బోల్తాపడిన ఆటో: పలువురికి గాయాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి శివారులో ఆదివారం ఓ ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామానికి చెందిన 12మంది ఒక శుభకార్యక్రమంలో పాల్గొనడానికి ఆటోలో సంతాయిపేట్ నుంచి తాడ్వాయికి బయలుదేరారు. తాడ్వాయి శివారులోకి రాగానే ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి చేయి విరుగగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.


