నెలకు రూ.7.5 లక్షల జీతం.. మూడునెలల్లో వదిలేసాడు!
చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అలాంటి అవకాశం వస్తే బాగుంటుందని ఎదురు చూస్తారు. కానీ నెలకు రూ.7.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఒక వ్యక్తి వదులుకుని.. బెంగళూరులోని గూగుల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఇతరత్రా వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.బెంగళూరులోని గూగుల్లో.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న టెక్నీషియన్ 'అడ్వైన్ నెట్టో' యూఏఈలోని అబుదాబిలో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని మూడు నెలల్లోనే వదులుకుని భారతదేశానికి ఎందుకు తిరిగి వచేసాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.అడ్వైన్ నెట్టో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. నెలకు రూ.7.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఆరు సంవత్సరాలకు ముందు వదిలిపెట్టేశాను అని పేర్కొన్నాడు. యూఏఈ వర్క్ వీసా రావడానికి దాదాపు ఐదు నెలలు పట్టింది. కానీ మూడు నెలల్లోనే ఉద్యోగన్ని వదిలేశాను. ఎక్కువ పనిగంటలు, ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు పంచ్ వేయకపోతే.. సగం రోజు జీతం కట్ అవుతుంది.మౌలిక సదుపాయాలు, భౌతిక అభివృద్ధిలో యూఏఈ చాలా అద్భుతంగా ఉంది. కానీ డిజిటల్ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. అత్యున్నత పదవులు అర్హత కంటే.. జాతీయతపై ఆధారపడి ఉన్నాయని, దీనివల్ల నిజమైన నైపుణ్యం వృద్ధి చెందడం కష్టమైందని పేర్కొన్నారు.నేను యూఏఈలో నెలకు నెలకు 30000 AED సంపాదించడం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ అక్కడ హాయిగా జీవించడానికి, సులభంగా 10000 AED ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే యూఏలో నెలకు 20000 AEDలను పొదుపుచేయగలిగాను. ఎంత సంపాదించిన అక్కడి పని వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. ఇదీ చదవండి: ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్: అమల్లోకి కొత్త రూల్!నా పరిస్థితిని వెల్లడించినప్పుడు.. నువ్వు కంపెనీని మార్చి ఉండవచ్చు, దేశాన్ని (యూఏఈ) ఎందుకు వదిలి వెళ్లావని కొంతమంది స్నేహితులు అన్నారు. అలా కూడా ట్రై చేసాను. కొంతమంది సన్నిహితులను అడిగాను. వాళ్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అంతే కాకుండా కొందరు వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నట్లు చెప్పారు. కాబట్టే ఆ దేశంలో ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చిందని అడ్వైన్ నెట్టో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Advin Roy Netto (@advinroynetto)
చంద్రబాబు ఘనమైన రికార్డే సాధించారు!
సంపద సృష్టించి మరీ ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళతానని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. కానీ గత ఏడాది జనసేన, బీజేపీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఆయన గారి సంపద సృష్టి అసలు రహస్యం ప్రజలకు అర్థం కాలేదు. అప్పులు, రెవెన్యూ లోటుల్లో మాత్రం ఏడాదిన్నర కాలంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసేశారు. ఒకప్పటి బీమారు రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ రుణాల విషయంలో బాగా మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. ఇవన్నీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలోని అంశాలు.ఏపీలో చంద్రబాబు అండ్ కో.. పాలన, అభివృద్ధి వంటి విషయాలపై కాకుండా.. ప్రత్యర్థులపై, ప్రశ్నించే వారిపై కేసులో పెట్టడంలోనే బిజీ అయిపోతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇచ్చిన కాగ్పై కూడా కేసు పెడతామని బెదిరిస్తారేమోనని ఓ సీనియర్ పాత్రికేయుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యమేమీ లేదు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసే ఎల్లో మీడియా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందంటూ ఒక కథనాన్ని ఇచ్చి అనవసర వ్యయాలను తగ్గించుకోవాలని సలహా ఇచ్చింది. ఇదేదో వ్యూహాత్మకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున కథనం రాశారేమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వాన్నంగానే ఉందన్న సంగతి అందరికీ తెలుసు. అయినా ఆహో, ఓహో అంటూ డబ్బా కొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు కాస్త భిన్నమైన కథనం రాయడం ద్వారా ప్రజలకిచ్చిన హామీలు ఎగవేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా స్కీములు అమలు చేసినప్పుడు, అప్పులు తీసుకువచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని టీడీపీ, జనసేనతో కలిసి ఎల్లో మీడియా నానా రచ్చ చేసేది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయని, అదంతా జగన్ ప్రభుత్వమే చేసిందేమో అన్న అనుమానం కలిగేలా ప్రచారం చేసేవారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వంలో తీసుకున్న అప్పు రూ.మూడున్నర లక్షల కోట్లేనని తేలింది. జగన్ టైమ్లో అప్పులు అంటూ గోలగోలగా చెప్పిన వారు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి లక్షన్నర కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. అది అసాధ్యమని జగన్ అంటే, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని, తద్వారా స్కీములు అమలు చేస్తామని ఆకాశమే హద్దుగా అబద్దాలు చెప్పారు. ఎల్లో మీడియా తాన తందానా అని పాట పాడేవి. ఇప్పుడేమో ప్రమాదంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పోటెత్తిన లోటు అని కథనాలు ఇస్తున్నారు. మరి అప్పుడు అన్ని చేసేస్తామని చెప్పారు కదా.. ఇప్పుడేమిటి ఇలా చేతులెత్తేస్తున్నారని వారు ప్రశ్నించరు. ఎవరైనా అడిగితే వారిపై తప్పుడు కేసులు ఎలా పెట్టాలా అన్నదానిపైనే ప్రభుత్వం దృష్టి ఉంటోంది.తాజాగా కాగ్ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే ఆర్థిక నిర్వహణ ఏ రకంగా చూసినా జగన్ టైమ్లో మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతుంది. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా జగన్ ప్రభుత్వం సమర్థంగా ఆర్ధిక నిర్వహణ చేసినట్లు వెల్లడవుతుంది. కూటమి ప్రభుత్వం 2025-26లో రెవెన్యూ లోటు రూ.33185 కోట్లు అంచనా వేస్తే ఆరు నెలలకే రూ.46652 కోట్లకు చేరిందని కాగ్ వెల్లడించింది. ఇది అధికారుల అంచనా తప్పా? లేక లక్ష్య సాధనలో వైఫల్యమా అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఆ పని ఎటూ చేయరనుకోండి. దాదాపు రూ.2.17 లక్షల కోట్ల రెవెన్యూను అంచనా వేస్తే రూ.74234 కోట్లు మాత్రమే వచ్చాయి. ఖర్చు మాత్రం రూ.120887 కోట్లుగా లెక్కగట్టారు. బడ్జెట్ రూపొందించిన సమయంలో అంచనా వేసిన ఆదాయంలో కేవలం 34 శాతం మాత్రమే ఇప్పటికి వచ్చిందట. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.32284 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని భావిస్తే, ఈ ఆరు నెలల్లో రూ.4014 కోట్లే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏడాది మొత్తానికి తీసుకోవాలని తలపెట్టిన రూ.79926 కోట్ల రుణంలో ఆరు నెలల్లోనే 78 శాతం పైగా, అంటే రూ.63వేల కోట్ల రుణాన్ని తీసేసుకుంది. ఇది దేశంలోనే అత్యధికం.2019లో చంద్రబాబు అధికారం కోల్పోయినప్పుడు కేవలం ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయారు. అదే 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీలో సుమారు రూ.ఏడు వేల కోట్లు ఉన్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని కూటమి పెద్దలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేసింది. ఒకప్పుడు ఆర్థిక నిర్వహణలో ఉత్తరప్రదేశ్ అట్టడగున ఉండేది. బీమారు రాష్ట్రాలలో ఒకటిగా చెప్పేవారు. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో యూపీ, బీహారులు సరిగా పర్ఫార్మ్ చేయడం లేదని, దానివల్ల బాగా పనిచేసే ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, కేంద్రం నుంచి ఆ రాష్ట్రాలకు అధికంగా నిధులు వెళుతున్నాయని, నిధుల పంపిణీ ఫార్ములా మార్చాలని వాదించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. అప్పులు, ఆర్ధిక నిర్వహణలో యూపీ బాగా పనిచేస్తున్నట్లు అనుకోవాలి.ఉత్తరప్రదేశ్ ఈ ఆరు నెలల్లో కేవలం రూ.9332 కోట్లు అప్పు మాత్రమే చేసింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ (రూ.49100 కోట్లు), తెలంగాణ(రూ.45139 కోట్లు) అధిక అప్పులు చేసిన రాష్ట్రాలలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణలతో పోల్చినా ఏపీ పరిస్థితి మరీ దారుణంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం రెండేళ్లపాటు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు ఆదాయం దాదాపుగా లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో రుణాలు తీసుకోండని రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. ఆ ప్రకారం అప్పులు చేసినా, అదేదో జగన్ తప్పు పనిచేసినట్లు ఎల్లో మీడియా అభూత కల్పనలు సృష్టించింది. ఇప్పుడు అలాంటి సంక్షోభాలు ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ ప్రభుత్వమే బాగా పని చేయగలిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీ విభజన నాటి రెవెన్యూ లోటు పదివేల కోట్లు కాని, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్ల ఆర్ధిక సాయం కాని జగన్ సాధించారు. ఆ రోజుల్లో జనంలో డబ్బులు రొటేట్ అవడం వల్ల జీఎస్టీ వసూళ్లు కూడా గణనీయంగానే ఉండేవి. కాని ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఇతర రాష్ట్రాలలో వృద్ధిరేటు కనిపిస్తుంటే ఏపీ అందుకు భిన్నంగా ఉంది. ఈ సందర్భంగా ఎల్లో మీడియా రాసిన కొన్ని కథనాల విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటుంది. తల్లికి వందనం పథకంతో జీఎస్టీ జోష్, ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగిందని ఎల్లో మీడియా కొద్దికాలం క్రితం ప్రచారం చేసింది. ఆ తర్వాత జీఎస్టీ తగ్గింపుతో జనంలో జోష్ అని, సూపర్ సేవింగ్స్ అంటూ కూడా ప్రజలను మభ్యపెట్టింది. ఇప్పుడు అదే మీడియా జీఎస్టీ రాబడులు తగ్గాయని రాస్తోంది. సేవింగ్స్కు సూపర్ మస్కా, రిటైల్ మాయలో జీఎస్టీ పొదుపు ఆవిరి అయిపోయిందని రాస్తోంది. మొదటేమో అద్భుతమని ప్రచారం చేయడం, ఒక్కో కుటుంబానికి రూ.25 వేల రూపాయల నుంచి నలభై వేలు సేవ్ అవుతున్నాయని ప్రభుత్వానికి డబ్బా కొట్టడం, ఇప్పుడేమో సేవింగ్స్ కనిపించడం లేదని చెప్పడం.. ఇలా ఉంది ఎల్లో మీడియా తీరు.ఈ 17 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.249350 కోట్ల మేర అప్పులు చేసిందని మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. తమ హయాంలో ఐదేళ్లలో రూ.332670 కోట్లు అప్పుచేస్తే శ్రీలంక అయిపోయిందని విష ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఇప్పుడు ఏపీ అమెరికా అయినట్లు కనిపిస్తోందా అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ, జనసేనలు చేసిన వాగ్దానాలలో అనేకం అమలు చేయకుండానే దాదాపు రూ.రెండున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, వచ్చే సంవత్సరాలలో ఇంకెంత అప్పు చేస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీటిపై సమాధానాలు ఇవ్వలేక, ఇప్పటికి జగన్ ప్రభుత్వం విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తే కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఉండదని గమనించాలి. సంపద సంగతేమోకాని, ఏపీని అప్పుల కుప్పగా చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
చచ్చిపోదామనుకుంది...ఇపుడు వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతి
ముంబై నడిబొడ్డున ఎన్నో కలలు కంటున్న ఒక చిన్నారి కలలు ఒక్కసారిగా ఊహించని మలుపు తీసు కున్నాయి. పుస్తకాలతో దోస్తీ చేయాల్సిన 12 ఏళ్ల వయసులోనే పెళ్లి. కట్ చేస్తే.. గృహ హింస, తీరని అణిచివేత అంతకుమించిన పేదరికం. జీవితం పీడకలగా మారిపోయింది. కానీ అక్కడినుంచే తననుంచి దూరంగా వెళ్లి పోయిన జీవితాన్ని వెదుక్కుంది. వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారింది.దళిత కుటుంబంలో జన్మించి, కడు పేదరికాన్ని అనుభవించి, ఒక్కో మెట్టు ఎక్కుతూ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన కల్పనా సరోజ్ సక్సెస్ స్టోరీ.1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కల్పనా సరోజ్. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్కు పెళ్లి జరిగిపోయింది. భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో నివసించేది. కానీ పెళ్లి తరువాత అత్తింటి వేధింపులు భరించలేక, బయటపడటానికి మార్గం లేదని భావించి కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఆమె తండ్రి ఆమెను రక్షించి,ఇంటికి తిరిగి తీసుకు వచ్చాడు. అలా16 సంవత్సరాల వయసులో, మనుగడ కోసం పోరాటం ప్రారంభమైంది. ముంబైలోని ఒక ప్రభుత్వ వస్త్ర మిల్లులో ఉద్యోగం మొదలు పెట్టింది జీతం నెలకు రూ. 2 మాత్రమే. కానీ అదే కల్పన భవిష్యత్తుకు తొలి అడుగు. సాధికారతకు స్వావలంబంనకు బీజం.ఇదీ చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీఈ కష్టాలమధ్యే బట్టలు కుట్టడం నేర్చుకుంది. అలా కల్పన ఆదాయాన్ని రూ. నెలకు 50 రూపాయలు. ఆ అనుభవంతో ఆమె పెద్ద రిస్కే చేసింది. జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో రూ. 50 వేల రుణం తీసుకొని సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. క్లాత్ బొటిక్ ప్రారంభించింది. అనుకోకుండా ఫర్నిచర్ రంగంలోకి అడుగుపెట్టింది . అక్కడితో ఆగిపోలేదు. బలమైన నెట్వర్క్తో రియల్ ఎస్టేట్లోకి విస్తరించింది. ఎలా అంటే..1995లో లిటిగేషన్లో ఉన్న స్థలం కొని మోసపోయింది. కానీ అప్పటి కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చిన కల్పనా సరోజ్,ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగింది. KS ఫిల్మ్ ప్రొడక్షన్ఆ తర్వాత తన సొంత సంస్థ KS ఫిల్మ్ ప్రొడక్షన్ను స్థాపించింది. మహారాష్ట్రలోని ఖైర్లాంజీలో ఒక దళిత కుటుంబం ఎదుర్కొన్న దారుణాల గురించి 'ఖైర్లాంజిచ్య మాత్యవర్' అనే వాణిజ్య చిత్రాన్ని నిర్మించింది. ఆధునిక కాలంలో కూడా దళితులను ఎలా చూస్తారనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ కథనాన్ని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకురావాలనది ఆమె అభిమతం. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ ,తెలుగు భాషలలో డబ్ చేశారు. నేరస్థులను ఆపకపోతే, అవగాహన పెంచకపోతే, సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని కల్పన నమ్ముతారు.కమానీ ట్యూబ్స్కు ప్రాణం పోసిందిదృఢసంకల్పం, తెలివైన వ్యాపారవేత్తగా ఆమె ఖ్యాతి పెరిగింది. కమానీ ట్యూబ్స్ కంపెనీప్పుల్లో మునిగి, పతనం అంచున ఉంది. దాదాపు మూడేళ్లుగా దాని 3,500 మంది ఉద్యోగులకు చెల్లించలేకపోయింది. అలా వారు 2001లో, కల్పనను సలహా కోసం సంప్రదించారు. ఇదే ఆమె కెరీర్లో అత్యంత ముఖ్యమైన చాలెంజ్ విసిరింది. దాన్ని బాధ్యతగా తీసుకుంది కల్పన. ఏకంగా కంపెనీని కొనుగోలు చేసి, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించింది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించింది. అచంచలమైన సంకల్పంతో ముందుకు నడిపించింది. అప్పులను తీర్చేసి,కార్మికులకు జీతాలు చెల్లించడమే కాదు, కంపెనీ లాభాల బాట పట్టింది. ఇపుడు కమానీ ట్యూబ్స్ రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.చదవండి: చిన్న తప్పిదం రూ.లక్ష కోట్లు : ఆర్బీఐ సీరియస్ఏడో తరగతిలోనే పెళ్లి, కష్టాలు అనుభవించి, రూ. 2 సంపాదించిన బాల్య వధువు కల్పన సరోజ్, రూ. 1000 కోట్ల నికర విలువను కలిగి ఉంది. కమానీ ట్యూబ్స్ చైర్పర్సన్గా 2013లో పద్మశ్రీ అవార్డును అందుకుంది. IIM బెంగళూరులో గవర్నర్ల బోర్డు సభ్యురాలు కూడా. దీంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోందామె.కల్పన సరోజ్ జీవితం అద్భుతమైన విజయగాథ మాత్రమే కాదు. కృషి, పట్టుదల ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అనడానికి ఇదొక బ్లూప్రింట్. కష్టాల కొలిమినుంచే అందమైన జీవితానికి బాటలు వేసుకున్న ధీర కల్పన సరోజ్ ఎంతోమందికి ప్రేరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఘోరం.. ట్రక్ ఢీకొని ఎనిమిది మంది దుర్మరణం
ముంబై ఇండియన్స్లోకి విధ్వంసకర వీరుడు
కీర్తి సురేశ్ సీరియస్ కామెడీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
దక్షిణాఫ్రికా బ్యాటర్ల విరోచిత పోరాటం
ఓటీటీ ప్రియులకు మరో దీపావళి.. ఒక్క రోజే 20 సినిమాలు స్ట్రీమింగ్!
ఇంజిన్ ఫెయిల్.. తృటిలో తప్పిన కృష్ణానది పెను పడవ ప్రమాదం
కొత్త రూల్.. పీఎఫ్ విత్డ్రాపై ట్యాక్స్!
సీదిరి అప్పలరాజుపై కక్ష సాధింపు
ఆపిల్ కొత్త ప్రొడక్ట్.. నోరెళ్లబెడుతున్న జనం!
ఆ సెక్షన్లు చెల్లవన్న హైకోర్టు
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
హన్మకొండ జిల్లా: వీడిన ‘నాటు కోళ్ల’ మిస్టరీ
ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారవృద్ధి
నేను నా చాంబర్ నుంచి బయటికి వెళ్లినా ‘ఇన్’ అనే ఉంచు.. పరిస్థితులు బాగోలేవ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
జీవితాన్ని మళ్లీ చూస్తున్నా.. నవీన్ చంద్ర పోస్ట్ వైరల్ (ఫొటోలు)
H1B Visa: తలొగ్గిన ట్రంప్.. మాకు వలస కార్మికులు కావాలి
ముఖ్యంగా పాలిటిక్స్లో లేరనిపిస్తోంది!
ఎర్రకోట సమీపంలో పేలుడు - 12 మంది మృతి
సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో)
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలలో లాభాలు
బడికి పంపడానికి ఏమీ అభ్యంతరం లేదటకానీ మధ్యాహ్న భోజనం పెట్టనని హామీ ఇవ్వాలట సార్!
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
'శివ' చైల్డ్ ఆర్టిస్ట్కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ
ఘోరం.. ట్రక్ ఢీకొని ఎనిమిది మంది దుర్మరణం
ముంబై ఇండియన్స్లోకి విధ్వంసకర వీరుడు
కీర్తి సురేశ్ సీరియస్ కామెడీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
దక్షిణాఫ్రికా బ్యాటర్ల విరోచిత పోరాటం
ఓటీటీ ప్రియులకు మరో దీపావళి.. ఒక్క రోజే 20 సినిమాలు స్ట్రీమింగ్!
ఇంజిన్ ఫెయిల్.. తృటిలో తప్పిన కృష్ణానది పెను పడవ ప్రమాదం
కొత్త రూల్.. పీఎఫ్ విత్డ్రాపై ట్యాక్స్!
సీదిరి అప్పలరాజుపై కక్ష సాధింపు
ఆపిల్ కొత్త ప్రొడక్ట్.. నోరెళ్లబెడుతున్న జనం!
ఆ సెక్షన్లు చెల్లవన్న హైకోర్టు
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
హన్మకొండ జిల్లా: వీడిన ‘నాటు కోళ్ల’ మిస్టరీ
ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారవృద్ధి
నేను నా చాంబర్ నుంచి బయటికి వెళ్లినా ‘ఇన్’ అనే ఉంచు.. పరిస్థితులు బాగోలేవ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
H1B Visa: తలొగ్గిన ట్రంప్.. మాకు వలస కార్మికులు కావాలి
ముఖ్యంగా పాలిటిక్స్లో లేరనిపిస్తోంది!
ఎర్రకోట సమీపంలో పేలుడు - 12 మంది మృతి
సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో)
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలలో లాభాలు
బడికి పంపడానికి ఏమీ అభ్యంతరం లేదటకానీ మధ్యాహ్న భోజనం పెట్టనని హామీ ఇవ్వాలట సార్!
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
'శివ' చైల్డ్ ఆర్టిస్ట్కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
సినిమా
ఓటీటీలోకి లీగల్ కామెడీ మూవీ.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అల తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ లాంటి హిట్ చిత్రాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు లిస్టులో లేటెస్ట్ హిందీ మూవీ ఒకటి చేరింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ లీగర్ కామెడీ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎప్పటినుంచి ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)గతంలో వచ్చిన జాలీ ఎల్ఎల్బీ, జాలీ ఎల్ఎల్బీ 2 సినిమాలకు కొనసాగింపుగా ఈ ఏడాదా సెప్టెంబరు 19న మూడో భాగం వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రలు చేశారు. తొలి రెండు చిత్రాల్ని తీసిన సుభాష్ కపూర్.. దీన్ని కూడా డైరెక్ట్ చేశారు. 2011లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే నవంబరు 14 నుంచి నెట్ఫ్లిక్స్లోకి రావొచ్చని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది.'జాలీ ఎల్ఎల్బీ 3' విషయానికొస్తే.. రాజస్థాన్లోని బికనీర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరి భాయ్ (గజరాజ్) చేసిన ఓ ప్రయత్నాన్ని ఊరిలోని వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండేసరికి హరి భాయ్.. మతలబు చేసి రైతుల భూముల్ని తన సొంతం చేసుకుంటాడు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన రైతులకు.. ఇద్దరు జాలీలు (అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ) ఎలాంటి సాయం చేశారు? చివరకు ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ. తొలిరోజు చిత్రాలతో పోలిస్తే ఇది ఓ మాదిరి స్పందన మాత్రమే అందుకుంది. పెద్దగా కలెక్షన్స్ కూడా రాలేదు.(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!)
రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు
ఈ ఏడాది 'కూలీ'తో ప్రేక్షకుల్ని పలకరించిన రజనీకాంత్ నుంచి వారం క్రితం కొత్త సినిమా ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు సుందర్తో కలిసి పనిచేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుని హీరో కమల్ హాసన్ నిర్మించనున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఇప్పడు అకస్మాత్తుగా ఈ మూవీ నుంచి సుందర్ తప్పుకొన్నారు. ఈ విషయమై ఇప్పుడు అధికారికంగా నోట్ కూడా రిలీజ్ చేశారు.'అనుకోని పరిస్థితుల కారణంగా #తలైవర్173 నుంచి తప్పుకొంటున్నాను. అయినా సరే రజనీకాంత్, కమల్ హాసన్లతో అనుబంధం అలానే కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా వాళ్లతో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి' అని సుందర్.సి తన నోట్లో రాసుకొచ్చారు. కానీ ఎందుకు బయటకొచ్చేయాల్సి వచ్చింది? ఏమైంది? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.(ఇదీ చదవండి: న్యూయార్క్లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?)ఇకపోతే రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో అనగానే చాలామంది కలిసి నటిస్తారని అనుకున్నారు. కానీ రజనీ హీరోగా, కమల్ నిర్మాత అనేసరికి కాస్త సంబరపడ్డారు. కానీ దర్శకుడిగా సుందర్ అనేసరికి చాలామంది అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. దీనికి కారణముంది. గతంలో రజనీకాంత్కి 'అరుణాచలం' లాంటి హిట్ చిత్రాన్ని సుందర్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్ టైంలో అయితే దెయ్యాల సినిమాలు తీస్తున్నాడు. వీటికి డబ్బులొస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి.ఇలాంటి దర్శకుడిగా రజనీకాంత్-కమల్ హాసన్.. అసలు ఎలా అవకాశమిచ్చారా అని.. అనౌన్స్మెంట్ వచ్చిన టైంలోనే చాలామంది అనుకున్నారు. ఇప్పుడు సుందర్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో, ఈయన స్థానంలోకి వచ్చే కొత్త దర్శకుడు ఎవరా అనేది సస్పెన్స్గా మారింది. అయితే సుందర్ నోట్ని, ఇతడి భార్య, నటి ఖుష్బూ తొలుత సోషల్ మీడియాలో పంచుకుంది. మరి ఏమైందో ఏమో గానీ వెంటనే డిలీట్ చేసింది.(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!)
'జిగ్రిస్' మూవీ.. నలుగురి స్నేహితుల కథ (రివ్యూ)
టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్.. ఈ మూవీని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. నవంబర్ 14న విడుదల కానుంది. అయితే, ఈ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే థియేటర్స్లో వేశారు. యువ నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..జిగ్రీస్ అనే టైటిల్కు తగ్గట్లుగా కార్తిక్ (కృష్ణ బూరుగుల ) ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి ఫుల్గా మద్యం సేవించి ఉండగా మారుతీ 800 కారులో గోవా వెళ్లాలని అనుకుంటారు. వారందరూ తాగిన మైకంలో ఉండగా దారి మద్యలోనే కారు ట్రబుల్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. ఈ నలుగురు స్నేహితులు అంత చిన్న కారులో గోవా చేరుకున్నారా..? రాత్రికిరాత్రే ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాలి అనుకుంటారు..? గోవాలో వీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు.. అక్కడ వారు చేసిన అల్లరి ఏంటి? గోవా ప్రయాణం వారి జీవితాలలో తెచ్చిన అనూహ్య మార్పులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే జిగ్రీస్ మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..జిగ్రీస్ టైటిల్కు తగ్గట్టే ఈ స్టోరీ నలుగురి స్నేహితులది. పెద్దగా కథలో ట్విస్ట్లు అంటూ ఏమీ లేవు కానీ నవ్వులు పూయిస్తుంది. చాలా సీన్స్ కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇలాంటి కథలకు బలం కూడా ఇదే.. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ముఖ్యంగా లారీ సీన్తో పాటు ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్ నవ్వులు తెప్పిస్తాయి. ఆపై కాండోమ్ చుట్టూ క్రియేట్ చేసిన సీన్ హిలేరియస్గా అందరినీ నవ్విస్తుంది. మావోయిస్టుల బ్లాక్ ఎపిసోడ్ కూడా ఓ మాదిరిగానే మెప్పిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ మన చుట్టూ కూడా ఉన్నారనిపించేలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. చాలా సీన్లు కూడా మన కథనే వెండితెరపై చూపిస్తున్నారని కలుగుతుంది. ‘జిగ్రీస్’ కథలో పెద్దగా ఊహించని మలుపులు లేకపోయినప్పటకీ ప్రేక్షకుడిని మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది. క్లైమాక్స్ సీన్ మాత్రం అందరిని మెప్పిస్తుంది. చాలామంది ఆ సీన్ చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురవుతారు.ఎవరెలా చేశారంటే..సినిమాలో ఎక్కువగా కనిపించింది యువ నటీనటులే.. కానీ, అందరూ తమ పాత్రల మేరకు మెప్పించారు. లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల పర్ఫార్మెన్స్ అందరినీ మెప్పిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి తనదైన నటనతో మెప్పిస్తాడు. రామ్ నితిన్ తన పాత్ర మేరకు పర్వాలేదనిపిస్తాడు. ధీరజ్ ఆత్రేయచాలా సహజంగా, అమాయమైన నటనతో కామెడీ పండించాడు. మనీ వాక సినిమాలో కీలకమైన పాత్ర, అసలు కథ మెుత్తం తన చుట్టూనే తిరుగుతుంది. అయితే ఎమోషన్ సీన్స్ నటనలో అనుభవం ఇంకొంత అవసరం కావాలినిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. కమ్రాన్ అందించిన సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా బాగానే ఉంది. కథమేరకు నిర్మాణ విలువలు మెప్పించాయి. స్వప్నిక్ రావు సౌండ్ డిజైన్తో పాటు శ్యామల్ సిక్దర్ మిక్సింగ్ బాగుంది. మీ జిగ్రీస్తో కలిసి సినిమాకు వెళ్లండి తప్పకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు.
ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ నెల 10వ తేదీ రాత్రి జరిగిన కారు పేలుడు ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇది ఉగ్రచర్య అని కేంద్రం ప్రకటించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ ఘటన నుంచి రామ్ చరణ్ 'పెద్ది' మూవీ టీమ్ కొద్దిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)ఈనెల 15, 16 తేదీల్లో పేలుడు జరిగిన ఎర్రకోట సమీప ప్రాంతంలోనే షూటింగ్ చేసేందుకుగానూ 'పెద్ది' టీమ్ అనుమతి తీసుకుందట. కానీ ఇప్పుడిలా జరగడంతో మరో ఆలోచన లేకుండా చిత్రీకరణ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మూవీ షూటింగ్ చేయడానికి కొన్నిరోజుల ముందే ఇలా జరగడంతో టీమ్ అంతా షాక్కి గురవుతున్నారట. రష్మిక కొత్త సినిమా షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నారట. ఇప్పుడు ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇంకొన్నిరోజుల పాటు ఎర్రకోట ప్రాంతంలో ఎలాంటి షూటింగ్ ఉండే అవకాశం లేదు.'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రావాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ఈ మధ్యే 'చికిరి.. చికిరి' అనే పాటని రిలీజ్ చేశారు. అదెంత వైరల్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: న్యూయార్క్లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?)
న్యూస్ పాడ్కాస్ట్
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
క్రీడలు
ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ..
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్కు సమయం అసన్నమైంది. దోహా వేదికగా ఈ మెగా ఈవెంట్ శుక్రవారం(నవంబర్ 14) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్-ఎ, ఒమన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఆ తర్వాత అదే రోజున వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ వేదికగా భారత్-ఎ జట్టు, యూఏఈ జట్లు తలపడనున్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ కుమార్ సారథ్యంలో ఇండియా-ఎ జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi), ప్రియాన్ష్ ఆర్య, ఆశుతోష్ శర్మ వంటి ఐపీఎల్ సంచలనాలు ఉన్నారు. ఈ టోర్నమెంట్లో యువ ఆటగాళ్లతో కూడిన భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. గ్రూపు-బిలో భారత్తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో యూఏఈతో మ్యాచ్లో భారత్ ఆడే ప్లేయింగ్ ఎలెవన్ను క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఓపెనర్లగా వైభవ్, ఆర్య..ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ను యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. ఫస్ట్ డౌన్లో నమన్ ధీర్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. గత ఐపీఎల్ సీజన్లో నమన్ ముంబై ఇండియన్స్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచారు. మిడిలార్డర్లో నేహాల్ వధేరా, కెప్టెన్ జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఫినిషర్గా ఆశుతోశ్ శర్మకు తుది జట్టులో దక్కనున్నట్లు తెలుస్తోంది.ఇక ఆల్రౌండర్ల కోటాలో రమణ్దీప్ సింగ్, హర్ష్ దూబేలకు మెనెజ్మెంట్ అవకాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి మ్యాచ్లో భారత్ యష్ ఠాకూర్, గుర్జాప్నీత్ సింగ్, విజయ్కుమార్ వైశాఖ్ వంటి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.భారత-ఎ తుది జట్టుప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నమన్ ధీర్, జితేష్ శర్మ(కెప్టెన్), అశుతోష్ శర్మ, రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, యష్ ఠాకూర్,గుర్జప్నీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్చదవండి: IPL 2026: కేకేఆర్ జట్టులోకి షేన్ వాట్సన్..
కేకేఆర్ జట్టులోకి షేన్ వాట్సన్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'అసిస్టెంట్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను కేకేఆర్ నియమించింది. కోల్కతా హెడ్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి వాట్సన్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించాడు.షేన్ వాట్సన్ను కేకేఆర్ కుటంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాడిగా, కోచ్గా అతడి అనుభవం మా జట్టు సన్నద్దతకు ఉపయోగపడుతోంది. టీ20 ఫార్మాట్పై అతడి అవగహన మా జట్టును మరో స్ధాయి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాము అని వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ట్రాక్ రికార్డు అదుర్స్కాగా ఐపీఎల్లో షేన్ వాట్సన్ ఆటగాడిగా, కోచ్గా తన సేవలను అందించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన వాట్సన్.. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. 2013 సీజన్లో కూడా మరోసారి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. ఐపీఎల్-2018 సీజన్లో సీఎస్కే ఛాంపియన్గా నిలవడంలో వాట్సన్ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో షేన్ చెలరేగాడు. ఇకఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా కూడా వాట్సన్ పనిచేశాడు. ఇప్పుడు తొలిసారి కేకేఆర్ కోచింగ్ స్టాప్లో ఈ ఆసీస్ దిగ్గజం భాగంకానున్నాడు. ఇక కేకేఆర్ అసిస్టెంట్ కోచ్గా ఎంపిక కావడం పట్ల షేన్ వాట్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. కోల్కతా నైట్రైడర్స్ వంటి అద్భుత ఫ్రాంచైజీలో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. కోల్కతాకు మరో టైటిల్ను అందించడానికి అన్ని విధాలగా కృషి చేస్తానని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్.. గత సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్పై కేకేఆర్ వేటు వేసింది.చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్
నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్
నేపాల్ ప్రీమియర్ లీగ్లో (NPL) మరో భారత స్టార్ క్రికెటర్ అడుగు పెట్టబోతున్నాడు. తొలుత ఈ లీగ్లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఆడాడు. తాజాగా దేశవాలీ స్టార్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఎన్పీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న 2025 ఎడిషన్ కోసం పంచల్ కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. పంచల్ చేరికతో ఎన్పీఎల్లో విదేశీ క్రికెటర్ల సంఖ్య 5కు (శిఖర్ ధవన్, జేమ్స్ వాట్, జేమ్స్ ఓడౌడ్ (నెదర్లాండ్స్), విలియం బాసిస్టో (ఆస్ట్రేలియా)) చేరింది.గుజరాత్కు చెందిన 35 పంచల్కు దేశవాలీ సూపర్ స్టార్గా పేరుంది. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు. అయినా అతనికి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రాలేదు. భారత సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం కళ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురుచూసి, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా జరిగిన హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీలో పంచల్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో పంచల్కు 2016-17 సీజన్ డ్రీమ్ సీజన్. ఆ సీజన్లో అతను ట్రిపుల్ సెంచరీ సాయంతో 1310 పరుగులు చేశాడు.కాగా, ప్రస్తుతం పంచల్ ఒప్పందం చేసుకున్న కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీకే శిఖర్ ధవన్ గత నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఆడాడు. యాక్స్ తరఫున మార్కీ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చిన ధవన్ గత సీజన్లో ఓ మెరుపు అర్ద శతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ సీజన్కు ధవన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. చదవండి: రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు సన్నాహకంగా రోహిత్ దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు (ముంబై తరఫున) సిద్దంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని రోహిత్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు తెలియజేశాడని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీతో పాటు కుదిరితే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రోహిత్ పాల్గొంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. విజయ్ హజారే టోర్నీలో కానీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కానీ ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని స్పష్టం చేశాడు.ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయని అన్నాడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని తెలిపాడు. ఆటగాళ్లు ఎంతటి వారైనా, జాతీయ జట్టు అవకాశాలు రావాలంటే దేశవాలీ క్రికెట్లో తప్పక ఆడాలని రూల్ పెట్టిన బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్కు ధన్యవాదాలు తెలిపాడు.కాగా, ఇటీవలికాలంలో టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవిష్యత్పై చర్చలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. ఇది జరగాలంటే రో-కో ఫిట్నెస్తో పాటు ఫామ్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రో-కోకు దేశవాలీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు తెలుస్తుంది.ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ మెరుపులుభవిష్యత్తుపై గందరగోళం నెలకొన్న తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్లో సత్తా చాటాడు. 3 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో రోహిత్ మునుపెన్నడూ కనబడని రీతిలో ఫిట్గా కనిపించాడు. ఇదే సిరీస్లో విరాట్ కోహ్లి తొలుత (తొలి 2 వన్డేల్లో డకౌట్) నిరాశపరిచినా.. ఆతర్వాత పర్వాలేదనిపించాడు (మూడో వన్డేలో హాఫ్ సెంచరీ). చదవండి: Viral Video: ఎంతుంటే ఏంటన్నయ్యా.. గెలిచానా లేదా..?
బిజినెస్
ఏరోక్స్-ఈ వచ్చేస్తోంది: 106 కిమీ రేంజ్!
యమహా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని విస్తరించడంతో భాగంగా.. ఏరోక్స్-ఈ ఆవిష్కరించింది. ఇప్పటికే పెట్రోల్ వెర్షన్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో దేశీయ విఫణి లాంచ్ కానుంది. ఇందులో 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 106 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కాగా 9.5 కేడబ్యు ఎలక్ట్రిక్ మోటారు 48 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.యమహా ఏరోక్స్ ఈ స్కూటర్ చూడటానికి.. సాధారణ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ కావదంతో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, యాబ్ బేస్డ్ కనెక్టివిటీతో కూడిన TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉన్నాయి. ఎకో, స్టాండర్డ్, పవర్, ఓవర్టేకింగ్ చేసేటప్పుడు ఉపయోగించగల అదనపు బూస్ట్ మోడ్ వంటి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ బ్లాస్ట్: తప్పు చేసిన కారు ఓనర్!సస్పెన్షన్ సెటప్ స్టాండర్డ్ వెర్షన్ నుంచి తీసుకున్నారు. కాబట్టి దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు చివర్లలో.. డిస్క్లు బ్రేక్స్ ఉన్నాయి. కాబట్టి పనితీరు పరంగా బాగుంటుందని భావిస్తున్నారు. కాగా దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాహుబలి విమానం
ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ (Antonov AN-124 Ruslan) తాజాగా హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో దర్శనమిచ్చింది. ఈ భారీ విమానం ల్యాండింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విమానాశ్రయానికి తరచూ కార్గో విమానాలు వస్తుంటాయి. కానీ, రుస్లన్ వంటి దిగ్గజ ఎయిర్క్రాఫ్ట్ రాక విమానయాన ప్రియులను, స్థానికులను ఆకర్షించింది.ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ ప్రత్యేకతలు..‘రుస్లన్’గా పిలువబడే ఆంటనోవ్ ఏఎన్-124.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్గో విమానాల్లో రెండో స్థానంలో ఉంది (మొదటి స్థానం ఏఎన్-225). ఈ విమానం గరిష్టంగా 150 టన్నుల వరకు కార్గోను మోయగలదు. దీని లోపల కార్గో కంపార్ట్మెంట్ పరిమాణం అధికంగా ఉంటుంది. సుమారు 36.5 మీటర్ల పొడవు, 6.4 మీటర్ల వెడల్పు, 4.4 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీంతో భారీ , పొడవైన వస్తువులను సులభంగా రవాణా చేయవచ్చు.కార్గో లోడింగ్, అన్లోడింగ్ సులభతరం చేయడానికి విమానం ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది. అంతేకాకుండా దీని ల్యాండింగ్ గేర్ ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉంది. దీని ద్వారా విమానం తన ఎత్తును తగ్గించుకుని వస్తువులను వాహనాల నుంచి నేరుగా లోడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. లోపల 30 టన్నుల బరువును ఎత్తగల క్రేన్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. దీని వల్ల సుదూర ప్రాంతాల్లో గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా లోడింగ్, అన్లోడింగ్ పనులు నిర్వహించవచ్చు. గరిష్ట ఇంధనంతో దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం.Am sitting in Hyderabad airport and look what just showed up! pic.twitter.com/YVBm9hfwND— Vishnu Som (@VishnuNDTV) November 13, 2025ఎలాంటి వస్తువులను రవాణా చేస్తారు?ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ను ముఖ్యంగా ఓవర్సైజ్డ్, హెవీ-లిఫ్ట్ కార్గో రవాణా కోసం ఉపయోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి వాడే భారీ టర్బైన్లు, ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు సంబంధించిన భారీ డ్రిల్లింగ్ యంత్రాలు, బరువైన ఎర్త్ మూవర్స్, క్రేన్లు, లేదా 25 మీటర్ల పొడవున్న యంత్ర భాగాలను ఇందులో రవాణా చేస్తారు. మిలిటరీ వాహనాలు (ట్యాంకులు), కంప్లీట్ మిస్సైల్ సిస్టమ్స్, లేదా బోయింగ్ 777 వంటి పెద్ద విమానాల టర్బోఫ్యాన్ ఇంజిన్లు, రాకెట్ భాగాలను చేరవేస్తారు.ఇదీ చదవండి: అమ్మకాలపై ఉన్న ఆసక్తి సర్వీసుపై ఏది?
మరో గోల్డ్ బాండ్.. రిడంప్షన్ రేటు ప్రకటించిన ఆర్బీఐ
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తుండటంతో పసిడికొనుగోళ్లు నానాటికి పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నప్పుడు కొనేవారికంటే రేటు తక్కువ ఉన్నప్పుడు భవిష్యత్తు అంచనాతో కొన్నవారే ఎక్కువ ప్రతిఫలం దక్కించుకుంటారు. ఇదే ఆలోచనలో గతంలో చాలా మంది ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేశారు. వారు ఇప్పుడు దాదాపు మూడింతల లాభాన్ని పొందుతున్నారు.2017-18 సిరీస్-7 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) నేటికి (2025 నవంబర్ 13) మెచ్యూరిటీ తీరాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటికి రూ.12,350 రిడంప్షన్ ధర ప్రకటించింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. 2017 వవంబర్ 13న వీటిని గ్రాముకు రూ.2934 లకు జారీ చేసింది. డిస్కౌంట్ పోగా వీటి ఆన్లైన్ ధర రూ.2,884. ఇప్పుడీ బాండ్లు 329 శాతం రాబడిని అందుకుంటున్నాయి. అంటే గ్రాముకు రూ.9466 లాభం అన్నమాట.మరో సిరీస్కు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ఆర్బీఐ 2018-19 సిరీస్-3 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు కూడా ముందస్తు రిడంప్షన్ ప్రకటించింది. 2018 నవంబర్ 13న జారీ చేసిన ఈ బాండ్లను ముందస్తుగా 2018 నవంబర్ 13న గ్రాముకు రూ.12,350 ధర వద్ద రిడీమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. గ్రాముకు రూ.3,146 ధర వద్ద జారీ చేసిన వీటి తుది గడువు 2026 నవంబర్ 13న తీరనుంది. ఇప్పుడు రిడీమ్ చేసుకుంటే గ్రాముకు 288 శాతం అంటే రూ.9204 లాభంతో సొమ్ము చేసుకోవచ్చు.సావరిన్ గోల్డ్ బాండ్ పథకం గురించి..భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం 2015 నవంబర్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేసింది. గ్రాములవారీగా ఈ గోల్డ్ బాండ్లపై పెట్టిబడి పెట్టినవారికి ద్వంద్వ ప్రయోజనాన్ని అందించాయి. ఇష్యూ ధరపై 2.5% స్థిర వార్షిక వడ్డీతో పాటు రిడంప్షన్ నాటికి అప్పటి ధరను పొందే అవకాశం కల్పించాయి.వాస్తవంగా ఈ బాండ్లకు ఎనిమిదేళ్ల నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. కానీ మదుపరులు కోరుకుంటే ఐదేళ్ల తర్వాత వడ్డీ చెల్లింపు తేదీలలో నిష్క్రమించవచ్చు. ఈ గోల్డ్ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేయవచ్చు, ఇతరులకు బదిలీ చేయవచ్చు లేదా రుణాలకు పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. కాగా రుణ భారం అధికమవడంతో ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో వీటి జారీని నిలిపివేసింది.ఆదాయపు పన్ను చట్టం, 1961 (1961 సెక్షన్ 43) నిబంధనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది. అయితే ఈ బాండ్లను రీడీమ్ చేసినప్పుడు, మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎక్స్ఛేంజీలో బాండ్ల బదిలీ ఫలితంగా వచ్చే ఏదైనా మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి.
పరుగెడుతున్న కొనుగోళ్లు.. జాగ్రత్త!
భారతదేశంలో పండుగలు, ఆఫర్లు లేకపోయినా ఆన్లైన్ షాపింగ్ ద్వారా వస్తువుల కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ కొనుగోళ్ల సరళిలో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ కామర్స్ కారణంగా ఈ-కామర్స్ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. పండుగల వేళ వస్తువుల కొనుగోళ్లు పెరగడానికి సోషల్ కామర్స్ ఒక ముఖ్య కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. సోషల్ కామర్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ ఎలా ప్రభావం చెందుతుందో చూద్దాం.సోషల్ కామర్స్ అంటే ఏమిటి?సోషల్ కామర్స్ (Social Commerce) అనేది ఈ-కామర్స్ (E-commerce) లో ఒక భాగం. దీనిలో వస్తువుల కొనుగోలు, అమ్మకం ప్రక్రియ మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతుంది. సాధారణ ఈ-కామర్స్లో సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూసినా లేదా ఉత్పత్తి గురించి తెలుసుకున్నా కొనుగోలు చేయడానికి అధికారిక వెబ్సైట్కి లేదా యాప్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, సోషల్ కామర్స్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లేదా యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే ప్రొడక్ట్ను పరిశోధించవచ్చు, ఆర్డర్ చేయవచ్చు, చెల్లింపు కూడా పూర్తి చేయవచ్చు.లక్షణాలు ఇవే..ప్రస్తుతం యూజర్ వాడుతున్న యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే కొనుగోలు(ఇన్-యాప్ కొనుగోళ్లు) చేసే అవకాశం ఉంటుంది. పోస్ట్లు లేదా లైవ్ వీడియోల్లో నేరుగా ఉత్పత్తులను ట్యాగ్ చేసి దానిపై క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇందులో ప్రముఖులు, ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా ఉత్పత్తుల ప్రచారం సాగుతుంది. వినియోగదారులు సమూహాలుగా ఏర్పడి డిస్కౌంట్పై కొనుగోలు చేయవచ్చు. యూజర్ల ఫీడ్బ్యాక్, రివ్యూలు, ఫొటోల ద్వారా ఇతర వినియోగదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.పండుగల వేళ యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన ఇన్ఫ్లూయెన్సర్ల సిఫార్సులపై ఆధారపడుతున్నారు. సోషల్ కామర్స్ ఈ సిఫార్సులను, రివ్యూలను నేరుగా పర్చేజ్ సెంటర్లుగా మారుస్తుంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా నచ్చిన వస్తువును వెంటనే కొనేందుకు వీలు కల్పించడం వల్ల తక్షణ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా దీనికి తోడవుతాయి.వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలుసోషల్ మీడియా ద్వారా కొనుగోలు చేయాలనుకునే ప్రొఫైల్కు బ్లూ టిక్ ఉందో లేదో చూడాలి.అమ్మకందారుని రివ్యూలు, రేటింగ్లు, ఫాలోవర్ల సంఖ్యను పరిశీలించాలి. కొత్త లేదా తక్కువ ఫాలోవర్లు ఉన్న ప్రొఫైల్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.చాలా మంది విక్రేతలు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఉత్పత్తులను కొనుగోలు చేసేప్పుడు అధికారిక వెబ్సైట్లో కూడా తనిఖీ చేయాలి. ధరలు, ఆఫర్లను పోల్చి చూడాలి.కొనుగోలు ప్రక్రియలో సోషల్ మీడియా యాప్ నుంచి వేరే పేజీకి వెళ్లాల్సి వస్తే ఆ పేజీ సురక్షితమైనదో లేదో నిర్ధారించుకోవాలి.అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేసి క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు లేదా యూపీఐ పిన్ను నమోదు చేయకూడదు. వీలైతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ను ఎంచుకోవాలి.90% డిస్కౌంట్.. వంటి అతి తక్కువ ధరలకు వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ప్రకటనలు నకిలీ ఉత్పత్తులు లేదా స్కామ్లు అయ్యే అవకాశం ఉంది.ప్రొడక్ట్ నచ్చకపోతే లేదా డ్యామేజ్ అయితే తిరిగి ఇచ్చే విధానం (Return Policy), రీఫండ్ (Refund) నిబంధనలు ఎలా ఉన్నాయో కొనుగోలుకు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి.ఇదీ చదవండి: అమ్మకాలపై ఉన్న ఆసక్తి సర్వీసుపై ఏది?
ఫ్యామిలీ
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్టాపిక్గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?)
లండన్లో లిటిల్ ఇండియా..మన సిగ్నేచర్ ఇదా..?
మనం ఒక చోట ఉన్నాం అనగానే..ఫలానా వాళ్లు అనే ఐడెంటీ ఉండాలి. ఆ గుర్తింపు కోసం అంతా ఆరాటపడుతుంటాం. కానీ అది మరొలా మనల్ని గుర్తిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. కనీసం అప్పుడైనా సరిదిద్దుకుంటే..ఓకే..ఎప్పటికీ ఆ గుర్తింపుతోనే ప్రతి చోట ఐడెంటిఫై అయితే..అంతకంటే ఇబ్బందికరం మరొకటి ఉండదు కదూ..ప్రతి మనిషికి సామాజికి బాధ్యత లేదా సివిక్ సెన్స్ అనేఇఉండాలి. అది లేకపోతే..మనం ఎక్కడ ఉన్నా..అది మన చేతలు లేదా చర్యల ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. మన సంస్కృతి, ఆచారాలతో ఇతర దేశాలను అబ్బురపర్చడమే కాదు..సామాజికపరంగా కూడా మన చేతలు ఆహా అనేలా ఉంటేనే అన్ని విధాల శ్రేయస్కరం. ఇదంతా ఎందుకంటే లండన్లో లిటిల్ ఇండియాగా పేర్కొనే ప్రాంతాలు చూడగానే..ఠక్కున భారతీయులు ఉండే ప్రదేశం అని చెప్పేస్తారు. కానీ అలా ఎందుకు చెబుతారో తెలుసా.. ఆచుట్టుపక్కల ఉండే చెత్త చెదారాలను బట్టి.అంతలాదారుణంగా చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చెత్తతో నిండి ఉన్నాయి అంటే..అది భారతీయులు ఉండే ప్రాంతాలని అర్థం అని తలిపించేలా ఉంది ఆ లిటిల్ ఇండియా. అందుకు సంబంధించిన వీడియోని ఓ భారతీయ యూట్యూబర్ షేర్చేయడంతో..అస్సలు మనవాళ్లకి సివిక్ సెన్స్ ఉందా అని సందేహం లెవనెత్తుంది. లండన్లో సౌతాల, వెంబ్లి ప్రాంతాల..భారతీయ కమ్యూనిటీలు ఉండే ప్రాంతాలుగా పేరుగాంచినవి. అవి చూడగానే మన సంస్కృతిని ప్రతిబింబిచే దేవాలయాలు, చీరల దుకాణాలు, తినుబండారాలు దర్శనంతోపాటు..చుట్టుపక్కల పరిసరాలన్నీ చెత్తతో కనిపిస్తే..సామాజిక బాధ్యత లోపం బట్టబయలు అవుతుంది కదూ..!. ప్రతిమనిషి పబ్లిక్లో ఉండేటప్పుడూ.. కొన్ని విలువలను పాటించాల్సిందే..అది మన ఉనికిని స్పష్టంగా కనబడేలా చేస్తాయి. అందుకు నిదర్శనం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోవ్యక్తిగత శుబ్రతతోపాటు మన పరిసరాలు పరిశుభ్రంగా కనిపించాలి. View this post on Instagram A post shared by Nayem 🇮🇳🇬🇧 (@nayem_in_london) ఒక పరాయి దేశంలో మన ఉనికిని తేటతెల్లం చేసేది ఈ సామాజికి స్పృహ. ఆ విషయంలో కరెక్ట్గా ఉంటే ..అది ఆ ప్రాంతంలోని మొత్తం జనాభా విజయాన్ని, సమిష్టి కృషిని ఎలుగెత్తి చాటుతుంది. సివిక్ సెన్స్తో వ్యవహరిస్తే..మనల్ని ఉన్నతంగా నిలిచేలా చేయడమే కాదు యావత్తు దేశాన్ని గర్వపడేలా చేయగలిగిన వాళ్లం అవుతాం అంటూ తన పోస్ట్ని ముగించాడు యూట్యూబర్. నెటిజన్లు కూడా ఎన్ని డిగ్రీలు ఉన్నా..సివిక్ సెన్స్ లేకపోతే..అవన్నీ వ్యర్థమే అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: హాట్టాపిక్గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?)
హాట్టాపిక్గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?
అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్కు గత నెల అక్టోబర్ 31 ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన తెలిసిందే. కొందరు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల మ్య ఈ ఎంగేజ్మెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అల్లు శిరీస్ తెల్లటి షేర్వానితోపాటు ధరించిన చోకర్ చాలా హాట్టాపిక్ మారడమే కాదు..వేడుకలో హైలెట్గా కనిపించింది. ఆ ఆభరణం హీరో శిరీష్కు అందమివ్వడమే కాదు..మగవాళ్లు కూడా ఆభరణాలు ధరించొచ్చా..లేక ఇది సరికొత్త ట్రెండ్నా అనే చర్చలకు దారితీసింది. అదీకాకుండా ఒకపక్క ఈ చోకర్ ధరించినందుకు శిరీష్పై సోషల్మీడియాలో తెగ మీమ్స్ వెల్లువెత్తాయి కూడా. దీనిపై శిరీష్ కూడా ఘాటుగానే స్పందించారు. అయితే ఇలా మగవాళ్లు ఆభరణాలు ధరించడం అనేది లేటెస్ట్ ట్రెండ్ కానేకాదు. మరచిపోతున్న మన మూలాలను ఒక రకంగా నటుడు శిరీష్ గుర్తుచేశారనే చెప్పొచ్చు. మన సంస్కృతిలో భాగమైన ఆ ట్రెండ్కి సంబంధించిన విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!.భారతీయ మహారాజులు, మొఘల్ పాలకులు చోకర్లు ధరించేవారు. అంతేగాదు ఆభరణాలనేవి కేవలం ఆడవాళ్లకే సొంతం కాదు. మగవాళ్లు ధరించిన అత్యద్భుతమైన ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే బ్రిటిష్ వాళ్ల పాలనాంతరం మన సంస్కృతిని మర్చిపోయాం అని చెప్పొచ్చు. నిజానికి ఇది సరొకొత్త ట్రెండ్ కాదు. రాజుల కాలం నుంచి మగవాళ్లు ఆభరణాలు ధరించేవారు. వాళ్లు ఆ కాలంలో అత్యంత విలక్షణమైనవి, ఖరీదైనవి ధరించేవారట. అంతేగాదు ప్రపంచంలో అత్యంత విలువైన ఆభరణాల్లో ఒకటైన "ఖిరాజ్-ఇ-ఆలం" లేదా తైమూర్ రూబీ ఒక చోకర్ని షాజహాన్ ధరించనట్లు చరిత్ర చెబుతోంది. అది ఏకంగా 352 క్యారెట్ల బరువుతో అత్యంత ఖరీదైన ఆభరణమని కూడా చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన తర్వాత మహారాజా షేర్ సింగ్ ధరించినట్లు చరిత్ర పేర్కొంది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దానిని దొంగలించి 1851లో విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంతేగాదు, మన చరిత్రను ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే.. మహారాష్ట్ర మరాఠా రాజులు, మైసూరు రాజులు, రాజస్థాన్ రాజులు కూడా వజ్రాలతో పొదిగిన అత్యంత విలాసవంతమైన ఆభరణాలు ధరించనట్లు ఆధారాలు ఉన్నాయి కూడా. ఆ కాలంలో మగవాళ్లు, ఆడవాళ్లు అనే తారతమ్యం లేకుండా చాలా విలాసవంతమైన ఆభరణాలు ధరించేవారు. రాను రాను పాశ్చాత్య సంస్కృతిని ఒట్టబట్టించుకుని, ధరించే బట్టలు కురచగా అయిపోయాయి..దాంతోపాటు ఆభరణాలను ధరించడం మానేశాం. మళ్లీ నటుడు శిరీష్ పుణ్యమా అని మన మూలాలు, మన గత సంస్కృతి వైభవం స్మతి పథంలోకి తెచ్చిందని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు. ఇదేమి నవ్వుకునే ఫ్యాషన్ శైలి కాదు. ఇలా మగవాళ్లు ఆభరణాలను ధరించడం అనేది మన సంప్రదాయంలో భాగమైన పురాతన స్టైల్గా అభివర్ణిస్తున్నారు ఫ్యాషన్ ప్రియులు. సో నచ్చితే..ఈ ట్రెండ్ని సరదాగా ట్రై చేయండి. ఒకరకంగా ఈ స్టైల్తో..మన సంస్కృతిని గౌరవించిన వాళ్లం అవ్వడమే కాకుండా..భవిష్యత్తుతరాలకు తెలియజేసినట్లు అవుతుంది కూడా.. కదూ..!."Chokers are only for women", is a very western construct. Its 2025 & high time we break free from such limiting beliefs and fully embrace our Indian style jewellery. pic.twitter.com/S1ljwMAp15— Allu Sirish (@AlluSirish) November 10, 2025 (చదవండి: Drones used for election surveillance: 'పోలింగ్పై నిఘా'..పెళ్లి వేడుకల్లో పాగా..)
'పోలింగ్పై నిఘా'..పెళ్లి వేడుకల్లో పాగా..
పెళ్లి, పేరంటం.. విందు.. వినోదం.. అన్న తేడా లేకుండా ఆయా సందర్భాన్ని.. ఆయా వేడుకలను డ్రోన్ల ద్వారా షూట్ చేయడం ఇప్పుడు కొత్త విషయం కాకపోవచ్చు. దీంతో పాటు ఇటీవల కాలంలో నిఘా కోసం పోలీసులు సైతం డ్రోన్లను వినియోగిస్తున్నారు. అలాగే వ్యవసాయంలోనూ పురుగుమందులు, ఎరువుల పిచికారీకి డ్రోన్లను వినియోగించడం పెరిగింది. అయితే ఈ టెక్నాలజీ వినియోగం నగరంలో మరింత పెరిగింది.. పెళ్లి సమయంలో వధూవరులు మార్చుకునే పూల దండల్ని వెరైటీగా డ్రోన్లను వినియోగించి మోసుకురావడం.. డ్రోన్లతో గిఫ్ట్ ప్యాకింగ్స్ అందజేయడం వంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి. కాగా ఎన్నికల ప్రచారాల్లోనూ డ్రోన్ల సాయంతో షూట్ చేయడం.. పోలింగ్ సమయంలో నిఘా కోసం వాడడం.. కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు.. రానురానూ విస్తృతమవుతున్న డ్రోన్ల వినియోగం నగర జీవనంలో ఓ భాగమవుతోందని విశ్లేషకులు చెబుతోన్న మాట. నిషాంత్ పేరిట దేశీయ డ్రోన్ పరిచయమై దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. మన నగరానికి పరిచయమైన డ్రోన్ వయసు అందులో సగం ఉండొచ్చు. స్వల్పకాలంలోనే వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం గణనీయమైన వృద్ధిని చవిచూస్తోంది. ఎన్నికల నిఘా, చట్టం అమలు, భూ సర్వేలు, వ్యవసాయం ఇలా ఏ రంగమూ డ్రోన్ అడుగుపెట్టేందుకు కాదు అనర్హం అన్నట్లు మారింది పరిస్థితి. పోలింగ్లో ఫస్ట్.. దేశంలోనే తొలిసారిగా నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సజావుగా, పారదర్శకంగా ప్రక్రియ జరిగేలా చూసేందుకు 407 పోలింగ్ కేంద్రాల్లో రియల్–టైమ్ నిఘా కోసం 139 డ్రోన్లను మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు గ్రామాల్లో భూమి రికార్డుల కోసం డ్రోన్ ఆధారిత వైమానిక సర్వేలను ఉపయోగించి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం వెలుపల ఉన్న 20 పట్టణ స్థానిక సంస్థల మాస్టర్ ప్లాన్ల కోసం బేస్ మ్యాప్లను సిద్ధం చేయడానికి కూడా డ్రోన్ మ్యాపింగ్ను వినియోగిస్తున్నారు. పోలీస్ నుంచి ఆర్మీ వరకూ.. గత కొంత కాలంగా నగర పోలీసులు సైతం విభిన్న అవసరాలకు డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణ శాంతిభద్రతల నిఘా మొదలుకుని పార్కింగ్ సమస్యల వరకూ, కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ పర్యవేక్షణకు పోలీస్ విధుల్లో డ్రోన్స్ భాగం అవుతున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఆధ్వర్యంలో స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సైనిక డ్రోన్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తోంది. పైలట్ శిక్షణ, కార్యాచరణ ట్రయల్స్ కోసం నగరంలో డ్రోన్ పోర్ట్ను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సినిమాలకూ.. సేద్యానికీ.. ఇటీవల షూటింగ్స్లో డ్రోన్స్ వాడకం భారీగా పెరిగింది. టాలీవుడ్కి హైదరాబాద్ క్యాపిటల్ కావడంతో సహజంగానే డ్రోన్లకు డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు వ్యవసాయంలో పత్తి, మిరప వంటి పంటలకు డ్రోన్లతో స్పాట్ స్ప్రేయింగ్ కోసం రాష్ట్రం పైలట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించడానికి రైతు సహకార సంఘాలు డ్రోన్లను స్వీకరిస్తున్నాయి. వ్యోమిక్ డ్రోన్ మారుత్ డ్రోన్ వంటి సిటీ స్టార్టప్లు పురుగుమందుల స్ప్రే చేయడం, పంట ఆరోగ్య విశ్లేషణ, వరి మొక్కలను నేరుగా నాటడం కోసం సృష్టించిన డ్రోన్స్ అవార్డులను పొందాయి. పెళ్లి, పేరంటాలకు.. ప్రీ–వెడ్డింగ్ షూట్స్ మొదలు పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సందర్భాల్లోనూ డ్రోన్ వినియోగం సర్వసాధారణం అయ్యింది. వధూవరులు మార్చుకునే పూల దండల్ని అందించడం లాంటి సరదాలను జత చేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు. అలాగే ఇటీవల నగరంలో నిర్వహించిన ఒక చిన్నారి నామకరణ మహోత్సవానికి డ్రోన్ ద్వారా పేరును జారవిడవడం ఆకట్టుకుంది. ఇలాగే రకరకాలుగా డ్రోన్లను వాడుతున్న నేపథ్యంలో డ్రోన్ పరిశ్రమకు సిటీ ప్రధాన కేంద్రంగా మారింది. వినియోగంలో జాగ్రత్త.. దేశంలో డ్రోన్ రూల్స్–2021 తరువాతి సవరణల ప్రకారం సగటు డ్రోన్ (250 గ్రాముల బరువు మించితే డీజీసీఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్) కోసం రిజిస్టర్ చేసి ఉండాలి. డ్రోన్ వినియోగించే ముందు డ్రోన్ ఆపరేటర్కి రిమోట్ పైలట్ సర్టిఫికెట్ ఉందో లేదో పరిశీలించాలి. పలు ప్రాంతాల్లో ముఖ్యంగా వీఐపీలు నివసించే ప్రాంతాల్లో, రాకపోకలు సాగించే సందర్భాల్లో డ్రోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. వీటిపై ముందుగానే అవగాహన పెంచుకోవాలి. స్వయం ఉపాధిగా..నగరంలో డ్రోన్–ఫొటోగ్రఫీకి స్పెషలైజ్డ్ ఫొటోగ్రాఫర్స్, స్పెషల్–ఈవెంట్ ఏజెన్సీలు అవతరించాయి. సాధారణంగా ఒక రోజు/ఈవెంట్కి హైదరాబాద్లో డ్రోన్ బేసిక్ నానో/ఆర్మ్–కెమెరా అద్దె రూ.1,500 నుంచి రూ.5,000 వరకూ ఉంటోంది. ప్రొఫెషనల్ కెమెరాతో ఉన్న వాటి ప్యాకేజీలు రూ.7,500 నుంచి రూ.30,000 వరకు అంతకంటే ఎక్కువగానూ ఉన్నాయి. కావలసిన డ్రోన్ మోడల్, కెమెరా రిజొల్యూషన్, ఎడిటింగ్ బట్టి వీటి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి. ఇక కొనుగోలు చేయాలంటే మాత్రం రూ.లక్షల్లో పలుకుతున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా ప్రయోజనాల కోసం వీఐపీల సందర్శనల సమయంలో కూడా డ్రోన్లపై తాత్కాలిక నిషేధాలు తరచూ విధిస్తుంటారు.(చదవండి: Delhi Fort Incident: పేలుడుకు కొన్ని నిమిషాల ముందు...)
ఫొటోలు
భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
SSMB29 లోకేషన్కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)
‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. ముఖ్య అతిథిగా విజయ్ (ఫొటోలు)
‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ట్రెడిషనల్ లుక్లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)
అంతర్జాతీయం
పుడమి పొర చిరిగిపోతోందా?
వాషింగ్టన్: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ఖండాలుగా విడిపోయిన భూఉపరితం కొన్ని కోట్ల సంవత్సరాలక్రితం ఒకే అఖండ గోండ్వానా ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడీ ఖండాలు నెమ్మదిగా మరింత దూరంగా వెళ్తున్నా యనే సిద్ధాంతమూ వింటున్నాం. అయితే ఈ ఖండాలు దూరంగా జరిగే క్రమంలో కేవలం ఉపరితల భూమి మాత్రమే చీలిపోవడంలేదని మహాసముద్రాల అడుగుల వందల కిలోమీటర్ల లోతులోనూ భూమి పొర చీలిపోతోందని తాజా అధ్యయనంలో తేలింది. దూరంగా జరిగినంత మాత్రాన మనకొచ్చే నష్టమేమీ లేదని అనుకో కూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఖండాల భూగర్భ పొర చీలిపోవడంతో దాని అడుగున ఉన్న శిలాద్రవ మ్యాంటిల్ పొర నుంచి భడభాగ్ని లాంటి శిలాద్రవం బయటకు ఎగజిమ్మే ఆస్కార ముంది. దీంతో కొత్తగా లెక్కలేనని అగ్నిపర్వ తాలు పుట్టుకొచ్చే ప్రమాదముందని భూభౌగో ళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త అగ్ని పర్వ తాలు కోట్ల ఏళ్లపాటు అలాగే శిలాద్రవం, మాగ్మాను ఎగజిమ్మే పెనుముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో స్పష్టమైంది. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘నేచర్ జియోసైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా వేర్వేరు భూఫలకాలకొనలు పరస్ప రం ఢీకొనడం, రాపిడి సందర్భాల్లోనే అగ్ని పర్వ తాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు కొత్తగా సముద్ర గర్భంలోనూ అగ్నిపర్వతాలు ఏర్పడి కోట్ల సంవత్సరాలపాటు అవి అలాగే క్రియాశీలకంగా ఉండిపోయే ప్రమాదం ఉందని అధ్యయనకారులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలోని సౌతాంప్టన్ విశ్వ విద్యాలయం, పోట్స్డామ్లోని జీఎఫ్జెడ్ హెల్మ్ హోట్జ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్, పోట్స్డ్యామ్ యూనివర్సిటీ, కెనడాలోని క్వీన్స్ విశ్వవిద్యా లయం, స్వాన్సియా యూనివర్సిటీలోని పరిశో ధకుల బృందం సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టింది. కంప్యూటర్ స్టిములేషన్ విధానంలో ఖండాల చీలిక కారణంగా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జరగబోయే విపరిణామాలను వీళ్లు విశ్లేషించగలిగారు.
విదేశీ ఉద్యోగులు ఉండాల్సిందే
న్యూయార్క్: విదేశీయులన్నా, హెచ్–1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్లన్నా అంతెత్తున లేచి గోలచేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా హెచ్–1బీ వీసాదారుల ప్రాధాన్యతను గుర్తించారు. అమెరికా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తి అయిన పరిశ్రమలు, సాంకేతిక రంగంలో విదేశీ ప్రతిభావంతుల కీలకపాత్రను ఆయన తొలిసారిగా కొనియాడారు. విదేశీయుల ప్రతిభ ఖచ్చితంగా అమెరికాకు అవసరమని, హెచ్–1బీ వీసా ఉన్న విదేశీ వృత్తినిపుణులు అమెరికాకు అత్యావశ్యకమని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే అమెరికాలోని నైపుణ్యసంబంధ ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే కేటాయించకుండా స్థానిక అమెరికన్లకు తగు ప్రాధాన్యతనివ్వాలని ఆయన వెనువెంటనే తనదైన శైలిలో మాట్లాడారు. బుధవారం ఫాక్స్న్యూస్ వార్తసంస్థ వ్యాఖ్యాత లారా ఇన్గ్రహామ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. లక్షలాది మంది విదేశీ కార్మీకులు వద్దు ‘‘ కేవలం స్థానిక అమెరికన్ కార్మీకులతో పని ముందుకు సాగదని నాకూ ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. అమెరికాలోకి విదేశీ ప్రతిభ రావాల్సిందే. అలాఅని ఉద్యోగాలన్నీ లక్షలాది మంది విదేశీ కార్మికులతో నింపేస్తామంటే కుదరదు. స్థానికుల్లోనూ ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. అయితే విదేశీయులకే ప్రత్యేకమైన అదనపు వృత్తి నైపుణ్యాలుంటే వాటిని స్థానిక అమెరికన్లు నేర్చుకోవాల్సిందే. స్థానికులకు నైపుణ్యం తప్పనిసరి. సెపె్టంబర్లో జార్జియా రాష్ట్రంలో దక్షిణకొరియాకు సంబంధించిన హ్యాందాయ్ ఫ్యాక్టరీల్లో అక్రమంగా అమెరికాకు వచ్చిన వలసదారులు కార్మీకులుగా పనిచేస్తున్నారు. వాళ్లను గుర్తించి అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు బహిష్కరించి స్వదేశానికి పంపేశారు. అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. మేం పంపేసిన కార్మికులు బ్యాటరీలను తయారుచేయడంలో సిద్ధహస్తులు. బ్యాటరీల తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ప్రక్రియ. అది అంత తేలికైన పని కానేకాదు. ఏమైనా తేడాలొస్తే పేలుళ్లు జరుగుతాయి. సమస్యలు మరింత పెద్దవవుతాయి. మేం బహిష్కరించిన బ్యాటరీ తయారీ కార్మికులు ఒక ఐదారు వందల మంది ఉంటారేమో. అలాంటి వాళ్ల నుంచి స్థానిక అమెరికన్లు వృత్తి మెళకువలను నేర్చుకోవాల్సిందే. ప్రతి రంగంలోనూ విదేశీ ప్రతిభావంతుల నుంచి స్థానిక అమెరికన్లు నైపుణ్యాలను నేర్చుకోవాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులతో క్షిపణులు అసాధ్యం నిరుద్యోగులుగా ఖాళీగా ఉన్న వాళ్లను హఠాత్తుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటే సానుకూల ఫలితాల కంటే తీవ్ర ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఉదాహరణకు అమెరికాపై ఆసక్తితో ఏదైనా విదేశీ కంపెనీ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక రక్షణరంగ కర్మాగారం స్థాపించేందుకు ఆసక్తి కనబరచిందనుకుందాం. అలాంటప్పుడు వెంటనే మేం ఖాళీగా ఉన్న నిరుద్యోగ అమెరికన్లను ఆ కొత్త ఫ్యాక్టరీలో కొలువుల్లో కూర్చోబెట్టలేం. ఐదేళ్లుగా ఎలాంటి ఉద్యోగం చేయని వ్యక్తులను కార్మీకులుగా మార్చేసి ఏకంగా క్షిపణులను తయారుచేయించలేం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త హెచ్–1బీ వీసా ఫీజును అనూహ్యంగా ఒకేసారి 1,00,000 డాలర్లకు పెంచేసి అమెరికాకు విదేశీ వృత్తినిపుణులు రాకుండా పరోక్షంగా కట్టడి చర్యలను ఆరంభించిన ట్రంప్ రెండు నెలలు తిరక్కుండానే హెచ్1బీ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చావు చులకనైపోయిన వేళ.. !
చావు చులకనగా మారడం అంటే ఇదేనేమో. మనిషి జీవిత విలువను తక్కువగా చూడటం, మరణాన్ని సాధారణ సంఘటనగా భావిస్తే అది మానవతా ప్రశ్నలను రేకెత్తిస్తుంది.సమాజం వ్యక్తి జీవితాన్ని గౌరవించకపోతే, చావు ఒక సాధారణ శిక్షగా మారుతుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. అన్యాయపు శిక్షలు: వేగంగా, విచారణ లేకుండా అమలు చేసే ఉరిశిక్షలు చావును చులకనగా మార్చే ఉదాహరణలు.ప్రజలలో భయాన్ని చాటేందుకు చావును సాధారణంగా చూస్తుంది నేటి అధికార వ్యవస్థ. నేటి అధికార వ్యవస్థలకు చావు అనేది వ్యూహంగా మారుతుందంటే అతిశయోక్తి కాదేమో.తాజాగా ఒక భయంకరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇరాన్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 74 మృతదేహాలను అతి దారుణంగా ఓ ఆనకట్టలో పడేశారనేది ఆ వార్త సారాంశం. ఆ ఆనకట్ట వర్షాలు లేక ఎండిపోవడంతో ఆ మృతదేహాలు బయటపడ్డాయట. వారిందరికీ చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. వారిని దుప్పట్లో చుట్టేసి మరీ పడేశారనేది సమాచారం.అంటే వారికి ఉరి శిక్షను అమలు చేసి, ఇలా ఆనకట్టలో పడేశారనేది తాజా పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఇరాన్లో ఉరిశిక్షలు చాలా వేగంగా అమలు చేస్తారు. అందులోనూ రాజ(దేశ) ద్రోహం కింద అయితే మరో అడుగు ముందుకేసి మరీ ఉరిని అమలు చేస్తారు.వారు దేశ ద్రోహానికి పాల్పడ్డారో లేదో మనకు తెలీదు కానీ, ఉరిశిక్షను చాలా వేగవంతంగా అమలు చేసినట్లు మృతదేహాల పరిస్థితి ని బట్టి తెలుస్తోంది. వారిని దేశ ద్రోహులుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఇలా పడేసినా ఎవరూ గుర్తించరని భావించి ఇలా చేసే ఉంటారనే సోషల్ మీడియా ద్వారా మనకు తెలుస్తున్న వైనం. అయితే ఈ వార్త ప్రచురించిన ఇరాన్ ప్రభుత్వ మద్దతు మీడియా తర్వాత దానిని తొలగించడం కూడా చకచకా జరిగిపోయిందనే వార్త కూడా మరొకటి వచ్చింది. అసలు ఏం జరిగిందనేది కొన్ని రోజుల వ్యవధిలో తెలిసే అవకాశం ఉంది.🔴 Horrifying:Reports that at least 74 bodies have been found in the Karaj Dam in Iran, all thought to be executed anti-regime dissidents.Because of the drought and lack of rain, this dam has dried up almost completely and revealed a MASS GRAVE.The victims had their hands… pic.twitter.com/7tz4m2PjYq— 𝐍𝐢𝐨𝐡 𝐁𝐞𝐫𝐠 ♛ ✡︎ (@NiohBerg) November 11, 2025
చైనాలో కలకలం.. భారీ శబ్ధంతో కుప్పకూలిన బ్రిడ్జి
చైనాలో ఇంజినీరింగ్ వైఫల్యం బట్టబయలైంది. చైనా-టిబెట్ను కలిపెందుకూ ఇటీవలే ప్రారంభించిన హాంగ్ కీ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్ లో నిర్మించిన ఈ బ్రిడ్జి 758 మీటర్ల పొడవైంది. వంతెన కూలడానికి గల కారణాలు తెలవాల్సి ఉంది.చైనా సియాచిన్ ప్రావిన్స్ లో టిబెట్-చైనాను కలుపుతూ నిర్మించిన హాంగ్ కీ బ్రిడ్జీని కొద్దిరోజుల కిందటే ప్రారంభించారు. కాగా మంగళవారం ఉదయం సమయంలో బ్రిడ్జి ప్రారంభంలోని భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపైనుంచి వాహనాలు ఏమి వెళ్లకపోవడం, అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వంతెన కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. 758 మీటర్ల పొడవైన ఈ వంతెన సెంట్రల్ చైనాను టిబెట్ తో కలుపుతుంది. వంతెన కూలిన సమయంలో భారీగా శిథిలాలు నదిలో పడిపోయి పెద్ద ఎత్తున వ్యర్థాలు పైకి లేచాయి. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇండస్ట్రీయల్ సెక్టర్ లో తామెప్పుడూ ముందుంటాం అనే చెప్పుకునే డ్రాగన్ దేశంలో ఇంత పెద్ద వంతెన నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోవడం ఏంటని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. Chinese Engineering Failure- The 758-metre-long Hongqi bridge collapsed in southwest China, months after opening. China isn’t as smart as everyone makes them out to be. They couldn’t copy this design. The ground shifted on one of the approaches. Luckily it was noticed the day… pic.twitter.com/ZJDDdwgCP9— Peter Lemonjello (@KCtoFL) November 11, 2025
జాతీయం
సువర్ణ గళ దేవత
నేనెప్పుడూ ప్రసిద్ధి చెందాలని కోరుకోలేదు. పాటలు పాడి శ్రోతల్ని సంతోషపెట్టాలని మాత్రమే అనుకున్నాను. అభిరు చికి కట్టుబడి, నిజాయతీగా కష్టపడి పని చేస్తే మన ప్రతిభకు ఆశీర్వచనాలు లభిస్తాయి. నిరంతర సాధన, అభ్యాసం అనేవి కళాకారునికి శ్వాస వంటివి. – పి.సుశీల (90), నేపథ్య గాయని దక్షిణ భారత ప్లేబ్యాక్ రంగంలో అగ్రగామి గాయకురాలు పి. సుశీల. 12 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమెను ‘గాన సరస్వతి’ అనడం అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లోని విజయ నగరంలో 1935 నవంబర్ 13న ప్రసిద్ధ క్రిమినల్ న్యాయవాది,సంగీత ప్రియుడు పులపాక ముకుంద రావు – శేషావతారం దంప తుల ఐదవ సంతానంగా ఆమె జన్మించారు.సుశీల కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ వయొలిన్ విద్వాంసులైన ‘సంగీత కళానిధి’ ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆయన కుమారుడు ద్వారం భావనరాయణల వద్ద ఆరు సంవత్సరాలు కఠిన శిక్షణ పొంది, గాత్ర సంగీతంలో డిప్లొమా సాధించారు. మొదట్లో వివాహ వేడుకలలో శాస్త్రీయ సంగీతం ఆలపించేవారు. సినిమా పాటలు పాడటానికి చెన్నై చేరే ముందు కొన్ని ఆలయ కచేరీలు ఇచ్చేవారని కొద్దిమందికి మాత్రమే తెలుసు. సుశీల స్వరం మూడో స్థాయిని కూడా స్పష్టంగా దాటుతుందని అందరికీ తెలుసు. ప్రముఖ వీణా విద్వాన్ ‘వీణ గాయత్రి’... సుశీల స్వరాన్ని ఒక గాత్ర వీణగా వ్యాఖ్యానించారు. ఆమె గొంతులో సూక్ష్మ గమకాలు సైతం అత్యంత స్పష్టతతో వినవచ్చు. ఈ గుణం సుశీలను శాస్త్రీయ గాయకులు కూడా భయపడే, గౌరవించే గాయనిగా చేసింది. ఆమె 1970లో ‘ఉయర్న్ద మనిదన్’ (1969) చిత్రానికి ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచు కున్నారు. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ చిత్రాలకు మరో నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఆ కాలంలోని ప్రముఖ గాయకులైన ఘంటసాల వేంకటేశ్వర రావుతో తెలుగులో, టి.ఎం. సౌందరరాజన్, పి.బి. శ్రీనివాస్లతో తమిళం, కన్నడ భాషలలో; తరువాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో తమిళం, తెలుగు, కన్నడ భాషలలో; కె.జె. ఏసుదాస్తో మలయాళంలో ఆమె యుగళగీతాలు పాడి దక్షిణాదిలో అగ్రగామి గాయనిగా నిలిచారు. 1991లో తమిళనాడు అత్యున్నత కళా పుర స్కారం ‘కలైమామణి’, 2004లో తెలుగు సినిమా రంగంలో ఆమె జీవితకాల కృషికి ‘రఘుపతి వెంకయ్య అవార్డు’, 2008లో 73 ఏళ్ళ వయసులో ‘పద్మభూషణ్’ పురస్కారం వంటివి వరించాయి. ఆమె సమకాలీనులైన ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత; ఆమె జూనియర్లు కె.ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ వంటివారందరూ ఆమె స్వర నాణ్యత, స్వాభావిక శ్రావ్యతను ఎంతో గౌరవించారు. ఆమె 1962 నుండి 1990ల చివరి వరకు 17,695 పాటలను రికార్డ్ చేయడం... పాట పట్ల ఆమె నిబద్ధతకు నిదర్శనం. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం 12 భారతీయ భాషలలో సోలోలు, డ్యూయెట్లు, కోరస్, నేపథ్య పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె అభిమానులు చాలా మంది ఆమెకు ’భారతరత్న’ పురస్కారం ఆమె 90వ పుట్టిన రోజు కానుకగా వస్తే బాగుండు అనుకుంటున్నారు. అందుకు ఆమె ముమ్మాటికీ అర్హురాలు.– డా.ఎం.ఎస్. నీలోత్పల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తమిళనాడు(నేడు గాన సరస్వతి పి. సుశీల 90వ జన్మదినం)
10.1 కోట్ల మంది : ఒడుదొడుకులే అసలు కారణం
మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మధు మేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 10.1 కోట్లకు చేరింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం (Diabetes) క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల అవగాహన కల్పించడానికి ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా ప్రతి ఏడాదీ జరుపుకోవడం ముదావహం.నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు... మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయి. అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో చోటు చేసు కున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, జన్యువులలో ఉత్పరివర్తనలు... ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్ను నియంత్రించే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయి. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ (Insulin) ఉత్పత్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు (రెసిస్టెన్స్), శరీర కణాలు ఇన్సులిన్ను వినియోగించుకోలేకపోవడం... వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో చక్కెర శాతాన్ని పెంచేస్తున్నాయి. చదవండి: ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్ల అవశేషాల ప్రభావం వల్ల ప్యాంక్రి యాస్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి అయినా... శరీర కణజాలాలలో నిరోధకత వచ్చి అది ఉపయోగపడక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి (Sugar Level) అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం ద్వారా జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ టి. సేవకుమార్ వ్యవస్థాపకులు, ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్–డయాబెటిక్ క్లబ్, గుంటూరు(నవంబర్ 14 ప్రపంచ మధుమేహ నిరోధక దినం)
ఢిల్లీలో మరో పేలుడు శబ్దం
ఢిల్లీ: ఢిల్లీలో మరో పేలుడు సంభవించింది. మహిపాల్పూర్ (Mahipalpur) ప్రాంతంలోని రాడిసన్ హోటల్ సమీపంలో గురువారం ఉదయం భారీ శబ్దంతో పేలుడు జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉదయం 9.18 గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. డీటీసీ బస్సు టైర్ పేలిన భారీ శబ్దంగా పోలీసులు పేర్కొన్నారు.అనుమానాస్పద వస్తువులేవి కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. సాధారణ టైరు పగిలిన సంఘటనగా పోలీసులు తేల్చారు. ఉదయం 9.18 నిమిషాల సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ శబ్దం విన్న ఓమహిళ మొదట PCR కాల్ చేయగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.At 9:18am on November 13, a commuter informed the Delhi Police about explosion near Radisson Hotel in Mahipalpur #DelhiUpon reaching the site, the police found nothing. It was a tyre burst of a DTC bus. #RedFort #LalQila #DelhiPolice pic.twitter.com/60WMstnA9r— Anish Singh (@anishsingh21) November 13, 2025ఢిల్లీ పోలీస్ బృందాలు, బాంబు నిర్వీర్య దళం, అగ్నిమాపక సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. అయితే, హోటల్ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఢౌలా కువాన్ వైపు వెళ్తున్న డీటీసీ బస్సు వెనుక టైరు పేలడంతో ఆ శబ్దం వచ్చిందని తెలిపారు. నవంబర్ 10 సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు నేపథ్యంలో దేశ రాజధానితో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ పేలుడు: ‘మహిళా డాక్టర్’ను ‘డీకోడ్’ చేసిన సన్నిహితులు
లక్నో: అది.. యూపీలోని లక్నోకు చెందిన జనసాంద్రత కలిగిన దాలిగంజ్ ప్రాంతం.. అక్కడి ఒక ఇరుకైన సందులో సయ్యద్ అహ్మద్ అన్సారీ ఇల్లు ఉంది. అతని కుమార్తె డాక్టర్ షాహీన్ సయీద్ను ఢిల్లీలో జరిగిన పేలుడు కేసుతో పాటు ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అందరి దృష్టి డాక్టర్ షాహీన్ సయీద్వైపు మళ్లింది.‘మాట్లాడి నాలుగేళ్లయ్యింది’పాకిస్తాన్కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (జెఎం) మహిళా నియామక విభాగాన్ని భారతదేశంలో నెలకొల్పేందుకు డాక్టర్ సయీద్ పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫరీదాబాద్లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికిన దరిమిలా డాక్టర్ సయీద్ను పోలీసులు అరెస్టు చేశారు. లక్నోలో ఉంటున్న సయీద్ మొహమ్మద్ షోయబ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, ఏటీఎస్ అధికారులు తమ ఇంటికి వచ్చారని, మర్యాద పూర్వకంగా వ్యవహరించారని తెలిపారు. తన సోదరి నాలుగేళ్లుగా తమతో తమతో మాట్లాడలేదన్నారు. అయితే తన సోదరి గురించి తాను ఆందోళన చెందుతున్నానన్నారు. ఆమెకు ఐఐఎం రోడ్దులో ఎక్కడో ఒక ఇల్లు ఉందని మాత్రమే తెలుసని, అయితే అది ఎక్కడ ఉందో తనకు తెలియదన్నారు. ఆమె తప్పు చేసినట్లు తాను ఎప్పుడూ అనుమానించలేదని పేర్కొన్నారు. ఆమె మెడిసిన్ చదువుతున్నప్పుడు కూడా అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇప్పటికీ ఈ ఆరోపణలను నమ్మలేక పోతున్నానని అన్నారు.‘చిన్న కొడుకును అరెస్ట్ చేశారు’డాక్టర్ సయీద్ తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ మాట్లాడుతూ తన కుమార్తె అలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నదంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. తన పెద్ద కుమారుడు షోయబ్ నాతో ఇక్కడే ఉంటున్నాడని, రెండవ కొడుకు షాహీన్ సయ్యద్ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. తన చిన్న కొడుకు పర్వేజ్ అన్సారీ చాలా కాలం క్రితమే నగరం విడిచి వెళ్లాడన్నారు. తాను చివరిసారిగా తన కుమార్తె షాహీన్తో నెల రోజుల క్రితం మాట్లాడానన్నారు. సయీద్ మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నదని, ఆ తరువాత విడాకులు తీసుకున్నాదని అహ్మద్ అన్సారీ తెలిపారు.‘విడాకుల తర్వాత...’క్రైమ్ బ్రాంచ్ అధికారులు డాక్టర్ సయీద్ మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్ను విచారించారు. తాము 2023, నవంబర్లో వివాహం చేసుకున్నామని, అయితే తమకు విడాకులు 2012 చివరిలో అయ్యాయన్నారు. ఆమె మనసులో ఏముందో తనకు తెలియదని, మా మధ్య ఎప్పుడూ ఎలాంటి వివాదం లేదన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఆమె ప్రమేయం ఉందనే సంగతి తనకు తెలియదని, తమ విడాకుల తర్వాత ఆమె ఏమి చేస్తున్నదో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుడు తర్వాత జరిగిన నిఘా సమాచారం ఆధారంగానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు డాక్టర్ హయత్ను విచారించారని కాన్పూర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రఘుబీర్ లాల్ మీడియాకు తెలిపారని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడి
ఎన్ఆర్ఐ
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
క్రైమ్
సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల : జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో బుధవారం ఉదయం ప్రత్తిపాటి సృజన్ (21) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థి మృతిపై స్థానికంగా విభిన్న కథనాలు వినిపిస్తుండగా పోలీసులు మాత్రం తల్లిదండ్రులు వస్తే కానీ ఏమీ చెప్పలేమని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సృజన్ ఎచ్చెర్ల ఎస్ఎంపురం సమీపంలోని ట్రిపుల్ ఐటీ ఇంజినీర్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులందరితో సరదాగా ఉండే సృజన్ బుధవారం ఉదయం11 గంటలకు కళాశాలలోనే నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంది. ఈలోగా మొదటి అంతస్తులో ఉన్న ఈసీ డిపార్ట్మెంట్ విద్యార్థుల్లో ఒకరికి ఫోన్ చేసి రూంలో ఎవరైనా ఉన్నారా అని సృజన్ అడిగాడు. ఎవరూ లేరని చెప్పడంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఎగ్జామ్ నుంచి వచ్చాక గది తలుపులు మూసి ఉండటంతో వెంటిలేటర్ నుంచి గమనించిన విద్యార్థులు ఏదో జరిగిందని అనుకుంటుండగా మెస్ ఆఫీసర్ రావడం.. అంతా చూసేసరికి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించడంతో అవాక్కయ్యారు. వెంటనే కళాశాల యాజమాన్యం గుంటూరులో ఉన్న సృజన్ తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన బయల్దేరారు. ఎస్ఐ వి. సందీప్ తమ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. విభిన్న కథనాలెన్నో.. కాగా సృజన్ ఆత్మహత్యపై అక్కడ విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బ్యాక్లాగ్స్ 11 సబ్జెక్టులు ఉండటంతో ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని కొందరు అనుకుంటుండగా.. ఓ అమ్మాయితో స్నేహంగా ఉండటం.. ఆమె అన్నదమ్ములు అదే కళాశాలలో చదువుతుండటం.. వారు ఒకట్రెండు సార్లు సృజన్ను హెచ్చరించడం చేశారని తెలిసింది. అంతేకాక మంగళవారం రాత్రి పది మందివరకు కళాశాలలో ప్రవేశించారని, వారి వెనుక ఆ విద్యార్థులున్నారని, సృజన్ను కొట్టారని సమాచారం. ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తల్లిదండ్రులు వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమన్నారు. ఐదుగురితో పోలీస్ పికెట్ మృతిచెందిన విద్యార్థి దళిత సామాజికవర్గానికి చెందడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
ఎంత పని చేశావమ్మా!
అనకాపల్లి జిల్లా: ఆరు నెలల బిడ్డను చంపి, ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. చోడవరం పట్టణ శివారు ద్వారకానగర్ సమీపంలో కనకమహాలక్ష్మినగర్లోని తమ నివాస గృహంలో పోరెడ్డి వీణ (30), ఆమె 6 నెలల బాబు బుధవారం సాయంత్రం విగత జీవులై కనిపించారు. వీణ మెడకు చీర ఉరి వేసుకున్నట్టుగా ఉండగా.. ఆమె పక్కనే కన్నకొడుకు మృతదేహం ఉంది. మృతురాలు వీణ భర్త ఉమామహేశ్వరరావు బుచ్చెయ్యపేట మండలం కేపీ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామానికి చెందిన వీణ, అదే జిల్లా వీఎం వలస మండలం కౌడుతండ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ప్రేమించుకొని, పెద్దల సమక్షంలో గత ఏడాది జనవరి నెలలో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు నెలల బాబు వియాన్స్ ఉన్నాడు. వీరు చోడవరం కనకమహాలక్ష్మినగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పోలీసులకు భర్త చెప్పిన వివరాల ప్రకారం.. రోజూలాగే ఉమామహేశ్వరరావు బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో భార్య వీణకు ఫోన్ చేస్తున్నప్పటికీ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పాఠశాల ముగిశాక ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూసేసరికి గదిలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని వీణ మృతి చెంది ఉండగా.. మంచం పక్కనే బాబు విగత జీవిగా పడి ఉన్నాడు. బాబును తలగడతో నొక్కి చంపేసి తర్వాత ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు సంఘటన స్థలంలో లభించిన వివరాలను బట్టి పోలీసులు భావిస్తున్నారు. భార్యభర్తల మధ్య కలహాల కారణంగానే వీణ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామని చోడవరం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలరాజు చెప్పారు. భర్త పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు వచ్చాక మిగతా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. భర్త ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కిటికీలోంచి చెయ్యి పెట్టి.. తలుపు గడియ తీసి..
రాజేంద్రనగర్: కిటికీ పక్కనే ఇంటి ప్రధాన ద్వారం ఉండటం దొంగ వరంగా మారింది. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా 31 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిస్మత్పూర్ ఓంనగర్ ఎస్ఎం ఎన్క్లేవ్లో కిరణ్ గౌడ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. కిరణ్ బంధువుల ఇంట్లో గురువారం వివాహం జరగాల్సి ఉంది. లాకర్ నుంచి 31 తులాల బంగారు ఆభరణాలు తీసుకొచ్చి ఇంట్లోని బీరువాలో భద్రపరిచాడు. మంగళవారం కుటుంబ సభ్యులంతా నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో ఇంటి వెనకాలే ఉన్న పిట్ట గోడ దూకి లోనికి వచి్చన దొంగ.. ప్రధాన ద్వారం పక్కనే తెరిచి ఉన్న కిటికీలోంచి చెయ్యిపెట్టి గడియ తీసి లోపలికి వెళ్లాడు. బీరువాలోని బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. అంతకుముందు ఇదే ఎన్క్లేవ్లోని రెడ్డి విజయ్ ఇంటి తాళాన్ని పగులగొట్టి లోనికి వెళ్లాడు. బీరువా కప్ బోర్డు అన్ని వెతకగా ఏమీ దొరకలేదు. దీంతో కప్ బోర్డు తలుపులను విరగ్గొట్టి బయట పడేశాడు. కిరణ్ గౌడ్ ఇంట్లో చోరీ అనంతరం మరో ఇంటి ప్రహరీ దూకి లోపలికి వెళ్లా డు. అçప్పుడే నిద్ర లేచిన యజమాని ఎవరు అని ప్రశ్నించే లోపు గోడ దూకి పరారయ్యాడు. ఎంఎస్ ఎన్క్లేవ్ వాచ్మన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఏడు నెలల గర్భిణి మృతి
మంచిర్యాల జిల్లా: వారిది ఒక అందమైన గిరిజన కుటుం బం. భర్త బీఎస్ఎఫ్ జవాన్గా ఉద్యోగం చేస్తుండగా, భార్య బీఎడ్ పూర్తి చేసి అంగన్వాడీ ఆయాగా పని చేస్తోంది. వారికి నాలుగేళ్ల కొడుకు ఉండగా, భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. మరో రెండు నెలలు గడిస్తే వారి కుటుంబంలో మరొకరు చేరుతారనే ఆనందంలో ఉండగా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రసవానికి ఆపరేషన్ చేసే సమయంలో గర్భిణీతో పాటు పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమటిచేను గ్రామపంచాయతీ సాముగూడకు చెందిన అనురాధ(35)కు సోనాపూర్కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కుడిమేత లక్ష్మణ్తో వివాహం జరిగింది. భర్త ఢిల్లీలో విధులు నిర్వహిస్తుండగా, అనురాధ తన తల్లి ఇంటివద్ద ఉంటుంది. ఏడు నెలల గర్భిణి అయిన అనురాధకు బుధవారం ఉదయం కడుపునొప్పి, ఫిట్స్ రావడంతో 108 అంబులెన్స్లో మంచిర్యాలలోని మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడ మరోసారి ఫిట్స్ రావడంతో వైద్యులు ప్రసవం చేసేందుకు ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో అనురాధ మృతిచెందింది. కాగా పుట్టిన మగశిశువును కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో ఫిట్స్ రావడంతో గర్భిణి మృతిచెందిందని, కొద్ది సేపటికి శిశువు సైతం మృతిచెందినట్లు మండల పీహెచ్సీ వైద్యురాలు దివ్య తెలిపారు. ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ రాక కోసం మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు జరుపలేదు.
వీడియోలు
Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
Ambati: ధర్మారెడ్డి విచారణపై ABN, TV5 పిచ్చి వార్తలు...
Nidadavolu: టీడీపీ బెల్ట్ షాపుల దందా.. బాటిల్పై అదనంగా రూ.30 వసూలు
ReNew సంస్థను రాష్ట్రం నుంచి పంపేసారంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు
విజయవాడలో నడిరోడ్డుపై దారుణహత్య
అంకాలమ్మ గూడూరు గ్రామ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: వైఎస్ అవినాష్
Sudha Madhavi: నన్ను బెదిరించి వీడియో రికార్డు చేశారు..!
తిరుపతిలో ప్రజా ఉద్యమం చూసి బిత్తరపోయిన పోలీసులు
పవన్ కల్యాణ్కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
మోసాలతో పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం

