ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం...ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, దేవీస్తోత్రాలు పఠించండి.వృషభం...పరపతి పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు, శ్రీ ఆంజనేయ స్తుతి మంచిది.మిథునం....ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన . చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా అనుకూలంగా మారతారు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ మెప్పిస్తారు. వ్యాపార లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. ఎరుపు, గులాబీ రంగులు, శివాష్టకం పఠించండి.కర్కాటకం...కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆశించిన రాబడి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. నలుపు, లేత గులాబీ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.సింహం...పనులు సక్రమంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.కన్య...ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ధనలబ్ధి. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.తుల...ఇంటాబయటా అనుకూల పరిస్థితి ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.వృశ్చికం...కొన్ని ఇబ్బందులు ఎదురైనా పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. ఎరుపు, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు, గ ణేశాష్టకం పఠించండి.మకరం...పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు, దేవీఖడ్గమాల పఠించండి.కుంభం...ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెంపొందుతాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.మీనం...ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, బంగారు రంగులు, హనుమాన్ ఛాలీసా పఠించండి.
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి..
రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి, శిక్షించేందుకు తనిఖీలను ముమ్మరం చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. పబ్లిక్ కంపార్ట్మెంట్ల తగ్గింపు, రైళ్ల కొరత వంటి అవకతవకల కారణంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైల్వే పరిపాలన విభాగం టికెట్ ఇన్స్పెక్టర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నెలవారీ ఆదాయ లక్ష్యాన్ని గణనీయంగా పెంచింది.జరిమానాలు వసూలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల ని ప్రణాళిక వేస్తున్నారు. ప్రయాణికుడు ప్రయాణించిన దూరం ఆధారంగా ఈ జరిమానాను లెక్కిస్తారు. రిజర్వేషన్ లేకుండా రెగ్యులర్ స్లీపర్ కోచ్లలో ప్రయాణించే సీజన్ టికెట్ హోల్డర్లను టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించి జరిమానా విధిస్తారు. ప్రస్తుతం పాలక్కాడ్ డివిజన్లో స్లీపర్ కోచ్లను పర్యవేక్షించే టికెట్ ఇన్స్పెక్టర్ నెలవారీ జరిమానా పరిమితిని రూ.10,000 నుంచి రూ. 25,000కు పెంచారు. దీనివల్ల సంవత్సరానికి రూ. 27 కోట్ల వరకు జరిమానా విధించాల్సి వస్తుంది. సరైన అనుమతి లేకుండా ఖరీదైన బాక్సులకు మారడం వంటి చిన్నపాటి ఉల్లంఘనలకు ఇకపై జరిమానాలు విధిస్తారు. ఈ తీవ్రమైన చర్య ఉద్యోగులు, ప్రయాణికుల మధ్య అనవసర ఘర్షణలకు దారితీయవచ్చని రైల్వే కార్మిక సంఘాలు హెచ్చరించాయి.మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు విధించే కనీస జరిమానాలను ఈమేరకు సవరించారు. జనరల్ కోచ్లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ. 320, సిట్టింగ్ రిజర్వ్ కంపార్ట్మెంట్లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ. 335, స్లీపర్ కోచ్లో ప్రతి 200 కిలోమీటర్లకు రూ. 530 జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, ఏసీ కోచ్కు కనీస జరిమానా రూ. 745గా, థర్డ్ ఏసీ కోచ్లో ప్రతి 300 కిలోమీటర్లకు రూ.2,070గా , సెకండ్ ఏసీ కోచ్లో ప్రతి 800 కిలోమీటర్లకు రూ. 2,070గా నిర్ణయించారు. అదే సమయంలో రెగ్యులర్, సీజన్ టికెట్ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, రైల్వే పరిపాలన రిజర్వేషన్ లేని జనరల్ కోచ్ల సంఖ్యను పెంచలేదు. దీనికి విరుద్ధంగా, ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ కోచ్లను తగ్గించి, వాటిని ఏసీ కోచ్లుగా మారుస్తున్నారు. తగినన్ని రైళ్లు లేకపోవడంతో, నిత్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కల్కి 2పై ప్రభాస్ ఫోకస్.. నాగ్ అశ్విన్ ఆసక్తికర అప్డేట్
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన రాజాసాబ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ప్రభాస్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలను సమాంతరంగా పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి 2పై కూడా ఫోకస్ పెట్టాడు. తాజాగా సింగ్ గీతం సినిమా ప్రమోషన్లలో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే కల్కి 2 చిత్రీకరణ ప్రారంభమైంది. జూలై నుంచి నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగ్ అశ్విన్ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి 2 చిత్రం 2027 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే నాగ్ అశ్విన్ మాత్రం దీనిపై ఎలాంటి డెడ్లైన్ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఇక ఫౌజీ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా టీమ్ ప్రకటించారు. ఈ రెండు థియేటర్లలోకి వచ్చిన తర్వాతే కల్కి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతే సలార్ 2 రానుంది.
హమ్మయ్యా.. రుతుపవనాలొచ్చేశాయ్
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. శనివారం ఇవి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 4న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు రెండు రోజుల్లోనే ఏపీకి విస్తరించాయి. అయితే వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో వాటి గమనం నెమ్మదిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించినా వర్షాలు మాత్రం తక్కువగానే కురుస్తాయని తెలిపింది. రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడతాయని... కొన్ని రోజులపాటు వర్షాలు కురిసి మరికొన్ని రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. అందువల్ల ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు ప్రవేశించినా శనివారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఆదివారం 58 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని, మరో 104 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.
ఆఖరి మనిషి
భారత్ ఆరోగ్య స్కోరు @ 65
కదం తొక్కిన కాక్రోచ్
చేతిలో ఫోన్.. చేరని నెట్
ఒక్క బిస్కట్కు లక్ష
వారికి ఎబోలా నెగెటివ్
వంట నూనె ప్యాకెట్లకు ‘ప్రామాణిక’ కొలతలు..!
ఆక్వా ‘వెల’వెల
ఎండ సీసానా! వీళ్ల బండబడా!
2030 నాటికి 20% మార్కెట్ వాటా
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
జై చంద్రబాబు అంటే మీకు కనెక్ట్ అవుతుంది సార్!
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
అపచారం... దైవద్రోహం
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
తమిళ రాజకీయం.. లతా రజినీకాంత్ ‘మక్కల్ మేడై’ ప్రారంభం
అన్నామలై రాజీనామాపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు
టెస్ట్ షూట్లోనే హీరోయిన్పై దర్శకుడి ప్రశంసలు
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
అతడికి అన్యాయం.. ఛాన్సులు ఇవ్వలేదు: గంభీర్
మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..!
పాకిస్తాన్కు కొత్త టెన్షన్.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్
అందుకే సూర్యను తప్పించాం: అగార్కర్
‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు
సాగుకు ఊతం.. రైతుకు భరోసా
ఆఖరి మనిషి
భారత్ ఆరోగ్య స్కోరు @ 65
కదం తొక్కిన కాక్రోచ్
చేతిలో ఫోన్.. చేరని నెట్
ఒక్క బిస్కట్కు లక్ష
వారికి ఎబోలా నెగెటివ్
వంట నూనె ప్యాకెట్లకు ‘ప్రామాణిక’ కొలతలు..!
ఆక్వా ‘వెల’వెల
ఎండ సీసానా! వీళ్ల బండబడా!
2030 నాటికి 20% మార్కెట్ వాటా
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
జై చంద్రబాబు అంటే మీకు కనెక్ట్ అవుతుంది సార్!
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
అపచారం... దైవద్రోహం
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
తమిళ రాజకీయం.. లతా రజినీకాంత్ ‘మక్కల్ మేడై’ ప్రారంభం
అన్నామలై రాజీనామాపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు
టెస్ట్ షూట్లోనే హీరోయిన్పై దర్శకుడి ప్రశంసలు
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
అతడికి అన్యాయం.. ఛాన్సులు ఇవ్వలేదు: గంభీర్
మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..!
పాకిస్తాన్కు కొత్త టెన్షన్.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్
అందుకే సూర్యను తప్పించాం: అగార్కర్
‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు
సాగుకు ఊతం.. రైతుకు భరోసా
ఫొటోలు
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్ సందడి (ఫొటోలు)
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
అమీర్పేటలో పొగ.. మంటలతో బెంబేలు (ఫొటోలు)
సినిమా
రామ్ చరణ్ని సర్ప్రైజ్ చేసిన కూతురు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా థియేటర్లలో ఉంది. మిక్స్డ్ టాక్ రావడంతో తెలుగులో మాత్రమే కలెక్షన్స్ వస్తున్నాయి. మిగిలిన భాషల్లో తేలిపోయింది. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం 'పెద్ది' మేనియా కనిపిస్తోంది. రామ్ చరణ్ కూతురే స్వయంగా తండ్రికి విషెస్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)'దిస్ ఈజ్ ఫర్ యూ నాన్న, లవ్ యూ సో మచ్' అని క్లీంకార ముద్దుమాటలతో ప్రారంభమైన వీడియోలో.. చరణ్-ఉపాసన ఇంట్లోని పనివాళ్లంతా కలిసి చికిరి చికిరి పాటకు డ్యాన్స్ చేశారు. చివరకు చరణ్ సెక్యూరిటీ గార్డ్తోనూ వైరల్ బ్యాట్ స్టెప్ వేయించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో రామ్ చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్గా కనిపించాడు. చరణ్ అద్భుతంగా నటించాడు. ఏఆర్ రెహమాన్ కూడా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నప్పటికీ.. జాన్వీ కపూర్ సీన్ల వల్ల ఘోరమైన నెగిటివిటీ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో సదరు సన్నివేశాలని తొలగిస్తామని చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు.. ప్రేక్షకులకు క్షమాపణ కూడా చెప్పాడు. రెండు రోజుల్లో రూ.181 కోట్ల గ్రాస్ కలెక్షన్ ఈ చిత్రానికి వచ్చాయి.(ఇదీ చదవండి: 'రెబల్' విషయంలో ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు తెలుగునాట చాలా క్రేజ్ ఉంటుంది. ఆ భాషలో తీసిన వివిధ జానర్ల మూవీస్ని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. అందుకు తగ్గట్లే డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా గత నెలలో రిలీజై హిట్టయిన కామెడీ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)మలయాళంలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ లేటెస్ట్ యూత్ఫుల్ కామెడీ మూవీ 'అతిరథి'. ఇందులోనే టొవిన్ థామస్ మరో హీరోగా నటించాడు. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు హీరోయిన్గా చేసింది. గత నెల 14న థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడీ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్లో అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పోస్టర్తో క్లారిటీ ఇచ్చారు.'అతిరథి' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే సామ్ కుట్టి(బాసిల్ జోసెఫ్) తన కాలేజీలో ఆగిపోయిన అరోహన్ ఫెస్ట్ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటాడు. కానీ ఇదే కాలేజీలో ఉంటే మరో గ్రూప్ దీన్ని వ్యతిరేకిస్తుంది. మరి చివరకు ఏమైంది? సామ్ కుట్టి తను అనుకున్నది సాధించాడా లేదా? శ్రీకుట్టి(టొవినో థామస్), స్వాతి (రియా షిబు) ఎవరు? అనేది మిగతా స్టోరీ. కాలేజీ బ్యాక్డ్రాప్లో సాగే కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల రిప్రజెంటేషన్పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.సీనియర్, జూనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్ఫార్మర్ అయిన ప్రీతి ముకుందన్ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్ సెన్సేషన్ బ్లాస్ట్లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్ నుంచి టాలీవుడ్కు సెటైర్ పడింది. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.బాలీవుడ్లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
కథ చెప్పండి గురూ!
సినిమాలో కొత్తదనం లేక పోతే ప్రేక్షకులు థియేటర్స్కు రావడం లేదు. దీంతో హీరోలందరూ కొత్త కథల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒక్క కథను ఓకే చేయడం కోసం పదుల సంఖ్యలో కథలు వింటున్నారు. ఇటు దర్శకులు, రచయితలు కూడా తమ కలానికి మరింత పదును పెట్టి విభిన్నమైన కథలను సిద్ధం చేస్తున్నారు. దీంతో సరికొత్త కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. మరి... ఏ హీరోకి ఏ దర్శకుడు కథ చె΄్పారు? ఏ దర్శకుడు ఏ హీరోను మెప్పించారు? తెలుగులో రాబోతున్న కొత్త కాంబినేషన్స్ ఏమిటి? అన్న విశేషాలపై ఓ లుక్ వేయండి.సంక్రాంతి తర్వాతే..! హీరో వెంకటేశ్ వరుస కథలు వింటున్నారు. యువ రచయిత నందు, తరుణ్ భాస్కర్ చెప్పిన కథలను ఆల్రెడీ విన్నారు వెంకటేశ్. అయితే ఈ కథలతో సినిమాలు చేయాలని ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇదే స్పీడ్లో వెంకటేశ్ రీసెంట్గా మరో కథ విన్నారట. ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకుని, రెండో సినిమాయే చిరంజీవితో ‘విశ్వంభర’ తీసిన మల్లిడి వశిష్ట ఇటీవల వెంకటేశ్కు ఓ కథ వినిపించారట. ఈ సినిమా చేసేందుకు వెంకటేశ్ సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబరు 47’ సినిమాలో హీరోగా నటిస్తూ, బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలనే సంక్పల్పంతో ఉన్నారట ఈ సీనియర్ హీరో. అలాగే ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వర ప్రసాద్’ (ఇందులో చిరంజీవి హీరో) వంటి హిట్ చిత్రాలను తనకు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేశ్ ఓ సినిమా చేస్తారు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. సో... వెంకీ ఇమ్మిడియట్ సినిమా ఇదే అవుతుంది. ఈ నెల 20 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్రామ్ మరో హీరోగా నటించనుండగా కీర్తీ సురేష్, కృతీశెట్టి హీరోయిన్స్గా నటిస్తారు. ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13న విడుదల’ అనే ఓ క్రేజీ టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇలా తన తర్వాతి ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉండటంతో, వెంకీ తన తదుపరి సినిమాను సంక్రాంతి పండగ తర్వాతనే ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే కథలు మాత్రం వింటున్నారు. ఈలోపు వెంకీని ఇంప్రెస్ చేసి, ఆయనతో సినిమా చేసే చాన్స్ను ఏ దర్శకుడు దక్కించుకుంటారో చూడాలి.నెక్ట్స్ ఎవరు? రాజమౌళి డైరెక్షన్లోని ‘వారణాసి’ చిత్రంతో మహేశ్బాబు ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో అనుకున్నట్లుగానే ఏప్రిల్ 7నే సినిమాను రిలీజ్ చేయాలని, ఇది జరగాలంటే ఈ ఏడాది ఆగస్టులోపే షూటింగ్ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఇలా ‘వారణాసి’ సినిమా షూటింగ్ కాస్త అటూ ఇటూ అయినా ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అవుతారు మహేశ్బాబు.కాగా, ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకూడదని మహేశ్బాబు అనుకుంటున్నారట. ఈ సినిమా రిలీజైన వెంటనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్. ఇందుకు తగ్గట్లుగానే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారట. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్లతో పాటు బుచ్చిబాబు సానా చెప్పిన స్టోరీ లైన్స్ను మహేశ్బాబు విన్నారని సమాచారం. ‘వారణాసి’ సినిమా రిలీజైన తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంపై మహేశ్బాబు ఓ స్పష్టతకు వస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. మోస్ట్లీ సందీప్ రెడ్డి వంగాతోనే మహేశ్బాబు సినిమా ఉండొచ్చని భోగట్టా.ముందు ఎవరు? హీరో రవితేజ కాస్త స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే తన నెక్ట్స్ సినిమాలను ఖరారు చేసుకోవాలని అనుకుంటున్నారట రవితేజ. ఇందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. ముందుగా హసిత్ గోలి కథ వినిపించారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్నారట రవితేజ.ఈ రెండు కథలకూ ఇంప్రెస్ అయినప్పటికీ ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను సెట్స్కు తీసుకువెళ్లాలని రవితేజ నిర్ణయించుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలిసింది. ఈ సినిమా ప్రారంభమైన మరికొన్ని రోజులకే హసిత్ గోలీ సినిమానూ సెట్స్పైకి తీసుకు వెళ్లాలని రవితేజ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని రవితేజ అనుకుంటున్నారట. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాదే రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు. ఇక రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్లోని సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. కాస్త సమయం ఉంది.. ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలో తీరిక లేకుండా ఉన్నారు హీరో నాని. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుజిత్తో ‘బ్లడీ రొమియో’ అనే ఓ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా చేయనున్నారు నాని. ఇక రెండు సినిమాలు ఇలా ఉండగానే... నిర్మాతగా తనకు ‘కోర్టు’ సినిమా రూపంలో ఓ బ్లాక్బస్టర్ను అందించిన రామ్ జగదీష్ చెప్పిన కథను నాని ఓకే చేశారని తెలిసింది.కానీ ఈ కథలో నానీయే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణ బాధ్యతల వరకే పరిమితం అవుతారా? అనేది చూడాలి. అలాగే ఇటీవల ‘బ్యాండ్ మేళం’ సినిమా తీసిన సతీష్ జవ్వాజి చెప్పిన కథను కూడా విన్నారు నాని. ఈ కథను ఆల్మోస్ట్ ఓకే చేశారు. అయితే ఈ కథలో తానే హీరోగా నటించాలని నాని భావిస్తున్నారని, కాక పోతే కథకు ఇంకాస్త మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని సతీష్కు నాని సూచించారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఇప్పటికే రెండు సినిమాలను ఖరారు చేసుకున్న నాని,మరో రెండు సినిమాల కథలను కూడా ఓకే చేశారు.మ్యూజికల్ లవ్స్టోరీ! ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాతో నాగచైతన్య బిజీ బిజీ. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రం. దీంతో తన కెరీర్లోని 25వ సినిమాను లవ్ జానర్లో చేయాలా? లేక యాక్షన్ జానర్లో చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నారట నాగచైతన్య. ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ చెప్పిన కథలను విన్నారట నాగచైతన్య.అయితే రొటీన్ లవ్స్టోరీకీ కాస్త భిన్నంగా ఓ డిఫరెంట్ ప్రేమకథను చెప్పిన క్లాక్స్కు ముందుగా చాన్స్ ఇచ్చారని సమాచారం. ప్రజెంట్ ఈ కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట క్లాక్. ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ తర్వాత, నాగచైతన్య 25వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ‘దూత’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ‘దూత చాప్టర్2’ షూటింగ్లోనూ త్వరలోనే పాల్గొనున్నారు నాగచైతన్య. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దూత చాప్టర్ 2’తో తొలిసారిగా నిర్మాతగా మారారు నాగచైతన్య. ఈ సిరీస్కు శరత్మరార్ మరో నిర్మాత.రెండు సంవత్సరాల తర్వాత తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలను రాబట్ట లేక పోయాయి. వైష్ణవ్ గత చిత్రం ‘ఆది కేశవ’ 2023లో విడుదలైంది. ఆ తర్వాత మరో కొత్త సినిమా సైన్ చేయడానికి వైష్ణవ్ దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్లో వైష్ణవ్ ఎన్నో కథలు విన్నారని తెలిసింది. కానీ ఫైనల్గా సుధీర్బాబుతో ‘హంట్’ సినిమా తీసిన దర్శకుడు మహేశ్ సూరపనేని చెప్పిన కథ వైష్ణవ్ను ఇంప్రెస్ చేసిందట.ఒకేసారి రెండు సినిమాలు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు కనీసం రెండు సెట్స్పై ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజి, స్పిరిట్’ చిత్రాలు సెట్స్పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే పూర్తవుతుంది. ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ను ఈ ఏడాదే అనుకుంటున్నారు. ‘స్పిరిట్’ సినిమాను వచ్చే మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే... మరో రెండు సినిమాలను సమాంతరంగా సెట్స్పైకి తీసుకువెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నారట. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో ప్రభాస్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వీటిలో ‘సలార్ 2’ ఒకటి అని తెలిసింది. అలాగే ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ ఓ మైథాలజీ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ చేస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారు. కానీ వచ్చే ఏడాదికి ఈ ఇద్దరు దర్శకులు కాస్త ఫ్రీ అవుతారు. మరి... ప్రభాస్ తర్వాతి రెండు సినిమాలకు ఈ ఇద్దరు దర్శకులే డైరెక్షన్ చేస్తారా? లేక మరో దర్శకుడి పేరు ఏదైనా సడన్గా తెరపైకి వచ్చి, కొత్త కాంబినేషన్ సెట్ అవు తుందా? అనేది చూడాలి. ఏదీ ఏమైనా తన తర్వాతి సినిమాలపై ప్రభాస్ ఓ క్లారిటీతో ఉన్నారని సమాచారం.అడవిలో పోరాటం ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు రామ్చరణ్. ఇక మెల్లిగా చరణ్ ఫ్యాన్స్ చర్చంతా ఆయన తర్వాతి సినిమాపైనే జరుగుతోంది. ‘రంగస్థ్థలం’ వంటి బ్లాక్బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన సుకుమార్తో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్కు వెళ్తుందని సమాచారం. అయితే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబైలో ఓ సందర్భంగా కలిశారట రామ్ చరణ్. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా కన్ఫార్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఇదొక పీరియాడికల్ జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా అని, ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించరని, కేవలం నిర్మాణం వరకు మాత్రమే పరిమితం అవుతారనే వార్తలు బాలీవుడ్లో వినిపించాయి. అలాగే ఈ సినిమాకు తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు బాలీవుడ్లో ‘కిల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్తోనూ ఓ సినిమా విషయమై రామ్చరణ్ చర్చలు జరిపారని టాక్. అయితే ఈ అంశాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.– ముసిమి శివాంజనేయులు
క్రీడలు
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను ఇవాళ (జూన్ 6) తొలగించారు. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా అతడికి ఉద్వాసన పలికారు. కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పేరును ప్రకటించారు.త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు జపాన్లో జరిగే ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేశారు. ఈ మూడు జట్లలో స్కైకు చోటు లభించలేదు. తనపై వేటు పడిన తర్వాత కూడా హుందాగా వ్యవహరించి, కొత్తగా ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన స్కై.. వేటు పడిన గంటల వ్యవధిలో బ్యాట్తో ఫైరయ్యాడు. టీ20 ముంబై లీగ్లో భాగంగా సోబో ముంబై ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో (రాత్రి) 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి (ట్రయంప్ నైట్స్ ఎంఎన్ఈ కెప్టెన్గా) వీరంగం సృష్టించాడు. ఈ మ్యాచ్లో స్కై ప్రత్యర్ది జట్టులో కొత్తగా ఎంపికై భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండటం మరో విశేషం. మ్యాచ్కు ముందు స్కై శ్రేయస్ను హత్తుకొని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చూడచక్కని దృశ్యం సోషల్మీడియాలో వైరలవుతుంది.ముంబై టీ20 లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. సూర్య ఔటయ్యాక అతడి జట్టు గాడి తప్పింది. 19 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. స్కై క్రీజ్లో ఉన్నంతసేపు అతడి జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్ కూడా చేసేలా కనిపించడం లేదు. ప్రత్యర్ది జట్టు బౌలర్లలో ప్రథమేశ్ డాకే 3, యశ్ డిచోల్కర్ 2, సిద్దార్థ్ రౌత్, వేదాంత్ గోరే తలో వికెట్ తీసి స్కై జట్టును దెబ్బకొట్టారు. స్కై జట్టులో అతడితో పాటు అఖిల్ హెర్వాద్కర్ (12), నూతన్ కుమార్ గోయెల్ (34), మకరంద్ గిరీశ్ పాటిల్ (11) మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
పాపం పాటిదార్.. ఆర్సీబీ కెప్టెన్పై సానుభూతి వెల్లువ
ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఇవాళ ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ను తప్పించి శ్రేయస్కు కొత్త టీ20 కెప్టెన్గా పట్టం కట్టారు. సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్ జట్టు నుంచి పిలుపందింది. వైభవ్ మూడు జట్లలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కింది. తిలక్కు మరో జాక్పాట్ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత 2-3 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న హర్షిత్ రాణాకు మూడు జట్లలో చోటు లభించింది.హర్షిత్ అంశం ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 అత్యుత్తమంగా రాణించిన భువనేశ్వర్ కుమార్ను కాదని ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా ఇవ్వని హర్షిత్కు ఇన్ని అవకాశాలు ఇవ్వడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నా, జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోతున్న భువీపై సానుభూతి ప్రదర్శిస్తున్నారు.ఇదే క్రమంలో టీమిండియాకు ఎంపికయ్యే విషయంలో మరో ఆటగాడికి కూడా అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఆ ఆటగాడు ఆర్సీబీ సారధి రజత్ పాటిదార్. పాటిదార్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక అతను వరుసగా రెండు సార్లు ఆర్సీబీకి టైటిల్ అందించాడు. 17 సీజన్లలో ఒక్క టైటిల్ కూడా సాధించలేని ఆర్సీబీ, పాటిదార్ సారథ్యంలో వరుసగా రెండు టైటిళ్లు సాధించడంతో అభిమానుల్లో అతడిపై క్రేజ్ను మరింత పెరిగింది.తాజాగా సీజన్లో పాటిదార్ కెప్టెన్గా సత్తా చాటడమే కాకుండా వ్యక్తిగతంగానూ ఇరగదీశాడు. 14 ఇన్నింగ్స్ల్లో 192.69 స్ట్రయిక్రేట్తో 41.75 సగటున 501 పరుగులు చేశాడు. ఇలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత ఏ ఆటగాడికైనా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుతుందని అంతా భావిస్తారు. పాటిదార్ విషయంలోనూ అదే జరిగింది.తీరా చూస్తే భారత సెలెక్టర్లు తాజాగా ప్రకటించిన జట్ల విషయంలో అతడి పేరును పరిగణలోకి కూడా తీసుకోలేదు. కనీసం ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై అయినా అవకాశం ఇవ్వాల్సింది. అదీ జరగలేదు. దీంతో పాటిదార్పై భువనేశ్వర్ కుమార్ తరహాలో సానుభూతి వ్యక్తమవుతుంది. పాపం పాటిదార్ అంటూ అతని వ్యక్తిగత, ఆర్సీబీ అభిమానులు సోషల్మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నారు.వాస్తవానికి వారి బాధలో అర్దం ఉంది. ఎందుకంటే, ప్రస్తుత భారత జట్టు నిర్మాణాన్ని బట్టి చూస్తే పాటిదార్ లాంటి డాషింగ్ మిడిలార్డర్ బ్యాటర్ ఎంతో అవసరం. నాలుగు, ఐదు స్థానాల్లో బరిలోకి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల దిట్ట అతడు. ఇలాంటి ప్రదర్శనలను అతడి నుంచి ఇటీవలికాలంలో చాలా చూశాం. కాబట్టి సహజంగానే పాటిదార్ లాంటి ప్లేయర్ జట్టులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ జట్టులో పరిమిత బెర్త్లకు మాత్రమే ఆస్కారం ఉండటంతో పాటిదార్కు మొండిచెయ్యి తప్పలేదు.ఆర్సీబీ అభిమానుల్లో ప్రస్తుతం ప్రకటించిన భారత జట్టుకు సంబంధించి మరో అసంతృప్తి కూడా ఉంది. ఛాంపియన్ జట్టు నుంచి కనీసం ఒక్క ఆటగాడికి కూడా ప్రాతినిథ్యం లభించలేదని వారు బాధపడుతున్నారు. ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ
‘అందుకే హార్దిక్ను కాదని నితీశ్ రెడ్డిని ఎంపిక చేశాం’
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ భారత టీ20 జట్టు సారథిగా వ్యవహరించడమే ఇందుకు కారణం.అప్పుడు కెప్టెన్సీ చేజారిందిఅయితే, అనూహ్యంగా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్ను చేసింది బీసీసీఐ. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నైపుణ్యాలున్న హార్దిక్ను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.కాలం గిర్రున తిరిగింది.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ద్వైపాక్షిక సిరీస్లలో ఎదురులేని శక్తిగా ఎదిగిన టీమిండియా.. ఈ ఏడాది స్వదేశంలో టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. సొంతగడ్డపై పొట్టి వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.సూర్యపై తప్పని వేటుకానీ ఊహించని రీతిలో బీసీసీఐ సూర్యపై వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టులోనూ స్థానం లేకుండా చేసింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.పిల్లాడికి అవకాశంఐర్లాండ్తో పాటు.. ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల సూర్యవంశీని తొలిసారి టీమిండియాకు ఎంపిక చేసింది. అయితే, ఈ మూడు జట్లలోనూ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు.హార్దిక్కు దక్కని చోటుకాగా ఐపీఎల్-2026లో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా.. ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది. ఇక హార్దిక్ పది మ్యాచ్లు ఆడి కేవలం 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఇక వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసినా.. అతడు ఆడే విషయంపై బీసీసీఐ ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.మూడు జట్లలోనూ నితీశ్ రెడ్డితాజాగా టీ20 జట్టు నుంచి పూర్తిగా పక్కనపెట్టేస్తూ టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో యువ ఆల్రౌండర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడల జట్టులో అతడికి చోటు ఇచ్చారు.అందుకే అతడిని ఎంపిక చేశాంఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో అతడు ముఖ్యమైన ఆటగాడు. అతడితో పాటుగా అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ రెడ్డి మాకు దొరికాడు.రొటేషన్ పద్ధతిలో ఇద్దరి సేవలు వాడుకుంటాము. అందుకే హార్దిక్కు విశ్రాంతినిచ్చాము. వన్డే వరల్డ్కప్ నాటికి అతడు ఫిట్గా ఉంటాడో లేదో చూడాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. తద్వారా హార్దిక్ ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా.. వన్డే వరల్డ్కప్ టోర్నీలోనూ నితీశ్ రెడ్డినే ఆడిస్తామని అగార్కర్ పరోక్షంగా స్పష్టం చేశాడు. అదే జరిగి.. నితీశ్ రెడ్డి అద్భుతంగా ఆడితే.. హార్దిక్ మున్ముందు జట్టులో కొనసాగడం కూడా కష్టమే అవుతుంది. చదవండి: ‘మేము సెలక్ట్ చేయలేదు.. తనంతన తానే ఎంపికయ్యాడు’
భువీని కాదని హర్షిత్కు చోటు.. గంభీర్పై ఆగ్రహజ్వాలలు
భారత సీనియర్ క్రికెట్ జట్టులో కెప్టెన్లకే గ్యారెంటీ లేని రోజుల్లో, ఓ ఆటగాడు కోచ్ అండదండలతో దాదాపు ప్రతి జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఆ ఆటగాడి పేరే హర్షిత్ రాణా. ఈ 24 ఏళ్ల కేకేఆర్ పేసర్కు గంభీర్తో సత్సంబంధాలు ఉన్నాయి. గంభీర్ కేకేఆర్ కోచ్గా పని చేసే సమయంలో హర్షిత్ను బాగా వెనకేసుకొచ్చాడు. టీమిండియా కోచ్గా ఎంపికయ్యాక భారీ లాబీయింగ్ జరిపి హర్షిత్కు ఏకంగా భారత జట్టులోనే చోటు ఇప్పించాడు.అది కూడా ఏదో ఒక ఫార్మాట్కే అనుకుంటే పొరపాటే. మూడు ఫార్మాట్ల జట్లలో ఎవరున్నా, లేకపోయినా హర్షిత్ పేరు ఉంటుంది. బుమ్రా అయినా ఏదో ఒక సిరీస్ జట్టులో ఉండడేమో కానీ, హర్షిత్ మాత్రం దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతాడు. హర్షిత్కు ఇంతలా అవకాశాలు వస్తున్నాయంటే, అతడేదో భారీ టాలెంటెడ్ అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటివరకు అతడు టీమిండియా తరఫున 2 టెస్ట్లు, 14 వన్డేలు, 9 టీ20లు ఆడినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా లేదు.ఇలాంటి ఆటగాడికి భారత సెలెక్టర్లు ఏం చూసి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఏదో కోచ్ అండదండలతో నెట్టుకొస్తున్నాడు కానీ, హర్షిత్ దేశవాలీ జట్లకు కూడా చాలా ఎక్కువే. ఇది చాలామంది టీమిండియా అభిమానుల "అభిప్రాయం". తాజాగా గంభీర్-హర్షిత్ బంధం మరోసారి సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లలో హర్షిత్కు చోటు దక్కింది. ఇతగాడు గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా సెలెక్టర్లు నేరుగా జాతీయ జట్టులో మరోసారి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి టీమిండియాకు ఎంపిక కావడానికి ఐపీఎల్ ప్రదర్శనలు కొలమానం కానప్పటికీ.. దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఇదే తంతు కొనసాగుతుంది.Look at the hypocrisy of Agarkar and Gambhir. They picked Harshit Rana, who was injured for 2-3 months, but left out Bhuvneshwar Kumar, the highest wicket-taker of this year's IPL. pic.twitter.com/BLS7ySwP6l— Aryan (@MStark_56) June 6, 2026ఐపీఎల్ ప్రదర్శనలనే పరిగణలోకి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు మొదటి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ సీజన్లో భువీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా టోర్నీ సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండో ఎడిషన్లో ఛాంపియన్గా నిలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.భువీ లాంటి ఇన్ ఫామ్ బౌలర్ను కాదని గాయపడి 2-3 నెలుల ఆటకు దూరంగా ఉన్న హర్షిత్ లాంటి అన్ ఫిట్ బౌలర్కు ఏకంగా మూడు భారత జట్లలో అవకాశం ఇవ్వడాన్ని ప్రతి భారత క్రికెట్ అభిమాని తప్పుబడుతున్నాడు. హర్షిత్ ఎంపికలో ప్రతిసారి చక్రం తిప్పే కోచ్ గంభీర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. గంభీర్-చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అర్హతలేని ఆటగాళ్లను ఎంపిక చేసే మాఫియా నడుపుతున్నారని ఫైరవుతున్నాడు.కాగా, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ను తప్పించి శ్రేయస్కు కొత్త టీ20 కెప్టెన్గా పట్టం కట్టారు. సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్ జట్టు నుంచి పిలుపందింది. మూడు వేర్వేరు జట్లలో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో హర్షిత్ రాణా ఒకరు.
న్యూస్ పాడ్కాస్ట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
బిజినెస్
ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు మాయం!
టెక్ రంగంలో ఉద్యోగాలు కోతలు భారీగా పెరుగుతున్నాయి. 2026 ప్రారంభం నుంచి కేవలం ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,16,000కు పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోయినట్లు లేఆఫ్.ఫై (Layoff.fyi) ట్రాకర్ వెల్లడించింది.లక్షలాది ఉద్యోగాలు పోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందడం అని తెలుస్తోంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కూడా కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. మార్చి నెలలో మాత్రమే 46,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే నెలలో 28,000 ఉద్యోగాలు తొలగింపులు జరిగాయి.భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, పేపాల్, సిస్కో, ఇంట్యూట్, క్లౌడ్ఫ్లేర్, లింక్డ్ఇన్, ఉబర్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.ఉబర్ తన పీపుల్ అండ్ ప్లేసెస్ డివిజన్లో సుమారు 23 శాతం సిబ్బందిని తగ్గించింది. సిస్కో 4,000 ఉద్యోగాలను తొలగిస్తూ, అదే సమయంలో కృత్రిమ మేధస్సు, సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించింది. పేపాల్ అయితే రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, తన ప్రణాళికను కూడా వెల్లడించింది. మెటా కంపెనీ కూడా తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో భారీ మొత్తంలో తగ్గిస్తూ, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది.
భారత్లోకి జెటూర్ టీ2.. ఫార్చ్యూనర్కు గట్టి పోటీ!
ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో జేఎస్డబ్ల్యు మోటార్స్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ చెరీ ఆటోమొబైల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలో ఈ రెండు కంపెనీల తొలి ఉత్పత్తిగా 'జెటూర్ టీ2' (Jetour T2) ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీని లాంచ్ చేయనున్నాయి.జెటూర్ టీ2 కారు ఇండియన్ మార్కెట్లో 2026 దీపావళి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జేఎస్డబ్ల్యు ఏర్పాటు చేయనున్న ప్లాంట్లో అసెంబుల్ చేయనున్నారు. ఈ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.జెటూర్ టీ2 ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మెజెస్టర్, స్కోడా కోడియాక్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. కాబట్టి మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది.అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతున్న జెటూర్ టీ2లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పాటు 26.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ను అందిస్తున్నారు. సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో ఈ వాహనం కేవలం ఎలక్ట్రిక్ మోడ్లోనే 139 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.ఫీచర్ల విషయానికి వస్తే.. జెటూర్ టీ2లో 15.6 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12 స్పీకర్ల సోనీ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అదనంగా లెవల్-2 ఏడీఏఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.గ్లోబల్ మార్కెట్లలో జెటూర్ టీ2 మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా లభిస్తున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రారంభ దశలో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే.. ఈ కారు లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన ఇంధన సామర్థ్యం, ప్రీమియం ఫీచర్లతో ఎస్యూవీ విభాగంలో గట్టి పోటీ ఇస్తుందని పలువురు భావిస్తున్నారు.
EPF 8.25% వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది.. ఎలా చెక్ చేసుకోవాలి?
దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఊరటనిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించింది. గత మార్చిలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, ఇది వరుసగా మూడో ఏడాది కూడా అదే స్థాయిలో కొనసాగుతున్న వడ్డీ రేటుగా నిలిచింది. అయితే ఇది ఎప్పుడు జమవుతుందని ఉద్యోగులు ఆతృతగా ఎదురుగా చూస్తున్నారు.వడ్డీ జమ ఎప్పుడు?వడ్డీ రేటును సీబీటీ సిఫారసు చేసినప్పటికీ, అది ఖాతాల్లో జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. గత అనుభవాలను బట్టి చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వడ్డీ జమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఆలస్యమైనా నష్టం ఉండదువడ్డీ ఖాతాలో ఆలస్యంగా కనిపిస్తే తమకు నష్టం జరుగుతుందేమోనని చాలామంది సభ్యులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఈపీఎఫ్ పథకం నిబంధనల ప్రకారం సభ్యుల అర్హత కలిగిన నిల్వలపై వడ్డీని నిరంతరం లెక్కిస్తారు. ఖాతాలో ఎంట్రీ ఆలస్యంగా నమోదైనా, చెల్లించాల్సిన పూర్తి వడ్డీ మొత్తాన్ని సభ్యులకు జమ చేస్తారు. అందువల్ల పరిపాలనా ఆలస్యం వల్ల ఖాతాదారులు ఎలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోరు.పాస్బుక్లో ఈ ఎంట్రీ కనిపిస్తే వడ్డీ పడ్డట్టే..వడ్డీ జమ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ పాస్బుక్లో “Int. Updated up to 31/03/2026” అనే ఎంట్రీ కనిపిస్తుంది. ఆ తర్వాత సభ్యులు తమ తాజా బ్యాలెన్స్ను పరిశీలించవచ్చు.బ్యాలెన్స్ చెక్ చేసుకునే మార్గాలుఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాలో వడ్డీ జమైందో లేదో కింది మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.🔸 ఉమంగ్ (UMANG) యాప్🔸 ఈపీఎఫ్ఓ సభ్యుల ఈ-సేవా పోర్టల్🔸 యూఏఎన్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్🔸 7738299899కు UAN EPFOHO ENG (లేదా భాష కోడ్తో) ఎస్ఎంఎస్ పంపడంఅయితే ఈ సేవలను వినియోగించాలంటే యూఏఎన్ యాక్టివ్గా ఉండటంతో పాటు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి.స్థిరమైన రాబడితో ఉద్యోగులకు భరోసాప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లు, బాండ్ ఈల్డ్లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులకు ఆకర్షణీయమైన రాబడిని అందిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన వెంటనే వడ్డీ జమ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది.
‘ఈ సిటీలో రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నా చాలడం లేదు’
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో జీవన వ్యయం ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి చర్చనీయాంశమైంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి నెలకు రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తమ ఖర్చులను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆర్థిక ప్రణాళికపై సూచనలు ఇవ్వాలని వారు కోరారు.అద్దె, పెట్టుబడులు, ప్రయాణ ఖర్చులే భారమా?రెడ్డిట్లో చేసిన పోస్టు ప్రకారం, ఈ దంపతులు ముంబైలో ఒక 1BHK ఫ్లాట్లో నివసిస్తున్నారు. నెలకు రూ.44 వేల అద్దె చెల్లిస్తున్నారు. కిరాణా సరుకులకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతుండగా, పనిమనిషి జీతం రూ.8 వేలు, విద్యుత్, ప్రయాణ ఖర్చులు కలిపి మరో రూ.10-12 వేల వరకు వెళ్తున్నాయి. వీటితో పాటు ప్రతి నెలా రూ.60 వేల మేర సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెడుతున్నారు.అంతేకాకుండా ఉద్యోగ సంబంధిత సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, సమావేశాల కోసం నెలకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. లెక్కల ప్రకారం ఇంకా సుమారు రూ.60 వేల వరకు మిగలాల్సి ఉన్నప్పటికీ, నెలాఖరుకు ఆ మొత్తం కూడా ఖర్చయిపోతోందని వారు పేర్కొన్నారు.చిన్న చిన్న ఖర్చులే పెద్ద భారంబట్టలు, వాచ్లు, పర్ఫ్యూమ్లు కొనడం వంటి వ్యక్తిగత ఖర్చులతో పాటు స్వగ్రామానికి వెళ్లి వచ్చేందుకు ప్రయాణాలపై కూడా భారీగా ఖర్చవుతోందని దంపతులు తెలిపారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల కోసం బహుమతులు, ఇతర అవసరాలతో కలిపి ఒక్కో ప్రయాణానికే రూ.45 వేల వరకు వెచ్చిస్తున్నామని వివరించారు.భవిష్యత్తులో పిల్లలను కనాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఖర్చు విధానం దీర్ఘకాలంలో నిలకడగా ఉంటుందా అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు.“సిప్ కూడా పొదుపే”.. నెటిజన్ల సలహాలుఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు, నెలకు రూ.60 వేలు సిప్లో పెట్టుబడి పెడుతున్నారు కదా దీన్ని కూడా పొదుపుగా పరిగణించాలని సూచించారు. రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురైతే సిప్ చేసే మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.మరికొందరు అసలు సమస్య ఆదాయం తక్కువగా ఉండటంలో కాదని, ఖర్చుల నియంత్రణలోనే ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆఫీస్ పార్టీల పేరుతో ప్రతి నెలా రూ.12-13 వేల వ్యయం చేయడం, అవసరం లేని కొనుగోళ్లు, తరచూ ఖరీదైన ప్రయాణాలు చేయడం వంటి అంశాలను తగ్గిస్తే పొదుపు పెరుగుతుందని సూచించారు.మెట్రో నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంఇటీవలి సంవత్సరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అద్దెలు, రవాణా, తిండి, సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో మంచి వేతనాలు పొందుతున్న మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఆర్థిక ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ, పెట్టుబడుల సమతుల్యతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై దంపతుల పోస్ట్ నగర జీవనశైలిపై, ఆదాయం-ఖర్చుల సమతుల్యతపై విస్తృత చర్చకు దారితీసింది.
ఫ్యామిలీ
సైక్లింగ్తో యాక్టివ్గా..!
ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ఒకే ఒక్క సులువైన పరిష్కారం ఉంది, అదే సైక్లింగ్. మరి ఆ సైక్లింగ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.శరీర భాగాల సమన్వయం, సమతుల్యత మెరుగవుతుంది.రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. ఊబకాయం నుంచి కాపాడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. కేన్సర్ నివారణకు సహాయపడుతుంది. కీళ్ల కదలికలు సులువవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించే ప్రాణయామంయోగాలో శ్వాస నియంత్రణ ప్రక్రియను ణాయామం అంటారు. ప్రాణ (జీవశక్తి) + ఆయామ (నియంత్రణ/విస్తరణ) కలయికే ప్రాణాయామం. ఇది ఒత్తిడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.ప్రయోజనాలు: ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి, కుడి ముక్కు ద్వారా వదలడం వల్ల నాడీ వ్యవస్థ శుభ్రపడుతుంది. భ్రామరీ: తుమ్మెదలా శబ్దం చేస్తూ గాలిని వదలడం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది.కపాలభాతి: శ్వాసను వేగంగా బయటకు వదలడం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.భస్త్రిక: బలమైన, వేగవంతమైన శ్వాస ప్రక్రియ. శరీరంలో శక్తిని పెంచుతుంది.ముఖ్యమైన జాగ్రత్తలు: ఖాళీ కడుపుతో (ఉదయం లేదా సాయంత్రం) చేయడం మంచిది. గుండెజబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల సమక్షంలోనే అభ్యసించాలి.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ (చదవండి: Weight loss Tips: 65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..)
చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!
ఆరేళ్లకు అనాథలా మారాడు. పదేళ్లకు కార్పెంటర్ అవతారమెత్తాడు. పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆపైన నైట్ వాచ్మన్గా పనిచేశాడు. చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్ చేస్తే... అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ సక్సెస్ జర్నీ... జీవితానికే కొత్త పాఠాలు నేర్పిస్తుంది, యువతకు ప్రేరణ కలిగిస్తుంది. కలిఖో పుల్... ఆ పేరుకు అర్థం 'మంచి భవిష్యత్తు' అని. ఏరికోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా.. ఊహ తెలిసినప్పట్నుంచీ అతనికి చీకట్లు తప్ప, రేపటిపైన ఆశ ఎప్పుడూ కనిపించలేదు. పుల్ పదమూడు నెలల చిన్నారిగా ఉన్నప్పుడే తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్. అలా దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్ని అతడి అత్తయ్య చేరదీసింది. అది అతడి మీద ప్రేమతో కాదు... ఇంట్లో పనులకు పనికొస్తాడని. పదేళ్లకు వడ్రంగిగా... ఆరేళ్ల వరకూ పుల్ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని. పుల్ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తులే. దాంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరంగా అడవి చెట్ల మధ్యే పెరిగాడు. పదేళ్ల వయసొచ్చేసరికి పక్క వూళ్లొని 'హవాయి క్రాఫ్ట్ సెంటర్'లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా బండి నడిపించేవాడు. పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. జీవితాన్ని మలుపు తిప్పిన ఆ పాట..పుల్ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్ సెంటర్కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్లోనే మాట్లాడేవాళ్లు. పుల్కి అస్సమీస్ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్ స్కూల్లో ఒకటో తరగతిలో చేరాడు పుల్. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు. ఓరోజు పుల్ చదువుతోన్న స్కూల్కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటి కమిషనర్ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్ పుల్కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడి గురించి ఆరా తీశాడు. విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్ని డే స్కూల్కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్ ఇప్పించాడు. అదే పుల్ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు. ఆత్మహత్యవైపు అడుగులు తరగతులు మారే కొద్దీ పుల్కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దాంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టం మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్ వాచ్మన్గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం ఐదు గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. నెలకు రూ.212 జీతం వచ్చేది. రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ దురదృష్టం పుల్ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు. కానీ చివరికి ఆపరేషన్ చేయించుకోకుంటే గానీ సమస్య తగ్గదనే పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు నలభై నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు. చదువుకుంటూనే పని జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్కి అర్థమైంది. ఎలాగైనా ఆపరేషన్ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రెండువేల ఐదొందలు పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్, తరవాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్ గ్రాంట్తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు. క్రమంగా పుల్ ఆరోగ్యం మెరుగు పడింది. చేతిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంది. చదువును కొనసాగిస్తూనే డబ్బులు సంపాదించడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. పుల్కి వెదురుతో ఫెన్సింగ్ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. దాన్నే ఉపాధిగా చేసుకుని అంచలంచెలుగా ఎదగడం ప్రారంభించాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్ నిద్రనీ, వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. ఓవైపు ఇంటర్ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్ హ్యాండ్ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు. పాతికేళ్లకే ఎమ్మెల్యే చిన్న కాంట్రాక్టర్గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి పుల్ ఎదిగాడు. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పుల్ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు. అల్సర్ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తున్నాడు. కాంట్రాక్టర్గా మారాక ప్రభుత్వాసుపత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది. మంత్రిగా 22ఏళ్లుచిన్న వయసులోనే స్థానికంగా పుల్ సంపాదించిన పేరు కాంగ్రెస్ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడు కాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు. తొలి ఎన్నికల్లో పుల్ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు.మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. 'ఒకప్పుడు ఆపరేషన్ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్ రెండువేల ఐదొందలు గ్రాంట్ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా' అంటూ పుల్ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు. 23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22 ఏళ్లు పుల్ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్లోని పుల్ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు. ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. కష్టమే దేవుడని నమ్ముతా..ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్, అరుణాచల్ ప్రదేశ్లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు తెరదించి, ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. "నాకు దేవుడిపైన నమ్మకం లేదు, ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నాకు సాయపడలేదు. కానీ కష్టమే దేవుడని నమ్ముతా. అదే జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నా కారుమీద ఎగిరే జెండాను చూస్తున్నప్పుడల్లా ఒకప్పుడు చౌకీదార్గా నేను రోజూ జెండాను ఎగరేసిన రోజులు గుర్తొస్తుంటాయి. ఇప్పటికీ నా తొలిరోజుల్నాటి చెక్క పనిముట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా ఐదుగురు కొడుకులకూ వాటిని చూపిస్తూ నా గతాన్ని గుర్తు చేస్తా. నన్ను మంత్రిగా కాకుండా ఓ మామూలు కార్పెంటర్గా, కాంట్రాక్టర్గానే చూడమని వాళ్లకు చెబుతా. ఒకప్పుడు రోజుకు 12 గంటలు ప్రభుత్వ వాచ్మన్గా పనిచేసిన నేను ఇప్పుడు 24 గంటలూ ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నా. నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు". అంటూ యువతను ప్రశ్నిస్తారు పుల్. అయితే పుల్ ఆగస్టు 9, 2016న 47 ఏళ్ల వయసులో మరణించాడు.చదవండి: బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం.. కానీ పేదవాడే!
బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం..! కానీ పేదవాడే..
మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సన్నీ గార్గ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్ 34 ఏళ్ల గుర్గావ్ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్ఫుల్ మ్యాన్లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్ బెడ్రూం ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్ సన్నీ. ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు. దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్ సన్నీ "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్ అని ఎన్నిసార్లు అనుకున్నావ్ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం. రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్ సన్నీ. అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Dr Sunny Garg (@drsunnygarg) (చదవండి: భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు)
భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు
ఢిల్లీలోని జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్ సైన్స్ టీచర్ సోమా మండల్ ఈ ఏడాది గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 129 దేశాల నుంచి వచ్చిన 12,000 నామినేషన్లలో ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ (కేంబ్రిడ్జ్)లోని అంతర్జాతీయ విద్యా విభాగం సోమా గ్లోబల్ విజేతగా నిలిచిందని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది ఇతర ప్రాంతీయ విజేతలతో హోరాహోరీగా జరిగిన పోటీలో, సోమా 40 శాతం ప్రజా ఓట్లను సాధించి.. భారత్ నుంచి గెలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించింది. సుమారు పదేళ్లకు పైగా బోధనా అనుభవం ఉన్న సోమా తన సైన్సు పాఠాలలో వాతావరణ విద్యను పొందుపరిచి..ఆ దిశగా విద్యార్థులను చైతన్యవంత చేయడమే కాదు, ఆచరణత్మక పరిష్కారాలను రూపొందించేలా ప్రోత్సహించారామె. ఈ మేరకు సోమా మాట్లాడుతూ..తాను ఈ గ్లోబల్ అవార్డు ఎంపికైనట్లు తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది. అంతేగాదే తన తల్లిదండ్రలు, సోదరుడితో కలిసి సోమా న్యూఢిల్లీలోని కేంబ్రిడ్జ్ కార్యాలయాలకు చేరుకుని ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుని అందుకున్నారు. ఈ పురస్కారం తోపాటు ఆమెకు కేంబ్రిడ్జ్ వర్చువల్ ఎన్రిచ్మెంట్ కోర్సులో ఒక స్థానాన్ని కూడా ప్రధానం చేశారు. నిజంగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని క్షణం అని సోమా భావోద్వేగంగా చెప్పింది. ఇదిలా ఉండగా, కేంబ్రిడ్జ్లోని అంతర్జాతీయ విద్య గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాడ్ స్మిత్ సోమాని అభినందిస్తూ..ఆమె రూపొందించిన వాతావరణ మార్పుల పాఠ్యప్రణాళిక చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ప్రతిరోజూ తరగతి గదిలో విద్యార్థులకు తమ పర్యావరణ, గ్రహం పట్ల ఎలా ఉండాలో చెప్పడం నిజంగా అభినందనీయం అని అన్నారు. ప్రపంచంలో ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాలు వాతావరణ మార్పులు..అలాంటి దానిపై విద్యార్థుకు అవగాహన కల్పిస్తూ..ఆచరణాత్మక పరిష్కరాల దిశగా చైతన్య పరిచే ఆమె అభిరుచికి ధన్యవాదాలని అన్నారు. అంతేగాదు నవంబర్ 2026 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న కొత్త కేంబ్రిడ్జ్ పాఠ్యపుస్తకాల ముందు భాగంలోని 'ధన్యవాదాలు' పేజీలో కూడా ఆమె కనిపించనుంది. అలాగే సోమా ప్రాంతీయ విజేతగా, తన తరగతి కోసం 500 పౌండ్ల విలువైన పుస్తకాలను కూడా గెలుచుకుంది. (చదవండి: చింతగింజలతో మైక్రో ప్లాస్టిక్కి చెక్..!)
అంతర్జాతీయం
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు భారీ ఊరట లభించింది. గ్రీన్కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తులను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు అమెరికా ఫెడరల్ కోర్టు చెక్ పెట్టింది. ఆ ఆదేశాలు చెల్లుబాటు కావని తీర్పు ఇచ్చింది. దీంతో స్వదేశంలోనే అమెరికా అధ్యక్షుడికి మరో పరాభవం ఎదురైనట్లయ్యింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన పలు వలస విధానాలపై రోడ్ ఐలాండ్లోని ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ ప్రభుత్వం "జాతీయ భద్రత" పేరుతో 39 దేశాలకు చెందిన విదేశీయుల గ్రీన్కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసింది. అంతేకాకుండా ఆశ్రయం (అసైలమ్) కోసం దరఖాస్తు చేసిన వారి కేసులను కూడా నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయాలను పరిశీలించిన న్యాయమూర్తి జాన్ మెక్కానెల్.. ప్రభుత్వం తనకు లేని అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించి, బయోమెట్రిక్ ప్రక్రియలు పూర్తి చేసి, ఇంటర్వ్యూలకు హాజరైన దరఖాస్తుదారులపై ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని స్పష్టం చేశారు."అమెరికాకు రావాలంటే చట్టాన్ని అనుసరించాలి అని తరచూ చెబుతుంటారు. ఈ కేసులో దరఖాస్తుదారులు అదే చేశారు. అయినప్పటికీ వారికి అన్యాయం జరిగింది. చట్టాన్ని పాటించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన దరఖాస్తుదారులను ఇలా నిరవధికంగా వేచి ఉండమని చెప్పలేరు" అంటూ కీలక తీర్పు ఇచ్చింది.ఈ వివాదానికి మూలం 2025లో వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పులు. ఈ ఘటనలో అరెస్టైన వ్యక్తి అఫ్గానిస్థాన్కు చెందినవాడు కావడంతో ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతను కారణంగా చూపుతూ పలు దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు అమలు చేసింది. అనంతరం "ట్రావెల్ బ్యాన్" జాబితాను విస్తరించి మొత్తం 39 దేశాలను చేర్చింది. ఈ జాబితాలోని దేశాల పౌరుల గ్రీన్కార్డులు, ఉద్యోగ అనుమతులు, పౌరసత్వ దరఖాస్తులను నిరవధికంగా నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ఆమోదించిన కొన్ని కేసులను కూడా మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. ఆశ్రయం కోరిన వారి దరఖాస్తులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.అయితే కోర్టు తాజాగా ఈ నాలుగు ప్రధాన విధానాలను చట్టవిరుద్ధమని తేల్చింది. వలస ప్రయోజనాలపై నిలిపివేత, ఆశ్రయ దరఖాస్తుల నిలిపివేత, ఇప్పటికే ఆమోదించిన కేసుల పునఃసమీక్ష, ట్రావెల్ బ్యాన్ దేశాలకు చెందిన వారిపై ప్రత్యేక ప్రతికూల దృష్టితో వ్యవహరించే విధానాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు చెందిన వేలాది మంది వలసదారులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా గ్రీన్కార్డుల కోసం, ఉద్యోగ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్తగా మారింది.అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి ఈ తీర్పు ట్రంప్ వలస విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా, చట్టబద్ధ వలస మార్గాలను పరిరక్షించే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికాలో వలసలపై జరుగుతున్న రాజకీయ పోరులో ఈ తీర్పు మరో కీలక మలుపుగా మారింది. "జాతీయ భద్రత" పేరుతో విధించిన ఆంక్షలకు కోర్టు అడ్డుకట్ట వేయడంతో.. చట్టబద్ధంగా అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
ప్రాణాలతో పోరాడుతుంటే.. సంకెళ్లు వేశారు!
కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న ఓ యువకుడికి సాయం చేయాల్సిన పోలీసులు.. అతడికే సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. బ్రిటన్లో వైరల్గా మారిన ఈ ఘటన.. ఇప్పుడు అట్లాంటిక్కు ఇరువైపులా రాజకీయ దుమారం రేపుతోంది. బాధితుడిని నిందితుడిగా భావించి పోలీసులు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదని, పాశ్చాత్య సమాజాలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది డిసెంబర్లో బ్రిటన్లోని సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే విద్యార్థిపై సిక్కు కమ్యూనిటీకి చెందిన విక్రమ్ దిగ్వా అనే 23 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నేలపై కుప్పకూలిన హెన్రీ ప్రాణాల కోసం పోరాడుతుండగా ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు తర్వాత తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.దాడి చేసిన విక్రమ్ దిగ్వా తానే బాధితుడినని, హెన్రీ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు తొలి దశలో హెన్రీనే అనుమానితుడిగా భావించినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉన్న యువకుడికి బేడీలు వేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలు, నివేదికలు బ్రిటన్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అనంతరం హెన్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఘాటుగా స్పందించారు. "హెన్రీ నోవాక్ మరణం విషాదకరమే కాదు.. ఆగ్రహం తెప్పించే ఘటన" అని పేర్కొన్నారు. అతడు చేయని నేరానికి ద్వేష నేరస్థుడిగా ముద్రవేశారని, అధికార యంత్రాంగం అతడిని విఫలమైందని విమర్శించారు. హెన్రీ మరణం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదని, సమాజం ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు.ఇదే సందర్భంగా యూరప్లో వలస విధానాలపై కూడా వాన్స్ విమర్శలు గుప్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు తమ విలువలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.వాన్స్ వ్యాఖ్యలకు ముందు అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ కేసుపై స్పందించింది. సిద్ధాంతపరమైన పక్షపాతం, రెండు రకాల పోలీసింగ్ విధానాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.అయితే అమెరికా వ్యాఖ్యలను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం స్పష్టం చేసింది. విద్వేషాన్ని, విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవి కావని పేర్కొంది. మరోవైపు హెన్రీ నోవాక్ కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కోరారు. ఈ విషాదం మరింత ద్వేషానికి, సామాజిక విభజనకు కారణం కాకూడదని విజ్ఞప్తి చేశారు.అయితే ఈ ఘటనపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు స్పందించగా.. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఈ కేసు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒక యువకుడి హత్యగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు బ్రిటన్ పోలీసుల పనితీరు, వలస విధానాలు, సామాజిక ఉద్రిక్తతలపై పెద్ద చర్చకు దారితీసింది.
నీటి చుక్క దొరక్క 49 మంది మృతి
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటైన సహారా ఎడారిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోగా.. రోజుల తరబడి నీటి చుక్క దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరు కాలినడకన సాహసోపేత ప్రయాణం చేసి అధికారులకు విషయం చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..అల్జీరియా-మాలీ సరిహద్దుల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మాలీ నుంచి కొందరు పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఈద్ అల్-అధా(బక్రీద్)ను జరుపుకునేందుకు ట్రక్కులో బయల్దేరారు. అయితే ట్రక్కు అస్సామాకా పట్టణానికి పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో.. సహారా ఎడారిలోని నిర్జన ప్రాంతంలో నిలిచిపోయింది. ట్రక్కు చెడిపోవడంతో డ్రైవర్, సహాయకులు, ప్రయాణికులు కలిసి మరమ్మతు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చుట్టుపక్కల ఎక్కడా గ్రామం లేదు.. నీటి వనరు లేదు.. ఫోన్ సిగ్నల్ కూడా లేదు. దీంతో వాహనంలో ఉన్నవారు మండే ఎండలో చిక్కుకుపోయారు.సహారా ఎడారిలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నీరు లేకపోతే మనిషి కొన్ని రోజులు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. మొదట నీటి నిల్వలు అయిపోయాయి. తర్వాత ఆహారం కూడా ముగిసింది. చివరకు దాహం, వేడి, అలసటతో ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు.అయితే అందరూ చనిపోలేదు. ఇద్దరు వ్యక్తులు ప్రాణాల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 50 కిలోమీటర్లకుపైగా కాలినడకన ఎడారిలో నడిచి ఒక నీటి వనరును చేరుకున్నారు. అక్కడి నుంచి అస్సామాకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతోనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రక్షక బృందాలు అక్కడికి చేరుకునే సరికి ట్రక్కు కింద, చుట్టుపక్కల డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించాయి. మొత్తం 49 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.రక్షక బృందాలకు మరో షాక్ఈ ఘటనలో మృతదేహాలను వెలికితీసి.. ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. అయితే రక్షక బృందాలు తిరుగు ప్రయాణంలో మరో షాకింగ్ దృశ్యాన్ని చూశాయి. సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి సుమారు 60 మంది మూడు రోజులుగా చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ వారికి సమయానికి నీరు అందించి ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే మరో భారీ విషాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు.సహారా ఎందుకు ఇంత ప్రమాదకరం?సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది సుమారు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. నైజర్లోని ఉత్తర ప్రాంతాల్లో జనావాసాలు చాలా తక్కువ. వందల కిలోమీటర్ల మేర నీటి వనరులు కనిపించవు. ఒక వాహనం చెడిపోతే సహాయం చేరుకోవడానికి రోజులు పట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే స్థానికులు సహారాను "సైలెంట్ కిల్లర్"గా అభివర్ణిస్తుంటారు. అలా.. కుటుంబాలతో ఈద్ చేసుకునేందుకు బయల్దేరిన 49 మంది ప్రయాణికుల ప్రయాణం... చివరకు ఇసుకల్లోనే ముగిసింది. సహారా ఎడారి మరోసారి తన క్రూర రూపాన్ని ప్రపంచానికి చూపించింది.ఇది మొదటిసారి కాదుసహారా ఎడారిలో ఇలాంటి విషాదాలు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగాయి. 2013లో నైజర్ నుంచి అల్జీరియా వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు వలసదారులు దారి తప్పి దాహంతో మరణించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. 2017లో మరో ఘోర ఘటన జరిగింది. ఎడారిలో చిక్కుకున్న వలసదారుల్లో 44 మంది దాహం, ఆకలితో మృతి చెందారు. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అంతర్జాతీయ వలస సంస్థ (IOM) అంచనా ప్రకారం 2014 నుంచి సహారా మార్గాల్లో కనీసం 7 వేల మందికిపైగా మరణించినట్లు.. మరికొందరు అదృశ్యమైనట్లు నమోదైంది. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎడారిలో కనిపించకుండా పోయిన వారిలో చాలామంది గురించి ఎప్పటికీ సమాచారం బయటకు రాదు.
పశ్చిమాసియాలో మళ్లీ అలజడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు వన్వే అటాక్ డ్రోన్లు ప్రయోగించబడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్లోని గోరుక్ ప్రాంతం, ఖేశ్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది.ఈ ఘటనలతో హర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు, సహజ వాయువు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలను కూడా ప్రకటించింది.మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్ముజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా నౌకాదళ కదలికలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నప్పటికీ.. తాజా పరిణామాలు మాత్రం భిన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవలే కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరిగినప్పటికీ, తాజా దాడులు ఆ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారాయి. ఇదే సమయంలో లెబనాన్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణలు కూడా మళ్లీ ఉద్ధృతమవుతుండటంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరత వైపు అడుగులు వేస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ, ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
జాతీయం
తప్పిన ఘోర రైలు ప్రమాదం.. కుప్పకూలిన బోగీ
చండీగఢ్: పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మరికాసేపట్లో కదులుతుందనగా టాయిలెట్ వద్ద ఉండే క్యాబిన్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో రైలు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ రోజు (శనివారం) ఉదయం లూథియానా రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ-శ్రీ వైష్ణో దేవి కత్రా స్పెషల్ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఒక స్లీపర్ కోచ్లోని టాయిలెట్ వద్ద నిర్మాణ లోపంతో బెర్తులు కుదుపులకు గురయ్యాయి. దీంతో స్లీపర్ కోచ్ దెబ్బతింది. టాయిలెట్ల సమీపంలో కోచ్ బాడీ పగిలిపోయింది. టాయిలెట్ పరికరాలు దెబ్బతిని పట్టాలపై కూలిపోయాయి.రైలులో అకస్మాత్తుగా కుదుపు రావడం, కోచ్ ఒకవైపుకు వంగిపోవడాన్ని గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే రైల్వే కోచ్ నుంచి దూకేశారు. అయితే వెనువెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, దెబ్బతిన్న కోచ్ నుండి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఒకవేళ రైలు వేగంగా ఉండి ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవన్నారు.అయితే దెబ్బతిన్న బోగీ స్థానంలో వెంటనే మరో బోగీ ఏర్పాటు చేసి రైలును ప్రారంభించారు.
కథలు అల్లకండి.. డీకే శివకుమార్ వార్నింగ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఊహించని షాక్ తగిలింది. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో డీకే శివకుమార్పై విమర్శలు రావడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని అనవసర కథనాలు సృష్టించకూడదని వార్నింగ్ ఇచ్చారు.కొత్తగా కొలువుదీరిన శివకుమార్ ప్రభుత్వానికి ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో ముఖ్యమంత్రి తనకు బెంగళూరు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రమాణ స్వీకారం తర్వాత నీటిపారుదల మంత్రిత్వ శాఖను కేటాయించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట తప్పినందుకు గానూ తన మంత్రిత్వ శాఖకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు.దీంతో శివకుమార్ డ్యామేజ్ కంట్రోల్ పనులు చేపట్టారు. ఆయన రాజీనామాపై స్పందిస్తూ "రామలింగారెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు తన అత్యంత సన్నిహితుడు సమస్యలన్నీత్వరలోనే పరిష్కారమవుతాయి. అనవసరమైన కథలు సృష్టించకండి అవన్నీ నిరాధారమవుతాయి.ఇప్పుడు సమస్యలన్నీ సర్ధుకున్నాయి" అన్నారు. అతను వాట్సాప్లో రాజీనామా పంపాడని పేర్కొన్నారు.కాగా నిన్న (శుక్రవారం) రాత్రి, రామలింగారెడ్డి రాజీనామా అనంతరం శివకుమార్ ఆయనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు.ఆయనతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విధంగా మాట్లాడారు. కాగా డీకే శివకూమార్ క్యాబినేట్ బెర్తులపై మరో మంత్రి కేఎం మునియప్ప సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు మరింత మెరుగైన క్యాబినేట్ దక్కాల్సిందన్నారు. ప్రస్తుతం ఆయనకు సివిల్ సప్లైస్ మంత్రిత్వశాఖ కేటాయించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ కీలక భేటీ
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. భారత్పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై కసరత్తు, ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి వివిధ ఆలోచనలు, చర్యలపై చర్చలు జరిపారు.ఆర్థికవృద్ధిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే ఒడుదొడుకులను తట్టుకునే సామర్థం పెంపుదల, వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వివిధ వ్యూహాలను, చర్యలను చర్చించారని వారు పేర్కొన్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
అమెరికాలో అక్రమ వలసదారులు.. భారత్ కీలక ప్రకటన
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎట్టి పరిస్థితుల్లో వారు దేశంలోకి ఉండనిచ్చేది లేదంటూ ఎన్నో కఠిన నిబంధనలు తీసుకవచ్చి వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనేఅమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు భారత్ ప్రకటించింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు ప్రకటించారు. "2026లో ఇప్పటివరకూ 1,076 మంది బహిష్కరణకు గురయ్యారు. అదే గతేడాది మెుత్తంగా 3,567 మంది బహిష్కరణకు గురయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇది అధికమే" అని జైశ్వాల్ అన్నారు. దేశ బహిష్కరణకు గురైన వారిలో సరైన పత్రాలు లేకపోవడంతో పాటు వీసా ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉన్నారని పేర్కొన్నారు.అక్రమ వలసల విషయమై భారత్, అమెరికా దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని అక్రమ వలసలను ఎలా అరికట్టాలి, అదే సమయంలో ఇది చట్టబద్ధమైన వలసలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా చూసుకోవాలి అనే దానిపై ఇరుదేశాలు దృష్టి సారించాయనిపేర్కొన్నారు. కాగా ఈ వారంలోనే భారత్కు చెందిన సుమారు 30 మంది వ్యక్తులు వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తూ అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించారు . వీరిని త్వరలోనే దేశ బహిష్కరణకు గురిచేసే అవకాశం ఉంది.
ఎన్ఆర్ఐ
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు)
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం.
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఎన్నారై రాపోలు నందు..!
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసూ్తనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా..నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం..కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేసూ్తనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.– రాపోలు నందు, సింగపూర్
అమెరికా యూ టర్న్ : వారికి భారీ ఊరట
అమెరికాలోని భారతీయుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్న వేళ గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకునే హెచ్-1బి (H-1B) వీసాదారులకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) భారీ ఊరట నిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన (ప్రాసెసింగ్) జరిగే సమయంలో అత్యధిక శాతం మంది వలసదారులు అమెరికాలోనే కొనసాగవచ్చని, వారు దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని DHS స్పష్టం చేసింది.గ్రీన్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు, వారి దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నప్పుడు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేద నిడీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఇటీవలి ప్రకటనపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో విధానంలో ఎలాంటి పెద్ద మార్పు జరగలేదని స్పష్టత వచ్చింది. దీని ప్రకారం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు అమెరికాలోనే సురక్షితంగా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యందరఖాస్తుదారుడు అమెరికా వెలుపల ఉండి ప్రక్రియను పూర్తి చేయాలా లేదా అనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ విచక్షణాధికారాల (case-by-case basis) ప్రకారం చాలా కాలంగా నిర్ణయిస్తున్నారు. తాజా మార్గదర్శకాలు కేవలం ఆ పాత అధికారాలను గుర్తుచేసేవే తప్ప కొత్త నిబంధనలు కావనిడీహెచ్ఎస్ ప్రతినిధి తెలిపారు.కాగా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చేసిన ఒక ప్రకటన వల్ల దరఖాస్తు దారులలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసాధారణ మినహాయింపులంటే తప్ప, వారు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉండాలంటూ వెలువడిన వార్త తీవ్ర ఆందోళన రేపింది.
క్రైమ్
ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ కుటుంబంలోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిపై ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జలాలాబాద్కు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద(మహిళ) మరణించింది. దీంతో అంత్యక్రియలు, అనంతర కర్మలు పూర్తి చేసుకుని ఆ కుటుంబం పికప్ వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 28 మంది వాహనంలో ఉన్నట్లు సమాచారం.గత అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనం ఫిరోజ్పూర్-ఫజిల్కా మార్గంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర కొండ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్తో కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పికప్ వాహనం అధిక వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్ మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైలర్ను తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఫరీద్కోట్లోని ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగం, ఇరుకు రహదారి, ప్రమాదకర మలుపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిలోని ఈ భాగం చాలా కాలంగా ప్రమాదాల కేంద్రంగా మారిందని, రహదారి విస్తరణ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#BREAKING SEVEN TO NINE killed and 15 injured in Ferozepur, Punjab, when a truck collided with a jeep carrying a family to immerse ashes. SSP Bhupinder Singh confirmed. #Punjab #Ferozepur #RoadAccident @PunjabPoliceInd https://t.co/3CbYUL1g3A pic.twitter.com/k8W1AxtjUP— jarvis ☠️ (@Vishii14) June 6, 2026
బుర్ఖాలో వచ్చాడు.. నడకతో దొరికిపోయాడు
స్నేహితుడి మెడలో ఐదు తులాల బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని నెలల తరబడి ఎదురు చూశాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి ఏం చేయాలి.. ఎలా తప్పించుకోవాలి అని స్కెచ్ గీశాడు. ప్లాన్ అమలు చేసే టైంలో.. కంగారుపడడంతో ఊహించనిది జరిగింది. అయినా బెదరలేదు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరకు.. సీసీటీవీలో దొరికిన ఒక చిన్న క్లూ చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ప్రకాశ్ చంద్ర గుప్తా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మోహిత్ ద్వివేది అనే వ్యక్తితో 18 ఏళ్ల స్నేహం ఉంది. అయితే ఆ స్నేహానికే చివరికి డబ్బు, బంగారం చిచ్చుపెట్టాయి. ప్రకాశ్ ధరించే సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసుపై మోహిత్ కన్నేశాడు. దానిని ఎలాగైనా దోచుకోవాలని నిర్ణయించుకున్న అతడు ముందుగానే పథకం రచించాడు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న మే 31 రాత్రి ప్రకాశ్ తన కోచింగ్ సెంటర్లోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించడంతో పాటు మహిళలు ఉపయోగించే ఆభరణాలు, చెప్పులు కూడా వేసుకున్నాడు. అనంతరం కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి ప్రకాశ్పై దాడికి దిగాడు. బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది.ఈ క్రమంలో ప్రకాశ్ను బలంగా తోసేయడంతో అతడు నేలపై పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మోహిత్ బంగారు గొలుసుతో పాటు మరో బంగారు బ్రాస్లెట్ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాశ్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని రక్తపు మడుగులో గుర్తించారు. తొలుత పోలీసులు ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల మరణించి ఉండొచ్చని భావించారు. అయితే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక చోట ఒకరు బుర్ఖాలో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ మనిషి నడక మాత్రం తేడాగా కనిపించింది. దీంతో బుర్ఖాలో ఉంది మహిళ కాదేమోనని అనుమానపడ్డారు. అలాగే.. అక్కడి నుంచి సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆ ముసుగు వ్యక్తి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు ఒక కారులో.. బుర్ఖా మార్చుకుంటూ ఆ వ్యక్తి బయటపడ్డాడు. అది మోహిత్ అని గుర్తించి షాక్ తిన్నారు.పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన మోహిత్.. హత్య తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు వెల్లడైంది. అంతేకాకుండా నేరం జరిగిన మరుసటి రోజే ఓ పోటీ పరీక్షకు హాజరై, తర్వాత లక్నోకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనతో ప్రకాశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. "18 ఏళ్ల స్నేహాన్ని డబ్బు కోసం బలి చేశాడు. ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఊహించలేదు" అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
రహస్య గదులు.. స్పా ముసుగులో వ్యభిచారం..!
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) సమన్వయంతో కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లలో విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయా సెంటర్లు ప్రధానంగా అనుమతులు లేకపోవడం, రహస్య గదుల ఏర్పాటు, గుర్తింపు కార్డులు సేకరించకపోవడం, నేమ్బోర్డులు ప్రదర్శించకపోవడం, రికార్డుల నిర్వహణ లోపం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు కమిషనర్ బి. సుమతి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), వ్యభిచార నిరోధక చట్టం (ఐటీపీఏ) ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భవన యజమానులు తమ ప్రాంగణాలను స్పా నిర్వహణకు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలను పూర్తిగా సరిచూసుకోవాలని, అక్రమ కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. #Hyderabad:Major crackdown on #spacentres in #Malkajgiri#Police inspected 113 spa centres and booked 46 cases for violations including #hiddenrooms without #transparentdoors, failure to collect #customerIDproofs, lack of permissions and poor record maintenance.Cases have… pic.twitter.com/yz44plNGKq— NewsMeter (@NewsMeter_In) June 5, 2026
మీనాకుమారి పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో నమోదైన ‘బాలికలకు వల’ కేసులో నిందితురాలు మీనాకుమారి మేజిస్ట్రేట్ ఎదుట ఒకలా.. ఇక్కడి పిటిషన్లో మరోలా విరుద్ధ ప్రకటనలు చేయడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. రిమాండ్ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని చెప్పిన ఆమె.. అనంతరం తనను వేధింపులకు గురిచేశారని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆమె కోరిన విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుగానీ, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్లో కోరిన ఉపశమనాల మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించలేదంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఇన్స్ట్రాగామ్ ద్వారా మైనర్ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షలో డబ్బు దోచుకున్నారన్న ఆరోపణలపై చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత అతని తల్లి మీనాకుమారితో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తను పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారని, సిట్ , సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నిందితురాలు మీనాకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి పిటిషనర్ను అక్రమంగా నిర్బంధించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై సిట్ ఏర్పాటుతో పాటు రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని, సంబంధిత పోలీసు స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్ వివరాలను భద్రపరచాలని కోరారు. హోం జీపీ మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ.. మే 5న రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరైన పిటిషనర్, పోలీసులు తనను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని, కోర్టు ముందు ఉన్న రికార్డులు ఆమె వాదనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీడియోలు
మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్
నందూస్ అక్రమాలపై జైపాల్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
పాపం రా బుడోడా అభిషేకే కే ఎసరు పెట్టిన వైభవ్
గజదొంగ..! స్కీముల పేరుతో స్కాములు.. బాబు పాపాల చిట్టా..!
మైనార్టీలను రాజకీయంగా ప్రోత్సహించింది YSRCP
మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..?
నీ అయ్య జాగీరా.. పవన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
దంచికొడుతున్న వర్షం రోడ్లు జలమయం
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా..షాకింగ్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్
నందూస్ కపుల్స్ మౌనం..స్క్రీన్ షాట్ బయటపెట్టిన UK జైపాల్ రెడ్డి..

