కదలివచ్చి.. మనసారా పూజించి
మంచాల: కార్తీక మాసంను పురస్కరించుకొని బుగ్గరామ లింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారు మోగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పారుతున్న సెలయేరు, షవర్ల వద్ద స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి భక్తిశ్రద్ధలతో వ్రతాలు, పూజలు చేశారు. మహిళలు కార్తీక దీపారాధన, తులసి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు తగిన చర్యలు తీసుకున్నారు.
రామలింగేశ్వరుడి సన్నిధిలో సేదతీరిన భక్తజనం
కదలివచ్చి.. మనసారా పూజించి


