వైఎస్సార్సీపీ గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం?.. షాకింగ్ వీడియో
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కారుకు నిప్పు అంటించిన తర్వాత సదరు వ్యక్తి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పటికే పలుమార్లు పూనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటన అనంతరం తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. ఇప్పటికైనా పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
అడ్డుకుంటే ఆగేదా.. జనాభిమానం!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలతో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి సర్కారు వణికిపోతున్నట్లుగా ఉంది. ప్రతి పర్యటన సందర్భంగా పలు రకాల ఆంక్షలు పెట్టి.. ఎలాగైనా సరే ఆ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పాపం.. వారి ప్రయత్నాలేవీ ఫలించడం లేదు సరికదా.. జగన్ సభలు, పర్యటనలు జనసంద్రాలవుతున్నాయి. తాజాగా జగన్ చేసిన కృష్ణ జిల్లా పర్యటనలో కేవలం 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏడు గంటల సమయం పట్టిందంటే.. జనాభిమానం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సహజంగానే ఇవన్నీ ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర సంస్థలకు కడుపు మంట మిగులుస్తుంది. వారి కథనాలు చూస్తే అవి ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే మీడియాను నడుపుతున్నట్లు తేటతెల్లమవుతుంది. అయితే జగన్ టూర్కు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందన్న విషయాన్ని వారు చెప్పకనే చెప్పేస్తున్నారు. ‘‘అడుగడుగునా అరాచకమే’’ అన్న ఈనాడు కథనం చూడండి... జగన్ పోలీసులు పెట్టిన షరతులను ఉల్లంఘించారన్నది ఏడుపు. ఆంధ్రజ్యోతి కూడా జగన్ టూర్తో జనం పాట్లు పడ్డారని గొంతు చించుకుంది. అంతేకానీ ఈ ఎల్లోమీడియా పత్రికలు జనం రాలేదని మాత్రం రాయలేకపోయాయి. రాజకీయ నాయకుల పర్యటనల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటిని నియంత్రణకే పోలీసులు ఉంటారు. కానీ వారు ఆ పని చేయకుండా ఎక్కడెక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వస్తున్న జగన్ అభిమానులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణలు కూడా చాలా చోట్ల పర్యటించారు. కానీ ఎన్నడూ ఈ రోజు జగన్ పర్యటనలకు పెట్టినన్ని ఆంక్షలు పెట్టలేదు. శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఇంటినుంచి బయటకు వెళ్లవద్దని, ఫలానా టూర్ చేయవద్దని పోలీసులు చంద్రబాబును చెబితే ఆయన ఊరుకోలేదు సరికదా... అంతెత్తున విమర్శించారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వారిపై దుర్భాషలాడారు. హెచ్చరికలు జారీ చేశారు. పుంగనూరు, అంగళ్లు వద్ద పార్టీ కార్యకర్తలను వైఎస్సార్సీపీపై ఉసికొల్పిన సందర్భాన్ని ఎల్లో మీడియా మర్చిపోయి ఉండవచ్చు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు దూకుడు కారణంగా ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీసు వాహనం దగ్ధమైంది. అప్పట్లో అవన్ని ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్లు, అదంతా ప్రభుత్వ తప్పు, పోలీసుల వైఫల్యం అని చెప్పుకుంది టీడీపీ, చంద్రబాబు బృందం. కందుకూరు వద్ద నడిరోడ్డు మీద సభ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినప్పుడు ఎల్లో మీడియాకు జనం పాట్లు కనిపించలేదు. వారికి ఇవి నరకంగా అనిపించలేదు. గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు సభ పెట్టి చీరల పంపిణీ చేసినప్పుడు జరిగిన తొక్కిసలాట వీరికి గుర్తుకు రాదు. విజయవాడలో ఒకసారి పవన్ కళ్యాణ్ రోడ్ షో చేసినప్పుడు గంటలకొద్ది ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మాబోటి వాళ్లం కూడా ఒక సందర్భంలో ట్రాఫిక్లో చిక్కుకున్నాం. జగన్ సీఎంగా ఉండగా... బహిరంగ సభల్లో తొక్కిసలాటలు, మరణాలు లేకుండా చూడడానికి, నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం జీవో ఇస్తే టీడీపీ, ఎల్లో మీడియాకాని రచ్చ రచ్చ చేశాయి. సంపాదకీయాలు సైతం రాసి గగ్గోలు పెట్టాయి. కోర్టుకు వెళ్లి రద్దు చేయించాయి! జగన్ టూర్లో ఎక్కడైనా తొక్కిసలాటలు జరిగాయా? పొరపాటున వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించిన ఘటన తప్ప ఇంకేమైనా ప్రమాదాలు జరిగాయా? కృష్ణా జిల్లా టూర్లో జగన్ కాన్వాయితోపాటు ఇతర ప్రయాణికుల వాహనాలు, బస్సులు అన్నీ మామూలుగానే నడిచాయి. జనం గూమికూడిన చోట ట్రాఫిక్ కొద్దిసేపు ఆటంకం కలిగి ఉండవచ్చు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్కు స్వాగతం చెబుతుంటే ఆయన వారిని కాదని ఎలా వెళ్లిపోగలుగుతారు? ఇవన్ని ప్రజాస్వామ్యంలో భాగం కాదా? జగన్ టూర్ వల్ల జనానికి ఇబ్బందులు వస్తుంటే, అధికార హోదాతో తిరుగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల టూర్ల వల్ల ఇంకెంత ఇబ్బంది కలుగుతుంది? పర్యటన ప్రాంతానికి రావడానికి అరగంటో, గంట ముందునుంచే ట్రాఫిక్ నిలిపివేయడమో, నియంత్రణలు పెట్టడమో చేస్తుంటారు కదా! అప్పుడు జనం పాట్లు పడినా, నరకం చూసినా తప్పు లేదా? జనం జగన్కు నీరాజనం పలుకుతున్న వైనం కూటమి నేతలకు ఆందోళన కలిగిస్తుండవచ్చు. వైఎస్సార్సీపీ ఓటమి పాలైన ఏడాదికే జగన్ సమావేశాలకు ప్రజలు తండోపతండాలుగా వస్తూండేందుకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్ని సంగతి వారికి తెలియదా? నిజానికి పోలీసులు జగన్ టూర్పై పోలీసులు పెట్టిన షరతులు అసంబద్ధమైనవి. హైవేపై గుమి కూడకూడదట. రాకపోకలకు, ప్రజాజీవనానికి అంతరాయం కలగరాదట. జగన్ తో పాటు ఏభై మంది మాత్రమే ఉండాలని, పది వాహనాలే వెళ్లాలని, దిచక్ర వాహనాలకు అనుమతి లేదని మరో షరతు పెట్టారట. ఇలాంటి షరతులు పెట్టిన పోలీసులను విమర్శించాల్సి మీడియా వాటిని సమర్థిస్తూ కథనాలు రాయడం, ఉల్లంఘించారని వైసీపీపై ఎదురుదాడి చేయడం చూస్తే ఈనాడు మీడియా జర్నలిజం ఎంత నీచంగా మారిందో తెలుస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడు వెళుతున్నప్పుడు జనం పోగవ్వకుండా ఎలా ఉంటారు? 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చైతన్యరథం వేసుకుని రాష్ట్రమంతటా టూర్ చేశారు.రహదారులన్నీ కిక్కిరిసిపోయేవి. అయినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దిక్కుమాలిన ఆంక్షలు పెట్టలేదు. అది వదిలేద్దం. చంద్రబాబు కుమారుడు లోకేశ్ యువగళం కార్యక్రమంపై కూడా ఇలాంటి నియంత్రణలు లేవు. సినిమా నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పర్యటనలు జరిపిన సందర్భంలోనూ పోలీసులు ఇలాంటి షరతులు పెట్టలేదు. రాజకీయ నేతలు రోడ్లపై టూర్లు చేయకూడదని, తద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగించరాదన్నదే ఎల్లో మీడియా విధానమైతే అదే మాట చంద్రబాబు పర్యటనల సందర్భంలోనూ చెప్పి ఉండాల్సింది. అప్పుడు చెప్పని సుద్దులు ఇప్పుడు చెప్పడం కచ్చితంగా ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. జగన్ తాజా టూర్లో జనం ప్రభుత్వంపైకి సంధించిన ప్రశ్నలకన్నా, ఇతర చిల్లర అంశాలే ఫోకస్ అవ్వాలన్నదే ఎల్లో మీడియా లక్ష్యం కావచ్చు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జగన్ రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు భరోసాగా రూ.13500 చెల్లింపు మొదలైన హామీలను అమలు చేశారు.దాంతో రైతులను ఏమార్చడానికి ‘‘అన్నదాత సుఖీభవ’’ కింద తాము ఏడాదికి రూ.ఇరవై వేలు ఇస్తామని, ఇతరత్రా అన్నిప్రయోజనాలు కల్పిస్తామని టిడిపి, జనసేన తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశారు. ఇప్పుడేమో వాటిని అమలు చేయడం లేదు. ఒక ఏడాది ఎగవేసి, తదుపరి రూ.ఐదు వేలే ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. మోంథా తుపాను వల్ల రైతుల వరి పంట నేలవాలి పోవడంతో చాలా నష్టపోయారు. వారికి నష్టపరిహారం ప్రకటించలేదు. పైగా పరిహారం తీసుకుంటే ధాన్యం కొనుగోలుకు బాధ్యత లేదని రైతులను బెదిరిస్తున్నారు. రైతులు వీటన్నిటిని జగన్ వద్ద ప్రస్తావించారు. అవన్ని జనంలోకి వెళతాయి కనుక ఈ రకంగా పోలీసులతో అడ్డదిడ్డమైన కండిషన్లు పెట్టించి టూర్ విఫలం చేయాలని చూశారనుకోవాలి. అయినా రైతులే వైసీపీ శ్రేణులే కాదు..సాధారణ జనం కూడా తరలిరావడం కూటమి నేతలకు, ఎల్లో మీడియాకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) మరో కొత్త ప్రయోగానికి తెరలేపాడు. క్వీన్స్ లాండ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో గంభీర్ ఎవరూ ఊహించని విధంగా ఆల్రౌండర్ శివమ్ దూబే (Shivam Dube)ను మూడో స్ధానంలో బ్యాటింగ్కు పంపాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్కు 56 పరుగుల ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్(28) ఓ భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. దీంతో ఫస్ట్ డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడని అంతా భావించారు. కానీ శివమ్ దూబే బ్యాటింగ్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రెగ్యూలర్గా మూడో స్దానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్కు వస్తుంటాడు. మొన్న సంజూ.. ఇప్పుడు దూబేకానీ గంభీర్ మాత్రం మూడో స్ధానంలో వెర్వేరు ఆటగాళ్లను పంపి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో సంజూ శాంసన్ను సూర్య స్ధానంలో బ్యాటింగ్కు పంపారు. కానీ శాంసన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ పూర్తిగా తుది జట్టులోనే కోల్పోయాడు. ఇప్పుడు దూబేను టాపర్డర్లో ప్రమోట్ చేశాడు. అస్సులు దూబేకు టాపర్డర్లో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికి దూబేను ఎందుకు ముందు బ్యాటింగ్ పంపారో గంభీర్కే తెలియాలి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో దూబే ఏకంగా ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ చేశాడు. మూడో టీ20లో అయితే దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఏకంగా తొలిసారి ఫస్ట్డౌన్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ దూబేకు లభించింది. కానీ గంభీర్ నమ్మకాన్ని దూబే నిలబెట్టుకోలేకపోయాడు. హెడ్కోచ్ చేసిన ప్రయోగం విఫలమైంది.18 బంతులు ఎదుర్కొన్న దూబే కేవలం 22 పరుగులు మాత్రమే చేసి నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. దీంతో గంభీర్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. నీవు మారవా? బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరమా? అంటూ పోస్ట్లు పెడుతున్నారు.ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్(46) టాప్ స్కోరర్గా నిలవగా..అభిషేక్ శర్మ(28), శివమ్ దూబే(22), సూర్యకుమార్(20), అక్షర్ పటేల్(21) రాణించారు. తిలక్ వర్మ(5), జితేష్ శర్మ(3) మాత్రం తీవ్ర నిరాశపరిచారు.చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’
ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వృద్ధి కారణంగా ఏర్పడిన గ్లోబల్ ఫ్లాష్ మెమరీ కాంపొనెంట్ల కొరత వల్ల ఎల్ఈడీ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఈడీ టీవీలు సహా అనేక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఫ్లాష్ మొమరీ కాంపొనెంట్ల తయారీలో కీలకంగా ఉన్న కంపెనీలు అధిక మార్జిన్ కలిగిన ఏఐ డేటా సెంటర్ల వైపు మళ్లడమేనని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్లాష్ మెమరీ ధరలు పెరుగుదలLED టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్లో విరివిగా ఉపయోగిస్తున్న ఫ్లాష్ మెమరీ ధరలు కొద్ది నెలల్లోనే భారీగా పెరిగాయి. వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపిన వివరాల ప్రకారం 1GB/8GB మెమరీ ధర ఏప్రిల్లో 2.61 డాలర్ల వరకు ఉండగా అక్టోబర్ నాటికి అది ఏకంగా 14.40 డాలర్లకు పెరిగింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ధరల పెరుగుదల 50 శాతానికిపైగా చేరాయి. ఇది టీవీ తయారీదారుల ఇన్పుట్ ఖర్చులపై ఒత్తిడి పెంచింది.ఏఐ డిమాండ్: సాధారణ ఎలక్ట్రానిక్స్కు అంతరాయంసెమీకండక్టర్ పరిశ్రమలోని ప్రధాన కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల వైపు దృష్టి సారించడమే ఈ కొరతకు మూలకారణం అని తెలుస్తుంది. చిప్ తయారీదారులు ఏఐ డేటాసెట్లలో ఉపయోగించే DDR6, DDR7 చిప్ సెట్ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కారణంగా టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ల్లో సాధారణంగా వాడే DDR3, DDR4 మెమరీ ఉత్పత్తి తగ్గిపోయింది.ఎస్పీపీఎల్(థామ్సన్ బ్రాండ్ లైసెన్స్) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ..‘2021-22 చిప్సెట్ కొరత తర్వాత ఫ్లాష్ మెమరీ అతిపెద్ద సమస్యగా ఉంది. త్వరలో ఎల్ఈడీ టెలివిజన్ ధరలు పెరుగుతాయి’ అన్నారు. ఈ మెమరీ కాంపోనెంట్స్ ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు 2026 కోసం మెమరీ సెట్లను భద్రపరచడానికి పోటీ పడుతుండటంతో సరఫరా గొలుసు అంతరాయాలు పెరిగి ధరల ఒత్తిడి మరింత తీవ్రమైందని నిపుణులు చెబుతున్నారు.ఈ కొరత ఎప్పటివరకంటే..ఈ కొరత కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల వరకు కొనసాగుతుందని ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (OEMలు) అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీలు తమ ఆర్డర్లను వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇన్వెంటరీని క్రమబద్ధీకరిస్తున్నాయి.టీవీలలో ఫ్లాష్ మెమరీని ఎందుకు ఉపయోగిస్తారంటే..స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ, వెబ్ఓఎస్ (webOS), టైజెన్ (Tizen) వంటి ఆపరేటింగ్ సిస్టమ్లపై పనిచేస్తాయి. ఈ OS కోడ్, టీవీని నడిపించే ఫర్మ్వేర్ (firmware) కోడ్ అంతా ఫ్లాష్ మెమరీలోనే శాశ్వతంగా నిల్వ అవుతుంది. టీవీని ఆన్ చేసినప్పుడు ఫ్లాష్ మెమరీలోని ఈ OS, ఫర్మ్వేర్ నుంచి డేటా లోడ్ అవుతుంది. అప్పుడే టీవీ పనిచేయడం మొదలవుతుంది.నెట్ఫ్లిక్స్ (Netflix), యూట్యూబ్ (YouTube), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వంటి యాప్లను వినియోగదారులు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ఫ్లాష్ మెమరీ స్థలాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: రుణదాతలకు ఉపశమనం.. ఈడీ, ఐబీబీఐ ఎస్ఓపీ ఖరారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు..
మాగంటి కుటుంబంలో ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ చిచ్చు!
శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
WPL 2026: రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా
ఒకే ట్రాక్పైకి మూడు రైళ్లు.. ఒక్కసారిగా కలకలం
రైతుల కోసం.. స్మార్ట్ ఫార్మ్ సెంటర్స్
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
IND vs SA: కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్.. శతక్కొట్టిన జురెల్
‘అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు.. మా పోస్టింగ్ ఆర్డర్లు ఏవి?’
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
భవిష్యత్తు బంగారు లోహం!
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
టీవీ5 మూర్తి, గౌతమి చౌదరికి షాక్!
సాక్షి కార్టూన్ 05-11-2025
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
స్మృతి మంధనకు భారీ షాక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
ఆల్రెడీ సీఎం అయ్యారుగా! ఇక నా ఓటు నీకెందుకని వెళ్లిపోతున్నాడ్నార్!
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు..
మాగంటి కుటుంబంలో ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ చిచ్చు!
శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
WPL 2026: రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా
ఒకే ట్రాక్పైకి మూడు రైళ్లు.. ఒక్కసారిగా కలకలం
రైతుల కోసం.. స్మార్ట్ ఫార్మ్ సెంటర్స్
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
IND vs SA: కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్.. శతక్కొట్టిన జురెల్
‘అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు.. మా పోస్టింగ్ ఆర్డర్లు ఏవి?’
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
భవిష్యత్తు బంగారు లోహం!
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
టీవీ5 మూర్తి, గౌతమి చౌదరికి షాక్!
సాక్షి కార్టూన్ 05-11-2025
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
స్మృతి మంధనకు భారీ షాక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
ఆల్రెడీ సీఎం అయ్యారుగా! ఇక నా ఓటు నీకెందుకని వెళ్లిపోతున్నాడ్నార్!
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!
సినిమా
ఇండో-చైనా యుద్ధంపై సినిమా.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ లేటెస్ట్ మూవీ '120 బహదూర్'. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా లీడ్ రోల్స్ చేశారు. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)మన దేశానికి చెందిన 120 మంది సైనికులు.. ఏకంగా 3000 మంది చైనా సైన్యంతో ఎలా పోరాడారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది '120 బహదూర్' మూవీ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకే వచ్చిన వార్ బ్యాక్ డ్రాప్ మూవీలా ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించేలా ఉన్నాయి.(ఇదీ చదవండి: తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్)
పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్ నటి హల్దీ ఫంక్షన్
బుల్లితెర నటి దీప్తి మన్నె (Deepthi Manne) పెళ్లి ఘడియలు వచ్చేశాయి. గత నెలలో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన ఆమె ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు రోహన్తో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో నటి దీప్తి - రోహన్ జంట హల్దీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో హల్దీ వేడుకలు సంతోషంగా, ఉత్సాహంగా సాగాయి. సీరియల్స్తో ఫేమస్ఈమేరకు ఓ వీడియోను దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బెంగళూరుకు చెందిన దీప్తి మన్నె.. మొదట్లో కన్నడ భాషలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. రాధమ్మ కూతురు, జగద్ధాత్రి, పద్మావతి వంటి పలు సీరియల్స్ చేసింది. తెలుగులో ఇక సెలవ్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Navya Rao (@navya_raooo) View this post on Instagram A post shared by Deepthi Manne (@deepthimanne_official) చదవండి: బూతులు, అసభ్యకరమైన కామెంట్లు.. పోలీసులకు చిన్మయి ఫిర్యాదు
కేజీఎఫ్ నటుడు కన్నుమూత
కన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసిన హరీశ్.. కేజీఎఫ్ మూవీలో చాచా అనే ముస్లిం వ్యక్తిగా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కేజీఎఫ్ రెండో పార్ట్ రిలీజయ్యే సమయానికి ఆయనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.క్యాన్సర్తో పోరాటంచూస్తుండగానే క్యాన్సర్ ముదిరి నాలుగో స్టేజీకి చేరింది. ఈ మహమ్మారి కారణంగా అతడు బక్కపలుచగా మారిపోయారు, కానీ, పొట్టభాగం మాత్రం ఉబ్బిపోయింది. చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు అవుతాయని.. ఎవరైనా సాయం చేయండంటూ ఆగస్టులో మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్ సర్జా తనకు తోచిన సాయం చేశారు. గతంలో యష్ కూడా సాయం చేశారు. ఇకపోతే హరీశ్ రాయ్.. ఓం, రాజ్ బహదూర్, దండుపాల్య, సంజు వెడ్స్ గీత వంటి పలు చిత్రాల్లో నటించారు.చదవండి: స్పిరిట్లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం!
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
గతంతో పోలిస్తే సినిమాలు చేయడం తగ్గించేసిన అనసూయ.. గతేడాది పుష్ప 2, రజాకర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ ఏడాది రిలీజైన వాటిలో 'అరి' అనే మూవీలో లీడ్ రోల్ చేయగా 'హరిహర వీరమల్లు'లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతానికైతే అనసూయ కొత్త చిత్రాల్లో నటించట్లేదు. అలాంటిది ఈమె చేసిన తమిళ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు రిలీజైంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)నాలుగైదేళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలు చేసిన అనసూయ.. అదే టైంలో తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాంటి వాటిలో 'ఊల్ఫ్' ఒకటి. ప్రభుదేవా హీరో. అనసూయతో పాటు లక్ష్మీ రాయ్ హీరోయిన్గా చేసింది. వినూ వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ని 2023 ఆగస్టులో రిలీజ్ చేశారు. తర్వాత ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'సాసా' అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.ఇందులో ప్రభుదేవా సరసన అనసూయ, లక్ష్మీ రాయ్, మరో నటి గ్లామరస్గా కనిపించారు. పేరుకే తమిళ సినిమా అయినప్పటికీ 'ఊల్ఫ్'ని తెలుగు, కన్నడ, హిందీలోనూ రిలీజ్ చేస్తామని టీజర్ రిలీజ్ టైంలో ప్రకటించారు. ఇప్పుడు వీడియో సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి త్వరలో ఏమైనా మూవీని థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి? ఏదేమైనా అనసూయ ఇలాంటి రొమాంటిక్ పాటలో కనిపించడం తెలుగు ప్రేక్షకులకు చిన్నపాటి షాకే అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్)
న్యూస్ పాడ్కాస్ట్
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్పై తీవ్ర ప్రభావం
క్రీడలు
క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా!
‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. నేను శతకం పూర్తి చేసుకున్నా. సచిన్ బ్యాటింగ్కు వచ్చాడు. వచ్చీరాగానే ‘వా’ (స్టీవ్ వా, మార్క్ వా) సోదరులు అతడిని స్లెడ్జ్ చేయడం మొదలుపెట్టారు.నీ తల పగులగొడతా చూడుఅప్పుడు మైక్ విట్నీ ఫీల్డింగ్ కోసం 12th మ్యాన్గా వచ్చాడు. అప్పటికే నేను అలెన్ బోర్డర్తో పోటీ పడుతున్నా. ఇంతలో అతడు బంతి చేతులో పట్టుకుని నన్ను చూస్తూ.. ‘నువ్వైతే క్రీజులోకి వెళ్లు.. నీ తల పగులగొడతా చూడు’ అని నాతో అన్నాడు.నేను వెంటనే వెనక్కి తిరిగి.. పిచ్ మధ్య వరకు వెళ్లి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అంతా వినిపించేలా గట్టిగా అరిచాను. ‘హే మైక్.. బంతిని విసరడం కాదు.. అద్భుతంగా బౌలింగ్ చేస్తేనే లెక్క. నువ్వెప్పటికీ ఆస్ట్రేలియా 12th మ్యాన్వి కాలేవు’ అని అరిచాను.నువ్వు నోరు మూసుకోఇంతలో సచిన్ నా దగ్గరికి వచ్చి.. తాను కూడా సెంచరీ చేసే ఆగమని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి వాళ్లకు వాళ్ల మాటల్ని తిరిగి ఇచ్చేద్దాం అన్నాడు. కానీ నేను మాత్రం.. ‘నువ్వు నోరు మూసుకో.. ఇప్పటికే చాలా అయింది. నీ బ్యాట్తో నువ్వు మాట్లాడు (పరుగులు రాబట్టు).. వాళ్ల సంగతి నేను చూసుకుంటా’ అని చెప్పాను’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.దశాబ్దకాలానికి పైగా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రవిశాస్త్రి (Ravi Shastri).. ఆ తర్వాత హెడ్కోచ్గానూ సేవలు అందించాడు. ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్న రవిశాస్త్రి.. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్తో ముచ్చటిస్తూ.. 1992 నాటి ఆస్ట్రేలియా టూర్ జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నాడు.పరుగుల మీదే దృష్టి పెట్టు నాడు సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ దిగ్గజం అలెన్ బోర్డర్ తమను స్లెడ్జ్ చేశాడని.. ఆ సమయంలో సచిన్కు కేవలం పరుగుల మీదే దృష్టి పెట్టాలని తాను సూచించినట్లు రవిశాస్త్రి తెలిపాడు. కాగా 1981- 1992 వరకు టీమిండియాకు ఆడిన రవిశాస్త్రి.. 80 టెస్టుల్లో 3830, 150 వన్డేల్లో 3108 పరుగులు సాధించాడు.ఇక అత్యధిక పరుగుల వీరుడిగా ప్రపంచ రికార్డు సాధించిన సచిన్ టెండుల్కర్.. 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో వంద సెంచరీలు ఉన్నాయి. తద్వారా ప్రపంచంలో ఏకైక శతక శతకాల ధీరుడిగా సచిన్ కొనసాగుతున్నాడు.చదవండి: హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడింది?.. ప్రధాని మోదీ ప్రశ్నకు దీప్తి శర్మ జవాబు ఇదే
సౌతాఫ్రికాతో మ్యాచ్.. ధ్రువ్ జురెల్ వీరోచిత సెంచరీ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రెడ్ బాల్ క్రికెట్లో తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు.ఈ ఉత్తర్ప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ 145 బంతుల్లో తన నాలుగవ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 59 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ను జురెల్ తన విరోచిత శతకంతో ఆదుకున్నాడు. తొలుత పంత్ కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించిన జురెల్.. ఆ తర్వాత లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్యాదవ్తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.ఇండియా-ఎ జట్టు 70 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో జురెల్(102)తో పాటు మహ్మద్ సిరాజ్(11) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు వాన్ వుర్రెన్ మూడు వికెట్లు పడగొట్టగా.. సుబ్రాయెన్, మొరేకీ తలా రెండు వికెట్లు సాధించారు. పంత్ రీ ఎంట్రీ.. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నాడు. అయితే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి రావడంతో జురెల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అయితే గత నెలలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో జురెల్ సూపర్ సెంచరీతో అందరని ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు కూడా తనకు వచ్చిన అవకాశాలను జురెల్ అందిపుచ్చుకున్నాడు. అతడు పంత్కు బ్యాకప్గా కొనసాగుతున్నాడు.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. రోవ్మన్ పావెల్ విధ్వంసం.. కానీ..
న్యూజిలాండ్- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీ తలపడ్డాయి. మరి గెలుపు ఎవరిని వరించిందంటే..?!ఐదు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు విండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆక్లాండ్లో బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ వెస్టిండీస్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం అదే వేదికపై రెండో టీ20 జరిగింది. ఆక్లాండ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (16), వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (11) మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (25 బంతుల్లో 39) రాణించాడు.కేవలం 28 బంతుల్లోనేఇక నాలుగో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది ఏకంగా 78 పరుగులు సాధించాడు. చాప్మన్ విధ్వంసకర ఇన్నింగ్స్కు తోడు.. డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 8 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచాడు.Starring Mark Chapman: A Bowler’s Nightmare 🎥#NZvWI pic.twitter.com/KXWomWevnN— FanCode (@FanCode) November 6, 2025ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ బ్రాండన్ కింగ్ (0)ను జేకబ్ డఫీ డకౌట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అలిక్ అథనాజ్ (25 బంతుల్లో 33), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (26 బంతుల్లో 24) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. మిడిలార్డర్లో అకీమ్ ఆగస్టి (7), జేసన్ హోల్డర్ (16) నిరాశపరచగా.. ఏడో నంబర్ ఆటగాడు రోస్టన్ చేజ్ (6) కూడా విఫలమయ్యాడు.రోవ్మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ.. విండీస్ పవర్ హిట్టర్ రోవ్మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే ఒక ఫోర్, ఆరు సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించి జట్టును విజయానికి చేరువ చేశాడు.అతడికి తోడుగా రొమారియో షెఫర్డ్ (16 బంతుల్లో 34), మాథ్యూ ఫోర్డ్ (13 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో కివీస్ విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆఖరి ఓవర్లో విండీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా మారింది.ఆఖరి ఓవర్లో కైలీ జెమీషన్ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే ఫోర్డ్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత పరుగులేమీ రాలేదు. మూడో బంతి నోబాల్ కాగా ఫోర్డ్ మరో ఫోర్తో చెలరేగాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో పావెల్ నాలుగో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి చాప్మన్కు క్యాచ్ ఇచ్చాడు.ఆఖరి బంతి వరకు ఉత్కంఠదీంతో విండీస్ కీలక వికెట్ కోల్పోగా.. అకీల్ హొసేన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఐదో బంతికి అకీల్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి విండీస్ విజయానికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఇక్కడే జెమీషన్ మాయ చేశాడు. అద్భుత బంతిని సంధించగా.. ఫోర్డ్ సింగిల్కే పరిమితమయ్యాడు. దీంతో మూడు పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించిన ఆతిథ్య కివీస్ సిరీస్ను 1-1తో సమం చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి, సాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. డఫీ, జెమీషన్ చెరో వికెట్ తీశారు. చాప్మన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టీ20కి సాక్స్టన్ ఓవల్ వేదిక.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) మరో కొత్త ప్రయోగానికి తెరలేపాడు. క్వీన్స్ లాండ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో గంభీర్ ఎవరూ ఊహించని విధంగా ఆల్రౌండర్ శివమ్ దూబే (Shivam Dube)ను మూడో స్ధానంలో బ్యాటింగ్కు పంపాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్కు 56 పరుగుల ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్(28) ఓ భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. దీంతో ఫస్ట్ డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడని అంతా భావించారు. కానీ శివమ్ దూబే బ్యాటింగ్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రెగ్యూలర్గా మూడో స్దానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్కు వస్తుంటాడు. మొన్న సంజూ.. ఇప్పుడు దూబేకానీ గంభీర్ మాత్రం మూడో స్ధానంలో వెర్వేరు ఆటగాళ్లను పంపి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో సంజూ శాంసన్ను సూర్య స్ధానంలో బ్యాటింగ్కు పంపారు. కానీ శాంసన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ పూర్తిగా తుది జట్టులోనే కోల్పోయాడు. ఇప్పుడు దూబేను టాపర్డర్లో ప్రమోట్ చేశాడు. అస్సులు దూబేకు టాపర్డర్లో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికి దూబేను ఎందుకు ముందు బ్యాటింగ్ పంపారో గంభీర్కే తెలియాలి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో దూబే ఏకంగా ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ చేశాడు. మూడో టీ20లో అయితే దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఏకంగా తొలిసారి ఫస్ట్డౌన్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ దూబేకు లభించింది. కానీ గంభీర్ నమ్మకాన్ని దూబే నిలబెట్టుకోలేకపోయాడు. హెడ్కోచ్ చేసిన ప్రయోగం విఫలమైంది.18 బంతులు ఎదుర్కొన్న దూబే కేవలం 22 పరుగులు మాత్రమే చేసి నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. దీంతో గంభీర్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. నీవు మారవా? బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరమా? అంటూ పోస్ట్లు పెడుతున్నారు.ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్(46) టాప్ స్కోరర్గా నిలవగా..అభిషేక్ శర్మ(28), శివమ్ దూబే(22), సూర్యకుమార్(20), అక్షర్ పటేల్(21) రాణించారు. తిలక్ వర్మ(5), జితేష్ శర్మ(3) మాత్రం తీవ్ర నిరాశపరిచారు.చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’
బిజినెస్
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 90.33 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 83,368.82 వద్ద, నిఫ్టీ 78.30 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో.. 25,519.35 వద్ద నిలిచాయి.ఎక్స్క్సారో టైల్స్, రెడింగ్టన్, ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్లింక్ హోల్డింగ్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫైనోటెక్స్ కెమికల్, అప్డేటర్ సర్వీసెస్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్, జ్యోతి స్ట్రక్చర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
అమెరికా టెక్ కంపెనీలపై నిషేధం విధిస్తే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో సర్వీసులు అందిస్తున్న యూఎస్ టెక్నాలజీ కంపెనీలపై నిషేధం విధించే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో వ్యాపార వర్గాలు, టెక్ నిపుణుల్లో ఆందోళన మొదలైంది. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన సాంకేతిక స్వావలంబన (టెక్ రెసిలెన్స్)ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు నొక్కి చెప్పారు.ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘అమెరికా టెక్ ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా ట్రంప్ ఇండియాలో ఎక్స్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాట్జీపీటీ వంటి వాటిని నిషేధిస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. దీనికన్నా భయంకరమైంది లేదు! ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు ప్లాన్ బీ ఏమిటో ఆలోచించండి’ అని తెలిపారు. గోయెంకా అభిప్రాయాన్ని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సమర్థిస్తూ ‘నేను అంగీకరిస్తున్నాను. మనం అప్లికేషన్ స్థాయికి మించి అధికంగా టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్స్, చిప్స్, ఫ్యాబ్స్.. అన్ని విభాగాల్లో యూఎస్ టెక్నాలజీపై ఆధారపడడం పెరుగుతోంది. దీని పరిష్కరించాలంటే 10 సంవత్సరాల నేషనల్ మిషన్ ఫర్ టెక్ రెసిలెన్స్ అవసరం’ అని చెప్పారు.గోయెంకా పోస్ట్పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. భారత్ నుంచి అమెరికా టెక్ కంపెనీలు అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను కేవలం యాప్లపై ఆధారపడటంలా కాకుండా టాలెంట్ సప్లై చైన్గా చూడాలని ఒక యూజర్ అన్నారు. మరో యూజర్.. ట్రంప్ భారతదేశం వంటి పెద్ద టెక్ మార్కెట్పై ఆంక్షలు విధించేంత మూర్ఖుడు కాదని, ఇది జరిగే అవకాశం లేదన్నాడు.ఇదీ చదవండి: మస్క్లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు..
న్యూఢిల్లీ: బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)రుణ మోసం కేసులో విచారణ కోసం నవంబర్ 14న విచారణకు రావాలని అనిల్ అంబానీని ఆదేశించింది. అనిల్ అంబానీని ఇదివరకే గత ఆగస్టులో ఈడీ ఓసారి విచారణకు పిలిచి ప్రశ్నించింది.అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై ఇప్పటికే ఈడీ, సీబీఐ, సెబీ విచారిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే రిలయన్స్ గ్రూప్ సంస్థలకు చెందిన దాదాపు రూ .7,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన 30 ఆస్తులు, అధార్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, మోహన్ బీర్ హైటెక్ బిల్డ్, గమేసా ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, విహాన్ 43 రియల్టీ, కాంపియన్ ప్రాపర్టీస్ తో ముడిపడి ఉన్న ఆస్తులు ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు.రూ.17,000 కోట్ల బ్యాంక్ రుణాలు దారి మళ్లించినట్లు అనిల్ అంబానీ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, సెబీతోపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా రంగంలోకి దిగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్ తో సహా పలు గ్రూప్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును ప్రారంభించింది.
42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!
మారుతి సుజుకి ఇండియా.. భారతదేశంలో మూడు కోట్ల యూనిట్ల సేల్స్ సాధించింది. దీంతో అమ్మకాల్లో అరుదైన మైలురాయి చేరుకున్న మొట్టమొదటి ఫ్యాసింజర్ వెహికల్స్ తయారీదారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. 1983 డిసెంబర్ 14న తన మొదటి మారుతి 800 డెలివరీ చేసిన కంపెనీ 42 ఏళ్లలో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.మారుతి సుజుకి తన మొదటి కోటి యూనిట్లను విక్రయించడానికి 28 సంవత్సరాల 2 నెలల సమయం పట్టింది. రెండవ కోటి యూనిట్లను 7 సంవత్సరాల 5 నెలల్లో సాధించగా.. ఇటీవలి కోటి యూనిట్లను విక్రయించడానికి 6 సంవత్సరాల 4 నెలలు మాత్రమే పట్టింది. ఇందులో ఆల్టో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్.ఇదీ చదవండి: ఎయిర్బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!మొత్తం 3 కోట్ల అమ్మకాల్లో.. 47 లక్షల కంటే ఎక్కువ సేల్స్ ఆల్టో పొందగా, వ్యాగన్ ఆర్ 34 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను సొంతం చేసుకుంది. స్విఫ్ట్ 32 లక్షల యూనిట్ల సేల్స్ సాధించింది. ఆ తరువాత స్థానాల్లో బ్రెజ్జా.. ఫ్రాంక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మొత్తం 19 వాహనాలను విక్రయిస్తోంది. వివిధ పవర్ట్రెయిన్ & ట్రాన్స్మిషన్ ఎంపికల ఆధారంగా తీసుకుంటే.. దేశంలో మొత్తం 170 కంటే ఎక్కువ వేరియంట్లు అమ్మకానికి ఉన్నాయి.
ఫ్యామిలీ
పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలు
పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఆయా పంటలను రోడ్డుమీద కుప్పలు కుప్పలుగా పారబోయడం, తగల బెట్టడం లాంటి బాధాకరమైన దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటపుడు ‘అయ్యో.. రేటు వచ్చేదాకా వీటిని భద్రపరిస్తే ఎంత బాగుండు’ అని అనుకుంటాం. అలా పుట్టిన ఆలోచనే ఆధునిక పద్దతులకు బాటలు వేస్తుంది. అదే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. పదండి వారి విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని గగన్బావ్డా తహసీల్లో, తేజస్-రాజేష్ పొవార్ అనే ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్ స్టోరీ ఇది. అది జాక్ఫ్రూట్ (పనస) చిప్స్ బిజినెస్తో. సాధారణంగా పనసకాయలు ఒకసారి కాతకొచ్చాయంటే విపరీతమైన దిగుబడి వస్తుంది. కొల్హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని దాదాపు ప్రతి రైతు తమ పూర్వీకుల నుండి పనస చెట్లు వారసత్వంగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే వాటి ద్వారా మంచి జీవనోపాధిని కూడా పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఉత్తిత్తి కూడా చాలా అధికంగా ఉండేది. దీంతో రైతులు వాటిని కోయలేక, మార్కెట్ చేసుకోలేక, మండీకి రవాణా ఖర్చులు కూడా భరించలేక వాటిని అలాగే పారవేసేవారు.తేజస్, రాజేష్ తల్లిదండ్రులకు జాక్ఫ్రూట్ చెట్లు బాగానే ఉండేవి. ఒక ఏడాది పనసకాయలుబాగా రావడంతో కొల్హాపూర్లో నివసించే బంధువులైన సంగీత, విలాస్ పొవార్ ఇంటికి తీసుకెళ్లారు.మా దగ్గర చాలా కాయలున్నాయి. వృధాగా పార వేస్తున్నామనే విషయాన్ని వారితో షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా వాటిని పారవేయడానికి బదులు చిప్స్గా తయారు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉందని వారు సూచించారట. అంతే అక్కడినుంచి వారి జీవితం మరో మలుపు తిరిగింది.15 కిలోల చిప్స్తో మొదలుదీంతో కుమారులతో కలిసి వారు రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలో దాదాపు 15 కిలోల చిప్స్ను తయారు చేసి కొల్హాపూర్లో ఇంటింటికీ వెళ్లి విక్రయించారు. డిమాండ్ పెరిగినప్పటికీ, ఇంటింటికీ డెలివరీ అందించడం సాధ్యం కాలేదు. దీంతో ఐటీఐ చదువు అయిన వెంటనే తేజస్ పనస చిప్స్ తయారీపై మరింత దృష్టి సారించాడు. ప్యాకేజింగ్ చేయడానికి కొన్ని ప్రాథమిక యంత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నేరుగా హోల్సేల్ వ్యాపారులు రిటైలర్లకు విక్రయించే పద్దతులను ప్రారంభించారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో పది పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాక్ఫ్రూట్ కోత జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభమైజూలై-ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఏటా 4,000 కిలోల జాక్ఫ్రూట్ను ప్రాసెస్ చేసి 1,000 కిలోల వేఫర్లను ఉత్పత్తి చేస్తారు.మార్కెట్ డిమాండ్ బట్టి కేజీ చిప్స్ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు విక్రయిస్తారు. ఇక జాక్ఫ్రూట్ పోలీలు కేజీకి రూ. 700 చొప్పున అమ్ముడవుతాయి. అలా ఏడాది కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు తమ పని పనసపంట వృధాను అడ్డుకోవడంతోపాటు, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని, ఉద్యోగ అవకాశాలను సృష్టించింది అంటూరు తేజస్ సంతోషంగా.పనస చెట్లు 30 అడుగుల నుండి 70 అడుగుల వరకు పెరుగుతాయి. పెద్ద పెద్దకాయలతో దిగుబడి కూడా భారీగా వస్తుంది. దీనికి తోడు భారీ బరువు, కాయలనుంచి వచ్చే జిగట రబ్బరు పాలు కారణంగా వాటిని కోయడం చాలా ఛాలెంజ్ అంటారు తేజస్. అందుకే రైతు లనుంచి కిలోకు రూ. 30 నుంచి రూ. 70 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారట. అలాగే పనసకాయలను ప్రత్యేక పద్ధతిలో కోసేలా నిపుణులను ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం వాటిని చిప్స్, ఇంకా పండిన పండ్లను ఫనాస్ పో (భక్ష్యాలు) జాక్ఫ్రూట్ గుజ్జు, బెల్లం, గోధుమ పిండితో కలిపి తీపి ఫ్లాట్బ్రెడ్ తయారు చేస్తారు. చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన పనసకాయలో పోషక విలువలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు ఇపుడు ఏ పెళ్లిళ్లు, పంక్షన్లలో చూసినా పనస కాయ బిర్యానీ చాలా ఫ్యామస్. జాక్ఫ్రూట్ కబాబ్లు, బిర్యానీలు, ఇతర రెడీ-టు-కుక్ ఉత్పత్తులకు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది.భారతదేశ జాక్ఫ్రూట్ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 1252 కోట్లు. రానున్న ఐదేళ్లలో దాదాపు రూ. 1580 కోట్లకు పెరుగుతుందని చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (CCSNIAM) నివేదిక పేర్కొంది.
‘షట్డౌన్’ తెచ్చిన ఆహార సంక్షోభం
ప్రస్తుతం అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ మాట వినడానికే వింతగా ఉన్నా... వాస్తవం! అక్కడ ప్రస్తుతం ‘షట్డౌన్’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షట్డౌన్ ప్రభావం అనేక రంగాలపై పడింది. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభా నికి దారి తీసింది. ప్రధానంగా వాణిజ్య రాజధాని అయిన న్యూయా ర్క్పై పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వ షట్డౌన్ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లి మెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్ స్టాంప్స్’ ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేద వారే! ఇదిలా ఉంటే, నిధుల కొరత కారణంగా నవంబరు నెల ప్రయోజనా లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ఏజెన్సీ లను అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా ఆహార సంక్షో భాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు లేదని గవర్నర్ కేథీ హోచుల్ ఆరోపించారు. చట్టబద్ధంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ఫండ్ను విడుదల చేయడానికి ట్రంప్ సర్కార్ నిరాకరిస్తోందని కేథీ ఘాటు ఆరోపణలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మంట్, న్యూ మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి.ఇదీ చదవండి : మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనఅమెరికా ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఒక బడ్జెట్ను లేదా తాత్కాలిక ఖర్చులను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబరు ఒకటో తేదీలోగా కాంగ్రెస్ ఈ బడ్జెట్ను ఆమోదించాల్సిఉంటుంది. అలా జరగకపోతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని సేవలు తాత్కా లికంగా నిలిచిపోతాయి. దీనినే ‘ప్రభుత్వ షట్డౌన్’ అంటారు. వాస్తవానికి ప్రభుత్వ సొమ్ము వృ«థా కాకుండా చూడాలనే సదుద్దేశంతో షట్డౌన్ చట్టాన్ని తొలి రోజుల్లో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలనే నియమాన్ని అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పెట్టి... తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే సామాన్య అమెరికన్లు మధ్యలో నలిగి పోవడం గమనార్హం.– ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్
మేయర్గా మమ్దానీ: తల్లి తొలి స్పందన
ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విజయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది.కుమారుడు జోహ్రాన్ మమ్దానీ విజయంపై మీరా నాయర్, బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ ఇన్స్టా పోస్ట్ను షేర్ చేశారు. హార్ట్, బాణసంచా ఎమోజీలతో "జోహ్రాన్ యు బ్యూటీ" అనే శీర్షికతో ఆమె స్టోరీని రీ పోస్ట్ చేశారు. అమెరికాలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ విజయంపై జోయా అక్తర్ ప్రశంసలు కురిపించారు."జోహ్రాన్ మమ్దానీ 34 ఏళ్ల వయసులో అధికారికంగా NYC మేయర్ రేసులో గెలిచారు" అంటూ కొనియాడారు. కాగా ఉగాండాలో జన్మించిన మమ్దానీ, ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతుల కుమారుడు.జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టించాడు.
దేవ దీపావళి దేవతలకూ పర్వదినమే!
చంద్రమా మనసో జాతః – చంద్రుడు (సృష్టికారకుడైన) విరాట్ పురుషుడి మనసు నుండి పుట్టాడు – అని ఋగ్వేద వాక్యం. అందుకే, సముద్రపు ఆటుపోట్లకూ, అమా వాస్య – పూర్ణిమలకూ ఉన్న సంబంధం లాగే, భూమి మీద మనుషుల మనసుల పని తీరు తీవ్రతకూ, ఆకాశంలో చంద్రబింబం వృద్ధి క్షయాలకూ కాదనలేని సంబంధం కనిపిస్తుంది. మానసిక రోగ చికిత్సా నిపుణులు కూడా మద్దతునిచ్చే మాట ఇది.నిండు పున్నమి దినాలలో మనిషి మనసుకు చురుకు ఎక్కువ. పున్నమి నాళ్ళలో, అటు రసభావాల వైపుగానీ ఇటు ఆధ్యాత్మికత వైపుగానీ మనసు ఎప్పటికంటే ఎక్కువ తీవ్రతతో స్పందిస్తుంది. అందుకే సాధకులకూ, భక్తులకూ, యోగులకూ పౌర్ణమి ప్రత్యేక విశిష్టత గల తిథి. అది మంత్రోపదేశాలకూ, ఉపాసనలకూ, తీవ్రమైన ధ్యానాలకూ మహత్తరమైన ముహూర్తం. పున్నమి అంటేనే పొంగిపోయే మనసు, శరత్కాల పూర్ణిమ అంటే మరీ ఉరకలెత్తు తుంది. శివకేశవులిరువురి అర్చనకూ సమానంగా ప్రశస్తమైనది కార్తిక పౌర్ణమి. ఆ పర్వ దినాన, మనసు పరుగునూ, చురుకునూ మంత్ర జపాల వైపు, ఇష్టదేవతారాధన వైపు మళ్ళిస్తే మరింత ఫలప్రాప్తి పొందవచ్చునని పెద్దల మాట.కార్తిక పూర్ణిమ మనుషులకే కాదు, దేవతలకు కూడా పవిత్రమైన పర్వదినమని పురాణాలు చెబున్నాయి. ఆస్తికావళికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీ క్షేత్రంలో, కార్తిక పూర్ణిమను ‘దేవ దీపావళి’గా పరిగణిస్తారు. వారణాసిలో గంగా తీరాన అన్ని ఘాట్లనూ దీపాలతో అలంకరించటంతో, గంగ ఒడ్డు లోకాతీతంగా ప్రకాశిస్తుంది. దేవతలు వారణాసికి వచ్చి గంగామాతను ఘనంగా అర్చించి వెళతారని ఆస్తికుల విశ్వాసం. కార్తిక దీపాలూ, జ్వాలాతోరణాలు, దేవ దీపావళుల లాంటి నైమిత్తిక సంప్రదాయాలతోనూ; అర్చనలూ, జపతపాలూ, అభిషేకాలూ, ధానధర్మాలతోనూ, ఆస్తికులు తమ మనసుకు నచ్చిన మార్గంలో, తమతమ ఇష్ట దేవతలను కొలుచుకొని, విశేషమైన అనుగ్రహం పొందటానికి అనుకూలమైన రోజు కార్తిక పూర్ణిమ. అలాగే, సాధకులు తమలో అనవరతం ప్రకాశించే ఆత్మజ్యోతి వైపు దృష్టి కేంద్రీకరించేందుకూ అది అనువైన రోజు. – ఎం. మారుతి శాస్త్రి
ఫొటోలు
ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)
#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)
విష్ణు విశాల్ ’ఆర్యన్‘ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)
తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్ (ఫోటోలు)
వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్ ఎమోషనల్ (ఫోటోలు)
అంతర్జాతీయం
నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య న్యూయార్క్ వాసులకు జోహ్రాన్ మమ్దానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో న్యూయార్క్ నగరానికి ఎన్నికైన అని పిన్నవయస్కుడైన మేయర్గా మమ్దానీ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఇండియన్-అమెరికన్ ముస్లిం మేయర్గానూ పేరొందారు.ఈ సందర్భంగా మమ్దానీ మాట్లాడుతూ ‘న్యూయార్క్ కొత్త తరానికి ధన్యవాదాలు. మేము మీ కోసం పోరాడుతాం. ఎందుకంటే మేము మీలాంటివాళ్లమే.. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. స్నేహితులారా.. మేము ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసాం’ అని పేర్కొన్నారు. 30 నిమిషాల కన్నా తక్కువగా సాగిన ఈ ప్రసంగంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేరుగా ఉద్దేశించి, ‘డోనాల్డ్ ట్రంప్.. మీరు దీనిని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పేందుకు నా దగ్గర నాలుగు మాటలు ఉన్నాయి.. వాల్యూమ్ పెంచండి’ అని అన్నారు. మాలో ఎవరినైనా సంప్రదించాలంటే, మీరు మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని సూచించారు.న్యూయార్కర్లకు మమ్దానీ కృతజ్ఞతలు చెబుతూ వారు మార్పు కోసం, కొత్త రాజకీయాల కోసం ఆదేశించారని అన్నారు. 2025, జనవరి ఒకటిన తాను న్యూయార్క్ నగర మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తానని మమ్దానీ ప్రకటించారు. న్యూయార్క్ ..వలసదారుల నగరంగానే ఉంటుంది. ఇది వలసదారులచే నిర్మితమైన నగరం.ఈ రాత్రి నుండి ఇది వలసదారుడి నేతృత్వంలో ఉంటుందని మమ్దానీ అన్నారు.భారత సంతతికి చెందిన మమ్దానీ తన విజయ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మనం పాత నుండి కొత్త వైపు అడుగు పెట్టే క్షణం చాలా అరుదుగా వస్తుంది. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడే క్షణం వస్తుంది’ అని ఆయన అన్నారు. తన విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం అని ఆయన అన్నారు. వలసదారుల నేతగా పేరొందిన మమ్దానీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్నికల ప్రచారంలో మమ్దానీ పలు హామీలు ఇస్తూ, ఓటర్లను ఆకట్టుకున్నాడు. వీటిని ప్రముఖ హిందీ సినిమాల క్లిప్లతో అన్వయిస్తూ, పొందుపరిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 🚨Breaking News — Zoharan Mamdani creates History, the son of Immigrants, becomes the first Indian Muslim American to win NY Mayor Race. Here’s one video how he captured the imagination of a diverse New York. pic.twitter.com/a00nzdLVEI— Rohit Sharma 🇺🇸🇮🇳 (@DcWalaDesi) November 5, 2025ఇది కూడా చదవండి: Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ!
రిపబ్లికన్ల ఓటమి.. ట్రంప్ వింత సమాధానం
వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తాజాగా ట్రంప్ స్పందించారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ట్రంప్ ఫొటో లేదు. అమెరికాలో షట్డౌన్ ఉంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ఇవే రెండు ముఖ్య కారణాలు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Nov 04, 2025, 10:05 PM ET )“TRUMP WASN’T ON THE BALLOT, AND SHUTDOWN, WERE THE TWO REASONS THAT REPUBLICANS LOST ELECTIONS TONIGHT,” according to Pollsters. pic.twitter.com/l3sMRCplPk— Fan Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) November 5, 2025 గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమివర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమివర్జీనియా గవర్నర్గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్వర్జీనియా తొలి మహిళా గవర్నర్గా అబిగైల్ స్నాన్బర్గర్ రికార్డుసిన్సినాటి మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ గెలుపుఅట్లాంటా మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నికపిట్స్బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ..వర్జీనియాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ సీయర్స్ ఓటమి పాలవ్వగా.. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్నాన్బర్గర్ గవర్నర్గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. అబిగైల్ 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్ గా అబిగైల్ చరిత్ర సృష్టించారు.జేడీవాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి..మరోవైపు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. పురేవాల్ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80% కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.
Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ!
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) రేసులో విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ జాన్ రీడ్ను ఓడించారు. హష్మీ.. వర్జీనియా సెనేట్లో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ. అలాగే మొదటి దక్షిణాసియా అమెరికన్గా గుర్తింపు పొందారు. గజాలా హష్మీ 15వ సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనేట్ స్థానంపై ఆధిపత్యం సంపాదించి, వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.హష్మీ సొంత వెబ్సైట్లో.. ‘ఇతరుల జీవితాలను మెరుగు పరిచే దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని’ పేర్కొన్నారు. ఆమె గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ న్యాయం తదితర సమస్యలపై దృష్టి సారించారు. 1964లో హైదరాబాద్లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించిన గజాలా తన బాల్యాన్ని మలక్పేటలోని తన తాత ఇంట్లో గడిపారు. హష్మీ తన నాలుగేళ్ల వయస్సులో తన తల్లి, అన్నయ్యతో కలిసి భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ వారంతా జార్జియాలో తండ్రితో పాటు ఉన్నారు.గజాలా తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. అక్కడ అతను ఎంఏ, ఎల్ఎల్బీ చేశారు. తరువాత సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. అనంతరం బోధనా వృత్తిని స్వీకరించారు. అతను స్వయంగా స్థాపించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశాడు. హష్మి తల్లి తన్వీర్ హష్మి హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ, బీఈడీ చేశారు.హష్మి తన విద్యాభ్యాసం సమయంలో పలు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందుకున్నారు. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుండి బీఏ, అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. 1991లో హష్మి, ఆమె భర్త అజార్ రఫీక్తో పాటు రిచ్మండ్ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ చెస్టర్ఫీల్డ్ వర్జీనియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. హష్మీ దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. మొదట రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో, తరువాత రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో పనిచేశారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్ గానూ హష్మీ పనిచేశారు.
Indonesia: 6.2 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు?
జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో బుధవారం (నవంబర్ 5) శక్తివంతమైన భూకంపం సంభవించింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేశ జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపం తర్వాత సునామీ ప్రమాదం పొంచి ఉందని తొలుత భయపడినప్పటికీ, అటువంటిదేమీ లేదని ఏజెన్సీ నిర్ధారించింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.సులవేసిలోని కొన్ని ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు తీవ్రంగా ఉండి, కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఉపక్రమించాయి. ఆసియా, ఆస్ట్రేలియన్ ఖండాల మధ్య, పసిఫిక్ మహాసముద్రం అంచున ఇండోనేషియా ఉంది. ఇది ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలలో 75 శాతం సంభవించే ప్రాంతంగా నిలిచింది. దేశ ప్రజలు తరచూ భూకంపాలు, సునామీల ప్రభావాలకు గురవుతుంటారు.
జాతీయం
స్కిన్ కేర్పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. భారత్కు ఘన విజయాన్ని అందించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. అలాగే టోర్నమెంట్ ఆరంభంలో ఎదురైన ఎదురుదెబ్బలు, ఆన్లైన్ ట్రోలింగ్ల గురించి ప్రస్తావిస్తూ, వాటన్నింటినీ తట్టుకుని నిలబడి అద్భుతమైన విజయాన్ని అందించారంటూ వారిని మోదీ ప్రశంసించారు.అయితే ఈ ఉత్సాహభరితమైన సంభాషణల మధ్యలో క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్ మోదీని అడిగిన ప్రశ్న నెట్టింట ఆసక్తికరంగా మారింది. తన రహస్య చర్మ సంరక్షణ దినచర్య గురించి ప్రధాని మోదీని ఆమె ప్రశ్నించింది. దీనికి ప్రధాని ఏమి సమాధానం ఇచ్చారో తెలుసా? (ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణం : షాక్లో ఫ్యాన్స్)#WATCH | Delhi: Cricketer and member of the Champion Indian Cricket team, Harleen Kaur Deol, asks Prime Minister Narendra Modi about his skin care routine. Prime Minister Narendra Modi says, "I did not pay a lot of attention to this... I've been in government for 25 years now.… pic.twitter.com/deqCTZcCAE— ANI (@ANI) November 6, 2025 ఇంత షైనీగా, యవ్వనంగా కనిపించే ఆయన చర్మ సౌందర్య వెనుక సీక్రెట్ ఏంటి అంటూ స్టార్ బ్యాటర్ ప్రధాని మోదీని అడిగింది. దానికి ప్రధాని చిరునవ్వుతో స్పందిస్తూ, చర్మ సంరక్షణ లేదా వస్త్రధారణపై తాను ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ చూపలేదన్నారు. ప్రత్యేకంగా ఏమీ చేయను. దాదాపు పాతికేళ్లుగా ప్రభుత్వ పాలనలో మునిగి ఉన్నా, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతానని చెప్పారు. దీంతో అక్కడంతా అభిమానంతో చప్పట్లు మారుమోగాయి. నవ్వులు విరబూశాయి. (మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’)అలాగే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 2017లో రన్నరప్గా నిలిచిన తర్వాత ప్రధాని మోదీని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్రోఫీతో వచ్చినందున ప్రత్యేకంగా అనిపించిందన్నారు. "భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలతో మిమ్మల్ని కలుస్తూనే ఉండాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేవారు. ప్రధాన మంత్రి మోదీ ప్రోత్సాహం తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చిందని, ఆయన స్థిరమైన మద్దతు, సాధికారత చొరవ కారణంగా దేశవ్యాప్తంగా మహిళలు వివిధ రంగాలలో రాణిస్తున్నారని వైస్-కెప్టెన్ స్మృతి మంధాన ప్రశంసించారు. మహిళా క్రికెట్ టీం గురువారం దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కలవనున్నారు.ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి
ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణం : షాక్లో ఫ్యాన్స్
అతనికి ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఇష్టం. అంతేకాదు తాను చూసిన అద్బుతాలను విశేషాలను తన అభిమానులతో పంచుకోవడం అంటే మరీ మరీ ఇష్టం. అలా పాపులర్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్గా సోషల్ మీడియాలో మంచి పేరుతెచ్చుకున్నాడు. 10 లక్షలకుపైగా ఫాలోయవర్లతో ఇన్స్టాలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకడిగా మారాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, దురదృష్టవశాత్తు, 32 ఏళ్లకే ఆయన ప్రయాణం ఆగిపోయింది. కానీ తుదిశ్వాస వరకు ఆసక్తిగల ప్రయాణికుడిగానే ఉన్నాడు. ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్కు చెందిన, అనునయ్ సూద్ (Anunay Sood) ఇక లేరన్న వార్త నెటిజనులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.32 ఏళ్ల అనునయ్ సూద్ ఆకస్మికంగా మరణించారన్న వార్తను ఆయన కుటుంబం గురువారం తెల్లవారుజామున అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. అయితే, ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చనిపోయే సమయానికా అనునయ్ లాస్ వెగాస్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడిఎవరీ అనునయ్ సూద్ అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్, ఇన్స్టాగ్రామ్లో1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్లో 3.8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఆయన సొంతం. ప్రపంచవ్యాప్తంగా పలుసందర్శనా స్థలాలకు సంబంధించి ఎంతో మంచి ట్రావెల్ కంటెంట్, అద్భుతమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ రీల్స్, వ్లాగ్స్తో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. 2022 -2024 వరకు వరుసగా మూడేళ్లు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న అనునయ్ సూద్ది. లాస్ వెగాస్లో స్పోర్ట్స్ కారు నడుపుతూ పెట్టిన పోస్ట్ ఆయన చివరి పోస్ట్.
జూనియర్ ఇంజినీర్ను బురదలో నడిపించిన రైతు నాయకుడు!
మహా నగరాలు, పట్టణాలు.. గ్రామాలు ఎక్కడైనా కానివ్వండి. తవ్వేసిన రహదారులు, నెలలకొద్దీ పూర్తికాని పారిశుద్ధ్యం పనులు సర్వసాధారణం. ఇక వీధుల్లోని సిమెంటు రహదారుల విషయమైతే చెప్పాల్సిన అవసరమే లేదు. గంటల్లో తవ్వి తీస్తారు కానీ.. అవశేషాలు మాత్రం అలాగే పడి ఉంటాయి. కొత్త రోడ్డు వేసేందుకూ వారాలకు వారాలు సమయం పడుతుంది. ఇలా చేస్తే ప్రజలకు ఎంత ఇబ్బందన్నది అస్సలు పట్టింపు ఉండదు. కాంట్రాక్టర్ ఎవరో తెలియదు.. తెలిసినా సామాన్యులు ఎవరూ ఎందుకిలా అని అడగలేరు. అడిగినా.. పట్టించుకుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఉత్తర ప్రదేశ్లోని ముజఫూర్పూర్లోనూ ఇలాంటి తంతే ఒకటి నడిచింది కానీ.. ఓ రైతు నాయకుడు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ప్రభుత్వ అధికారికి ప్రజాగ్రహం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. అసలు విషయం ఏమిటంటే..అది చెప్పే ముందు ఈ ట్వీట్ చూడండి... https://x.com/ggganeshh/status/1986069720668537230 ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తి రైతు సంఘం నాయకుడు అంకుశ్ చౌదరి. పక్కనున్న వ్యక్తి సాగునీటి విభాగం జూనియర్ ఇంజినీర్ సచిన్ పాల్. పంట కాలువల పూడికను కాస్తా రహదారిపై వదిలేశారట సాగునీటి విభాగం వారు. ఎంతకీ తీయకపోవడంతో వీధి వీధంతా కంపు కొడుతోంది. పైగా ఆ బురదలో ప్రజలు నడవడమే కష్టమైపోయింది. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదేమో ఇంజినీరు సారు.. అంకుశ్ చౌదరి ఆగ్రహం నశాళానికి ఎక్కింది. జూనియర్ ఇంజినీర్ సచిన్ పాల్ చొక్కా పట్టేసుకున్నాడు. ఆ నల్లటి, దుర్గంధభరితమైన బురదలో నడిపించాడు. రోడ్లు ఇలా ఉంటే మేము మా ఇళ్లకెలా వెళ్లాలి పటేలా? పొలాలకు దారేది పటేలా? అంటూ అతడిని బురదలో నడిపించాడు. చుట్టూ ఉన్న వారు ఇంజినీర్కు తగిన శాస్తి జరిగిందని సంబరపడ్డారు కానీ.. ఈ ఘటన కాస్తా వాడి వేడి చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తప్పని, అంకుశ్ చౌదరి చేసింది సరైన పనేనని కొందరు సమర్థిస్తే... మరికొందరు వ్యతిరేకించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వారు అంటున్నారు.ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. కర్ణాటక రాజధాని బెంగళూరులో రహదారుల దుస్థితిపై చాలాకాలంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. కొంతమంది అకడక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కూడా. రోడ్లు వేయకపోతే ట్యాక్సులు కట్టమని కొందరు... రోడ్లు, ఫుట్పాత్లలో పేరుకుపోయిన చెత్తను హైలైట్ చేస్తూ ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు వాసుల ప్రజాస్వామ్యయుతమైన నిరసనతో కొంచెం ఆలస్యంగానైనా ప్రయోజనం ఉంటుందేమోకానీ.. క్షణికావేశంలో అంకుశ్ చౌదరిలా ప్రవర్తిస్తే మాత్రం ఏమవుతుందో చెప్పలేము.
ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి
బిర్లా కుటుంబ వారసుడు, పారిశ్రామికవేత్త యశోవర్ధన్ (యష్) బిర్ల , అవంతిక బిర్లా బిర్లా కుమారుడు వేదాంత్ బిర్లా (33) మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. ముంబైలో మలబార్ హిల్లోని బిర్లా నివాసంలో సంజీవ్ -సుప్రియా కులకర్ణిల కుమార్తె తేజల్ కులకర్ణిని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సమక్షంలో కుమార మంగళం బిర్లా ,ఆయన భార్య నీర్జా బిర్లా దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఈ వెడ్డింగ్ వేడుక కోసం, తేజల్ హ్యాండ్మేడ్ బంధాని , సబ్యసాచి రెడ్ లెహంగాలో అందంగా కనిపించింది అద్దాలు, ముత్యాలు, సాంప్రదాయ మరోడి పనితనంతో సున్నితంగా ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహెంగాకు వజ్రాల ఆభరణాలతో జత చేసింది, అందులో నెక్లెస్, మాంగ్ టేకు, నాథ్, సరిపోలే చెవిపోగులు, స్వల్ప మేకప్తో పెళ్లికళ ఉట్టిపడేలా కనిపించింది. వేదాంత్ తెల్లటి బంధ్గాలాలో మ్యాచింగ్ టర్బన్తో ముస్తాబయ్యారు. వివాహం తర్వాత సెయింట్ రెగిస్లో స్టార్-స్టడెడ్ రిసెప్షన్ జరిగింది.సన్నిహిత బంధువులు, స్నేహితులు, పారిశ్రామికవేత్తలు, ముంబైలోని ఇతర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Dr.Swami kailashanand giri ji (@swamikailashanandgiri_official)తేజల్ : విజిలింగ్ వుడ్స్ గ్రాడ్యుయేట్ , ఏజిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకురాలు, తేజల్ వ్యాపారంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. సుభాష్ ఘాయ్ స్థాపించిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ నుండి డిప్లొమా ఇన్ ఫిల్మ్ స్టడీస్తో తేజల్ తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించింది. సినిమాలు, కథలు మీద ఆసక్తి ఉన్నప్పనటికీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుండి బిజినెస్ అండ్ మేనేజిరియల్ ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ చేసింది, తరువాత పొలిటికల్ సైన్స్ అండ్ గవర్నమెంట్లో మాస్టర్స్ పూర్తి చేసింది.ప్రొడక్షన్ అసిస్టెంట్ నుండి ఒక కంపెనీ సహ వ్యవస్థాపకురాలిగా తనను తాను తీర్చిదిద్దుకుంది.వేదాంత్ బిర్లా దేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వేదాంత్ బిర్లా పారిశ్రామికవేత్త యశోవర్ధన్ (యశ్) బిర్లా మరియు అవంతి బిర్లాల ఏకైక కుమారుడు. వేదాంత్ ప్రస్తుతం బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్లో బోర్డు ఛైర్మన్గా పనిచేస్తున్నారు. ముంబైలోని కాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, BD సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ ప్రోగ్రామ్ను పూర్తి చేశాడు. ఆతరువాత, HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి అకౌంటింగ్ మరియు ఫైనాన్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. అలాగే UK లోని RBS కాలేజ్ నుండి జనరల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చదివాడు.ఊర్వశి రౌతేలా , నీల్ నితిన్ ముఖేష్ ,పూనమ్ ధిల్లాన్, నీలం కొఠారి, భూమి పెడ్నేకర్, సీమా సజ్దే వరకు లాంటి సినీ ప ప్రముఖులతోపాటు, ఆదర్ జైన్, అనిస్సా మల్హోత్రా జైన్,అర్మాన్ జైన్,ఆదిత్య సీల్,అనుష్క రంజన్, ఇంకా మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులు - ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే,ఆదిత్య ఠాక్రే కూడా హాజరయ్యారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు.
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది.
క్రైమ్
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విశాఖపట్నం: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాలు(వ్యభిచారం) నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్పై కేసు నమోదు చేసి, యజమానులు ఏ1గా కాసిరెడ్డి అరుణ్ కుమార్ (పరారీలో), ఏ2గా రాహుల్ (పరారీలో), సిబ్బంది ఏ3గా కల్లూరు పవన్ కుమార్, ఏ4గా జానా శ్రీనివాస, విటుడు ఏ5గా చీలి రామచంద్ర ప్రసాద్లను పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా: అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం గజ్వేల్లో చోటు చేసుకుంది. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ (ఎర్రవల్లి)కి చెందిన వనం సుగుణ–నర్సింలు దంపతుల పెద్ద కూతురు వసంతకు గజ్వేల్కు చెందిన సమీప బంధువుతో ఆగస్టు 10న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 18 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చారు. వసంత ఉన్నత చదువులకు ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే పెళ్లయిన నెల రోజుల తర్వాత నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో పాటు వివాహేతర సంబంధం అంటగట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత.. ఈనెల 1న పురుగుల మందు తాగింది. కడుపులో నొప్పి వస్తోందంటూ తన తల్లి సుగుణకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు వసంతను మెరుగైన చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వా స్పత్రికి, అక్కడి నుంచి పలు ప్రైవేటు ఆస్పత్రు ల్లో చికిత్స చేయించినప్పటికీ తగ్గకపోవడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి వసంత మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వసంత మృతికి కారణమైన భర్త రోహిత్, అత్త దుర్గమ్మ, మామ గంగయ్యలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు
పటాన్చెరు టౌన్ (హైదరాబాద్): చీమల ఫోబియాతో ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్కు చెందిన శ్రీకాంత్ భార్య మనీషా (25) చీమల ఫోబియాతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చూపించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం భర్త డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేసరికి పడక గది తలుపు మూసి ఉంది. స్థానికుల సహకారంతో లోపలికి వెళ్లి చూడగా.. మనీషా చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని శవమై కనిపించింది. ‘ఈ చీమల ఫోబియాతో బతకడం నా వల్ల కావట్లేదు.. కూతురు అని్వ(4) జాగ్రత్త‘అని ఆమె రాసి ఉంచిన లేఖ ఉంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సీక్రెట్ కెమెరా.. మహిళలు స్నానం చేసే వీడియోలు ప్రియుడికి..
తమిళనాడు రాష్ట్రం: ఆమె బుద్ధి తప్పుదోవ పట్టింది, ఇతర మహిళల వీడియోలను తీసుకుని ప్రియునికి పంపింది. ఫలితంగా రచ్చ చెలరేగింది. బెంగళూరు సమీపంలోని పారిశ్రామిక నగరం హోసూరు వద్ద అకృత్యం బయటపడింది. కంపెనీ మహిళా సిబ్బంది బస చేసే హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాను ఏర్పాటు చేసి ఆ చిత్రాలను ఇంటర్నెట్లో వైరల్ చేశారు. ఇది తెలిసి మహిళా సిబ్బంది ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎల్రక్టానిక్స్ కంపెనీ నడుస్తోంది, ఇందులో వేలాది మంది మహిళా ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వారి కోసం ఉద్దనపల్లి వద్ద ప్రత్యేక హాస్టల్ వసతిని కల్పించింది. నీలాకుమారి నిర్వాకం ఒడిశాకు చెందిన నీలా కుమారి గుప్తా (23) కూడా కంపెనీలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు ఏం దుర్బుద్ధి పుట్టిందో మరి ఓ బాత్రూంలో రహస్య కెమెరా ఉంచి తోటి మహహిళలు స్నానం చేసే దృశ్యాలను మొబైల్ఫోన్లో రికార్డు చేసుకుంది. వాటిని బెంగళూరులో ఉండే తన ఒడిశా ప్రియునికి పంపుతోంది. అతడు వాటిని ఇంటర్నెట్ వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. తమ చిత్రాలు నెట్లో వ్యాపించాయని తెలిసి మహిళలు కంగుతిన్నారు. మంగళవారం రాత్రి సుమారు రెండువేల మంది మహిళలు, యువతులు హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. దుండగులను శిక్షించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ఎస్పీ ఎస్పీ తంగదురై వచ్చి వారితో మాట్లాడినా శాంతించలేదు. నీలాకుమారిని అరెస్ట్ చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. ప్రియుని కోసం గాలిస్తున్నారు.
వీడియోలు
Karumuri Venkat: మొగుడు పెళ్ళాం మధ్యలో నీకేంటి పని.. TV5 బ్రోకర్ మూర్తి నోరు జాగ్రత్త..
Gudivada: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
యువతకు జగన్ మెసేజ్.. మీరంతా జెన్-Z తరంలో ఉన్నారు
OPEN CHALLENGE: జూబ్లీహిల్స్ ప్రచారంలో కేసీఆర్ ఎంట్రీ ఉంటుందా ?
కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి: YS జగన్
YS Jagan: వ్యవసాయం దండగ అన్నావ్.. మరి నువ్వు ఏం తింటున్నావ్
YS Jagan: పిల్లలను చదివించడం భారం కాదు అందుకే ప్రతి తల్లిదండ్రులకు మాటిస్తున్న..
SRM University : 300 మందికి అస్వస్థత
చంద్రబాబు ఇంతమంది ప్రాణాలు పోతే మీకు బాధ్యత లేదా?: పేర్నినాని
Punuru Gowtham: నన్ను చంపడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు

