జాడలేని సబ్సిడీ టార్పాలిన్లు! | - | Sakshi
Sakshi News home page

జాడలేని సబ్సిడీ టార్పాలిన్లు!

Nov 10 2025 8:30 AM | Updated on Nov 10 2025 8:30 AM

జాడలే

జాడలేని సబ్సిడీ టార్పాలిన్లు!

ప్రభుత్వం స్పందించాలి..

ధర్పల్లి: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి, వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం వ స్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడు కునేందుకు టార్పాలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. దీంతో గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను రైతులకు సరఫరా చేసేది. కానీ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం టార్పాలి న్ల పంపిణీని నిలిపివేసింది. మార్కెట్లో టార్పాలిన్ల ధరలు అధికంగా ఉండటంతో కొనలేక టాపర్లను రైతులు అద్దెకు తెచ్చుకుంటూ పంటను కాపాడుకుంటున్నారు.

2018 వరకు పంపిణీ..

వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేది. మార్కెట్లో రూ. 2500కు లభించే టార్పాలిన్లను 50 శాతం సబ్సిడీ తో రూ.1250కే ప్రభుత్వం రైతులకు అందించేది. ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే టార్పాలిన్లు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉండేవి. ఈవిధంగా 2018 వరకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లను పంపిణీ చేసింది. రైతులు కూడా వాటిని తీసుకోవడానికి పోటీపడేవారు. ప్రతి సారి ఆశించిన మేర టార్పాలిన్లు రాకపోవడంతో ఉన్నంత మేరలో అధికారులు రైతులకు అందించేవారు. కానీ 2018 తర్వాత సబ్సిడీ టార్పాలిన్ల జాడే లేదు. వాటికోసం రైతులు ఏడేళ్లుగా ఎదురుచూపులు చూస్తూనేఉన్నారు.

ప్రస్తుతం ధాన్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. పంట కోస్తే ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్లు లేకపోవడంతో అద్దెకు తీసుకుంటున్నాం. ఒక రైతు సుమారు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు టార్పాలిన్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా టార్పాలిన్లను సబ్సిడీపై అందించాలి.

–తిరుపతి, రైతు, కార్నల్‌ తండా

రోజుకు అద్దె రూ.25..

జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణ శివా రులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పలువురు వ్యక్తులు టార్పాలిన్లను అద్దెకిచ్చి ఉపాధి పొందుతున్నారు.ఒక్క టార్పాలిన్‌కు రోజుకు రూ.15 నుంచి రూ.25 వరకు చెల్లించి అద్దె ప్రతిపాదికన రైతులు తీసుకుంటున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి సాధారణంగా ప్రతి రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతిరోజు సుమారు రూ.100నుంచి రూ. 250 వరకు భారం పడుతుంది.ఇలా రోజుల త రబడి టార్పాలిన్లను అద్దైపె తీసుకువస్తే రైతుల పై రూ.వెయ్యికి పైగా ఖర్చవుతోంది. దీంతో టా ర్పాలిన్ల అద్దె భారం మోయలేకపోతున్నట్లు రైతు లు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయాలని రైతులు కోరుతున్నారు.

ఏడేళ్లుగా రైతుల ఎదురుచూపులు

బహిరంగ మార్కెట్లో

అధిక ధరలు

కొనలేక అద్దెకు తెచ్చుకుంటున్న

అన్నదాతలు

జాడలేని సబ్సిడీ టార్పాలిన్లు! 1
1/2

జాడలేని సబ్సిడీ టార్పాలిన్లు!

జాడలేని సబ్సిడీ టార్పాలిన్లు! 2
2/2

జాడలేని సబ్సిడీ టార్పాలిన్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement