సమస్యలపై ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తాం | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తాం

Nov 10 2025 8:24 AM | Updated on Nov 10 2025 8:24 AM

సమస్య

సమస్యలపై ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తాం

ఎల్‌పీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌

సుభాష్‌ చంద్రబోస్‌

కర్నూలు(అర్బన్‌): సమస్యలపై ప్రజల గొంతుకగా న్యాయవాదుల ప్రజాకూటమి ప్రశ్నిస్తుందని ఎల్‌పీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. న్యాయవాదుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. నూతనంగా లాయర్స్‌, పబ్లిక్‌ ఫ్రంట్‌(ఎల్‌పీఎఫ్‌) న్యాయవాదుల ప్రజా కూటమి ఆవిర్భవించింది. ప్రతిష్టాత్మకంగా వెలసిన న్యాయవాదుల ఎల్‌పీఎఫ్‌కి రాష్ట్ర కన్వీనర్‌గా మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులు కూడా నియమితులయ్యారు. ఆదివారం కర్నూలు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, కర్నూలు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మిదేవి, దేవపాల్‌, సుబ్బయ్య, ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాదులు రవీందర్‌చౌదరిలతో పాటు పెద్ద ఎత్తున న్యాయవాదులు హాజరై ఏకగ్రీవంగా లాయర్స్‌, పబ్లిక్‌ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు.

చట్టాలపై అవగాహన కల్పిస్తాం

సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించే కార్యాక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతామని ఎల్‌పీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌పీఎఫ్‌ పని చేస్తుందని, ఎవ్వరికి అన్యాయం జరిగినా పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి మారెప్ప మట్లాడుతూ.. ప్రజా ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వారు ప్రజాసమస్యలు పట్టించుకోకుండా రూ.కోట్లు కూడబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న లోపాలను సవరించేందుకు ఎల్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కర్నూలు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మిదేవి, పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయవాదుల ప్రజా కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. న్యాయవాదులు గాలిరాజు, గౌతంశేఖర్‌, ఉపేంద్ర, సువర్ణకుమారి, సుమలత, జ్యోతి లావణ్య, శ్రావణ్‌కుమార్‌, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

లాయర్స్‌, పబ్లిక్‌ ఫ్రంట్‌ కమిటీలో

సభ్యులు..

ఎల్‌పీఎఫ్‌ రాష్ట్ర కో–కన్వీనర్‌గా ముప్పసాని గాలిరాజు, కర్నూలు జిల్లా కన్వీనర్‌గా గౌతంశేఖర్‌, కో–కన్వీనర్‌లుగా న్యాయవాదులు కె.సుమతల, డి.లావణ్య, జీఎన్‌జ్యోతి, వై.ఉపేంద్ర, ఎం.శ్రావణ్‌కుమార్‌, మహేంద్రరెడ్డి, వినోద్‌కుమార్‌ ఎన్నికయ్యారు.

సమస్యలపై ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తాం1
1/1

సమస్యలపై ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement