది. ఇందులో ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగ విరమణ రోజే ఆయన్ను సస్పెండ్‌ చేయడం అన్నావర్సిటీలో చర్చకు దారి తీసింది.

    చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

    ఒడిశా యువకుడిపై పోక్సో కేసు

    తిరుత్తణి: చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఒడిశాకు చెందిన యువకుడిని పోక్సో చట్టం కింద కనకమ్మసత్రం పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. తిరుపతి–చైన్నె జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. కనకమ్మసత్రం ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు చేస్తూ అదే ప్రాంతంతో 50కు పైగా కార్మికులు తాత్కాలిక షెడ్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో కనకమ్మసత్రం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక గురువారం ఉదయం ఇంటికి సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. అక్కడ దాగి ఉన్న యువకుడు బాలికపై లైంగికదాడికి యత్పించడంతో బాలిక కేకలు పెట్టింది. ఇది విన్న స్థానికులు చుట్టిముట్టి యువకుడిని చితకబాది పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కనకమ్మసత్రం సీఐ నరేష్‌ కేసు నమోదు చేసి ఎరోమల్‌అలీ(27) అనే వ్యక్తిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

    సబర్బన్‌ రైలు మార్గం విస్తరణకు ఆమోదం

    సాక్షి, చైన్నె : ఉత్తర చైన్నె పరిధిలో సబర్బన్‌ రైలు మార్గం విస్తరణకు దక్షిణ రైల్వే యంత్రాంగం ఆమోద ముద్ర వేసింది. రైల్వే బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్తిపట్టు– గుమ్మిండి పూండి మధ్య మూడు, నాలుగో రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని మోర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ నుంచి గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్‌ సబర్బన్‌ రైలు సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌, ఎలక్ట్రిక్‌ రైళ్లు అన్నీ ఒకే మార్గంలో పయనిస్తున్నాయి. ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల అత్యధికంగా పయనిస్తుంటాయి. దీంతో సబర్బన్‌ రైలు సేవలలో జాప్యం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ రైళ్లు ఎక్కడికక్కడ స్టేషన్లలో ఆగిఆగి పయనించాల్సి ఉంది. ఈ సమస్యను అధిగమించేలా సబర్బన్‌ రైల్వే మార్గాన్ని విస్తరించాలన్న నినాదం ఆది నుంచి మిన్నంటుతూ వస్తుంది. ప్రస్తుతం దీనికి మోక్షం లభించింది. రైల్వే బోర్డు సమావేశంలో తీర్మానించడమే కాకుండా, ఈ పనులకు రూ.374 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు.

    20న పోషకాహార కార్మికుల సమ్మె

    కొరుక్కుపేట: పోషకాహార భోజన కార్మికులు ఈ నెల 20వ తేదీన నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఆ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ పోషకాహార రంగంలో ఖాళీగా ఉన్న 60 వేల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరంసహా వివిధ డిమాండ్లను నొక్కి చెబుతూ తాము కొన్ని సంవత్సరాలుగా అనేక దశల నిరసనలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే, ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. దీంతో తాము 7 దశల నిరసనలను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు. మొదటి దశలో ఈ నెల 20వ తేదీన జిల్లా రాజధానుల్లో ఒకరోజు సమ్మె జరుగుతుందన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 20న తిరుచ్చిలో సమ్మె సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత, అక్టోబర్‌ 8న యాదృచ్ఛిక సెలవు నిరసనను, నవంబర్‌ 7న చైన్నెలో ర్యాలీని నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌ 17న ఒకరోజు సమ్మె నిర్వహిస్తామని చెప్పారు.

    పోలీసులపై ఖైదీల దాడి

    కొరుక్కుపేట: చైన్నెలో పోలీసులపై ఖైదీలు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. చైన్నెలోని అ న్నానగర్‌ రౌడీ రాబర్ట్‌ హత్య కేసులో అరెస్టయి, జై లులో ఉన్న నిందితులను గురువారం పోలీసులు ఎగ్మోర్‌ క్రిమినల్‌ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు విచారణ పూర్తయిన తర్వాత, నిందితులను పోలీసు వాహనంలో తిరిగి పుళల్‌ జైలుకు తరలించారు. ఆ సమయంలో గార్డులు ఖైదీలను దుర్భాషలాడారు. దీంతో పోలీసులపై ఖైదీలు దాడి చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించాయి. వీడియో ఫుటేజ్‌ ప్రామాణికతను, హత్య కేసులో అరెస్టు చేసిన నిందితుడిని తీసుకువచ్చిన పోలీసు అధికారులను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయకపోవడం గమనార్హం.

  • బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు!

    సాక్షి, చైన్నె : బీజేపీతో పొత్తుప్రసక్తే లేదని ఎండీఎంకే నేత వైగో స్పష్టం చేశారు. మళ్లీ డీఎంకే అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎండీఎంకే నేత వైగో రాజ్యసభ పదవీ కాలం గత నెల ముగిసిన విషయం తెలిసిందే. ఆయనకు మళ్లీ అవకాశం దక్కుతుందని ఎండీఎంకే వర్గాలు ఎదురుచూశాయి. అయితే డీఎంకే కరుణించ లేదు. అదేసమయంలో ఈ సారి ఎన్నికల్లో ఎండీఎంకే రూటు మార్చే అవకాశాలు ఉన్నాయని, డీఎంకేకు మోసం చేయడం ఖాయం అనే చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఆ పార్టీలో వైగో, ఆయన తనయుడు, ఎంపీ దురైవైగోలతో సీనియర్‌నేత మల్‌లై సత్య ఫైట్‌ వెలుగులోకి రావడం చర్చకు మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. ఈ వివాదానికి డీఎంకే కారణం కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం సీఎం స్టాలిన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో ఎండీఎంకే నేత వైగో, ఎంపీ దురైవైగో భేటీ అయ్యారు. ఆస్పత్రి నుంచి వచ్చినానంతరం స్టాలిన్‌ను పరామర్శించే దిశగా ఈ భేటీ సాగినా, రాజకీయ అంశాల గురించి చర్చించుకున్నట్టు సమాచారం.

    అనంతరం మీడియాతో వైగో మాట్లాడుతూ, సీఎం స్టాలిన్‌ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయడానికి, ఆయన సోదరుడు ముత్తు మరణానికి సంతాపంగా పరామర్శించేందుకు వచ్చినట్టు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌ 19న ఎండీఎంకే నేతృత్వంలో జరగనున్న అన్నా జయంతి వేడుకల మహానాడుకు హాజరు కావాలని సీఎంను ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం నేరాల మీద ఉక్కు పాదం మోపుతోందని, తప్పు చేసిన వాళ్లను వదలి పెట్టడం లేదని ఈసందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సీఎం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కూటమి మళ్లీ అధికార పగ్గాలు రాష్ట్రంలో చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు కలిగిన బీజేపీతో ఎలాంటి పరిస్థితుల్లోనూ, తాము పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

    మళ్లీ అధికారంలోకి డీఎంకే

    ఎండీఎంకే నేత వైగో

  • పళనికి చుక్కెదురు!
    ● పిటిషన్‌ తిరస్కృతి

    సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కె పళణి స్వామి ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ విచారణకు సిటీ సివిల్‌ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలన్న పళనిస్వామి వాదనను కోర్టు తోసి పుచ్చింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా 2022లో పళణి స్వామి ఎంపికై న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే, ఈ కేసును దాఖలు చేసిన వ్యక్తికి అన్నాడీఎంకేతో సంబంధం లేదంటూ పళణి స్వామి తరఫున రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. వాదన అనంతరం పళణిస్వామి వాదనను కోర్టు తిరస్కరించింది. పళణి ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ విచారణకు నిర్ణయించింది. సిటీ సీవిల్‌ కోర్టు నిర్ణయం కాస్త అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. పళణి స్వామి ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంగా విచారణను ఎదుర్కోవాల్సి ఉండడంతో ఇది ఎన్ని మలుపులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఇదిలా ఉండగా పళణిస్వామి చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర శుక్రవారం తిరునల్వేలిలో బ్రహ్మరథం పట్టేలా జరిగింది. పళని రోడ్‌ షోకు విశేష స్పందన వచ్చింది. అదే సమయంలో పళణి మూడో విడత పర్యటన షెడ్యూల్‌ను సైతం అన్నాడీఎంకే వర్గాలు విడుదల చేశాయి.

  • సిల్వర్‌ జూబ్లీ

    పొటో: 34: చైన్నె అడయార్‌లోని పాట్రిషియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు శుక్రవారం జరిగాయి. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి కోవి చెలియన్‌, ఘనా డిప్యూటీ ప్రావిన్స్‌ లీడర్‌ బ్రదర్‌ డాక్టర్‌ ఎస్‌ అరోకియారా, తమిళనాడు సాంకేతిక విద్యా కమిషనర్‌ జే ఇన్నోసెంట్‌ దివ్య, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, పోస్టల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ మేజర్‌ మనోజ్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా కాన్సుల్‌ జనరల్‌ చాంగన్యూన్‌ కిమ్‌, సినీ దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి, ఎమ్మెల్యే హసన్‌ మౌలానా, మద్రాసు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రీటాజాన్‌ హాజరయ్యారు. సిల్వర్‌ జూబ్లీ జ్ఞాపిక, కాఫీ టేబుల్‌ బుక్‌, డాక్యుమెంటరీ చిత్రాలను ఈసందర్భంగా ఆవిష్కరించారు.

    – సాక్షి, చైన్నె :

  • విశాల

    తమిళసినిమా: ఎదగడానికై నా, ఎదిగిన తరువాత అయినా ప్రచారం ముఖ్యంగా మారిన రోజులివి. అలాంటి ప్రచారంలో ఉన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఈమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనే చెప్పవచ్చు. ఎందుకంటే వరలక్ష్మీ నటించిన పాత్రలు అలాంటివి. 2012లో పోడాపోడీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె శరత్‌కుమార్‌ వారసురాలు అన్నది తెలిసిందే. అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా, అలాంటి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతినాయకిగానూ నటించడమే ఈమె ప్రత్యేకత. అలా ఎలాంటి పాత్రకై నా రెడీ అనే వరలక్ష్మీ బహుభాషా నటి కూడా. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. కారణాలేమైన ఇప్పుడీమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారనే చెప్పవచ్చు. అందులో భాగంగా శ్రీలంకకు వెళ్లి ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసుకుని ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. శ్రీలంకలో చిన్నమోన్‌ లైఫ్‌ సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ ప్రాంతంలో ఈమె ఫొటో షూట్‌ నిర్వహించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ఫొటోల్లో తనకే సొంతమైన అందంతో పాటు ధైర్యాన్ని వ్యక్తం చేసేలా వరలక్ష్మీ కనిపించడం విశేషం. పలు చిత్రాల్లో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న వరలక్ష్మీ ఇటీవల నటించిన ది వెర్డిక్ట్‌ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలను అందుకున్నారు. డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ నటిగా ముద్ర వేసుకున్న ఈ భామ మరిన్ని వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా వరలక్ష్మీ ఫొటో సెషన్‌ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

    తమిళసినిమా: నటుడు విశాల్‌ ఇటీవల మార్క్‌ ఆంటోని, మదగజరాజా చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే త్వరలో ఓ ఇంటివాడు కూడా కాబోతున్నారు. నటి ఽసాయి దన్సికను జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నారు. ఇలాంటి సంతోషకరమైన తరుణంలో విశాల్‌ తన 35వ చిత్రానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత నిర్మించడం విశేషం. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 99వ చిత్రం కావడం మరో విశేషం. ఇంతకు ముందు ఎందరో నూతన నటీనటులకు, సాంకేతిక వర్గానికి అవకాశాలు కల్పించి, వారి సినీ జీవితాలకు మంచి బాట వేసిన నిర్మాత ఆర్‌బీ.చౌదరి తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి రవిఅరసు కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గత నెలలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను శుక్రవారం ప్రారంభించారు. చిత్రం షూటింగ్‌ను సింగిల్‌ షెడ్యూల్‌లో 45 రోజుల్లో చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేయనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం, రిజర్డ్‌ ఎం.నాథన్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా నటి దుషారా విజయన్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో తంబిరామయ్య, ఆర్జై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు.

    శ్రీలంకలో

    వరలక్ష్మి

    ఫొటో సెషన్‌

  • క్లుప

    అడ్డంకులు వచ్చినా

    ఎదుర్కోవాలి

    వేలూరు: విద్యార్థులు జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిగా మారాలని చైన్నె అన్నాయూనివర్సిటీ నానో టెక్నాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.దేవసేన అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని అగ్జిలియమ్‌ మహిళా డిగ్రీ కళాశాలలో 66వ స్నాతకోత్సవ కార్యక్రమం కళాశాల కార్యదర్శి డాక్టర్‌ ఆరోగ్యమేరి జోసిపిన్‌ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై వివిధ కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసిన 879 మందికి డిగ్రీ, 241 మందికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పట్టాలను అందజేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేసేందుకే బ్రిటీష్‌ వారి కాలంలోనే అగ్జిలియమ్‌ కళాశాలను ప్రారంభించారన్నారు. క్రమశిక్షణతో ఉంటే మాత్రమే ఉన్నత శిఖరాలకు వెళ్లగలమన్నారు. డిగ్రీలు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు ఆశక్తి చూపాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సిస్టిర్‌ ఆరోగ్య జయశీలి, వైస్‌ ప్రిన్సిపల్‌ అమల వలర్‌మది, ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ డీన్‌ విన్సీ, ఇంగ్లిష్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కలైసెల్వి, విద్యార్థినిలు, ఫ్రొఫెసర్‌లు పాల్గొన్నారు.

    పుట్టినరోజునే

    కానరాని లోకాలకు..

    –ట్యాంకర్‌ ఢీకొని ఎస్‌ఐ దుర్మరణం

    అన్నానగర్‌: పుట్టినరోజే ఓ ఎస్‌ఐ తుదిశ్వాస విడిచాడు. ట్యాంకర్‌ ఢీకొని ఓ ఎస్‌ఐ దుర్మరణం చెందాడు. కీరనూరుకు చెందిన ముత్తుకుమార్‌ (52) పుదుక్కోట్టై జిల్లా కీరనూర్‌ పోలీస్‌స్టేషన్‌న్‌లో ఎస్‌ఐ. శనివారం తన పుట్టినరోజున స్వస్థలమైన వెల్లనూర్‌ సమీపంలోని వడచేరి పట్టిలో ఉన్న తల్లిని చూడడానికి పుదుక్కోట్టై నుంచి బైక్‌లో బయలుదేరాడు. నెడుంచేరి ప్రాంతంలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ బైక్‌ను ఢీకొంది. ఈఘటన తీవ్రంగా గాయపడిన ముత్తుకుమార్‌ను స్థానికులు తిరుచ్చిలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన నామక్కల్‌ జిల్లా మోహనూర్‌కు చెందిన ట్యాంకర్‌ డ్రైవర్‌ కృష్ణసామిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    కాలేజీ రోడ్డుకు

    నటుడు జయశంకర్‌ పేరు

    తమిళసినిమా: స్థానిక నుంగంబాక్కంలో పాపులర్‌ అయిన వీధి పేరు కాలేజీ రోడ్డు. కాగా అదే రోడ్డులో ప్రముఖ దివంగత నటుడు మక్కల్‌ కలైంజర్‌ జయశంకర్‌ ఇల్లు ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో చిరస్మరణీయమైన నటుడు జయశంకర్‌. తమిళ జేమ్స్‌బాండ్‌గా పేరు గాంచిన ఈయన తనదైన నటనతో తమిళ ప్రేక్షకుల మన్ననలను పొందారు. అలా తమిళ సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించినందుకు గానూ కాలేజీ రోడ్డుకు మక్కల్‌ కలైంజర్‌ జయశంకర్‌ రోడ్డుగా పేరు మార్చినట్లు చైన్నె మహానగరం శాఖ పేర్కొంది. దీని గురించి చైన్నె మహానగరం జాయింట్‌ డైరెక్టర్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో స్థానిక నుంగంబాక్కంలోని కాలేజ్‌ రోడ్డులో నటుడు జయశంకర్‌ ఇల్లు ఉండడంతో ఆ రోడ్డుకు ఇప్పుడు మక్కల్‌ కలైంజర్‌ జయశంకర్‌ రోడ్డుగా ప్రభుత్వం అనుమతితో పేరు మార్చినట్లు పేర్కొన్నారు.

    పథకాన్ని విజయవంతం చేయాలి

    వేలూరు: మీతో ముఖ్యమంత్రి పథకం విజయవంతం కావడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్‌ అన్నారు. వేలూరు డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈనెల 7న కరుణానిధి ఏడవ వర్ధంతి పురష్కరించుకుని ఆయన విగ్రహాలకు నివాళులర్పించాలన్నారు. అదేవిధంగా తమిళనాడులో డీఎంకే పార్టీలో రెండు కోట్ల మందికి సభ్యత్వం ఇప్పించి పార్టీ విజయం సాధించేందుకు సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌లకు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు. మీతో స్టాలిన్‌ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల వినతి పత్రాల కేంద్రం ఏర్పాటు చేసి పథకం విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. అనంతరం వివిధ సమస్యలపై సమీక్షించించి తీర్మానం చేశారు. ఎమ్మెల్యే కార్తికేయన్‌, మేయర్‌ సుజాత, డిప్యూటీ మేయర్‌ సునీల్‌కుమార్‌, మాజీ ఎంపీ మహ్మద్‌సఖీ, యూనియన్‌ కార్యదర్శలు జ్ఞానశేఖరన్‌, శరవణన్‌, గజేంద్రన్‌, కరుణాకరన్‌, తనికాచలం పాల్గొన్నారు.

  • సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా సరెండర్‌

    తమిళసినిమా: క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రం సరెండర్‌. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శన్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో మలయాళ నటుడు లాల్‌, మన్సూర్‌అలీఖాన్‌, మునీష్‌కాంత్‌, సుజిత్‌, పడినే కుమార్‌, అరోళ్‌ డి.శంకర్‌, రమ్య రామకృష్ణన్‌, సుందరేశ్వరన్‌, కౌశిక్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా గౌతమ్‌ గణపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన దర్శకుడు అరివళగన్‌ శిష్యుడన్నది గమనార్హం. మెయ్యేంద్రన్‌ చాయాగ్రహణం, వికాశ్‌ బడీశా సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని ఆఫ్‌ బీట్‌ పిక్చర్స్‌ పతాకంపై వీఆర్‌వీ.కుమార్‌ నిర్మించారు. సరెండర్‌ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా పోలీసుశాఖ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే కథ, కథనాలతో సాగే ఈ చిత్రం ఎన్నికలకు ఐదు రోజుల ముందు జరిగే సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది. ఎన్నికలకు ముందు ఒక నటుడు తన పర్సనల్‌ గన్‌ను పోలీస్‌స్టేషన్‌లో సరెండర్‌ చేస్తాడు. అది మిస్‌ అవుతుంది. కాగా అదే సమయంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు ఓట్ల కోసం ప్రజలకు పంపిన నగదు మిస్‌ అవుతుంది. ఈ రెండు సంఘటనలతో జరిగే కథే సరెండర్‌. మిస్‌ అయిన గన్‌ కోసం పోలీసులు, ఓటర్లకు పంచాల్సిన డబ్బును కనుగొనడానికి రాజకీయ నాయకులు పడే పాట్లే ఈ చిత్రం. చిత్ర కథ బిగువైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు గౌతమ్‌ గణపతి తెరపై ఆవిష్కరించారు. నటుడు దర్శన్‌ ట్రైనీ ఎస్‌ఐగా పాత్రకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. ఇక లాల్‌ పోషించిన పోలీస్‌ రైటర్‌ పాత్ర చిత్రానికి కీలకమనే చెప్పాలి. మొత్తం మీద సరెండర్‌ చిత్రం సినీ ప్రముఖుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్‌ రిపోర్ట్‌ తెచ్చుకుంటోంది.

  • వ్యవసాయ భూములను సేకరిస్తే ఆందోళన

    –అన్బుమణి రామదాస్‌

    తిరువళ్లూరు: వ్యవసాయ భూములను ధ్వంసం చేసి శాటిలైట్‌ సిటీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే రైతుల తరఫున ఆందోళన చేస్తామని పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు అన్బుమణిరామదాస్‌ అన్నారు. తమిళ ప్రజల హక్కుల పరిరక్షణ పేరుతో పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు అన్బుమణి వంద రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పెద్దపాళ్యం, గుమ్మిడిపూండి, తిరువళ్లూరు ప్రాంతాల్లో గురు, శుక్రవారం పాదయాత్రను నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు అండగా ఉంటామని హామీ సైతం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరణి నది పరివాహక ప్రాంతాల్లో మూడు పంటలు పండే 1,700 ఎకరాల విస్తీర్ణంతో శాటిలైట్‌ సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాం. రైతులను వంచించి బెదిరింపులకు దిగి వ్యవసాయ భూముల్లో శాటిలైట్‌ సిటీని ఏర్పాటు చేసే తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు పోరాటం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయానికి ఉపయోగకరంగా లేని స్థలంలో శాటిలైట్‌ సిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పర్యావరణం కలుషితమైన ప్రాంతంగా గుమ్మిడిపూండి వుందని, అధికారులు చర్యలు తీసుకుని నష్ట నివారణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, మాజీ కార్యదర్శి సెల్వరాజ్‌, రమేష్‌ పాల్గొన్నారు.

  • భక్తి

    కొరుక్కుపేట: చైన్నెలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించిన ఆడి శుక్రవార అన్నకూట మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలపైన శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల వద్ద వాసవాంబకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 102 పాల బిందెలతో మహిళలు ఊరేగింపుగా శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయానికి మంగళ వాయిద్యాలు, జై వాసవీ...జైజై వాసవీ నినాదాల నడుమ చేరుకున్నారు. ఆలయంలో వాసవాంబకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి విశేషాలంకరణ చేసి, అన్నం రాశిగా పోసి అన్నకూట మహోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర్‌ పంతులు నేతృత్వంలో అన్నకూట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దీపారాధన చేసి, రాశిగా పోసిన అన్నాన్ని ప్రసాదంగా తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి క్లబ్‌ షావుకారు పేట బృందం నిర్వహించిన భక్తి గీతాలాపన అందరినీ అలరించింది.

  • ఇతర భాషల్లో చేయడం అంటే..

    తమిళసినిమా: దీన, రమణ, గజనీ, తుపాకీ, సర్కార్‌ ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్‌ దర్శకుల లిస్ట్‌లో స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌. ఈయన గజనీ చిత్రాన్ని హిందీలో అమీర్‌ఖాన్‌ హీరోగా చేసి విజయాన్ని సాధించారు. అదేవిధంగా రమణ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా స్టాలిన్‌ పేరుతో చేశారు. అదేవిధంగా ఇటీవల సల్మాన్‌ఖాన్‌ హీరోగా సికిందర్‌ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. పలువురు దర్శకుడితోపాటు యూనిట్‌ సభ్యులపై విమర్శలు గుప్పించారు. కాగా మురుగదాస్‌ ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌ హీరోగా మదరాసి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టంబర్‌ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంగీత దర్శకుడు ఏఆర్‌.రెహ్మాన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇతర భాషల్లో చిత్రాలు చేసేటప్పుడు దివ్యాంగుల్లా భావన కలుగుతుందన్నారు. అదే మాతృభాషలో చిత్రం చేయడం చాలా బలం అని అన్నారు. తెలుగు కూడా ఓకే అని, ఎందుకంటే తెలుగు భాష కూడా ఇంచుమించు మన భాషలానే ఉండడంతో పట్టు దొరుకుతుందన్నారు. భాష తెలియని ప్రాంతంతో చిత్రం చేయడం దివ్యాంగుల మాదిరి భావన కలుగుతుందనే అభిప్రాయాన్న దర్శకుడు మురుగదాస్‌ వ్యక్తం చేశారు. కాగా హిందీలో రెండు చిత్రాలు చేసిన ఆయన ఇలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.

  • అమ్మవారి ఊరేగింపు అడ్డగింత

    – డీఎస్పీకి ఫిర్యాదు

    తిరుత్తణి: అమ్మవారి ఊరేగింపును అడ్డుకోవడంపై చర్యలు తీసుకోవాలని పదిమంది కుటుంబీకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుత్తణి యూనియన్‌లోని సూర్యనగరం పంచాయతీలోని రామాపురం గ్రామంలో వందకు పైగా కుటుంబీకులు నివాశముంటున్నారు. ఆగ్రామంలో ప్రతి ఏటా ఆడి నెలలో పడవేట్టమ్మన్‌ ఆలయ జాతర నిర్వహించడం పరిపాటి. వచ్చే శుక్రవారం వేడుకలు సందర్భంగా బుధవారం రాత్రి గ్రామంలో సమావేశం నిర్వహించి గ్రామానికి హద్దు వరకు మాత్రమే అమ్మవారిని ఊరేగించాలని వెలుపల ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకెళ్లరాదని నిర్ణయించారు. దీంతో గ్రామానికి చెందిన పది కుటుంబీకులు ప్రభుత్వం అందజేసిన ఉచిత ఇంటి పట్టాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాశముంటున్న ప్రాంతం కొండ జాతి ప్రజలు నివాశముంటున్న ప్రాంతం కావడంతో తమ ప్రాంతానికి అమ్మవారి ఊరేగింపును గ్రామంలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపిస్తూ డీఎస్పీ కందన్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కందన్‌ గ్రామానికి చెందిన ఆలయ పెద్దలను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఏటా అమ్మవారిని గ్రామ హద్దు వరకు మాత్రమే ఊరేగించడం పరిపాటి. ఆ ప్రకారం మాత్రమే ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తున్నాం. కొత్తగా హద్దులు దాటి అమ్మవారిని ఊరేగించడం సాధ్యంకాదని తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య చర్చలు నిర్వహించి సమస్య పరిష్కరిస్తామని డీఎస్పీ తెలిపారు.

  • రిటైర్‌ పోలీస్‌ అధికారులకు సత్కారం

    కొరుక్కుపేట: చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ శాఖలో 24 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ మేరకు చైన్నె వేపేరిలోని చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో జరిగిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో చైన్నె నగర పోలీస్‌ కమిషనర్‌ ఎ.అరుణ్‌ పాల్గొని చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ శాఖలో 25 సంవత్సరాలకు పైగా సేవలందించినందుకు 24 మందిని ఘనంగా సత్కరించారు. చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ అదనపు కమిషనర్‌ విజయేంద్ర బిదారి,, డిప్యూటీ కమిషనర్లు డి.ఎన్‌.హరికిరణ్‌ ప్రసాద్‌, జి.సుబ్బులక్ష్మి, పోలీసు అధికారులు, ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Tirupati

  • అక్రమ స్కానింగ్‌ పార్ట్‌–2!

    చేతులు మారిన

    స్కానింగ్‌ మిషన్‌!

    కాణిపాకం: చిత్తూరులోని భరత్‌నగర్‌లో మూడు నెలలక క్రితం అక్రమ స్కానింగ్‌ సెంటర్‌ను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సీజ్‌ చేశారు. ఇక్కడ దొరికిన స్కానింగ్‌ మిషన్‌ను విచారణ అనంతరంకలెక్టర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగించారు. ఈ మిషన్‌ కంపెనీ ఆధారంగా తమిళనాడు నుంచి బయటకు వచ్చినట్లు తెలుసుకున్నారు. ముఠా సభ్యులు స్కానింగ్‌ మిషన్‌ను ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారో తెలుసుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా స్కానింగ్‌ మిషన్‌ 16 మంది చేతులు మారినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు.

    కాణిపాకం/తిరుపతి తుడా: మళ్లీ తెరపైకి అక్రమ స్కానింగ్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో చిత్తూరు కలెక్టర్‌ పట్టుకున్న అక్రమ స్కానింగ్‌ వ్యవహారం పార్ట్‌–2 కథను తలపిస్తోంది. చిత్తూరులో గుట్టు రట్టు కావడంతో ఈ ముఠా తిరుపతికి మక్కాం మార్చింది. అక్కడ అక్రమ స్కానింగ్‌ను గుట్టుగా నడిపించింది. వీరిచ్చిన తప్పుడు రిపోర్టుతో ఓ గర్భిణి, గర్భిణి కుమార్తెను బలితీసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ముఠాను అరెస్ట్‌ చేసి... భవానీ నగర్‌లోని అక్రమ స్కానింగ్‌, ఓ ప్రైవేటు ఆస్పత్రిని సీజ్‌ చేశారని రెండు జిల్లా అధికారులు వెల్లడించారు. ఇందులో చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఓ సిబ్బంది పాత్ర కీలకమని తెలిసింది. దీనిపై చిత్తూరు కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, వన్‌టౌన్‌ పోలీసులు చర్చించినట్లు సమాచారం.

    గర్భిణితో పాటు ఆడ బిడ్డను చంపేశారు!

    వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి చెందిన ఓ గర్భిణికి తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. రెండో సారి గర్భవతి కావడంతో ఆగర్భిణి ముఠా వలలో పడింది. నెల కిందట తిరుపతికి వచ్చింది. స్కానింగ్‌ చేయించుకుని కడుపులో ఉన్నది ఆడ బిడ్డగా తెలుసుకుంది. ఇంటికెళ్లి అబార్షన్‌ చేయించుకుంటానని పట్టుపట్టింది. కుటుంబీకులు ఇందుకు ఒప్పుకోకపోవడంతో కుమార్తెతో పాటు ఆ గర్భిణి బావిలో దూకి చనిపోయింది. దీనిపై భర్త ఇచ్చిన ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భిణి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా..క డుపులో ఉన్నది మగబిడ్డగా నిర్థారణ అయ్యింది. దీంతో అక్రమ స్కానింగ్‌ సెంటర్‌పై అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    చిత్తూరు సిబ్బందిదే కీలక పాత్ర

    చిత్తూరులో పట్టుబడ్డ అక్రమస్కానింగ్‌ ముఠా సభ్యులే.. ఈ గర్భిణి మృతికి కూడా కారణమని తమిళనాడు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. వీళ్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ముఠాకు .గుడిపాల మండలంలో పనిచేసే ఓ అటెండర్‌ (డీఎంఅండ్‌హెచ్‌ఓ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది) ముందుండి నడిపిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతనిని కూడా తమిళనాడు పోలీసులు రిమాండ్‌కు తరలించగా.. అతను మూడు రోజుల క్రితమే బయటకు వచ్చినట్లు కార్యాలయమంతా గుసగుసలు మొదలయ్యాయి. ఇతనే ముఠాకు స్కానింగ్‌ మిషన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు చిత్తూరు శాఖలో చర్చ సాగుతోంది. ఇతనితో పాటు జీడీనెల్లూరుకు చెందిన ఓ ఆశా వర్కర్‌, పాలసముద్రంకు చెందిన ఓ ఏఎన్‌ఎం పాత్ర కూడా ఉందని చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖలో చర్చించుకుంటున్నారు. అయినా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఈ మేరకు పోలీసులు చిత్తూరు కలెక్టర్‌, డీఎంఅండ్‌హెచ్‌ఓతో చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆశావర్కర్‌పై రెండు రోజుల్లో చర్యలు ఉంటాయని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా తిరుపతి భవానీ నగర్‌లో నడిపిస్తున్న స్కానింగ్‌ సెంటర్‌ను తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్‌ చేశారు. దీంతో పాటు ఒక మెటర్నిటీ ఆస్పత్రిని కూడా సీజ్‌ చేశామని తిరుపతి డీఎఅండ్‌హెచ్‌ఓ తెలిపారు.

    మళ్లీ తెరపైకి అక్రమ స్కానింగ్‌

    చిత్తూరు కలెక్టర్‌ పట్టుకున్న అక్రమ స్కానింగ్‌లో ఇది పార్ట్‌–2 చిత్తూరులో గుట్టురట్టు కావడంతో తిరుపతిలో ముఠా మక్కాం ఓ క్లినిక్‌ అడ్డాగా లింగనిర్థారణ

    తప్పుడు నిర్థారణతో తమిళనాడుకు చెందిన గర్భిణితోపాటు కుమార్తె ఆత్మహత్య!

    భర్త ఫిర్యాదుతో కేసు నమోదు!

    అక్రమ స్కానింగ్‌ ఇలా..

    మూడు నెలలకు క్రితం చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చిత్తూరు నగరంలోని భరత్‌నగర్‌లో అక్రమ స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహణ ముఠాను.. రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. 22 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. తాజాగా దీని పార్ట్‌–2 కథ బయటకు వచ్చింది. చిత్తూరులో పట్టుబడ్డ ముఠానే మళ్లీ తిరుపతి భవానీ నగర్‌లో అక్రమ స్కానింగ్‌ను ఏర్పాటు చేసుకుని లింగనిర్థారణను కొనసాగిస్తూ వచ్చింది. దీనిపై చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్రమ స్కానింగ్‌ సెంటర్‌పై వారు నిఘా పెట్టారు. తమిళనాడు నుంచి గర్భిణులను తీసుకొచ్చి తిరుపతిలో లింగనిర్థారణ చేయిస్తూ జేబులు నింపుకుంటున్నారని గుర్తించారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి ఫీజుగా రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు గుంజుకుంటున్నారని తెలుసుకున్నారు. వీళ్ల నిర్థారణలో ఓ గర్భిణికి ఇచ్చిన రిపోర్టు తప్పు అని తేలడంతో వీళ్ల బండారం మొత్తం బయటపడింది.

  • వసతి గృహాలు దారుణం
    ● డీఆర్‌ఓకువైఎస్సాఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతల వినతి

    తిరుపతి రూరల్‌ : జిల్లాలోని బాల, బాలికల ప్రభుత్వ వసతి గృహాలు దారుణంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఓబుల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా పలు ప్రభుత్వ, సంక్షేమ వసతిగృహాలను సందర్శించిన అనంతరం సమస్యల ప్రతిని శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులును కలిసి అందజేశారు. అనంతరం విద్యార్థి నాయకులతో కలసి ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను పరిశీలించామని తెలిపారు. ప్రభుత్వం పెరిగిన ధరలకనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచాలని, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లు, బాత్‌ రూములు నిర్మించాలని డిమాండు చేశారు. అలాగే వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ప్రతీ హాస్టల్లోనూ పిల్లలకు బెడ్స్‌, ప్లేట్లు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు అందించాలన్నారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వసతిగృహాలలో సిబ్బందిని నియమించి, ఖాళీగా ఉన్న వార్డెన్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యవర్గ, నియోజకవర్గ, యూనివర్సిటీ, మండల అధ్యక్షుడు భాను ప్రకాశ్‌ రెడ్డి, దినేష్‌ రెడ్డి, చంగల్‌ రెడ్డి, ప్రేమ్‌ కుమార్‌, జస్వంత్‌ కుమార్‌ రెడ్డి, మహమ్మద్‌ రఫీ, యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, హరిబాబు, ముని, వినోద్‌ కుమార్‌, ప్రదీప్‌ కుమార్‌, పార్థసారథి, శేషారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.

  • ఆయుష్‌ సేవలు మరింత బలోపేతం
    ● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

    తిరుపతి మంగళం : జిల్లాలో ఆయుష్‌ సేవలను మరింత బలోపేతం చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంటులో ఆయుష్‌ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలపై వివరాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్‌ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌ రావు జాదవ్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్‌ మిషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదేళ్లలో రూ.28.82 కోట్ల మేర కేంద్రం నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపినట్లు వివరించారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో 50 పడకల సమీకృత ఆయుష్‌ ఆస్పత్రుల ఏర్పాటు చేయాలని, మరో నాలుగు ఆయుష్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చిందని చెప్పారు. తిరుపతి ఆయుష్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎంపీ గురుమూర్తి కోరారు.

  • నూతన ఆవిష్కరణలకు ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ సహకారం

    ఏర్పేడు : శాస్త్ర, సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ (అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌) నిబద్దతతో పనిచేస్తోందని సీఈవో శివకుమార్‌ కళ్యాణరామన్‌ అన్నారు. శుక్రవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని సందర్శించి, సహకార పరిశోధనా కార్యక్రమాలు, ఆవిష్కరణ వ్యూహాలపై అధ్యాపకులతో చర్చించారు. సహకార, అంతర్‌ విభాగ పరిశోధన ప్రతిపాదనలను పెంపొందించడం, ప్రభావవంతమైన పరిష్కారాల కోసం లోతైన సాంకేతిక పరిశోధన, అభివృద్ధి, ఆర్‌ అండ్‌డీ వ్యూహాలను గురించి వివరించారు. పరిశోధకుల సామర్థ్య నిర్మాణం, అధునాతన పరిశోధన గ్రాంట్లు, కన్వర్జెషన్స్‌ హబ్‌–అండ్‌–స్పోక్‌ పరిశోధన నమూనాలు, పీఎం–ఈసీఆర్‌జీ పథకం, మెడ్‌టెక్‌లో సవాళ్లను పరిష్కరించడం వంటి అంశాలపై లోతుగా చర్చించారు. భారతీయ సంస్థలలో పరిశోధనా నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

Krishna

  • మందుల
    కృష్ణాజిల్లా
    శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
    u8లో

    దుర్గమ్మ నమోస్తుతే

    ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శ్రావణ శుక్రవారం సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి.

    తగ్గుముఖం పట్టిన వరద

    గాంధీనగర్‌: ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టింది. 89,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు. కాలువలకు 17, 576 క్యూసెక్కులు విడుదల చేశారు.

    జిల్లా మహాసభలు

    సీపీఐ ద్వితీయ జిల్లా మహాసభలు జగ్గయ్య పేటలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.

    కంకిపాడు: ఖరీఫ్‌ సాగు రైతులకు ఎరువు కరువైంది. సొసైటీల్లో ఎరువుల నిల్వలు నిండుకున్నాయి. బయటి మార్కెట్‌లో వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరత కారణంగా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. అదునుకు వేయాల్సిన ఎరువు దొరక్క పైరు ఎదుగుదల లోపిస్తుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కోటి ఆశలతో చేపట్టిన ఖరీఫ్‌ సాగు కష్టాలతో సాగుతున్నా, వ్యవసాయశాఖ కాకిలెక్కలతో సరిపెడుతుందే తప్ప ఎరువులను సమృద్ధిగా అందించడం లేదు. అండగా నిలవాల్సిన కూటమి సర్కారు రైతులను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సీజన్‌కు అవసరమైన ఎరువులను అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందగా. రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ పోరుబాట పట్టింది. ఖరీఫ్‌లో ఎరువుల కొరతను తీర్చాలంటూ రైతు పక్షాన ఆందోళనలు నిర్వహిస్తోంది.

    ఎరువుల కొరత..

    ప్రస్తుతం ఎకరాకు ఒక కట్ట యూరియా, ఒక కట్ట డీఏపీ తప్పనిసరిగా వేయాల్సి ఉంది. పైరు ఎదుగుదలకు దోహదపడే యూరియా ప్రస్తుతం దొరకడం లేదు. 80శాతం సొసైటీల్లో ఎరువులు లేకపోవడంతో వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా ఎమ్మార్పీ ధర రూ 265.50 ఉండగా, కొందరు వ్యాపారులు రూ 310 నుంచి రూ.330 వరకూ విక్రయిస్తున్నారు. డీఏపీ ఇతర ఎరువులతోపాటు జింకు, గుళికలను అంటగడుతున్నారు. అవి కొంటేనే డీఏపీ ఇస్తామంటూ రైతులను అందినకాడికి దోచేస్తున్నారు. యూరియా కొరత కారణంగా డీఏపీ రూ.1350 చొప్పున కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

    పట్టించుకోని అధికారులు...

    జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతుంటే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం తాపీగా ఎరువుల లభ్యతపై కాకిలెక్కలు చెబుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అందించడంలో విఫలమయ్యారు. మొక్కుబడిగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ఉయ్యూరులో విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టగానే, వ్యాపారులు దుకాణాలు మూసివేశారంటే బయటి మార్కెట్‌లో ఎరువుల గోల్‌మాల్‌ ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోఆపరేటివ్‌ సొసైటీల్లో 78 టన్నులు, హబ్‌లలో 0.24 టన్నులు, ఔట్‌లెట్‌లలో 534 టన్నులు, పీఏసీఎస్‌లలో 3807 టన్నులు, రిటైలర్స్‌ వద్ద 3191 టన్నులు, ఇతరుల వద్ద కలిపి జిల్లాలో మొత్తం 7,696 టన్నుల ఎరువుల లభ్యత ఉన్నట్లు అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.

    నిర్లక్ష్యం వీడని పాలకులు..

    కూటమి సర్కారు రైతు విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సాగునీరు విడుదల, విత్తనాల సరఫరాలోనూ వైఫల్యం చెందింది. తాజాగా ఎరువుల లభ్యతలోనూ అలసత్వం కనబరుస్తుండటం రైతుల పాలిటశాపంగా మారింది. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ఖరీఫ్‌ సాగు కష్ట మేననే రైతులు అభిప్రాయపడుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వహయాంలో రైతుభరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా సకాలంలో ఎరువులు అందించడంతోపాటు పెట్టుబడిసాయాన్ని సైతం అందించిన వైనాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు.

    పామర్రులో రైతులపక్షాన ర్యాలీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌,

    రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు (ఫైల్‌)

    ఖరీఫ్‌లో సాగవుతున్న వరి పంట

    7

    న్యూస్‌రీల్‌

    కూటమి ప్రభుత్వ పతనం తప్పుదు : కై లే

    పెదపారుపూడి: ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి పోయేరోజులు దగ్గరలోనే ఉన్నాయని పామర్రు మాజీఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఆయన పెదపారుపూడి వైఎస్సార్‌ సీపీ మండల నాయకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీను నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కై లే అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు అన్నిరకాల ఎరువుల అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకా ఎరువుల కృతిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు యూరియా క్లాంపెక్స్‌ అడుగుతుంటే షాపుల యజమానులు గుళికలు, జింక్‌నకు లింకు పెట్టి అమ్ముతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులకు ఎరువులు అందుబాటులో వచ్చేవరకు వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తుందని వివరించారు.

    అంతా మంత్రి ‘కొల్లు’ డైరెక్షన్‌లోనే

    వైఎస్సార్‌ సీపీ పోరుబాట..

    80వేల హెక్టార్లలో ఇప్పటికే నాట్లు..

    కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1.62లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ వరిసాగుకు అనువైన భూమి ఉంది. తొలకరి ముందస్తు పలకరింపుతో బోర్లు కింద ముందుగానే సాగు చేపట్టారు. సాగునీరు విడుదల కావడంతో జిల్లాలో సాధారణంగా వరినాట్లు వేయటం, వెద, వరుస నాట్లు పద్ధతిలో సుమారుగా 80వేల హెక్టార్లలో వరి సాగు పూర్తయ్యింది. ప్రస్తుతం వరిపైర్లు దుబ్బు చేసే దశకు చేరుతున్నాయి. శివారు గ్రామాల్లో వరినాట్లు వేస్తున్నారు.

    సొసైటీల్లో నిండుకున్న ఎరువుల నిల్వలు

    మార్కెట్‌లో అన్నదాతల జేబులకు చిల్లు

    ఎరువుల లభ్యతపై

    వ్యవసాయశాఖ కాకి లెక్కలు

    నిర్లక్ష్యంగా కూటమి సర్కారు

    రైతుపక్షాన పోరుబాటలో వైఎస్సార్‌సీపీ

    ఎరువుల కొరతతో అల్లాడుతున్న రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ పోరాటం చేపట్టింది. ఎరువులు సమృద్ధిగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ నేతృత్వంలో నియోజకవర్గవ్యాప్తంగా రైతుల పక్షాన ఆందోళనలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయ అధికారులకు వినతులు అందించి సమస్యను వివరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ సమాయత్తం అవుతోంది.

  • రైతుల

    జేసీ ఇలక్కియ

    జి.కొండూరు: భూములు రీసర్వే సమాచారాన్ని ముందుగానే తెలియజేసి, సర్వేకు సంబంధిత రైతు తప్పక హాజరయ్యేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ ఆదేశించారు. భూముల రీ సర్వేలో భాగంగా జి.కొండూరు మండల పరిధి చెవుటూరు, వెంకటాపురం గ్రామాల మధ్య గ్రామసరిహద్దులను శుక్రవారం ఆమె పరిశీలించారు. రీ సర్వే సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జి.కొండూరు శివారులో జరుగుతున్న గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులను పరిశీలించారు. జేసీ వెంట తహసీల్దార్‌ చాట్ల వెంకటేశ్వర్లు ఉన్నారు.

    నిత్యాన్నదానానికి విరాళాలు

    ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు దాతలు విరాళాలను అందజేశారు. రాజమండ్రికి చెందిన ఎం.ప్రేమ్‌కుమార్‌ ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116ల విరాళాన్ని అందజేశారు. విజయవాడ పటమటకు చెందిన ఎం.వెంకటలక్ష్మి పేరిట కుమారుడు శ్రీనివాస్‌, లలిత దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,00,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు, దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.

    సీనియర్‌ డీసీఎంగా

    ప్రశాంత్‌కుమార్‌

    రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం (డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌)గా బి.ప్రశాంత్‌కుమార్‌ శక్రవారం బాధతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీనియర్‌ డీసీఎం వావిలపల్లి రాంబాబు విజయవాడ డివిజన్‌లోనే సీనియర్‌ డివిజనల్‌ సేఫ్టీ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఆస్థానంలో ప్రశాంత్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు.

    ఐవీఎఫ్‌ సెంటర్‌ తనిఖీ

    లబ్బీపేట(విజయవాడతూర్పు): సంతాన సాఫల్య కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వైద్యసేవలు అందిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని హెచ్చరించారు. ఆమె శుక్రవారం నగరంలోని ఒయాసిస్‌ ఐవీఎఫ్‌ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. సెంటర్‌లోని రికార్డులు, రిజిస్టర్లు, అనుమతులు, పరికరాలను పరిశీలించారు. ఈసందర్భంగా డాక్టర్‌ సుహాసిని మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని ఐవీఎఫ్‌ కేంద్రాలు, ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత షోకాజ్‌ నోటీసు జారీచేసి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ఏఆర్‌టీ సెంటర్లు, ఆస్పత్రులు తప్పనిసరిగా విధి విధానాలు పాటించాలని ఆమె సూచించారు. తనిఖీల్లో ఎన్‌హెచ్‌ఎం డీపీఎం డాక్టర్‌ నవీన్‌ కూడా పాల్గొన్నారు.

    మొసళ్లున్నాయ్‌ జాగ్రత్త!

    కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో భయంకరమైన మొసళ్లు ఉన్నాయ్‌, నదిలోకి దిగి ప్రాణాలు పోగొట్టుకోవద్దని శనైశ్వర స్వామి దేవస్థానం వద్ద కృష్ణలంక పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహంలో వచ్చిన మొసళ్లు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిలో తిరుగుతున్నాయని, ఇప్పటికే ఈ ప్రాంతంలో సరదాగా ఈతకు దిగి పలువురు యువకులు మృతి చెందారంటూ ఫొటోలతో కూడిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

  • ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం..

    లబ్బీపేట(విజయవాడతూర్పు): మందుల షాపుల్లో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుంది. మత్తు మందులతోపాటు, కాలం చెల్లిన మందులు, ఫిజీషియన్‌ శాంపిల్స్‌ను కూడా అమ్మేస్తున్నారు. ఈగిల్‌ బృందాలు మొదటివిడత తనిఖీల్లో అలాంటి మందులను గుర్తించి, పలు షాపులను సీజ్‌ చేయగా, తిరిగి అవి యథావిధిగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా ఔషధ నియంత్రణ మండలి అధికారులు సైతం ఈ మెడికల్‌ మాఫియాను ఏం చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో అక్రమ మందుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

    మత్తు మందుల విక్రయాలు..

    నగరంలోని పలు షాపుల్లో మత్తు మందుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నచిన్న ఆస్పత్రిల లైసెన్స్‌లను చూపించి మత్తుమందులు కొనుగోళ్లు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా మత్తుమందులు కొనుగోళ్లు చేసిన ముఠాసభ్యులు వాటిని ఇతర ప్రాంతాలకు కొరియర్‌ ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా వెలుగు చూశాయి. పుష్పా హోటల్‌ సమీపంలోని ఓ షాపు నుంచి చైన్నెకు మత్తు మందులు సరఫరా చేయగా, అక్కడి పోలీసులు పట్టుకుని ఇక్కడకు తనిఖీలకు వచ్చారు. మూడు రోజుల కిందట మత్తు పదార్థాలు కలిగి ఉన్న యువకులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బీఆర్‌టీఎస్‌ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు మత్తుమందులు వస్తుండగా, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తుండటం గమనార్హం.

    కాలం చెల్లిన మందులు విక్రయం.

    జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లోని మందుల షాపుల్లో కాలం చెల్లిన మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. గతంలో ఈగల్‌ టీం తనిఖీల్లో సైతం పలు షాపుల్లో కాలం చెల్లిన మందులు ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆయాషాపుల లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయగా, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో మళ్లీ లైసెన్స్‌ను పునరుద్ధరించినట్లు తెలిసింది. అధికారపార్టీ నేతలు అండదండలు ఉంటే అక్రమవ్యాపారం చేసినా ఏమి కాదనే రీతిలో పలువురు రెచ్చిపోతున్నారు. దీంతో మార్కెట్‌లోకి కాలం చెల్లిన మందులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రజలకు బ్రాండెడ్‌ మందుల ధరలకే జనరిక్‌ మందులను సైతం అంటగడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ నియంత్రణ మండలి అధికారులు స్పందించి మందుల మాయాజాలం బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

    గుట్టుగా మత్తుమందుల అమ్మకాలు

    కాలం చెల్లిన మందులు,

    శాంపిల్స్‌ కూడా ..

    గతంలో ఈగల్‌ బృందం

    తనిఖీల్లో వెలుగులోకి

    అయినా ఆగని తంతు

    అమ్మకాలపై కొరవడిన నిఘా

    కాలం చెల్లిన మందులు, ఫిజీషియన్‌ శాంపిల్స్‌ విక్రయాలపై ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటాం.

    డాక్టర్‌ కె.అనీల్‌కుమార్‌, అసిస్టెంట్‌

    డైరెక్టర్‌, ఔషధ నియంత్రణ మండలి

  • కాల్‌ డేటాతో వెలికితీయాలి..

    చిలకలపూడి(మచిలీపట్నం): ఓ టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమవ్యవహారం తదనంతర ఘటనలన్నీ మంత్రి కొల్లు రవీంద్ర డైరెక్షన్‌లోనే చోటుచేసుకున్నాయని మాజీమంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీ పార్టీలోని నాయకుని కుటుంబ వ్యవహారాలు, గొడవలను చివరికి మాకు ఆపాదించడమేమిటన్నారు. మీ పార్టీ, కుటుంబవ్యవహారాల్లో జరిగిన గొడవలకు మాకేమి సంబంధమని మంత్రి కొల్లు రవీంద్రను ప్రశ్నించారు. టీడీపీ నాయకుడి కుమారుడు ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి తీసుకువెళ్లిన ఘటనతో మాకు సంబంధం ఎలా ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రేమికులను తీసుకువచ్చేందుకు పోలీసులు ఒడిశా వెళ్లడం నిజం కాదా? ప్రశ్నించారు.

    హైదరాబాద్‌ ఎందుకు తీసుకువెళ్లారు...

    టీడీపీ నాయకుడి కుమారుడు, ఆ యువతి ఒడిశాలో దొరికిన అనంతరం వారిని మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాకుండా భువనేశ్వర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారో విచారణ చేపట్టాలని నాని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా వీరితో ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న నోవాటెల్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఏమి కౌన్సెలింగ్‌ ఇచ్చారు? ఆ యవతికి ఏం చెప్పారు? యువతి తండ్రితో ఏం మాట్లాడారో పోలీసులు విచారణ చేస్తే తేటతెల్లమవుతుందన్నారు. వీటితోపాటు ఒడిశా వెళ్లేందుకు అభినవ్‌కు ఫోన్‌ పే ద్వారా డబ్బులు ఎవరు పంపించారు...భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ ఎంత మంది వెళ్లారు...విమాన టికెట్లు ఎవరు కొన్నారు...హైదరాబాద్‌ నుంచి మచిలీప ట్నంకు ఎవరు మాట్లాడితే వారిని కారులో తీసుకువచ్చారో విచారణ చేస్తే పోలీసులు ఏవిధంగా ప్రవర్తించారో ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చిలకలపూడి సీఐ నబీతోపాటు కానిస్టేబుల్‌ మల్లి తీరుపై డీఎస్పీ చప్పిడి రాజా, ఎస్పీ గంగాధరరావు పూర్తిస్థాయి విచారణ చేస్తే నిజాలు నిగ్గుతేలతాయన్నారు. ఈ వ్యవహారమంతా మంత్రి కొల్లు రవీంద్ర డైరక్షన్‌, పోలీసుల ప్రమేయంతోనే సాగిందని ఆరోపించారు.

    యువతి తల్లి తాగిన పురుగుమందు సీసా ఎక్కడ కొన్నారు, ఎవరు తెచ్చారో విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయని పేర్ని నాని అన్నారు. ఓ కుటుంబానికి అన్యాయం జరిగితే నా కుమారుడు వెళ్లి ఆసుపత్రిలో వారిని పరామర్శించడం తప్పా? అని ప్రశ్నించారు. ఓ మహిళకు అన్యాయం జరిగితే పరామర్శించిన మాపార్టీ మహిళా అధ్యక్షురాలిపై విమర్శలు చేయడం టీడీపీ వారి అనైతికతకు నిదర్శనమన్నారు. యువతి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి రాజీ చేసుకోవడం కోసం అప్సర హోటల్‌, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కొంతమంది టీడీపీ కాపు పెద్దలు యత్నించడం, గొడవలుపడటం జరగలేదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చిలకలపూడి సీఐ నబీ కాల్‌ డేటా, కానిస్టేబుల్‌ మల్లి చేసిన వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపితే ఎవరి డైరక్షన్‌లో...ఎవరి కోసం ఈతతంగమంతా చేశారో తెలిసిపోతుందన్నారు. దిగజారుడు రాజకీయాలతో యువతిని బలిచేయకుండా మనిషిగా ప్రవర్తించి వారిద్దరికీ వివాహం జరిపించాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, నగర పార్టీ అధ్యక్షులు మేకల సుబ్బన్న, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

  • ఎడ్లం

    అవనిగడ్డ: కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. పులిగడ్డ అక్విడెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పెరిగిన వరద తాకిడికి ఎడ్లంక కాస్‌వే రహదారికి గండిపడింది. దీంతో ఎడ్లంక ప్రజలు బయటకు రావాలంటే పడవ ప్రయాణమే దిక్కయింది. పడవ ఎక్కిదిగే క్రమంలో వృద్ధులు, విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడ్లంక వద్ద మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జి ఆర్డీవో బి.శ్రీదేవి, డీఎస్పీ విద్యశ్రీ, తహసీల్దార్‌ నాగమల్లేశ్వరరావు, సీఐ యువకుమార్‌, ఆర్‌ఐ బాలాజీ, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఎడ్లంకను సందర్శించి గ్రామస్తులను అప్రమత్తం చేశారు. వరద ఉధృతి పెరిగితే ఇళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

  • కూటమి ప్రభుత్వం మిథున్‌రెడ్డిని వేధిస్తోంది

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధిస్తోందని మాజీ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని కోర్టు సముదాయం వద్ద శుక్రవారం ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మిథున్‌రెడ్డి ఏ తప్పూ చేయకపోయినా తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం ఆయనను వేధిస్తోందన్నారు. జ్యూడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఆయన ఏదో తప్పు చేసినట్లుగా చిత్రీకరించే తీరు బాధ కలిగిస్తోందన్నారు. జైలులో బాత్‌ రూమ్‌లో తప్ప మిగతా అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారని, ఇందుకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హెరిటేజ్‌ సంస్థలో ఏదైనా కేసు వస్తే ఇదేరకంగా చేస్తారా? అని అంటూ నిలదీశారు. మిథున్‌రెడ్డి తాను లైడిటెక్టర్‌ టెస్ట్‌కు కూడా సిద్ధమేనని చెప్పారని, ఈ ఏడాదికాలంలో ఏ డిస్టిలరీ వద్ద మీరు ముడుపులు తీసుకోలేదని లైడిటెక్టర్‌ టెస్ట్‌కు సిద్ధమా? అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్‌ చేశారు. మీరు లేదా మేముచెప్పే మీ అనుచరుల పేర్లలో ఎవరినైనా ఈ లైడిటెక్టర్‌ టెస్ట్‌కు పంపుతారా అని నిలదీశారు. వైఎస్సార్‌సీపీపై బురద జల్లడం మానేసి, ప్రజలకు మేలు చేసే విషయంపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.

    మాజీ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

  • ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని  అందిపుచ్చుకోవాలి

    లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యులంతా ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ సూచించారు. ఇండియన్‌ నెఫ్రాలజీ సొసైటీ సదరన్‌ చాప్టర్‌ 44వ వార్షిక సదస్సు విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో శుక్రవారం ప్రారంభమైంది. వీసీ మాట్లాడుతూ ఆధునిక వైద్యచికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి.శ్రీహరిరావు, సదస్సు ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.అమ్మన్న, 600మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Movies

  • కోలీవుడ్లో దీన, రమణ, గజనీ, తుపాకీ, సర్కార్‌ ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్‌ దర్శకుల లిస్ట్‌లో ఏఆర్‌.మురుగదాస్‌ చేరిపోయారు. ఈయన తెరకెక్కించిన గజనీ చిత్రాన్ని హిందీలో అమీర్‌ఖాన్‌ హీరోగా చేసి విజయాన్ని సాధించారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవి హీరోగా స్టాలిన్‌ పేరుతో ఒక సినిమా చేశారు. ఇటీవల సల్మాన్‌ఖాన్‌ హీరోగా సికిందర్‌ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నెటిజన్లతో పాటు బాలీవుడ్ప్రేక్షకులు కూడా దర్శకుడితోపాటు యూనిట్‌ సభ్యులపై విమర్శలు గుప్పించారు. 

    కాగా మురుగదాస్‌ ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌ హీరోగా మదరాసి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టంబర్‌ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మురుగదాస్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను ఇతర భాషల్లో చిత్రాలు చేసేటప్పుడు దివ్యాంగుల్లా భావన కలుగుతుందన్నారు. అదే మాతృభాషలో చిత్రం చేయడం చాలా బలం అని అన్నారు. కానీ, తెలుగులో మాత్రం అలాంటి ఇబ్బంది రాలేదన్నారు. ఎందుకంటే తెలుగు భాష కూడా ఇంచుమించు మన భాషలానే ఉండడంతో పట్టు దొరుకుతుందన్నారు. 

    భాష తెలియని ప్రాంతంతో చిత్రం చేయడం దివ్యాంగుల మాదిరి భావన కలుగుతుందనే అభిప్రాయాన్న మురుగదాస్‌ వ్యక్తం చేశారు. కాగా హిందీలో రెండు చిత్రాలు చేసిన ఆయన ఇలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. హిందీలో తెరకెక్కించిన సికిందర్‌ సినిమా డిజాస్టర్కావడం వల్లనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Business

  • జూన్‌ త్రైమాసికంలో భారత్‌ సహా ఇరవై నాలుగు మార్కెట్లలో రికార్డు స్థాయిలో ఆదాయాలు సాధించినట్లు అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. ఐఫోన్లు, మ్యాక్, సర్వీసులు మొదలైన విభాగాలు ఇందుకు దోహదపడినట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలోనూ ఐఫోన్ల విక్రయాలు పెరిగాయని, భారత్‌తో పాటు దక్షిణాసియా, బ్రెజిల్‌లాంటి వర్ధమాన మార్కెట్లలో రెండంకెల స్థాయి వృద్ధి నమోదైందని ఆయన వివరించారు.

    ఇదీ చదవండి: ‘ఏఐకి అంత సీన్‌ లేదు’

    మరోవైపు, అమెరికా టారిఫ్‌ల అంశం తీసుకుంటే 800 మిలియన్‌ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త టారిఫ్‌లేమీ లేకపోతే సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది 1.1 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని కుక్‌ వివరించారు. జూన్‌ త్రైమాసికంలో యాపిల్‌ ఆదాయం 10 శాతం పెరిగి 94.04 బిలియన్‌ డాలర్లకు, లాభం 9.2 శాతం పెరిగి రూ.23.42 బిలియన్‌ డాలర్లకు చేరింది.
     

Srikakulam

  • దళితుల భూములకు రక్షణ కల్పించాలి

    ఎచ్చెర్ల : బుడతవలస దళితల భూములకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ, కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనారి మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం లావేరు మండలం బుడతవలస గ్రామాన్ని సందర్శించి వివాదాస్పద భూమిని వీరు పరిశీలించారు. 2006లో అప్పటి ప్రభుత్వం దళితులైన పిన్నింటి లక్ష్మీ, రమణమ్మ, కుప్పిలి అనసూయ, సింహాచలంలకు సర్వే నంబర్లు 344/4, 344/8, 344/9, 344/10 లో 6.43 ఎకరాల డీ పట్టాలను మంజూరు చేసిందని తెలిపారు. ఈ భూముల్లో నీలగిరి మొక్కలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇటీవల నడుపూరి రాంబాబు, మహాంతి రాజులు, రూప వచ్చి నీలగిరి తోటలు నరుక్కుపోయారని, ఈ విషయమై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భూములను దళితులకు అప్పగించాలని డిమాండ్‌చేశారు.

  • అర్హులందరికీ పింఛన్లు

    శ్రీకాకుళం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పెన్షన్‌ విధానం అమలు చేస్తోందని ఎస్‌ఎంఈ, ఎన్నారై, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పాత్రునివలసలో శుక్రవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదిన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నెలకు సుమారు రూ. 2,700 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.

    రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన సూపర్‌సిక్స్‌ హామీలన్నీంటినీ నెరవేర్చామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం అన్నదాత సుఖీభవ పథకం, 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

  • క్యాంపస్‌ డ్రైవ్‌లో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రతిభ

    ఎచ్చెర్ల : శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో ఏడుగురు సీఎస్‌ఈ విద్యార్థులు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని గ్రిడ్లైక్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగాలు దక్కించుకున్నారు. నెలకు రూ. 20 వేలు స్టైపండ్‌తో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాక సంవత్సరానికి రూ.8,00,00 ప్యాకేజీ అందిస్తారు. ఈ సందర్భంగా ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బాలాజీ, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి డాక్టర్‌ మునిరామకృష్ణ, డీన్‌ ఆఫ్‌ అకడమిక్స్‌ డాక్టర్‌ శివరామకృష్ణ, ఫైనాన్స్‌ అధికారి వాసు, వెల్ఫేర్‌ డీన్‌ డాక్టర్‌ గేదెల రవి, సీఎస్‌ఈ విభాగాధిపతి వై.రమేష్‌, అధ్యాపకులు అభినందిస్తూ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందించారు.

  • జాప్యానికి సిగ్గుపడుతున్నాం

    శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పనుల్లో జాప్యం జరగడంపై సిగ్గుపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. అయితే దీనివెనుక సవాలక్ష కారణాలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల సెమినార్‌ కమ్‌ వర్క్‌షాప్‌ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు, వసతులు కల్పించలేకపోతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఐదు జోనల్‌ పరిధిలో గ్రిగ్స్‌మీట్‌ల నిర్వహణకు అవసరమైన రూ. 5లక్షల నిధులను మంజూరుకు కలెక్టర్‌తో మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉప విద్యాశాఖాధికారులు ఆర్‌.విజయకుమారి (శ్రీకాకుళం), పి.విలియమ్స్‌(టెక్కలి) మాట్లాడుతూ పీడీ–పీఈటీలకు పాఠశాలల్లో క్రీడల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కారిస్తామన్నారు.

    అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌, గ్రిగ్స్‌ పోటీల కోసం జిల్లా, డివిజన్‌, నియోజకవర్గం స్థాయి క్రీడల నిర్వహణ తలెత్తుతున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సలహాదారు పి.సుందరరావు, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ బి.వి.రమణ, గ్రిగ్స్‌ సెక్రటరీ కె.మాధవరావు, సంపతిరావు సూరిబాబు, మెట్ట తిరుపతిరావు, తవిటయ్య, రాజారావు, శేఖర్‌బాబు, నారాయణరావు, జగదీష్‌, నిర్మల్‌కృష్ణ, హెచ్‌ఎంలు హరిబాబు, పోలినాయుడు, ఎమ్మెస్‌ చంద్రశేఖర్‌, ఎంఈఓ సోంబాబు, విజయనగరం జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి వెంకట్‌నాయుడు, నియోజకవర్గ, మండల స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్లు, పీడీలు, పీఈటీ పాల్గొన్నారు.

    పీడీ–పీఈటీ వర్క్‌షాప్‌ ప్రారంభంలో ఎమ్మెల్యే శంకర్‌

    గ్రిగ్స్‌మీట్‌ క్రీడాపోటీలకు రూ.5లక్షలు మంజూరు చేయిస్తామని హామీ

    నిధులు కేటాయించండి..

    జోన్‌–1 పరిధిలో రీజనల్‌ ఇన్‌స్పెక్షర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐ పీఈ) పోస్టును ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. గ్రిగ్స్‌మీట్‌లను ఐదు జోన్‌ల పరిధిలో నిర్వహించేందుకు కనీసం రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలి. స్కూల్‌గేమ్స్‌ ఎంపికల పోటీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ బిల్డింగ్‌ కోసం కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

    – మొజ్జాడ వెంకటరమణ, పీడీ–పీఈటీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

  • రేపు

    నరసన్నపేట: నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 3న జిల్లా యోగాసనా చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద ధ్యాన యోగా సమితి అధ్యక్షుడు కింజరాపు రామారావు తెలిపారు. యోగాసన స్పోర్ట్‌ అసోషియేషన్‌ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అభ్యాసకులకు ఇచ్చే టీషర్టులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ , ఎన్‌వైఎస్‌ఎఫ్‌ కార్యదర్శి బోత్స కేదారినాథ్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 7 కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు.

    బాక్సర్‌కు అభినందనలు

    శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ బాక్సింగ్‌ సంచలనం జి.సత్యభార్గవ్‌ను డీఎస్‌డీఓ డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు అభినందించారు. శుక్రవారం కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద శిక్షణకు హాజరైన సత్యభార్గవ్‌ను, తీర్చిదిద్దుతున్న కోచ్‌ పి.ఉమామహేశ్వరరావును మెచ్చుకున్నారు. హర్యానాలోని రోతక్‌ వేదికగా జరిగిన ఆలిండియా జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఈ యువ బాక్సర్‌ రజత పతకంతో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్‌ కోచింగ్‌ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. త్వరలో శిక్షణా శిబిరాలకు హాజరుకానున్నట్టు కోచ్‌ తెలిపారు.

    రెడ్డీస్‌లో బ్యాటరీలు చోరీ

    రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటీస్‌ సీటీవో–6 పరిశ్రమలో గత నెల 23న నాలుగు పెద్ద బ్యాటరీలు చోరీ జరిగినట్లు జె.ఆర్‌.పురం పోలీసులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌.చిరంజీవి శుక్రవారం చెప్పారు.

  •  గుర్

    టెక్కలి రూరల్‌: స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, రెండు రోజులుగా టెక్కలిలోనే తిరిగాడని స్థానికులు చెబుతున్నారు. గురువారం రాత్రి సమీప షాపుల బయట పడుకుని ఉదయం వెళ్లిపోయాడని, మధ్యాహ్నానికి మృతి చెంది కనిపించాడని అంటున్నారు. మృతుడు నీలం టీషర్టు, ట్రాక్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని ఎస్‌ఐ రాము కోరారు.

    బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి

    గోవాలో ఘటన

    వజ్రపుకొత్తూరు: పల్లివూరు పంచాయతీ హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు కారి రాజులు(44) గోవాలో శుక్రవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజులు స్థానికంగా వేట సాగకపోవడంతో గోవాకు వలసవెళ్లాడు. అక్కడ శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో వేట సాగిస్తుండగా అలల ధాటికి బోటు బోల్తా పడింది. బోటు కిందే రాజులు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. రాజులు తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోగా, భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలు స్వాతి, స్వప్న ఉన్నారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోవా పోలీసులు పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని గ్రామానికి పంపిస్తారని స్థానికులు తెలిపారు.

  • సమాచార హక్కు చట్టంతో జవాబుదారీతనం

    శ్రీకాకుళం న్యూకాలనీ: సమాచార హక్కు చట్టం అమలుతో ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం పెరిగిందని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ (అటానమస్‌) కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కింతలి సూర్యచంద్రరావు అన్నారు. ఆమదాలవలస, రాజాం, పాలకొండ, తొగరాం, సీతంపేట, వీరఘట్టం, శ్రీకాకుళం(పురుషులు, మహిళలు) కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌ తదితర పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం–2005 ప్రవేశపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ ఈ పోటీలు నిర్వహించిందన్నారు. ఈ చట్టంభారత పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తుందన్నారు. పాలనలో పారదర్శకతతోపాటు జవాబుదారీతనాన్ని పెంచిందన్నారు. పోటీల విజేతలను జోనల్‌స్థాయికి పంపిస్తామని, చివరిగా రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.చిన్నారావు, ఐక్యుఏసీ కో–ఆర్డినేటర్‌ ఎస్‌.పద్మావతి, అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.మౌనిక, బోటనీ హెచ్‌ఓడీ ఎస్‌.రుద్రమరాణి, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • కార్మికుల పొట్టకొట్టొద్దు

    ఎచ్చెర్ల: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎచ్చెర్ల ఐఎంఎల్‌ డిపోకు భూములిచ్చిన కార్మికుల పొట్టలను కొట్టవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్‌ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం డిపో వద్ద హమాలీలు మోకాళ్లపై కూర్చుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు తీసుకుని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉపాధిని కల్పించారని చెప్పారు. ఇప్పటికీ దీనినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో డిపోను విడదీసి బతుకులను రోడ్డుపాలు చేయడం తగదన్నారు. నిరసన కార్యక్రమంలో హమాలీల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డి.బంగార్రాజు, టి.రామారావు, ఎం.సురేష్‌, బోనెల రాము, లింగాల రాము, జి.గురుమూర్తి, పట్నాన రామారావు, ఎల్‌.సీతారాం, రాజు, కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

  • న్యాయం చేస్తారా.. చనిపోమంటారా?

    టెక్కలి రూరల్‌: తనకు, పిల్లలకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం ఓ మహిళ పురుగుల మందుతో టెక్కలి పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించింది. గతంలో తన భర్తతో తగాదా ఉంటే పోలీసులు కోర్టులో రాజీ చేయించి తమను బాగా చూసుకుంటాడని చెప్పారని, తర్వాత పూర్తిగా పట్టించుకోవడం మానేశాడని వాపోయింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమన్నారు. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పురుగు మందు బాటిల్‌ను తీసుకుని స్టేషన్‌లోకి తీసుకువెళ్లి మాట్లాడారు. భర్తను పిలిపించి తనకు న్యాయం చేస్తామని ఎస్‌ఐ రాము నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించారు. కాగా, స్టేషన్‌ వద్ద మహిళ బైఠాయించిందన్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించే క్రమంలో పోలీసులు అడ్డుతగిలారు. ఫొటోలు తీయడానికి వీలు లేదంటూ పంపించేశారు.

    పురుగుమందు బాటిల్‌తో మహిళ నిరసన

    టెక్కలి పోలీస్‌స్టేషన్‌ ఎదుట కలకలం

  • పాలకులకు గుణపాఠాలు చెప్పాలని..

    శ్రీకాకుళం న్యూకాలనీ: పాలకులకు గుణ‘పాఠాలు’ చెప్పేందుకు గురువులు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ లోకానికి ఇచ్చిన హామీలపై అతీగతీ లేకపోవడంతో సర్కారు చెవులకు వినిపించేలా గర్జించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించి, పాఠాలు చెప్పేందుకు అవకాశం ఇ వ్వాలని కోరుతూ శనివారం ఆందోళన చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. సర్కారు వైఖరిపై గురువులంతా గుర్రుగా ఉన్నారు. తమ డి మాండ్లను ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నా అటు ప్రభుత్వంలో గానీ, ఇటు ఉన్నతాధికారుల్లో గానీ చలనం లేదు. కనీసం సీఎంగాని, చీఫ్‌ సెక్రటరీ గానీ సమావేశం నిర్వహించడం లేదని, ఒక ప్రకటన కూడా చేయడం లేదని వాపోతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలవడం కూడా కష్టంగా మారిపోయిందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉద్యమ బాటకు శ్రీకారం చుడుతున్నారు.

    నేడు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా..

    అటు విద్యాశాఖలో ఉపాధ్యాయులకు పాఠాల బోధనకు ఎదురవుతున్న సమస్య లు, ఇటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఆర్థిక పరమైన డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్‌ 2వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఽఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో సైతం ధ ర్నాను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఫ్యా ప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 ప్రధానమైన డిమాండ్ల సాధనకు శనివారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాప్టో చైర్మన్‌ బమ్మిడి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ జన రల్‌ పడాల ప్రతాప్‌కుమార్‌, కో చైర్మన్లు పూజారి హరిప్రసన్న, వాల్తేటి సత్యనారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఎస్‌వీ రమణమూర్తి, మజ్జి మదన్‌మోహన్‌, బి.వెంకటేశ్వర్లు, కోశాధికారి కె.జగన్‌మోహన్‌రావు, కార్యవర్గ సభ్యులు ఎల్‌.బాబూరావు, పి.కృష్ణారావు, వై.వాసుదేవరావు, జి.రమణ, ఎస్‌వీ అనీల్‌కుమార్‌, బి.రవి, ఎస్‌ఏఎల్‌వీ పూర్ణిమ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు.

    ఫ్యాప్టో ప్రధాన డిమాండ్లలో కొన్ని..

    ● ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమా లు లేకుండా చేయాలి. పీ–4 వంటి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు.

    ● నూతనంగా అప్‌గ్రేడ్‌ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.

    ● ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి.

    ● అంతర్‌ జిల్లాల బదిలీలను చేపట్టాలి.

    ● 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.

    ● 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌)ని తక్షణమే ప్రకటించాలి. మూడు పెండింగ్‌ డీఏలను ప్రకటించాలి. డీఏ బకాయిలను, 11వ పీఆర్పీ బకాయిలను, సరెండర్‌ లీవ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలి.

    ● సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి.

    బోధనలో ఎదురవుతున్న సమస్యలు, ఆర్థిక పరమైన అంశాల సాధనపై నేడు పోరుబాట

    బోధనేతర బాధ్యతలపై గుర్రుగా ఉన్న గురువులు

    సీపీఎస్‌ రద్దు, కారుణ్య నియామకాలు ఇతరత్రా డిమాండ్ల సాధనే ధ్యేయంగా ధర్నా

    కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టేందుకు ఏర్పాట్లు

  • 2478

    సారవకోట: మండలంలో వృద్ధులు, దివ్యాంగుల ఇచ్చే రేషన్‌ సరుకులు 800 మందికి మా త్రమే అందజేశారు. జూలై నెల 25 నుంచి 31లోగా వృద్ధులు, దివ్యాంగుల ఇంటికెళ్లి రేషన్‌ సరుకులు అందజేయాలి. మండలంలో 2478 మంది వృద్ధులు, దివ్యాంగులు ఉండగా.. 800 మందికి మాత్రమే అందజేశారు. సంబంధిత అధికారులు రేషన్‌ డీలర్లకు దీనిపై సరైన ఆదేశాలు అందించకపోవడం వల్లనే కొందరు రేషన్‌కు దూరమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ

    గార: అంపోలు జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.హరిబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ముద్దాయిలకు అందించే ఆహార పదార్థాలను రుచి చూశారు. గ్రంథాలయం, మహిళా బ్యారక్‌లు పరిశీలించి ముద్దాయిలతో మాట్లాడారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచనలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జైలర్‌ దివాకర్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

    అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము

    నరసన్నపేట: మండలంలోని బడ్డవానిపేట అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం నాగు పా ము భయోత్పాతం సృష్టించింది. 10 అడుగులకు పైగా పొడవున్న పామును సెంటర్‌లో ఒక్కసారిగా చూసిన అంగన్‌వాడీ వర్కర్‌ పి.వనజాక్షి ఆందోళనకు గురైంది. స్థానికులు వెంటనే స్పందించి పామును పట్టుకుని బయటకు వదిలారు. అంగన్‌వాడీ వర్కర్‌ వనజాక్షి మా ట్లాడుతూ ఉదయం 9 గంటల సమయంలో కేంద్రాన్ని తెరిచానని, నలుగురు పిల్లలను బయట కూర్చోబెట్టి తలుపులు తెరిచి వంట చేసేందుకు అట్ట పెట్టె తెరవగా పాము కనిపించిందని, స్థానికులను పిలిస్తే వారు వచ్చి పట్టుకుని బయటకు పంపారని తెలిపారు.

    జిల్లా డైమండ్‌ జూబ్లీ వేడుకలకు శ్రీకారం

    శ్రీకాకుళం పాతబస్టాండ్‌: శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు జరిగే డైమండ్‌ జూబ్లీ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని జిల్లా రెవెన్యూ అధి కారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వి విధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చే సిన సమీక్ష సమావేశంలో ఆయన మా ట్లాడారు. జిల్లా పురోగతిని ప్రతిబింబించేలా ప్రతి కార్యక్రమాన్ని రూపొందించాలని, ప్ర జలంతా పాల్గొనాలనిపించేలా ఉత్సవాలు ఉండాలని ఆయన అన్నారు.

    ● ఆగస్టు 13న ఉదయం 10 గంటలకు మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో వేడుకలు ప్రారంభం.

    ● 1950 నుంచి 2025 వరకు జిల్లాలో అభివృద్ధిని ఆవిష్కరించే సాంస్కృతిక ప్రదర్శనలు.

    ● సాయంత్రం 4 నుంచి 7.30 వరకు ఆర్ట్స్‌ కాలేజీ రోడ్‌ నుంచి 7 రోడ్ల జంక్షన్‌ వరకు శోభాయాత్ర. ఆదివాసీ తెగల జానపద నృత్యాలు, సంగీతం, వారసత్వ కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణ.

    ● రాత్రి 6 నుంచి 10 వరకు ఫుడ్‌ స్టాల్స్‌. స్థానిక రుచులు, తెగల మిల్లెట్‌ ఫుడ్‌, తీరప్రాంత వంటకాలు అందుబాటులోకి.

    ● ఆగస్టు 14న ఉదయం 8 నుంచి సంప్రదాయ క్రీడల పోటీలు, చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు. థింసా నృత్యాలు, స్వాతంత్య్ర పోరాట ఇతివృత్తాల నాటకాలు.

    ● ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల అనంతరం డైమండ్‌ జూబ్లీ ప్రత్యేక పతాకం ఆవిష్కరణ.

  • హాస్టళ్లను రక్షించాలని వినతి
    ● శ్రావణం.. పావనం

    పవిత్ర శ్రావణ శుక్రవారం పూట అమ్మవారి ఆలయాలు కళకళలాడాయి. జిల్లా కేంద్రంలోని బలగలో గల బాలా త్రిపుర కాలభైరవ ఆలయంలోని అమ్మవారిని లక్ష గాజులతో సలక్షణంగా అలంకరించారు. అలాగే 108 రకాల పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పించారు. సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. – శ్రీకాకుళం కల్చరల్‌

    వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో తగ్గిన ‘అన్నదాత సుఖీభవ’ అర్హుల సంఖ్య

    ఈ ఏడాది 2.74లక్షల మందికి మాత్రమే సుఖీభవ

    వైఎస్సార్‌ హయాంలో 3.22 లక్షల మందికి రైతు భరోసా అందించిన వైనం

    గత ఏడాదిని పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం

  • ఎంఈఓ–1 నియామకాల్లో ఉమ్మడి సీనియారిటీ పాటించారా..?

    శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న విడుదల చేసిన ఎంఈఓ–1 నియామకాల ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉమ్మడి సీనియారిటీ నుంచి ఎంపిక చేయకుండా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్ర మే పరిగణలోకి తీసుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఏపీయూఎస్‌), పీఆర్‌టీయూ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఈఓ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే తీవ్రస్థాయి ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం వారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు.

    కార్యక్రమంలో ఆపస్‌ సంఘం నాయకులు దుప్పల శివరామ్‌ ప్రసాద్‌ పీఆర్‌టీయూ నాయకులు తంగి మురళి మోహనరావు, పప్పల రాజశేఖర్‌, కీలు సోమేశ్వరరావు, పైడి కాశీ విశ్వనాథరావు, బత్తుల రవి, ఎచ్చెర్ల మురళి, వేణు తదితరులు పాల్గొన్నారు.

  • అప్పులు చేశాక సాయం..

    ఏటా నైరుతి రుతుపవనాలు జూన్‌ చివరిలో వచ్చేవి. ఈ ఏడాది మాత్రం మే నెల చివరి నాటికే ప్రవేశించాయి. దీంతో ఖరీఫ్‌ కాసింత ముందుగానే మొదలైంది. ఇది వరకు ఖరీఫ్‌ పనులు మొదలయ్యే నాటికే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అందజేసేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఒక ఏడాదిని మర్చిపోయి.. రెండో ఏడాది ఆగస్టు వచ్చేనాటికి జమ చేయడం దారుణమని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రైతులు పొలాలు దుక్కి దున్నడానికి, విత్తనాలు కొనుగోలు చేయడానికి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాక ఇంత ఆలస్యంగా పథకాన్ని అమలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Suryapet

  • 1,600

    సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌) ద్వారా శుక్రవారం నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జనవరి నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పవర్‌ ప్లాంట్‌లోని రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. దాంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్‌ విద్యుదుత్పత్తి చేస్తుండగా, శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యూనిట్‌–1 నుంచి జాతికి అంకితం చేశారు. దాంతో మరో 800 మెగావాట్లు కలుపుకొని 1600 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్‌ విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. వైటీపీఎస్‌ యూనిట్‌ –1 ప్రారంభం అనంతరం రూ.970 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పనులకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం వైటీపీఎస్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరో మూడు యూనిట్లను వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులు ఆదేశించారు. పవర్‌ ప్లాంట్‌ ద్వారా మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే స్టేజ్‌–1లోని రెండు యూనిట్లను పూర్తి చేయడంపై ఆయన వైటీపీఎస్‌ అధికారులు, సిబ్బందిని అభినందించారు. పవర్‌ ప్లాంట్‌ ఆవరణలో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    నిర్వాసితులకు ఉద్యోగాలిస్తున్నాం :

    మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

    యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో భూములు పోయిన పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విష్ణుపురం డబుల్‌ రైల్వే లైన్‌ పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వైటీపీఎస్‌ వద్దకు రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడంతోపాటు.. క్లీయరెన్స్‌ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ వైటీపీఎస్‌లోని అన్ని విభాగాల్లో లాగ్‌బుక్‌ ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్‌ శంకర్‌నాయక్‌, నెల్లికంటి సత్యం, రాష్ట్ర జెన్‌కో సీఎండీ డాక్టర్‌ హరీష్‌, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, హైడల్‌ డైరెక్టర్‌ బాలరాజు, కోల్‌ డైరెక్టర్‌ నాగయ్య, థర్మల్‌ డైరెక్టర్‌ వై.రాజశేఖర్‌రెడ్డి, జెన్‌కో సివిల్‌ డైరెక్టర్‌ అజయ్‌, జెన్‌కో హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ కుమార్‌రాజు పాల్గొన్నారు.

    చివరి దశకు చేరుకున్న నాలుగో యూనిట్‌ పనులు

    పవర్‌ ప్లాంట్‌లోని 3, 4, 5 యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. నాలుగో యూనిట్‌ పనులు చివరి దశకు చేరుకున్నారు. గత ఏడాది నవంబర్‌లోనే నాలుగో బాయిలర్‌ లైటింగ్‌ (స్టీమ్‌ జనరేషన్‌) పనులు పూర్తికాగా, ప్లాంట్‌ సింక్రనైజేషన్‌కు సంబంధించి బాయిలర్‌ స్టీమ్‌ బ్లోయింగ్‌ ఆపరేషన్‌, నార్మలైజేషన్‌ పనులను ఈ నెల చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. యూనిట్‌–3 సింక్రనైజేషన్‌ను సెప్టెంబర్‌ నాటికి పూర్తిచేసి, అక్టోబర్‌లో కమర్షియల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించేలా పనులను చేపట్టారు. డిసెంబర్‌లో సింక్రనైజేషన్‌ పూర్తి చేసి, 2026లో ఫిబ్రవరిలో కమర్షియల్‌ ఆపరేషన్‌ ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ పేర్కొంది.

    ఫ యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోని రెండు యూనిట్లలో ఉత్పత్తి

    ఫ ఈ ఏడాది జనవరిలో సీఎం చేతుల మీదుగా యూనిట్‌–2 ప్రారంభం

    ఫ శుక్రవారం యూనిట్‌–1ను జాతికి

    అంకితం చేసిన డిప్యూటీ సీఎం భట్టి

    ఫ వచ్చే ఏడాది జనవరి నాటికి మిగతా మూడు యూనిట్లు పూర్తిచేయాలని ఆదేశం

    ఫ పనులపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, ఉత్తమ్‌, కోమటిరెడ్డితో కలిసి సమీక్ష

  • ముఖ హ
    తొలిరోజు 2,689 మంది

    ఉపాధ్యాయులకు

    ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ అమలు

    సాంకేతిక సమస్యలతో

    ఆలస్యంగా రిజిస్ట్రేషన్‌

    జిల్లాలో 881 స్కూళ్లు..

    4,542 మంది టీచర్లు

    సూర్యాపేటటౌన్‌ : విధులు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లకు ఇకనుంచి చెక్‌ పడనుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ముఖ గుర్తింపు (ఫేస్‌ రికగ్నిషన్‌) హాజరు విధానం అమలు చేస్తున్నారు. ఇందుకు ఉపాధ్యాయులే నేరుగా తమ సెల్‌ ఫోన్లలోనే ఆన్‌లైన్‌ విధానంలో హాజరు నమోదు చేసుకునేలా టీజీఎఫ్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రత్యేక యాప్‌ రూపొందించారు. ఈ నూతన విధానాన్ని శుక్రవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. అయితే మొదటి రోజు 2,689 మంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లు జరగలేదు. శనివారం అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయనున్నారు.

    విద్యార్థులకు మాదిరిగానే..

    గతేడాది నుంచి పాఠశాలల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను ఉపయోగించి విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు టీచర్లకు హాజరు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేసేలా ఏర్పాట్లు చేశారు.

    యాప్‌లో రిజిస్ట్రేషన్‌ ఇలా..

    జిల్లాలోని 881 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 4,542 మంది పనిచేస్తున్నారు. కొత్త విధానం అమలులో భాగంగా సంబంధిత ఉద్యోగి స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రిజిస్టర్‌ చేసుకొని లాగిన్‌ కావాలి. యాప్‌ ఇన్‌స్టాలేషన్‌ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశాల ఆవరణ లాంగిట్యూడ్‌, లాటిట్యూడ్‌లను టెక్నీషియన్‌ అప్‌లోడ్‌ చేస్తారు. ఒక్కసారి లాగిన్‌ అయిన తరువాత యాప్‌ నిరంతరంగా వినియోగించవచ్చు. ఇక ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి పాఠశాలకు వచ్చిన తర్వాత యాప్‌ను ఓపెన్‌ చేసి క్లాక్‌ ఇన్‌ అనే ఆప్షన్‌ నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్‌లైన్‌లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. పాఠశాలలో పని సమయం, ముగిసిన తర్వాత క్లాక్‌ ఔట్‌ అనే ఆప్షన్‌పై టచ్‌ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయాన్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారి ఆన్‌లైన్‌లో చేరుతుంది.

    విద్యార్థులకు మెరుగైన బోధన

    ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు కొందరు సమయానికి రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలులోకి తెచ్చింది. దీతో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా మెరుగైన బోధన అందుతుంది. మిగిలిన ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్‌ శనివారం పూర్తవుతుంది.

    – అశోక్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

    ఉత్తమ బోధనే లక్ష్యంగా..

    ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. విద్యార్థులకు ఉత్తమ బోధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. చాలామంది పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్కూళ్లకు వేళకు చేరుకోవడం లేదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు విద్యాశాక ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

  • కోటపహ

    ఆత్మకూర్‌(ఎస్‌) : మండలంలోని కోటపహాడ్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.విజయ్‌ కుమార్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. కార్యదర్శి విధులకు సక్రమంగా రాకుండా గ్రామంలో పారిశుద్ధ్యం పనులు పట్టించుకోకపోవడంతో వీధులు, మురికి కాలువల్లో చెత్తపేరుకుపోయి దుర్వాసన వస్తోందని మూడు రోజులు క్రితం గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడం, నిరసన గురించి పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ విచారణ చేపట్టి కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారని ఎంపీడీఓ తెలిపారు.

    నీట్‌ పీజీ పరీక్షకు

    ఏర్పాట్లు పూర్తి

    కోదాడరూరల్‌ : నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని సన కళాశాలలో ఆదివారం జరగనున్న నీట్‌ పీజీ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. సన కళాశాలలో 50 మంది, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాలలో 180 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అభ్యర్థులను 7 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. పరీక్ష హాల్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదని, సీసీ కెమోరాలు, జామర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్‌ వాజిద్‌అలీ, కళాశాల సిబ్బంది ఉన్నారు.

    పీహెచ్‌సీల్లో కాన్పుల

    సంఖ్య పెరగాలి

    అర్వపల్లి: పీహెచ్‌సీల్లో సాధారణ కాన్పుల సంఖ్య పెరిగేలి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు జ్వర పీడితులను గుర్తించి వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ భూక్యా నగేష్‌నాయక్‌, సీహెచ్‌ఓ ఎం.బిచ్చునాయక్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.

    ఎనిమిది గేట్ల ద్వారా

    పులిచింతల నీటి విడుదల

    మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు 2,08,455 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో అధికారులు 8 గేట్లను మూడు మీటర్ల మేరకు పైకెత్తి 2,05,279 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్‌కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్ట అధికారులు తెలిపారు.

  • చేయూత పింఛన్లు పెంచేవరకు పోరు

    హుజూర్‌నగర్‌ : ప్రభుత్వం చేయూత పింఛన్లు పెంచేవరకు పోరాడుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో చేయూత పింఛన్‌దారుల జిల్లా సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, గీత, బీడీ, చేనేత కార్మికుల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని, వికలాంగులకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌తో మంత్రుల నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించిన అనంతరం ఈనెల 13న హైదరాబాద్‌లో చేయూత పింఛన్‌దారుల మహా గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ మహాగర్జనకు పింఛన్‌దారులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు బివెంకటేశ్వర్లు, సీహెచ్‌.వినయ్‌ బాబు, ఆర్‌ సురేష్‌, సీహెచ్‌.నాగయ్య, బి.ప్రసాద్‌, ఒగ్గు విశాఖ, ఎం.వెంకటేశ్వర్లు, శరత్‌బాబు, ఎం.నాగరాజు, రాజేష్‌, శరత్‌, ఖాసీం, సతీష్‌, వినయ్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, నాగరాజు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఫ మంద కృష్ణమాదిగ

  • కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయాలి

    సూర్యాపేట : కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో 42శాతం రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని యునైటెడ్‌ పూలే ఫ్రంట్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి రామ్‌కోటి ప్రజాపతి, రాష్ట్ర నాయకుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ బిల్లు సాధన కోసం ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించే 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష వాల్‌ పోస్టర్లను శుక్రవారం సూర్యాపేటలోని జే ఫంక్షన్‌ హాల్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డిలు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. నిరాహార దీక్షకు 30 కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పగిళ్ల సైదులు, రెడ్డబోయిన నరేష్‌, కె.వీరబాబు, సట్టు మురళి, వేముల వీరమల్లు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు గొట్టిపర్తి లింగయ్య, ఎలకపల్లి సైదులు, ప్రవీణ్‌, రాచమల్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

  • సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

    మోతె : సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహనణ కల్పించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శుక్రవారం మోతె పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. అన్ని రకాల రిజిస్టర్లు, బ్లడ్‌ టెస్టులు, మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏఎన్‌సీ చెకప్‌కు వచ్చిన వారితో కలెక్టర్‌ మాట్లాడి వారి ఆరోగ్య విషయాలను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు వైద్యధికారులు కృషి చేయాలన్నారు. ఎక్కడైన డెంగీ కేసులు గుర్తిస్తే వారి ఇంటి పరిసరాల్లో శానిటేషన్‌ చేయించాలన్నారు. గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం తీసుకుంటే శిశువులో ఎదుగుదల ఉంటుందన్నారు. భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. రాంపురంతండాలో ఎస్సారెస్పీ 22–ఎల్‌ కాల్వను పరిశీలించి సాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్‌, తహసీల్దార్‌ వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు, పీహెచ్‌సీ డాక్టర్‌ యశ్వంత్‌, ఆయుష్‌ డాక్టర్‌ వాణి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

    ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌