Archive Page | Sakshi
Sakshi News home page

Nagarkurnool

  • నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

    పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్‌ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది.

    ఆస్పత్రుల వద్ద బ్యానర్లు

    ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్‌ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ ఉన్నట్లు నోటీస్‌ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్‌ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్‌ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.

    ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేసిన సర్జరీలు, అంచనా వివరాలు

    జిల్లా చేసిన బకాయిలు

    సర్జరీలు (రూ.లలో..)

    గద్వాల 527 1,02,78,990

    మహబూబ్‌నగర్‌ 19,032 46,95,71,170

    నాగర్‌కర్నూల్‌ 133 34,03,362

    నారాయణపేట 275 1,02,52,882

    వనపర్తి 603 1,94,18,046

    బకాయిలు రూ.కోట్లకు చేరడంతో ప్రైవేటు ఆస్పత్రుల విముఖత

    సేవలు నిలిపివేతతో

    పేదలకు ఆర్థిక ఇబ్బందులే..

    మొదటి రోజు ఆస్పత్రులకు వచ్చి

    తిరిగి వెళ్లిన రోగులు?

  • మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌

    అచ్చంపేట రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా అచ్చంపేటకు వచ్చిన గువ్వల బాలరాజుకు స్థానిక బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియం నుంచి ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మహిళ లు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రజాకార్ల పాలనను కాంగ్రెస్‌ ప్రభు త్వం తలపిస్తుందని అన్నారు. గతంలో తనను ఓడించడానికి బీఆర్‌ఎస్‌ నాయకులే కుట్రలు చేశార ని గువ్వల ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాగా, పట్టణంలో బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కార్యకర్తలకు ముందస్తు హెచ్చరికలు చేయడంపై అసహనం వెలిబు చ్చారు. మరోవైపు అంబేడ్కర్‌ విగ్రహం చుట్టూ బీజేపీ జెండాలు కట్టారని అంబేడ్కర్‌ సంఘం, దళిత సంఘం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదుతో మున్సిపల్‌ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో బీజేపీ జెండాలు, తోరణాలను తొలగించారు. అయితే ఓర్వలేకనే కుట్ర పూరితంగా కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. లింగాల చౌరస్తా లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, నరేందర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మంగ్యానాయక్‌, బాలాజీ, రామోజీ, సీతారాంరెడ్డి, మహేందర్‌, శంకర్‌ పాల్గొన్నారు.

National

  • న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

    మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్‌ దలాల్‌ అనే వ్యక్తి ఈ పిల్‌ వేశారు. ఈ పిల్‌ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రనల్‌ ధర్మాసనం పరిశీలించింది. 

    ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్‌ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్‌నిర్మాణంపై ఏఎస్‌ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. 

    అయితే తీర్పు సందర్భంగా  సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  

    వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీం కోర్ట్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సత్యం సింగ్ రాజ్‌పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి అని లేఖలో డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం సీజేఐ వ్యాఖ్యలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Mahabubnagar

  • నాగర్‌కర్నూల్‌ క్రైం: కస్టమర్లు ఆర్డర్‌ చేసిన చికె న్‌ కర్రీలో మృతిచెందిన బల్లి కనిపించిన ఘట న జిల్లాకేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలోని ఓ దాబాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దాబాలో చికెన్‌ కర్రీ, రైస్‌ ఆర్డర్‌ చేయడంతో దాబా సిబ్బంది కస్టమర్‌కు చికెన్‌ కర్రీ తీసుకొచ్చి ఇచ్చాడు. అందులో చనిపోయిన బల్లి కనబడడంతో భయాందోళనకు గురయ్యాడు. చికెన్‌ కర్రీలో చనిపోయిన బల్లి కస్టరమర్లకు ఇచ్చిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనకు సంబంధించి ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ నీలిమను వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తామని తెలిపారు.

    గంజాయి పట్టివేత.. ఇద్దరి రిమాండ్‌

    జడ్చర్ల: స్కూటీలో గంజాయిని తరలిస్తుండగా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పట్టుకుని ఇద్దరి వ్యక్తులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జడ్చర్ల ఎకై ్సజ్‌ ఎస్‌ఐ కార్తీక్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి జడ్చర్ల కొత్తబస్టాండ్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా స్కూటీపై వస్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయ గా స్కూటీ డిక్కీలో 310గ్రాముల ఎండు గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరిని జడ్చర్ల కుమ్మరివాడకు చెందిన కుమార్‌ అలియాస్‌ మింటుగా గుర్తించగా.. మరొకరు బీహార్‌కు చెందిన బిజేశ్‌కుమార్‌గా గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో రూ.15వేల కు ఆరకిలో గంజాయిని కొనుగోలు చేసి 10 గ్రాముల ప్యాకెట్‌ చొప్పున తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.600కు విక్రయిస్తున్నా రు. స్కూటీతోపాటు రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని బుధవారం నిందితులను రిమాండ్‌కు తరలించారు. తనిఖీలో సిబ్బంది అనిల్‌, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

    యువతి ఆత్మహత్య

    కేటీదొడ్డి: ఉరేసుకుని యు వతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఉ మిత్యాలతండాలో చోటు చోటుచేసుకుంది. స్థానికు ల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఈరమ్మ (19) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువతికి మద్దెలబండతండాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. తరచూ ఫోన్‌లో మాట్లాడేదన్నారు. తల్లి దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

    గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

    రాజాపూర్‌(బాలానగర్‌): బాలానగర్‌ మండలం మోతీఘణపూర్‌ శివారు లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్‌ఐ లెనిన్‌గౌడ్‌ తెలిపారు. మోతీఘణపూర్‌ శివారులో సీఎస్‌కే వెంచర్‌లో 45 సంవత్సరాల వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు చూసి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. మృడుడి ఒంటిపై బ్లూ షార్ట్‌, తెల్లషర్టుపై గీతలున్నట్లు మృతుడి జేబులో గార్డ్‌ శ్యామ్‌శర్మ ఐడీ నెంబర్‌ 00689 ఐడీకార్డు ఉన్నట్లు తెలిపారు. మోతీఘణపూర్‌ పంచాయతీ కార్యదర్శి వడ్ల నరేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

    వ్యక్తి ఆత్మహత్యాయత్నం

    అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని టంగాపూర్‌ శివారులో ఓ వెంచర్‌లో తాను కొనుగోలు చేసిన ప్లాట్‌లో ఇంటి నిర్మాణం చేయగా.. కొందరు ఆక్రమణదారులు కూల్చివేశారని మనస్తాపం చెందిన పుల్యనాయక్‌ అనే వ్యక్తి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని సర్వే నెంబర్‌ 26, 27లో కొన్నేళ్ల కిందట ప్లాట్లను కొనుగోలు చేశాడు. మున్సిపల్‌ అధికారుల నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నప్పటికీ కొందరు ఆక్రమణదారులు తమ ప్లాట్లను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. బుధవారం జేసీబీ సహాయంతో నిర్మాణ దశలో ఉన్న గోడలు, రేకులు తొలగించడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. గమనించిన సమీప ఇళ్లవారు అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.

  • 26 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

    మద్దూరు: మద్దూరు పట్టణంలో ఓషాపులో పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించి బియ్యాన్ని పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఆనంద్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని ఎస్‌బీఐ దగ్గర ఉన్న దుకాణంలో పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు సమాచారం మేరకు నారాయణపేట, కోస్గి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలు కాళప్ప, భాస్కర్‌తో కలిసి తనిఖీలు నిర్వహించగా.. అక్కడ 58 బస్తాల బియ్యాన్ని గుర్తించారు. అలాగే రెండో ఆటోల్లో పీడీఎస్‌ బియ్యాన్ని అక్కడ అమ్మడానికి తీసుకొచ్చారు. ఒక ఆటోలో రెండు బస్తాలు, మరో ఆటోలో 6 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం 66 బస్తాల బియ్యాన్ని తూకం వేయగా.. 26 క్వింటాళ్లు వచ్చాయి. వీటిని ఖాజీపూర్‌ డీలర్‌ శ్రీలతకు అప్పగించి రషీద్‌ తీసుకున్నారు. దుకాణా యజమాని మహిమూద్‌, ఆటో డ్రైవర్లు గోవిందు, నరేశ్‌పై కేసు నమోదు చేసి ఆటోలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు డీటీ పేర్కొన్నారు.

  • యథావి

    మరిన్ని చిరుతలు

    ఉండొచ్చనే అనుమానం

    16 ట్రాప్‌, 4 లైవ్‌ కెమెరాలతో

    నిఘా, 3 బోన్ల ఏర్పాటు

    మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: కనిపించిందొకటి, బోనుకు చిక్కిందొకటి అనే అనుమానాలు స్థానిక ప్రజలను వెంటాడుతుండటంతో అటవీశాఖ చిరు త పులుల సంచారంపై మరింత అప్రమత్తమైంది. మహబూబ్‌నగర్‌ పట్టణ సమీపంలోని వీరన్నగట్టు, తిర్మల్‌దేవునిగుట్ట, డంపింగ్‌ యార్డు ప్రాంతాల్లో అటవీ సిబ్బందిని మూడు షిఫ్టులుగా విభజించి షిఫ్టుకు ఐదుగురు బృందంతో 24 గంటలు నిఘా ఉంచారు. రెండున్నర నెలలుగా పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుతపులి ఈనెల 15న వీరన్నపేట సమీపంలో తిర్మల్‌దేవుని గుట్ట వద్ద బోనుకు చిక్కింది. బోనుకు చిక్కిన చిరుతపులి రెండు సంవత్సరాల్లోపు వయసు కలిగినదిగా, ఆడ పులిగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలజికల్‌ పా ర్క్‌లో నిపుణులైన వెటర్నరీ డాక్టర్లు గుర్తించారు. అ యితే రెండున్నర నెలలుగా గుట్టపై ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో రికార్డయిన పులి పగ్‌ మార్కులను గుర్తించిన స్థానిక అటవీశాఖ అధికారులు మగ పులిగా, దాదాపు 3నుంచి 4ఏళ్లు కలిగినదిగా పేర్కొన్నారు. బోనుకు చిక్కిన చిరుత పులి, ట్రాప్‌ కెమెరాల్లో రికార్డయిన చిరుతపులికి వ్యత్యాసాలను అంచనా వేసిన స్థానికులు మరిన్ని చిరుతపులులు ఉండొచ్చనే భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు మరింత అప్రమత్తమై సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు.

    సహకరించిన హమీద్‌కు సన్మానం,

    నగదు బహుమతి

    మహబూబ్‌నగర్‌ పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత పులిని బోనుకు చిక్కేలా అటవీ సిబ్బందితోపాటు సహకరించిన వీరన్నపేటకు చెందిన హమీద్‌ను జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. మయూరి పార్కులో బుధవారం అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన స మావేశంలో హమీద్‌ను సన్మానించి రూ.5వేల నగదు బహుమతిని అందజేశారు. రెండున్నర నెలలుగా వీరన్నగట్టు, తిర్మల్‌దేవుని గుట్ట, డంపింగ్‌ యార్డు ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన బోన్‌ల్లో మేకలను ఉంచడం, అటవీ సిబ్బందితోపా టు ఉన్నతాధికారులను గుట్టపైకి దారిచూపి తీసుకెళ్లడం, ఎప్పటికప్పుడు బోన్‌లపై ని ఘా పెట్టడం వంటి చర్యల్లో చురుకుగా పాల్గొన్నందు కు హమీద్‌ సేవలను గుర్తిస్తూ అటవీశాఖ సత్కరించింది.

  • జ్వరం వచ్చిందని వస్తే..
    కుక్కకాటు ఇంజెక్షన్‌ ఇచ్చారు

    దేవరకద్ర: జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ పరీక్షించి న వైద్యుడు చీటీ రాసివ్వగా.. దానిని నర్సుకు చూ పించడంతో ఆమె నిర్లక్ష్యంగా కుక్కకాటు ఇంజక్షన్‌ ఇచ్చిన సంఘటన మ హబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర పీహెచ్‌సీలో చో టుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో ని బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు వైర ల్‌ జ్వరంతో బాధపడుతూ సోమవారం దేవరకద్ర పీహెచ్‌సీకి వచ్చాడు. అయితే మూడు రోజుల పాటు ఐవీ పెట్టాలని, అందులో ఇంజక్షన్‌ ఇ వ్వాలని సూచిస్తూ వైద్యాధికారి శరత్‌చంద్ర ప్రిస్కిప్షన్‌ ఇవ్వగా.. సైలెన్‌ పెట్టి ఇంజెక్షన్‌ చేశా రు. మంగళవారం అదే చీటీని తీసుకువచ్చి వై ద్యాధికారికి చూపించగా మళ్లీ ఐవీ పెట్టాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో ఉన్న ఏఎన్‌ఎం విజయకుమారి వద్దకు వెళ్లిన నాగరాజు చీటీ చూపించగా వరుసగా తేదీలు ఉండడంతో కుక్కకాటు ఇంజెక్షన్‌ ఇవ్వాలని అనుకున్న నర్సు యాంటీ రేబిస్‌ టీకా చేసింది. ఐవీలో ఇవ్వాల్సిన ఇంజక్షన్‌ ఇలా చేతికి ఇవ్వడంతో బాధితుడు నాగరాజు నర్సును అడిగాడు. కుక్కకాటు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు నర్సు చెప్పడంతో ఆందోళనకు గురైన బాధితుడు విషయం వైద్యాధికారి శరత్‌కు చెప్పగా.. నర్సుపై చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. కాగా.. కొందరు ఇంట్లోకు క్కలను పెంచుకునే వారు ముందస్తుగా యాంటీ రేబిస్‌ టీకాలు తీసుకుంటారని, దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యాధికారి చెప్పారు. అయితే నాగరాజును మాత్రం అబ్జర్వేషన్‌లో ఉంచుతామని తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి నాగరాజుకు వైద్య పరీక్షలు చేసి జ్వరానికి సంబంధించిన ఇంజక్షన్‌ ఇచ్చారు.

    వ్యక్తి ఆత్మహత్య

    వెల్దండ: మండలంలోని బొల్లంపల్లికి చెందిన కానుగుల జంగయ్య(45) బుధవారం వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. జంగయ్య వెల్దండలో వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం షాపు వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వ్యవసాయ పొలంలో సాయంత్రం 6గంటలకు బైక్‌ ఉండడంతో పరిసరాల్లో వెతకగా.. చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. మృతిగల కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య రజితతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

    అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

    మహబూబ్‌నగర్‌ క్రైం: దాదాపు పదిరోజుల కిందట చెట్టుకు ఉరేసుకొన్న ఓ గుర్తు తెలియని వ్య క్తి మృతదేహం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి అడవిలో గుర్తు తెలియని వ్యక్తి(35) దాదాపు పదిరోజుల కిందట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. బుధవారం మేకల కాపరి సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహం పరిశీలించగా.. పూర్తి గా గుర్తించలేని విధంగా కుల్లిపోయింది. మృతదేహం జనరల్‌ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

    యాచకుడి హత్య కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు

    మహబూబ్‌నగర్‌ క్రైం: యాచకుడిని రాళ్లతో దాడిచేసి హత్య చేసిన కేసులో నేరస్తుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దేవరకద్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2024 ఏప్రిల్‌ 18న స్థానిక బస్టాండ్‌ వద్ద ఆర్‌వోబీ బ్రిడ్జి కింద ఉంటూ బిక్షాటన చేసే మరికల్‌కు చెందిన సీమ వెంకటయ్యను రాళ్లతో దాడిచేసి హత్య చేశారు. ఈ కేసు బుధవారం అదనపు సెషన్స్‌ కోర్టు–ఎస్సీ, ఎస్టీ కోర్టుకు రావడంతో వాదనలు విన్న తర్వా త నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శారదాదేవి నిందితుడు వెంకటేశ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసు దర్యాప్తు, విచారణలో కృషి చేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బంది, అదనపు పీపీని ఎస్పీ జానకి అభినందించారు.

  • జూరాలకు మళ్లీ భారీగా వరద

    20 క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు

    నీటి విడుదల

    ధరూరు/ఆత్మకూర్‌/రాజోళి: ప్రియదర్శిని జూరా ల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం భారీగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 1,18,500 క్యూసె క్కులు ఉండగా.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1.73 లక్షల క్యూసెక్కులకు చేరిందన్నారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్ట్‌ గేట్లను పైకెత్తి 1,42,180 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 34,879 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 47, భీమా లిఫ్ట్‌–1కు 650, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 600, భీమా లిఫ్ట్‌–2కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.070 టీఎంసీలు ఉందన్నారు.

    కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..

    జూరాల దిగువ, ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. బుధవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 338.100 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 362.935 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని వివరించారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 701.035 మి.యూ. విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.

    సుంకేసులకు 30 వేల క్యూసెక్కులు..

    సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి స్వల్పంగా వరద వస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం 30,450 క్యూసెక్కుల వరద రాగా.. ఆరు గేట్లను మీటరు మేర తెరిచి 26,472 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు వదిలినట్లు వివరించారు.

  • గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స

    ప్రాణాపాయ స్థితి నుంచి

    కాపాడిన వైద్యసిబ్బంది

    12 రోజులుగా ప్రత్యేక గైనకాలజీ

    విభాగంలో వైద్యచికిత్సలు

    నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రాణాపాయస్థితిలో ఉన్న గర్భిణికి జనరల్‌ ఆస్పత్రి గైనకాలజీ విభాగం వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలు పాకాడడంతోపాటు సురక్షితంగా బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి కథనం ప్రకారం.. తాడూరు మండలం చర్ల తిరుమలాపూర్‌కు చెందిన గర్భిణి యాద మ్మ ఈనెల 6న తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మార స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు తిరిగినా గర్భిణి పరిస్థితి గమనించి చికిత్స అందించకపోవడంతో కుటుంబ సభ్యులు జనరల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పల్స్‌, బీపీ పూర్తిగా పడిపోయిన స్థితిలో చేరిన గర్భిణి యాదమ్మను గైనకాలజిస్టులు పరీక్షించి హెటిరోటోపిక్‌ ప్రెగ్నెన్సీ గర్భధారణగా స్కానింగ్‌ చేసి నిర్ధారించారు. పిండం గర్భసంచి పక్కనున్న ట్యూబ్‌లో పెరగడం, అది పగిలిపోయి అధిక రక్తస్రావం జరిగినట్లు గుర్తించి వెంటనే గర్భిణి రక్తంలోకి 4 ఎర్ర రక్త కణాలు, 3 తెల్ల రక్త కణాలు ప్యాకెడ్‌ సేల్స్‌ను బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా ఎక్కించి గైనకాలజీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నీలిమ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేసి గర్భిణి ప్రాణా లు రక్షించారు. ఎటరోటోపిక్‌ ప్రెగ్నెన్సీ చాలా అరుదని, లక్షమంది గర్భిణుల్లో ఒకరికి సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. మరో రెండురోజుల తర్వా త గర్భసంచిలో ఉన్న పిండం కూడా గుండెచప్పుడు లేకపోవడంతో మ్యానువల్‌ వాక్యూమ్‌ ఆస్పిరేషన్‌ ద్వారా చికిత్స అందించినట్లు తెలిపారు. 12రోజులుగా యాదమ్మను ప్రత్యేక గైనకాలజీ విభాగంలో ఉంచి వైద్యచికిత్సలు అందించడంతోపాటు బుధవారం క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి అంబులెన్స్‌లో ఇంటికి పంపినట్లు తెలిపారు. ప్రాణాపా య స్థితిలో వచ్చిన గర్భిణికి మెరుగైన చికిత్స అందించిన వైద్యసిబ్బందిని సూపరింటెండెంట్‌ అభినందించా రు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ శేఖ ర్‌, సీ్త్ర వైద్య నిపుణులు నీలిమ, సుప్రియ, సౌమ్య, శిరీష, అనస్తీశియా బృందం ధీరజ్‌, గౌతం, సురేశ్‌, ఉదయ్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ జరీనా పాల్గొన్నారు.

  • రమణీయం.. రాములోరి కల్యాణం

    ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబు చేసి వేద మంత్రాల నడుమ కల్యాణం రమణీయంగా జరిపించారు. కల్యాణ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు ఉదయా న్నే బీచుపల్లికి చేరుకొని పవిత్ర కష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల క ల్యాణంలో పాల్గొని కనులారా తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌రా జు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు, పాల్గొన్నారు.

  • వనపర్తి రూరల్‌: పెద్దల పండుగ కోసం బంధువుల వద్ద పొట్టేలును తీసుకొచ్చేందుకు వెళ్తూ మృత్యు ఒడికి చేరిన ఘటన వనపర్తి మండలం నాచహళ్లి వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో భర్త, మరోవ్యక్తి దుర్మరణం చెందగా.. భార్యకు గాయాలయ్యాయి. స్థానికుల కథ నం ప్రకారం.. వనపర్తి మండలం నాచహళ్లికి చెందిన పాలెమోని రవి(35) కూరగాయల వ్యాపారి. పెద్దల పండుగ ఉండడంతో పెబ్బేరులోని బంధువుల వద్ద పొట్టేలును తీసుకొచ్చేందుకు భార్య సరోజ, వనపర్తిలోని పీర్లగుట్ట తిరుమలకాలనీకి చెందిన పెబ్బేటి తెలుగురాజు(38)తో కలిసి బుధవారం మధ్యాహ్నం నాచహళ్లి నుంచి ఆటోలో బయలుదేరారు. 

    మార్గమధ్యంలో లిరిక్స్‌ రైస్‌మిల్లు వద్ద పెబ్బేరు నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయి రవి, రాజు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సరోజ ఆటోలోంచి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వనపర్తి ఆస్పత్రి మార్చురీ, క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అమలుకున్నాయి. మృతుల బంధువులు, ,గ్రామస్తులు ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో పరిసరాలు ఆర్తనాదాలతో నిండిపోవడంతో పలువురిని కంటతడి పెట్టించాయి.

  • విద్య

    ఖిల్లాఘనపురం: పంటకు కాపలా కాసేందుకు పొ లం వద్దకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. ఆలస్యంగా బుధవారం వెలుగు చూ సింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖిల్లాఘనపురం మండలంలోని రోడ్డుమీది తండాకు చెందిన సభావత్‌ భద్రునాయక్‌ (భద్యనాయక్‌) తాను సాగు చేసుకున్న వరిపంటను అడవి పందుల బెడద నుంచి కాపాడుకునేందుకు విద్యుత్‌ షాక్‌ పెట్టాడు. సోమవారం రాత్రి భోజనం తర్వాత కాపలాకు పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్‌ వైర్లు గమనించక ప్రమాదవశాత్తు తగలడంతో షాక్‌కు గరై అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఫోన్‌ చేశారు. ఫోన్‌రింగ్‌ అవుతున్నా.. ఎత్తడంలేదు. ఎక్కడో వెళ్లి ఉంటాడని అనుకున్నారు. మంగళవారం సాయంత్రం వరకు చూశా రు. ఎంతకూ రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా.. కరెంట్‌షాక్‌తో మృతిచెంది ఉన్నాడు. వెంటనే తండాకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవా రం మృతు డి కూతు రు కాట్రావత్‌ గీత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు.

    కోడేరు: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘ టన మండలంలోని తీగలపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాచూరిస్వామి(45) తన పొలంలో మోటారు వేసేందుకు వెళ్లగా విద్యుత్‌షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. స్వామి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యు లు ఆందోళన చెంది పొలానికి వెళ్లి చూడ గా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌ తెలిపారు. మృతుడికి భార్య నాగమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లున్నారు.

  • సమస్యల పరిష్కారంలో వార్డు ఆఫీసర్లే కీలకం

    మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగర పరిధిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని, ఈ విషయంలో వార్డు ఆఫీసర్లే కీలకపాత్ర వహించాలని అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు. బుధవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల పూర్తి వివరాలను వార్డుల వారీగా సేకరించి ఎప్పటికప్పుడు అపార్‌ ఐడీ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఈ విషయమై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి డివిజన్‌ పరిధిలోని కార్యాలయం వద్ద వార్డు ఆఫీసర్‌, వాటర్‌ లైన్‌మన్‌, పారిశుద్ధ్య విభాగం అధికారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు రాయించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమై ఆరు నెలలు కావస్తున్నందున ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, మున్సిపల్‌ దుకాణాల అద్దె వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని వీధుల్లో పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపడాలని సూచించారు. అనంతరం మెప్మా పీడీ మహమ్మద్‌ యూసుఫ్‌ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌తోపాటు దేవరకద్ర మున్సిపాలిటీల పరిధిలో కొత్త మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీరా రాజన్న, మేనేజర్‌ వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్‌ ఎంఈ నర్సింహ, డీఈఈలు హేమలత, విజయ్‌కుమార్‌, ఆర్‌ఓలు మహమ్మద్‌ ఖాజా, యాదయ్య, ఆర్‌ఐలు నర్సింహ, రమేష్‌, అహ్మద్‌షరీఫ్‌, ముజీబుద్దీన్‌, ఇన్‌చార్జ్‌ డీఎంసీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

  • జోరుగా ఉల్లి వ్యాపారం

    గరిష్టంగా రూ.1,800,

    కనిష్టంగా రూ.1,100

    దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వివిధ గ్రామాల నుంచి రైతులు వేయి బస్తాల వరకు ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో నాణ్యమైన ఉల్లి ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,800 పలకగా.. కనిష్టంగా రూ.1,100 ధర వచ్చింది. గత వారం కంటే ధరలు స్వల్పంగా పెరిగాయి. 50 కిలో ఉల్లి బస్తా గరిష్టంగా రూ.900, కనిష్టంగా రూ.550, మధ్యస్తంగా రూ.700 చొప్పున విక్రయించారు.

    ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాల్‌ రూ.2,009

    దేవరకద్ర మార్కెట్‌ యార్డులో బుధవారం జరిగిన ఈనామ్‌ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2009 ఒకే ధర లభించింది. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,719, కనిష్టంగా రూ.1,629 ధరలు నమోదయ్యాయి.

  • జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పు చేస్తే.. వాటికి ప్రతినెలా రూ.వేల కోట్ల మిత్తి చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందేలా చూస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రజా పాలన ప్రభుత్వం అమరుల ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 

    మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2.45 కోట్ల మంది మహిళలు జీరో బిల్లు వినియోగించుకున్నారని, 1,02,658 మంది వినియోగదారులకు 3.85 లక్షల గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ చేశామన్నారు. ప్రతినెలా 200 యూనిట్ల విద్యుత్‌ కోసం 1,32,931 జీరో బిల్లు జారీ చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచిన ప్రభుత్వం తమదేనన్నారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా రూ.552 కోట్ల అంచనా వ్యయంతో 11,037 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు.

  • నిలిచ

    పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్‌ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది.

    ఆస్పత్రుల వద్ద బ్యానర్లు

    ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్‌ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ ఉన్నట్లు నోటీస్‌ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్‌ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్‌ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.

    బకాయిలు రూ.కోట్లకు చేరడంతోప్రైవేట్‌ ఆస్పత్రుల విముఖత

    సేవలు నిలిపివేతతో పేదలకు ఆర్థిక ఇబ్బందులే..

    మొదటి రోజు ఆస్పత్రులకు వచ్చి తిరిగి వెళ్లిన రోగులు?

  • వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వార్షిక పరీక్షలు

    స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన 17వ బ్యాచ్‌ 150 మంది అభ్యర్థులకు హైదరాబాద్‌ సెట్విన్‌ ఆధ్వర్యంలో బుధవారం వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు కొనసాగాయి. పరీక్షలను జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.శ్రీనివాస్‌, ఇతర అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ 17వ బ్యాచ్‌కు సంబంధించి జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు 150 మంది నిరుద్యోగ యువతకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందజేసినట్లు వివరించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెట్విన్‌ వారిచే సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. కేంద్రంలో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఫలితాల అనంతరం జాబ్‌మేళా నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి తగిన చర్య లు తీసుకుంటామని చెప్పారు. వార్షిక పరీక్షలను హైదరాబాద్‌ సెట్విన్‌ కోఆర్డినేటర్‌, పరీక్షల పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి, మహ్మద్‌ షేక్‌ ఇస్మాయి ల్‌, అజీమ్‌ ఎజాజ్‌ పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రవీందర్‌రెడ్డి, ఫ్యాకల్టీ హరిప్రసాద్‌, కౌసల్య, సువర్ణ, ఖలీల్‌, ఇమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు.

  • దేశ ఆర్థిక ప్రగతిలో మోదీ పాత్ర కీలకం

    పాలమూరు: దేశ ప్రగతి కోసం నిస్వార్థంగా పాటుపడుతున్న గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్‌ ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికై దేశ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా మొదటి స్థానంలో నిలబెట్టేందుకు వికసిత్‌ భారత్‌ సకల్పంతో ముందుకు సాగుతున్న గొప్ప నాయకుడు అని కొనియాడారు. అనంతరం జిల్లాకేంద్రంలోని భగీరథకాలనీ, కొత్త గంజిలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను ఎంపీ ప్రారంభించారు.

    ● జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. తెలంగాణలో నిజాం పాలన లో రజాకార్లు మహిళలను, ప్రజలను ఎంతో ఘో రంగా అవమానాలకు గురిచేశారని అలాంటి అరా చకాలకు చరమగీతం పాడటం గొప్ప విషయం అన్నారు. నిజాం సర్కార్‌ నుంచి విముక్తి పొందిన సందర్భంగా ప్రజలు వేడుకలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పద్మజారెడ్డి, బాలరాజు, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.

  • ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన

    జిల్లాలో మొదటిరోజు

    3,893 మందికి పరీక్షలు

    పాలమూరు: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. జిల్లాలో మొదటి రోజు జిల్లాలో 3,893 మంది మహిళలు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా బాలానగర్‌ పీహెచ్‌సీలో మెగా శిబిరం ఏర్పాటు చేసి 537 మందికి ఏడు రకాల పరీక్షలు చేశారు. ఎంపీ డీకే అరుణ హాజరై ప్రారంభించారు. దీంతోపాటు దేవరకద్రలో ఈఎన్‌టీ పరీక్షలు 103, ఎదిరలో గైనిక్‌, క్యాన్సర్‌ పరీక్షలు 109, కోత్లాబాద్‌లో పిడియాట్రిక్‌ సమస్యలపై 134, గంగాపూర్‌లో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో 100 మందికి, అడ్డాకుల పీహెచ్‌సీలో అర్థో సమస్యలపై 117, గండేడ్‌లో 130 మందికి పరీక్షలు నిర్వహించారు. పల్లె దవాఖానాల్లో సైతం మహిళలకు పరీక్షలు చేయడం జరిగింది. గురువారం రాజాపూర్‌, జానంపేట, పేరూరు, మణికొండ పీహెచ్‌సీలతోపాటు జిల్లాకేంద్రంలోని కుమ్మరివాడి అర్బన్‌ హెల్త్‌సెంటర్‌, యూపీహెచ్‌సీ జడ్చర్ల, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ కోయిలకొండలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయనున్నారు.

International

  • న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి జరిపిన కొద్దిరోజులకే ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరుపక్షాలలో ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయి.

    సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్- పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాక, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. యువరాజు ఆహ్వానం మేరకు పాక్‌ ప్రదాని షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారని పాక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం, ఏదైనా దురాక్రమణ  ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది’ అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఒక దేశంపై ఏదైనా దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించాయి. ఇది జరిగిన తరువాత సౌదీ-పాక్‌ల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం గమనార్హం. మరోవైపు ఖతార్- యునైటెడ్ స్టేట్స్ మెరుగైన రక్షణ సహకార ఒప్పందాన్ని ఖరారు చేసే దశలో ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు.

     

Family

  • శ్రీరామ పట్టాభిషేకం మూర్తి ప్రతి ఇంటిలోనూ ఉండాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు. కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ. రాముడు అకారానికి ప్రతినిధి,

    యో వేదాదౌ స్వరప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!.

    అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ. ’మ్‌’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ. అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. 

    ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది. 

    (చదవండి: కొలిచిన వారికి 'బంగారు తల్లి'! పులి రూపంలో తిరుగుతూ..)

Mulugu

  • పోరాట యోధుల త్యాగాలు మరువలేనివి

    జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి సీతక్క పక్కన కలెక్టర్‌ దివాకర,

    ఎస్పీ శబరీశ్‌

    ములుగు రూరల్‌: రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కలెక్టర్‌ దివాకర, ఎస్పీ శబరీశ్‌లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు.

    ఆరోగ్యశ్రీ పథకం రూ.10లక్షలకు పెంపు

    1948 సెప్టెంబర్‌ 17వ తేదీకి ఎంతో విశిష్టత ఉందన్నారు. 77 సంవత్సరాల క్రితం రాచరిక పాలనకు విముక్తి పలికారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సెప్టెంబర్‌ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడంలో మహనీయులు, పోరాటయోధుల త్యాగాలు మరువలేనివని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను స్వీకరించి 48 గంటల్లో అమలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.40 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించడంతో రూ. 89.34 లక్షలు మహిళలకు ఆదాయం చేకూరుతుందన్నారు. నిరుపేదలు కార్పొరేట్‌ వైద్యం పొందడానికి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో గుండె, న్యూరాలజీ, ఆర్థోపెటిక్‌, పీడీయాట్రిషన్‌, జనరల్‌ సర్జరీలో 3,501 మందికి గాను రూ. 9కోట్ల 25లక్షల 67 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు.

    ఇంటింటి జ్వర సర్వే..

    వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500లకు వంట గ్యాస్‌ జిల్లాలో 50 వేల 98 మంది లబ్ధిదారులకు రూ. 4కోట్ల 38లక్షల 53 వేల సబ్సిడీ చెల్లించామని వివరించారు.

    ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల నిర్మాణం

    ప్రతీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళలు వ్యాపార రంగాలలో అభివృద్ధి చెందేవిధంగా ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలకు ఆసక్తి కలిగిన రంగాలలో నైపుణ్య శిక్షణ అందించి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రామప్ప రీజియన్‌ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా రూ. 37.10 కోట్లతో ఇంచర్ల గ్రామంలో టూరిస్టు ఎత్నిక్‌ విలేజ్‌ పనులు, రామప్ప ఐలాండ్‌ వద్ద రూ. 13 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు.

    ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

    జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇంచర్ల శివారులో ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అధిక లాభాలు ఉంటాయని వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారని, వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 39 ఇళ్లకు ఆర్ధిక సాయంగా రూ.1.45లక్షలు బాధితుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, పార్లమెంట్‌ సభ్యులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఆర్డీఓ వెంకటేశ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

    పదేళ్ల నుంచి రేషన్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి జిల్లాలో 8,968 మందికి రేషన్‌ కార్డులు అందించామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామని వివరించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంగన్‌ వాడీలలో ప్రీప్రైమరీ తరగతులు, ప్రాథమిక విద్య నుంచి విశ్వ విద్యాలయాల వరకు మెరుగైన విద్యను అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.

    పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందేలా చర్యలు

    ప్రజాపాలన దినోత్సవంలో

    మంత్రి సీతక్క

  • తక్కువ తూకంతో  విక్రయిస్తే కేసులు

    లీగల్‌ మెట్రాలజీ శ్రీలత

    ములుగు: వ్యాపారులు తక్కువ తూకంతో వినియోగదారులకు మాంసాహారాన్ని విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఉమ్మడి భూపాలపల్లి జిల్లా లీగల్‌ మెట్రాలజీ తనిఖీ అధికారి శ్రీలత వ్యాపారులను హెచ్చరించారు. ములుగు మార్కెట్‌ ప్రాంగణంలోని చేపలు, చికెన్‌, మటన్‌ షాపులను ఆమె బుధవారం తనిఖీ చేశారు. అమ్మకందారులు తక్కువ బరువున్న రాళ్లను వాడుతుండటంతో కిలోకు 200 గ్రాములు తక్కువ తూకం వస్తున్నట్లు తనిఖీలో తేలిందన్నారు. వినియోగదారులకు సరైన తూకం వేసి ఇవ్వాలన్నారు.

Nirmal

  • ప్రజా
    నిర్మల్‌

    రైళ్ల ఆలస్యానికి చెక్‌..!

    రైళ్ల ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

    గోదావరిలో పెరుగుతున్న వరద

    ఎగువన కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీతీరంలోని స్నానఘట్టాల వద్దకు భక్తులను అనుమతించడం లేదు.

    జాతీయస్థాయి అర్చరీ

    పోటీలకు ఎంపిక

    కడెం: మండలంలోని గంగాపూర్‌ గ్రామానికి చెందిన టేకం సునీల్‌ జా తీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌ అంబేడ్కర్‌ తెలిపారు. నిర్మల్‌లోని ప్రభుత్వ కళా శాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతు న్న సునీల్‌ బుధవారం వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో అక్టోబర్‌ 29న పంజాబ్‌ రాష్ట్రంలోని భటిండా నగరంలో జరిగే జాతీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు.

    నిర్మల్‌: తెలంగాణ ప్రాంత చరిత్రలో 1948 సెప్టెంబర్‌ 17కు విశిష్టత ఉందని, రాచరికానికి ఘోరీకట్టి.. ప్రజాపాలనకు హారతిపట్టిన రోజని రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజయ్య ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాలను ఆ లపించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ ప్రసంగపాఠాన్ని చదివి వినిపించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో పథకాలతో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. జిల్లాలో ఈ పథకం ద్వారా లక్షా 28 వేలమందికి లబ్ధి చేకూరుతోందన్నారు. పేదలకు ఉచిత సన్నబియ్యం అందేలా జిల్లాలో 35,769 కొత్త రేషన్‌ కార్డులను అందించామన్నారు. సెప్టెంబర్‌లో 4,746 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం అందించామని చెప్పారు. పేదప్రజల ఆరోగ్యానికి భరోసాగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యచికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా జిల్లాలో రూ.57కోట్ల 80 లక్షల లబ్ధి చేకూరిందన్నారు. గృహజ్యోతితో పేదల ఇంట 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అంది స్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాకు 8,852 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 5,265 ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయన్నారు.

    రాష్ట్రంలోనే మొదటి స్థానం..

    బ్యాంకు లింకేజీ ఎన్‌పీఏ రికవరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించామని సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,058 మహిళాసంఘాలకు రూ.240 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది సీ్త్రనిధి రుణాల కింద ఇప్పటి వరకు రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నిర్మల్‌ రూరల్‌ మండలం కొండాపూర్‌లో గణపతి మహిళాసంఘం నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ విధానానికి పెప్సికో సంస్థ రివల్యూషనరీ అవార్డు అందించడం ప్రశంసనీయమన్నారు. చేపల ఉత్పత్తిలో మత్స్య సలహాదారు అవార్డును దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమన్నారు. నీతిఆయోగ్‌ ఆస్పిరేషన్‌ బ్లాక్‌ కార్యక్రమంలో భాగంగా పెంబి ఆస్పిరేషన్‌ బ్లాక్‌ జాతీయస్థాయిలోనే ఉత్తమ పనితీరుతో నాలుగోస్థానంలో నిలువడం అభినందనీయమన్నారు.

    వినూత్నంగా పోలీసుశాఖ..

    జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పోలీసుశాఖ వినూత్నంగా పనిచేస్తోందని అభినందించారు. నారీశక్తి కార్యక్రమం పేరిట మహిళా పోలీసులతో గస్తీతనిఖీలు చేపడుతున్నామన్నారు. విపత్కర సమయాల్లో అత్యవసరంగా సహాయాన్ని అందించేందుకు శివంగి టీమ్‌ ముందంజలో ఉంటుందన్నారు. పోలీసుఅక్క కార్యక్రమం పేరిట బాలికల వసతిగృహాల్లో మహిళాపోలీసులు రాత్రివేళల్లో బసచేయడం, వారి సమస్యలను తెలుసుకుంటూ మనోధైర్యం నింపుతున్నారన్నారు. గాంజాగస్తీ పేరిట గంజాయిని అరికడుతూ మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేయడం అభినందనీయమన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు అహర్నిశలు అంకితభావంతో సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం భారీ వర్షాల కారణంగా పశువులను కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయ పత్రాలను అందజేశారు. స్వచ్ఛతాహి సేవ 2025లో భాగంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛోత్సవ్‌–పక్షోత్సవ్‌’ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ఆవిష్కరించారు. స్వచ్ఛభారత్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, కిషోర్‌కుమార్‌, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, ఏఎస్పీ రాజేశ్‌ మీనా, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    సందేశంలో చోటివ్వరా..!

    తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన రోజున నిర్మల్‌ గడ్డపై పోరాడిన, ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు, స్వాతంత్య్ర సమరయోధులకు సరైన గుర్తింపుదక్కక పోవడంపై జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ముఖ్యఅతిథి సందేశంలో వెయ్యిఉరులమర్రి ఘటనతోపాటు జైళ్లల్లో మగ్గిన సమరయోధుల గురించి ప్రస్తావించకపోవడంపై మండిపడ్డారు.

    రైతులకు భరోసాగా..

    ప్రజాప్రభుత్వం రైతులకు భరోసాగా వానాకాలం పంట పెట్టుబడిగా లక్షా 85వేల 500మందికి రూ.268 కోట్ల 70లక్షలను ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. 72,500మంది రైతులకు రూ.658 కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ఇటీవల భారీ వర్షాలకు జిల్లాలో 19,530 ఎకరాల్లో పంటదెబ్బతిందని, బాధిత రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కడెం ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి కుటుంబానికి రూ.5లక్షలు అందించామన్నారు. లక్ష్మణచాంద మండలం మునిపెల్లిలో గోదావరి వరదలో చిక్కుకున్న పశువుల కాపరిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షించడంపై కలెక్టర్‌, ఎస్పీలను అభినందించారు.

    రైతులు అధైర్యపడవద్దు

    సోన్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కడా్‌త్‌ల్‌ సమీపంలో తెగిపోయిన పెద్దచెరువును ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన చెరువుకు మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు.

    ప్రజాపాలనకు హారతిపట్టిన రోజు

  • యూరియా కన్నా.. ‘నానో’ మిన్న

    లక్ష్మణచాంద: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రసాయన ఎరువులైన యూరియా, డీఏపీకి కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవి ఆర్థికంగా సమర్థవంతమైనవి మాత్రమే కాకుండా పంటలకు, నేల సారానికి కూడా ఉపయోగకరమైనవని పేర్కొంటున్నారు.

    ఎరువుల ధరల భారం..

    జిల్లా వ్యాప్తంగా యూరియా, డీఏపీ ఎరువులకు డిమాండ్‌ పెరగడంతో కొందరు వ్యాపారులు ప్రభుత్వ సరఫరా ఎరువులను నిల్వ చేసి, యూరియా సంచి ధరను రూ.266 నుంచి రూ.300–320కి, డీఏపీ సంచిని రూ.1350కి అమ్ముతున్నారు. ఈ ధరల పెంపు రైతులకు భారంగా మారాయి.

    నానో ఎరువులు..

    వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగాన్ని సిఫారసు చేస్తున్నారు. అరలీటరు నానో యూరియా ద్రవం రూ.200–225కి, నానో డీఏపీ రూ.600కి లభిస్తుంది, ఇవి సంప్రదాయ ఎరువులతో పోలిస్తే ఆర్థికంగా లాభదాయకం. అంతేకాక, 20 నానో యూరియా సీసాలు కొనుగోలు చేసిన రైతుకు రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు, అయితే రసీదు తీసుకోవడం తప్పనిసరి.

    లాభాలు

    నానో ఎరువులు సంప్రదాయ రసాయన ఎరువుల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

  • ఉపాధ్

    నిర్మల్‌రూరల్‌: ఉపాధ్యాయులు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటీ కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం డీఈవో భోజన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌తో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, 5 డీఏల గురించి అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు. జిల్లాను విద్యారంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మాట్లాడుతూ గురువులు ఆరాధ్య దైవాలని, దేశ భవిష్యత్‌ తీర్చిదిద్దే మార్గదర్శకులని అన్నారు. గురువులు నేర్పిన విద్యతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఈ విద్యా సంవత్సరం పదోతరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థి, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తానని ప్రకటించారు. అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయసారిణి తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం జిల్లాలో ఎంపికై న 110 మంది ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాల, శాలువాలతో సత్కరించి మెమొంటో అందజేశారు. అంతకుముందు పలు పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వెల్మల్‌ బొప్పారం ఉన్నత పాఠశాల విద్యార్థులు రచించిన అంకురాలు రెండు కథల సంపుటిని కలెక్టర్‌, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవోలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Nizamabad

  • అభివృ
    అన్నివర్గాలకు

    వాతావరణం

    ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి.

    త్వరలో జీవాలకు..

    రెండేళ్ల క్రితం నిలిచిపోయిన జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ త్వరలో ప్రారంభం కాబోతోంది.

    – 8లో u

    మహిళల ఆరోగ్య

    సంరక్షణే లక్ష్యం

    నిజామాబాద్‌నాగారం: మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణే తమ లక్ష్యమని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా అన్నారు. స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం వర్చుల్‌గా ప్రారంభించగా, కలెక్టరేట్‌ నుంచి బుధవారం ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం దుబ్బ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారు లతో కలిసి స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అక్టోబర్‌ 2వ తేదీ వరకు కొనసాగుతుందని, జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాల్లో వైద్యారోగ్య అధికారులు మహిళలకు సేవలందిస్తారన్నారు. కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీకి ఎమ్మెల్యే స్వస్త్‌ నారీ సశక్త్‌ సర్టిఫికెట్‌ను అందజేశారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ, జీజీహెచ్‌ సూపరిండెంట్‌ శ్రీనివాస్‌, డిప్యూ టీ డీఎంహెచ్‌వో అంజన, డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, వైద్యురాలు సుశానా, తాజా మాజీ కార్పొరేటర్‌ పంచరెడ్డి ప్రవళిక, శ్రీధర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    కమీషన్‌లను

    ప్రోత్సహించొద్దు

    నిజామాబాద్‌నాగారం: రోగులను రిఫర్‌ చేసే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రు లు కమీషన్‌లు ఇస్తున్న ట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో రాజశ్రీ హెచ్చరించారు. స్కానింగ్‌, ఆస్పత్రుల్లో రిఫరల్‌ దందాలపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కావడంతో డీఎంహెచ్‌వో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమీషన్‌లను ప్రోత్సహించే ఆస్పత్రుల యాజమాన్యాలతోపాటు ప్రాక్టిషనర్లపై చర్యలుంటాయని హెచ్చరించారు. కమీషన్‌ దందాపై ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకురావాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ మేరకు ఓ నిఘా బృందాన్ని సైతం నియమించినట్లు తెలిపారు.

    లింగాపూర్‌ మత్స్య

    సొసైటీ రద్దుకు నోటీసు

    డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): కోటగిరి మండలం లింగాపూర్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రద్దుకు జిల్లా మత్స్య శాఖ అధికారి నోటీసు జారీ చేశారు. సొసైటీలో 40 మంది సభ్యులు ఉండగా అందరూ ఇతర కులస్తులకు చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న సొసైటీకి నోటీసు జారీ చేశారు.

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన చేస్తున్నట్లు, ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజావ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తన ప్రసంగంలో నరేందర్‌ రెడ్డి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపారు. 1948 సెప్టె ంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గాంధీజీ కలులుగన్న గ్రామస్వరాజ్యం దిశగా వెళుతూనే, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడంలో స్వర్గధామంగా పేరు తెచ్చుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో, పట్టణాల్లో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ‘ప్రజాపాలన’ పేరిట కార్యక్రమం తీసుకొచ్చామన్నారు.

    రైతులకు రూ.755.29 కోట్ల రుణమాఫీ

    రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1.13 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చరిత్ర సృష్టించామన్నారు. జిల్లాలో ఇప్ప టి వరకు 97,696 మంది రైతులకు 755.29 కోట్ల రుణమాఫీ అయిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ వానాకాలం సీజనులో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.316 కోట్లు జమ చేశామన్నారు.

    ● కీలక సంస్కరణల్లో ఒకటిగా భూభారతి చట్టం నిలిచిందన్నారు. దీని ద్వారా భూపరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేశామన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లల్లో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం ఇస్తున్నామన్నారు. తొలివిడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందుకు రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. గ్రీన్‌ ఛానెల్‌లో నిధులు విడుదల చేస్తున్నామన్నారు. జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా, 18,155 ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు.

    ● గృహ జ్యోతి పథకం ద్వారా మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు ప్రతి నెల 2,67,707 మంది వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు మంజూరు చేశామన్నారు. ఇందుకు గాను రూ.174.90 కోట్లు విడుదల చేశామన్నారు.

    ● అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 760 పాఠశాలల్లో అత్యవసర మరమ్మతు పనులు చేశామన్నారు. ఇందుకు గాను జిల్లాలో ఇప్పటివరకు రూ.22.20 కోట్లు వెచ్చించామన్నారు. మరోవైపు ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూర్‌, మోపాల్‌ మండలాల్లో కేజీబీవీల్లో ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టామన్నారు.

    ● జిల్లాలో కళ్యాణలక్ష్మి ద్వారా 2025–26లో 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు అందించామన్నారు. షాదీ ముబారక్‌ ద్వారా 672 మందికి రూ.6.72 కోట్లు ఇచ్చామన్నారు.

    ● కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, డాక్టర్‌ ఆర్‌ భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, కలెక్టర్‌ టి వినయ్‌ కష్ణారెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీ, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

    నవీపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సాంస్కృతిక ప్రదర్శన

    సిద్ధార్థ కళాక్షేత్రం ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన

    ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన

    కీలక సంస్కరణగా నిలిచిన

    భూభారతి చట్టం

    ధాన్యం బోనస్‌, ఇందిరమ్మ ఇళ్లు,

    గృహజ్యోతి పథకాలతో రైతులు,

    మహిళలకు మరింత మేలు

    ధాన్యం సేకరణలో ప్రథమ

    స్థానంలో నిలిచిన జిల్లా

    ముఖ్యమంత్రి సలహాదారు

    వేం నరేందర్‌రెడ్డి

  • బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతోందని, దీనికి బా ధ్యత వహిస్తూ కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతాంగానికి సరిపడా యూరియాను తె ప్పించలేని బీజేపీ ఎంపీలు ఎందుకని ప్రశ్నించారు. వేల్పూర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. నెల రోజుల నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున అన్ని వేదికల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మన్నారు. మళ్లీ చెప్పులు, పాస్‌బుక్కులు లైన్‌లలో పెట్టే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే.. అర్వింద్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వద్ద పలుకుబడి ఉందని చెప్పుకునే ఆయన.. యూరియా కొరతపై ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. వెంటనే ప్రధానితో మాట్లాడి యూరియా తెప్పించాలని డిమాండ్‌ చేశారు.

    ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం కాంగ్రెస్‌ ఎంపీలకు ఎందుకు లేదన్న ప్రశాంత్‌రెడ్డి.. బడే భాయ్‌ కు కోపం వస్తుందా? ఆయనకు కోపం వస్తే.. చోటేభాయ్‌కు జైలు శిక్ష పడుతుందా అని ఎద్దేవా చే శారు. ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న ధ్యాస.. రైతులపై కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.

    యూరియా ఎటువెళ్లింది..

    జిల్లాకు 75వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమైతే 72వేల మెట్రిక్‌ టన్నులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని, మరి వచ్చిన యూరియా ఎటు వెళ్లిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించారా అని ఆరోపించారు. యూరియా సరిపడా సరఫరా చేసే సత్తా లేక.. కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలకు అవగాహన లేక రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో రైతులు యూరియా కోసం లైన్‌ కట్టే పరిస్థితి రాలేదని, ముందు చూపుతో వ్యవహరించి సరిపడా తెప్పించారని గుర్తుచేశారు. పోలీస్‌స్టేషన్‌లో టోకెన్లు పంపిణీ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఉందా..? అని ప్రశ్నించారు. యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వెంటనే మంత్రులు బృందాన్ని పంపించి యూరియా సరిపడా అందుబాటులో ఉంచాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

    యూరియా ఇప్పించలేని కేంద్రమంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు ఎందుకు?

    అర్వింద్‌కు పలుకుబడి ఉంటే

    యూరియా తెప్పించాలి

    మళ్లీ చెప్పులు, పాస్‌బుక్‌లు

    లైన్‌లో పెట్టే దౌర్భాగ్యం

    కేసీఆర్‌ ముందుచూపుతో గతంలో యూరియా కొరత రాలేదు

    మాజీ మంత్రి, బాల్కొండ

    ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

  • బైక్‌

    మాక్లూర్‌ /నందిపేట్‌ (ఆర్మూర్‌): బైక్‌ అదుపు త ప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన మాక్లూర్‌ మండలం దుర్గానగర్‌ శివారు లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటు కు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌కు చెందిన పూజ(25)తో 10 నెలల క్రిత మే వివాహం జరిగింది. 

    బీటెక్‌ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై తమను నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద వదిలేసి రావాలని తండ్రి నారాయణ (58)ను చింటు కోరాడు. ముగ్గురూ కలిసి బైక్‌పై బయల్దేరారు. 

    చింటు డ్రైవ్‌ చేస్తుండగా దుర్గానగర్‌ శివారులో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన పూజతోపాటు చింటును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల సమయంలో పూజ మృతి చెందింది. మామ కోడలు మృతితో తల్వేదలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. ఘటనా స్థలాన్ని ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ పరిశీలించారు.

  • ఎస్సారెస్పీలోకి భారీ వరద

    1.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

    38 గేట్ల ద్వారా 2.82 లక్షల అవుట్‌ ఫ్లో

    బాల్కొండ: ఎగువ నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి లక్షా 92వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మంగళవారం సాయంత్రానికి లక్షా 67 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద.. బుధవారం ఉదయం 7 గంటల నుంచి క్రమంగా పెరిగింది. ఉదయం 10 గంటలకు 2 లక్షల 15 వేల క్యూసెక్కులకు చేరింది. బుధవారం సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో నిలకడగా ఉండగా రాత్రి సమయానికి లక్షా 92వేలకు తగ్గింది. 38 వరద గేట్ల ద్వారా 2 లక్షల 82 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 4 వే లు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. మిషన్‌ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 701 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం రాత్రి సమయానికి 1087.06(68.04 టీఎంసీలు) అడుగులు నీరు నిల్వ ఉంది.

  • పేదలకు సన్న బియ్యం

    ‘సన్న బియ్యం’ పంపిణీ ద్వారా ప్రజలకు మరింత మేలు చేస్తున్నామని, రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలై 14 నుంచి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా రూ.500 లకే సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఈ పథకం కింద 2,19,330 గ్యాస్‌ వినియోగదారులకు, 10,19,994 సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు రూ.30.73 కోట్లు ఖర్చు చేశామన్నారు.

    ● సన్న ధాన్యం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కింద 29 లక్షల పంపు సెట్లకు ఉచిత కరెంట్‌ సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకు గాను రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్‌ సంస్థలకు చెల్లిస్తున్నామన్నారు. జిల్లాలో 2024–25 వానాకాలం సీజన్‌లో 4,91,497 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 78,488 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1,140 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. యాసంగి సీజన్‌లో 8,40,279 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 1,16,000 రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రూ.1,949 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

Orissa

  • అర్ధర

    భువనేశ్వర్‌: దేవీ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజధాని నగరంలో మంగళవారం అర్ధరాత్రి బాంబుల పేలుడు కలకలం రేపింది. రెండు బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు భువనేశ్వర్‌ నగరం నడి బొడ్డున బాంబులు రువ్వి అలజడి రేపారు. పోలీసులకు బహిరంగ సవాలు విసిరారు. బొడొగొడొ, రాజధాని పోలీస్‌ ఠాణా ప్రాంతాల్లో భారీగా బాంబులు విసిరి పరారయ్యారు. అయితే ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం తప్ప పౌరులకు ఎటువంటి ప్రాణహాని సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను జంట నగరాల కమిషనరేట్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దుండగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని గాలింపు ముమ్మరం చేశారు. రెండు పోలీస్‌ ఠాణాల పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేసి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

    అప్రమత్తమైన పోలీసులు..

    బొడొగొడొ పోలీస్‌ ఠాణా గౌతమ్‌ నగర్‌ బస్తీ, క్యాపిటల్‌ పోలీస్‌ ఠాణా ఫలికియా బస్తీపై భారీగా బాంబులు రువ్వారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆరుగురు దుండగులు రెండు బైక్‌లపై వచ్చి ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. తొలుత గౌతమ్‌ నగర్‌ బస్తీపై 5 బాంబులు రువ్వారు. తరువాత వారు ఫలికియా బస్తీపై మూడు బాంబులు విసిరారు. భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారు వెంటనే పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలం చేరే సమయానికి దుండగులు పరారయ్యారు. ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరు బాంబులు విసిరారో పోలీసులు స్పష్టం చేయలేదు. గత రెండు నెలల్లో భరత్‌పూర్‌ పండా కుడియా బస్తీ, పులీశ్వరి బస్తీలలో ఇలాంటి పేలుళ్లు సంభవించాయి. ఈ చర్యలు స్థానికుల్ని కలవరపరుస్తున్నాయి.

    దుర్గా పూజలకు సిద్ధం..

    రాష్ట్రంలో దుర్గా పూజోత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల నిర్వహణ కోసం పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ మేరకు బుధవారం డీఐజీ సెంట్రల్‌ రేంజ్‌ పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశయ్యారు. శాంతిభద్రతలను నిశితంగా పరిశీలించాలని ఎస్పీలకు ఆదేశించారు.

  • అసెంబ

    భువనేశ్వర్‌: రాష్ట్ర 17వ శాసన సభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గట్టి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. శాసన సభ వెలుపల, లోపల, పరిసరాల్లో ప్రతి కదలికపై నిఘా వేసేందుకు మూడంచెల భద్రతా వలయం సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా ప్రత్యక్షంగా సమీక్షించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్ధంగా ఎదుర్కోవడానికి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించారు. శాసన సభ భద్రతా కార్యకలాపాల కోసం 30 ప్లాటూన్ల పోలీసులను మోహరించనున్నారు. 150 మంది ప్రత్యేక అధికారులు పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. రాత్రింబవళ్లు 5 తాత్కాలిక కంట్రోల్‌ రూములు పని చేస్తాయి. స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, బాంబు నిర్వీర్య బృందం ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటాయి. శాసన సభ సమీపంలోని వివిధ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దిగువ పీఎంజీలో 144 సెక్షన్‌ జారీ చేయనున్నారు.

  • రాయగడ: రాయగడ పట్టణాన్ని బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఎనిమిది గంటల వరకు దట్టంగా కురిసిన మంచుతో పట్టణంలో చీకట్లు అలముకున్నాయి. దట్టంగా కురిసిన మంచుతో రోడ్లు కన్పించకపోవడంతో వాహనాల రాకపొకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో వాహనాలు నడిపే సమయంలో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తెంది. చాలామంది కాలం కాని కాలంలో కురిసిన మంచును ఆస్వాదించారు.

    భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ పూజలు

    రాయగడ: పట్టణంలో బుధవారం విశ్వకర్మపూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక మెయిన్‌ రోడ్డు వద్ద స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలను చేపట్టారు. అదేవిధంగా ఎలక్ట్రికల్‌ కాలనీల్లో విశ్వకర్మ పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

    నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ

    రాయగడ: స్థానిక లయన్స్‌ క్లబ్‌ అపరాజిత సంస్థ ప్రతినిధులు పట్టణంలోని నిరుపేదలకు ఆహార పొట్లాలను బుధవారం పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల్లో వారిని గుర్తించి సంస్థ సభ్యులు అక్కడకు చేరుకుని ఆహార పొట్లాలను అందించారు. తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవం సందర్భంగా పేదల ఆకలి తీర్చేందుకు తమవంతు కృషి చేశామని సంస్థ కార్యదర్శి బరాటం అవంతి తెలియజేశారు. పంపిణీ కార్యక్రమంల్లో సంస్థ అధ్యక్షులు జి.రామక్రిష్ణ, కోశాధికారి పి.కల్యాణి ఉన్నారు.

    15 అడుగుల నల్లత్రాచు పట్టివేత

    మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి లుగెల్‌ పంచాయతీ పరిధిలోని ఎంపీవీ–47 గ్రామంలోని ఓ వేపచెట్టు పైనుంచి భారీ నల్లత్రాచు పాము బుధవారం మధ్యాహ్న సమయంలో దిగుతూ అలజడి సృష్టించింది. దీన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వీరిని చూసిన పాము తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది. వెంటనే కలిమెల అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎంవీ–79 గ్రామ అటవీ శాఖ గార్డుతోపాటు మరోవ్యక్తి వచ్చి అతి కష్టంపై చెట్టూ ఎక్కి పామును పట్టుకున్నారు. దీని పొడవు 15 ఉందని అటవీ సిబ్బంది తెలిపారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సి పాము ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చి చెట్టు ఎక్కిపోయి ఉంటుందని భావిస్తున్నామన్నారు. అనంతరం పామును అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.

Prakasam

  • పెద్ద

    కంభం: మండలంలోని పెద్దనల్లకాల్వ గ్రామంలో జ్వరాలు అధికంగా ప్రబలిన వైనంపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పంచాయతీ, వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. బుధవారం గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న పిల్లల గృహాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తురిమెళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంపీడీఓ వీరభద్రాచారి, డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

  • అడ్డుకుంటాం
    మెడికల్‌ కాలేజీ ప్రైవేటీకరణను

    మార్కాపురం:

    వెనుకబడిన పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చేయకపోగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో కేటాయించిన మెడికల్‌ కాలేజీని ప్రైవేట్‌ పరం చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం మార్కాపురంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 19న వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో మెడికల్‌ కాలేజీ వాల్‌పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మెడికల్‌ కాలేజీని ప్రైవేటుపరం చేసేందుకు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 19న యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో కళాశాలను సందర్శించనున్నట్లు అన్నా పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 12 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 17 మెడికల్‌ కళాశాలలు నిర్మించేందుకు జగనన్న అనుమతులు తీసుకొచ్చారని వివరించారు. ఇప్పటికే 5 కళాశాలల్లో క్లాసులు ప్రారంభమయ్యాయని చెప్పారు. పాడేరు, పులివెందులలో మెడికల్‌ కళాశాలలను గత ఏడాది నుంచి క్లాసులు జరగాల్సి ఉండగా మెడికల్‌ సీట్లు అవసరం లేదని ఎన్‌ఎమ్‌సీ బోర్డుకు చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. నీట్‌ ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలోనే ఎంబీబీఎస్‌ చదువుకోవడానికి ఇష్టపడతారని తెలిపారు. మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభం కావాల్సి ఉందని, అందుకు తగ్గట్టు గత ప్రభుత్వంలోనే మార్కాపురం జీజీహెచ్‌లో బెడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ.475 కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ ప్రాంతానికి మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారని వివరించారు.

    పేదలపై పెను భారం

    మెడికల్‌ కళాశాలను ప్రైవేటుకు కేటాయించి ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపడం సమంజసం కాదని అన్నా రాంబాబు పేర్కొన్నారు. మార్కాపురం మెడికల్‌ కళాశాలను ప్రైవేటు పరంకాకుండా అడ్డుకునేందుకు నిరసనలు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతమైన పశ్చిమ ప్రకాశంలో మెడికల్‌ కాలేజీ ప్రైవేటు పరం కాకుండా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కృషి చేయాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ దొనకొండలో రాజధానిని ఏర్పాటుచేయాలని కోరిందని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారి సూచనలను పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ ప్రాంతంపై వివక్ష తగదని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకే ఈ ప్రాంతంలో గ్యాస్‌ ప్లాంట్లు కడతామని చెబుతున్నారని, సాగునీరు, పరిశ్రమలు లేని ఈ ప్రాంతంపై జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటామన్నారు.

    పశ్చిమ ప్రకాశంపై వివక్షలో భాగమే ప్రైవేటీకరణ

    ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ప్రైవేటీకరణను ఆపుతాం

    మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉద్ఘాటన

    శుక్రవారం నిర్వహించనున్న చలో మెడికల్‌ కాలేజీ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొనాలని అన్నా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషేర్‌ ఆలీబేగ్‌, జెడ్పీటీసీ సభ్యుడు నారు బాపన్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు సలీమ్‌, కౌన్సిలర్లు డాక్టర్‌ కనకదుర్గ, సిరాజ్‌, కొత్త కృష్ణ, చాటకొండ చంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్‌ జి.శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ మక్బుల్‌ బాషా, నాయకులు రామసుబ్బారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పి.చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, గొలమారి సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • వేర్వ

    పెద్దదోర్నాల: బైక్‌పై వెళ్తున్న ఓ గిరిజనుడిని అడవి పందులు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దదోర్నాల మండలంలోని పెద్ద మంతనాల సమీపంలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెద్దమంతనాలకు చెందిన కుడుముల రామన్న గత కొన్ని నెలలుగా యర్రగొండపాలెంలో నివాసం ఉంటూ బొగ్గుల బట్టీలు నిర్వహిస్తున్నాడు. బుధవారం వేకువజామున వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామమైన పెద్దమంతనాల వస్తున్నాడు. గ్రామ సమీపంలో వేగంగా రోడ్డు దాటుతున్న అడవి పందులు రామన్న బైక్‌ను ఢీకొట్టడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ మాలకొండయ్య తెలిపారు. మృతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు.

    శ్రీశైలం ఘాట్‌లో బైక్‌ అదుపు తప్పి..

    బైక్‌ అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం శ్రీశైలం ఘాట్‌రోడ్‌ లోని బోడేనాయక్‌ తండా వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. నంద్యాల జిల్లా నందికొట్కూర్‌కు చెందిన రాకేష్‌ బైక్‌పై శ్రీశైలం వెళ్తుండగా ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను అదే మార్గంలో ప్రయాణిస్తున్న శ్రీశైలం వైఎస్సార్‌ సీపీ నాయకులు ఒట్టి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా బంధువు భరత్‌రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గమనించారు. తమ కారును వెనక్కు మళ్లించి క్షతగాత్రుడి పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ అంబులెన్స్‌లో కర్నూలు తరలించేందుకు సహకరించి మానవత్వం చాటుకున్నారు.

    తాటిచెర్ల వద్ద పాదచారుడు మృతి

    కొమరోలు: నడుచుకుంటూ స్వగ్రామానికి వెళ్తున్న వ్యక్తిని వేగంగా వెళ్తున్న ట్రక్‌ ఢీకొనడంతో మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. తాటిచెర్ల గ్రామానికి చెందిన బొమ్మని రమణ(42) గిద్దలూరు హమాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం కూడా గిద్దలూరులో పని ముగిశాక మోటు వరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ తాటిచెర్ల వెళ్తున్న సమయంలో మినీ ట్రక్‌ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రమణను 108 వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

    కర్నూల్‌ ఘాట్‌లో అడవి పంది ఢీకొని ఒకరు..

    కొమరోలు మండలం తాటిచెర్ల వద్ద ట్రక్‌ ఢీకొని మరొకరు..

    శ్రీశైలం ఘాట్‌లో బైక్‌ అదుపు తప్పి యువకుడికి తీవ్రగాయాలు

  • మద్యా

    భర్త చేతిలో హింసకు గురైన యువతి ఆవేదన

    తర్లుపాడు: మద్యం తాగడానికి డబ్బులివ్వలేదనే కారణంతో భర్త బాలాజీ, అతని బంధువులు తనను అపహరించి, తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించారని తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడుకు చెందిన బాధిత మహిళ భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర గాయాలతో కదలలేని స్ధితిలో ఉన్న భాగ్యలక్ష్మిని మంగళవారం రాత్రి పోలీసులు చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మద్యానికి బానిసైన తన భర్త అప్పులు చేయడమే కాకుండా వేరే మహిళతో కలిసి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాడని తెలిపింది. కూలీనాలీ చేసుకుని నలుగురు పిల్లలను పోషించుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది. కాగా ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తర్లుపాడు పోలీసులు తెలిపారు.

    బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

    మార్కాపురం: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో భార్యను హింసించిన ఘటనలో బాలాజీతోపాటు సహకరించిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా సంఘ ప్రధాన కార్యదర్శి కె.రమా దేవి కోరారు. బుధవారం ఆమె మార్కాపురంలోని వైద్యశాలకు వెళ్లి బాధిత మహిళను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించకుంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆమె నలుగురు పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘ నాయకులు భూలక్ష్మి, శారా, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

     నిందితులను 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తాం: సీఐ వెంకటేశ్వర్లు

    పొదిలి: తర్లుపాడు మండంలోని కలుజువ్వలపాడులో భార్యను హింసించిన సంఘటనకు సంబందించి నిందితులందరినీ 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తామని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. బుధవారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ విలేకర్లతో మాట్లాడారు. సంఘటన స్థలాన్ని పరిలించి, బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నామన్నారు. భార్యను క్రూరంగా హింసించేందుకు భర్తకు సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లతో గాలిస్తున్నట్లు చెప్పారు.

  • మద్యం మత్తులో ఘర్షణ

    మార్కాపురం: మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో బుధవారం మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్కులో ఘర్షణకు దిగారు. పోలీసుల కథనం మేరకు.. షేక్‌ మహబూమ్‌ సుబానీ, అతని తండ్రి బాబు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం మద్యం సేవించి గాంధీ పార్కులో కూర్చుని ఉండగా, అదే సమయంలో నాగరాజు అనే మరో కూలీ వచ్చి అసభ్యకరంగా తిట్టాడు. దీంతో సుబానీ కోపోద్రిక్తుడై నాగరాజుపై దాడి చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు టూటౌన్‌ ఎస్సై రాజమోహన్‌రావు తెలిపారు.

    ఒంగోలు సిటీ: ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు జిల్లాలోని ఆర్టీసీ డిపోల్ల్లో అప్రెంటీస్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రధానాచార్యుడు, సహాయ అప్రెంటీస్‌ అడ్వైజర్‌, జిల్లా కన్వీనర్‌ సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డీజిల్‌ మెకానిక్‌ 37, మోటార్‌ మెకానిక్‌ 2, ఎలక్ట్రీషియన్‌ 9, వెల్డర్‌ 1, పెయింటర్‌ 1, ఫిట్టర్‌ 3, డ్రాఫ్ట్‌మన్‌ సివిల్‌ ఒకటి చొప్పున మొత్తం 54 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఎంపికై న విద్యార్థులకు అప్రెంటిస్‌ యాక్ట్‌ ప్రకారం శిక్షణా భృతి చెల్లిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 97031 65456ను సంప్రదించాలని సూచించారు.

    కలెక్టర్‌ పి.రాజాబాబు

    ఒంగోలు టౌన్‌: మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని కలెక్టర్‌ పి.రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం జీజీహెచ్‌లో మహిళల అరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించన్నుట్లు తెలిపారు. మహిళలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్య పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట , ఎమ్మెల్యే దామచర్ల, మేయర్‌ సుజాత, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, నోడల్‌ ఆఫీసర్‌ శ్యామల, డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాసనాయక్‌, ఐసీడీఎస్‌ పీడీ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

    ఒంగోలు సిటీ: ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం కల్పించాలని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్‌ ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2000 సంవత్సరం నుంచి ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్లు పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులు 140 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 169 మంది ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు మరణించారని, అందులో ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది ఉన్నారని తెలిపారు. వైద్యం నిమిత్తం రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినా టీచర్లు మరణించారని, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు మెడికల్‌ సౌకర్యం లేనందున రీయింబర్స్‌మెంట్‌ కల్పించి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  • హైవే మార్జిన్‌లోకి దూసుకెళ్లిన లారీ

    మద్దిపాడు: జాతీయ రహదారిపై గుట్టుగా తరలిపోతున్న బియ్యం అక్రమ రవాణాను లారీ డ్రైవర్‌ నిద్రమత్తు రట్టు చేసింది. బియ్యం లోడ్‌తో వినుకొండ నుంచి చైన్నె వైపు వెళ్తున్న 14 చక్రాల లారీ బుధవారం మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి ఫ్లయ్‌ఓవర్‌ సమీపంలో హైవే మార్జిన్‌లోకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన 2 విద్యుత్‌ స్తంభాలను తాకుతూ సుమారు 20 మీట్లర్ల దూరంలోని గదులను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ క్రమంలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీలో తరలిస్తున్నది పీడీఎస్‌ బియ్యంగా గుర్తించి సీజ్‌ చేశారు. లారీలో 25 కేజీల పరిమాణం గల 1200 బ్యాగ్‌లు ఉన్నాయని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

    బోల్తా పడిన లారీలో 30 టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులు

Peddapalli

  • అభివృ

    పెద్దపల్లిరూరల్‌: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తోందని మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఒబెదుల్లా కొత్వాల్‌ సాహెబ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అడిషనల్‌ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఆయన పాల్గొన్నారు. డీసీ పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.

    ఆరు గ్యారంటీల అమలు..

    కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లపాటు పాలించిన తొలిపాలకుల తీరుతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని కొత్వాల్‌ విమర్శించారు. అయినా ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రూ. 500కే సిలిండర్‌, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు అందిస్తున్నట్లు వివరించారు.

    బీసీలకు 42శాతం రిజర్వేషన్లు

    బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని ఒబెదుల్లా కొత్వాల్‌ అన్నారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో నిరసన చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు.

    జిల్లాలో ఆయకట్టు స్థిరీకరణ

    జిల్లా రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహ్మద్‌ ఒబెదుల్లా కొత్వాల్‌ అన్నారు. 2 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించి, 10వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించేలా శ్రీలక్ష్మీనర్సింహాస్వామి పత్తిపా క రిజర్వాయర్‌ను 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని అన్నారు. రూ.కోటి 10 లక్షలను డీపీఆర్‌ తయారీకి మంజూరు చేసిన ట్లు ఆయన తెలిపారు. 13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పెండింగ్‌ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

    అర్హులందరికీ రేషన్‌కార్డులు, సన్నబియ్యం..

    అర్హులైన పేదలు పదేళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూసి విసిగిపోయారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జిల్లాలో 12,168మందికి రేషన్‌కార్డులు అందించామని ఒబెదుల్లా కొత్వాల్‌ తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ

    ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందు కు జిల్లా ప్రధాన ఆస్పత్రిని రూ.52కోట్లతో ఆధునికీకరిస్తున్నామని ఒబెదుల్లా తెలిపారు. గోదావరిఖని జనరల్‌ ఆస్పత్రిని రూ.160కోట్లతో నిర్మిస్తన్నామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలను రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. పెద్దపల్లిలో 100 పడకలు, మంథనిలో 50 పడకలు ఆస్పత్రుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు.

    రూ.173కోట్లతో అభివృద్ధి పనులు

    జిల్లాలో రూ.173 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని కొత్వాల్‌ అన్నారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ఉన్నాయన్నారు. మత్స్యకారులు, మహిళా సంఘా లు ఆర్థికాభ్యున్నతి సాధించేలా రాయితీ రుణాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్డీవో గంగయ్య, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌తోపాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    వేడుకలకు హాజరైన ప్రముఖులు

    పోలీసుల గౌరవ వందనం

    మాట్లాడుతున్న మహ్మద్‌ ఒబెదుల్లా కొత్వాల్‌

    రామగుండం సీపీ కార్యాలయంలో..

  • మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

    పెద్దపల్లిరూరల్‌: మహిళలకు మెరుగైన ఆరోగ్యసేవ లు అందించేందుకు స్వస్థ్‌నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌ అమలు చేస్తున్నామని కలెక్టర్‌ శ్రీహర్ష, ఎంపీ వంశీకృష్ణ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం పథకం ప్రారంభించి మాట్లాడారు. మహిళ లు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ, సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

    గోపాలమిత్రలకు సన్మానం

    గోపాలమిత్రల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వునుకొండ శ్రీధర్‌, అధ్యక్షుడిగా కల్వల శ్రీనివాస్‌ను నియమించగా.. వారిని ఎంపీ సన్మానించారు. పాడిరైతులకు అండగా ఉండాలని సూచించారు.

  • కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి

    పెద్దపల్లిరూరల్‌: విరాట్‌ విశ్వకర్మ యజ్ఙమహోత్సవ్‌ను కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటం వద్ద మైనారిటీస్‌ ఫైనా న్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబెదుల్లా కొత్వాల్‌ సాహె బ్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు.. అడిషనల్‌ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు. ప్రభుత్వాదేశాలతో విశ్వకర్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామ ని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలని సంఘం జిల్లా అ ధ్యక్షుడు కట్ట రాజానందం, నాయకులు కోరారు. బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి పాల్గొన్నారు.

  • ఎన్టీ

    జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం ఎన్టీపీసీ – తెలంగాణ ప్రాజెక్టులో బుధవారం శ్రీవిశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) చందన్‌కుమార్‌ సామంత ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం సుమారు 2వేల మంది కార్మికులకు ప్రసాదం పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో జనరల్‌ మేనేజర్లు ముకుల్‌ రా య్‌, మనీశ్‌అగర్వాల్‌, అవిజిత్‌ దత్తా, బినోయ్‌జోస్‌, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

    సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

    జ్యోతినగర్‌(రామగుండం): సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అంగన్‌వాడీ టీచర్లు బాధ్యతగా వ్యవహరించాలని సైబర్‌ క్రై మ్‌ ఎస్సై కృష్ణమూర్తి సూచించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో బుధవారం ఏర్పాటు చే సిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. అనుమాతులు ఫోన్‌కాల్‌ చేస్తే బ్యాంక్‌, ఆ ధార్‌ తదితర వివరాలు తెలియజేయవద్దన్నా రు. ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, పేటీఎం, ఫోన్‌ పే, గూ గుల్‌ పే, ఈ కేవైసీ అప్‌డేట్‌ తదితర సమాచా రం అడిగినా సమాధానం ఇవ్వొద్దని ఆయన సూచించారు. సైబర్‌ నేరాల బారినపడితే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యా దు అందించాలని ఆయన కోరారు. అంగన్‌వాడీ టీచర్ల అసోసియేషన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ అనిల్‌, రామగుండం ప్రాజెక్ట్‌ సీడీపీవో అలేఖ్య పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

    వైద్య సిబ్బందికి టీకాలు

    పెద్దపల్లిరూరల్‌: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో బుధవారం వైద్యసిబ్బందికి హైపటైటిస్‌– బీవ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈవ్యాధితో రక్తం, శరీరద్రవ్యాలు వ్యాప్తి చెందుతాయని డీఎంహెచ్‌వో వాణిశ్రీ, సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ అన్నా రు. జీరో డోస్‌ తీసుకున్నాక నెలకు ఒక డోస్‌, ఆరునెలల తర్వాత రెండోడోస్‌ తీసుకోవాలని వారు సూచించారు. ప్రోగ్రాం అధికారి కిరణ్‌, ఆర్‌ఎంవో విజయ్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జమున తదితరులు పాల్గొన్నారు.

    బీజేపీ జిల్లా కార్యవర్గంలో పలువురికి చోటు

    సుల్తానాబాద్‌(పెద్దపల్లి): బీజేపీ జిల్లా కార్యవర్గంలో పలువురికి చోటు కల్పించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి బుధవారం తెలిపారు. ఉపాధ్యక్షులుగా అమరగాని ప్రదీప్‌ కుమార్‌, ముస్కూల భాస్కర్‌రెడ్డి, శనిగరపు రమేశ్‌, సౌదరి మహేందర్‌, మచ్చగిరి రాము, కాసాగోని నిర్మలగౌడ్‌, ప్రధాన కార్యదర్శులు గా కోమల మహేశ్‌ కుమార్‌, పల్లె సదానందం, కడారి అశోక్‌రావు, కార్యదర్శులుగా సో మా రపు లావణ్య, బిరుదు గట్టయ్య, మోటం న ర్సింగం, గర్రెపల్లి నారాయణస్వామి, దాడి సంతోష్‌, శివంగారి సతీశ్‌, కోశాధికారిగా కామని రాజేంద్రప్రసాద్‌ను నియమించామన్నారు. ఆ ఫీస్‌ కార్యదర్శిగా ఎస్‌ఎంసీ వనజ, సోషల్‌ మీ డియా ఇన్‌చార్జిగా కుమ్మ వెంకటకృషష్ణ, మీ డియా కన్వీనర్‌గా వెన్నంపల్లి శ్రీనివాస్‌రావు, ఐటీ ఇన్‌చార్జిగా అక్కపల్లి క్రాంతిని నియమించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో సంజీవరెడ్డి మాట్లాడుతూ, బీజేపీని మరింత బలోపేం చేసి వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో విజ యమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

    కబడ్డీపోటీలకు ఎంపిక

    ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని మీనుగు భూలక్ష్మి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం దేవేందర్‌రావు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన సబ్‌ జూనియర్‌ కబడ్డీ ఎంపిక పో టీల్లో భూలక్ష్మి ప్రతిభ చూపిందన్నారు. ఈనెల 25న నిజామాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొంటుందని పేర్కొన్నారు. బాలికను హెచ్‌ఎం, ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్‌ డైరెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌, గ్రామస్తులు అభినందించారు.

Sri Sathya Sai

  • 16 మండలాల్లో వర్షం

    పుట్టపర్తి అర్బన్‌: తుపాను ప్రభావంతో జిల్లాలోని 16 మండలాల్లో వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ సగటున 9.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా చిలమత్తూరు మండలంలో 46.4 మి.మీ, పుట్టపర్తి మండలంలో 40 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక పరిగి మండలంలో 35.4 మి.మీ, అమడగూరు 30.6, అగళి 29.2, మడకశిర 26.8, రొళ్ల 18.2, సోమందేపల్లి 17.0 , గోరంట్ల 15.2, పెనుకొండ 12.8, తాడిమర్రి 10.2, హిందూపురం 9.8, తనకల్లు 4.8, గుడిబండ 3.4, అమరాపురం 3.0, ఓడీచెరువు మండలంలో 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాకు మరో రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Patients crowded in a ward in the pediatric department of the district government hospital in Hindupuram.

    ఊరూరా జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్‌ ఆస్పత్రులే కాదు ఆర్‌ఎంపీల ప్రథమ చికిత్స కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు. ఏ ఆస్పత్రి చూసినా కిక్కిరిసి ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలంలో ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు డెంగీ బారిన పడటంతో బళ్లారి ఆస్పత్రికి చికిత్స చేయించారు. తాజాగా గుత్తి ఆర్ ఎస్ లో ఇద్దరు చిన్నారులు డెంగీ జ్వరంతో కోలుకోలేక ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేపుతోంది.

    సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు జ్వరాల బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సగటున 40 నుంచి 50 మంది ఔట్‌పేషెంట్లు చికిత్సకు వస్తే అందులో 15 మంది వైరల్‌ జ్వర పీడితులే ఉంటున్నారు. అనంతపురం సర్వజనాస్పపత్రిలో రోజూ 250 మందికి పైగా జ్వరబాధితులు చికిత్సకు వస్తున్నారు. చాలామంది చలి జ్వరంతో నడవలేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందించాల్సిన పరిస్థితి వస్తోంది. పడకలు సరిపడక కొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు– చికిత్సల ఖర్చులు భారీగా ఉండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే 50వేలమంది జ్వరాల బారిన పడినట్లు అంచనా. అందులోనూ చిన్నారులు కూడా జ్వరాలతో విలవిలలాడిపోతుండటం తల్లిదండ్రులను కలవరపెడుతోంది.

    చిన్నారులతో ప్రైవేటు ఆస్పత్రుల రద్దీ

    జ్వరాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉంటున్నారు. అనంతపురం సాయినగర్‌లోని ఓ చిన్నపిల్లల ప్రైవేటు ఆస్పత్రిలో జ్వరాలతో చేరిన చిన్నారులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఒక్కో చిన్నారికి రూ.500 ఔట్‌పేషెంటు ఫీజు వసూలు చేస్తుండటంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తపరీక్షలు, నెబులైజర్ల పేరిట రెండు మూడు రోజులకే రూ.15వేల వరకూ వసూలు చేస్తున్నట్టు వాపోతున్నారు.

    డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి

    గుత్తి ఆర్‌ఎస్‌లో తాత వద్ద ఉంటూ చదువుకుంటున్న సంయుక్త అనే ఏడేళ్ల అమ్మాయి ఆరు రోజుల క్రితం డెంగీతో కర్నూలులో చికిత్స పొందుతూ మృతిచెందింది. పాప తల్లిదండ్రులు ముదిగుబ్బలో నివాసం ఉంటారు. గుత్తికే చెందిన రెండేళ్ల హర్షిత్‌ అనే బాలుడు బుధవారం డెంగీతో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కానీ అనంతపురం జిల్లాలో డెంగీ మరణాలు లేవని, ఇప్పటివరకూ 37 కేసులు మాత్రమే నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు.

  • ప్రతి

    పుట్టపర్తి అర్బన్‌: ప్రతి మహిళకూ వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ ఆదేశించారు. స్వస్త్‌ నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజాబేగంతో కలసి ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, సీ్త్ర సంబంధిత అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, మందులు అందజేయాలన్నారు. అలాగే ఆభా కార్డ్‌లు (ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌), పీఎంజేఏవై కార్డుల నమోదు ప్రక్రియ జరగాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మంజువాణి, డాక్టర్‌ నాగేంద్రకుమార్‌, డాక్టర్‌ సునీల్‌, ఎన్టీఆర్‌ వైద్య సేవ అధికారి డాక్టర్‌ శ్రీదేవి, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డెమో బాబాఫకృద్దీన్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    నెల రోజుల పాటు ‘పోషణ్‌ మహా’..

    పోషకాహార ప్రాధాన్యతపై ప్రజలను చైతన్య పరిచాలని ఐసీడీఎస్‌ సిబ్బందిని జేసీ అభిషేక్‌కుమార్‌ ఆదేశించారు. నెల రోజుల పాటు పోషన్‌ మహా కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని సూచించారు. ఐసీడీఎస్‌ పీడీ ప్రమీలతో కలసి బుధవారం పుట్టపర్తి మండలం ఎనుములపల్లి పీహెచ్‌సీ ప్రాంగణంలో పోషన్‌ మహా కార్యక్రమాలను ఆయన ప్రారంభించి, మొక్క నాటి నీరు పోశారు. మాతృవందన యోజనపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు పలు రకాల ఆహార పదార్థాలను తీసుకొచ్చి ప్రదర్శించారు. వాటిలోని పోషక విలువలను గర్భిణులకు, బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

    క్రికెట్‌ టోర్నీలో గురుకుల విద్యార్థుల సత్తా

    రొళ్ల: తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న జీసీసీ (గుమ్మడి క్రికెట్‌ గ్రౌండ్‌) వేదికగా స్కూల్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ యాక్టివిటీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగిన 6వ జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నీలో రొళ్ల మండలం దొమ్మరహట్టిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 15 మంది క్రీడాకారులున్న ఏపీ జట్టులో 9 మంది గురుకుల పాఠశాల విద్యార్థులే ఉండడం గమనార్హం. ఫైనల్‌ మ్యాచ్‌లో తెలంగాణ జట్టుతో తలపడిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. తర్వాత బరిలో దిగిన తెలంగాణ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగుల వద్ద చతికిలపడింది. 3 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు విజయం సాధించింది. ఆంధ్ర జట్టు తరపున విజేత ట్రోఫీని కెప్టెన్‌ మనోహర్‌, వైస్‌ కెప్టెన్‌ వరుణ్‌సందేష్‌ అందుకున్నారు. ప్రతిభ చాటిన గురుకుల పాఠశాల విద్యార్తులు బుధవారం సాయంత్రం ఎంఈఓ శ్రీధర్‌, ప్రిన్సిపాల్‌ మైలారప్ప, చైర్మన్‌ సుమతో పాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

  • టేకులోడు ఎంజేపీ పాఠశాల

    విద్యార్థులకు కలెక్టర్‌ సూచన

    చిలమత్తూరు: జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు గర్వించేలా ప్రతి విద్యార్థీ బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. బుధవారం చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్‌లో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశాల, విద్యార్థుల భోజన గది, క్రీడా మైదానాన్ని పరిశీలించారు. పాఠశాలలో సౌకర్యాలు, విద్యాబోధన తదితర అంశాలపై విద్యార్థులతో ఆరా తీశారు. 1,100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు, మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    నేడు మద్యం

    దుకాణాలకు లాటరీ

    పుట్టపర్తి టౌన్‌: జిల్లాలో దరఖాస్తు చేసుకున్న మూడు మద్యం దుకాణాలకు గురువారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించనున్నట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ గోవిందనాయక్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో 12 బార్ల నిర్వహణకు టెండర్లు పిలవగా ఏడింటికి మాత్రమే దరఖాస్తులు అందాయి. వీటికి లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేశారు. మిగిలిన 5 బార్లకు మరోమారు పలు దఫాలుగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. గడువు ముగిసే సమయానికి మడకశిర, కదిరి, హిందూపురంలోని బార్లకు 12 దరఖాస్తులు అందాయి. ధర్మవరంలో రెండు దుకాణాలకు దరఖాస్తులు అందలేదు. దరఖాస్తులు అందిన మూడు బార్లకు గురువారం ఉదయం లాటరీ నిర్వహించనున్నారు.

  • సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం

    పెనుకొండ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్‌, కార్యదర్శులు లక్ష్మీరాజా, శెట్టిపి జయచంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్‌ చేపట్టిన రణభేరి కార్యక్రమం కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా బుధవారం పెనుకొండకు చేరింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌తో కలసి యూటీఎఫ్‌ నాయకులు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఒకటిన్నర ఏడాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. పీఆర్‌సీని నియమించడంతో పాటు 30 శాతం ఐఆర్‌ను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు డీఏలు, రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు, 11వ పీఆర్‌సీ, అరియర్స్‌, పీఎఫ్‌ చెల్లింపులు చేయాలన్నారు. ఈ నెల 25న గుంటూరులో తలపెట్టిన రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు నారాయణస్వామి, నబీ, నరేష్‌, భూతన్న, జీహెచ్‌ బాబు, మారుతి, శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, నరసింహప్ప, మహంతేష్‌, రామకృష్ణనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

    యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్‌

  • వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు

    పెనుకొండ: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ సూచించారు. పెనుకొండలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులను బుధవారం సీపీఎం నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలనుకోవడం అవివేకమన్నారు. 2023లో గత ప్రభుత్వం పెనుకొండలో వైద్య కళాశాల భవన నిర్మాణాలను చేపట్టి రూ. 30 కోట్ల మేర ఖర్చు పెట్టిందని, ఇలాంటి తరుణంలో ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతమైన పెనుకొండలో సత్వరం మెడికల్‌ కళాశాల నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పెనుకొండలో మెడికల్‌ కళాశాల ఏర్పాటైతే సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. అదే ప్రైవేట్‌ పరమైతే ఫీజుల భారం పడుతుందన్నారు. వైద్య సేవలు అత్యంత ఖరీదుతో కూడుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను వీడి ప్రభుత్వమే మెడికల్‌ కళాశాలలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగాధర్‌, వెంకటరాముడు, సీఐటీయూ జిల్లా నాయకుడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

    మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌

  • వైద్య సేవల్లో లోపాలు తలెత్తరాదు

    పరిగి: మహిళలకు అందజేస్తున్న వైద్య సేవల్లో లోపాలు తలెత్తరాదని వైద్య, ఆరోగ్య సిబ్బందిని స్వస్త్‌ నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమ స్టేట్‌ నోడలాఫీసర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. స్వస్త్‌ నారీ–సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పరిగిలోని పీహెచ్‌సీలో బుధవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. మహిళల ఆరోగ్య భద్రత కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం పలువురు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దారు హసీనాసుల్తానా, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు నవీన, స్వరూపరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మంజువాణి, ఆర్‌ఐ సిద్దేశ్వర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లలిత, సిబ్బంది పాల్గొన్నారు.

    స్వస్త్‌ నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌

    కార్యక్రమ స్టేట్‌ నోడలాఫీసర్‌ అనిల్‌కుమార్‌

  • యూరియా కోసం రైతుల ఆందోళన

    అగళి: యూరియా కోసం మండల పరిధిలోని పి.బ్యాడగేరలో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం పి.బ్యాడగెర రైతు సేవా కేంద్రానికి 280 బస్తాలు యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు 500 మంది రైతులు ఉదయమే సేవా కేంద్రం ఎదుట బారులు తీరారు. గంటల తరబడి ఓపిగ్గా నిల్చున్నా.. అధికారులు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. అయినా కూడా చాలా మంది రైతులకు యూరియా అందలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిదారు. కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

West Godavari

  • రక్తపు మడుగులో బాలుడు

    ఏలూరు టౌన్‌: ఏలూరు శివారు కలపర్రు జాతీయ రహదారికి వెళ్ళే ప్రధాన రహదారిపై పొలాల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని గుర్తించిన సమీపంలోని రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ బాలుడిని అంబులెన్స్‌లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. బిఆలుడి తల, చెవుల పక్కన తీవ్ర గాయాలున్నాయి. కత్తితో, పదునైన చాకుతో పొడిచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏకంగా పదికి పైగా కత్తిపోట్లు ఉన్నాయని చెబుతున్నారు. బాలుడి వయసు 14 నుంచి 15 ఏళ్లు ఉంటుందని, ఖాకీ రంగు నిక్కరు, ఎరుపు టీషర్ట్‌ వేసుకుని ఉన్నాడనీ, వివరాలు తెలిస్తే.. 9440796637 నెంబరులో సంప్రదించాలని కోరారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, పెదవేగి సీఐ రాజశేఖర్‌, పెదపాడు ఎస్‌ఐ సంఘటనా స్థలంలో పరిస్థితులను పరిశీలించారు. ఎవరైనా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి కత్తితో పొడిచి పారిపోయారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

  • రోడ్డెక్కిన దస్తావేజు లేఖర్లు

    పెదవేగి: తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కనున్నట్టు దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఆయన నేతృత్వంలో జిల్లా స్థాయి లేఖర్లు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని, వీలునామాలు రాయించుకున్న వారి ఇళ్లకు వెళ్లి నేరుగా అక్కడే రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా అనుమతి కల్పించాలని, ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఇచ్చే గ్రాంట్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దస్తావేజు రాసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్‌ కోసం 72 గంటలు సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. పెన్‌ డౌన్‌ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖర్లంతా శుక్ర, శని వారాల్లో నిర్వహించే పెన్‌డౌన్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • జగన్‌
    వాగులు దాటాలంటే వణుకే
    వర్షాకాలం వస్తే చాలు.. ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు బుసలు కొడుతూ ప్రవహిస్తూ ఉంటాయి. వాగు దాటాలంటే ప్రజలు వణుకుతున్నారు. 8లో u

    2024 ఎన్నికల నాటికి

    గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

    ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏలూరులో మెడికల్‌ కాలేజీ నిర్మించారు. మాజీ సీఎం జగన్‌ జిల్లా ప్రజల కలను నిజం చేస్తూ.. ప్రతి పేదవాడికి అత్యుత్తమ స్థాయి వైద్యచికిత్సలు, సేవలు అందాలనే సంకల్పంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని తేవడమే కాదు, యుద్దప్రాతిపదికన భవనాల నిర్మాణం చేపట్టారు. 2023 సెప్టెంబర్‌ 15న మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభించిన భవనాల వద్ద ఇప్పుడు కూటమి నేతలు ఫొటోలు దిగుతూ ... తమ హయాంలోనే జరిగిందనే రీతిలో ప్రచారం చేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించి 50 శాతం పనులు పూర్తి చేయగా.. కూటమి 15 నెలల పాలనలో మిగిలిన 50శాతం పనులు నేటికీ పూర్తి చేయలేదు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్ర చేస్తోంది. దీనిని నిరసిస్తూ ఈ నెల 19న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు.

    ఏడాదిలోపే భవన నిర్మాణం

    2019 అక్టోబర్‌ 4న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జీజీహెచ్‌కు శంకుస్థాపన చేశారు. అప్పటికే అక్కడ భారీ భవనాలు ఉండడంతో ముందుగా వాటిని తొలగించారు. ఈలోగా కరోనా వైరస్‌ విలయంతో రెండేళ్ల పాటు కరోనాతో పనులన్నీ నిలిచిపోయాయి. అనంతరం 2022 అక్టోబర్‌లో పాత బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలో డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద రూ.60 కోట్లతో శరవేగంగా కేవలం ఏడాదిలోపే భవన నిర్మాణం పూర్తి చేశారు. 2023 సెప్టెంబర్‌ 15న ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించారు.

    కూటమి రాకతో పనుల్లో జాప్యం : కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. కాంట్రాక్టర్‌ను తొలగిస్తారని, నిధులు విడుదల చేస్తారో లేదో అన్న సందేహాలతో పనులు నత్తనడకన సాగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా... నేటికీ శాశ్వత భవనం, హాస్టల్స్‌ భవనాలను పూర్తి చేయలేదు.

    తామే కట్టామంటూ కూటమి నేతల ప్రగల్భాలు

    ఏలూరు జీజీహెచ్‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ భవనం వద్ద కూటమి నేతలు ఫొటోలు దిగటాన్ని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఏలూరులో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నం చేయని సీఎం చంద్రబాబు.. మాజీ సీఎం జగన్‌ పనులు ప్రారంభించిన భవనాల వద్ద తమ హయాంలోనే అంటూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం మూడో ఏడాది ప్రారంభం నాటికై నా పనులు పూర్తి చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

    రాయలంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సందీప్‌

    మాట్లాడుతున్న మాజీ మంత్రి కారుమూరి

    ఏడాదిలోనే ఎంబీబీఎస్‌ క్లాస్‌లకు మెడికల్‌ కళాశాల సిద్ధం

    శాశ్వత కళాశాల పనులూ వైఎస్సార్‌సీపీ హయాంలోనే

    కూటమి ప్రభుత్వంలో పనుల జాప్యంతో క్లాస్‌లకు ఇబ్బంది

    ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి సర్కారు యత్నం

    ఈ నెల 19న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

    ఏలూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు... కాలేజీ శాశ్వత భవనాలు, పరిపాలన భవనం, విద్యార్థులకు హాస్టల్స్‌ భవనాలు, అధునాతన బోధనాసుపత్రి(జీజీహెచ్‌), టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, నర్సింగ్‌ స్టాఫ్‌కు నివాసాలకు క్వార్టర్లు, అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబ్‌లు, ఇలా పూర్తిస్థాయి మెడికల్‌ కళాశాల తీర్చిదిద్దేందుకు రూ.525 కోట్లు నిధులను మంజూరు చేయించారు. ఏలూరు జీజీహెచ్‌లో శాశ్వత మెడికల్‌ కాలేజీ భవనం, వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనాల నిర్మాణ పనులను 2023 జనవరిలో ప్రారంభించారు. ఈ భవనాలను యుద్ధప్రాతిపదికన 2024 సెప్టెంబర్‌ కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 జూన్‌ 4 నాటి వరకూ పనులు శరవేగంగా సాగాయి.

Warangal

  • మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యం

    వరంగల్‌ ఎంపీ కడియం కావ్య

    హన్మకొండ: మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్వస్థనారి స్వశక్తి పరివార్‌ అభియా న్‌లో భాగంగా బుధవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్‌సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత ఈ మెగా వైద్యశిబిరాన్ని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌తో కలిసి కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్యసేవలందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించా రు. టీబీ ముక్త్‌ అభియాన్‌లో భాగంగా దాతలు అందించిన పోషకాహార కిట్‌లను టీబీ వ్యాధిగ్రస్తులకు అందించారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్‌, డాక్టర్లు అజిత్‌ మహమ్మద్‌, సుదీప్‌, ప్రశాంత, హారిక, హిమబిందు ఉన్నారు.

  • హసన్‌పర్తి: బైక్‌ అదుపు తప్పి ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈసంఘటన కేయూ–వడ్డేపల్లి రోడ్డులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా అన్నంపల్లికి చెందిన పోరిక రమేశ్‌నాయక్‌ (42) జవహర్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి మోడల్‌ స్కూల్‌లో ఆయన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. 

    బుధవారం రాత్రి బైక్‌పై ఇంటి నుంచి కేయూ జంక్షన్‌ వైపు పని నిమిత్తం ఆయన బయల్దేరాడు. మార్గమధ్యలో తులసి బార్‌ సమీపంలో చీకటిగా ఉండడంతో ఎదురుగా వెళ్తున్న ఆవు కనిపించలేదు. దీంతో సడన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ అదుపు తప్పి ఆవును ఢీకొని కిందపడిపోయాడు. ఈసంఘటనలో తలకు బలమైన గాయమై రమేశ్‌నాయక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

  •  Officials and public representatives present

    వరంగల్‌ అర్బన్‌: తెలంగాణ సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కొనియాడారు. తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంలో భాగంగా బుధవారం వరంగల్‌ ఓ సిటీకి ఎదురుగా ఉన్న ఐడీఓసీ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజున ‘తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం’గా నిర్వహించడం శుభసూచకమన్నారు. స్వాతంత్య్రం పొందిన సమయంలో దేశంలో రెండు రకాల పరిపాలన ఉండేదన్నారు. స్వాతంత్ర సమరయోధులు, మేధావుల దూరదృష్టి, ప్రభావవంతమైన చర్యల వల్ల భారత్‌ శక్తివంతమైన దేశంగా అవతరించిందని చెప్పారు.

    తెలంగాణలో దశాబ్దకాలం తర్వాత 2023 డిసెంబర్‌ 7న ప్రారంభమైన ఇందిరమ్మ ప్రజారాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య, పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఆరు గ్యారంటీలతోపాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆర్థిక క్రమశిక్షణతో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ సత్యశారద, అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యరాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

  • తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు

    సాక్షి, వరంగల్‌: జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జూలైలో 1,182 వాహనాలు రిజిస్ట్రేషన్లు అయితే ఆగస్టులో ఆ సంఖ్య పెరిగి 1,297కు చేరుకుంది. కానీ, సెప్టెంబర్‌లో మాత్రం 552 వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. కార్లు, బైక్‌లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించడంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు. దీంతోపాటు దసరా పండుగ వస్తుండడంతో ఈ నెల 22 తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు జోరందుకుంటాయని రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కార్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గుతుండడం వాహనదారులకు రూ.వేలల్లో నుంచి రూ.లక్షల్లో ఉపశమనం కలిగించే అంశమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్లు తగ్గినా దసరాలోపు భారీగానే పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో రవాణా శాఖకు వచ్చే ఆదాయానికి ఏమాత్రం ఢోకా ఉండకపోవచ్చు. జిల్లాలో ఇప్పటికే 2.30 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి.

    తగ్గనున్న ధరలు..

    నగర పరిధిలో బైకులు, కార్ల షోరూంలు సుమారు 30కి పైగా ఉన్నాయి. ఈ నెల 22 నుంచి జీఎస్టీ తగ్గనుంది. భారీ ఎంటీ లెవల్‌ హ్యాచ్‌ బైక్‌ నుంచి లగ్జరీ ఎస్‌.యూవీ కార్ల వరకు ధరలు తగ్గనున్నాయి. దీంతో వాహనాలు కొనాలనుకునేవారు ఇప్పటికే ధరలు ఏమేర తగ్గుతాయని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. బైక్‌ కొనాలనుకునేవారికి రూ.20 వేల నుంచి రూ.35 వేలు, కారు కొనుగోలు చేస్తే కనిష్టంగా రూ.65 వేల నుంచి గరిష్టంగా రూ.లక్షన్నర వరకు తగ్గొచ్చొని విక్రయదారులు చెబుతున్నారు. ప్రతి ఏటా దసరా, దీపావళికి 240 నుంచి 350 వరకు కార్ల అమ్మకాలు జరుగుతుండేవని, ఈసారి ఆ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చంటున్నారు. పలు కంపెనీ లు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈనెల 22లోగా ముందుస్తు బుకింగ్‌ చేసుకునే వారికి చిన్న కారుపై రూ.80 వేలు తగ్గింపుతోపాటు కారు డెలివరీ సమయంలో జీఎస్టీ తగ్గింపు అమలు చేస్తామని ఆఫర్‌ చేస్తుండడంతో కొందరు ఇప్పటికే బుకింగ్‌ చేసుకుంటున్నారు.

    కొనుగోళ్లపై మారనున్న జీఎస్టీ శాతం

    ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్‌లో సగం కంటే తక్కువే..

    భారీగా పడిపోయిన కారు, బైక్‌ల విక్రయాలు

    ఈ నెల 22 తర్వాత రిజిస్ట్రేషన్లు పుంజు కుంటాయంటున్న ఆర్టీఏ అధికారులు

  • దళిత కాలనీలను సుందరీకరిస్తాం

    నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి

    దుగ్గొండి: నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దళిత కాలనీలను సుందరీకరిస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.53 లక్షలతో మండలంలోని తొగర్రాయి, మందపల్లి, మధిర, అడవిరంగాపురం గ్రామాల్లో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. దళితులకు ఇళ్లు, దళిత కాలనీల్లో రోడ్లు, మంచినీటి వసతి కాంగ్రెస్‌ ప్రభుత్వాల కాలంలోనే అందాయని గుర్తు చేశా రు. అన్ని దళిత కాలనీల్లో సీసీ రోడ్డుతోపాటు డ్రె యినేజీలు నిర్మిస్తామన్నారు. ఇళ్లులేని వారికి ప్రాధాన్యతా క్రమంలో రాజకీయాలకు అతీతంగా ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. బతుకమ్మ సంబరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

    కాంగ్రెస్‌తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

    నర్సంపేట: కాంగ్రెస్‌తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలం లింగాపురం, కోనాపురం, ఉప్పరపల్లి, అక్కల్‌చెడ, అమీనబాద్‌, బోజెర్వు, లింగగిరి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, మహిళా సంఘాల భవనాలకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద సుమారు రూ.2కోట్ల 30లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మార్కె ట్‌ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్‌, నర్సంపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్‌, ఎర్రల్ల బాబు, కిరణ్‌రెడ్డి, నర్సింగరావు, రాజేశ్వర్‌రావు, ఎడెల్లి శ్రీనివాసరెడ్డి, దంజ్యా, రామారావు, బండి రాజమల్లు, అమ్మరోహిత్‌, నర్సింహారెడ్డి, తిరుపతి, రాజేశ్వరాచారి, సుమలత, బుర్రి సునిత, కూనమల్ల శ్రీనివాస్‌, పుప్పాల శ్రీనివాస్‌, నగేష్‌, ఎంపీడీఓ శ్రీవాణి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్‌, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • క్వాంటం సైన్స్‌పై అవగాహన ఉండాలి

    రామన్నపేట : విద్యార్థులకు క్వాంటం సైన్స్‌పై అవగాహన ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి రంగ య్య నాయకుడు అన్నారు. నగరంలోని మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా సైన్స్‌ అధికారి కట్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ‘క్వాంటం యుగం ప్రా రంభం– అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ సెమినార్‌ ముగింపు సమావేశంలో డీఈఓ మాట్లాడారు. సాంకేతికంగా ప్రపంచం దూసుకెళ్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న సూపర్‌ కంప్యూటర్లు 1,000 సంవత్సరాలు తీసుకొని చేయగలిగే పనిని రానున్న క్వాంటం కంప్యూట ర్లు కొన్ని సెకండ్ల వ్యవధిలో చేయగలగుతాయని అన్నారు. సాంకేతిక విస్పోటనం జరుగుతున్న తరుణంలో విద్యార్థులు క్వాంటం సైన్స్‌పై, శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న పలు మార్పులపై అవగాహ న కలిగి పెంచుకోవాలని తెలిపారు. ఈ సెమినార్‌లో చెన్నారావుపేట మండలం లింగాపురం జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని బూర మానస మొదటి స్థానం నిలిచి ఎస్సీఈఆర్టీలో జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ సెమినార్‌కు అర్హత సాధించింది. శ్రీ సరస్వతి విద్యానికేతన్‌ హైస్కూల్‌ విద్యార్థి సహస్రాక్ష్‌ ద్వితీ య స్థానం, నర్సంపేట అక్షర హైస్కూల్‌ విద్యార్థిని హరిప్రియ తృతీయ స్థానం కై వసం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం విజేతలకు, పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలు పింగిళి కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రతిభ, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పెట్లోజు సురేష్‌, దేవులపల్లి కిరణ్‌ వ్యవహరించగా, మట్టెవాడ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అరుణ ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, వారి గైడ్‌ టీచర్లు పాల్గొన్నారు.

    డీఈఓ రంగయ్య నాయుడు

  • పూర్వ విద్యార్థులు సహకారం అందించాలి

    కేయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి

    కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో చదువుకొని వివిధ దేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కృషిని అభినందిస్తూ, వర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. అమెరికాలోని అట్లాంటాలో ఫార్మసీ కళాశాల గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించగా వీసీ ప్రతాప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెలబ్రెట్‌ అండ్‌ కంట్రిబ్యూట్‌ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సమూహాలు యూనివర్సిటీ గ్లోబల్‌ భాగస్వామ్యా నికి రావాలని కోరారు. అల్యుమ్ని గోల్డెన్‌జూబ్లీ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్తరాష్ట్రాల విశ్వవిద్యాలయ ఫార్మసీ చాప్టర్‌, కేయూ ఫార్మసీ విభాగం పూర్వవిద్యార్థి డాక్టర్‌ సాంబారెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ పరుచూరితో పాటుగా పూర్వవిద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

  • పంటల నమోదు వేగవంతం చేయాలి

    గీసుకొండ: వానాకాలం పంటల నమోదును ఏఈ ఓలు వేగవంతం చేయాలని, నమోదుతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా వ్యవసా య అధికారి అనురాధ అన్నారు. మండలంలోని ప లు గ్రామాల్లో పంట చేలు, యూరియా పంపిణీ, పంటల నమోదు తీరును బుధవారం ఆమె పరిశీ లించి మాట్లాడారు. ఎలుకుర్తి హవేలిలో పీఏసీఎస్‌ రికార్డులు, గోదాంను పరిశీలించారు. ఎరువుల అ మ్మకం రిజిష్టర్లను సరిగా నిర్వహించాలన్నారు. దు మాల రాజు అనే రైతు పత్తి చేనులో నానో యూరి యాతోపాటు సాగరిక గోల్డ్‌(పోటాష్‌–14శాతం)ను కలిపి పిచికారీ చేయించారు. పూత కాత దశలో ఉన్న పత్తి చేలకు గుళికల రూపంలో ఉన్న యూరియాకు బదులుగా నానో యూరియాను స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. నానో యూరియాతోపా టు నానో పొటాష్‌/సాగరిక గోల్డ్‌ కలిపి పిచికారీ చేస్తే మంచిదన్నారు. ఈ సమయంలో వరి పొలాలు ఉన్న రైతులు మాత్రమే గుళికల యూరియాను వేయాలన్నారు. గుళికలను నీళ్లు తీసిన పొలంలో వేస్తే మేలని రైతులకు చెప్పారు. ఏఓ హరిప్రసాద్‌బాబు, ఏఈఓలు స్మిత, రజిని, ఎలుకుర్తి పీఏసీఎస్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, సీఈఓ సాంబశివుడు ఉన్నారు.

    జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ

  • అభివృద్ధిపై మంత్రి సమీక్ష

    హన్మకొండ అర్బన్‌: ప్రజా పాలన వేడుకల అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హనుమకొండ కలెక్టరేట్‌లో సుమారు గంటసేపు హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు, మేయర్‌, గ్రేటర్‌ కమిషనర్‌, జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, కాంగ్రెస్‌ అంతర్గత విషయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. అంతకుముందు ప్రజాపాలన వేడుకల కోసం నగరానికి వచ్చిన మంత్రి పొంగులేటికి నిట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

    అమరవీరులకు నివాళి..

    హనుమకొండ అదాలత్‌ కూడలిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీశ్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Jogulamba

  • అందరి

    గద్వాల: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని అధికారంలోకి వచ్చిన 48గంటల్లోనే అమలు చేస్తూ సీఏం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని.. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఏం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్‌ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ప్రజల ఆత్వగౌరవానికి ప్రతీకగా నిలిచిన రేషన్‌కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూలై 14వ తేదీన ప్రారంభించామన్నారు. పదేళ్ల తరువాత మళ్లీ ప్రజలకు కొత్త రేషన్‌కార్డులు అందించామన్నారు. ఉగాది పండుగ నుంచే ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. జిల్లాలో 1,81,352 రేషన్‌కార్డు లబ్ధిదారులకు 4058 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం కేటాయించడం జరిగిందన్నారు.

    జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు

    ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులను ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను ఆకట్టుకున్నాయి. బాలభవన్‌ నాట్య మయూరి నృత్యశిక్షణ కేంద్రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎస్పీ టి.శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, మార్కెట్‌యార్డు చైర్మన్లు హనుమంతు, దొడ్డప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నీలిశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించాలి

    గద్వాల/అలంపూర్‌: జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రధానంగా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. అదేవిధంగా వీఐపీల ప్రోటోకాల్‌ విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వేడుకలకు వచ్చే భక్తులకు తాగునీటిని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రసాద్‌స్కీమ్‌ భవన్‌లో నీటికొరత తలెత్తకుండా ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. పారిశుద్ధ్య పనులను పక్కాగా చేపట్టి ఆలయ ప్రాంగణం, ఘాట్‌పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి అలంపూరు వరకు, అలంపూర్‌ నుంచి దేవస్థానం వరకు బస్సులను పెంచాలన్నారు. నీటిప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఫైర్‌ సేఫ్టీ అధికారులు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసుబందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందించేలా మెడికల్‌ క్యాంపు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని, విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా నిరంతర విద్యుత్‌ సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో అలివేలు, దేవాలయశాఖ ఈవో దీప్తి, మిషన్‌భగీరథ ఇంట్రా, గ్రిడ్‌ ఈఈలు శ్రీధర్‌రెడ్డి, పరమేశ్వరి, ఆర్‌అండ్‌బి ఈఈ ప్రగతి, ఇరిగేషన్‌శాక ఈఈ శ్రీనివాస్‌రావు, డీఎస్పీ మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.

    జిల్లా అధికారులకు ఆహ్వానం

    జోగుళాంబ ఆలయంలో జరిగే శరన్ననవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ జిల్లా అధికారులను ఆహ్వానించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ నాగేశ్వర్‌ రెడ్డి, ఈఓ దీప్తి ఆలయ ధర్మకర్తలు.. కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రావు, అదనపు కలెక్టర్‌ లక్ష్మినారయణను బుధవారం కలిశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో హాజరుకావలని కోరుతూ ఆహ్వానం పలికారు. వీరితోపాటు ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, సరస్వతి, అడ్డాకుల రాము, జగన్‌ గౌడు, గోపాల్‌, జయన్న, నాయకులు జోగుల రవి తదితరులు ఉన్నారు.

    జోగుళాంబ ఆలయంలో

    పకడ్బందీ ఏర్పాట్లు

    భక్తులకు ఎలాంటి ఇబ్బందులు

    రాకుండా చర్యలు

    కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • మహిళల

    గద్వాల క్రైం: మహిళలు ఎదుర్కొంటుంన్న ఆరోగ్య సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యచరణ చేపట్టిందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో స్వస్థ్‌ నారి సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 17వ తేది నుంచి ఈక్టోబర్‌ 2వ తేది వరకు మహిళల ఆరోగ్య సమ్యసలపై ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని స్వదినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో సీ్త్ర వ్యాధి, మానసిక, నేత్ర, చెవి, ముక్కు, దంత, చర్మ, పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. రక్తపోటు, షుగర్‌, నోటి, రొమ్ము, గర్భాశయ, క్యాన్సర్‌, టీబి తదితర రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మహిళలు శిబిరంలో పాల్గొనాలని, అన్ని రకాల వ్యాధులకు మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్‌ వైద్యాధికారి సిద్దప్ప, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఇందిర, అభినేష్‌, రాజు, ప్రసూన్నరాణి, సంధ్యాకిరణ్‌మై, శ్రీధర్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు.

    నేడు, రేపు డిగ్రీలోస్పాట్‌ అడ్మిషన్లు

    శాంతినగర్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో గురు, శుక్రవారాల్లో స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌. రామా ఓబులేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక, స్థానికేతర విద్యార్థులకు అడ్మిషన్‌ చేసుకునేందుకు అవకాశం వుందని తెలిపారు. అడ్మిషన్‌ పొందాలనుకునే విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లతో ఈనెల 18, 19 తేదీల్లో కళాశాలలో హాజరుకావాలని సూచించారు.

    పారదర్శక పాలనతోప్రజలకు మేలు

    మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రజా పాలన ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు ఎన్నో లాభా లు ఉంటాయని జోగుళాంబ జోన్‌–7 డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం డీఐజీ కార్యాలయంలో డీఐజీ, అదేవిధంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్‌ అధికారి, సిబ్బంది మరింత కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్‌, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, శ్రీనివాసులు, ఏఓ రుక్మిణిబాయి, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్‌, భగవంతురెడ్డి, శ్రీనివాస్‌, వెంకటేష్‌, ఆర్‌ఐలు నగేష్‌, కృష్ణయ్య పాల్గొన్నారు.

  • మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి

    గద్వాలటౌన్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి పిలుపునిచ్చారు. మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా సమర్పణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరా న్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్య పద్దతుల గురించి ఈతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జన ఔషద సంస్థ ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే మందులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఉచితంగా జనరిక్‌ మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని, సేవా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

  • జోరుగా ఉల్లి వ్యాపారం

    గరిష్టంగా రూ.1,800,

    కనిష్టంగా రూ.1,100

    దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వివిధ గ్రామాల నుంచి రైతులు వేయి బస్తాల వరకు ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో నాణ్యమైన ఉల్లి ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,800 పలకగా.. కనిష్టంగా రూ.1,100 ధర వచ్చింది. గత వారం కంటే ధరలు స్వల్పంగా పెరిగాయి. 50 కిలో ఉల్లి బస్తా గరిష్టంగా రూ.900, కనిష్టంగా రూ.550, మధ్యస్తంగా రూ.700 చొప్పున విక్రయించారు.

    ఆర్‌ఎన్‌ఆర్‌ ధర రూ.2,009

    దేవరకద్ర మార్కెట్‌ యార్డులో బుధవారం జరిగిన ఈనామ్‌ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2009 ఒకే ధర లభించింది. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,719, కనిష్టంగా రూ.1,629 ధరలు నమోదయ్యాయి.

    వేరుశనగ క్వింటా రూ.4,239

    గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌ యార్డుకు బుధవారం 96 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 4239, కనిష్టం రూ. 2419, సరాసరి రూ. 3539 ధరలు లభించాయి. అలాగే, 11 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 6019, కనిష్టం రూ. 6011, సరాసరి రూ. 6011 ధరలు పలికాయి.

Wanaparthy

  • అర్హు

    వనపర్తి: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, యాదయ్య, వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు.

    ● జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల 38 లక్షల 68 వేల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని.. మొత్తం ప్రయాణికుల్లో 64.28 శాతం మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా రూ.97.54 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. 85 వేల మందికి 2,34,879 గ్యాస్‌ సిలిండర్లు రూ.500కే పంపిణీ చేశామని.. దీనికిగాను ప్రభుత్వం రూ.6.56 కోట్ల రాయితీ అందించిందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకుగాను మహిళాశక్తి పథకంలో భాగంగా 10 మండల మహిళా సమాఖ్యలకు 10 ఆర్టీసీ బస్సులను మంజూరు చేశామని.. వీటి ద్వారా ప్రతి సమాఖ్యకు నెలకు సుమారు రూ.69 వేల ఆదాయం వస్తుందని చెప్పారు.

    కొత్త రేషన్‌ కార్డుల జారీ..

    జిల్లాలో ఇప్పటి వరకు 17,490 కొత్త రేషన్‌ కార్డులను జారీ చేయగా.. 45,576 మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. అలాగే ప్రస్తుత కార్డుల్లో కొత్తగా 29,858 మందిని చేర్చినట్లు వివరించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని.. జిల్లాలో 2024, ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు 15,540 మంది రూ.39.77 కోట్ల విలువైన వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్లలోపు విద్యుత్‌ అందిస్తున్నామని.. జిల్లాలో ఇప్పటి వరకు 82,708 కుటుంబాలకు సంబంధించి రూ.30.48 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. అదేవిధంగా కొత్తగా 33 కేవీ సామర్థ్యం గల 29 ఉప కేంద్రాలు రూ.45.43 కోట్లతో నిర్మిస్తున్నామని.. పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

    ఇందిరమ్మ ఇళ్ల పథకం..

    పేదల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని.. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,173 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయగా.. 3,731 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తంగా రూ.26.73 కోట్లను వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

    రైతుభరోసా..

    రైతును రాజు చేసేందుకు రైతుభరోసా, పంట రుణమాఫీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్‌లో 1,75,869 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.205 కోట్ల 93 లక్షల 79 వేలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా పథకంలో భాగంగా 2024–25 సంవత్సరానికిగాను 681 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.34.05 కోట్లు చెల్లించినట్లు వివరించారు. పంట రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 4 విడతల్లో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల రుణాన్ని మాఫీ చేసినట్లు చెప్పారు.

    జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న

    శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌, ఎమ్మెల్యే తూడి

    మేఘారెడ్డి తదితరులు

    జిల్లా ప్రగతి నివేదిక

    చదువుతున్న శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

    భూ సమస్యల పరిష్కారానికే

    భూ భారతి

    ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్సీ, చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

    రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందని.. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 1,943 దరఖాస్తులు రాగా.. 1,207 పరిష్కరించామని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనను అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని.. వనపర్తి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణానికి మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు.

    శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానించి నేరాలను నియంత్రిస్తున్నట్లు చెప్పారు. సఖి, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తున్నామని.. సైబర్‌ క్రైమ్‌ విభాగం ఏర్పాటు చేసి జిల్లాలో సైబర్‌ నేరాలను అరికడుతున్నట్లు వివరించారు. డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ప్రత్యేక పోలీస్‌ బృందం నిఘా ఉంటుందని.. మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నందుకు జిల్లా పోలీస్‌శాఖను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

  • సమన్వ

    వనపర్తి: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కొత్తకోట, మదనాపురం మండలాలకు సంబంధించిన సమస్యలపై కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తకోట మండలానికి చెందిన పలువురు విద్యుత్‌ అంతరాయం, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సరఫరా, మున్సిపల్‌ కాంప్లెక్స్‌ భవనం ఏర్పాటు, సంతకు స్థలం కేటాయింపు తదితర సమస్యలను వారికి వివరించారు. వెంకటగిరి ఆలయానికి వెళ్లేందుకు రహదారి నిర్మించాలన్నారు. మదనాపురంలో బస్టాండ్‌, జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు చొరవ చూపాలని మండలవాసులు కోరారు. కొన్ని గ్రామాల్లో డ్రైనేజీలు, తాగునీటి సమస్య వేధిస్తోందని.. పరిష్కరించాలని సూచించారు. దుప్పల్లిలో పశు వైద్యశాల, గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ.. వెంకటగిరి ఆలయానికి రహదారి, వారాంతపు సంత నిర్వహణకు స్థలం కేటాయింపునకుగాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. విద్యుత్‌ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కలెక్టర్‌ను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ అందుకొని పనులు ప్రారంభించని లబ్ధిదారులతో త్వరగా మొదలు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. చిన్న చిన్న కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని.. పరిష్కరించాలని కోరారు. కొత్తకోటలో ఆడిటోరియం అప్రోచ్‌ రోడ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సమస్యలు తలెత్తకుండా చొరవ తీసుకుంటున్నందుకు కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కానాయిపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ అత్యధికంగా 72 శాతానికిపైగా కొత్తకోట మండలంలో జరిగిందని ఇది మంచి పరిణామమన్నారు. కొత్తకోటలో ఆడిటోరియం అప్రోచ్‌ రోడ్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈని ఆదేశించారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ఆ శాఖ ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా మదనాపురం మండల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ యాదయ్య, కొత్తకోట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్‌, కతలప్ప, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

    దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

  • వనపర్తి: విశ్వకర్మలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే గుర్తింపు లభిస్తుందని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. బుధవారం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనను ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆహ్వానించి పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ మనుగడలో విశ్వకర్మల చేతివృత్తులు ప్రధాన భూమిక పోషించాయని, యాంత్రిక ప్రపంచీకరణ నేపథ్యంలో కులవృత్తులకు ప్రాధాన్యం తగ్గి జీవనోపాధికి ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. 

    సమస్యలను అధిగమించాలంటే తమ పిల్లలు గొప్పగా చదువుకునేందుకు ప్రోత్సహించాలని, అంతేగాక తాము సంపాదించిన సొమ్మును భూమి కొనుగోలుకు వెచ్చించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంస్కారవంతమైన జీవనాన్ని సాగించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ, స్వర్ణకార సంఘం, బులియన్‌ మర్చంట్‌ ప్రతినిధులు ఎస్పీని సన్మానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన కళాకారులు, దేవాలయ, విశ్వబ్రాహ్మణ అభివృద్ధికి కృషిచేసిన వారిని ఎస్పీ శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో డా. పోతేదారు యాదాచారి, దర్శనోజు సత్యనారాయణ, వేణు, మాజీ కౌన్సిలర్‌ బ్రహ్మం, బైరోజు చంద్రశేఖర్‌, డా. శ్యాంసుందర్‌, కొండోజు గోపినాథ్‌, నారాయణదాసు గోవర్ధనాచారి, చెన్నయ్యచారి, వీరాచారి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

    నిండుకుండలా రామన్‌పాడు జలాశయం

    మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్‌ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు.

    ప్రైవేట్‌కు ధీటుగా ఉత్తీర్ణత సాధించాలి

    ఆత్మకూర్‌: ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు బాగా చదివి ప్రైవేట్‌కు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని, దేశం గర్వించేస్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, గురువులు, తమ ఊరికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి ఎర్ర అంజయ్య ఆకాంక్షించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్‌డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ సైదులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరగా డీఐఈఓను కళాశాల అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భాగ్యవర్ధన్‌రెడ్డి, టీజే విశ్వేశ్వర్‌, జమ్మన్న, రాఘవేందర్‌రావు, శ్వేత, వీణ, లలితమ్మ, ఏకే కురుమూర్తి, చైతన్యరాణి, పావని, సునీల్‌రెడ్డి, రాఘవేంద్ర, రామన్‌గౌడ్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

    రాష్ట్రస్థాయి టీఎల్‌ఎం మేళాకు ముగ్గురు ఎంపిక

    పాన్‌గల్‌: జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళాలో మండల విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికై నట్లు ఎంఈఓ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో గోప్లాపూర్‌ యూపీఎస్‌ విద్యార్థి కార్తీక్‌ ప్రథమ బహుమతి, ఇంగ్లీష్‌ విభాగంలో బుసిరెడ్డిపల్లి పీఎస్‌ విద్యార్థి శిరీష ద్వితీయ బహుమతి, గణిత విభాగంలో వెంగళాయిపల్లి పీఎస్‌ విద్యార్థి రాణి ద్వితీయ బహుమతి సాధించినట్లు పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు, ఉపాధ్యాయులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి టీఎల్‌ఎం మేళాలో పాల్గొంటారని చెప్పారు.

  • ఆరోగ్య మహిళ.. ప్రభుత్వ ధ్యేయం

    ‘స్వస్త్‌ నారి.. సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ ప్రారంభం

    సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు

    ఖిల్లాఘనపురం: దేశంలోని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి కుటుంబం బాగుంటుందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం మండల కేంద్రంలోని సీఎస్‌సీ ఆవరణలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. అక్కడికి వచ్చిన మహిళలు, బాలికలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే శక్తి మహిళకే ఉంటుందని, అలాంటి మహిళ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోదీ ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. అక్టోబర్‌ 2 వరకు పుట్టిన బిడ్డ నుంచి అన్ని వయసుల మహిళలకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేక వైద్య నిపుణులు వచ్చి మహిళలకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని.. అన్ని విద్యాలయాలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

    జిల్లాకేంద్రంలో సీటీ స్కాన్‌ సెంటర్‌..

    ఎంపీ మల్లు రవి చొరవతో యూనియన్‌ బ్యాంక్‌ సహకారంతో జిల్లాకేంద్రంలో రూ.2.50 కోట్లతో సీటీ స్కాన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. వైద్య శిబిరంలో 12 రోజుల పాటు క్యాన్సర్‌, చెవి, ముక్కు, గొంతు, దంత, క్షయ, మధుమేహం తదితర వ్యాధులకు వైద్య సేవలు అందిస్తారని.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    ● ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకుగాను మండలంలోని సోళీపురంలో 6 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని.. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, మండల వైద్యులు డా. చైతన్య, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, మండల సింగిల్‌విండో చైర్మన్‌ మురళీధర్‌రెడ్డి, డైరెక్టర్‌ సాయిచరణ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

    పోషణ మాసం ప్రారంభం

    మండల కేంద్రంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసం చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. త్వరలోనే మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.

  • నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

    పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్‌ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది.

    ఆస్పత్రుల వద్ద బ్యానర్లు

    ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్‌ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ ఉన్నట్లు నోటీస్‌ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్‌ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్‌ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.

    ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేసిన సర్జరీలు, ఎస్టిమేషన్‌ వివరాలు

    జిల్లా చేసిన బకాయిలు

    సర్జరీలు (రూ.లలో..)

    గద్వాల 527 1,02,78,990

    మహబూబ్‌నగర్‌ 19,032 46,95,71,170

    నాగర్‌కర్నూల్‌ 133 34,03,362

    నారాయణపేట 275 1,02,52,882

    వనపర్తి 603 1,94,18,046

    బకాయిలు రూ.కోట్లకు చేరడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల విముఖత

    వైద్యసేవల నిలిపివేతతో

    పేదలకు ఆర్థిక ఇబ్బందులే..

    మొదటిరోజు ఆస్పత్రులకు వచ్చి తిరిగి వెళ్లిన రోగులు?

  • ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌  సస్పెన్షన్‌

    వనపర్తి: జిల్లా ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ జి.విజయ్‌కుమార్‌ ఓ ఆధార్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతికిగాను రూ.50 వేల లంచం డిమాండ్‌ చేశారని ఆధారాలు లభించడంతో ఈడీఎస్‌ కమిషనర్‌ రవికిరణ్‌ ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఈడీఎస్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. కొత్తవారిని నియమించే వరకు మహబూబ్‌నగర్‌ ఈడీఎం చంద్రశేఖర్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. మీ–సేవా కేంద్రాలు, ఆధార్‌ సెంటర్ల నిర్వాహకుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై పలుమార్లు రాష్ట్రస్థాయి అఽధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మహబూబ్‌నగర్‌ ఈడీఎం వద్ద ప్రస్తావించగా.. విషయం నిజమే నని గురువారం జిల్లాలో జాయినింగ్‌ రిపోర్టు ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌ ఏఓ భానుప్రకాష్‌ను వివరణ కోరగా.. సమాచారం వచ్చిందని, ఇప్పటి వరకు లేఖ రాలేదన్నారు. ఈడీఎంను తొలగిస్తున్నట్లు వచ్చిన ఉత్తర్వుల ప్రతి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

    పర్యావరణ పరిరక్షణపై

    అవగాహన కల్పించాలి

    వనపర్తిటౌన్‌: పర్యావరణ పరిరక్షణపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘనీ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ కో–ఆర్డినేటర్‌ సుదర్శన్‌ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నందుకుగాను ఆయనను అభినందించి మాట్లాడారు. విద్యతో పాటు సామాజిక, పర్యావరణ అంశాలను జోడించి అవగాహన పెంచాలన్నారు. ఈ నెల 15న రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం గ్రీన్‌ కో–ఆర్డినేటర్లు పర్యావరణ పరిరక్షణలో ఎలా ముందుండాలో సూచించారని, అందుకు అనుగుణంగా పని చేయాలని కోరారు.

    మహబూబ్‌నగర్‌ అధికారికి

    ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

Sports

  • ఆసియాక‌ప్‌-2025లో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధ‌వారం జ‌రిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో యూఏఈను 41 ప‌రుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూప‌ర్ 4కు ఆర్హ‌త సాధించిన జ‌ట్టుగా పాకిస్తాన్ నిలిచింది.

    ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 21(ఆదివారం) దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సూప‌ర్‌-4 మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్‌ను చిత్తు చేయాల‌ని భార‌త జ‌ట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గ‌త ఆదివారం(సెప్టెంబ‌ర్ 14) జ‌రిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

    128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫ‌లితం కంటే హ్యాండ్ షేక్ వివాద‌మే ఎక్కువ‌గా హైలెట్ అయింది. ఈ మ్యాచ్‌లో పెహల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా భార‌త ఆట‌గాళ్లు పాక్ ప్లేయ‌ర్ల‌తో క‌రాచాల‌నాన్ని తిర‌ష్క‌రించారు.

    దీంతో ఘోర అవ‌మానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భార‌త్ ఆట‌గాళ్ల‌తో పాటు మ్యాచ్ రిఫ‌రీ అండీ పైక్రాప్ట్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్‌లో ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాళ్ల‌తో హ్యాండ్ షేక్ చేయడం త‌ప్ప‌నిసారి అని లేకపోవ‌డంతో ఐసీసీ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇప్పుడు సూప‌ర్‌-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భార‌త్ కొన‌సాగించ‌నుంది.
    చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్‌.. ఈసారి పసికూన బలి

Yadadri

  • అదే క

    ‘పోషణ్‌ భీ –పడాయి భీ’పై అవగాహన

    రామన్నపేట: పోషణ్‌ భీ – పడాయి భీ కార్యక్రమంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు రామన్నపేటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు హాజరై మాట్లాడారు. చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయడంతో పాటు వారి చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా నవచేతన చిన్నారులు, డిజేబుల్‌ చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం టీచర్లకు, ఆయాలకు యూనిఫామ్‌ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ వెంకటరమణ, ఏసీడీపీఓ సమీరా సూపర్‌వైజర్లు బాలమణి, ధనమ్మ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

    ఘనంగా విశ్వకర్మ జయంతి

    భువనగిరిటౌన్‌ : విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సాతీతి, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    డ్రోన్‌ పరికరాల పరిశీలన

    గుండాల: మండల కేంద్రంలోని ఎంజేఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో తయారు చేస్తున్న డ్రోన్‌ పరికరాలను డీసీపీ అక్షాంశ్‌యాదవ్‌ బుధవారం పరిశీలించారు. ప్రభుత్వ అనుమతి మేరకే పరికరాలను తయారు చేస్తున్నారా, లేదా అని ఆరా తీశారు. ఆయన వెంట ఏసీపీలు శ్రీనివాస్‌నాయుడు, రాహుల్‌రెడ్డి, సీఐ శంకర్‌గౌడ్‌, ఎస్‌ఐ తేజమ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

    ప్రతి విద్యార్థి పుట్టిన రోజు మొక్క నాటాలి

    భువనగిరి: ప్రతి విద్యార్థి తన పుట్టిన రోజు తప్పనిసరిగా మొక్క నాటాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. బుధవారం భువనగిరి మండలం అనాజిపురంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ధరణి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మొక్కలను నాటడంతోనే సాధ్యమవుతుందన్నారు. అదే విధంగా ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి తమ తల్లి పేరున మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగవర్థన్‌రెడ్డి, ధరణి ఫౌండేషన్‌ చైర్మన్‌ లింగారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • యాదగిరి క్షేత్రంలో ఏకాదశి పూజలు

    యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పుష్పాలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రనామ పఠనాలు, వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. స్వామివారి మేల్కొలుపులో భాగంగా వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భగుడిలో స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠామూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో శాస్త్రోక్తంగా అర్చించారు.

  • నిజమై

    చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేని సీసీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జంహంగీర్‌ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా చేపట్టిన బస్సు యాత్ర బుధవారం చౌటుప్పల్‌ మీదుగా సంస్థాన్‌నారాయణపురం మండలం గుడిమల్కాపురం చేరుకుంది. సాయుధ పోరాట యోధుడు మన్నె బక్కారెడ్డి స్తూపానికి నివాళులర్పించి వారోత్సవాలు ముగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తికోసం కమ్యూనిస్టులు వీరోచితమైన పోరాటం చేశారని పేర్కొన్నారు. సంబంధం లేని వ్యక్తులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు చౌటుప్పల్‌లో మాజీ ఎంపీ ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళుర్పించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, వెంకటేష్‌, బూరుగు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్‌, ఎండీ పాష, బండారు నర్సింహ, పల్లె మధుకృష్ణ, దశరథ, బొడ్డు అంజి రెడ్డి, కొండె శ్రీశైలం, జి.శ్రీనివాసచారి, దోడ యాదగిరిరెడ్డి, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, దొంతగోని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి, లలిత, కృష్ణయ్య, వెంకటేశ్‌, సైదులు తదితరలు పాల్గొన్నారు.

    ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

  • పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం ‘రావి’

    భువనగిరి: రాజకీయ చైతన్యానికి, పో రాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణరెడ్డి అని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో మార్పులు రావాలని అవసరం ఉందన్నారు. భువన గిరి మండలం బొల్లేపల్లిలో రావి నారా యణరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావి నారాయణరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. అప్పటి నాయకులు సేవాదృక్పథంతో పని చేసేవారని, ప్రస్తుత రాజకీయాల్లో దోరణి మారిందన్నారు. తొలి లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీ సాధించిన నాయకుడిగా రావి నారా యణరెడ్డి ఉండటం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం అన్నారు.గాంధీజీతో కలిసి స్వాతంత్య్రం కోసం పనిచేశారని, ఆ తరువాత 1941లో ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాఽయుధ పోరు సాగించారని పేర్కొన్నారు. నల్లగొండ గడ్డ ఎంతో మంది మహానుభావులు పుట్టిన గడ్డ అని, అలాటి వారిలో రావినారాయణరెడ్డి ఒక్కరు అన్నారు. గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని, తన వంతుగా రూ.15 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రావి నారాయణరెడ్డి తన సొంత భూమి 500 ఎకరాలకు పేదలకు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరారు. భువనగిరితో పాటు హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ పై రావి నారాయణరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్‌ హనుమంతరావు, భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేఖబాబురావు, రావి నారాయణరెడ్డి సేవా సంస్థ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సామ మధుసూదన్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

    ఫ ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి

  • మహిళలకు మెరుగైన వైద్యసేవలు

    భువనగిరి: మహిళల ఆరోగ్య పరిరక్షణ, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వస్థ్‌నారి–సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం భువనగిరిలోని జనరల్‌ ఆస్పత్రిలో మహిళల మెడికల్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అక్టోబర్‌ 2వ తేదీ వరకు ప్రతి ఆరోగ్య కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ.. మెడికల్‌ క్యాంపులలో ఎనిమది రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు ఇస్తారని, ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్వస్థ్‌ నారి–సశక్త్‌ పరివార్‌ ఆభియాన్‌ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమేష్‌రెడ్డి, ఆస్పత్రి సూపరిండెంటెండ్‌ పాండునాయక్‌, వైస్‌ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌రావు, డీసీహెచ్‌ఎస్‌ చిన్ననాయక్‌, డిప్యూటీ సూపరిండెంటెండ్‌ సద్గుణాచారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవెజ్‌ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.

    ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

  • రోడ్డు ప్రమాదాలను తగ్గించాల్సిందే

    సాక్షి,యాదాద్రి : రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రాణాలను కాపడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశించారు. రోడ్డు భద్రతపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే అన్ని శాఖల మధ్య సమన్వయంతో తప్పనిసరి అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని,బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి సూచిక బోర్డులు, రుంబుల్‌ స్ట్రిప్స్‌, స్టడ్స్‌, బ్లింకర్స్‌ ఏర్పాటు చేయాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని స్పష్టం చేశారు. వాహనాల వేగ పరిమితిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ధర్మోజిగూడెం క్రాస్‌ రోడ్డు, కొయ్యలగూడెం బస్టాప్‌, వలిగొండ ఎక్స్‌ రోడ్డు, అనంతారం బ్రిడ్జి, మోత్కూర్‌–పాటిమట్ల ఎక్స్‌రోడ్డు వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతుంటాయని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఈ రవీందర్‌, రోడ్లు భవనాల అధికారి సరిత తదితరులు పాల్గొన్నారు.

    ఫ కలెక్టర్‌ హనుమంతరావు

  • పటేల్‌తోనే  తెలంగాణకు విముక్తి

    భువనగిరి: జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. సర్దార్‌ వల్లభబాయ్‌ పటేల్‌తోనే తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించందన్నారు. తెలంగాణ విమోచన కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్‌ గుప్తా, కాటూరి అచ్చయ్య, కొప్పుల యాది రెడ్డి, ఉపాధ్యక్షులు గూడూరు నరోత్తంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, వైజయంతి, కోటేష్‌, సీనియర్‌ నాయకులు మాయ దశరథ, రత్నపురం బలరాం, డీఎల్‌ఎన్‌గౌడ్‌, నరసింహరావు, రామకృష్ణ, ఊదరి లక్ష్మి, మల్లిక, కృష్ణాచారి, మహమూద్‌, సతీష్‌, రాజు, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Eluru

  • జగన్‌


    ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏలూరులో మెడికల్‌ కాలేజీ నిర్మించారు. మాజీ సీఎం జగన్‌ జిల్లా ప్రజల కలను నిజం చేస్తూ.. ప్రతి పేదవాడికి అత్యుత్తమ స్థాయి వైద్యచికిత్సలు, సేవలు అందాలనే సంకల్పంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని తేవడమే కాదు, యుద్ధప్రాతిపదికన భవనాల నిర్మాణం చేపట్టారు. 2023 సెప్టెంబర్‌ 15న మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. 

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభించిన భవనాల వద్ద ఇప్పుడు కూటమి నేతలు ఫొటోలు దిగుతూ ... తమ హయాంలోనే జరిగిందనే రీతిలో ప్రచారం చేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించి 50 శాతం పనులు పూర్తి చేయగా.. కూటమి 15 నెలల పాలనలో మిగిలిన 50శాతం పనులు నేటికీ పూర్తి చేయలేదు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్ర చేస్తోంది. దీనిని నిరసిస్తూ ఈ నెల 19న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు.

    ఏడాదిలోపే భవన నిర్మాణం

    2019 అక్టోబర్‌ 4న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జీజీహెచ్‌కు శంకుస్థాపన చేశారు. అప్పటికే అక్కడ భారీ భవనాలు ఉండడంతో ముందుగా వాటిని తొలగించారు. ఈలోగా కరోనా వైరస్‌ విలయంతో రెండేళ్ల పాటు కరోనాతో పనులన్నీ నిలిచిపోయాయి. అనంతరం 2022 అక్టోబర్‌లో పాత బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలో డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద రూ.60 కోట్లతో శరవేగంగా కేవలం ఏడాదిలోపే భవన నిర్మాణం పూర్తి చేశారు. 2023 సెప్టెంబర్‌ 15న ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించారు.

    కూటమి రాకతో పనుల్లో జాప్యం : కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. కాంట్రాక్టర్‌ను తొలగిస్తారని, నిధులు విడుదల చేస్తారో లేదో అన్న సందేహాలతో పనులు నత్తనడకన సాగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా... నేటికీ శాశ్వత భవనం, హాస్టల్స్‌ భవనాలను పూర్తి చేయలేదు.

    తామే కట్టామంటూ కూటమి నేతల ప్రగల్భాలు

    ఏలూరు జీజీహెచ్‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ భవనం వద్ద కూటమి నేతలు ఫొటోలు దిగటాన్ని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఏలూరులో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నం చేయని సీఎం చంద్రబాబు.. మాజీ సీఎం జగన్‌ పనులు ప్రారంభించిన భవనాల వద్ద తమ హయాంలోనే అంటూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం మూడో ఏడాది ప్రారంభం నాటికై నా పనులు పూర్తి చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

    ఈ నెల 19న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

    ఏలూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు... కాలేజీ శాశ్వత భవనాలు, పరిపాలన భవనం, విద్యార్థులకు హాస్టల్స్‌ భవనాలు, అధునాతన బోధనాసుపత్రి(జీజీహెచ్‌), టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, నర్సింగ్‌ స్టాఫ్‌కు నివాసాలకు క్వార్టర్లు, అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబ్‌లు, ఇలా పూర్తిస్థాయి మెడికల్‌ కళాశాల తీర్చిదిద్దేందుకు రూ.525 కోట్లు నిధులను మంజూరు చేయించారు. ఏలూరు జీజీహెచ్‌లో శాశ్వత మెడికల్‌ కాలేజీ భవనం, వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనాల నిర్మాణ పనులను 2023 జనవరిలో ప్రారంభించారు. ఈ భవనాలను యుద్ధప్రాతిపదికన 2024 సెప్టెంబర్‌ కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 జూన్‌ 4 నాటి వరకూ పనులు శరవేగంగా సాగాయి.

  • ఇళ్ల నిర్మాణాలకు రగహణం

    ఏలూరు (మెట్రో): అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటను మూలకు నెట్టేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇస్తామని ప్రకటించిన కూటమి పెద్దలు గద్దెనెక్కిన తరువాత వాటిని మర్చిపోగా పేద ప్రజలు మాత్రం పెద్దల మాటలు ఎప్పుడు నెరవేరతాయా? అని ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కోటలు దాటాయి. వాటిని అమలు చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన పాపాన పోవడం లేదు. పేదల ఇళ్ల స్థలాలు, దీనిలోనూ పేదలు గృహనిర్మాణాలు చేసుకునేందుకు రూ.4 లక్షలు ఇస్తామని చెప్పిన మాటలు మాత్రం నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ఇల్లు మంజూరు మాట అటుంచితే గతంలో నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కూడా కూటమి సర్కారు ముందడుగు వేయడం లేదు.

    గతమెంతో ఘనం

    పేదవాడు అద్దె ఇంట్లో ఉండకూడదనే ఉద్ధేశంతో ప్రతి ఒక్క పేదవాడు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా లేఅవుట్లలో 1,02,240 ఇళ్లను మంజూరు చేయించింది. మంజూరు చేయడమే కాకుండా వాటికి మొదటి ప్రాధాన్యత కల్పించి నిర్మాణాలు చేపట్టి 2024 జూన్‌ నాటికి 44,618 నిర్మాణాలు పూర్తి చేయించింది. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రూ.1.80 లక్షల చొప్పున చెల్లించి ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా రూ.917.92 కోట్ల గృహనిర్మాణాలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.

    పాత వాటి పట్టింపు లేదు

    జిల్లా వ్యాప్తంగా మంజూరైన గృహాలలో ఇంకా ప్రారంభమే కాని గృహాలు 18,758 ఉండగా, పునాదుల స్థాయిలోనే 21,436 గృహాలు నిలిచిపోయాయి. పునాదులు పైకి 9,946 గృహాలు, గోడలు పూర్తి చేసుకుని 4,241, శ్లాబ్‌ స్థాయికి 2,742, శ్లాబ్‌ పూర్తి చేసుకుని 498 గృహాలు ఉన్నాయి. ఇలా వివిధ దశల్లో నిలిచిపోయిన గృహాలను సైతం కూటమి సర్కారు గత సర్కారుపై ఉన్న కక్షతో పట్టించుకోవడమే మానేసింది.

    కొత్త వాటి ఊసు లేదు

    జిల్లా వ్యాప్తంగా ఇళ్ల మంజూరు కోసం గృహ నిర్మాణ శాఖకు దరఖాస్తులు క్యూలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 26,318 మంది నూతన గృహాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మాత్రం తమ తప్పు లేకుండా వారి పని పూర్తి చేసి వచ్చిన దరఖాస్తులపై నివేదికలు సైతం సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి మాత్రం మంజూరుకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ నివేదికలు మాత్రం నివేదికలుగానే మిగిలిపోతున్నాయి.

    ప్రస్తుతం గృహనిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించని సర్కారు గృహాలపై పైసా కూడా విదిల్చే పరిస్థితులు కనుచూపు మేరలో కానరావడం లేదు. కొత్తగా పేదల నుంచి అందిన దరఖాస్తులకు కేంద్రమే ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. పేదల ఇళ్ల నిర్మాణాలను పీఎంఎవై పథకం ద్వారా చేపట్టి చేతులు దులుపుకునే పనిలో కూటమి సర్కారు నిమగ్నమైంది.

    కొత్త వాటి ఊసు లేదు.. పాతవాటికి మోక్షం కలగదు

    అటకెక్కిన చంద్రబాబు రూ.4 లక్షల హామీ

    గతంలో 1.02 లక్షల ఇళ్లు మంజూరు చేసిన వైఎస్సార్‌సీపీ సర్కారు

    జగన్‌ హయాంలో రూ.917 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం

    గత 15 నెలల్లో పైసా విదల్చని కూటమి సర్కారు

  • రక్తపు మడుగులో బాలుడు

    ఏలూరు టౌన్‌: ఏలూరు శివారు కలపర్రు జాతీయ రహదారికి వెళ్ళే ప్రధాన రహదారిపై పొలాల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని గుర్తించిన సమీపంలోని రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ బాలుడిని అంబులెన్స్‌లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. బిఆలుడి తల, చెవుల పక్కన తీవ్ర గాయాలున్నాయి. కత్తితో, పదునైన చాకుతో పొడిచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏకంగా పదికి పైగా కత్తిపోట్లు ఉన్నాయని చెబుతున్నారు. బాలుడి వయసు 14 నుంచి 15 ఏళ్లు ఉంటుందని, ఖాకీ రంగు నిక్కరు, ఎరుపు టీషర్ట్‌ వేసుకుని ఉన్నాడనీ, వివరాలు తెలిస్తే.. 9440796637 నెంబరులో సంప్రదించాలని కోరారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, పెదవేగి సీఐ రాజశేఖర్‌, పెదపాడు ఎస్‌ఐ సంఘటనా స్థలంలో పరిస్థితులను పరిశీలించారు. ఎవరైనా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి కత్తితో పొడిచి పారిపోయారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

  • రోడ్డెక్కిన దస్తావేజు లేఖర్లు

    పెదవేగి: తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కనున్నట్టు దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఆయన నేతృత్వంలో జిల్లా స్థాయి లేఖర్లు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని, వీలునామాలు రాయించుకున్న వారి ఇళ్లకు వెళ్లి నేరుగా అక్కడే రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా అనుమతి కల్పించాలని, ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఇచ్చే గ్రాంట్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దస్తావేజు రాసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్‌ కోసం 72 గంటలు సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. పెన్‌ డౌన్‌ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖర్లంతా శుక్ర, శని వారాల్లో నిర్వహించే పెన్‌డౌన్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్‌ ఉద్యోగుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండో విడత బుధవారం రామచంద్రరావుపేట విద్యుత్‌ భవన్‌లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న జీపీఎఫ్‌తో కూడిన పెన్షన్‌ నిబంధనలను 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 వరకు నియమించిన ఉద్యోగులందరికీ వర్తింపజేయాలన్నారు. భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లేబర్‌, అవుట్‌ సోర్స్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. డిస్కమ్‌ నాయకులు తురగా రామకృష్ణ, భూక్యా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎం.రమేష్‌, వీ.రాము, అబ్బాస్‌ పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.

  • విశ్వకర్మ యోజనతో సాధికారత

    ఏలూరు(మెట్రో): విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌ గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంప్రదాయ కళా నైపుణ్యాలు కలిగిన వారికి ప్రయోజనం కలిగించేలా విశ్వకర్మ యోజన ద్వారా ప్రభుత్వం సాధికారిత కల్పించేందుకు కృషిచేస్తుందన్నారు. విశ్వబ్రాహ్మణ నాయకులు తెలియజేసిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, సూచనలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ విజయరాజు పాల్గొన్నారు.

Krishna

  • సాక్షి దినపత్రిక నిజాలను నిర్భయంగా రాస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌ లెస్‌గా నిలిచింది. పాలకుల అవినీతిని ఎత్తిచూపుతోంది. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఆ పత్రిక జర్నలిస్టులను అక్రమ కేసులతో వేధిస్తోంది. ఎడిటర్‌ ధనంజయరెడ్డిపైనా కేసులు నమోదు చేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఇది సరైన విధానం కాదు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.

    – అవుతు శ్రీశైలజారెడ్డి, డెప్యూటీ మేయర్‌, విజయవాడ

    కూటమి ప్రభుత్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే ప్రశ్నిస్తున్న వారిపై కేసులకు తెగబడు తోంది. ప్రజలకు అలవికాని హామీలిచ్చి వాటిని విస్మరించిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పత్రికలపై, వాటి సంపాదకులపై కేసులు పెట్టడం దుర్మార్గం. ప్రజల ముందు సాక్ష్యాలు ఉన్నప్పటికీ బుకాయించటం, ప్రశ్నించిన వారిపై కూటమి పాలకులు ఎదురు కేసులు పెట్టడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. సాక్షి పత్రికపైనా, దాని సంపాదకుడు, జర్నలిస్టులపై పెట్టిన దుర్మార్గపు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

    – షేక్‌ ఆసిఫ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ సీపీ

  • అదే ద
    ఇబ్రహీంపట్నంలో బూడిద దోపిడీపై వైఎస్సార్‌ సీపీ పోరుబాట భగ్నం

    ఇబ్రహీంపట్నం: బూడిద డంపింగ్‌లు, అక్రమ రవాణా, కాలుష్య నివారణపై వైఎస్సార్‌ సీపీ చేపట్టిన పోరుబాటను పోలీసులు భగ్నం చేశారు. మూలపాడు, జూపూడిలో టీడీపీ నేతలు అక్రమంగా డంపింగ్‌ చేసిన బూడిద నిల్వలు పరిశీలించి, లారీ ఓనర్లకు అప్పగించేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలసి బుధవారం ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తమను వెళ్లనీయాలని జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ గరికపాటి శ్రీదేవి భర్త గరికపాటి రాంబాబు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని పోలీసులు జోగి రమేష్‌తో పాటు పలువురు నాయకులను అరెస్ట్‌ చేసి వాహనంలో భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు జోగి రమేష్‌కు అండగా నిలిచి ప్లకార్డులు పట్టుకుని.. ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. ఏసీపీ దుర్గారావు నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 60మంది పోలీసు సిబ్బంది ర్యాలీని అడ్డుకోవడం గమనార్హం.

    సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించాలి..

    అరెస్ట్‌కు ముందు జోగి రమేష్‌ మాట్లాడుతూ బూడిద కాలుష్యం, అక్రమ బూడిద రవాణాపై వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు బూడిద లోడింగ్‌ అప్పగించి లోకల్‌ లారీ ఓనర్ల పొట్టకొట్టిందన్నారు. సుమారు 500 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. కాలుష్యంతో నిండిపోయిన ఈ ప్రాంతంలో ఏపీ జెన్‌కో సంస్థ సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించి పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కాలుష్య నివారణకు మొక్కలు పెంచి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేస్తోందని స్పష్టం చేశారు.

    అరెస్ట్‌ అయ్యింది వీరే..

    జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు, మేడపాటి నాగిరెడ్డి, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, గుంజా శ్రీనివాస్‌, మిక్కిలి శరభయ్య, మండల, పట్టణ అధ్యక్షులు రెంటపల్లి నాగరాజు, పోరంకి శ్రీనివాసరాజు, విజయవాడ రూరల్‌ మండల అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్‌ను అరెస్ట్‌ చేసి భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

  • బందరు టీడీపీలో ముసలం

    సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 40 ఎకరాలకు సంబంధించిన తాజా పరిణామాలపై మచిలీపట్నం టీడీపీ ముఖ్య నేతల మధ్య ముసలం ముసురుకుంది. మచిలీపట్నం ముఖ్య నాయకులు విజయవాడకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారులతో కుమ్మక్కై దేవస్థానం భూముల విషయంలో సహకరించారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆ పార్టీ అధిష్టానం దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లి దేవస్థానం భూములను కాపాడుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవడాన్ని బట్టి నాయకుల తీరు తేటతెల్లమవుతోందని పార్టీలు, వర్గాలకు అతీతంగా బందరు వాసులు అభిప్రాయపడుతున్నారు.

    దీర్ఘకాలిక ఎత్తుగడతో..

    దసరా ఉత్సవాల సమయంలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు వినోద, ఆహ్లాద కార్యక్రమాల కోసం ‘విజయవాడ ఉత్సవ్‌’ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. దీని వెనుక దీర్ఘకాలిక ఎత్తుగడ ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గొడుగుపేట ఆలయానికి చెందిన 35 ఎకరాల్లో విజయవాడ ఉత్సవ్‌ పేరిట శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్‌, అయిదు ఎకరాల్లో గోల్ఫ్‌కోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నట్లు బందరు వాసుల దృష్టికి పదిరోజుల కిందటే వెళ్లింది. విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత, విజయవాడకు చెందిన రాష్టస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌, బందరు రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్‌ యజమాని, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవ్‌ పేరిట ఆలయ భూములను శాశ్వత ప్రాతిపదికన పొందేలా గూడు పుఠాణి చేస్తున్నారని అక్కడి ప్రజలు అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని ముందుగానే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది కూడా.

    అఖిలపక్షం సమావేశంలో చర్చించి..

    ఆలయ భూముల విషయంలో ఏదో తేడా జరుగుతోందని భావించిన బందరులోని ధార్మిక సంస్థలు, వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీలతో పాటు పలు సంఘాలు సమావేశమయ్యాయి. తమకు గాని, తమ పార్టీ నాయకులకు గాని ఏమీ తెలియదని టీడీపీ వారు తెల్లముఖం వేశారు. సమావేశం నుంచే జనసేన నాయకుడు ఎం.రాము మంత్రి కొల్లు రవీంద్రకు ఫోన్‌ చేసి ఆలయ భూములకు సంబంధించి ఏం జరుగుతోందని ప్రశ్నించగా.. తాను స్థానికంగా అందు బాటులో లేనని, గొడుగుపేట ఆలయ భూముల విషయం తన దృష్టికి రాలేదని, ఈ విషయంపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడతానని నమ్మబలికారు. ఆ సమావేశంలో పాల్గొన్న వైఎస్సాఆర్‌ సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆలయానికి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనేది వివరించారు. దేవస్థానానికి విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ సరైన ఆలనాపాలనా లేదని, వర్షం వస్తే స్వామి విగ్రహంపై చినుకులు పడుతుండటాన్ని గమనించి రూ.2 కోట్లతో త్రిదండి చినజీయర్‌ స్వామి ద్వారా ఆలయ పునర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించి పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

    మరుసటి రోజే కొల్లు మాట మారింది..

    సమావేశం మరుసటి రోజు ఉదయాన్నే ఆలయం వద్దకు వచ్చి ఎవరికీ, ఏ సొసైటీకి, ఏ అవసరాలకు భూములు ఇవ్వడంలేదని, కలెక్టర్‌కు చెప్పి ఆపించేస్తామని చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర మాట 24 గంటల్లోగా మారిందని సమావేశంలో పాల్గొన్న వారు గుర్తుచేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, కొమ్మారెడ్డి పట్టాభి తదితరులను వెంటబెట్టుకుని మంత్రి రవీంద్ర రూ.45లక్షల చెక్కును దేవస్థానం వారికి అందజేశారని సుజయ్‌ కుమార్‌, రాజశేఖర్‌, అయోధ్యరామయ్య తదితరులు వివరించారు. తాము పరిస్థితులను అంచనా వేసుకున్నందునే న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు.

    విదేశీ టూర్‌కు కొనకళ్ల..

    స్థానికంగా టీడీపీలోని తాజా పరిస్థితులను అంచనా వేసుకున్న ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు ముఖం చాటేస్తూ బుధవారం విదేశాలకు పయనమయ్యారు. అమెరికాతో పాటు టర్కీ, మక్కా తదితర ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. బంధువుల వద్దకు అంటూ బయలుదేరిన ఆయన దసరా ఉత్సవాల తరువాతే తిరిగి రానున్నారు.

    గొడుగుపేట ఆలయ భూములే కాదు రాష్ట్రంలోని ఏ ఆలయం, మరే ధార్మిక సంస్థకు చెందిన సెంటు భూమి కూడా పరులకు దక్కనీయకుండా అడ్డుకుంటా మని బందరుకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు బూరగడ్డ సుజయ్‌కుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు. స్వామి భూమిని కాపాడుకోవడానికి తనతో పాటు వీహెచ్‌పీ, బీజేవైఎం నాయకులు రాజశేఖర్‌, అయోధ్యరామయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కాగా సుజయ్‌కుమార్‌ పెడన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ బాబాయ్‌ కుమారుడు. స్థానిక టీడీపీ నాయకులు సైతం ఆలయ భూముల విషయంలో మంత్రి కొల్లు తీరును తప్పుపడుతుండటం గమనార్హం.

  • మైనార్టీల ద్రోహి గద్దే

    లబ్బీపేట(విజయవాడతూర్పు): ముస్లింల చిరకాల ఆకాంక్ష అయిన షాదీఖానా నిర్మాణ పనులను నిలిపివేసి, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌ మైనార్టీలకు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ అన్నారు. పిచ్చయ్యవీధి చివర బందరు కాల్వ ఒడ్డున గత ప్రభుత్వంలో ప్రారంభించిన షాదీ ఖానా పనులు నేటికీ పూర్తి కాకుండా, మధ్యలో నిలిపివేయడంతో దానిని వైఎస్సార్‌ సీపీ నేతలు బుధవారం పరిశీలించారు. తొలుత వైవీరావు ఆస్పత్రి రోడ్డులోని కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అలీం కార్యాలయం నుంచి పార్టీ నేతలు, ముస్లిం మైనార్టీలు షాదీఖానా వరకూ ర్యాలీగా వెళ్లారు.

    అబద్దాలు చెబుతూనే ఉన్నారు..

    దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా నిర్మాణాన్ని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామన్నారు. మైనార్టీల కోసం నాడు వైఎస్‌ జగన్‌ ఆర్‌అండ్‌బీ స్థలాన్ని మున్సిపల్‌ శాఖకు బదిలీ చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా నిర్మాణం పూర్తి కాలేదని ఆరోపించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌ మైనార్టీలను మోసం చేశారన్నారు. ఆయన 2014 నుంచి షాదీఖానా విషయంలో అబద్దాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ సెంట్రల్‌ ఇన్‌చార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆసిఫ్‌, గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్‌, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

  • గవర్నర్‌కు ఆహ్వానం

    ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై 22వ తేదీ నుంచి నిర్వహించే దసరా ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు దేవదాయ శాఖ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం గవర్నర్‌ను దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో పాటు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అంతకు ముందు దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి దేవదాయ శాఖ కమిషనర్‌ గవర్నర్‌కు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు వేద ఆశీర్వచనం అందజేసి, పట్టువస్త్రాలు, పవిత్రాలను అందించారు. అదే విధంగా ప్రభుత్వంలోని పలువురికి కూడా ఆహ్వాన పత్రికలను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు అందజేశారు.

    స్వర్ణాంధ్ర సాధనలో ఎన్‌ఎస్‌ఎస్‌ కీలకం

    కోనేరుసెంటర్‌: స్వర్ణాంధ్ర సాధనలో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె. రాంజీ పేర్కొన్నారు. బుధవారం సెనేట్‌ హాల్‌లో విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు గ్రామాల్లో చేపట్టవలసిన సేవా కార్యక్రమాలపై చర్చించారు. విద్యార్థులకు డిజిటల్‌ లిటరసీ శిక్షణపై అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా గ్రామస్తులను భాగస్వాములను చేసి శుభ్రతా డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.ఉష, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం సమన్వయకర్త డాక్టర్‌ ఎం. శ్రావణి, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

    ఘనంగా విశ్వకర్మ జయంతి

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విరాట్‌ విశ్వకర్మ జయంతి వేడుకలు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. బుధవారం కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సంప్రదాయ కళలు, కళాకారుల క్షేమం, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా సాధికారిత కల్పించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేతివృత్తుల కళాకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక నైపుణ్యాల సము పార్జన ద్వారా చేతివృత్తులకు కొత్త వైభవం వస్తుందని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు.

  • గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఇటీవల జరిగిన డీఎస్సీలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు పొందిన 17 మంది అభ్యర్థులను గ్రంథాలయాధికారులు సత్కరించారు. బందరు రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డైరెక్టర్‌ ఎ.కృష్ణమోహన్‌, కార్యదర్శి వి. రవికుమార్‌ అభ్యర్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. 

    వారి స్ఫూర్తితో మరింత మంది ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వసతి లేని విద్యార్థులు గ్రంథాలయాల్లో చదువుకోవాలన్నారు. ఉద్యోగాలు సాధించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్‌ గ్రంథాలయ అధికారి కె.రమాదేవి, గ్రేడ్‌ 3 గ్రంథ పాలకురాలు వై.ధనలక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

    డిజిటల్‌ అరెస్టు పేరుతో రూ.42.20 లక్షలకు టోపీ

    లబ్బీపేట(విజయవాడతూర్పు): డిజిటల్‌ అరెస్టు పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ వృద్ధుడిని బెదిరించి రూ.42.20 లక్షలు స్వాహాచేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. 76 ఏళ్ల నరపరెడ్డి సత్యనారాయణమూర్తి నంద మూరినగర్‌ ఆరో లైన్‌లో నివశిస్తున్నారు. అతనికి ఈ నెల 11న ఎస్‌కే చౌదరి డేటా ప్రొటెక్టింగ్‌ బోర్డు ఆఫీసర్‌ పేరుతో కాల్‌ చేశారు. అతని ఆధార్‌ కార్డు చెల్లనిదిగా మారిందని, సేఫ్టీ కోసం మరో అకౌంట్‌ తెరవాలని నమ్మబలికారు. 

    అనంతరం క్రైమ్‌ పోలీసుల మంటూ మరో రెండు నంబర్ల నుంచి వీడియో కాల్‌ చేసి బెదిరింపులకు దిగారు. వృద్ధుడిపై అరెస్టు వారెంట్‌ ఉందంటూ బెదిరించారు. పదే పదే ఫోన్‌లు చేసి డిజిట్‌ అరెస్టు అంటూ వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు తాళలేక వృద్ధుడు ఈ నెల 15న ఆర్టీజీఎస్‌ ద్వారా రూ.42,20,280 వారు చెప్పిన బ్యాంక్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించి బుధవారం సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    యువకుడిపై పోక్సో కేసు నమోదు

    మైలవరం(జి.కొండూరు): మైలవరం మండలంలోని పోరాటనగర్‌ గ్రామానికి చెందిన యువకుడు అజ్మీరా రమేష్‌నాయక్‌పై పోలీసులు బుధవారం పోక్సో కేసు న మోదు చేశారు. మైలవరం పోలీసుల కథనం మేరకు.. పోరాటనగర్‌ గ్రామానికి చెందిన అజ్మీరా రమేష్‌నాయక్‌ అదే గ్రామానికి చెందిన 17 బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. అనంతరం ఆమైపె లైంగికదాడి చేశాడు. రమేష్‌నాయక్‌ వేధింపులు తాళలేక ఆ బాలిక ఈ నెల 9వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సఅనంతరం కోలుకున్న బాలిక అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక తల్లి మైలవరం పోలీసులకు బుధవారం పిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

  • విమానాశ్రయంలో ఘనంగా యాత్రి సేవ దివస్‌

    విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో బుధవారం యాత్రి సేవ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. తొలుత విమానాశ్రయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వేర్వేరుగా మొక్కలు నాటారు. అనంతరం విమానాశ్రయ టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగులు, భద్రత దళాలను ఆయన అభినందించారు. అనంతరం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ట్యాక్సి, క్యాబ్స్‌ డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, సెక్యూరిటీ హోల్డ్‌ ఏరియాలో ప్రయాణికులకు సాధరణ హెల్త్‌ చెకప్‌లు నిర్వహించారు. వంద మంది జెడ్పీ హైస్కూళ్ల విద్యార్థులకు విమానాశ్రయ సందర్శనకు అవకాశం కల్పించారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. యాత్రి సేవ దివస్‌ను పురస్కరించుకుని విమానాశ్రయానికి విచ్చేసిన ప్రయాణికులకు ప్రత్యేకంగా తిలకం దిద్ది స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు, బాల ప్రయాణికులకు డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక, జానపద నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎల్‌.లక్ష్మీకాంతరెడ్డి, పలువురు విమానాశ్రయ ఉద్యోగులు పాల్గొన్నారు.

  • కేసరపల్లిలో కేంద్ర బృందం పర్యటన

    కేసరపల్లి(గన్నవరం): మండలంలోని కేసరపల్లి గ్రామాన్ని బుధవారం నేషనల్‌ ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో డెప్యూటీ డైరెక్టర్‌ అదితి అగర్వాల్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం పర్యటించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్వర్ణ పంచా యతీ పోర్టల్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీల్లో స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో పన్నుల వసూళ్ల గురించి రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2021లో తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.45 లక్షలు ఉన్న గ్రామపంచాయతీ వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం రూ.2 కోట్లకు పెంచినట్లు సర్పంచి చేబ్రోలు లక్ష్మీమౌనిక తెలిపారు. పెరిగిన ఆదాయంలో గ్రామంలో పలు సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.

    కాఫీ స్టాల్‌ పరిశీలన

    అనంతరం ఈ బృందం దుర్గాపురం వద్ద గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన కుంభకోణం కాఫీ స్టాల్‌ను పరిశీలించింది. ఈ స్టాల్‌ ద్వారా నెలకు రూ.70 వేలు వరకు పంచాయతీకి ఆదాయం సమకూరనున్నట్లు ఇన్‌చార్జ్‌ ఈఓపీఆర్డీ రాజబాబు తెలిపారు.

    పంచాయతీలు ఆదాయం పెంచుకోవాలి

    అనంతరం అదితి అగర్వాల్‌ మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీల స్వయం సమృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామపంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు కాఫీ స్టాల్‌, క్రికెట్‌ నెట్‌ వంటివి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉపసర్పంచ్‌ జాస్తి శ్రీధర్‌బాబు, ఎంపీటీసీ సభ్యులు శొంఠి కిషోర్‌, పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లు చందన, హర్ష, చైతన్య, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

  • సమాచార శాఖ ఏడీకి కలెక్టర్‌ అభినందనలు

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర సమాచార కేంద్రం విజయవాడ కార్యాలయంలో సహాయ సంచాలకుడిగా ఉద్యోగోన్నతి పొందిన ఎన్టీఆర్‌ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్‌.వి.మోహన్‌రావుకు కలెక్టర్‌ జి.లక్ష్మీశ అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ విజయవాడ సహాయ సంచాలకుల కార్యాలయంలో సహాయ సంచాలకుడిగా ఉద్యోగో న్నతి పొందిన మోహన్‌రావును బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం అభినందనలు తెలిపి సత్కరించారు. 2008లో సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్వో)గా విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఎస్‌.వి.మోహన్‌రావు విజయవాడ డివి జనల్‌ పీఆర్వోగా, డీపీఆర్వోగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయవాడ సహాయ సంచాలకుడిగా ఉద్యోగోన్నతి పొందారు. ఉద్యోగోన్నతి పొంది నప్పటికీ జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా కవరేజ్‌ చేస్తూ మీడియా ప్రతినిధులు, అధికారులను మరింత సమన్వయం చేసుకోవాలని కోరారు. దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ డీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన వై.బాలకృష్ణ కలెక్టర్‌ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో డీఐపీఆర్వో కె.వి.రమణరావు, ఇన్‌చార్జ్‌ డీపీఆర్వో వై.బాలకృష్ణ, డివిజనల్‌ పీఆర్వో కె.రవి, ఏవీఎస్‌ వి.వి.ప్రసాద్‌, సిబ్బంది కె.గంగా భవాని, వై.గౌరి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఘనంగా విశ్వకర్మ జయంతి

    కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) వి.వి.నాయుడు, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ బి.సత్యనారాయణ, ఇతర పోలీసు అధికా రులతో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ జయంతిని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలు ఎంతో నిష్టతో జరుపుతారని, పశ్చిమ బెంగాల్లోని హల్దియా పారిశ్రామిక ప్రాంతం విశ్వకర్మ పూజకు ప్రసిద్ధి చెందిందని ఏఎస్పీలు తెలిపారు. ఇంజినీరింగ్‌ ఆర్కిటెక్చర్లే మాత్రమే కాకుండా వివిధ రకాల చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు, మెకానిక్‌లు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, మొదలైన వారు కూడా ఎంతో నియమ నిష్టలతో జరుపుకుంటారని వివరించారు. పట్టుదల, నైపుణ్యాన్ని అలవర్చుకుంటే ఎంత కష్టమైనా పనినైనా తేలికగా సాధించవచ్చు అని తెలియచెప్పే విశ్వకర్మ అందరికీ ఆదర్శప్రాయుడని అడిషనల్‌ ఎస్పీలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.