Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

BC Reservations Telangana Bandh Oct 18th News Live Updates In Telugu
బీసీ బంద్‌: ‘త్వరలోనే మోదీని కలుస్తాం’

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ.. 9వ షెడ్యూల్‌ చేర్చి చట్టసవరణ చేయాలంటూ బీసీ సంఘాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఈ బంద్‌కు అన్ని పార్టీలతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు ప్రకటించాయి.

Kavitha Son Politically Activted With BC Bandh Viral2
కవిత కొడుకు పొలిటికల్‌ ఎంట్రీ!?

సాక్షి, హైదరాబాద్‌: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత శనివారం ఉదయం ఖైర‌తాబాద్ చౌర‌స్తాలో మాన‌వహారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవ‌లం మా అమ్మ మాత్ర‌మే పోరాటం చేస్తే స‌రిపోదు.. ప్ర‌తి ఇంటి నుండి అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడాలి. బీసీ రిజ‌ర్వేష‌న్లు స్థానిక ఎన్నిక‌ల‌కు ఎంతో అవ‌స‌రం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీఆర్‌ఎస్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చ‌దువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్‌, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్‌ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది.

Trump Again Claims India Will Soon Stop Buying Russian Oil3
రష్యా ఆయిల్‌ కొనుగోళ్లను భారత్‌ ఆపేయబోతోంది: ట్రంప్‌

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చెప్పడం తెలిసిందే. అయితే భారత్‌ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ దరిమిలా ట్రంప్‌ మరోసారి అదే వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌ రష్యా చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యల చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో వైట్‌హౌజ్‌లో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతిత్వరలోనే భారత్‌ నిలిపివేయబోతోందని అన్నారాయన. తద్వారా మాస్కోపై ఉక్రెయిన్‌ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతోందని ట్రంప్‌ తాజాగా చెప్పారు. ఇండియా రష్యా నుంచి 38 శాతం చమురు కొనుగోలు చేసేది. అయితే ఇక నుంచి ఆ పని చేయబోదు. ఆ దేశం ఇప్పటికే కొనుగోళ్లను తగ్గించేసింది. దాదాపుగా ఆపేసేదాకా వచ్చింది అని ట్రంప్‌ అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చారని, తమ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగిందని ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. దీంతో.. ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు కూడా. అయితే.. భారత్‌ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. ట్రంప్‌-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ స్వయంగా వెల్లడించారు కూడా. ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఏంటంటే.. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్‌లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తోందని. అలా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్‌ సహకరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ట్రంప్ భారత్‌పై 25% ప్రతీకార సుంకం(అంతకు ముందు విధించిన దాంతో కలిపి మొత్తంగా 50 శాతం) విధించినట్లు ప్రకటించారు కూడా. అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్‌ మరోసారి భారత్‌ రష్యా చమురును ఆపేయబోతోందన్న వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.ఇదీ చదవండి: ట్రంప్‌ అయోమయావస్థ!

MP Priyanka Chaturvedi Reacts Afghans call off Pakistan series4
బీసీసీఐ, ‍కేంద్రం.. ఆప్ఘన్‌ను చూసైనా సిగ్గుపడాలి: ప్రియాంక చతుర్వేది

ముంబై: పాకిస్తాన్‌ సైన్యం వైమానిక దాడుల కారణంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్లు మృతిచెందారు. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్‌, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోణపు సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ నిర్ణయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఏసీబీని చూసి బీసీసీఐ, భారత ప్రభుత్వం నేర్చుకోవాలి అని ఘాటు విమర్శలు చేశారు.శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పాకిస్తాన్ వ్యవస్థలో అమాయక బాధితుల రక్తం తాగే కొందరు వ్యక్తులు సరిహద్దుల్లో ఉన్నారు. వారంతా సిగ్గుపడాలి. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌తో తమ సిరీస్ మ్యాచ్‌లను రద్దు చేసుకోవడం సరైన చర్య. బహుశా బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం క్రీడల కంటే దేశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో ఆప్ఘన్‌ నుంచి నేర్చుకోవాలంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు సంఘీభావంగా శ్రీలంక జట్టు కూడా సిరీస్ నుండి కూడా వైదొలగాలని ఆశిస్తున్నాను. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు వారి జట్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని మర్చిపోకూడదు. బీసీసీఐ లాగా కాకుండా పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇతర ఆసియా జట్లు సంఘీభావంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.Pakistan establishment is made up of a bunch of cowards who thrive on the blood of their innocent victims and get thrashed at the borders. Shame on them. Good to see Afghanistan Cricket Board call off their series matches with Pakistan, maybe BCCI and GoI can take tips on how to… https://t.co/VzAvFcUOwi— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలి. ఇక్కడ పోరాటం కేవలం రాజకీయల గురించి మాత్రమే కాదు. దుష్ట దేశం పాకిస్తాన్‌ గురించి. పాక్‌ ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. దేశం అంతా బాధపడుతోంది. కాబట్టి ఇది రాజకీయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ హితవు పలికారు. ఇక, అంతుకుముందు కూడాప్రియాంక బీసీసీఐ, కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత జట్టు మ్యాచ్‌లు ఆడటమేంటని ప్రశ్నించారు. Keep Politics out of sports is something that gets thrown around so easily by apologists of the government and the BCCI. This isn’t politics but about terrorism. Lives are lost, families are impacted, economy is affected, country suffers all of it because of one rogue nation. So…— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025ఇదిలా ఉండగా.. క్రికెటర్ల మరణంపై ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘అత్యంత విషాదకరమైన ఘటన. అనైతికం, అనాగరిక చర్య. పాకిస్తాన్‌ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. విషాద ఘటనలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటోన్న యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది. పౌరులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరుతున్నా. పాక్‌తో తలపడబోయే ట్రై సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నామని మా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందే. క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తాం. మాకు దేశ సమగ్రత అత్యంత ముఖ్యమైన అంశం’ అని పేర్కొన్నాడు.

IND vs AUS: What Is Rohit Sharma ODI Record Against Australia?5
25 ఫోర్లు, 8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌల‌ర్ల‌ను ఉతికారేసిన రోహిత్ శ‌ర్మ‌!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం (అక్టోబ‌ర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న భారత జట్టు నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.మరోవైపు ఆస్ట్రేలియా కూడా తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆసీస్ జట్టు పగ్గాలను మిచెల్ మార్ష్ చేపట్టాడు. ఇక మొన్నటివరకు టీమిండియా వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ.. ఇప్పడు కేవలం ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. భారత వన్డే జట్టు సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. భారత వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత హిట్‌మ్యాన్ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.ఆసీస్ గ‌డ్డ‌పై అదుర్స్‌..కాగా ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై రోహిత్ శ‌ర్మ‌కు అద్భుత‌మైన రికార్డు ఉంది. ఆసీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఇప్ప‌టివ‌ర‌కు 30 వ‌న్డేలు(ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌తో క‌లిపి) ఆడిన రోహిత్ శ‌ర్మ.. 53.12 స‌గ‌టుతో 1,328 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాడు.అదేవిధంగా కంగారుల గ‌డ్డ‌పై ఆస్ట్రేలియాతో వ‌న్డే మ్యాచ్‌ల్లో భార‌త త‌రపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు రోహిత్ శ‌ర్మ పేరిట ఉంది. 19 వ‌న్డేల్లో 58.23 స‌గ‌టుతో 990 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌దిక స్కోర్ 171 ప‌రుగులుగా ఉంది.పెర్త్‌లో తిరుగులేని హిట్‌మ్యాన్‌..ఇక తొలి వ‌న్డే జ‌రిగే పెర్త్‌లో కూడా రోహిత్ మంచి రికార్డు ఉంది. పెర్త్ మైదానంలో హిట్‌మ్యాన్ కేవ‌లం 4 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి 122.5 స‌గ‌టుతో ఏకంగా 245 పరుగులు చేశాడు. ఈ వేదికగా 2016లో ఆసీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో రోహిత్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశాడు. ఈ మైదానంలో రోహిత్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో 163 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌..13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 171 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. పెర్త్‌లోనే వాకా స్టేడియంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్‌ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు అదే జోరును కనబరిచాలని రోహిత్ అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: 'ఇదొక క్రూరమైన చర్య'.. అఫ్గాన్ క్రికెటర్ల మృతిపై రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి

K Ramp Movie Twitter Review And Public Talk6
‘కె-ర్యాంప్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

గతేడాది దీపావళికి ‘క’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న కిరణ్‌ అబ్బవరం..ఈ సారి ‘కె-ర్యాంప్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జైన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్‌ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘కె-ర్యాంప్‌’ ఎలా ఉంది? కిరణ్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా ? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.ఎక్స్‌లో కె-ర్యాంప్‌ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వినిస్తుంది. సినిమా బాగుందని, కిరణ్‌కి భారీ విజయం సాధించిందని కొంతమంది అంటుంటే.. బాగోలేదని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.#KRamp Review : A Good Festive Fun filled Entertainer - 3/5 💥💥💥Youth Star ⭐️ @Kiran_Abbavaram RAMPAGE TIMING with one man show totally 👍🔥❤️‍🔥 Mass Center audience ki eyyite eye feast 🤩🙌💥#KiranAbbavaram #JainsNani Director @JainsNani presented second half so superbly… pic.twitter.com/vsMkne6yP0— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) October 18, 2025ఈ పండక్కి మంచి ఫన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ఇది. ఈ మూవీకి కిరణ్‌ వన్‌మ్యాన్‌ షో. మాస్‌ సెంటర్‌ ఆడియన్స్‌ సినిమా బాగా ఎక్కేస్తుంది. సెకండాఫ్‌ని దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. డైలాగ్స్‌ మరో ప్రధాన బలం’ అంటూ ఓ నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు.A good overall watch Family entertainer 👌Second half pub scene 😂😂 Ee #Diwali kuda needhey @Kiran_Abbavaram #KRamp #KrampReview https://t.co/mwsuneMLhA— Karthik Chowdary (@KChowdaryyy) October 18, 2025 ఓవరాల్‌గా సినిమా బాగుంది.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సెకండాఫ్‌ పబ్‌ సీన్‌ బాగుంది. ఈ దిపావళి కూడా కిరణ్‌ అబ్బవరందే అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.#KRamp A Silly, Outdated Film that’s Over the Top from Start to Finish!The film follows a very simple story with a routine to the core screenplay that we’ve seen countless times before. This might have worked for a genre that aims purely to entertain, but here the comedy and…— Venky Reviews (@venkyreviews) October 18, 2025 ప్రారంభం నుంచి ముగింపు వరకు ఓవర్‌ ది టాప్‌గా ఉండే ఒక సిల్లీ చిత్రమిది. ఇలాంటి కథలను మనం చాలా వరకు చూశాం. కేవలం వినోదాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే క్రింజ్‌గానే అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్లను దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. మిగిలి రచన పేలవంగా ఉంది అంటూ ఓ నెటిజన్‌ 2 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు.Done with my show, good 2nd half followed..!! Disorder characterization scenes comedy worked in parts. Kumar abbavaram steals the show from scene 1 except during father sentiment. Climax is just good. Overall a decent entertainer. 2.5/5 #KRamp— Peter Reviews (@urstrulyPeter) October 17, 2025#KRamp LOUD MASS ENTERTAINER What team promised is Completly Fulfilled👍, Okayish 1st half followed by Very good 2nd half🌟Introduction 🔥🔥, 2nd half Some comedy scenes🔥. Good film for @Kiran_AbbavaramAfter #KA MASSSY ENTERTAINERDIWALI WINNER 🏆 🌟🌟🌟/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 18, 2025#KRampExcept for a couple of sequences in the second half nothing is interesting. Outdated story,Unwanted songs, Predictable screenplay and those comedy scenes 🙏 Forget about music. No emotional depth except climax sequence. @ItsActorNaresh and @vennelakishore are the saviours.— Vaishu Mahadevan (@VaishuMahadeva2) October 17, 2025Second half >>>Full tooo Fun 😂🔥Fully entertainment Bomma 3.25/5 - #KRamp https://t.co/9a8mqTUMc5— let's x Cinematica (@letsxCinematica) October 17, 2025

US Donald Trump rejects Zelensky to Give Tomahawk missiles7
తూచ్‌ అదంతా ఉత్తినే.. జెలెన్‌స్కీకి ట్రంప్‌ ఝలక్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మాట మార్చారు. రష్యాను బెదిరించినట్టే వార్నింగ్‌ ఇచ్చి.. వెంటనే యూటర్న్‌ తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్‌స్కీకి అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్‌.. తాజాగా అలాంటిదేమీ లేదని చేతులెత్తేశారు. దీంతో, మరోసారి అందరి ముందూ నవ్వులపాలయ్యారు.ఇక, రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే పలు రకాల ప్లాన్స్‌ వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సైతం ట్రంప్‌ భేటీ అయ్యారు. కానీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మాత్రం ఆడగం లేదు. ఈ నేపథ్యంలో రష్యా బెదిరించేందుకు ట్రంప్‌ కొత్త ప్లాన్‌ చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను జెలెన్‌స్కీకి ఇవ్వాల్సి వస్తుందని రష్యాను బెదిరించారు. ఇలా అయినా పుతిన్‌కు దారికి తెచ్చేందుకు పైకి గంభీరంగా ప్రకటన చేశారు.🇺🇸🇺🇦 US President Trump has rejected Ukrainian President Zelensky’s request for more tomahawk missiles in a “tense” White House meeting today. @europa pic.twitter.com/O5OVZFOjA7— EUROPA (@europa) October 18, 2025అయితే, తాజాగా ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌ను జెలెన్‌స్కీ కలిశారు. ఈ సందర్బంగా తోమహాక్ క్షిపణులపై చర్చించారు. తమకు క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. కానీ, ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్‌ ఇచ్చారు. తోమహక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్‌ తెగేసి చెప్పేశారు. తాజా పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని.. వాటిని సరి చూసుకోవాలని తెలిపారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు.Again, Zelensky had a bath with cold water. He expected to get the Tomahawk cruise missiles to counter attacks on Russia. But Kerlmin already made a deal with President Trump. Mr. Putin is trying to delay the peace process because he doesn’t want to lose his power.— Rudra Raya (@RudraRaya) October 18, 2025 ఈ సందర్బంగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని చేతులెత్తేశారు. అయితే.. తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకునేలా చేయవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు. మరోవైపు, బుడాపెస్ట్‌లో సమావేశం తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్‌హౌస్ అధికారులు చెబుతున్నారు.‍ కాగా, ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.

Hyderabad Realty Prices Set to Rise Surging Demand for Developed Plots8
రియల్‌ ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు

సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్‌ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్‌ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్‌ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్‌ ఏర్పడటం ఖాయమని జేఎల్‌ఎల్‌–రూఫ్‌ అండ్‌ ఫ్లోర్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇతరత్రా అవసరాల కోసం బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్‌ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్‌మెంట్లు లేదా పేరున్న డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్‌ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Pakistan Army launches airstrikes on Afghanistan Province9
పాకిస్తాన్‌ సైన్యం అరాచకం.. తాలిబన్‌ నేత సీరియస్‌ వార్నింగ్‌

కాబూల్‌: దాయది దేశం పాకిస్తాన్‌(pakistan), ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్యూరాండ్‌ లైన్‌ వెంట వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా పదుల సంఖ్యలో ఆప్ఘన్‌ పౌరులు మృతి చెందినట్టు తెలిసింది. వారిలో ముగ్గురు ఆప్ఘన్‌ క్రికెటర్లు కూడా ఉన్నారు.పాక్‌ సైన్యం ఆప్ఘనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరుదేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటల తర్వాత పాక్‌ సైన్యం ఓవరాక్షన్‌కు దిగింది. డ్యూరాండ్ లైన్ (Durand Line) వెంబడి ఉన్న పక్తికా (Paktika) ప్రావిన్స్‌లోని అర్గున్, బెర్మల్ జిల్లాలలో పలు ఇళ్లపై మూడు ప్రాంతాల్లో బాంబు దాడి చేసింది. పాక్‌ దాడుల కారణంగా ముగ్గరు ఆప్ఘన్‌ క్రికెటర్లతో పాటుగా మరో 10 మంది పౌరులు మృతిచెందినట్టు సమాచారం.మరోవైపు.. పాక్‌ చర్యలపై తాలిబాన్ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడింది. పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు, రెండు దేశాల నాయకులు శనివారం ఖతార్, దోహాలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పాక్ ప్రతినిధులు దోహా చేరుకున్నారు, ఆప్ఘనిస్థాన్‌ నుంచి ఇంకా బయల్దేరాల్సి ఉంది. అయితే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందే ఉల్లంఘించడం గమనార్హం.

Crackdown on Injection Abuse in Gyms Stocks Seized10
జిమ్‌లలో కొత్త దందా..‘ఇంజెక్షన్లు’తో బాడీ బిల్డింగ్‌.. డీసీఏ దాడులతో గుట్టురట్టు

హైదరాబాద్‌: నగరంలోని పలు జిమ్‌లలో బాడీ బిల్డింగ్‌ కోసం అక్రమంగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వినియోగిస్తున్న ఉదంతం వెలుగు చూసింది. తాజాగా తెలంగాణలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)సికింద్రాబాద్‌లోని నామాలగుండుకు చెందిన ఎం. నరేష్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన కార్డియాక్ స్టిమ్యులెంట్ మందులను స్వాధీనం చేసుకుంది. ఈ కేటగిరిలోని టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు (మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు)ను స్వాధీనపరుచుకుంది. జిమ్‌లలో బాడీబిల్డింగ్‌ కోసం వచ్చేవారికి ఈ మందులను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారని వెల్లడయ్యింది.ఖార్కానా పోలీసుల నుండి అందిన సమాచారం ఆధారంగా సికింద్రాబాద్ జోన్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సికింద్రాబాద్‌లోని నామాలగుండులో ఉంటున్న ఎం నరేష్‌ ఇంటిపై దాడిచేశారు. ఇతను లైసెన్స్ లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నాడని సమాచారం. అ సందర్భంగా అధికారులు ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ అనే కార్డియాక్ స్టిమ్యులేట్ డ్రగ్ నిల్వలను గుర్తించారు. బాడీబిల్డింగ్‌ కోసం జిమ్‌కు వెళ్లేవారికి వీటిని విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు.మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అనేది కార్డియాక్ స్టిమ్యులేట్ ఔషధం. దీనిని ప్రధానంగా శస్త్రచికిత్స సమయంలో.. అనస్థీషియా ఇవ్వడం వల్ల తలెత్తే తగ్గిన రక్తపోటు (హైపోటెన్షన్)ను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు. అలాగే హైపోటెన్సివ్ (తక్కువ రక్తపోటు) స్థితులలో రక్తపోటును చక్కదిద్దేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఈ ఔషధం నోరాడ్రినలిన్ విడుదలను పెంచుతుంది. తద్వారా కార్డియాక్ అవుట్‌పుట్‌ పెరుగుతుంది. గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచడం, రక్త నాళాలను కుదించడం ద్వారా, ఈ ఔషధం వేగంగా రక్తపోటును పెంచుతుంది. అయితే ఈ ఔషధం మోతాదు, వ్యవధిని సంబంధిత వైద్యుడు మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది.మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌ను బాడీబిల్డర్లలో ఓర్పును పెంచడానికి అక్రమంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ ఇంజెక్షన్ల అనవసరం వినియోగం కారణంగా హృదయ సంబంధిత రుగ్మతలతో సహా శరీరంలో పలు ప్రతికూల ప్రభావాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ల వినియోగం చివరికి మరణానికి కూడా దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. కాగా నామాలగుండుతో దాడులు చేపట్టిన డీసీఏ అధికారులు స్థానికుడు ఎం నరేష్ నుండి టెర్మివా ఇంజెక్షన్లు , టెర్మిన్ ఇంజెక్షన్ల 66 వైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సికింద్రాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ డీ సరిత, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ బీ గోవింద్ సింగ్, పీ రేణుక,జీ. సురేంద్రనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడు ఎం సురేష్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement