విద్యార్థులతో మాట్లాడి.. కూరగాయలు పరిశీలించి!
● మద్దికెరలో కలియతిరిగిన ట్రైనీ కలెక్టర్లు
మద్దికెర: మండలకేంద్రమైన మద్దికెరకు ఆదివారం ట్రైనీ ఐఏఎస్ కలెక్టర్లు అంకిత్ రాజుపుత్, మోహిత్ మంగల్, భరత్ దత్ తివారి, తన్మయి మెగ్వాల్, అమర్ బాగిల్, అతుల్సోని వచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా విద్యాలయానికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ప్రధాన కూడలిలో ఉన్న కూరగాయల మార్కెట్ను పరిశీలించి ధరల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి, గ్రామంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి.. తదితర వివరాలు తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీపీ అనిత, సర్పంచ్ సుహాసిని, తహసీల్దార్ గుండాలనాయక్, ఎంపీడీఓ కొండయ్య, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ మయాంక్, ఎంఈఓ రంగస్వామి, ఏఓ రవి, ఏపీఓ నర్సిరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ త్రివేణి ఉన్నారు.


