కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ) ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కో ఆర్డినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్సీ చైర్పర్సన్లు, జడ్సీ వైస్ చైర్పర్సన్లు, పీఏసీ, సీఈసీ, ఎస్ఈసీ మెంబర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారు. కోటి సంతకాల ప్రతులను10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలి. జిల్లా స్థాయి కార్యక్రమం 13న కాకుండా 15న నిర్వహించాలి. 17న వైఎస్ జగన్ సహా ముఖ్య నేతలు.. గవర్నర్ను కలుస్తారు.’ అని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి.. కోటి సంతకాల సేకరణ అంశానికి సంబంధించి వరుసగా జూమ్ మీటింగ్లు, టెలీ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు నేతలను నుంచి కోటి సంతకాల సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు పలు సలహాలు ఇస్తున్నారు సజ్జల.ఇదీ చదవండి:చంద్రబాబు క్షద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్
అయ్యప్ప భక్తుల కారు బోల్తా.. పలువురికి గాయాలు
తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాలలో కారు బోల్తా పడిన ఘటనలో పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. శబరిమల నుంచి కోడూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, నిన్న(శనివారం, డిసెంబర్ 6వ తేదీ) తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
ఏవియేషన్ డే: ఇండిగో తరహా సంక్షోభాలు మున్ముందు ఎదురైతే..
భారత్లోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన సేవలు ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపుతోంది. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా పెళ్లిళ్లూ రద్దవుతున్నాయి. దీంతో, ఇండిగో యాజమాన్యం తీరుపై జనం నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని సగటు ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నాడు..అయితే, ఇండిగో తన దగ్గర ఉన్న పరిమిత సిబ్బంది, పైలెట్లతోనే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ రాత్రి పూట నడిపే సర్వీసులు సైతం అధికంగా ఉన్నాయి. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థ చేరవేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విమానయాన సంస్థలు సైతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.పౌర విమానయాన రంగంలో కీలక సవాళ్లు..1. అధిక ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ఖర్చులుభారతదేశంలో ATF ధరలు GST పరిధిలోకి రాకపోవడంతో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. విమానయాన నిర్వహణ ఖర్చులలో ఇంధన వాటా 30–40% ఉంటుంది. దీనివల్ల టిక్కెట్లు ఎక్కువగా ఉన్నాయి. మార్జిన్లు తక్కువగా ఉంటాయి. ఇంధన ఖర్చులను తగ్గించడానికి పరిశ్రమ చాలా కాలంగా ATFని GST కింద చేర్చాలని డిమాండ్ చేస్తోంది.2. మౌలిక సదుపాయాల అడ్డంకులుదేశ ప్రయాణీకుల రద్దీ ప్రతీ ఏటా పెరుగుతోంది. 120 మిలియన్ల నుండి 236 మిలియన్లకు పెరిగింది. విమానాశ్రయాలు కూడా 74 నుండి దాదాపు 160కి రెట్టింపు అయ్యాయి. ఎయిర్పోర్టుల విస్తరణ ఉన్నప్పటికీ ప్రధాన విమానాశ్రయాలలో (ఢిల్లీ, ముంబై, బెంగళూరు) రద్దీ మాత్రం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ప్రాంతీయ కనెక్టివిటీ (UDAN పథకం) విస్తరిస్తున్నప్పటికీ చిన్న విమానాశ్రయాలు నిధులు, కార్యాచరణ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. చిన్న విమానయాన సంస్థలు మనుగడ కోసం కష్టపడుతున్నాయి3. స్థిరత్వం, కార్బన్ నియమాలు2027 నుండి ICAO యొక్క CORSIA కార్బన్ ఆఫ్సెట్ పథకాన్ని భారతదేశం పాటించాలి. ప్రభుత్వం స్థిరమైన విమాన ఇంధనం (SAF) మిశ్రమ లక్ష్యాలను నిర్దేశించింది. కానీ SAF ఖరీదైనది, పరిమితమైనంది. లాభదాయకతను సమతుల్యం చేస్తూ ఉద్గారాలను తగ్గించడానికి విమానయాన సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.4. సైబర్ భద్రతా ప్రమాదాలుఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన GPS స్పూఫింగ్ సంఘటనలు నావిగేషన్ వ్యవస్థలలోని భద్రతలేమిని హైలైట్ చేశాయి. డిజిటల్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ బెదిరింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి భారత్ GNSS సలహాదారులను, మెరుగైన పర్యవేక్షణను అమలు చేస్తోంది.5. పైలట్ల కొరత.. దేశంలో ముఖ్యంగా పైలట్ల కొరత అధికంగా ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలెట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.పరిష్కారాలు..దేశంలో కొత్త ఫ్లయింగ్ అకాడమీలు ఏర్పాటు చేయడంపైలట్ శిక్షణలో PPP మోడల్ ప్రవేశపెట్టడంFDTL (Flight Duty Time Limit) నియమాలను శాస్త్రీయ డేటా ఆధారంగా తయారు చేయడం. పైలట్లకు వెల్నెస్ ప్రోగ్రామ్లు, ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్లుపైలట్ శిక్షణ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలిఎయిర్లైన్స్ సిబ్బంది ప్లానింగ్లో AI ఆధారిత షెడ్యూలింగ్ ఉపయోగించాలిఎయిర్లైన్స్కు స్లాట్ మేనేజ్మెంట్ కఠినంగా అమలు చేయడంవాతావరణ అంచనాల కోసం అధునాతన మెటీరియాలజీ సిస్టమ్లు ఏర్పాటు చేయడంప్రయాణికులకు రియల్-టైమ్ సమాచారం అందించే యాప్లు తీసుకురావాలి. విమాన సర్వీసుల రద్దులపై పెనాల్టీ మెకానిజం తీసుకురావడం. ఎయిర్లైన్స్ బ్యాకప్ క్రూ & బ్యాకప్ విమానాల వ్యవస్థను కలిగి ఉండాలి. చిన్న ఎయిర్లైన్స్కు పన్ను రాయితీలు ఇవ్వాలి.మల్టీ-రన్వే ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయాలి. మెట్రో నగరాల్లో సెకండరీ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలి. కార్గో టెర్మినల్లను ఆధునీకరించాలి. ఎయిర్పోర్ట్లలో సోలార్ ఎనర్జీ వినియోగం.ఎఫ్డీటీఎల్ నిబంధనలు..డీజీసీఏ 2024 జనవరిలో కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జులై నుంచి అమలవుతున్నాయి. రెండో దశ నిబంధనలను నవంబరు 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా పైలెట్లు, కేబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతి నివ్వడం, రాత్రి డ్యూటీలకు సంబంధించినవే. పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు.రాత్రి ల్యాండింగ్ పరిమితులు వారానికి ఆరు నుంచి రెండుకు కుదింపు.‘రాత్రి గంట’లకు కొత్త నిర్వచనం ఇచ్చారు. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకూ సమయాన్ని రాత్రి గంటలుగా పేర్కొన్నారు. పైలెట్లకు వరుసగా రెండు రాత్రి డ్యూటీలు మాత్రమే వేయాలి. విమానయాన సంస్థలు తప్పనిసరిగా అలసట నివేదికలను మూడు నెలలకోసారి సమర్పించాలి.ఇండిగో ఏం చేసింది..మొదటి దశ నిబంధనల్లో ముఖ్యమైనదైన పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలికగానే అమలు చేసింది. రెండోదశలో, రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి ఆరు నుంచి రెండుకు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోల్చితే, తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది. అందుకే రాత్రి పూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులే నిర్వహిస్తోంది. కొత్త నిబంధనల ఫలితంగా పైలెట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబరులోనే 755 విమాన సర్వీసులు రద్దు చేసింది. ఈనెలలో రోజూ వేల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమగ్ర సంస్కరణలు అవసరం..భారత్ ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ను కలిగి ఉంది. కోవిడ్ కారణంగా దేశీయంగా మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ కొద్దినెలలుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ రవాణా కోవిడ్కి ముందు స్థాయిలను చేరుకుంటోంది. భారత పౌర విమానయాన రంగం కేవలం రవాణా వ్యవస్థ కాదు. ఇది దేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమగ్రత, గ్లోబల్ కనెక్టివిటీకి ఎంతో కీలకం. సవాళ్లు ఉన్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తే భారత విమానయాన రంగం స్థిరమైన, సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి వ్యవస్థగా మారుతుంది. భారత విమానయాన రంగం ప్రస్తుతం మార్పు దశలో ఉంది. సవాళ్లను అవకాశాలుగా మార్చే విధాన దృక్పథం, పోటీని ప్రోత్సహించే మార్కెట్ నిర్మాణం, ప్రయాణికుల కేంద్రిత సేవలు ఈ రంగాన్ని మరింత బలపరుస్తాయి. సమర్థవంతమైన నియంత్రణ, పారదర్శకత, దీర్ఘకాలిక ప్రణాళికలతో భారత పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు. భవిష్యత్ విమానయాన రంగం పర్యావరణ అనుకూలత, ఇంధన సామర్థ్యం, హరిత సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా భారత్ ముందడుగు వేస్తే, స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రయాణికులకు భరోసా ఉంటుంది.
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?
గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు
కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల
హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి
‘వారిది వ్యూహాత్మక వివేకం’: రాజ్నాథ్ సింగ్
కోహ్లి, రోహిత్లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!
స్టార్ డైరెక్టర్తో సినిమా.. రూమర్స్పై స్పందించిన అమిర్ ఖాన్..!
సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా
అయ్యప్ప భక్తుల కారు బోల్తా.. పలువురికి గాయాలు
అంధ లెఫ్టినెంట్ కల్నల్ నుంచి వీల్చైర్ మోడల్ వరకు..!
ఇండిగో సంక్షోభం.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్పల ధర్నా
ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరిక
TN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల దుర్మరణం
ఇండిగోకు భారీ ఊరట
కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్
ఇండిగో సంక్షోభంపై పరువు పోగొట్టుకున్న టీడీపీ
పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా?
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
అంతర్జాతీయ మోడల్గా హైదరాబాదీ.. ట్రెండింగ్లో భవితా మండవ
‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
విమాన టికెట్ల ధర పెంపుపై కేంద్రం సీరియస్
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
ఇండిగో సంక్షోభంపై రాహుల్ సంచలన ట్వీట్
భారత్కు రష్యా నిజమైన స్నేహితుడు: మోదీ
బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?
గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు
కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల
హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి
‘వారిది వ్యూహాత్మక వివేకం’: రాజ్నాథ్ సింగ్
కోహ్లి, రోహిత్లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!
స్టార్ డైరెక్టర్తో సినిమా.. రూమర్స్పై స్పందించిన అమిర్ ఖాన్..!
సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా
అయ్యప్ప భక్తుల కారు బోల్తా.. పలువురికి గాయాలు
అంధ లెఫ్టినెంట్ కల్నల్ నుంచి వీల్చైర్ మోడల్ వరకు..!
ఇండిగో సంక్షోభం.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్పల ధర్నా
ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరిక
TN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల దుర్మరణం
ఇండిగోకు భారీ ఊరట
కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్
ఇండిగో సంక్షోభంపై పరువు పోగొట్టుకున్న టీడీపీ
పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా?
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
అంతర్జాతీయ మోడల్గా హైదరాబాదీ.. ట్రెండింగ్లో భవితా మండవ
‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
విమాన టికెట్ల ధర పెంపుపై కేంద్రం సీరియస్
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
ఇండిగో సంక్షోభంపై రాహుల్ సంచలన ట్వీట్
భారత్కు రష్యా నిజమైన స్నేహితుడు: మోదీ
ఫొటోలు
థాయ్ల్యాండ్ ట్రిప్లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)
బిగ్బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు
హోటల్లో 'పాయల్ రాజ్పుత్' బర్త్డే.. ఫోటోలు వైరల్
‘షనెల్’ప్యాషన్ షోలో ఓపెనింగ్ వాక్ చేసిన స్టార్స్ వీళ్లే (ఫోటోలు)
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు ( డిసెంబర్ 07-14)
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాట్లపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి
రేపు హైదరాబాద్కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
#BiggBossTelugu9 ట్రెండింగ్లో 'తనూజ' (ఫోటోలు)
సినిమా
'అది ఫేక్.. దయచేసి అప్రమత్తంగా ఉండండి'..మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన
మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ సోషల్ మీడియా యుగంలో మోసాలు మరింత ఎక్కువయ్యాయి. సైబర్ క్రైమ్స్తో పాటు ధనార్జనే ధ్యేయంగా పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కాల్, ఆడిషన్స్ పేరిట ఏదో ఒక చోట ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. అలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది. నిర్మాత నవీన్ యెర్నేని పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఖాతా మా దృష్టికి వచ్చిందని తెలిపింది. దయచేసి అది నకిలీ ఖాతా అని గుర్తించాలని ప్రజలను కోరింది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చే ప్రతి కాస్టింగ్ కాల్ మా అధికారిక హ్యాండిల్ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని తెలిపింది. మా చిత్రాల పేరు చెప్పుకునే వ్యక్తులు లేదా ఏజెన్సీలతో ఎవరూ సంభాషించవద్దని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు పోస్ట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అలాంటి తప్పుదారి పట్టించే ప్రొఫైల్స్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నామని ట్విటర్ ద్వారా వెల్లడించింది.Every casting call from Mythri Movie Makers will only be announced through our official handle @MythriOfficial. We request everyone not to engage with any individuals or agencies claiming to cast for our films.Additionally, an Instagram account impersonating Mr. Naveen Yerneni…— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2025
రష్మిక ముఖంపై అన్ని రంగులెందుకు?.. ది గర్ల్ఫ్రెండ్ డైరెక్టర్ రిప్లై ఇదే!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్ఫ్రెండ్. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. గతనెల థియేటర్లలో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగానే రాబట్టింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.అయితే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ ఆడియన్స్ను కట్టిపడేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీంతో ఈ మూవీకి థియేటర్ల వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ నెటిజన్ రష్మిక లుక్పై కామెంట్ చేశాడు. క్లైమాక్స్ సీన్లో ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఆమె ముఖం, దుస్తులపై అన్ని రంగులు ఎందుకు? ఇది చాలా పవర్ఫుల్ మూవీనే.. కానీ అర్జున్ రెడ్డికి, ది గర్ఫ్రెండ్కి సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించాడు.నెటిజన్ ప్రశ్నకు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఈ మూవీకి ఏ సినిమాతోనూ సంబంధం లేదన్నారు. ఈ రంగులు ఆమెను సిగ్గుపడేలా, అవమానించడానికి విక్రమ్ ఉపయోగిస్తాడు.. అలా వాటిని స్వీకరించడం నేర్చుకుంది. అది ఆమెలో ఇప్పుడొక భాగమని కూడా తెలుసు.. ఆ అంగీకారమే తనను మరింత బలంగా, అజేయంగా చేసిందన్నారు. ఒకప్పుడు ఇంట్రావర్ట్గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు కళాశాల అందరి ముందు ఈ రంగులతో నిలబడటానికి ఆలోచించదు.. దాన్ని చెప్పడానికి ఉద్దేశించినదే ఆ రంగుల ఎంపిక. సింపుల్గా చెప్పాలంటే మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!అని చెప్పడమేనని రాహుల్ ట్విటర్లో రిప్లై ఇచ్చారు. No buddy… it had nothing to do with any other movie. Vikram uses these colours/paint to shame and humiliate her. She has learnt to embrace it now. She knows it’s a part of her now. That acceptance makes her stronger, invincible even. And for someone who starts out as an… https://t.co/jfdcWe3Zh9— Rahul Ravindran (@23_rahulr) December 7, 2025
నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. థియేటర్లలోకి వచ్చి వీటిని చూసే ప్రేక్షకులు చాలావరకు తగ్గిపోయారు. అదే టైంలో ఓటీటీలో రిలీజైన తర్వాత మాత్రం బాగానే చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలు చిన్న చిత్రాలు కొన్నిసార్లు నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. అలాంటి ఓ తెలుగు థ్రిల్లర్ సినిమానే 'దివ్య దృష్టి'. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రాబోతుంది?'ప్రేమకావాలి' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈషా చావ్లా.. ఓవర్నైట్ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో టాలీవుడ్కి దూరమైపోయింది. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఓ పాత్రలో నటించిందని అంటున్నారు గానీ క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే ఈమె లీడ్ రోల్ చేసిన చిత్రమే 'దివ్యదృష్టి'. సునీల్ విలన్గా నటించాడు. ఈ చిత్రాన్ని ఈనెల 19 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'గుమ్మడి నర్సయ్య'గా శివన్న.. ఎందుకు చేస్తున్నారో తెలుసా?)'దివ్యదృష్టి' టీజర్ బట్టి చూస్తే.. ఓ అమ్మాయికి ప్రమాదవశాత్తూ కళ్లుపోతాయి. అయినా సరే బతుకుతుంది. తర్వాత తన దివ్యదృష్టిని ఉపయోగించి కొన్ని సంఘటనలని ముందుగానే చూస్తుంది. ఇంతకీ ఈమె కళ్లు పోవడానికి కారణమేంటి? ఈమె వెంటపడుతున్న వ్యక్తి ఎవరు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఈ వీకెండ్ ఓటీటీ సినిమాల విషయానికొస్తే రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' నెట్ఫ్లిక్స్లో, కామెడీ మూవీ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' జీ5లో, 'స్టీఫెన్' అనే డబ్బింగ్ చిత్రం నెట్ఫ్లిక్స్లో, సుధీర్ బాబు 'జటాధర'తో పాటు రష్మిక 'థామా' చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 'డీయస్ ఈరే' అనే హారర్ డబ్బింగ్ సినిమా హాట్స్టార్లోకి వచ్చాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్.. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. 'స్టీఫెన్' సినిమా ఓటీటీ రివ్యూ)Every vision is a clue. Every clue is a threat. Divya Dristi, Direct on Sun NXT this Dec 19.@eshachawla63 @suniltollywood @kamalkamaraju @iam_kabirlal @lovelyworldentertainment @IamAjayKSingh#DivyaDristi #SunNxtExclusive #DirectToSunNxt #SunNxt #ThrillerMovie pic.twitter.com/EQXaHmD3Lr— SUN NXT (@sunnxt) December 4, 2025
డేంజర్ జోన్లో బాలీవుడ్ భామలు!
మొన్నటి వరకు వెండితెరపై బాలీవుడ్ భామలదే హవా. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వాళ్లే నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ని సౌత్ బ్యూటీస్ ఏలేస్తున్నారు. రష్మిక, సమంత, నయనతార లాంటి తారలు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంటే.. బాలీవుడ్ భామలు మాత్రం కెరీర్ విషయంలో తడబడుతున్నారు. వరుస అపజయాల కారణంగా పాన్ ఇండియా సినిమాల్లోనే కాదు బాలీవుడ్లోనూ అవకాశాలు రావట్లేదు. ఇక దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లు మాత్రం కండీషన్ల కారణంగా చేతికి వచ్చిన ప్రాజెక్టులను కోల్పోతూ.. కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు.అలియా చేతితో ‘ఆల్ఫా’ ఒక్కటేబాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియాభట్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ స్థాయిలో మరో హిట్ మాత్రం పడలేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం భారీ అంచనాల మధ్య 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్గా నిలిచింది. రూ. 80 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం 32 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలియా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చిత్రంగా మిగిలిపోయింది. దీంతో అలియా చేతికి మరో భారీ ప్రాజెక్టు రాలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఆల్ఫా’ చిత్రం మీదే పెట్టుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో మొదటి ఫీమేల్-లెడ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.హిట్ కోసం కృతి ఎదురుచూపులుబాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఖాతాలో కూడా భారీ హిట్ లేదు. ధనుష్తో కలిసి నటించిన 'తేరే ఇష్క్ మే' ఈ మధ్య రిలీజై హిట్ టాక్ని సంపాదించుకుంది. అయితే కృతి చేతిలో మాత్రం ప్రస్తుతం భారీ ప్రాజెక్టులేవీ లేవు.కియారాకు వరుస షాకులుఅందం, అభినయం ఉన్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరస షాకులు తగులుతున్నాయి.‘భూల్ భులయ్యా 2’ తర్వాత కియరా ఖాతాలో హిట్ అనేదే లేదు. ‘జగ్ జగ్ జియో’ మొదలు గేమ్ ఛేంజర్ వరకు ఇలా ఆమె నటించిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కియరాకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రసుత్తం ఆమె చేతిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా.. వాటిపై పెద్ద అంచాలు అయితే లేవు.‘కండీషన్ల’తో రిస్క్ చేస్తున్న దీపికబాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొణెది విచిత్రమైన పరిస్థితి. మిగతావాళ్లంతా భారీ ప్రాజెక్టులకు కోసం ఎదురు చూస్తుంటే..దీపికా పదుకొణె మాత్రం చేతికి వచ్చిన అవకాశాలను వదులుకొని కెరీర్ని రిస్క్లో పెడుతోంది. స్పిరిట్లో ప్రభాస్కు జోడీగా నటించే అవకాశం మొదట్లో దీపికా పదుకొణెకే వచ్చింది. అయితే ఆమె పెట్టిన పని గంటల కండీషన్ నచ్చక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు నుంచి దీపికను తప్పించాడు. ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.ప్రస్తుతం దీపికా రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి షారుఖ్ ఖాన్ ‘కింగ్’. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరొకటి అల్లు అర్జున్-అట్లీ మూవీ. ఈ రెండింటిపైనే దీపికా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కండీషన్స్ అంటూ దీపికా తన కెరీర్ని ప్రమాదంలోకి తీసుకెళ్తోంది. ఒవైపు సౌత్ స్టార్ల డామినేషన్..మరోవైపు కొత్త భామల దూకుడు కారణంగా ఈ బ్యూటీస్ కెరీర్ డేంజర్ పడింది. బాలీవుడ్లో తమ స్థానాన్ని కాపాడుకోవాలంటే..వీళ్లందరికి అర్జెంట్గా భారీ హిట్ పడాల్సిందే.
క్రీడలు
సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
భారత పురుషల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండేవిధంగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టీమిండియా సారథిగా శుభ్మన్ గిల్ ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ ఏడాది మేలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు జట్గు పగ్గాలను గిల్ చేపట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్కు ముందు వన్డే జట్టు బాధ్యతలను కూడా గిల్కే బీసీసీఐ అప్పగించింది. అంతేకాకుండా టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా గిల్ను ఎంపిక చేశారు.దీంతో రాబోయో రోజుల్లో పొట్టి క్రికెట్లో కూడా గిల్ను సారథిగా నియమించే యోచనలో ఉన్నట్లు ఆర్ధమవుతోంది. అయితే టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్ధానంలో కెప్టెన్గా హార్దిక్ పాండ్యా లేదా జస్ప్రీత్ బుమ్రా ఎంపిక అవుతారని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం జట్టు బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్కు అప్పగించింది. అయితే సూర్యను కెప్టెన్గా ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పు బట్టారు. కానీ సూర్య మాత్రం తన అద్భుత కెప్టెన్సీతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో భారత్ ఆడిన 22 మ్యాచ్లలో కేవలం రెండింట మాత్రమే ఓడిపోయింది.అయినప్పటికి టీ20ల్లో కూడా గిల్ను కెప్టెన్గా చేయాలని చాలా మంది బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్ను కెప్టెన్గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు."సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శుభ్మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. వెంటనే నేను అవునాని సమాధానమిచ్చాను. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి.శుభ్మన్ ఏ ఫార్మాట్లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు నెలల క్రితం అతడు ఇంగ్లండ్లో ఏమి చేశాడో మనమందరం చూశాము. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు" అని 'కెప్టెన్'స్ కామ్' పోడ్కాస్ట్లో దాదా పేర్కొన్నాడు.చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన తన పెళ్లి రద్దు అయినట్లు మంధాన సోషల్ మీడియాలో ప్రకటించింది."గత కొద్ది రోజులగా నా వ్యక్తిగతం జీవితంపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. వాటిపై స్పందించాల్సిన అవసరముంది. నా పెళ్లి రద్దైందని క్లారిటీ ఇస్తున్నా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. దయచేసి ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం దృష్టి అంతా క్రికెట్పైనే ఉంటుంది. భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యమని" ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది.ముచ్ఛల్ ఏమన్నాండంటే?ఇక స్మృతి మంధానాతో తన బంధం ముగిసిందని పలాష్ ముచ్ఛల్ సైతం ధ్రువీకరించాడు. తాము విడిపోవడానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ముచ్ఛల్ తెలిపాడు."నా వ్యక్తిగత సంబంధం నుండి బయటకు వచ్చాను. నా జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. నిరాధారమైన వార్తలను ప్రజలు అంత సులభంగా నమ్మడం చూసి చాలా బాధగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్ట కాలం. కానీ ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటకు వస్తానన్న నమ్మకం ఉంది.ఆధారాల్లేని వదంతులను ప్రచారం చేసేముందు.. ఏది నిజం, ఏది అబద్దమని ఒక్కసారి ఆలోచించుకోవాలి. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నిరాధారమైన వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ముచ్ఛల్ ఇన్స్టాలో రాసుకొచ్చాడు.కాగా ముచ్చల్- స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో తన పెళ్లిని మంధాన వాయిదా వేసుకుంటున్నట్లు ఆమె మేనేజర్ మీడియాతో తెలిపాడు. ఆ తర్వాత ముచ్చల్ కూడా అనారోగ్యంతో అస్పత్రిలో చేరాడు. అయితే మంధాన తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. దీంతో మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్మృతి చేతికి నిశ్చితార్థం రింగ్ లేకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుంది. ఈ నేపథ్యంలోనే మంధాన, ముచ్చల్ ఇద్దరూ తాము విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.చదవండి: సూపర్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం
ముచ్చల్తో వివాహం రద్దైంది.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మంధన
భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మంధన తన వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వివాహం రద్దైందని స్పష్టంగా తెలిపారు. పలాష్ ముచ్చల్ పేరు ప్రస్తావనకు రాకుండా విడుదల చేసిన పోస్ట్లో మంధన ఈ విధంగా రాసుకొచ్చారు.వివాహం రద్దుగత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. కానీ ఇప్పుడు మాట్లాడటం అవసరం. వివాహం రద్దైంది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను.🚨 A STATEMENT BY SMRITI MANDHANA 🚨 pic.twitter.com/HAoHLlSIHt— Johns. (@CricCrazyJohns) December 7, 2025ప్రైవసీ ఇవ్వండిఇదే పోస్ట్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ .. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. మేము మా స్థాయిలో ఈ విషయాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలనుకుంటున్నామని పేర్కొన్నారు.కెరీర్పై దృష్టిమంధన కెరీర్పై దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. నన్ను నడిపించే ఉన్నత లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడం. భారత జట్టుకు విజయాలు అందించడమే నా కర్తవ్యమని పేర్కొన్నారు.అభిమానులకు ధన్యవాదాలు మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చిందంటూ ప్రకటన ముగించారు.కాగా, స్మృతి మంధన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యే మంధన ముచ్చల్తో పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ, గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. చివరికి మంధన పెళ్లి రద్దైందంటూ బాంబు పేల్చింది. మంధన ఇటీవల భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.
సూపర్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం
దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్ సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్ల్లో 136.42 స్ట్రయిక్రేట్తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్ స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్ స్టార్ రోహిత్ శర్మ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్మ్యాన్ ఈ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్ కానీ జైస్వాల్ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.ప్రస్తుతం ఎడిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఈ జట్టుకు నాకౌట్ బెర్త్ ఇదివరకే ఖరారైంది. ఈ ఎడిషన్లో శార్దూల్ ఠాకూర్ నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ స్వయంగా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్ మ్యాచ్ను డిసెంబర్ 8న ఒడిషాతో ఆడనుంది.
న్యూస్ పాడ్కాస్ట్
‘ఇండిగో’ నిర్వాకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల అష్టకష్టాలు... మంచినీళ్లు, ఆహారం కోసం వరద బాధితుల తరహాలో ఫుడ్ కోర్డుల ముందు నిరీక్షణ
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు?. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జీవో సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు... విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ కాలేజీలకు రాష్ట్ర ఖజానా నుంచి వంద కోట్ల రూపాయలు దోచిపెట్టే కుతంత్రం
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధి మాటున భూ దోపిడీ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో వరి రైతుల పరిస్థితి దయనీయం... ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం... దళారుల కనుసన్నల్లోనే ధాన్యం సేకరణ వ్యవస్థ
బిజినెస్
ట్యాక్స్ అయిపోయింది.. ఇక భారీ మార్పులు వీటిలోనే..
భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాటిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇప్పటివరకు ఆదాయ పన్ను రేట్లు, వస్తు..సేవల పన్నుల (జీఎస్టీ) క్రమబద్ధీకరణ తదితర సంస్కరణలను అమలు చేసినట్లు ఆమె వివరించారు. ఇక కస్టమ్స్ డ్యూటీ రేట్లను క్రమబదీ్ధకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దీనిపై ప్రకటనలు ఉండొచ్చని ఆమె వివరించారు. గత రెండేళ్లుగా కస్టమ్స్ సుంకాన్ని తాము గణనీయంగా తగ్గించామని తెలిపారు.అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పోటీతత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్ విధానాల్లో ఆధునీకరణ అత్యవసరమైందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని మంత్రి సూచించారు. సరుకుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడం, పేపర్లెస్ విధానాలను మరింత విస్తరించడం, రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరిచే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతులు, దిగుమతుల సంబంధిత ఖర్చులు తగ్గి దేశీయ పరిశ్రమలకు మరింత అవకాశాలు కలుగుతాయని తెలిపారు.అదేవిధంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశ ర్యాంకును మెరుగుపరిచేందుకు కస్టమ్స్ విభాగం కీలకంగా మారబోతోందని ఆమె అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పారదర్శకమైన, అంచనాలు స్పష్టంగా ఉండే కస్టమ్స్ విధానాలు ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపార వర్గాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనలోకి తీసుకుని రాబోయే బడ్జెట్లో వాటికి అనుగుణంగా విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ఆమె వెల్లడించారు.
‘కొత్త కరెన్సీ వస్తోంది.. డాలర్కు గుడ్బై’
ప్రముఖ ఇన్వెస్టర్, పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. అమెరికా డాలర్ స్థిరత్వం గురించి ఎప్పుడూ విమర్శలు చేసే ఆయన మరోసారి యూఎస్ కరెన్సీ గురించి వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని ప్రకటించాయన్న పుకారు వార్తను ప్రస్తావిస్తూ ఇక అమెరికా డాలర్ పని అయిపోయింది.. ‘‘బై బై యూఎస్ డాలర్’’ అంటూ తన ‘ఎక్స్’ పోస్ట్ లో రాసుకొచ్చారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహం బ్రిక్స్ బంగారం మద్దతు ఉండే "యూనిట్" అనే "డబ్బు"అని ప్రకటించాయి అన్నారు. ‘అప్రమత్తంగా ఉండండి.. నష్టాలపాలవ్వొద్దు’ అని యూజర్లకు సూచించారు.‘నా అంచనా ఏమిటంటే యూఎస్ డాలర్ల పొదుపు చేసేవాళ్లు అత్యంత నష్టపరులు అవుతారు. మీరు యూఎస్ డాలర్లను కలిగి ఉంటే... అధిక ద్రవ్యోల్బణం మిమ్మల్ని తుడిచిపెట్టవచ్చు. నేను నా మంత్రానికి కట్టుబడి ఉన్నాను, బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథర్లను కలిగి ఉన్నాను’ అని రాసుకొచ్చారు.బంగారం, వెండిపై దీర్ఘకాలంగా పెట్టుబడులు పెడుతున్న కియోసాకి.. ఇటీవలి సంవత్సరాలలో బిట్ కాయిన్, ఎథేరియంలను డాలర్ క్షీణత నుంచి కాపాడుకునే ఆస్తులుగా పేర్కొంటున్నారు.BIG BREAKING $ NEWS:BRICS: Brazil, Russia, India, China, South Africa announces the “UNIT”a gold backed “money.”BYE BYE US DOLLAR!!!!!Stand by, stay awake, stay tuned in.DONT BE A LOSERMy forecast is Savers of US dollars biggest losers.If you own US Dollars…. Hyper…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 5, 2025
తక్కువ ధరలో వచ్చేసిన స్మార్ట్ ఫోన్, ట్యాబ్..
రెడ్మీ తాజాగా ‘రెడ్మీ 15సీ’ పేరుతో మరో 5జీ స్మార్ట్ఫోన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. 6.9 అంగుళాల హెచ్డీ అడాప్టివ్సింక్ డిస్ప్లే, డస్ట్ .. వాటర్ రెసిస్టెన్స్, 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, (33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్) దీని ప్రత్యేకతలు.మిడ్నైట్ బ్లాక్, మూన్లైట్ బ్లూ, డస్క్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి రెండేళ్ల ఓఎస్ అప్గ్రేడ్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్లను ఇస్తారు. ధరల విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ రేటు రూ.12,499గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 13,999గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 15,499గా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 వచ్చేసింది దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ భారత్లో తన కొత్త ‘‘గెలాక్సీ ట్యాబ్ ఏ11’’ టాబ్లెట్ను విడుదల చేసింది. ఇందులో 8.7 అంగుళాల స్క్రీన్, 5100ఎంఏహెచ్ బ్యాటరీ, 6 ఎన్ఎం ఆధారిత ఆక్టా–కోర్ ప్రాసెసర్, 5ఎంపీ కెమెరా, 8జీబీ వరకు ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.పెద్ద ఫైల్స్కు తగినంత స్థలాన్ని చేకూర్చుకునేందుకు 128జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్తో 2టీబీ వరకు విస్తరించకోవచ్చు. క్లాసిక్ గ్రే, సిల్వర్ రంగులలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999 (4జీబీ ర్యామ్ + 64జీబీ)కాగా, గరిష్ట ధర రూ.20,999 (8జీబీ ర్యామ్ + 128 బీజీ)గా ఉంది. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లతో పాటు శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
పల్సర్ బైక్ కొత్త వేరియంట్.. మారిపోయింది!
బజాజ్ ఆటో సంస్థ తన పల్సర్ సిరీస్కి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పల్సర్ ఎన్160 కొత్త వేరియంట్ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,23,983గా ఉంది. ఇంజిన్లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ డిజైన్, లుక్లో కీలక మార్పులు చేసింది.పసిడి వర్ణపు అప్సైడ్ డౌన్ (యూఎస్డీ) ఫోర్క్, స్ల్పిట్ సీట్ బదులు సింగిల్ సీట్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, పోలార్ స్కై బ్లూ, బ్లాక్ ఇలా మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. లాంచింగ్ సందర్భంగా బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సరంగ్ కనడే మాట్లాడుతూ ‘‘కస్టమర్ల అభిప్రాయాలు, డిమాండ్లకు అనుగుణంగా, దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ మార్పులను దృష్టిలో పెట్టుకొని గోల్డ్ యూఎస్బీ ఫోర్క్లు, సింగిల్ సీట్తో పల్సర్ ఎన్160ని అప్గ్రేడ్ చేశాము. మరింత మెరుగైన సౌకర్యాన్ని జత చేశాము. ఈ మార్పులు కొత్త తరాన్ని మెప్పిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు.
ఫ్యామిలీ
కథాకళి: వన్ బై టు
గత ఆరేళ్ళుగా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్గా పని చేస్తున్న అద్విత ఆరోజు అంబులెన్స్లో ఓ ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఆ ఇంటి సర్వెంట్ మెయిడ్ చెప్పింది.‘‘అతను మా సార్ డ్రైవర్. వెనక ఔట్ హౌస్లో ఉంటాడు. కారు సిద్ధం చేయమని చెప్పడానికి వెళ్ళి చూస్తే, అపస్మారకంగా కనిపించాడు. సార్కి చెప్తే మీకు ఫోన్ చేయమన్నారు.’’‘‘అతనికి ఎవరైనా ఉన్నారా?’’ ఆమె వెంట నడుస్తూ అద్విత అడిగింది.‘‘లేరు. బ్రహ్మచారి. ‘జీతం బానే వస్తుంది. పెళ్ళి చేసుకోలేదే’మని అడిగితే ఓ నవ్వు నవ్వుతాడు తప్ప జవాబు చెప్పడు.’’స్ట్రెచర్తో ఇద్దరు పేరామెడిక్స్ వారిని అనుసరించారు. సర్వెంట్ మెయిడ్ వాళ్ళని ఫామ్ హౌస్ వెనక ఉన్న పెంకుటింటికి తీసుకెళ్ళింది. అద్విత ఇనుప బద్దీలకి అల్లిన ప్లాస్టిక్ నవారు మంచం మీది సన్నటి పరుపు మీద స్పృహలో లేని రోగిని, ఓ మూల ఉన్న డంబెల్స్ని చూసింది.‘‘ఇతని వయసు తెలుసా?’’ అద్విత అతని బీపీని చూస్తూ అడిగింది.‘‘రాబోయే నెలకి ముప్ఫై ఒకటి వస్తాయి అనుకుంటా.’’‘‘బీపీ బాగా పడిపోయింది. హార్ట్ ఎటాక్. గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఇతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి.’’ స్టెతస్కోప్తో అతని గుండె చప్పుడుని విని, అతనికో ఇంజక్షన్ ఇచ్చి చెప్పింది. ‘‘రోజూ ఎక్సర్సైజ్ చేస్తాడు. చెడ్డ అలవాట్లు లేవు. కాఫీ, టీలు కూడా తాగడు. టీ ఇస్తానంటే, ఒంటరిగా తాగను అంటాడు. ‘నాతో కలిసి తాగు’ అంటే నీతో కాదు అంటాడు. అయినా ఇదేం ఖర్మ?’’‘‘ఈ రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఓ రోగమే. చెడ్డ అలవాట్లు లేని కన్నడ నటుడు శివరాజ్ కుమార్కి చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వచ్చి పోలా?’’అంబులెన్ ్సలో వెళ్ళేప్పుడు అతను కళ్ళు తెరిచి చూసి మూసుకున్నాడు. కాని వెంటనే మళ్ళీ కళ్ళు తెరచి అద్వితని చూశాడు. అతని మొహంలో బలహీనమైన చిరునవ్వు. ఏదో మాట్లాడాడు. కాని అది వినపడకపోవడంతో ఆమె తన చెవిని అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళింది.‘‘నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది.’’ బలహీనంగా వినిపించింది.‘‘ఫర్వాలేదు. భయపడక. నీకేం కాదు.’’ అతని భుజం తట్టి చెప్పింది.‘‘నర్స్గా కాదు సంతోషం.’’హాస్పిటల్కి చేరుకున్నాక అతన్ని ఎమర్జెన్సీ రూమ్కి షిఫ్ట్ చేయడంతో అద్విత బాధ్యత పూర్తయింది.అరగంట తర్వాత ఓ నర్స్ వచ్చి చెప్పింది.‘‘జూనియర్ డాక్టర్గారు నిన్ను రమ్మంటున్నారు.’’అక్కడికి వెళ్ళాక కార్డియాక్ మానిటర్ని చూసి, అతని గుండె ఎంత బలహీనంగా కొట్టుకుంటోందో గ్రహించింది.‘‘ఇతను నీతో మాట్లాడతాడట.’’‘‘మాట్లాడు.’’ ఆమె అతని నోటి దగ్గర తన చెవిని ఉంచి చెప్పింది.‘‘నర్సింగ్ కాలేజ్లో నేను బస్డ్రైవర్గా పని చేసేటప్పుడు నిన్ను చూశాను అద్వితా. రెండుసార్లు నీతో కలసి వన్ బై టు టీ తాగాలని ఉందని చెప్పాను. మూడోసారి నన్ను వేధించకు అన్నావు.’’‘‘ఓ. సారీ. నువ్వు నాకు గుర్తు లేదు.’’‘‘ఇప్పుడు నీతో కలిసి వన్ బై టు టీ తాగాలని ఉంది. ఆ టీ తాగుతూ ‘ఐ లవ్ యు’ అని చెప్పాలనుకున్నాను...’’ అతను రొప్పుతూ చెప్పాడు.‘‘మాట్లాడకు.’’ అద్విత చెప్పింది. జూనియర్ డాక్టర్ వెంటనే కేంటీన్ కి ఫోన్ చేసి వన్ బై టు టీ తీసుకురమ్మని చెప్పాడు. అది వచ్చేలోగా మాటిమాటికీ కార్డియాక్ మానిటర్ని, తలుపుని చూడసాగాడు. టీ వచ్చాక అద్విత ఓ కప్పుని అతని నోటికి అందించింది. అతను ఓ గుక్క తాగి తను చెప్పాలి అనుకున్నది ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు.‘‘అతన్ని ముద్దు పెట్టుకో. తర్వాత ప్రశ్నలు.’’ జూనియర్ డాక్టర్ వెంటనే అరిచాడు.ఆమె ఆ పని చేస్తే సరిదిద్దాడు.‘‘పెదవుల మీద.’’ఆమె అతని పెదవులని తన పెదవులతో చుంబించింది. అతను కళ్ళు తెరచి ఆమె వంక చూశాడు. ఆ కళ్ళల్లో అకస్మాత్తుగా వెలుగు! క్రమంగా అది ఆరిపోయింది. మానిటర్లోని ఆకుపచ్చ గీత స్ట్రైట్ లైన్ గా మారింది. జూనియర్ డాక్టర్ అతని మొహం మీద దుప్పటిని కప్పాడు.రెండు కన్నీటి చుక్కలు ఆ టీ కప్పుల్లో పడ్డాయి.‘‘ఇతను నిన్ను ప్రేమించాడని తెలిస్తే మన పెళ్ళి జరిగేది కాదేమో!’’ జూనియర్ డాక్టర్ అద్వితతో చెప్పాడు.∙∙ అద్విత టీ తాగటం మానేసింది. పూర్తిగా. ఒంటరిగా కూడా. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com
హైహయుల కథ
హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని, రాజ్యాన్ని పాలించేవాడు. కార్తవీర్యార్జునుడి వద్ద భృగువంశ విప్రులు పురోహితులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్తవీర్యార్జునుడు అనేక యజ్ఞయాగాదులు చేశాడు. అతడు చేసిన దానాలతో, అతడి నుంచి అందుకున్న సంభావనలతో భృగువంశీయులందరూ సంపన్నులయ్యారు. కార్తవీర్యార్జునుడు స్వర్గస్థుడయ్యాక హైహయులు నిర్ధనులయ్యారు. ఒకసారి వారికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. హైహయులు సుక్షత్రియులే అయినా, అహం చంపుకొని భృగువంశ పురోహితులను ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. లుబ్ధులైన భార్గవులు లేదు పొమ్మంటూ హైహయులకు మొండిచేయి చూపారు. హైహయులు తమ సంపదను బలవంతంగా దోచుకుంటారేమోనని భయపడిన భార్గవులు తమ వద్దనున్న అపార ధనరాశులను భూమిలో పాతిపెట్టి, తట్టా బుట్టా సర్దుకుని, భార్యా బిడ్డలతో పాటు మహిష్మతీ నగరాన్ని విడిచిపెట్టి, అడవుల్లోకి పారిపోయారు.హైహయులకు ఎక్కడా ధనం దొరకలేదు. మనసు చంపుకొని భార్గవులనే మరోసారి అడుగుదామని వారి ఆశ్రమాలకు వచ్చారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. వారందరూ పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించిన హైహయులు ఇళ్లన్నీ తవ్వారు. అంతులేని ధనరాశులు దొరికాయి. ఈ సంగతి తెలిసిన భార్గవులలో కొందరు లబోదిబోమంటూ తిరిగి తమ ఆశ్రమాలకు వచ్చారు. క్షమించమంటూ హైహయుల కాళ్ల మీద పడ్డారు. తాము సవినయంగా అడిగితే ధనం లేదని చెప్పి, పాతిపెట్టి పారిపోయిన భార్గవులపై హైహయులు మండిపడ్డారు. వారిపై ధనుర్బాణాలను ఎక్కుపెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా మట్టుబెట్టారు. అడవులలో తలదాచుకున్న భార్గవులను వెదికి వెదికి మరీ సంహరించడం ప్రారంభించారు. ఈ బీభత్సానికి భార్గవుల పత్నులు రోదనలు ప్రారంభించారు. హైహయుల మారణకాండ వల్ల చెలరేగిన కలకలానికి, రోదనలకు చుట్టుపక్కల ఆశ్రమాల్లోని మునీశ్వరులు ఏదో దారుణం జరుగుతోందని తలచి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సరికి హైహయులు భార్గవులను ఊచకోత కోస్తూ కనిపించారు. మునిగణమంతా హైహయులకు అడ్డువెళ్లి, వారించారు. విప్రులను వధించడం పాపకృత్యమని, ఈ హింసాకాండను ఇక్కడితో విరమించుకోమని హెచ్చరించారు. మునిగణం వారించడంతో హైహయులు కొంత శాంతించారు. ఆగ్రహావేశాల నుంచి తేరుకుని, పెదవి విప్పారు.‘మునీశ్వరులారా! మీరు మమ్మల్ని నిందిస్తున్నారే గాని, వీరు మా పట్ల చేసిన పాపకృత్యం మీకు తెలియదు. వీరు మా పూర్వీకుల వద్ద పౌరోహిత్యం చేసేవారు. మా పూర్వీకుల నుంచి భూరి దానాలు, సంభావనలు స్వీకరించి ధనాఢ్యులయ్యారు. వీరు విప్రులు కాదు, నయవంచకులు, పరమ లోభులు. మాకు అత్యవసరం ఏర్పడి ధనాన్ని సర్దుబాటు చేయమని సవినయంగా అర్థిస్తే, కనికరమైనా లేకుండా, లేదు పొమ్మన్నారు. పైగా మేమెక్కడ బలవంతం చేస్తామోనని అనుమానించి, ధనరాశులను భూమిలో పాతిపెట్టి, అడవులకు చేరుకున్నారు. కృతజ్ఞత కలిగిన మనుషులు చేయదగిన పనేనా ఇది? వీరిని చంపుతున్నామంటే, చంపమా మరి? వీరికి ఈ ధనరాశులన్నీ మా పూర్వీకుడైన కార్తవీర్యార్జునుడు లోక క్షేమం కోసం యజ్ఞ యాగాదులు చేయమని, తాము సుఖంగా బతకమని, యాచకులకు దానం చేయమని వీరికి అపార ధనరాశులను ఇచ్చాడు. వీళ్లు ఈ మూడింటిలో ఏ ఒక్క పనీ చేయలేదు. పైగా లోభంతో ధనరాశులను భూమిలో పాతిపెట్టారు. పరమ లోభులైన ఈ నీచులను విప్రులు అనవచ్చునా? యజమానుల క్షేమం కోరుకోని వీరు లోకక్షేమాన్ని కాంక్షిస్తారనుకోగలమా? ధనానికి మూడే గతులు. దానం, భోగం, నాశం. దానం చేయక, తాను అనుభవించక ధనం కూడబెట్టిన లోభులు వంచకులు, దండనార్హులు. అందుకే మేము ఈ వంచకులను దండించాం. ఇందులో మా తప్పులేదని మా అభిప్రాయం. దీని గురించి మీరు మాపై కినుక వహించకండి’ అన్నారు.హైహయుల సమాధానానికి మునీశ్వరులెవరూ మారు పలకలేకపోయారు. అయితే, మునిగణం రాకతో హైహయులు ఆగ్రహం నుంచి బయటపడ్డారు. రోదిస్తున్న భార్గవుల పత్నులను ప్రాణాలతో విడిచిపెట్టారు. అప్పటికే భయకంపితులై ఉన్న ఆ స్త్రీలు, ప్రాణాలు దక్కడమే చాలనుకుని, అక్కడి నుంచి బయలుదేరి హిమవంతం చేరుకున్నారు.హిమాలయాలకు చేరుకున్న భార్గవుల పత్నులు కొన్నాళ్లకు భయాందోళనల నుంచి తేరుకున్నారు. వారంతా నదీతీరంలో మట్టితో గౌరీదేవి బొమ్మను చేసి, దీక్షగా అర్చించారు. వారి భక్తికి ప్రసన్నురాలైన దేవి కలలో కనిపించింది. ‘మీలో ఒకరికి ఊరు అంశతో కొడుకు పుడతాడు. అతడే మీ దుఃఖాలను తొలగించగలడు’ అని పలికింది. కొన్నాళ్లకు భార్గవపత్నులలో ఒకరికి తొడలో గర్భం ఏర్పడింది. ఒకనాడు వారు ఉంటున్నవైపు హైహయులు వచ్చారు. వారిని చూసి భార్గవపత్నులు భయకంపితులై పరుగులు తీశారు. హైహయులు వారిని వెంబడించారు. పరుగు తీయలేని ఊరుగర్భిణిని ఖడ్గధారులైన హైహయులు చుట్టుముట్టారు. ఊరుగర్భంలో ఉన్న బాలకుడు తన తల్లి దీనావస్థకు చలించిపోయి, గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. మార్తాండకాంతితో మెరిసిపోతున్న ఆ బాలుడిని చూడటంతోనే హైహయులకు కళ్లు పోయాయి. ఇది పాతివ్రత్య మహిమ అని గ్రహించిన హైహయులు రోదిస్తూ ఆ తల్లి కాళ్ల మీద పడ్డారు. ‘తల్లీ! కనికరించు’ అని ప్రాధేయపడ్డారు. ‘క్షత్రియవీరులైన మీరు నావంటి సామాన్య స్త్రీని ప్రాధేయపడటం తగదు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. తన తాత తండ్రులను చంపినందుకు నా కుమారుడికే మీ మీద కోపంగా ఉంది. ఇతడు జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. అతడే మిమ్మల్ని క్షమించగలడు’ అని చెప్పింది. హైహయులు వెంటనే ఆ బాలుడి పాదాల మీద పడ్డారు. బాలభార్గవుడు ప్రసన్నుడై, వారికి దృష్టి ప్రసాదించాడు. ధర్మబద్ధంగా పాలన సాగించండి అని హితవు చెప్పి, వారిని పంపాడు.సాంఖ్యాయన
పోలీసులూ జైలుకెళ్లారు!!
లంచాలు తీసుకుంటూ చిక్కి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టి, అవకతవకలకు పాల్పడి, నేరాలు చేసి, చివరకు రాజకీయ కక్షసాధింపుల వల్ల– రకరకాల కారణాలతో పోలీసులు జైలు పాలైన ఉదంతాలను వింటుంటాం. కొన్ని కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించడానికి కోర్టు అనుమతితోనూ పోలీసులు జైలు లోపలకు వెళతారు. అయితే ఎలాంటి ఆధారం లేకుండా, అగమ్యగోచరంగా ఉన్న ఓ కేసు దర్యాప్తుకు అవసరమైన సమాచారం సేకరించడానికి అరెస్టైన ఓ పోలీసు అధికారి కొన్ని రోజులు జైల్లో, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీల మధ్య గడిపాడు. ఇది 2007 సెప్టెంబర్లో చోటు చేసుకుంది. గోకుల్చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది. హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీపార్క్ల్లో 2007 ఆగస్టు 25న సాయంత్రం జంట పేలుళ్లు జరిగాయి. అదే రోజు దిల్సుఖ్నగర్లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో మరో పేలని బాంబు పోలీసులకు దొరికింది. ఆ రెండు చోట్లా జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించారు. దాదాపు మూడువందల మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి సరిగ్గా వంద రోజుల ముందు 2007 మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల్ని టార్గెట్గా చేసుకున్న ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి పేలగా, మరోదాన్ని స్వా«ధీనం చేసుకున్న పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ విధ్వంసంలో 11 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు.హైదరాబాద్లో వంద రోజుల వ్యవధిలో రెండు విధ్వంసాలు జరగడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. అప్పటికే మక్కా మసీదు పేలుడు కేసు సీబీఐకి బదిలీ కాగా, గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల కేసు దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో ఉగ్రవాదంపై పట్టున్న అధికారులను డిప్యుటేషన్పై సిక్లో నియమించారు. అప్పటికే ఉగ్రవాద కేసుల్లో అరెస్టయి, బయటకు వచ్చిన వ్యక్తులు, అనుమానితులు, వారి అనుచరులు– ఇలా వందల మందిని అదుపులోకి తీసుకున్న సిక్ – వీరి విచారణ కోసం హైదరాబాద్ శివార్లలోని అనేక గెస్ట్ హౌస్లు, ఫామ్హౌస్లు ఇంటరాగేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు ఎలాంటి ఆధారం చిక్కలేదు. భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది.ఆధారాలు దొరక్కపోవడంతో సిక్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. అప్పట్లో హైదరాబాద్లోని జైళ్లల్లో ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అప్పటికే రిమాండ్లో ఉన్న ఉగ్రవాదులను కలవడానికి వారి సంబంధీకులు వచ్చిపోతుండే వాళ్లు. ఈ పరిణామాలను గమనించిన ఓ పోలీసు అధికారికి ఓ ఆలోచన వచ్చింది. గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సంబంధించిన సమాచారం ఏదైనా జైల్లో ఉన్న ఉగ్రవాదులకు తెలిసే అవకాశం ఉంటుందని భావించారు. జైల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నారు. ఈ ఆలోచన బాగానే ఉన్నా, వారిని ప్రశ్నించడం ఎలా అన్నదే ఎవరికీ అంతుచిక్కలేదు. న్యాయస్థానం అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లి ప్రశ్నించలేరు. కస్టడీలోకి తీసుకోవడానికి వారిపై ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేవు. పిటిషన్లు వేసినా, పెద్ద సంఖ్యలో ఖైదీలను ప్రశ్నించడానికి కోర్టు అనుమతి లభించదు. ఇవన్నీ బేరీజు వేసిన ఓ అధికారికి వచ్చిన ఆలోచనే– నమ్మకమైన సమర్థుడైన పోలీసు అరెస్టు. ఉగ్రవాదులు నమ్మే వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసుకుని, ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడానికి ఉన్నతాధికారులూ అంగీకరించారు. అంతే.. సిక్లో ఉన్న అధికారులంతా తమ వద్ద పని చేసిన, చేస్తున్న వారిలో అలాంటి పోలీసు కోసం వెతికారు. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో పని చేస్తున్న ఓ పోలీసు దీనికి సమర్థుడని అంతా అంగీకరించారు. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి పోలీసు సిద్ధంగా ఉన్నా, జైలులోకి ఎలా పంపాలన్న దానిపై భారీ తర్జనభర్జన జరిగింది. చివరకు గుడుంబా ప్యాకెట్లు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై హైదరాబాద్లోని ఓ పోలీసుస్టేషన్లో ఆ పోలీసుపై కేసు నమోదు చేయించారు. అందులో అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా పంపారు. ఆ పోలీసు దాదాపు 15 రోజులు జైల్లో ఉండి సమాచార సేకరణకు ప్రయత్నించారు. జైల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిక్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చాకచక్యంగా జైల్లో గడిపిన సదరు పోలీసు అధికారి, ఈ పేలుళ్లపై వారికి ఎలాంటి సమాచారం లేదని నిర్ధారించుకున్నాక బెయిల్పై బయటకు వచ్చారు. ఆపై ఈ కేసులు ఆక్టోపస్కు బదిలీ కావడంతో సిక్ కథ ముగిసింది. దీంతో ‘జైలుకు వెళ్లిన పోలీసు’ తాను పని చేసే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆపై కొన్నాళ్లకు నాటకీయ పరిణామాల మధ్య ఆ గుడుంబా కేసు క్లోజ్ అయింది. కొన్నాళ్లకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్ జంట పేలుళ్లకు కారణమని తెలిసింది. 2007 సెప్టెంబరు 13న ఢిల్లీలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికీ ఐఎం బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులను దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిందితుల షెల్టర్ గుర్తించారు. అక్కడి జామియానగర్లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్లో 2008 సెప్టెంబర్ 15న జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు పట్టుబడ్డారు. ఈ ఉదంతంతో ఐఎం డొంక కదిలింది. ఈ ఆధారాలతో ముందుకు వెళ్లిన ముంబై క్రైమ్ బ్రాంచ్ దేశ వ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిక్ డీల్ చేసిన కేసులు కొలిక్కి వచ్చాయి. వీరిని పీటీ వారెంట్లపై తీసుకువచ్చి అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన ఐదుగురిలో అనీఖ్, అక్బర్లపై 2018 సెప్టెంబర్ 4న నేరం రుజువైంది. వీరికి అదే నెల 10న ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.శ్రీరంగం కామేష్
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్కు సహాయం అందించాడు. తరువాత మెషిన్గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్
అంతర్జాతీయం
త్వరలో భారత్కు ఇజ్రాయిల్ నుంచి 40 వేల ఎల్ఎమ్జీలు..
త్వరలో భారత్కు 40 వేల లైట్ మెషీన్ గన్లు సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ సంస్థ సిద్ధమవుతోంది. ఇరుదేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్కి చెందిన (Israel Weapon Industries (IWI) సంస్థ భారత్కు లైట్ మెషిన్ గన్స్ సరఫరా చేయడానికి రెడీ అయ్యింది. ఈ సరఫరా 2026 ఆరంభం నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుండి 40,000 లైట్ మెషిన్ గన్స్ (ఎల్ ఎంజీ) మొదటి బ్యాచ్ ను భారతదేశానికి పంపిణీ చేయడం ప్రారంభిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాన రక్షణ సంస్థ తెలిపింది.ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యూఐ) సీఈవో షుకీ స్క్వార్ట్జ్ మాట్లాడుతూ భారతదేశంలో పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్ గన్లు వంటి ఆయుధాల అమ్మకంపై భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన అనేక ఏజెన్సీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు."మేము ప్రస్తుతం మూడు పెద్ద కార్యక్రమాలలో పాల్గొంటున్నాము. మొదటిది గత సంవత్సరం సంతకం చేసిన 40 వేల లైట్ మెషిన్ గన్ల ఒప్పందం. మేము అన్ని పరీక్షలు, ప్రభుత్వ దర్యాప్తులను పూర్తి చేశాం. ఉత్పత్తి చేయడానికి మాకు లైసెన్స్ వచ్చింది. మేము సంవత్సరం ప్రారంభంలో మొదటి సరుకును పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నాం’ అని తెలిపారు. లైట్ మెషీన్ గన్స్( LMG) సరఫరా ఐదేళ్ల పాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇంతకంటే త్వరగా సరఫరా చేయగలనని, అయితే మొదటి లాట్ సంవత్సరం ప్రారంభంలో పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు. కార్బైన్ కోసం టెండర్ అని చెప్పారు. ఇందులో కంపెనీ రెండో అత్యధిక బిడ్ వేలం వేయగా, 'భారత్ ఫోర్జ్' ప్రధాన బిడ్డర్గా నిలిచింది. మేము ఈ ఒప్పందంలో 40 శాతం సరఫరా చేయాలనుకుంటున్నాము. మేము ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు దశలో ఉన్నాం. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో పూర్తవుతుందని నేను భావిస్తున్నాను.సీక్యూబీ కార్బైన్లో 60 శాతం భారత్ ఫోర్జ్ సరఫరా చేయనుంది, మిగిలిన 40 శాతం (1,70,000 యూనిట్లు) అదానీ గ్రూప్ కంపెనీ పీఎల్ఆర్ సిస్టమ్స్ సరఫరా చేస్తుంది’ అని స్పష్టం చేశారు. అర్బెల్ టెక్నాలజీ గురించి స్క్వార్ట్జ్ మాట్లాడుతూ, ‘ ఇది కంప్యూటరైజ్డ్ ఆయుధ వ్యవస్థ, దీనిలో ఒక సైనికుడు సరైన లక్ష్యంలో ఉన్నప్పుడు సంక్లిష్టమైన అల్గోరిథం గుర్తిస్తుంది మరియు ఆపై గొప్ప వేగం మరియు ఖచ్చితత్వంతో కాల్పులు జరుపుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశాన్ని అనుసంధానించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు."అర్బెల్ టెక్నాలజీని అవలంబించడానికి మేము వివిధ ఏజెన్సీలతో ప్రారంభ చర్చలు జరుపుతున్నాం వారు దానిని తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, మేము దానిని ఇజ్రాయెల్తో పాటు భారతదేశంలో సంయుక్తంగా తయారు చేసి సరఫరా చేస్తాం పిఎల్ఆర్ సిస్టమ్స్ భారతదేశంలో ఈ సహ-ఉత్పత్తిని నిర్వహిస్తుంది’ అని తెలిపారు.ఎందుకు ఇది ముఖ్యమైంది?భారత రక్షణ సామర్థ్యం పెరుగుతుంది: కొత్త తరం LMGలు సైనికులకు అధునాతన ఫైర్పవర్ అందిస్తాయి.ఇజ్రాయెల్-భారత్ రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి: ఇజ్రాయెల్ ఇప్పటికే భారత్కు డ్రోన్లు, రాడార్లు ఇతర రక్షణ సాంకేతికతలు అందిస్తోంది. ఈ ఒప్పందం భారత్కి రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ఇజ్రాయెల్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుస్తుంది.
రోజూ వెళ్లే జిమ్మే... కానీ క్షణాల్లోనే అంతా అయిపోయింది!
బ్రెజిల్కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి జిమ్ చేస్తూ కన్నుమూసిన ఘటన విషాదాన్ని నింపింది.బ్రెజిల్లోని ఒలిండా నగరంలో ఉన్న ఒక జిమ్లో రొనాల్డ్ మోంటెనెగ్రో కసరత్తు చేస్తున్నాడు. రోజూ వ్యాయామం చేసే జిమ్లోనే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్లోని ఈశాన్య తీరంలోని రెసిఫే నగరానికి సమీపంలోని ఒలిండాలో ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. రోనాల్డ్ మోంటెనెగ్రో బెంచ్ ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బార్బెల్ జారి ఛాతీపై పడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. బార్బెల్ జారి బార్బెల్ ఛాతీపై పడింది. దీని తర్వాత తొలుత లేచాడు కానీ సెకన్లలోనే కుప్పకూలిపోయాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తుచేశారు. ఇది ఒక ప్రమాదమని ప్రాథమికంగా భావించారు.☠️A Brazilian man lost control of a barbell and died right in the gymHe was using an unsafe grip — without wrapping his thumb around the bar. It slipped, crashed onto his chest, and the impact caused his heart to stop.👍Gym lovers, watch your thumbs — it might literally save… pic.twitter.com/mSEiq5vdqj— NEXTA (@nexta_tv) December 4, 2025 దీనికి సంబంధించిన వీడియెనెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు.స్పాటర్ ఉండటంఅందుకే చాలా ముఖ్యం! ఇలాంటివి చేసేటపుడు ట్రైనర్ కచ్చితంగా ఉండాలని కొందరు విచారం వ్యక్తం చేశారు. అయ్యో.. కొన్ని సెకన్లలోనే జీవితం మారి పోయింది అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు మోంటెనెగ్రో పని చేసే పలాసియో డోస్ బోనెకోస్ గిగాంటెస్ మ్యూజియం, ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జిమ్, RW అకాడెమియా కూడా దాని సోషల్ మీడియాలో విచారాన్ని వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తే
ట్రంప్కే ‘ఫిఫా’ తొలి శాంతి బహుమతి ఎందుకంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్లే.. శాంతి బహుమతి వరించింది. నోబెల్ కాదు.. ఫిఫా శాంతి బహుమతి రూపంలో. ఈ ఏడాదే ప్రారంభమైన తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని శాంతిదూత ట్రంప్కు ప్రకటిస్తున్నట్లు ఫిఫా పేర్కొంది. అవార్డు అందుకుంటూ ట్రంప్ కూడా ఖుషీ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే, ఈ శాంతి బహుమతి ట్రంప్నకు ఇవ్వడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది.ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్-2026 (FIFA World Cup 2026) పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ట్రంప్.. బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు. ఇందుకు గాను ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్నకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.కాంగో-రువాండా ఘర్షణలు ఏంటి? కాంగో-రువాండా ఘర్షణలు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) తూర్పు ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఇది ఖనిజ సంపద, 1994 రువాండా మారణహోమం, రువాండా మద్దతుగల M23 తిరుగుబాటుదారుల కార్యకలాపాలతో ముడిపడి ఉంది. DRC తూర్పు ప్రాంతంలో కోబాల్ట్, బంగారం వంటి విలువైన ఖనిజాలు ఉండటం, వాటిపై నియంత్రణ కోసం కాంగో-రువాండా మధ్య పోరాటం కొనసాగుతోంది. 1994 రువాండా మారణహోమం తర్వాత హుటు, టుట్సీ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. DRCలోకి శరణార్థులు తరలి వెళ్లడం ఎక్కువైంది. ఈ క్రమంలో రువాండా మద్దతుతో ఉన్న M23 వంటి సాయుధ సమూహాలు, DRC ప్రభుత్వంతో పోరాడటం ప్రారంభమైంది. దీంతో, రెండు వర్గాల మధ్య పొరుగు దేశాల జోక్యం, ఆయుధాల సరఫరా, ప్రాంతీయ ప్రయోజనాలు తెరపైకి వచ్చాయి. అంతర్గత పోరు, దాడుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది మరణించారు. లైంగిక హింస వంటివి విపరీతంగా పెరిగాయి. ముఖ్యమైన ఖనిజాలపై నియంత్రణ లేకపోవడంతో దోపిడీ జరిగింది.ఇటీవలి పరిణామాలు (2022-2025):శాంతి చర్చలు: కెన్యా, అంగోలా ద్వారా చర్చలు విఫలం కాగా, 2024లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.US-ఖతార్ ఒప్పందం: జూన్ 2025లో అమెరికా(డొనాల్డ్ ట్రంప్), ఖతార్ మధ్యవర్తిత్వంతో ఒక చారిత్రక శాంతి ఒప్పందంపై సంతకం జరిగింది. ఇందులో సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం, శరణార్థులను పునరావాసం కల్పించడం వంటివి ఉన్నాయి.M23తో ఒప్పందం: నవంబర్ 2025లో M23 తిరుగుబాటుదారులు, DRC ప్రభుత్వం దోహాలో ఒక ఒప్పందంపై సంతకం చేసి, శాంతికి ఒక రోడ్మ్యాప్ను రూపొందించారు. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందాలు కుదిరినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు DRCలో పోరాటాలు ఉద్రికత్తలకు దారి తీశాయి. M23.. గోమా వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.M23 గ్రూప్..2012లో M23 గ్రూప్ ఏర్పడింది.ఇది కాంగోలోని టుట్సీ వర్గానికి చెందిన మాజీ CNDP తిరుగుబాటు దళాల నుండి విడిపోయిన గ్రూప్.2009లో కాంగో ప్రభుత్వం CNDPతో ఒక శాంతి ఒప్పందం (March 23 Agreement) కుదుర్చుకుంది.ఆ ఒప్పందంలోని నిబంధనలు అమలు కాలేదని ఆరోపిస్తూ, తిరుగుబాటు దళాలు “March 23 Movement (M23)” పేరుతో కొత్త గ్రూప్ను ఏర్పాటు చేశాయి.2012–2013 తిరుగుబాటుM23 తూర్పు కాంగోలో వేగంగా ఎదిగిందిగోమా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఇది పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది.అంతర్జాతీయ ఒత్తిడి, ఐక్యరాజ్యసమితి దళాల జోక్యంతో 2013లో M23 ఓడిపోయింది.నాయకులు రువాండా, ఉగాండా వంటి దేశాలకు పారిపోయారు.2021 తర్వాత మళ్లీ పునరుద్ధరణ2021 చివరలో M23 మళ్లీ చురుకుగా మారింది.2022–2025 మధ్య ఈ గ్రూప్ తూర్పు కాంగోలో పెద్ద ఎత్తున దాడులు చేసింది.కాంగో ప్రభుత్వం రువాండా ఈ గ్రూప్కు మద్దతు ఇస్తోంది అని ఆరోపిస్తోంది.రువాండా మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.2025లో కూడా M23 గోమా, కిట్షంగా, బుకావు వంటి ప్రాంతాల్లో యుద్ధం కొనసాగిస్తోంది.M23 గ్రూప్ లక్ష్యాలుటుట్సీ వర్గాల రక్షణకాంగో ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి2009 ఒప్పందం అమలు చేయించుకోవడంతూర్పు కాంగోలో తమ ప్రభావాన్ని పెంచుకోవడం.ట్రంప్ ఏమన్నాడంటే.. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడమే నా లక్ష్యం. అవార్డులతో సంబంధం లేకుండా నా పని నేను చేస్తున్నాను. నా దౌత్యంతో యుద్ధాలను ఆపాను.. లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ. కాంగో-రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాను. ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని సైతం నేనే ఆపాను. నా చర్యలతో ఎన్నో దేశాల మధ్య యద్ధాలు ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయి. ఇది నాకు ఎంతో గర్వకారణం. ఈ అవార్డు పొందడం జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటి’ అని వ్యాఖ్యలు చేశారు.#FIFAWorldCup 🇺🇸 Trump just won the FIRST-EVER FIFA Peace Prize!Golden globe for the man bringing REAL peace. Nobel said no… FIFA said HELL YES! America leads, the world heals 🔥🏆Who’s with President Peace?! Drop a 🇺🇸#MAGA pic.twitter.com/j1K98OaTra— TRUTH🕊️ (@HonestHalo) December 5, 2025ఈ ఏడాదే ప్రారంభం.. ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే శాంతి బహుమతిని ఇవ్వడం ప్రారంభించింది. తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్టు నవంబర్ 5న ప్రకటించింది. ఈ క్రమంలో శాంతి బహుమతి.. ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరఫున అందజేసేదిగా గియాని అభివర్ణించారు. ఫిఫాకు ఇదొక గుర్తింపు అని చెప్పారు. విమర్శల వర్షం.. ట్రంప్నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాట్ సంస్థ ఫిఫాపై బహిరంగాంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది. ఇక, ట్రంప్.. కాంగో-రువాండా మధ్య శాంతి నెలకొల్పినట్టు చెబుతున్నప్పటికీ అక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ లేకపోవడం గమనార్హం. మరోవైపు.. యుద్ధాలను ఆపుతున్నట్టు ట్రంప్ చెప్పినా.. భారత్-పాక్ మధ్య ఆయన ప్రమేయమే లేదని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడం ట్రంప్ ఇప్పటికీ విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిఫా శాంతి బహుమతిని (FIFA Peace Award) ట్రంప్కు ఇవ్వడంపై విమర్శలు పెరిగాయి. అసలు ట్రంప్కు అంత సీన్ ఉందా? అని పలువురు విశ్లేషకులు, నెటిజన్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
భారత్, చైనాలు మా సన్నిహిత మిత్రులు
బీజింగ్: భారత్, చైనాలు తమకు సన్నిహిత మిత్రదేశాలంటూనే ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించింది. పుతిన్ భారత్ పర్యటనకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వని చైనా ఈ విషయాన్ని మాత్రం హైలైట్ చేసుకుంది. రష్యాకు ఇటీవలి కాలంలో బాగా దగ్గరైన చైనా భారత్లో పుతిన్ పర్యటనపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘భారత్, చైనా రెండు కూడా మాకు సన్నిహిత మిత్రులే. ఆ సంబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం.ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు మాకుందని నేను భావించడం లేదు’అని పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్, చైనా నేతలు తమ మధ్య ఉన్న అత్యంత సున్నితమైనవి సహా అన్ని విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నారు. వీటిపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరేలా ఇద్దరు నేతలు ప్రయతి్నస్తారని నమ్మకం ఉంది. అదే సమయంలో, ఆ సమస్యలు రెండు దేశాలకు సంబంధించినవి అయినందున రష్యాకు కలుగజేసుకునే హక్కు లేదు’అని ఆయన చెప్పిన విషయాన్ని చైనా మీడియా ప్రస్తావించింది. రష్యాతో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా ఉన్న చైనా.. భారత్, రష్యాలు దగ్గరవడంపై మాత్రం అసహనంతో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.చైనాతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకుంటూనే, భారత్తోనూ ఎప్పటిలాగానే మైత్రిని కొనసాగించారు పుతిన్. 2020లో లద్దాఖ్లో ఉద్రిక్తతల సమయంలోనూ ఇదే విధమైన బ్యాలెన్స్ను పుతిన్ కొనసాగించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దీంతోపాటు, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడులపై పుతిన్ చేసిన వ్యాఖ్యలను కూడా చైనా మీడియా ప్రస్తావించింది. తమ నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అమెరికాకు, భారత్ చమురు కొనడంపై ఎందుకు అభ్యంతరమని పుతిన్ ప్రశ్నించారని కూడా తెలిపింది. ప్రస్తావించాల్సిన అంశమేమంటే..భారత్లో పర్యటనకు కొద్దిరోజుల ముందే చైనా, రష్యాలు ఆసియా పసిఫిక్తోపాటు పొరుగుదేశాల్లో భద్రతా పరమైన ప్రయోజనాలే లక్ష్యంగా వ్యూహాత్మక చర్చలు జరపడం..!
జాతీయం
అమ్మ మీ అల్లుడు తేడా.. సంసారానికి పనికి రాడు..!
బెంగళూరు: సంసారం చేయడం లేదు, అలాగే పురుషత్వ పరీక్షకు ఒప్పుకోకుండా పరారైన భర్త ఉదంతం నెలమంగలలో జరిగింది. బెంగళూరు హెసరఘట్ట నివాసి అయిన యువతి (26)కి, నెలమంగలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అయిన వరునితో (30) గత జూన్ 9న వివాహం జరిగింది. మొటి రాత్రే భర్త అంటీముట్టనట్టుగా ప్రవర్తించినా, గొడవ కాకూడదని ఆమె అలాగే సంసారం నెట్టుకొస్తోంది. ఆరు నెలలు గడిచినా నెల తప్పలేదని అత్తమామలు ఆమెను వేధించడంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అన్ని రిపోర్టులు మామూలుగా వచ్చాయి, అయితే భర్త మాత్రం పురుషత్వ పరీక్ష అనగానే ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. భర్త చేత పురుషత్వ పరీక్ష చేయించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారం చేయడం లేదని అడిగినందుకు అదనపు కట్నం పేరుతో భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపింది.
గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
గోవాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు మోదీ పేర్కొన్నారు. కేంద్రం మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం అధికారులతో కలిసి పరిశీలించారు. బిర్స్ నైట్ క్లబ్ సరైన నిబంధనలు పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలిందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా 50 మందికి తీవ్రగాయాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితా వారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి సహాయక చర్యలు ప్రారంభించాయి.
ఏవియేషన్ డే: ఇండిగో తరహా సంక్షోభాలు మున్ముందు ఎదురైతే..
భారత్లోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన సేవలు ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపుతోంది. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా పెళ్లిళ్లూ రద్దవుతున్నాయి. దీంతో, ఇండిగో యాజమాన్యం తీరుపై జనం నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని సగటు ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నాడు..అయితే, ఇండిగో తన దగ్గర ఉన్న పరిమిత సిబ్బంది, పైలెట్లతోనే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ రాత్రి పూట నడిపే సర్వీసులు సైతం అధికంగా ఉన్నాయి. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థ చేరవేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విమానయాన సంస్థలు సైతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.పౌర విమానయాన రంగంలో కీలక సవాళ్లు..1. అధిక ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ఖర్చులుభారతదేశంలో ATF ధరలు GST పరిధిలోకి రాకపోవడంతో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. విమానయాన నిర్వహణ ఖర్చులలో ఇంధన వాటా 30–40% ఉంటుంది. దీనివల్ల టిక్కెట్లు ఎక్కువగా ఉన్నాయి. మార్జిన్లు తక్కువగా ఉంటాయి. ఇంధన ఖర్చులను తగ్గించడానికి పరిశ్రమ చాలా కాలంగా ATFని GST కింద చేర్చాలని డిమాండ్ చేస్తోంది.2. మౌలిక సదుపాయాల అడ్డంకులుదేశ ప్రయాణీకుల రద్దీ ప్రతీ ఏటా పెరుగుతోంది. 120 మిలియన్ల నుండి 236 మిలియన్లకు పెరిగింది. విమానాశ్రయాలు కూడా 74 నుండి దాదాపు 160కి రెట్టింపు అయ్యాయి. ఎయిర్పోర్టుల విస్తరణ ఉన్నప్పటికీ ప్రధాన విమానాశ్రయాలలో (ఢిల్లీ, ముంబై, బెంగళూరు) రద్దీ మాత్రం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ప్రాంతీయ కనెక్టివిటీ (UDAN పథకం) విస్తరిస్తున్నప్పటికీ చిన్న విమానాశ్రయాలు నిధులు, కార్యాచరణ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. చిన్న విమానయాన సంస్థలు మనుగడ కోసం కష్టపడుతున్నాయి3. స్థిరత్వం, కార్బన్ నియమాలు2027 నుండి ICAO యొక్క CORSIA కార్బన్ ఆఫ్సెట్ పథకాన్ని భారతదేశం పాటించాలి. ప్రభుత్వం స్థిరమైన విమాన ఇంధనం (SAF) మిశ్రమ లక్ష్యాలను నిర్దేశించింది. కానీ SAF ఖరీదైనది, పరిమితమైనంది. లాభదాయకతను సమతుల్యం చేస్తూ ఉద్గారాలను తగ్గించడానికి విమానయాన సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.4. సైబర్ భద్రతా ప్రమాదాలుఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన GPS స్పూఫింగ్ సంఘటనలు నావిగేషన్ వ్యవస్థలలోని భద్రతలేమిని హైలైట్ చేశాయి. డిజిటల్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ బెదిరింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి భారత్ GNSS సలహాదారులను, మెరుగైన పర్యవేక్షణను అమలు చేస్తోంది.5. పైలట్ల కొరత.. దేశంలో ముఖ్యంగా పైలట్ల కొరత అధికంగా ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలెట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.పరిష్కారాలు..దేశంలో కొత్త ఫ్లయింగ్ అకాడమీలు ఏర్పాటు చేయడంపైలట్ శిక్షణలో PPP మోడల్ ప్రవేశపెట్టడంFDTL (Flight Duty Time Limit) నియమాలను శాస్త్రీయ డేటా ఆధారంగా తయారు చేయడం. పైలట్లకు వెల్నెస్ ప్రోగ్రామ్లు, ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్లుపైలట్ శిక్షణ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలిఎయిర్లైన్స్ సిబ్బంది ప్లానింగ్లో AI ఆధారిత షెడ్యూలింగ్ ఉపయోగించాలిఎయిర్లైన్స్కు స్లాట్ మేనేజ్మెంట్ కఠినంగా అమలు చేయడంవాతావరణ అంచనాల కోసం అధునాతన మెటీరియాలజీ సిస్టమ్లు ఏర్పాటు చేయడంప్రయాణికులకు రియల్-టైమ్ సమాచారం అందించే యాప్లు తీసుకురావాలి. విమాన సర్వీసుల రద్దులపై పెనాల్టీ మెకానిజం తీసుకురావడం. ఎయిర్లైన్స్ బ్యాకప్ క్రూ & బ్యాకప్ విమానాల వ్యవస్థను కలిగి ఉండాలి. చిన్న ఎయిర్లైన్స్కు పన్ను రాయితీలు ఇవ్వాలి.మల్టీ-రన్వే ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయాలి. మెట్రో నగరాల్లో సెకండరీ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలి. కార్గో టెర్మినల్లను ఆధునీకరించాలి. ఎయిర్పోర్ట్లలో సోలార్ ఎనర్జీ వినియోగం.ఎఫ్డీటీఎల్ నిబంధనలు..డీజీసీఏ 2024 జనవరిలో కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జులై నుంచి అమలవుతున్నాయి. రెండో దశ నిబంధనలను నవంబరు 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా పైలెట్లు, కేబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతి నివ్వడం, రాత్రి డ్యూటీలకు సంబంధించినవే. పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు.రాత్రి ల్యాండింగ్ పరిమితులు వారానికి ఆరు నుంచి రెండుకు కుదింపు.‘రాత్రి గంట’లకు కొత్త నిర్వచనం ఇచ్చారు. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకూ సమయాన్ని రాత్రి గంటలుగా పేర్కొన్నారు. పైలెట్లకు వరుసగా రెండు రాత్రి డ్యూటీలు మాత్రమే వేయాలి. విమానయాన సంస్థలు తప్పనిసరిగా అలసట నివేదికలను మూడు నెలలకోసారి సమర్పించాలి.ఇండిగో ఏం చేసింది..మొదటి దశ నిబంధనల్లో ముఖ్యమైనదైన పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలికగానే అమలు చేసింది. రెండోదశలో, రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి ఆరు నుంచి రెండుకు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోల్చితే, తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది. అందుకే రాత్రి పూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులే నిర్వహిస్తోంది. కొత్త నిబంధనల ఫలితంగా పైలెట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబరులోనే 755 విమాన సర్వీసులు రద్దు చేసింది. ఈనెలలో రోజూ వేల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమగ్ర సంస్కరణలు అవసరం..భారత్ ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ను కలిగి ఉంది. కోవిడ్ కారణంగా దేశీయంగా మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ కొద్దినెలలుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ రవాణా కోవిడ్కి ముందు స్థాయిలను చేరుకుంటోంది. భారత పౌర విమానయాన రంగం కేవలం రవాణా వ్యవస్థ కాదు. ఇది దేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమగ్రత, గ్లోబల్ కనెక్టివిటీకి ఎంతో కీలకం. సవాళ్లు ఉన్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తే భారత విమానయాన రంగం స్థిరమైన, సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి వ్యవస్థగా మారుతుంది. భారత విమానయాన రంగం ప్రస్తుతం మార్పు దశలో ఉంది. సవాళ్లను అవకాశాలుగా మార్చే విధాన దృక్పథం, పోటీని ప్రోత్సహించే మార్కెట్ నిర్మాణం, ప్రయాణికుల కేంద్రిత సేవలు ఈ రంగాన్ని మరింత బలపరుస్తాయి. సమర్థవంతమైన నియంత్రణ, పారదర్శకత, దీర్ఘకాలిక ప్రణాళికలతో భారత పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు. భవిష్యత్ విమానయాన రంగం పర్యావరణ అనుకూలత, ఇంధన సామర్థ్యం, హరిత సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా భారత్ ముందడుగు వేస్తే, స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రయాణికులకు భరోసా ఉంటుంది.
అంబేడ్కర్కు ఘనంగా నివాళి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన 69వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రేరణ స్థల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరై బాబా సాహెబ్ అంబేడ్కర్కు పుష్పాంజలి ఘటించారు. ‘మహా పరినిర్వాణ్ దివస్ సందర్భంగా భారత రత్న, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్కు సవినయంగా నివాళులరి్పస్తున్నాను’అని ఉపరాష్ట్రపతి ఎక్స్లో పేర్కొన్నారు. ‘డాక్టర్ అంబేడ్కర్ దార్శనికత కలిగిన నేత, న్యాయం, సమానత్వం కోసం ఆయన ఎంతో అంకితభావంతో పనిచేశారు’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చైత్యభూమిపై పూలజల్లు మహా పరినిర్వాణ్ దినాన్ని పురస్కరించుకుని ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ చైత్యభూమి వద్దకు శనివారం వేలాదిగా తరలివచ్చారు. అంబేడ్కర్కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎంసీ ఫొటో ఎగ్జిబిషన్ను నిర్వహించింది. చైత్యభూమిపై హెలికాప్టర్ ద్వారా పూలజల్లు కురిపించారు. భారత రాజ్యాంగం ప్రతులను పంచిపెట్టారు. బీఎంసీ ఈ కార్యక్రమం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
ఎన్ఆర్ఐ
సింగపూర్లో కార్తీకమాస స్వరారాధన
సింగపూర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారథి", ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం "కార్తీకమాస స్వరారాధన" అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కానీ ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయం" అని తెలియజేశారు.డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.సంస్థ ప్రధాన నిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా, సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం.కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది. (చదవండి: జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు)
ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం:లక్ష్మీపార్వతి
సిడ్నీ: వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు.
అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి
ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతిపై అమెరికాలో ఘన నివాళి అర్పించారు. నార్త్ కరోలినా ఛార్లెట్ లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు అందెశ్రీ మాట, పాటలను స్మరించుకున్నారు.తెలంగాణ భూమి పుత్రుడిగా, నిస్వార్థ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడిగా అందెశ్రీని తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుందని ఎన్.ఆర్.ఐ లు అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా ఆయన ప్రవాసులతో అత్మీయ అనుబంధాన్ని కొనసాగించారని కొనియాడారు.అందెశ్రీ రచనలు, ఆయన గాత్రం చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాసులు కోరారు. రానున్న తరాలకు ఆయన రచనలు పరిచయం అయ్యేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చటంతో పాటు, అందెశ్రీ పేరుపై రాష్ట్ర స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) – ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వై. నరేందర్ రెడ్డికి విన్నవించారు.అందెశ్రీని స్మరించుకోవటంతో పాటు, నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, కోర్ టీం సభ్యుడు, చార్లెట్ చాప్టర్ దిలీప్ రెడ్డి స్యాసని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర దేవరపల్లి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) చార్లెట్ చాప్టర్ అధ్యక్షుడు కదిరి కృష్ణ, చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) కార్యదర్శి ప్యారం పుట్టలి, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖుడు పవన్ కుమార్ రెడ్డి కొండ, స్థానిక తెలంగాణ ప్రవాసులు హాజరయ్యారు.
క్రైమ్
ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్..
శామీర్పేట్: ట్రాక్టర్ను లారీ ఢీ కొట్టిన ఘటన శనివారం శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ ఉత్తమ్ సోనె (31), స్థానికంగా నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. శనివారం హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా ట్రాక్టర్ నడుపుతూ వెళ్తుండగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్జె 17 జిబి 0546 నంబరు గల లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందిగా మరో వ్యక్తి జగదేవ్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ట్రాక్టర్ను లారీ వెనక నుండి అతివేగంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్ధం వచి్చందని, దీన్ని బట్టి లారీ వేగాన్ని అంచనా వేయొచ్చని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారిపై సుమారు 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న శామీర్పేట పోలీసులు క్రేన్ సహాయంతో ట్రాక్టర్ భాగాలను రోడ్డుపై నుండి తొలగించారు. ప్రమాద తీవ్రతకి డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, ట్రాక్టర్పై ఉన్న మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు.
మిత్రుల కళ్ల ముందే.. రైలుకు ఎదురెళ్లి..
సికింద్రాబాద్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు మిత్రుల కళ్లెదుటే రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. సైనిక్పురి శివనగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ కుమారుడు రవిశంకర్ (30) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఉద్యోగం దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన రవిశంకర్ శుక్రవారం రాత్రి 9 గంటలకు నేరేడ్మెట్లోని తన స్నేహితుడు శ్రీధర్ ఇంటికి వెళ్లి తనకు ఉద్యోగం దొరకడం లేదని ఆవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత ఇరువురు కలిసి అదే కాలనీలో నివసించే మరో మిత్రుడు సాయిప్రశాంత్ ఇంటికి వెళ్లారు. అక్కడికి శైలేష్ జగన్ అనే మరో ఇద్దరు మిత్రులు వచ్చి రాత్రి 12.30 గంటల వరకు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవిశంకర్ను ఓదార్చారు. అర్దరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత రవిశంకర్ను అతడి ఇంట్లో దింపి వచ్చేందుకు మిత్రులు అందరు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. మార్గంమధ్యలో వాజపేయినగర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ పడింది. దీంతో ద్విచక్ర వాహనాలను నిలిన స్నేహితులు గేట్ తెరిచే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మిత్రుడి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న రవిశంకర్ ఉన్నఫలంగా దిగిపోయి మిత్రులు చూస్తుండగానే రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చినన రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. అంబులెన్స్ను రప్పించిన మిత్రులు రవిశంకర్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఉద్యోగం రావడం లేదని, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు పని చేశానని కొద్ది రోజులుగా రవిశంకర్ మనస్తాపానికి గురవుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
కాంగ్రెస్ నేత హత్య
బనశంకరి: చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవలో గ్రామపంచాయతీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు గణేశ్గౌడ (38) హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి కల్కురుడేశ్వర వద్ద కారులో వెళ్తుండగా సంజయ్, మిథున్ అనే ఇద్దరు బైక్తో అడ్డుకుని కొడవలితో దాడిచేసి చంపారు. నిందితులు భజరంగదళ్ కార్యకర్తలని తెలిసింది. సఖరాయపట్టణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ విక్రమ్ ఆమ్టె తెలిపారు. ఇద్దరు నిందితులు కూడా ఆసుపత్రిలో చేరారని తెలిపారు. సంజయ్, భూషణ్, మిథున్తో పాటు ఐదుమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం: ఎమ్మెల్యే మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆనంద్ సందర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ బ్యానర్ తొలగింపు గురించి గొడవ జరిగి హత్యకు దారితీసిందని సమాచారం. కొద్దిరోజులుగా గణేశ్, మరో వర్గం మధ్య విభేదాలున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో.. రెచ్చిపోతున్న మృగాళ్లు
ధర్మవరం పట్టణంలో వరుసకు మేనమామ కావాల్సిన ఓ వ్యక్తి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ గర్భం దాల్చడంతో అసలు విషయం బయట పడింది. తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాకే నరసింహ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం వెలుగు చూసింది.పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామంలో వరుసకు పెద్దనాన్న అయిన 60 ఏళ్ల వృద్ధుడు మద్యం మత్తులో 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యతి్నంచాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా ప్రయాణించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఇంట్లో ఉండాలన్నా .. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లినా తిరిగి వచ్చే వరకూ ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉండటంతో అల్లరిమూకలు రాజ్యమేలుతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితుల్లో 70 శాతం మంది మద్యం మత్తులోనే లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. 120కి పైగా పోక్సో కేసులు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త మద్యం పాలసీ తీసుకురావడంతో వీధి వీధిగా బెల్టు షాపులు వెలిశాయి. రాత్రింబవళ్లూ మద్యం అందుబాటులో ఉంటోంది. ఫూటుగా సేవించిన తర్వాత మత్తులో సైకోలుగా మారి బాలికలు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులు నుంచి పండు ముసలి వరకూ బాధితులుగా ఉన్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిన్నర వ్యవధిలో సత్యసాయి జిల్లాలో అత్యాచార ఘటనలు దాదాపు 200 పైగా జరిగాయి. అలాగే 120 పైగా పోక్సో కేసులు నమోదు కావడంతో మహిళల రక్షణ ప్రశ్నార్థంగా మారింది. ఇక.. బయటికి రాని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు కూడా ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యం.. బాలికలు, అమ్మాయిలు, మహిళలకు అల్లరి మూకల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. బయట ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగిక వేధింపులకు దిగడం.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ‘ఏం జరగలేదు కదా’ అని కేసు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేసులు నమోదు చేస్తే ‘మీకే నష్టం’ అంటూ బాధితులతో చెబుతుండటంతో వారికేం చేయాలో కూడా పాలుపోవడం లేదు. దీనికి తోడు నిందితులు సైతం బెదిరింపులకు దిగుతుండటంతో నమోదు కాని కేసుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. వీడియోల పేరుతో బెదిరింపులు మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడిన తర్వాత పదే పదే బెదిరిస్తూ.. సదరు మహిళలపై సామూహికంగా వచ్చి వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వీడియోలు ఉన్నాయంటూ బెదిరిస్తూ గ్యాంగ్ రేప్లకు పాల్పడుతుండటం సంచలనం రేపుతోంది. గంజాయి మత్తులో రోడ్డు పక్కన ఇంట్లోకి చొరబడి గ్యాంగ్రేప్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. రాప్తాడు, హిందూపురం నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఘటనలు అధికంగా వెలుగు చూస్తుండటం గమనార్హం.మహిళలకు రక్షణ కరువైంది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైంది. హోంమంత్రిగా ఓ మహిళ ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జిల్లాలో కూడా ఓ మహిళా మంత్రి ఉన్నారు. ఆమె దగ్గర పని చేస్తున్న అనుచరులు సైతం వేధింపులకు గురి చేస్తుండటం సిగ్గుచేటు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు
వీడియోలు
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. బాబు డైరెక్షన్.. పార్వతీపురంలో డ్రామా..
అనుకోకుండా మోడల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు తేజం
గంగమ్మ ఆలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఈవో
సమస్య పరిష్కారంలో మంత్రి రామ్మోహన్ విఫలం: అమర్నాథ్
పుష్ప ఏపిక్ తో బాక్సాఫీస్ పీస్ పీస్ చేయడానికి సుకుమార్ రెడీ
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
రాష్ట్రాలు దాటిన అభిమానం
తల్లిదండ్రులకు కొడుకు ఇచ్చిన లైఫ్ టైం సర్ ప్రైజ్..! కంటతడి పెట్టించే వీడియో
బుల్డోజర్ పాలన.. తెగిపడుతున్న జీవితాలు
దేవుడి సొమ్ము దోచేస్తూ.. పట్టుబడ్డ టీడీపీ కార్యకర్త

