తప్పిపోయిన వ్యక్తి అప్పగింత
కామారెడ్డి క్రైం: లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల పెంటయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం సక్రమంగా ఉండటం లేదు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆయన ఆచూకీ కోసం సామాజిక మా ధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఆదివారం పెంటయ్య కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట కూర్చుని ఉండటాన్ని గమనించిన అవుట్పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ అనుమానం వచ్చి ఆరా తీశారు. విషయం తెలుసుకుని అతని కుటుంబ స భ్యులకు సమాచారం ఇచ్చారు. వారు రాగానే పెంటయ్యను అప్పగించారు. పెంటయ్య కుటుంబ స భ్యులు హెడ్ కానిస్టేబుల్కు కృతజ్ఞతలు తెలిపారు.


