ponguleti srinivasa reddy
-
‘దోచుకున్న డబ్బుతో మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు’
వరంగల్:: గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయిలు దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టలాని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో భాగంగా సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు వరంగల్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్.. బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రెండు సార్లు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన బుద్ధి రావట్లేదు.రాష్ట్ర విభజన జరిగిన నాడు తెలంగాణ ధనిక రాష్ట్రం. నిజాలు బయటపడతాయని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడడు. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ బయట బావ, బామ్మర్ధులు సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎందుతున్నాయంటే దానికి కారకులు గత పాలకులే’ అని ధ్వజమెత్తారు పొంగులేటికాంగ్రెస్ అంటేనే సంక్షేమం.. సామాజిక న్యాయంఅసలు కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమన్నారు మంత్రి సీతక్క. ఇంటింటికి ఒక్క ఉద్యోగం అని రంగుల ప్రపంచం కేసీఆర్ చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్12 నెలల్లోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగాలు ఇస్తుంటే కళ్లల్లో ప్రతిపక్షాలు నిప్పులు పోసుకుంటున్నాయన్నారు. సంవత్సరంలో రూ. 23, 600 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాం. పరీక్షలు రాయకుండానే పేపర్లు లీకైన చరిత్ర బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో స్టేసన్ ఘనపూర్ అభివ1ద్ధిలో అగ్రగామి అని సీతక్క స్పష్టం చేశారు. -
ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ల క్రమబధ్దీకరణ పథకానికి (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సచివాలయంలో ఎల్ఆర్ఎస్ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు. 2021లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారిలో.. 2020 ఆగస్టు 28కు ముందు నాటి అక్రమ లేఅవుట్లనే క్రమబధ్దీకరించనున్నారు. మార్చి 31వ తేదీలోపు పూర్తిగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినవారికి 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లేఅవుట్లలో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల క్రమబధ్దీకరణకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10శాతం ప్లాట్లు రిజిస్టరై.. 90శాతం ప్లాట్లు మిగిలిపోయినా ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్డీడ్ రిజి్రస్టేషన్ కలిగిన వారికి కూడా క్రమబధ్దీకరణ చాన్స్ ఇచ్చారు. ఈ కేటగిరీల వారికి కూడా మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే, ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని రోజు వారీగా సమీక్షించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత భూముల జాబితా పట్ల అప్రమత్తం ఎల్ఆర్ఎస్కు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం జనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, దాన కిషోర్, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్ల రాబడి అంచనా రాష్ట్రంలో 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకానికి శ్రీకారం చుట్టింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్ఆర్ఎస్పై దృష్టి పెట్టింది. అప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తగిన ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబధ్దీకరించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ఆలస్యమైంది. తాజాగా బుధవారం మంత్రులు సమావేశమై ఎల్ఆర్ఎస్కు ఆమోదం తెలిపారు. మార్చి 31వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.20 వేల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వేగంగా దరఖాస్తుల పరిశీలన రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు సుమారు 25.67 లక్షలు. ఇందులో 13,844 దరఖాస్తులకు సంబంధించి రూ.107.01 కోట్లు చెల్లింపు కూడా పూర్తయింది. మరో 9.21 లక్షల దరఖాస్తులను పరిశీలించి ఎల్ఆర్ఎస్కు ఆమోదయోగ్యమైనవిగా గుర్తించారు. ఫీజు చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇంకా ఆయా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీల పరిధిలో వచ్చిన మిగతా సుమారు 16 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఇకపై వేగవంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. -
పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం.. వైరా మండలంలో పర్యటించిన మంత్రి.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్కి మంత్రి ఫోన్లో సూచించారు.పంచాయతీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఆ దిశగా మార్పులు, చేర్పులతో కూడిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వరకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి 3న ప్రకటించాలని పేర్కొంది.4న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి తుది జాబితాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల పంచాయతీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్,కాంగ్రెస్కు ఎంపీ లక్ష్మణ్ ఛాలెంజ్ -
వికసిస్తా.. విరుచుకుపడతా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్లో శుక్రవారం మంత్రి పొంగులేటి ఉన్నతాధికా రులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆమె తన ఇన్స్టాలో పెట్టిన భావోద్వేగ పోస్టు ఆమె లోలోపల కుమిలిపోతున్నారనడానికి నిదర్శనమని పలువురు ఉదహరిస్తున్నారు. కాగా.. కలెక్టర్ ఇన్స్టాలో పెట్టినపోస్టు శనివారం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనలో మంత్రి శ్రీనివాస్రెడ్డి తీరును తప్పుపడుతూ సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మంత్రి బహిరంగంగా కలెక్టర్ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని, నామమాత్రంగా వ్యవహరించారని మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. బీజేపీ నాయకులూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్మెన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పదేపదే పడటంతో ఆయన ఆగ్రహించారు. ‘వాట్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడ మీ ఏసీపీ, ఎక్కడ సీపీ? కామన్సెన్స్ లేదా? అని కలెక్టర్ ఎదుటే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్న మంత్రి అసంతృప్తి, ఆగ్రహం ఆమెను బాధించాయని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ఇన్స్టాలో ‘నేను మహిళను.. సందర్భానికి తగినట్లుగా ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరగిపోగలను’’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలుమీడియాలోనూ వార్తగా వచ్చింది. తర్వాత ఆమె పెట్టినట్లుగా చెబుతున్న పోస్టు ఆమె ఇన్స్టాఖాతాలో కనిపించలేదు. ఈ విషయమై కలెక్టర్ పమేలా సత్పతిని సంప్రదించేందుకు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందని, ఆమె నొచ్చుకున్నారని పలువురు కలెక్టరేట్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?అధికారులు ప్రొటోకాల్ పాటించాలికరీంనగర్ కార్పొరేషన్: జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హి తవు పలికారు. కేంద్ర పట్టణాభివృది్ధశాఖ మంత్రి ఖట్టర్ నగరంలో పర్యటిస్తే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్న తనకు ప్రొటోకాల్ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘వాటిజ్ దిస్ నాన్సెన్స్...వేర్ ఈజ్ సీపీ...వేర్ ఈజ్ ఏసీపీ...కామన్సెన్స్ లేదు...ఇదేం పద్ధతి’ అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్బోర్డుకాలనీలో 24/7 నీటి సరఫరాను ప్రారంభిస్తున్న క్రమంలో గన్మెన్లు కొందరు పదేపదే పొంగులేటిని తోసివేయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనలో ఏర్పాట్లపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతంటూ కలెక్టర్పై మండిపడ్డారు. సీపీ ఎక్కడా, ఏసీపీ ఎక్కడా అంటూ నిలదీశారు. అయితే వారెవరు అక్కడ లేకపోవడంతో ఆయన మరింత ఆగ్రహానికి గురయ్యారు. pic.twitter.com/nZwEHGf6Dj— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) January 24, 2025 -
ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని ప్రారంభించిన మంత్రి
-
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
కూసుమంచిలో ‘ఇందిరమ్మ’ నమూనా ఇల్లు
కూసుమంచి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భా గంగా ప్రభుత్వం మొదటి మోడల్ హౌస్ను సిద్ధం చేసింది. ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుండగా లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రకటించించిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతీ మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించాలని అధికా రులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గతనెల 13న నమూ నా ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయగా కేవ లం 30 రోజుల్లో శనివారం సాయంత్రానికి పూర్తిచేశారు.ఈ ఇంటిని సోమవా రం మంత్రి పొంగులేటి ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోనే తొలి నమూ నా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి రానుంది. కాగా, ఇదే నమూనాలో ఇంటిని నిర్మించుకోవాలనే నిబంధన ఏదీ లేకపోయినా.. రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తిచేయొచ్చని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు.ఆకర్షణీయంగా నమూనా ఇల్లు..కూసుమంచిలో 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూంతో బెడ్ రూంను నిర్మించారు. ఇంటి లోప లి గదు లు, ముందు వరండాలో టైల్స్ వేశారు. అలాగే, డా బా మెట్ల కింద టాయిలెట్ను నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇంటికి రంగులు, ఇతరత్రా వసతులను రూ.5 లక్షలతోనే పూర్తిచేసినట్లు కాంట్రాక్టర్ కంచర్ల జీవన్రెడ్డి తెలిపారు. -
మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హనుమకొండలో ఆదివారం జరిగిన అధికారిక సమీక్షలో పాల్గొన్న ఆయన, అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు. రాత్రి 8–45 గంటల సమ యాన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ఎడమపక్క రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. అనంతరం మంత్రి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. హనుమ కొండ నుంచి వస్తున్న క్రమంలో టైర్లు వేడెక్కి పేలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల కోసం వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సేవలను మరింత పారదర్శకంగా అందించడానికి ప్రత్యేక వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఫిర్యాదుల కోసం ఇంది రమ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్ను తెచ్చినట్లు రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గురువారం సచివాల యంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులపై ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుని, వివరాలను ఫిర్యాదు దారు మొబైల్కు మెసేజ్ రూపంలో పంపిస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి 32 జిల్లాలలో 95% పూర్తికాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పూర్తయిందన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం కార్యాచరణపై దృష్టి సారిస్తా మన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి, రెండో దశలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను మంజూరు చేస్తామన్నారు, మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. -
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు
హనుమకొండ అర్బన్/నయీంనగర్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా మని రెవెన్యూ, గృహ ని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేస్తే కూడా ఓర్వలేక ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. సోమవారం హనుమకొండ కుడా మైదానంలో వరంగల్ రీజియన్కు కేటాయించిన టీజీఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో కలిసి పొంగులేటి ప్రారంభించారు. అదేవిధంగా హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ, గత ప్ర భుత్వం కుట్రపూరితంగా ఆర్టీసీని ప్రైవేట్పరం చేయాలని చూసిందని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో పరిపుష్టం చేసి, కార్మికులకు భద్రత కల్పించామన్నారు. ధర ణిని ప్రక్షాళన చేసి కొత్త చట్టం తీసుకువచ్చామని, దీనిద్వారా తెలంగాణలో ఉన్న 2 కోట్ల 77లక్షల ఎకరాల ఆసాములకు పూర్తి భద్రత కలి్పస్తున్నామని పే ర్కొన్నారు. గత ప్రభుత్వం కనీసం లక్ష ఇళ్లు కూడా నిర్మించలేదని, తమ ప్ర భుత్వంలో మొదటి విడతగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. మిగతా నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు.అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులు ఉంటే మండల కార్యాలయాల్లో ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆంబోతులను పంపుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు గతంలో తొంటి ఇరుగుడు నిజమా అబద్ధమా తెలియదు.. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి ఏమైందని ఆయన ప్రశ్నించారు. సాగు చేసే ప్రతీ భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ‘కార్పొరేట్’ లుక్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సేవలతోపాటు వారికి అవసరమైన వసతులు కల్పించడమే ధ్యేయంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్య కలాపాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ప్రజలు చెట్ల కింద నిరీక్షించే పరి స్థితిని నివారించేలా ప్రస్తుతమున్న సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాలను పునర్వ్యవస్థీకరించడంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులతో అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి మంగళ వారం ఆయన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు.తొలుత పటాన్చెరు, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఫోర్త్సిటీలో నిర్మాణంఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల శాశ్వత భవనాల కోసం స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశలవారీగా ఈ నిర్మా ణాలు ఉంటాయని, తొలిదశలో పటాన్చెరు, సంగా రెడ్డి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్తోపాటు రంగారెడ్డి జిల్లా కందుకూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీ లో నిర్మి స్తామని చెప్పారు. గండిపేట, శేరిలింగంపల్లి, రంగా రెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను కలిపి గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) కార్యాలయంలో సమీకృత సబ్రిజి స్ట్రార్ నమూనా కార్యాలయాన్ని నిర్మిస్తామని వివరించారు. ఈ నెలలో శంకు స్థాపనలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలోని బంజా రాహిల్స్, ఎస్ఆర్నగర్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలను షేక్పేటలో నిర్మించాలని నిర్ణయించామన్నారు.వెయిటింగ్ హాల్, విశాల పార్కింగ్ సదుపాయాలతో..మొదటి దశలో నిర్మించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీ సం 3 ఎకరాల్లో ఉంటాయని, 10–15 వేల చదరపు అడు గుల్లో కార్యాలయాల భవన నిర్మాణాలు చేపడతామని పొంగులేటి చెప్పారు. వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, విశాల పార్కింగ్ వసతులుండేలా డిజైన్లు రూపొందించా లని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడుతుందని, పర్యవే క్షణ సులభతరం అవుతుందని.. దస్త్రాల పరిశీలిన వేగవంతం అవుతుందన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీ తిని నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడేలా తక్షణమే కార్యాచరణ రూపొందించాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు. -
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి
-
ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై అధికారులతో మంత్రి పొంగులేటి భేటీ
-
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీఆర్ఎస్కు పొంగులేటి వార్నింగ్.. కాంగ్రెస్ కార్యకర్తలు గాజులు తొడుక్కోలేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమైపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఈరోజు సమావేశాల్లో రైతుభరోసాపై చర్చ నడిచింది. దీంతో, బీఆర్ఎస్పై మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసు విషయంపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూభారతి చట్టం బీఆర్ఎస్కు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడం బీఆర్ఎస్ నేతలకు నచ్చదు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు చేయాలని నియోజకవర్గానికి రూ.2కోట్లు పంపించారు. అల్లర్లు జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. రాష్ట్రం అగ్నిగుండం అయితే చూస్తూ ఊరుకోం. -
అసెంబ్లీలో భూభారతిపై కొనసాగుతున్న చర్చ
-
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్లైన్లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్బుక్లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్లైన్తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్తో ప్రారంభించి 33 మాడ్యూల్స్కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్కు పెంచాం. ధరణి పోర్టల్లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
హరీష్ రావు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు: మంత్రి పొంగులేటి
-
అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంతలు తొక్కుతుందని ఎల్లోమీడియాలో కథనాలు
-
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్తో పోలిస్తే నవంబర్లో, నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం(డిసెంబర్ 16) అసెంబ్లీ కమిటీహాల్లో కేబినెట్ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రాత్రి 8.30 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.కేబినెట్ సమావేశంలో కేటీఆర్ ఈ-కార్ రేసుపై సమగ్రంగా చర్చించామని చెప్పారు. ఈ కార్ రేసులో నిధుల అవకతవకలపై దర్యాప్తునకు గవర్నర్ న్యాయనిపుణులను సంప్రదించి అనుమతించారని పొంగులేటి తెలిపారు. కేటీఆర్ను అరెస్టు చేస్తారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.ఈ-కార్ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్కుమార్పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు.కేబినెట్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..భూమి లేని వారికి డిసెంబర్ 28న రూ.6వేల నగదు పంపిణీసంక్రాంతి తర్వాత కొత్త రేషన్కార్డుల జారీ కేటీఆర్పై కేసు విషయంలో ఏసీబీకి సీఎస్ ద్వారా లేఖసంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయంరైతు కూలీలకు రెండు దఫాలుగా 12 వేలు ఆర్దిక సహాయం చేసేందుకు కేబినెట్ నిర్ణయం.స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం..పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం -
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
డిసెంబర్ 1 నుంచి NIC ధరణి బాధ్యతలు చూస్తోంది
-
సంక్రాంతికి గ్రామానికో రెవెన్యూ అధికారి: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని, తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. తమ స్వలాభం కోసం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల రక్షణ, రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ధరణి పోర్టల్ను సరళీకృతం చేస్తామని, ఇప్పుడున్న 33 మాడ్యూల్స్ స్థానంలో 11–13 మాడ్యూల్స్ మాత్రమే ఉంచుతామని చెప్పారు. పహాణీల్లో ఇప్పటివరకు ఒక్కటే కాలమ్ ఉందని, ఇక నుంచి 12 లేదా 13 కాలమ్స్ పెడతామని, భూముల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..5 లక్షలకు పైగా ధరణి దరఖాస్తులకు పరిష్కారంఅధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన ప్రారంభించాం. ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉన్న 2.46 లక్షలు, ఈ ఏడాదిలో వచ్చిన 2.60 లక్షల దరఖాస్తులు కలిపి 5 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించాం. ఇంకా 60–70 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ధరణి పునర్నిర్మాణ కమిటీని నియమించాం. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చట్టం ముసాయిదాను ప్రజల్లో చర్చకు పెట్టాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేశానికి రోల్ మోడల్గా ఉండేలా బిల్లు ప్రవేశపెడతాం. అటవీ, రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ భూముల సరిహద్దు వివాదాలు వచ్చాయి. వీటిని సర్వే చేసి డీ మార్కింగ్ చేస్తాం. ఏ శాఖ భూములు ఆ శాఖకు ఇచ్చేస్తాం. పార్ట్–బీలో ఉన్న భూముల సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాం. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసేసుకుంటాం. జీవో 59 కింద పెండింగ్లో ఉన్న సరైన దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తాం.వైఎస్ స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్ల పథకంహైడ్రా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో 6–7 శాతం మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. మూసీ ప్రక్షాళన విషయానికొస్తే.. ప్రజలు నివసించే ప్రాంతాల జోలికి ఇప్పుడే వెళ్లబోం. ఇళ్లు తక్కువ ఉండి ప్రజలు లేనిచోట్ల ముందు అభివృద్ధి చేస్తాం. ఆ అభివృద్ధిని ప్రజలకు చూపించి వారిని ఒప్పించి మిగిలిన చోట్ల ముందుకెళతాం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 18.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించారు. ఆ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను కేటాయిస్తున్నాం. కనీసం 400 చ.అ.లకు తగ్గకుండా వంట గది, టాయిలెట్తో కూడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది వచ్చే నాలుగేళ్లు కొనసాగుతుంది.కేంద్ర యాప్ తయారీలో ఆలస్యం వల్లే జాప్యంఇందిరమ్మ లబ్ధిదారుల వివరాల నమోదులో కేంద్రం రూపొందించిన యాప్ను వాడుతున్నాం. ఆ యాప్ సిద్ధమైతే తప్ప లబ్ధిదారుల వివరాల నమోదు సాధ్యం కాదు. ఆ యాప్ తయారీలో కేంద్ర జాప్యం వల్ల ఈ పథకం గ్రౌండ్ అవటంలో ఆలస్యం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి 1.52 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి 96 వేలే పూర్తి చేసింది. మిగతా వాటిని కూడా పూర్తి చేసి నిరుపేదలకిస్తాం. రూ.187 కోట్లతో డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. బాంబు పేలడమంటే జైల్లో పెట్టడం కాదుఅధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ అరాచకంగా, అక్రమంగా వ్యవహరించింది. ఇందుకు సంబంధించి 10–12 అంశాలపై సమాచారం తీసుకుంటున్నాం. బాంబులు పేలడమంటే ఎవరినో జైల్లో పెట్టడం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష సాధింపు చర్యలుండవు. ఉద్దేశ పూర్వకంగా ఏ వ్యక్తిని, కుటుంబాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఈ–రేస్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, విదేశాలకు నిధుల సరఫరా, ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయాల్లో తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. తప్పని తేలితే శిక్ష తప్పదు. నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే. బట్ట కాల్చి మీద వేయడమే బీఆర్ఎస్ పని. నా ఇంట్లో ఈడీకి దొరికిన డబ్బులు లెక్కపెట్టేందుకు వేలసంఖ్యలో కౌంటింగ్ మెషీన్లు తీసుకెళ్లారని చెప్పారు. ఈడీ అనే వ్యవస్థతో సంబంధముండే పార్టీతోనే కదా వారు అంటకాగింది. ఆ పార్టీని అడిగి నా ఇంట్లో ఎన్ని డబ్బులు దొరికాయో తెలుసుకోవచ్చు కదా. ఈ–రేస్ వ్యవహారం తెరపైకి రాగానే ఢిల్లీకి వెళ్లి ఎవరు ఎవరి కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఒక్క గజం భూమి కొనుగోలు చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. మా పార్టీలోకి చేరికలు ఆగలేదు. కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ చాలా పెద్దగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరు. ఆ పార్టీలో జబ్బలు చరుచుకుంటున్న వాళ్లు, 1, 2 స్థానాల కోసం పోటీలు పడుతున్న వాళ్లు కూడా ఉండరు. స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నా..ఏడాది పాటు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం సంతృప్తినిచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి పెట్టిన పార్టీలో చేరి ఎంపీనయ్యా. ఐదేళ్లు ప్రజలకు సేవ చేశా. తర్వాతి ఐదేళ్లూ మాజీ సీఎం పుణ్యాన ప్రజలతో కలిసి అరణ్యవాసం చేశా. ఆ తర్వాత అదే ప్రజల దీవెనలు, ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో సముచిత స్థానంలో ఉన్నా. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నా. భవిష్యత్తులో ప్రజలకు మరింత మంచి చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా. -
హాయ్ చెప్తే..అంత డ్రామా చేస్తారా: మంత్రి పొంగులేటి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్లోని ఓ హోటల్లో భేటీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.‘అదానీ నేను హైదరాబాద్లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్గా చెప్పండి.మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్కు కేటీఆర్ గట్టి కౌంటర్ -
హరీశ్రావు కొన్న భూములపై విచారణ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని.. దీనివల్ల రైతుల భూములు పోతాయని బెదిరించి హరీశ్ ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. హరీశ్ భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేశారని దుయ్యబట్టారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని... ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న హరీశ్రావు.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని పొంగులేటి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పొంగులేటి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక దాన్ని రద్దు చేయలేరని.. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆరెస్టు చేయట్లేదంటూ ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి.. అందుకు వీలుగా గవర్నర్ చేత అనుమతి ఇప్పించాలని సూచించారు. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నామని, తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశాల్లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే కులగణన, రైతు రుణమాఫీ, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ, సోనియాగా>ంధీ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, ఛత్తీస్గఢ్తో నాటి ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చంచనున్నట్లు సమాచారం. కేంద్రం స్పష్టత ఇస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కాస్త అస్పష్టంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత కోరుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెరుగుతుందన్నారు. ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైతే పథకం వేగం పుంజుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రివర్గ విస్తరణ! మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న ప్రశ్నకు ఆయన నేరుగా స్పందించలేదు. తాను మంత్రిని మాత్రమేనని, మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని వ్యాఖ్యానించారు. -
డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పషతనిచ్చారు.ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించాలని చూస్తోంది. రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది.డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినిపిస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు వెళ్ళక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. -
పింక్ చొక్కాలు కాజేసిన భూములను పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి
సాక్షి,కరీంనగర్జిల్లా: ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం(నవంబర్ 20)వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు.‘నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశాం.రాబోయే నాలుగు ఏళ్ళలో 20 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాం.ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ..ప్రతి పేదవాడికి పక్కా ఇళ్ళు ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ రెవెన్యూ చట్టం 2024 రాబోతోంది.ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారు.ఆ భూములను ప్రజా ప్రభుత్వం తీసుకుని పేదలకు పంచి పెడుతాం’అని పొంగులేటి తెలిపారు. -
సంక్షేమ పథకాల విస్తృతికే సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల అంశాలతో ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వ హిస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా 58.3% ఇళ్లను సర్వే చేశామని, నెలాఖరులోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు.ఇప్పటికే సర్వే చేసిన ఇళ్లకు సంబంధించి వివరాలను కంప్యూ టరీకరిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల స్థితి గతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథ కాలను విస్తృతం చేయడంతోపాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా సర్వే ప్రక్రియను నిర్వ హిస్తోందన్నారు. తాజాగా చేప డుతున్న సర్వే దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వేను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అధికారులకు వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతపడుతుందని, పలు రకాల బెనిఫిట్స్ ఆగిపోతాయంటూ ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసిందని, కానీ ఆ సర్వేకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజల ఆస్తులు తెలుసుకొని వాటిని కొల్లగొట్టేందుకు అప్పటి సర్వేను బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే సర్వే దేశానికే ఆదర్శంగా నిలిపేలా ఉంటుందని చెప్పారు. -
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర జరుగుతోందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో అమాయక రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు బీఆర్ఎస్ ప్రయతి్నస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చిల్లర, అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తించాలని, పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలిపెట్టొద్దని గురువారం ఒక ప్రకటనలో ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్నారు. జిల్లా కలెక్టర్తోపాటు అధికారులపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని విమర్శించారు.కలెక్టర్పైనే హత్యకు భారీగా కుట్ర పన్నారని, రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనివెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, స్థానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కుట్రపూరిత చర్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. రైతులకు నష్టం కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. అధికారులపై దాడి జరిగినట్టుగానే భవిష్యత్లో రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.ప్రజలను కాపాడుకున్నట్టే, అధికారులను కాపాడుకోలేకపోతే పనిచేయడానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్య చెప్పుకోవడానికి వచ్చిన ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేశారని గుర్తు చేశారు. ఇసుక దందాలకు అడ్డువస్తున్నారని, సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని నేరెళ్లలో దళితులను ట్రాక్టర్తో తొక్కించి పోలీస్స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక 2021 జూన్ నెలలో వేములఘాట్ రైతు తూటుకూరి మల్లారెడ్డి, కూలి్చవేసిన తన ఇంటిలోని కట్టెలను పోగుచేసి, దానినే చితిగా మార్చుకొని ఆత్మార్పణ చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వం పెట్టిన బాధలను భరించలేక ఏకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. గడచిన 11 నెలలుగా ప్రతి విషయంలోనూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్రకు పొంగులేటిమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గురువారం నాందేడ్ ప్రాంతంలో జరిగిన పలు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు వచి్చన రాహుల్గాం«దీకి నాందేడ్ విమానాశ్రయంలో మంత్రి ఉత్తమ్తో కలిసి స్వాగతం పలికారు. -
రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా చేయలేదు: మంత్రి పొంగులేటి
సాక్షి,హైదరాబాద్: ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ధరణి సమస్యలు ఎక్కువగా వచ్చాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ విషయమై పొంగులేటి బుధవారం(నవంబర్ 13) మీడియాతో మాట్లాడారు.‘భూములున్న వారిని గత ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టింది.గ్రామ సభలో ఇంధిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.పైరవీలు అవసరం లేదు.కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.అసెంబ్లీలో కొత్త భూ చట్టం వివరాలు వెల్లడిస్తాం.ప్రతిపక్ష నేతల సలహాలు కూడా కొత్త చట్టం లో తీసుకుంటాం.ఇటీవల ధరణి బాధ్యతలు ఎన్ఐసికి ఇచ్చాం. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం. రైతు భరోసా కూడా ఇస్తాం’అని పొంగులేటి తెలిపారు.ఇదీ చదవండి: రేవంత్రెడ్డికి లిక్కర్ అమ్మకాలపై ప్రేమ ఎక్కువైంది: హరీశ్రావు -
తెలంగాణలో మళ్లీ బాంబ్ బ్లాస్ట్ పాలిటిక్స్
-
ఆటంబాంబు పేలబోతోంది..: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వర్ధన్నపేట/తొర్రూరు: తుప్పు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. రాజకీయ ఆటంబాంబు పేలబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా బీఆర్ఎస్ నేత (కేటీఆర్) తీరు ఉందన్నారు. తనను జైలుకు పంపిస్తారని.. జైలులో జిమ్ చేసి పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా చోట్ల మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎవరినీ జైలుకు పంపించాలనే ఉద్దేశం ప్రభుత్వానిది కాదని, తప్పు చేస్తే ఉపేక్షించడం ఉండదన్నారు. తప్పు చేసిన వాళ్లపై ఆటంబాంబు పేలబోతోందని హెచ్చరించారు. రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఆ బాంబులు ఇంకా తుస్సుమనలేదని చెప్పారు. కొద్దిరోజుల్లో తాను పేల్చిన బాంబు ఏంటో మీరే చూస్తారని స్పష్టం చేశారు. అరెస్టు చేయాలా.. జీవితకాలం జైలులో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందన్నారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారని, వారంతా ఫలితాలు అనుభవిస్తారని చెప్పారు. పేదల సొమ్ము విదేశాలకు పంపుకున్నారని, రూ.55 కోట్లు ఎవరి ద్వారా ఎవరికి పోయిందో, ఎవరి ఖాతాలో వేసుకున్నారో ప్రజల ముందు తమ ప్రభుత్వం పెట్టి చూపిస్తుందన్నారు. అవి చౌకబారు విమర్శలు ఈడీ దాడులు చేస్తోందని..అదాని కాళ్లు పట్టుకుంటున్నాడని తనపై కేటీఆర్ చవకబారు విమర్శలు చేస్తున్నాడని మంత్రి పొంగులేటి అన్నారు. తాను ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని, గతంలో బీఆర్ఎస్లో చేరినప్పుడు మాత్రమే కేసీఆర్ కాళ్లకు నమస్కరించానని చెప్పారు. అది వయసుకు ఇచ్చిన గౌరవంతోనేనన్నారు. పదేళ్లు సామాన్యులను వంచించిన చరిత్ర బీఆర్ఎస్కే దక్కిందని, పేదల మద్దతు కూడగట్టేందుకు కేటీఆర్ పాదయాత్ర పేరిట డ్రామా చేస్తున్నాడన్నారు. పాదయాత్ర చేసినా.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు వారిని నమ్మబోరని తెలిపారు. వైఎస్సార్ తన హయాంలో 19 లక్షల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదలకు అండగా నిలిచారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించనుందన్నారు. ఆయా సమావేశాల్లో ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతుంది: మంత్రి పొంగులేటి
సాక్షి, వరంగల్: నాటు బాంబు.. లక్ష్మిబాంబు కాదు.. త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతుందంటూ మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వర్దన్నపేట సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకు?. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయటూ వ్యాఖ్యానించారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.‘‘మీ ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదు. చట్టం తనపని తాను చేసుకుంటది.. పేదలను మరిచిపోయిన మీరు అధికార దాహంతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందే. కారుకూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తలపెడతారు’’ అంటూ పొంగులేటి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: పొంగులేటి.. జైలుకెళ్లడానికి రెడీగా ఉండు: కేటీఆర్ -
మంత్రి పొంగులేటి జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలి: కేటీఆర్
-
ఏడాదిలోగా వరంగల్ ఎయిర్పోర్టు
సాక్షి, హైదరాబాద్: చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 విజన్తో మాస్టర్ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రానున్న 25 ఏళ్లలో పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం రూపొందుతున్న మాస్టర్ప్లాన్ తు దిదశలో ఉందని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేస్తామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఆయా జిల్లా ల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. నగర మాస్టర్ ప్లాన్, వరంగల్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, భద్రకాళి ఆలయ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్, ఎకో టూరిజం అంశాలపై చర్చించారు.పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రింగ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 41 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డును 3 దశల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ పనులను త్వరలో ప్రారంభించి, ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువులో పూడిక తీసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అన్నారు. వరంగల్ ప్రజల చిరకాల వాంఛ ఎయిర్ పోర్టు: మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని మంత్రి కొండా సురేఖ తెలిపా రు. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి అంగీకరించిందని చెప్పారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎ మ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కె నాగరాజు, నాయిని రాజేందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి పాల్గొన్నారు. -
కేటీఆర్ చుట్టూ.. ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసింగ్ అంశంలో పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ–కార్ల రేస్ నిర్వహణ సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల సియోల్ పర్యటన సందర్భంగా రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ చేసిన కామెంట్లు.. తాజాగా అర్వింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ బావమరిది జన్వాడ నివాసంలో దాడులు.. కేటీఆర్ లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేసిన కామెంట్లు వంటి పరిణామాలన్నీ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న దిశగా వస్తున్న సంకేతాలే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే అర్వింద్ కుమార్కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నాయి. రంగంలోకి ఈడీ? ఫార్ములా–ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ కేసు రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది? హైదరాబాద్లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈవో, ఏస్ నెక్ట్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ (సెషన్–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్ తప్పుకొన్నారు. 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్–10) ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్లోనే కార్ రేస్ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్ఈవోకు స్పష్టం చేశారు. ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్లో ఎఫ్ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవోకు చెల్లించింది. ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి.. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్కుమార్ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. ఆ మెమోకు అర్వింద్కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. -
పక్షం రోజుల్లో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో ప్రారంభించి పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక యాప్ ద్వారా జరుగుతుందని, ఎంపికలో రాజకీయ జోక్యం ఏమాత్రం ఉండదని చెప్పారు. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించడం లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తాం. 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇళ్లకు ప్రత్యేక డిజైన్ అంటూ ఉండదు. లబ్ధిదారులకు ఉన్న జాగా ఆధారంగా వారే కావాల్సిన ఆకృతిలో నిర్మించుకోవచ్చు. అయితే వంటగది, మరుగుదొడ్డి కచ్చితంగా ఉండేలా చూడాలి.దశలవారీగా సొమ్ము విడుదలఇందిరమ్మ ఇళ్లకు పునాదులు నిర్మించుకున్నాక రూ.లక్ష, గోడల నిర్మాణం తర్వాత రూ.లక్షన్నర, పైకప్పునకు రూ.లక్షన్నర చొప్పున చెల్లిస్తాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మిగతా మొత్తం అందజేస్తాం. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ ద్వారా జమ చేస్తాం. తొలిదశలో కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇళ్లను మంజూరు చేస్తాం. తదుపరి విడతలో భూమిలేని నిరుపేదలకు స్థలం ఇచ్చి నిధులు అందజేస్తాం. నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేస్తున్నాం. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించేలా చూస్తాం. ఈ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసం 16 శాఖల నుంచి సిబ్బందిని సమీకరిస్తున్నాం.నిధులను సమీకరించుకుంటాం..తొలిదశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతాయి. బడ్జెట్లో ప్రభుత్వం రూ.7,740 కోట్లను కేటాయించింది. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టి వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. అవసరమైన నిధులను వివిధ మార్గాల్లో సమీకరించుకుంటాం. కొత్తగా ఏర్పడే ఇందిరమ్మ కాలనీల్లో ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పిస్తుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెడతాం..గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తేవటంలో విఫలమైంది. మేం ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర నిబంధనలు అనుసరించటంతోపాటు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెట్టాలంటే కూడా పెడతాం. మాకు భేషజాలు లేవు. సర్పంచుల పదవీకాలం పూర్తయినందున ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీల్లో వారి ప్రాతినిధ్యం లేదు. తదుపరి దశ నాటికి వారు ఉండేలా అవసరమైతే జనవరి నాటికే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం..’’అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఈ టర్మ్ అంతా రేవంతే సీఎంసీఎం రేవంత్రెడ్డిని మారుస్తారంటూ కొందరు పనిగట్టు కుని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టర్మ్ పూర్తయ్యేందుకు ఇంకా నాలుగేళ్ల ఒక నెల సమయం ఉందని, అప్పటి వరకు రేవంతే సీఎంగా ఉంటారని చెప్పారు. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో విపక్షాలు లేనిపోని ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. ఒకట్రెండు రోజులు అటూఇటూ అయినా.. తాను చెప్పినట్టు రాజకీ య బాంబులు పేలటం తథ్యమని పేర్కొన్నారు. -
రెండు మూడ్రోజుల్లో ఆ బాంబు పేలుతుంది: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం మాట్లాడాలి.. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రతిపక్షం ఎలా అవుతుంది? అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైరికల్గా కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు.. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు. వచ్చే నాలుగేండ్ల ఒక నెల సీఎంగా రేవంత్రెడ్డినే ఉంటారు.’’ అని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామ సర్పంచ్లు అందుబాటులోకి వస్తారు. సంక్రాంతి లోపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి అన్నారు.ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానెల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుని ఖాతాలోకి నేరుగా నిధుల జమ చేస్తాం. ప్రారంభంలో లక్ష ఇస్తారు. ఫిల్లర్స్ 1.25 లక్షలు, స్లాబ్ 1.75 లక్షలు ఇళ్లు పూర్తి అయ్యాక 1లక్ష ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో మాట్లాడా. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు ఉంది.’’ అని పొంగులేటి చెప్పారు.‘‘కేంద్రం నుంచి నిధులు వస్తే మంచిది.. లేకపోతే నేను ఇండ్లను కట్టిస్తాను. ప్రారంభానికి కేంద్ర మంత్రులను పిలుస్తాం.. నేన, సీఎం వెళ్లి కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తాం. వచ్చే నాలుగేళ్లు 20 లక్షలు ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.ఇదీ చదవండి: మా దగ్గర ‘బీఆర్ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు -
జన్వాడ మందు పార్టీ సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: ఎంపీ రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ బీఆర్ఎస్ను నమ్మరు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. అలాగే, దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు అంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ ఎంపీ రఘునందన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని అంటున్నారు. ఆయన తప్పుకుంటే వద్దు అనే వాళ్లు ఎవరూ లేరు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్కు ప్రజలను కలిసే సమయం దొరకలేదు. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు?. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ పట్టించుకోరు. కేసీఆర్ పది నెలలుగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఏమైనా నష్టం జరిగిందా?. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం మాత్రమే. మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారు.కేటీఆర్కు ఎవరి మీదా నమ్మకం లేదు. చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా నమ్మకం లేదు. జన్వాడ ఫామ్హౌస్ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ను బయటపెట్టాలి. అప్పుడే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా?. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ మంత్రి పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు’ అంటూ సెటైర్లు వేశారు. -
పొంగులేటికి రఘునందన్ స్ట్రాంగ్ కౌంటర్
-
మంత్రి పొంగులేటి ఫ్యాన్ అదిరిపోయే గిఫ్ట్
-
పొంగులేటి బాంబుల కామెంట్స్.. జగదీష్రెడ్డి కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబుల కామెంట్స్పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి జగదీష్రెడ్డి స్పందించారు. ఈ విషయమై జగదీష్రెడ్డి తెలంగాణభవన్లో మంగళవారం(అక్టోబర్ 29) మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ బాంబులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ దోపిడీ బాంబులను అడ్డుకుంటాం. మా హాయాంలో తప్పు జరిగితే విచారణ జరుపుకోవచ్చు.కాంగ్రెస్ నేతల చిల్లర బెదిరింపులకు భయపడేది లేదు. మంత్రులు చిల్లర మాటలు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. పాలన చేతకాకనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీశారు. ప్రజాస్వామికవాదిగా చెప్పుకునే పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నారు? పెద్దమనిషి కాంగ్రెస్ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసులే రోడ్డు ఎక్కటం చరిత్రలో ఇది మెదటిసారి.సీఎం సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తప్పించటం అన్యాయం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆంధ్రకు వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.పండుగల సమయంలో 144సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. లోఓల్టేజీ కరెంట్తో ఇళ్ళల్లో వస్తువులు కాలిపోతున్నాయి. కమీషన్ రాదన్న కారణంగానే విద్యుత్ శాఖను ప్రభుత్వం గాలికొదిలేసింది. కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారు. కరోనా కాలంలో కూడా తెలంగాణ ఆదాయం తగ్గలేదు.ఇప్పుడెందుకు తగ్గింది? పేదలకు చెందాల్సిన ఆదాయం మంత్రులు,కాంగ్రెస్ నేతలు తింటున్నారు. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది కేసీఆర్. రైతులకు కూడా 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలు,రైతాంగానికి అర్థమైంది. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. పత్తిని కొనుగోలు చేయాలి.నాణ్యత లేని గుజరాత్ పత్తికి ఎక్కువ ధర ఇస్తున్నారు’అని జగదీష్రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి: సమస్యలు కొనితెచ్చుకుంటున్న తెలంగాణ సీఎం -
కులగణనకు ఇంటింటి సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను నవంబర్ 4 లేదా 5న ప్రారంభించి 30లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి, విధివిధానాలను ఆమోదించింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ఫిబ్రవరి 17న శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు ఇప్పటికే జీవో 18 ప్రభుత్వం జారీ చేయగా సీఎం రేవంత్ సోమ వారం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లతో సమావేశమై సర్వేపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా, మండల స్థాయిలోని 80 వేల మంది అధికారులు, సిబ్బందికి కులగణనపై శిక్షణ అందించనున్నట్లు పొన్నం తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటర్కు 150 ఇళ్లను కేటాయించి సర్వే పూర్తి చేయడానికి 3, 4 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. 15–20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తికానుందని... ఇప్పటికే షెడ్యూల్ను సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం ఒక్క రోజులో కుటుంబ సర్వే నిర్వహించి వివరాలను బయటపెట్టలేదని.. కానీ తాము సర్వే ముగిశాక సమాచారాన్ని, ప్రయోజనాలను ప్రజా బాహుళ్యంలో ఉంచి పారదర్శకంగా వ్యవహరిస్తామని పొన్నం తెలిపారు. సర్వేలో సరైన సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి కులమతాలు, పారీ్టలకు అతీతంగా పేదల్లో బహు పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళి మర్నాడు లేదా ఆ తర్వాతి రోజున సీఎంతోపాటు మంత్రులం స్వయంగా మొగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఒక డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలను చెల్లించాల్సి ఉండగా దీపావళి కానుకగా 2022 జనవరి నుంచి రావాల్సిన ఒక డీఏను మంజూరు చేశామని పొంగులేటి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే జీవో 317 కింద గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులను స్పౌజ్, ఆరోగ్య, పరస్పర కేటగిరీల కింద తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. జీవో 317 కింద దూర ప్రాంతాలకు వెళ్లిన ఇతర ఉద్యోగుల సమస్యతోపాటు ఉద్యోగ నియామకాలకు జీవో 46తో ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చట్ట రీత్యా, కోర్టుల రీత్యా చిక్కులున్న నేపథ్యంలో తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లిస్తే ప్రభుత్వంపై రూ. 3 వేల కోట్ల భారం పడనుందని.. అందుకు ప్రతి నెలా రూ. 230 కోట్లు అదనంగా కావాలని పొన్నం తెలిపారు. నాలుగు కేటగిరీలుగా మిల్లర్ల విభజన.. రాష్ట్రంలో మిల్లర్లను నాలుగు విభాగాల కింద విభజిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేని మిల్లర్లకు ప్రథమ కేటగిరీ, ప్రభుత్వ నోటిసులకు స్పందించి చెల్లింపులు చేసిన వారిని రెండో కేటటిరీ, నోటిసులిచ్చినా చెల్లింపులు చేయక రికవరీకి గురైన వారిని మూడో కేటగిరీగా విభజించి వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకున్న తర్వాత ధాన్యం సేకరణలో అనుమతించాలని, ఇంకా డిఫాల్టర్లుగా మిగిలిపోయిన వారిని అనుమతించరాదని నిర్ణయించామన్నారు. మిల్లర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పొరుగు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఆమోదించామని చెప్పారు. రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశ హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నాగోల్–శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీనగర్–హయత్నగర్ కారిడార్లలో 76.4 కి.మీ. కొత్త మెట్రో రైల్వే లైన్ను రూ. 24,269 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయడానికి రూపొందించిన డీపీఆర్ను కేంద్రానికి పంపేందుకు మంత్రివర్గం ఆమోదించింది. పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ పరిధిలో 16–17 వేల కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం/పునరుద్ధరణ పనుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పనిసరిగా బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు 4 లేన్ల రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని పీపీపీ విధానంలో వచ్చే 4 ఏళ్ల పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మరికొన్ని నిర్ణయాలు.. ⇒ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ స్టేడియం స్థలాన్ని అప్పగించడంతోపాటు ములుగులోని గిరిజన వర్సిటీకి 211 ఎకరాల భూమిని, స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి స్టేడియాన్ని అప్పగించాలనే ప్రతిపాదనలకు ఆమోదం. ⇒ మధిర, వికారాబాద్, హుజూర్నగర్లో స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా కొత్త ఐటీఐల మంజూరు. ⇒ కొత్తగా ఏర్పడిన 8 కోర్టులు, రెండు వైద్య కళాశాలలకు సిబ్బంది మంజూరు. ⇒ కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ఆమోదం. అన్ని ప్రాజెక్టుల్లో 23 శాతం పూడికతో నిండి ఉన్నాయని, భవిష్యత్తులో వాటిలోని పూడిక తొలగిస్తామని పొంగులేటి తెలిపారు. సినీనటుడు బాలకృష్ణకు స్టూడియో నిర్మాణానికి ఎలాంటి స్థలం కేటాయించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీపావళికి ముందే పొలిటికల్ బాంబుల పేలుళ్లు రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు ఒకట్రెండు రోజుల్లో పేలబోతున్నాయని దక్షిణ కోరియా పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. దీపావళి టపాసుల కంటే ముందే ఇవి పేలుతాయని స్పష్టం చేశారు. కాగా, దక్షిణ కొరియాలో అమలైన నదుల పునరుజ్జీవ ప్రాజెక్టు గురించిన వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం తమ సహచరులకు వివరించినట్లు సమాచారం. అయితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రత్యేకంగా మరో సమావేశం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైనట్లు తెలియవచ్చింది. -
రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి: మంత్రి పొంగులేటి
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి. దాంట్లో ప్రధాన నేతలు ఉంటారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతోపాటు ఎనిమిది నుంచి 10 అంశాల్లో నిజాలు నిగ్గుతేల్చి ప్రజల ముందు ఉంచబోతున్నాం’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆయన బుధ వారం సియోల్లో మీడియాతో మాట్లాడారు. ‘‘తప్పు చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లు అయినా వదలం.. అది విదేశీ కంపెనీయా? వారిని ఎలా ట్రేసవుట్ చేయాలి? వారి వెనుక ఉన్న తొత్తులు ఎవరు? వారి మధ్య జరిగిన లావాదేవీలేమిటి?.. ఇలా అన్నింటినీ నిగ్గుతేల్చి మా ప్రభుత్వం ప్రజల ముందు పెట్టనుంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.ఆధారాలతో సహా ఫైళ్లు సిద్ధమవుతున్నాయికాంగ్రెస్ ప్రభుత్వం ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలు అంటూ ఆరోపణలు చేయ డమే తప్ప, ఇప్పటివరకు ఎలాంటి రుజువులు చూపలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోందని మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం సియోల్ నుంచి హైదరాబాద్కు వెళ్లిన తర్వాత రోజు తెల్లారో,మరోనాడో ఒకటో, రెండో బాంబులు పేలబోతున్నాయి. దాంట్లో ప్రధాన నాయకులే ఉంటారు. ఈ ధరణికి సంబంధించి, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఇతరత్రా ఏవైతే ఎనిమిదో, పదో అంశాలు ఉన్నాయో.. తొందరపడో, ఉత్త పుణ్యానికో, అన్యాయంగానో వారిపై వేయాలన్నది కాదు. ఆధారాలతో సహా నిరూపిస్తాం. కాళేశ్వరంపై కమిషన్ వేశాం. త్వరలో దాని నివేదిక వస్తుంది. ధరణికి సంబంధించిన సమాచారం కూడా వస్తోంది. ఆల్రెడీ రెండు ట్రాక్లో ఉన్నాయి. ఆధారాలతో సహా ఫైళ్లు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయి’’ అని తెలిపారు.కొత్త కాన్సెప్ట్లో ధరణి..రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత ఒకే కాలమ్లో పేరు ఉంటే రైతుకు భూమి ఉన్నట్లు లేదంటే భూమి లేనట్లు అయిపోయిందని మంత్రి పొంగులేటి చెప్పారు. అదే ఇప్పుడు తాము 12 నుంచి 14 కాలాలు తీసుకొచ్చి.. ఆ భూమి స్వభావం, గతంలో ఎవరి దగ్గర ఉంది వంటి వివరాలన్నీ నమోదు చేస్తామని తెలిపారు. ‘‘భవిష్యత్తులో డాక్యుమెంట్లో ఎలాంటి అపార్థాలు లేకుండా ఉండేలా కాలాలు ఉంటాయి. ధరణి పేరు కూడా మార్చబోతున్నాం. కొత్త కాన్సెప్ట్లో భూమి ఉన్న ప్రతి ఆసామికి పూర్తిగా క్లియర్ టైటిల్తో డాక్యుమెంట్ ఉండబోతోంది. ధరణిలో మొత్తం 35 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏదైనా భూసమస్యపై దరఖాస్తు చేయాల్సి వచ్చినప్పుడు.. తెలిసో, తెలియకో ఒక మాడ్యూల్ బదులు మరో మాడ్యూల్లో దరఖాస్తు చేస్తే.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతుంది. మేం 35 మాడ్యూల్స్కు బదులు సింగిల్ డిజిట్లో మాడ్యూల్స్తో కొత్త కాన్సెప్ట్ను తీసుకురాబోతున్నాం..’’ అని పొంగులేటి తెలిపారు. విదేశీ సంస్థ చేతుల్లో నుంచి భూరికార్డుల నిర్వహణను తప్పించి.. భారత ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి ఇచ్చామని చెప్పారు. 2024 రెవెన్యూ యాక్ట్ను ప్రజలకు అనుకూలంగా ఉండేలా తీసుకొచ్చామని.. అభద్రతతో ఉన్న లక్షల మంది రైతులు, భూములున్న ఆసాములకు భరోసాను కల్పించబోతున్నామని పేర్కొన్నారు. -
‘హాన్’ను ఎలా పునరుద్ధరించారు?
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుద్ధరణపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని సియోల్ వెళ్లిన అధికారుల బృందం రెండో రోజైన మంగళవారం అక్కడ విస్తృతంగా పర్యటించింది. తొలుత హాన్ నదిని సందర్శించి నది పునరుద్ధరణ పనులను పరిశీలించింది. ఒక ప్పుడు మురికి కాలువలా ఉన్న నదికి జీవం పోసిన విధానాన్ని మంత్రులు పొంగులేటి, పొన్నం అక్కడి అధికారులను అడిగి తెలుసుకు న్నారు.సియోల్లో నీటి సరఫరా, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థకు ఈ నది ఎలా కీలకంగా మారిందో అక్కడి అధికారులు వారికి వివరించారు. అనంతరం మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వస్త్ర తయారీ సంస్థ యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈవో ‘కీ హాక్ సంగ్’తో సమావేశమైంది. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్ర మలు ఏర్పాటు చేసేందుకు ఇటీవల ముందు కొచ్చిన ఆయన.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటైన ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ గురించి పొంగులేటి, పొన్నం ఆయనకు వివరించారు. ఆ తర్వాత సియోల్ లోని సియోనామ్ వాటర్ రిసోర్స్ రికవరీ ప్లాంట్ను అధికారుల బృందం సందర్శించింది. నీటి శుద్ధీక రణ ఎలా జరుగుతోందో పరిశీలించింది. సియోల్లోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వ్యర్థ జలాలను ఈ కేంద్రాలు శుభ్రపరుస్తాయి. రోజుకు 16.3 లక్షల లీటర్ల మురుగునీటితోపాటు 4 వేల కిలోలీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తాయి. ఈ సామ ర్థ్య ం ప్రపంచంలోనే 9వ అతిపెద్ద ప్లాంటుగా గుర్తింపు పొందింది. ఇదే కేంద్రంలో హాన్ నది నీటి స్వచ్ఛతను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.ప్రతిపక్షాలు సహకరించాలిమూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సియోల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో మూసీని భాగం చేయాలని తమ ప్రభు త్వం భావిస్తోందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి కష్టం రానివ్వబోమని.. పునరావాసంతోపాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పొన్నం హామీ ఇచ్చారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి తలపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాద్ మరో సియోల్ నగరంగా రూపాంతరం చెందుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
‘చియోంగ్చియాన్’పై అధ్యయనం
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్రెడ్డి): ‘మూసీ’ ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ కొరియాలోని సియోల్లో నదులను అభివృద్ధి చేసిన తీరుపై రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం అధ్యయనం ప్రారంభించింది. అక్కడి హాన్, చియోంగ్చియాన్ నదుల పునరుజ్జీవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. హాన్, చియోంగ్చియాన్ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, పాటించిన పద్ధతులు, విధానాలను క్షుణ్ణంగా తెలుసుకుని.. అదే తరహాలో రాష్ట్రంలో మూసీ నదికి ప్రాణం పోయాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ల నేతృత్వంలోని రాష్ట్ర బృందం.. సోమవారం సియోల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. మంత్రులు తొలుత చియోంగ్చియాన్ నది వెంట కలియదిరుగుతూ.. పునరుద్ధరణ ప్రాజెక్టు వివరాలను అక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ‘మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్’ను సందర్శించారు. ఐదు రోజుల దక్షిణకొరియా పర్యటనకు వెళ్లిన ఈ బృందంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్తోపాటు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. రోజూ వెయ్యి టన్నులు రీసైక్లింగ్ మాపో రిసోర్స్ రికవరీ ప్లాంటులో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. ‘వేస్ట్ టు ఎనర్జీ’ సాంకేతికత వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని రాష్ట్ర బృందానికి సియోల్ నగరపాలక సంస్థ అధికారులు వివరించారు. పర్యవరణంపై ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మరో పదేళ్లలో భూఉపరితలం నుంచి ఈ ప్లాంటును తొలగించి, భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. సియోల్ నగరానికి పశి్చమాన ఉన్న ఈ ప్లాంట్ను 2005లో ప్రారంభించారు. ఇందులో ఏటా 2 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి మరో నాలుగు ప్లాంట్లను కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మూసీ అభివృద్ధి కోసం.. సియోల్లో నదులకు పునరుజ్జీవం కల్పించినట్టే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సియోల్లోని చియోంగ్చియాన్ నది పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హన్ పరీవాహక ప్రాంతాలను రాష్ట్ర బృందంతో కలిసి పరిశీలించానని తెలిపారు. అక్కడ ఒకప్పుడు తీవ్ర కాలుష్యంతో జీవించలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు నూతన కళను సంతరించుకుందని చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు టూరిస్టు హబ్గా మారాయని.. వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయని తెలిపారు. మూసీ నిర్వాసితులకు అభివృద్ధి ఫలాలను అందిస్తామన్నారు. -
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది..మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’ సేవల్లో తేడా కనపడాలి: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. మీరు బాగా పనిచేస్తే ప్రజలకు మేలు జరగడమే కాదు.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. గతానికి, ప్రస్తుతానికి తేడా కనపడాలి’అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి ఆదివారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖా ముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కలిగించేలా దేశానికే రోల్మోడల్గా ఉండే కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకొస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. వ్యవస్థలో ఒకరిద్దరి తప్పుల కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా పనిచేయాలని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు వేసే ప్రతి అడుగు రెవెన్యూ వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఉండాలన్నారు. రెవెన్యూ సేవల్లో అంతరాయాన్ని నివారించేలా నల్లగొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని.. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందని వివరించారు. కొత్త చట్టం వచ్చేలోగానే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు. 3 నెలలకోసారి లీగల్ సమావేశాలు.. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ యంత్రాంగం రాజీపడవద్దని మంత్రి పొంగులేటి సూచించారు. భూముల పరిరక్షణ కోసం మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో లీగల్ టీంలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రెవెన్యూ మంత్రిగా ఎవరున్నా భూముల రికార్డులను టాంపరింగ్ చేసేందుకు వీల్లేకుండా రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడతామని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోయినా పట్టించుకోని గత ప్రభుత్వం.. అప్పు చేసి మరీ ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టిందని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు ఉన్నా కొత్తవి నిర్మించిందని.. తానైతే అలాంటి పనులు చేయబోనని పొంగులేటి స్పష్టం చేశారు. అందరికీ శిక్షణ తప్పనిసరి.. రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికి కూడా శిక్షణ తప్పనిసరి చేస్తామని.. ఇందుకోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల జాబ్ చార్ట్ నిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జాబ్ చార్ట్ రూపొందిస్తామన్నారు. ఆర్థికేతర అంశాలకు తక్షణమే పరిష్కారం రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్లో ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తామని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ పెంచుతామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు పంపడంపై దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి భాస్కరరావు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పేద, ధనిక తేడా లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ పేద, ధనిక అనే తేడా లేకుండా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అందిస్తామని రెవెన్యూ, గృహని ర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించి యునిక్ నంబర్తో స్మార్ట్ కార్డ్ ఇవ్వడమే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉద్దేశమని చెప్పారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గం నుంచి రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కుటుంబాల వివరాల నమోదులో పొరపాట్లకు తావివ్వరాదని.. ఈ విష యంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలు వురు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం సచి వాలయం నుంచి మంత్రి పొంగులేటి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్యా మిలీ డిజిటల్ కార్డులతోపాటు పట్టణాభివృద్ధి సంస్థలు, ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్రూం ఇళ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షించారు.యుద్ధప్రాతిపదికన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం..భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారం కోసం లక్షలాది మంది ప్రజలు నాలుగేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని, అందువల్ల యుద్ధప్రాతి పది కన ఈ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్ట ర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ ముందుకు సాగ ట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణా భివృద్ధి సంస్థల పరిధి పెంపుతోపాటు కొత్త యూడీఏల ఏర్పాటు ప్రతిపాదనలను తక్షణమే పంపాలన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు కోసం కమిటీలుగత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లను అరకొరగా నిర్మించారని మంత్రి పొంగులేటి విమర్శించారు. అయితే ఇప్పటికే పూర్తయిన ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి దసరాలోగా అప్పగించాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా కొందరు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసినందున ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్సీలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టాలన్నారు.సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలుఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 35 సన్న రకాల ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. ఈసారి ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. సన్న, దొడ్డు రకాల ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాల ని ఆదేశించారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందన్న అంచనాతో ఏర్పాట్లు చేయా లని.. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. -
మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు సోదా లు జరిపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 5:30 గంటల నుంచి జూబ్లీహిల్స్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో మొత్తం 15 ఈడీ అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.విదేశాల నుంచి ఖరీదైన వాచీల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టమ్స్, డీఆర్ఐ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల రక్షణలో సోదాలు కొనసాగాయి. పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్ధికలావాదేవీలపైన ఆరా తీసినట్టు సమాచారం. కేసు వివరాలివీ..: హాంగ్కాంగ్లో నివాసముండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన రెండు లగ్జరీ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ను కస్టమ్స్ అధికారులు విచారించగా, మధ్యవర్తి నవీన్కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి ముబీన్ నుంచి దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచ్లను కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సమాధానం ఇవ్వాలని కస్టమ్స్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతోమనీలాండరింగ్ కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీ దాడులను ఖండించిన మంత్రి సీతక్క ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఈడీ, సీబీఐలను పచ్చిగా దురి్వనియోగం చేస్తోంది. తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది’ అని సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులకు సోదాలకు కారణం బీజేపీ కుట్రలేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
-
మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు.. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేపట్టాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొంగులేటి నివాసం, ఆయన వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆయన అనుచరులకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో నేపథ్యంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రైడ్స్కు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. -
అమృత్ టెండర్లలో అక్రమాలపై కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అమృత్ టెండర్లలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజ్ఞప్తి చేసేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ దగ్గరికైనా వెళ్దామని అన్నారు. అమృత్ టెండర్లలో తప్పు జరిగిందని తేలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పొంగులేటి సవాల్ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ‘ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని కోరదాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పు జరగలేదని అంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉందంటే డేట్, టైం ఫిక్స్ చేస్తే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) దగ్గరికి పోదాం. ఒకవేళ మీరు రాకపోయినా వచ్చే వారంలో సీవీసీకి ఆధారాలు సమర్పిస్తా. సీఎం రేవంత్రెడ్డికి, మంత్రికి ఒకటే చెప్తున్నా.. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలి..’ అని కేటీఆర్ అన్నారు. సోదరుడు, బావమరిది ఆ స్థాయికి ఎలా ఎదిగారో సీఎం చెప్పాలి ‘సీఎంను పొంగులేటి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పొంగులేటి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు చుట్టరికాలు కూడా తెలిసినట్టు లేదు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలి. సొంత బావమరిది కంపెనీకి లాభం చేకూరిస్తే బంధువని అనడమేంటి?. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కానీ రూ.1,137 కోట్ల అవినీతి జరిగినా, ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలి. ఢిల్లీకి కప్పం కట్టేందుకే అవినీతి కేవలం రూ.2 కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే సీఎం సోదరుడు జగదీశ్రెడ్డి రూ.వెయ్యి కోట్లుం, బావమరిది సూదిని సృజన్రెడ్డి రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా ఎదిగారనే విషయాన్ని రేవంత్రెడ్డి చెప్పాలి. పొంగులేటి సంస్థకు దక్కిన కొడంగల్ ఎట్టిపోతల కాంట్రాక్టుల గురించి త్వరలో మాట్లాడతా. ప్రజల తరఫున మంత్రులు, ముఖ్యమంత్రి అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వం ఈ భారీ అవినీతికి తెగబడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన అంశంలో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ మొదలు ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు..’అని కేటీఆర్ విమర్శించారు. సింగరేణి కార్మికుల పొట్ట కొడుతున్నారు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.. ‘దసరా బోనస్ కాదు బోగస్’అని కేటీఆర్ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు పంచుతున్నట్లు గొప్పలు చెప్పుకుని కేవలం 16.9% మాత్రమే ఇచ్చారు. కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోంది., పండుగ వేళ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది. ప్రతి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం జరుగుతుంది. సింగరేణి నికర లాభం రూ.4,701 కోట్లు. ఇందులో కార్మికులకు 33 శాతం వాటా కింద రూ.1,551 కోట్లు పంచాలి. ఒక్కో కార్మికుడికి రూ.3.7 లక్షల చొప్పున అందాలి. కానీ కేవలం రూ.796 కోట్లను మాత్రమే కార్మికులకు పంచుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సింగరేణి లాభాల్లో వాటాపై కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఒక్కో కార్మికుడికి అత్యధికంగా 32 శాతం వాటా ఇచ్చామని చెప్పారు. -
కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరారు.కేటీఆర్ చెప్పినట్లు అమృత్ స్కీమ్ కింద టెండర్లు అయినట్లు నిరూపిస్తే తాను మంత్రిగా రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఈ విషయమై శనివారం(సెప్టెంబర్21) పొంగులేటి మీడియాతో మాట్లాడారు.ఆరోపణలను నిరూపించకపోతే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు.రూ.3వేల6వందల కోట్లు కాస్తా రూ.8888 కోట్లు ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లను గత ప్రభుత్వమే వాళ్లు దిగిపోయే సమయంలో 3 ప్యాకేజీల కింద ఇచ్చారని చెప్పారు.ఇదీ చదవండి.. సీఎం రేవంత్ ప్రమేయంతోనే అమృత్ టెండర్లలో అవినీతి: కేటీఆర్ -
కొత్త రేషన్కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.సోమవారం(సెప్టెంబర్16) జలసౌధలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.‘పదేళ్లలో నామమాత్రంగా రేషన్ కార్డులిచ్చారు. ఖరీఫ్ నుంచిన వడ్లకు క్విటాలుకు 500 అదనంగా ఇవ్వబోతున్నాం జనవరి నుంచిన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తాం. పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో 49476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజక వర్గాల్లో మాత్రమే ఇచ్చారు. పద్ధతి ప్రకారం ఎక్కడా ఇవ్వలేదు. మా ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి రేషన్కార్డులిస్తాం’అని తెలిపారు. ఇదీ చదవండి.. నిమజ్జనానికి అంతా రెడీ.. జీహెచ్ఎంసీ మేయర్ -
వరద బాధితులను ఆదుకుంటాం
కూసుమంచి/తిరుమలాయపాలెం/నేలకొండపల్లి: గతనెల 31 నుంచి ఈనెల 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో రూ. 10,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా లోని కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో శనివారం మంత్రి పర్యటించారు. పాలేరు ఎడమ కాల్వ గండి మరమ్మతులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంటల వ్యవధిలో 37 నుంచి 38 సెం.మీ. మేర వర్షం కురవడంతో అన్ని విభాగాల్లో నష్టం ఎదురైందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, సీఎం వినతితో కేంద్ర బృందాలు పర్యటించాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వానికి వరద సాయం కోసం విన్నవించడమే కాక ప్రజలను ఆదుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కేంద్రం నుంచి సాయం అందినా, అందకున్నా వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం త్వరలో అందిస్తామని, పూర్తిగా ఇళ్లు నష్టపోయిన ప్రజలకు నెలాఖరులోగా ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్ల నుంచి 100 మంది సిబ్బందిని ఎంపిక చేసి వరద సహాయక చర్యలపై శిక్షణ ఇప్పించి కావాల్సిన పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. వచ్చేవారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన కలిసి విపత్తు సాయం కోసం ప్రతిపాదనలు అందిస్తామని వెల్లడించారు. -
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ. 16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఇటీవలి వర్షాలకు ప్రభావితం అయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంపై సోమవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్లతోపాటు మున్సిపల్, వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రహదారులు, భవనాలు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సమీక్షలో వరద నష్టాన్ని అంచనా వేయడంతోపాటు దాన్ని పూడ్చుకునేందుకు ఎన్ని నిధులు కావాలన్న దానిపై చర్చించారు. వరదలు, నష్టంపై కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలని ఆదేశించారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం పెంపు సమీక్షలో అధికారులు మాట్లాడుతూ.. వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో ఆరుగురు, కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు, కామారెడ్డి, వనపర్తిలలో ముగ్గురి చొప్పున చనిపోయారని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా, పాక్షికంగా కూలిపోయిన ఇళ్లను గుర్తించి.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందించాలని.. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశించారు. తొలుత రూ.10 వేల ఆర్థిక సాయం అనుకున్నప్పటికీ.. మానవతా దృక్పథంతో దాన్ని రూ.16,500కు పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరద ముంపునకు గురైన పంట భూములకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇక మైనింగ్ వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేయడం వల్ల వరద వెళ్లక సూర్యాపేట, పాలేరులకు భారీగా నష్టం జరిగిందని అధికారులు సమీక్షలో మంత్రికి వివరించారు. దీంతో ఆ నష్టాన్ని మైనింగ్ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. శాశ్వత మరమ్మతులు చేపట్టండి సమీక్షలో భాగంగా అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారని వివరించారు. 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. వర్షాలు, వరదలతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు వేల కిలోమీటర్ల పొడవునా దెబ్బతిన్నాయని అధికారులు వివరించగా.. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోడ్లను పునరుద్ధరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. శాశ్వత మరమ్మతులకు అవసరమైన కార్యాచరణను రెండు రోజుల్లో తయారు చేయాలని సూచించారు. పెద్ద, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులను కూడా వేగంగా చేపట్టాలన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్సీలు ఏ మేరకు దెబ్బతిన్నాయనే వివరాలను సేకరించాలని సూచించారు. ఇక వర్షాలు, వరదల కారణంగా ఇండ్లలోకి నీరు చేరి.. ఇంటి పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు తడిచిపోయాయని, కొన్నిచోట్ల కొట్టుకుపోయాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి... డాక్యుమెంట్లు పోయిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా వారికి డూప్లికేట్ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
TG: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. డబ్బు, ఇల్లు ఇంకా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముంపు ప్రాంతాల వరద బాధితులకు నష్టపరిహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. అలాగే, తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది.కాగా.. భారీ వర్షాలు, వరదలపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ‘చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తాం. భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం అందజేస్తాం. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ.5 లక్షల సహాయం చేస్తాం. వరద ముప్పునకు గురైన ప్రతీ ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తాం. వరదల కారణంగా తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం. యుద్ధ ప్రతిపాదికన తాత్కాలికంగా రహదారుల మరమత్తులు చేపడతాం. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందకండి. ప్రతీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
త్వరలోనే కొత్త ఆర్వోఆర్
సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024 చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ అభిప్రాయ సేకరణలో మేధావులు, రిటైర్డ్ రెవె న్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి సామా న్యుల వరకు అందరూ తమ సల హాలు, సూచనలను ప్రభు త్వానికి ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని అందుబా టులోకి తెస్తామని, ఇందుకు అవసరమైన కసరత్తును త్వరి తగతిన పూర్తి చేస్తామని శనివారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. రాష్ట్రంలో భూమి సమస్యలకు శాశ్వత పరి ష్కారమే లక్ష్యంగా, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త చట్టాన్ని తెస్తామని స్పష్టం చేశారు. ’’తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూ సమస్యలు పరిష్కారమవుతాయని అనుకుంటే గత పాలకుల తొందరపాటు నిర్ణయాలతో కొత్త సమస్యలు ఉత్పన్న మయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్వోఆర్ చట్టం లోపభూయిష్టంగా ఉండడంతో రైతులు, భూముల యజమానులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తప్పుల తడకగా సేకరించిన వివరాలతో నిర్వహించిన ధరణి పోర్టల్కు 30 లక్షల మంది రైతులు బాధితులుగా మారారు. అటువంటి పరిస్థితులను పునరావృతం కానివ్వం. తాము రూపొందించిన ఆర్వోఆర్ ముసాయిదా చట్టంపై విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపాం. జిల్లా స్థాయిలో వర్క్షాప్లు నిర్వహించాం. ఆ వర్క్షాప్లలో వచ్చిన సూచనలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపుతారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా, ఈమెయిల్ రూపంలో వచ్చిన సూచనలను కూడా వాటితో క్రోడీకరిస్తాం. అమలు చేసే అధికారులకు అవగాహన ఉండేలా, రైతులకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహిత చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో అత్యంత రహస్యంగా ఉంచిన ధరణి పోర్టల్ను మా ప్రభుత్వం ఒక పబ్లిక్ డాక్యుమెంట్గా ప్రజలందరికీ అందుబాటులో ఉంచబోతోంది.’ అని ఆ ప్రకటనలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి తావివ్వొద్దని, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పనిచేయాలని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే బకాయిల విడుదల ఇటీవల బదిలీలు జరిగిన విషయం గుర్తుచేస్తూ.. సబ్ రిజిస్ట్రార్ల నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారులందరూ వీలైనంత త్వరగా కొత్త స్థానాల్లో సర్దుబాటు కావాలని పొంగులేటి చెప్పారు. బాగా పని చేసిన వారికి పదోన్నతులు కల్పిస్తామని, బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. వచ్చే ఐదేళ్లలోగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని, దశల వారీగా నిర్మాణాలు చేపట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న భవనాలకు అద్దెలు, విద్యుత్, వాటర్ చార్జీలు, వాహనాల అద్దె లాంటి బకాయిలను త్వరలోనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల విషయంలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. భూముల విలువల సవరణ ప్రక్రియ విషయంలో థర్డ్ పార్టీ నివేదిక వచ్చిన తర్వాత త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. కాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ బుద్ధ ప్రకాశ్జ్యోతి శాఖ పనితీరు గురించి మంత్రికి వివరించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక నివేదికను మంత్రి పొంగులేటి విడుదల చేశారు. సమావేశంలో అదనపు ఐజీలు, డీఐజీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త టేపుతో నా ఇంటికి రండి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు నా ఇల్లు హిమాయత్సాగర్ బఫర్ జోన్లో లేదు. నా మీద బురద జల్లాలని, నన్ను బూచిగా చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నా ఇంటి వద్దకు ఎంత మందైనా, ఎప్పుడైనా వెళ్లవచ్చు.. కొలుచుకోవచ్చు. బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కూల్చుకోవచ్చు. దిస్ ఈజ్ మై చాలెంజ్. పొంగులేటి చాలెంజ్. ప్రధాన ప్రతిపక్షానికి సవాల్ చేస్తున్నా.. కొలిచిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకుంటారో మీరే నిర్ణయించుకోండి..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం గాం«దీభవన్లో ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. బురద జల్లే ప్రయత్నమే.. ‘అవాకులు, చెవాకులు, అసందర్భ వాదనలతో పాటు మాజీ మంత్రులకు సంబంధించిన వ్యవస్థలు నామీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. నేను ఒకటే చాలెంజ్ విసురుతున్నా. మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు చెందిన మాజీ మంత్రులు, వారికి డబ్బాలు కొట్టే సంస్థలు, వ్యవస్థలు, కొత్త టేపు కొనుక్కుని వెళ్లండి. నేను కూడా రాను. మా అధికారులొస్తారు. డేట్ ఎప్పుడో చెప్పండి. ఎన్ని ప్రొక్లెయినర్లు కావాలంటే అన్ని పెట్టుకుని అధికారులు రెడీగా ఉంటారు నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నా, బఫర్జోన్లో ఉన్నా, ఒక్క ఇటుక పెళ్ల ఉన్నా వెంటనే పడగొట్టండి. నా ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ను కూడా ఆదేశిస్తున్నా..’ అని మంత్రి అన్నారు. మళ్లీ చెబుతున్నా..మీకా చాన్స్ ఇవ్వను ‘బీఆర్ఎస్ నేతల్లాగా నేను ఒకటికి వంద అబద్ధాలు చెప్పను. వాస్తవానికి నేనుండే ఇల్లు నా పేరు మీద లేదు. నా కొడుకు పేరు మీద ఉంది. అయినా ఆ ఇల్లు నాది కాదని చెప్పను. లీజుకు తీసుకున్నానని మీలాగా సొల్లు కబుర్లు చెప్పను. నేను అందరు అన్నట్టు దాంట్లో దూకు.. దీంట్లో దూకు అనను. ఇది పొంగులేటి చాలెంజ్. గతంలో ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పా. మళ్లీ ఈరోజు చెపుతున్నా. ఈ రోజు కాదు.. ఏ రోజైనా, నీతో, నీ బావతో, ఆయన మామతో చెప్పించుకునే చాన్స్ ఈ పొంగులేటి ఎప్పుడూ ఇవ్వడు. ఇవ్వబోడు. ప్రతిపక్షానికి దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలి.’ అని పొంగులేటి అన్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాం ‘గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు సీట్లు రాలేదనే అక్కసుతో రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాం. ఇంకా రూ.12,300 కోట్ల మాఫీ చేయాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతల్లా మేము శనగలు తిని చేతులు దులుపుకునే రకం కాదు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు కటాఫ్ తేదీ పెట్టి ఆ తేదీలోపు ఎక్కువగా ఉన్న డబ్బులు కడితే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం..’ అని మంత్రి తెలిపారు.2020 ఆర్వోఆర్ చట్టాన్ని మార్చి రైతులకు ఇబ్బంది లేకుండా వీలున్నంత త్వరలో కొత్త చట్టాన్ని తెస్తామన్నారు. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వచి్చన సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. అప్పుడెప్పుడో వచ్చి చీలి్చచెండాడతానని చెప్పిన కేసీఆర్ మళ్లీ 6–9 నెలలు కనపడడంటూ ఎద్దేవా చేశారు. మహిళా జర్నలిస్టులపై తమకు గౌరవం ఉందని, వారిపై దాడి జరిగి ఉంటే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పొంగులేటి చెప్పారు. -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Vs కేటీఆర్
-
ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ అమలు చేశాం..
-
కాంగ్రెస్ను విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: లక్ష రుణమాఫీ చేసేందుకు బీఆర్ఎస్కు ఐదేళ్లు పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఐదేళ్లైనా లక్ష రుణమాఫీ చేయని బీఆర్ఎస్కు కాంగ్రెస్ను విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు.ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ధనిక రాష్ట్రం అని అన్నారు కానీ.. ఖజానా మొత్తం ఖాళీగా ఉందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించి రైతును రాజును చేసే పనిలో పడ్డామని చెప్పారు తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాజీ మంత్రుల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు.‘ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ చేశాం. మిగతా ఖర్చులు తగ్గించుకుని రైతులకు మేలుచేశాం. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు పైన ఉన్న మొత్తంచెల్లిస్తే రుణమాఫీ అవుతుంది. బీఆర్ఎస్లా మేం రూ. వేల కోట్లు దోచుకోలేదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ముందే చెప్పాంకేటీఆర్ ఆరోపణలకు కౌంటర్రేవంత్పైకేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్లో కేటీఆర్ ఇల్లు అని పెట్టారు. ఇప్పుడా ఇల్లు నాది కాదు అని కేటీఆర్ అంటున్నారు. నాపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే బఫర్ జోన్లో పాంహౌజ్ కట్టుకున్నారు. మీలాగా మీరు ఉండే ఇల్లు నాది కాదు అని చెప్పనునా ఇళ్ళు బఫర్ జోన్లో ఉన్నా.. ఎఫ్టీఎల్లో ఉన్నా మొత్తం పడగొట్టండి. కేటీఆర్ చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ విమర్శలకు కట్టుబడి ఉండాలి. కొత్త టేప్ తెచ్చుకుని కొలవండి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చాలని హైడ్రా అధికారులను ఆదేశిస్తున్నా’ అని తెలిపారు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్/ ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో విస్తతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మరో ఐదురోజులు ఈ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదు ర్కొనేందుకు జిల్లా యంత్రాంగాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఆయన భారీ వర్షాలు, నూతన ఆర్వోఆర్ ముసాయిదా చట్టం, ఎల్ఆర్ఎస్, ధరణి దరఖాస్తుల పరి ష్కారంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో వర్ష పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న ఐదు రోజుల వర్షాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అధికారం కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ప్రతి కలెక్టరేట్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సామాన్యుల నుంచి మేధావుల వరకురాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని భావిస్తోన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024 చట్టంపై విస్తృతస్థాయిలో ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లకు సూచించారు. అందులో భాగంగా ఈనెల 23, 24 తేదీల్లో ఆర్వోఆర్ ముసాయిదా చట్టంపై జిల్లాస్థాయి వర్క్షాప్లు నిర్వహించాలన్నారు. సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరికీ అర్థమయ్యేలా చట్టం రూపొందించే క్రమంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.పది రోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించండిధరణి పోర్టల్ కింద పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాల్సిందేనని స్పష్టం చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ధరణి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నా యని, ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ఆదేశించారు. క్షేత్రస్థాయి తనిఖీల కోసం స్పెషల్ టీమ్లతోపాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసుకోవాలని, ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. -
సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కర్ణాటకలో డీకేశివకుమార్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. ‘పొంగులేటి ఇక్కడ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకేదో పదవి ఆశిస్తున్నాడనిపిస్తోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం పదవిపై పడింది. సీఎంను కాదని కొడంగల్ అబివృద్ధి కాంట్రాక్టు పొంగులేటికి వచ్చింది. భట్టి ఉపముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్లో లేరు. అమెరికా పర్యటనలో రేవంత్ తీసుకొచ్చిన వేల కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? సీఎం కుటుంబ సభ్యుల్లో ఎవరెంత పెట్టుబడి పెడుతున్నారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలి. మంత్రిగా ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో లేదు. ఎస్కేలేషన్, ప్రైస్ హైక్ మీద మాకు అనుమానం ఉంది. తన వెంట కొంత మంది ఎంఎల్ఏలు ఉన్నారని భయపడి పొంగులేటి కి కాంట్రాక్టు ఇచ్చారా? సీఎం సమాధానం చెప్పాలి. కొంత మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పొంగులేటి సీఎంను బ్లాక్మెయిల్ చేస్తున్నారు’అని మహేశ్వర్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన 45 రోజుల్లోగా కొత్త రెవెన్యూ చట్టం
త్వరలో జీవో 59 దరఖాస్తుల పరిష్కారంజీవో 59 కింద అక్రమంగా భూములను క్రమ బద్ధీకరించుకున్నారు. నానక్రాంగూడలో రూ.3 వేల కోట్ల ఖరీదైన 32 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. మేం రాగానే వాటిని వెనక్కు తీసుకున్నాం. అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో జీవో 59 దరఖాస్తులను పరిష్కరిస్తాం.సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2020 స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వీలైతే అసెంబ్లీలో పెట్టి లేదంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే రూపొందించిన ముసా యిదా చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచ నలు వస్తున్నాయన్నారు. సూచనలు తీసుకునే గడువును ఈనెల 23నుంచి మరో వారం పొడిగి స్తామని చెప్పారు. గడువు ముగిసిన 45 రోజుల్లో గా కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు రెవె న్యూ సంబంధిత అంశాలపై ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త చట్టం, ధరణి పోర్టల్లో తెస్తున్న మార్పులు, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు హక్కుల కల్పన, భూముల విలువల సవరణ, జీవో 59 దరఖా స్తులు వంటి అంశాలపై పొంగులేటి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..ధరణితో ప్రజలు కుదేలు: గత ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాల భూమి డేటాను విదేశీ కంపెనీకి అప్పగించినందుకే మేం ధరణి పోర్టల్ను తప్పుపడుతున్నాం. ఇది రైతుల మెడలో పెద్ద గుదిబండ. ఈ పోర్టల్ కారణంగా ప్రజలు కుదేలయ్యారు.. తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని తెచ్చిన చట్టం ఇది. ప్రజలు తమ భూమి తమకు రావాలని దేవుళ్లకు దండం పెట్టారో లేదో తెలియదు కానీ, దొరకు, కలెక్టర్లకు మాత్రం పొర్లు దండాలు పెట్టాల్సి వచ్చింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. తినీతినక కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని అమ్ముకునే హక్కును కాలరాసింది. పుట్టలో పాముల్లా అక్రమాలుమేం అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే పుట్టలో పాముల్లాగా ధరణిలో వందలాది అక్రమాలు బయటకు వస్తున్నాయి. రెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మూడు నిమిషాల్లో మ్యుటేషన్ అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు ఆస్కారం కల్పించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్లు చేసుకుని తాళాలు వేసుకున్నారు. వాళ్లేం చేశారో కలెక్టర్లకు కూడా తెలియదు. హెడ్ ఆఫీస్, విదేశీ కంపెనీకి మాత్రమే తెలుసు. మేం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అన్ని వివరాలు ప్రజా బాహుళ్యంలో పెట్టించాం లొసుగులు సవరించేందుకే చట్టం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామంటే.. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఆత్రుతగా తప్పులు చేయడం కాదు. పేరు మార్చడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మన నిర్ణయాలతో తరతరాలు ముందుకెళ్లాలి. అందుకే భేషజాలకు పోకుండా ధరణి పోర్టల్ను మాత్రమే కాదు. చట్టంలోని లొసుగులను సవరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. ఆర్వోఆర్ చట్టం–2020 కారణంగానే సమస్యలన్నీ వచ్చాయి.80–85 వేల దరఖాస్తులే పెండింగ్లో..మేం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించాం. అప్పటికే 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతిరోజూ 3–5 వేల కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టి 1.28 లక్షల దరఖాస్తులు పరిష్కరించాం. అంతేకాదు రోజూ పరిష్కరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు పోర్టల్లో 80–85 వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా నమోదు చేయిస్తున్నాం. అభిప్రాయ సేకరణకు జిల్లా స్థాయిలో సదస్సులుకొత్త చట్టం ముసాయిదాపై చెట్టుకింద కూర్చునే సామాన్య రైతు నుంచి దొర వారు ఇచ్చే సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరుపుతాం. దేశంలోనే రోల్మోడల్ చట్టంగా రూపొందిస్తాం. దీని ద్వారా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందుతాయి. పోర్టల్లోని దరఖాస్తు పద్ధతిని మార్చేస్తాం. ఇప్పటివరకు ఉన్న 33 మాడ్యూళ్ల స్థానంలో ఒకటే మాడ్యూల్ తెస్తాం. రైతుల ఏ సమస్యపై అయినా ఈ మాడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పహాణీలో 35 కాలమ్లు ఉండేవి. 100 ఏళ్ల చరిత్ర ఉండేది. ఇప్పుడు ఒక్కటే కాలమ్ ఉంది. దీని స్థానంలో 14–16 కాలమ్లతో కొత్త పహాణీ అందుబాటులోకి తెస్తాం. సీసీఎల్ఏ స్థాయిలో కూడా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కటాఫ్ డేట్ నిర్ణయిస్తున్నాం. సీసీఎల్ఏకు వచ్చిన దరఖాస్తులు వారం రోజుల్లోగా పరిష్కారం కావాలని ఆదేశిస్తా. ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా?దొరగారు చెపితే వినలేదని 23 వేల మందిని అర్ధరాత్రి వేరే శాఖకు బదిలీ చేశారు. వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూకు సాక్ష్యాలు లేకుండా చేశారు. మేం రాష్ట్రంలోని 10,945 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు కాపలాదారులను నియమించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఇంట్లోకి ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా? పేదోళ్ల భూములు వారికే పంచుతాంపేదలకు ఇందిరమ్మ పంచిన భూములు లాగేసుకున్నారు. అలాంటి భూములు గుర్తించాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటినీ తిరిగి పేదలకు పంచుతాం. పేదోడి భూమి ధనికుల చేతికి వెళ్లనివ్వం. ఆ కోణంలోనే అసైన్డ్ భూములపై అమ్మకపు హక్కు కల్పిస్తాం. కొత్త చట్టం ఏర్పాటు కాగానే మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 9 లక్షల దరఖాస్తులకు తోడు కొత్తగా వచ్చే వాటిని ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం భూముల విలువల సవరణలో శాస్త్రీయత పాటించలేదు. మేం అధికారులు, థర్డ్ పార్టీ నుంచి వివరాలు సేకరించాం. రెండింటినీ క్రోడీకరించి త్వరలోనే న్ణియం తీసుకుంటాం. పార్టీ ఆస్తులు ఏం చేయాలా అని దొర ఆలోచిస్తున్నాడు‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం 100 శాతం ఖాయం. అయితే బీఆర్ఎస్ పేరిట ఉన్న ఆస్తులు, డబ్బులు ఏం చేయాలనేదానిపై దొర ఆలోచిస్తున్నాడు. పార్టీని విలీనం చేయకుండా కవితకు బెయిల్ రాదు. మేం కేంద్రంలో అధికారంలో లేము కనుక ఆ కేసులు తప్పించడం మాతో కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ జోలికి రాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరికకు బ్రేక్ మాత్రమే పడింది. ప్రతి దానికీ ఆషాఢాలు, శ్రావణాలు ఉంటాయి కదా! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. నెలాఖరులోనే జేఎన్జే సొసైటీకి భూమిని సీఎం చేతుల మీదుగా అప్పగిస్తాం. ఈ సొసైటీలో లేని మిగిలిన వారికి ఎలా ఇవ్వాలన్న దానిపైనా ఆలోచిస్తున్నాం. ఇతర సొసైటీల సభ్యత్వాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. -
‘ధరణి’ని ప్రక్షాళన చేస్తాం
నేలకొండపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించారు. సీసీ రోడ్లు, పల్లె దవాఖానా ప్రారంభించి బీపీ పరీక్ష చేయించుకున్నారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా మారిందన్నారు. త్వరలో రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, నీటిపారుదల సంçస్థ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్బాబు, డీఎంహెచ్ఓ మాలతి, ఆర్డీఓ గణేష్ తదితరులు ఉన్నారు. -
3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి కావాలి
సాక్షి, హైదరాబాద్/ భూపాలపల్లి/ సాక్షిప్రతినిధి, ఖమ్మం: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని.. మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారం మాత్రమే క్రమబద్దీకరణ జరగాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి అక్కడి కలెక్టరేట్ నుంచి మున్సిపల్, రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధనశాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రత్యేక బృందాలతో ప్రక్రియ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో దళారుల ప్రమేయం లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ‘‘పెండింగ్లో ఉన్న 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రజలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలి. సిబ్బంది కొరత ఉన్నచోట ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలి. ప్రతిపాదనలు పంపితే రెవెన్యూ శాఖ నుంచి కూడా సర్దుబాటు చేస్తాం. రెవెన్యూ, సాగునీరు, మున్సిపల్ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్డెసు్కలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో పాలుపంచుకునే అధికారులు, సిబ్బందికి తక్షణమే శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా అవసరమైన కా ర్యాచరణ చేపట్టాలి..’’అని మంత్రి ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో క్రమబద్దీకరణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పొంగులేటి సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగొద్దు: డిప్యూటీ సీఎం భట్టి ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దరఖాస్తుల స్క్రూటినీ సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని.. నీటి వనరులు, కాలువలు, చెరువుల ఆక్రమణలకు పాల్పడకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. -
Telangana: రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ను కేబినేట్ ఆమోదించిందని పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేరళలో వయనాడ్లో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడంతోపాటు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది. రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే అర్హులైన పేదలందరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం.క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందిగౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్పేట చెరువు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు -
వరదలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదికి వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. సోమవా రం మంత్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్య టించారు. గోదావరి తీరంలో కరకట్టలను పరిశీలించి, జిల్లా అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని.. వరద తగ్గేవరకు కూనవరం– భద్రాచలం– దుమ్ముగూడెం రోడ్ల మీదుగా రాకపోకలను నిలిపేయాలని సూచించారు. భద్రాచలంలోకి చేరే వరద నీటిని నదిలోకి ఎత్తిపోసేలా మోటార్లు సిద్ధం చేయాలన్నారు. అనంతరం బూర్గంపాడు మండలంలో పొలాలను పరిశీలించారు. ‘పెద్దవాగు’పై అధికారుల వైఫల్యం అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడటానికి ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని పొంగులేటి పేర్కొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారీ వరద వస్తుంటే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని.. ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేయించలేదని మండిపడ్డారు. అధికారులకు నోటీసులు ఇచ్చామని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం గత పదేళ్లుగా తగినంత శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు.ప్రాజెక్టు విషయంలో తప్పు జరిగిన విషయాన్ని అంగీకరిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని తిరిగి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తారని తెలిపారు. ఆలోగా ఫీడర్ చానల్ లేదా రింగ్బండ్ నిర్మించి ఆయకట్టు రైతులకు నీరు అందించేందుకు ప్రయతి్నస్తామన్నారు. ప్రాజెక్టు గండ్లు, వరదలతో నష్టపోయిన వారిని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వంతోపాటు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తామని ప్రకటించారు. వరద కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రెండు నెలల్లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ముగ్గురు ఇంజనీర్లపై చర్యలకు సిఫారసు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు ‘పెద్దవాగు’. 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా 1981లో దీనిని నిర్మించారు. 40,500 క్యూసెక్కుల వరదను విడుదల చేసేలా స్పిల్వేను డిజైన్ చేశారు. కానీ 1989లో 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో స్పిల్వేకు ఎడమవైపు 200 మీటర్ల వరకు కట్టకు గండిపడింది. ఇప్పుడు 75వేల క్యూసెక్కుల వరద రావడంతో మళ్లీ గండ్లు పడ్డాయి.దీనికి నిర్వహణ లోపమే కారణమని.. ఎగువ నుంచి భారీ వరద రానుందని సమాచారమున్నా ఇంజనీర్లు సకాలంలో గేట్లు ఎత్తలేదని.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలేవీ జారీ చేయకుండా నీటిని విడుదల చేశారని అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు నిర్వహణలో విఫలమైన డీఈఈ, ఏఈఈ, ఏఈలపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రాజెక్టుకు గండ్లు పడటంతో 16 గ్రామాలు నీట మునిగాయి. రూ.100 కోట్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. -
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
రైతు భరోసాపై మంత్రుల క్లారిటీ
సాక్షి,వనపర్తి: రైతులకు తాము ఇచ్చిన హమీలు అన్ని నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజాధనం సద్వినియోగం చేయాలనే రైతు భరోసాపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. శుక్రవారం(జులై12) వనపర్తిలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కూడిన సబ్కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ‘కొందరు నాయకులు, ప్రతిపక్షాలు రైతుభరోసాపై రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నాయి. దీన్ని తిప్పి కొట్టాలి. ప్రతిపక్షాలు కూడా మంచి సూచనలు చేస్తే బేషజాలు లేకుండా వాటిని స్వీకరిస్తాం. రైతుభరోసా స్కీమ్పై ఎలాంటి అపోహలు వద్దని, ప్రజాభిప్రాయాలను అసెంబ్లీలో చర్చించి స్కీమ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.రైతు బంధు పేరుతో రూ.25 వేల కోట్లు దుర్వినియోగం: తుమ్మల నాగేశ్వరరావురైతులు, మేధావుల అభిప్రాయం మేరకే రైతుభరోసా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సాగుకు పనికిరాని భూములకు రూ. 25 వేల కోట్ల రైతుబంధు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేశారన్నారు. సీఎం మనసులో రైతుల పంటలకు బీమా ఇచ్చే ఆలోచన ఉందన్నారు. మద్దతుధర అందించి రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. -
కాంగ్రెస్ ఓపెన్ మైండ్ తో ఉంది..
-
ఆంబోతు రంకెలు ఆగేంతవరకు వలసలు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో 100 మంది ఎమ్మెల్యేలు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని, కానీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అచ్చోసిన ఆంబోతు రంకెలు ఆగేంతవరకు వలసలు కొనసాగుతూనే ఉంటాయని, ఆ రంకెలు ఆగిపోగానే వలసలు ముగించేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుందనే విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దు. 2018 ఎన్నికల్లో కేసీఆర్కు 88 సీట్లు ఇస్తే తృప్తి పడలేదు. కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే ఐదుగురిని ఉంచాడు. అప్పుడు అక్కడ ఉండి అదంతా చూసిన ఎమ్మెల్యేలే ఇప్పుడు మా పార్టీలోకి వస్తున్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని అనలేదు. కానీ మేం గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కేసీఆర్ ప్రారంభించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఈయన ముందుండి నడిపించాలని చూశాడు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను చుట్టూ కూర్చోబెట్టుకుని కేబినెట్లో నువ్వు మంత్రి, నువ్వు మంత్రి అని చెప్పాడు. అలా మంత్రుల లిస్టు రాసుకున్న వారిని ఏమనాలి?’ అని పొంగులేటి ప్రశ్నించారు. అసలు ప్రభుత్వాన్ని కూల్చడం అన్న పదమే అప్రజాస్వామికమని, ఇప్పుడు వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... – రైతు రుణమాఫీ చేసి తీరుతాం. రెండుమూడు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తాం. ఇప్పటికే రూ.9వేల కోట్లు వ్యవసాయశాఖకు బదిలీ చేశాం. మిగిలిన నిధులు కూడా సమీకరించి రుణమాఫీ చేసి తీరుతాం. – రైతు భరోసాపై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వెళతాం.కౌలు రైతులను కాపాడుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. – సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరణి పోర్టల్ను సంస్కరిస్తాం ఒకే మాడ్యూల్లో దరఖాస్తు చేసుకుంటే అది ఎలా పరిష్కరించాలో అధికారులు నిర్ణయించాలి. వీలున్నంత త్వరలోనే ధరణి పెండింగ్ దరఖాస్తులను జీరో చేస్తాం. అలాగని అడ్డగోలుగా ధరణి దరఖాస్తులను తిరస్కరిస్తే చర్యలు తీసుకుంటాం. – ఈ ఏడునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. అయినా అన్ని విషయాలను ప్రజల ముందు పెట్టలేకపోయాం. మేం అధికారంలోకి వచ్చాకే హెదరాబాద్లో కమర్షియల్ లీజ్ బాగా పెరిగింది. ఎలాంటి సమస్యా రాకుండా టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం చేసిన రూ. 6.82లక్షల కోట్ల అప్పుకుగాను షెడ్యూల్కు మించి అప్పులు కడుతున్నాం. ఇలాంటివన్నీ చెప్పుకోవాలి. – రాష్ట్రంలో చాలామంది అర్హులకు పింఛన్లు, రేషన్కార్డులు రావాల్సి ఉంది. కొన్ని బోగస్ కార్డులు కూడా ఉన్నాయి. ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ కోసం కార్డులు రాయించుకుంటున్నారు. అందుకే రేషన్కార్డుకు, ఆరోగ్యానికి లింకు తీసేయాలని, రేషన్కార్డును, హెల్త్కార్డును వేర్వేరుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. – 2021–22 ఆర్థిక సంవత్సరంలో భూముల విలువలు రెండుసార్లు సవరించారు. అప్పుడు శాస్త్రీయంగా జరగలేదు. ఇప్పుడు మేం శాస్త్రీయంగా చేయాలనుకుంటున్నాం. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భూముల విలువల సవరణ ఆగస్టు1 నుంచా ఆగస్టు 15 నుంచా అన్నది ఇప్పుడే చెప్పలేం. – జీఓ 59 దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్లను మేం కావాలని ఆపడం లేదు. పేదలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఆ రెండు అంశాల్లో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నాం. అవి మళ్లీ జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టేస్తాం. ధరణి అంశం పూర్తికాగానే జీఓ 59, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేస్తాం. ఇప్పటికే జీఓ 59 కింద చిన్న చిన్న స్థలాలు రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలిచ్చాం. – కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న బడ్జెట్ పెడుతుంది. అందులో రాష్ట్ర కేటాయింపులు చూసుకొని ఆ తర్వాత 1,2 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ కూడా పెడతాం. జూలై 31లోపే రెగ్యులర్ బడ్జెట్కు ఆమోదం లభిస్తుంది. – కేసీఆర్ అంటే నాకేం కోపం లేదు. ఆయన అంటే నాకు లవ్వు ఎక్కువ. ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా? తన అనుభవాన్ని రంగరించి పాలన గురించి ఎప్పుడు సూచనలిస్తారా అని ఎదురుచూస్తున్నా. కానీ ఆయన రావడం లేదు. – తుదిదశలో నిర్మాణాలు ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి నిరుపేద లబ్ధిదారులను గుర్తించి కేటాయిస్తాం. అతి తక్కువ మొత్తం ఖర్చు చేస్తే గృహప్రవేశాలకు సిద్ధమయ్యే స్థాయిలో ఉన్న ఇళ్లను తొలుత ఎంపిక చేస్తాం. – అమ్ముడు కాకుండా మిగిలిపోయిన రాజీవ్ స్వగృహ ఇళ్లకు కొత్తగా ధరలు నిర్ణయించి ప్రజలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. – స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్లు చేయించుకోలేని వారి డబ్బులు నాలుగేళ్లుగా ఇవ్వడం లేదు. ఇలా రూ.32 కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. వాటిని 2,3 రోజుల్లో విడుదల చేస్తాం. సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక హంగులతో సబ్రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తాం. ప్రతి గ్రామంలో సమగ్ర రెవెన్యూ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కచి్చతంగా ఇస్తాం. జేఎన్జే సొసైటీ అంశాన్ని 2,3 రోజుల్లోనే పరిష్కరిస్తాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో విలేకరులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన.’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. -
రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం నీరివ్వలేదు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయితే, ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని.. అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, బీరోలు, పోచారంలో సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అలాగే దమ్మాయిగూడెం నుంచి పోచారం వరకు నిర్మాణం జరుగుతున్న కాలువ, సొరంగం పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండగా, ఇప్పటికే మొదటి లిఫ్ట్ ట్రయల్రన్ పూర్తిచేసి రెండో లిఫ్ట్ ట్రయల్ రన్కు సిద్ధమవుతున్నామని తెలిపారు.మొదటి విడత ఆగస్ట్ 15న..సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మొదటి విడతగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయిస్తామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై ఎక్కడా నీటి నిల్వకు రిజర్వా యర్లు కట్టలేదని, దీంతో 10 టీఎంసీల నుంచి 12 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ నిర్మించాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. కాగా, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్ర నాయక్, నీటిపారుదల శాఖ సీఈ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్: టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ఫొటోలు)
-
పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్
-
బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఇండియన్ టెలికం యాక్ట్పై కేంద్రానికి పూర్తి అధికారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా స్వీకరించొచ్చు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? ఆ పార్టీ నేతలు అవగాహన రాహిత్యంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్పై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ..పరోక్షంగా బీఆర్ఎస్కు సహకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న వారు ఎంతటి పెద్దమనుషులైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుని పోతోంది’అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబులు స్పష్టం చేశారు. తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన జనజాతర మహాసభ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాలు వారి మాటల్లోనే...బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించింది. మా ఫోన్లు కూడా ట్యాప్ చేసింది. వీటిని అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు పేరుతో తిన్న కమీషన్లు కక్కిస్తాం. ధరణి ఫోర్టల్ను అడ్డుపెట్టుకొని వారు కొల్లగొట్టిన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, సీలింగ్ భూములను వెనక్కి తీసుకుంటాం. ఆర్థిక దోపిడికి పాల్పడిన వారికి జైలుకు పంపిస్తాం. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. మీరు మా తాట తీయడం కాదు.. ప్రజలే మీ తాట తీస్తారు అని హెచ్చరించారు. కర్రుకాల్చి వాత పెట్టినా సిగ్గురాలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..కరువొచ్చిందని బీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. కరువుకు కాంగ్రెస్కు సంబంధం ఏమిటీ? కాంగ్రెస్ డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు వర్షపు చినుకు కురవలేదు. వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ ఏడాది 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని సెపె్టంబర్ 5న త్రిసభ్య కమిటీ ప్రకటించింది. ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని కేఆర్ఎంబీ కమిటీ ముందే హెచ్చరించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో కరువొస్తే...కాంగ్రెస్కు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు తెలివైనవారు. ఎవరు ఏమిటో వారికి తెలుసు. ఇప్పటికే ఒకసారి కర్రుకాల్చి వాతపెట్టారు. అయినా సిగ్గురాలే. మళ్లీ వారికి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనజాతరకు భారీగా తరలిరావాలి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇదే స్ఫూర్తితో ఇదే వేదికపై నుంచి ఈ నెల 6న కాంగ్రెస్ జాతీయ గ్యారంటీలను ప్రకటించనుంది. ఏఐసీసీ ముఖ్యనేతలు రాహుల్గాందీ, ప్రియాంకగాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదు లక్షల మందికి తగ్గకుండా సభకు తరలించాలని నిర్ణయించింది. సభలో మహిళలకు పెద్దపీట వేయబోతున్నాం. వారికి ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నాం. సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం’అని మంత్రులు వివరించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నేత దేప భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేను ఎవరితోనూ టచ్లోకి వెళ్లలేదు: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కావాలని తానేమీ కోరుకోవడం లేదన్నారు. తాను బీజేపీతో టచ్లోకి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ప్రధాన మంత్రిని కలిసినంత మాత్రాన పొల్యూట్ అయినట్టు కాదన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని చెప్పారు. గురువారం మంత్రి పొంగులేటి హైదరాబాద్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పొంగులేటి సీఎం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మీడియా ప్రస్తావించగా.. అంతా అవాస్తవన్నారు. ‘‘పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు పడతాయి. నా వద్ద పళ్లు ఉన్నాయి. అందుకే ఈ ప్రచారం జరుగుతోంది. నేను సీఎం వెంట ఉన్నంత మాత్రాన కేబినెట్లో నంబర్ 2 ఎలా అవుతాను. సీఎం కావాలని నేను అనుకున్నా పార్టీ అధిష్టానం అన్నిరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది కదా..’’అని పేర్కొన్నారు. ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయబోం.. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాపింగ్ చేయదని భరోసా ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒకట్రెండు సీట్లు గెలిస్తే గొప్పేనన్నారు. కాంగ్రెస్లోకి ఎవరినీ ఆహా్వనించలేదని, వారంతట వారే వస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్పై కేసులతో కక్షసాధింపు అన్న ఆరోపణలు సరికాదని.. గత ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడేనాటికే వానాకాలం ముగిసిందని.. కానీ జలాశయాల్లో నీళ్లు లేకపోవడం, పంటలు ఎండిపోవడం విషయంలో తమ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. జీతాల చెల్లింపులో కొంత ఆలస్యం వాస్తవమేనని, దానిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
కాంగ్రెస్లో జూనియర్ని.. నేనెలా సీఎం అవుతా: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్ని.. తాను ఎలా ముఖ్యమంత్రిని అవుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసుకుంటున్నారని అన్నారు. ఆయన గురువారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుంది. తెలంగాణలో 11కు పైగా ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తాం. 3 సీట్లలో పోటాపోటీ ఉంటుంది. బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుంది. బీఆర్ఎస్ 1 లేదా రెండు ఎంపీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో సాగునీటి కొరతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం. కాళేశ్వరం ప్రోజెక్టు 3 పిల్లర్లతో డ్యామేజ్ ఆగదు. మొత్తం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. కాళేశ్వరంలో నీటిని స్టోర్ చేయాలని బీఆర్ఎస్ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రంలో త్రాగునీరు కొరత లేకుండా చూస్తున్నాం. నీటి కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మేము ఇంకా గేట్లు ఎత్తలేదు. గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మా ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది’ అని మంత్రి పొంగులేటి అన్నారు. -
ప్రజాసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
హుజూర్నగర్, పాలకవీడు: ప్రజాసంక్షేమం.. అభి వృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ఫణిగిరి గుట్ట వద్ద రూ.74.80 కోట్లతో 2,160 సింగిల్ బెడ్రూం ఇళ్ల పునర్నిర్మాణ పైలాన్ ఆవిష్కరించారు. రూ.50 లక్ష లతో క్రిస్టియన్ సిమెట్రీ, రూ.కోటితో టౌన్హాల్లో అభివృద్ధి పనులు, రూ.33.83 కోట్లతో పాలకవీడు మండలం బెట్టెతండ గ్రామం వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పనులకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లా డుతూ.. హుజూర్నగర్లో ఉత్తమ్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయ న్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వంలో ధరణి పేరుతో వేలాది కోట్ల ఆస్తులు ఎలా దోచుకుని దాచుకున్నారో..ఆ లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం అభివృద్ధిపై పెట్టలేద ని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లలో అర్హుల ఎంపికకు రాజకీయాలకతీతంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇళ్లు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్షా 12 వేల ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందిస్తామని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభు త్వంలో ఎన్నో లిఫ్ట్లు, రహదారులు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్కార్డులు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లత, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. -
మీ ఇష్టానుసారంగా వస్తారా?
సాక్షి, హైదరాబాద్: సమయపాలన పాటించకుండా..విధులకు మీ ఇష్టానుసారంగా వస్తే ఎలా అంటూ సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో పలు విభాగాలను మంత్రి పొంగులేటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు ఎంత మంది సమయానికి హాజరవుతున్నారో తెలుసుకునేందుకు ఉదయం 11:40 నిమిషాలకు మంత్రి సచివాలయంలోని రెవెన్యూ శాఖకు వెళ్లారు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చిలే కనిపించాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బందిని పిలిచి ఆరా తీశారు. ఎవరైనా సెలవులో ఉన్నారా అని అడిగారు. వారు చెప్పిన జవాబుతో ఆయన సంతృప్తి చెందలేదు. మీరే ఇలా చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? ‘ఉదయం 11: 40 దాటినా ఇంకా 80 శాతం మందికిపైగా ఉద్యోగులు విధుల్లో రాకపోవడం ఏంటని..’ మంత్రి వారిని ప్రశ్నించారు. రిజిస్టర్ తనిఖీ.. పలు విభాగాల పరిశీలన తనిఖీలో భాగంగా ఉద్యోగుల హాజరు పట్టిక తీసుకురావాలని అక్కడే ఉన్న సిబ్బందిని మంత్రి ఆదేశించారు. రిజిస్టర్ పరిశీలించి ఒక్కో సెక్షన్లో ఈ సమయంలో కూడా ముగ్గురు నలుగురే ఉంటే ఎలా అని మండిపడ్డారు. ప్రభుత్వ వారధిగా మీరే సమయానికి రాకపోతే ఎలా? అన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి సమాచారం, అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళతారని నిలదీశారు. రెవెన్యూ విభాగంలోని ఐదు సెక్షన్లలో ఏ సెక్షన్లో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు, సెక్షన్ ఇన్చార్జ్పై చర్యలు తీసుకుంటాం సచివాలయంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సమయానికి విధుల్లోకి రావాలి. ఉద్యోగుల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి రావొద్దు. అనివార్య కారణాలు ఉంటే సెక్షన్ ఇన్చార్జ్కు సమాచారం ఇవ్వాలి. ముందస్తు సమాచారం లేకుండా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఆయా ఉద్యోగులు, సెక్షన్ ఇన్చార్జ్పై చర్యలు తప్పవు. – మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టాం.. : మంత్రి పొంగులేటి
మహబూబ్నగర్: ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ చేసిన అవినీతిని శ్వేతపత్రంలో ఎండగట్టామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో గురువారం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ఎకరాకై నా నీళ్లు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను పట్టించుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరులో చేపట్టిన ప్రాజెక్టులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాల్వల్లో కంప, జమ్ము తొలగించి నీళ్లు పారించి పూలు జల్లి తామే అంతా చేశామని గొప్పలు చెప్పుకొన్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పాలమూరుకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కార్యక్రమానికి వచ్చే ముందు సీఎం రేవంత్రెడ్డిని కలిసి ఏం మాట్లాడాలి అని అడిగితే.. దేవరకద్ర నియోజవర్గంలో 100 పడకల ఆస్పత్రి, మండలానికో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేద్దామని చెప్పారన్నారు. ధరణి పేరుతో రైతుల భూములు లాక్కున్న వారి నుంచి తిరిగి తీసుకుని ప్రజలకు ఇస్తామన్నారు. పాలమూరును కాపాడేందుకే న్యాయయాత్ర.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చల్లా వంశీచందర్రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని కాపాడేందుకు రాహుల్గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ను ఆదర్శంగా తీసుకుని ‘పాలమూరు న్యాయ యాత్ర’ చేపట్టానన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటంబానికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను మభ్యపెట్టారు! రాజాపూర్: తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారు.. ఇప్పుడు అధికారం కోల్పోయి రెండు నెలలు కూడా పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారంలో ఉండి కాలయాపన చేసింది మీరు కాదా అని విమర్శించారు. కృష్ణానది నీటిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదన్నారు. ఇంకా వారే అధికారంలో ఉన్నట్లు భ్రమపడుతూ కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై నెట్టాలని చూడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారన్నారు. సమావేశంలో రంగారెడ్డిగూడ మాజీ సర్పంచ్లు జనంపల్లి శశికళారెడ్డి, దుష్యంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!? -
కృష్ణా జలాలపై కేంద్రానికి పెత్తనం ఇవ్వొద్దు! : తమ్మినేని వీరభద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కృష్ణా, గోదావరి జలాల విషయంలో శాస్త్రీయ పరిష్కారానికి ఆలోచన చేయాలే తప్ప కేంద్రానికి పెత్తనం అప్పగించొద్దని.. అదే జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదో ఒక కొర్రీ సృష్టిస్తూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ కుట్ర అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలిచేసి ఏకపక్ష పరిపాలన కోసమే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై కేంద్రం రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసిందన్నారు. కాగా, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదని తమ్మినేని తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తుండగా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేరకున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడకుండా ఓట్ల కోసం తగువు పడితే తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ శాపనార్థాలు పెట్టడం సరైందికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినా ఉద్యమాలు, హక్కుల విషయాల్లో అణిచివేయడం, ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షాలపై అహంకార పూరితంగా ప్రవర్తించిందని తమ్మినేని చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెకు సీపీఎం మద్దతు తెలుపుతోందన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని వీరభద్రం తెలిపారు. కాగా, పాలేరు పాత కాల్వ కింద 6వేల ఎకరాల్లో వరి, 1,227 ఎకరాల్లో చెరుకు సాగు చేసినందున నీరు విడుదల చేయించే బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్రావు, సాయిబాబా, ఎర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం, బండి రమేష్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: చర్చకు తేవాల్సిన అంశాలెన్నో.. -
నేడు ధరణి పోర్టల్పై మధ్యంతర నివేదిక!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ బుధవారం తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టల్ నిర్వహణ కంపెనీలతో ప్రాథమికంగా జరిపిన చర్చల అనంతరం రూపొందించిన ప్రాథమిక స్థాయి నివేదికను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమర్పించే అవకాశమున్నట్లు సమాచారం. బుధవారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, టీఎస్ఐఐసీతో కమిటీ భేటీ ముగిసిన తర్వాత మంత్రికి నివేదికను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి జిల్లాలకు వెళ్లి క్ష్రేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను తెలుసుకున్న తర్వాత మధ్యంతర నివేదిక ఇవ్వాలని సభ్యులు భావించారు. కానీ ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో బుధవారం నాడే సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికపై కూడా చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ధరణిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్పిన సంగతి తెలిసిందే. -
వినతులు పెండింగ్ ఉండొద్దు! : మంత్రి పొంగులేటి
ఖమ్మం: ప్రజలు విన్నవించే సమస్యలను పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలని రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన రైతులు 110 ఎకరాల్లో వరి విత్తనాలు వేయగా 60 రోజుల్లోనే కంకులు వచ్చి నష్టపోయామని విన్నవించగా విచారణ చేపట్టి కంపెనీపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీఏఓ విజయనిర్మలను ఆదేశించారు. అలాగే, రాజుపేట వద్ద నిర్మించిన చెక్డ్యాంను సాగర్ నీటితో నింపాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రేలా వెంకటరెడ్డి వినతిపత్రం అందజేశారు. అధికారులు విచారణ చేపట్టకుండా ఫ్యామి లీ సర్టిఫికెట్ జారీచేశారని నేలకొండపల్లి మండలం నాచేపల్లికి చెందిన మల్లెల వెంకటాచారి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టాలని సూచించారు. ఆతర్వాత మంత్రి మాట్లాడుతూ రాజుపేటలోని ఖబరస్తాన్కు ప్రహరీ నిర్మించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ భూముల కబ్జాపై సర్వే చేయాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా తీర్థాల, కూసుమంచి ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. తొలుత మంత్రి పొంగులేటి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులతో పాటు విద్యుత్ శాఖ నుండి మంజూరైన బీమా చెక్కులను అందజేశారు. అనంతరం కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన విద్యార్థి జర్పుల సింధు రోడ్డు ప్రమాదంలో గాయపడిన కోమాలోకి వెళ్లగా మంత్రి పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటల వైద్యసేవలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వైద్యం అందేలా తమ ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి లో హోమియో ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం లింగారంతండాలో జీపీ భవనం, పలుచోట్ల రహదారి నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీఓ గణేష్, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి శ్రీరాం, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సులోచన, మత్స్యశాఖ ఏడీ ఆంజనేయస్వామితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వాణిశ్రీ, డాక్టర్ రాములు, ఉమామహేశ్వరరావు, బానోత్ శ్రీనివాస్నాయక్, మోహ న్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు మాదాసు ఉపేందర్, జూకూరి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచిలో రహదారి పక్కన ఉన్న ఓ టీ స్టాల్ వద్ద కాన్వాయ్ నిలిపిన మంత్రి టీ తాగాక నిర్వాహకుడు అనిల్తో మాట్లాడి వ్యాపారంపై ఆరా తీశారు. తమ్మినేని కృష్ణయ్యకు నివాళి.. మండలంలోని తెల్దారుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం గతంలో హత్యకు గురైన నాయకుడు తమ్మినేని కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు రాయల నాగేశ్వరరావు, తమ్మినేని నవీన్, తమ్మినేని మంగతాయారు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్ సై! ఖమ్మం స్థానంపై ప్రత్యేక దృష్టి.. -
భావోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
-
ఆ రోజు కన్నీళ్లు కార్చాను.. మంత్రి పొంగులేటి ఎమోషనల్
సాక్షి, ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారని, నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. ఖమ్మం నగరంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సత్కారంలో మంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ కుటుంబం చెప్పిందే వేదం.. గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది. మా ప్రభుత్వంలో ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి ఎమోషనల్.. నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చానని.. ఆ రోజు అభిమానులు బాధపడతారని వారి ఎదుట ఎమోషనల్ కాలేదని.. మంత్రి పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు. ఇదీ చదవండి: ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్.. ఎంపీ రేసులో మంత్రి సతీమణి? -
పరిపాలనలో ‘రెవెన్యూ’ కీలకం
కుత్బుల్లాపూర్: రెవెన్యూ శాఖ పరిపాలనలో కీలకమని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తీరు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం కొంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్విసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వం ఆ శాఖను నిర్విర్యం చేసిందని, భూరికార్డులను ధరణి పేరుతో అస్తవ్యస్తంగా నిర్వహించడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖను పటిష్టపరిచి రైతులకు న్యాయం చేస్తామని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రవీందర్రెడ్డి మాట్లాడారు. ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ స్థాయిలో సేవలకు ఆటంకం కలగకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరారు. కార్యక్రమానికి సుమారు 5వేలకు పైగా రెవెన్యూ ఉద్యోగులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
అర్హుల గుర్తింపునకు 'ఇంటింటి సర్వే'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే నిర్వహిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, ఆరు గ్యారంటీలను వందరోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ప్రజాపాలన దరఖాస్తులు..తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయ మీడియా సెంటర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడు తూ కోటి ఐదు లక్షల దరఖాస్తులు ఆరు గ్యారంటీలకు రాగా, మరో 20 లక్షల దరఖాస్తులు రేషన్కార్డులు, ఉద్యోగాలు, భూసమస్యలపైనా వచ్చాయన్నారు. 30వేల మందికిపైగా ఆపరేటర్లతో యుద్ధప్రాతిపదికన డేటాఎంట్రీ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 13 నుంచి 14 శాతం వరకు ఎంట్రీ పూర్తయ్యిందని, మొత్తం పూర్తిచేసేందుకు ఈనెల 25 నుంచి 30వతేదీ వరకు సమయం పడుతుందని, ఆలోపు పూర్తి సమాచారం కంప్యూటరీకరిస్తామన్నారు. ఆధార్కార్డు, రేషన్కార్డులను లింకప్ చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ హామీలన్నీ అందిస్తామని చెప్పారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత అర్హులందరి లిస్ట్ గ్రామాల వారీగా వెల్లడిస్తామన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి అధికారులు వెళ్లి వివరాలు మరోసారి పరిశీలిస్తారని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 40 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గతంలో తామెప్పుడూ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్రెడ్డి, భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, మల్లిఖార్జున ఖర్గే, రాహూల్గాందీ, ప్రియాంకగాందీలు సైతం ఎక్కడా ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చి మంగళవారానికి నెలరోజులు అవుతుందని, ఈలోపే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులు కూడా కాకముందే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. విమర్శలు చేసే ముందు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. గత ప్రభుత్వ తప్పులను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రతిపక్షాలు, మీడియా సైతం ఓపిక పట్టాలని కోరారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘంలో విధివిధానాలపై చర్చిస్తామన్నారు. వీటన్నింటిపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేయని అర్హులైనవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాపాలన వెబ్సైట్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కమిటీలో ఎవరంటే.. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ సబ్కమిటీని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ సబ్కమిటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు తాను సభ్యుడిగా ఉన్నానని పొంగులేటి చెప్పారు. ఈ కమిటీ ఆరు గ్యారంటీల అమలుపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని తెలిపారు. రేషన్కార్డులపైనా త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుతం 89 లక్షల రేషన్కార్డులు ఉన్నాయని, కార్డులు లేనివారి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈనెల 6వ తేదీ నుంచి అధికారులంతా ఓటర్లిస్ట్ ప్రక్రియలో ఉన్నారని, అయినా ఆరు గ్యారంటీల అమలు ప్రక్రియలో భాగంగా డేటాఎంట్రీ కొనసాగుతుందన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచి్చన భూములకు సంబంధించిన జీఓలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. -
TS: ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలన దరఖాస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టిని నియమించారు. కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియమించారు. తెలంగాణ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజా పాలన నోడల్ అధికారులు హాజరయ్యారు. డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీకి ఈ నెల చివరి వరకు సమయం కావాలని అధికారులు కోరారు. కోటి అయిదు లక్షల దరఖాస్తు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలన-అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరిగిందని, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలనలో కోటి అయిదు లక్షల అభయహస్తం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇతర రేషన్ కార్డు, భూములు తదిరల అంశాల నుంచి 20 లక్షలు వచ్చాయన్నారు. డేటా ఎంట్రీ తరువాత కేబినెట్, అలాగే సబ్ కమిటీలో చర్చలు జరిపి విధివిధానాలు అర్హులను ప్రకటిస్తామన్నారు. అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు. ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందన్నారు. కారు కూతలు కూస్తే ఊరుకోం ఈ నెల 25వ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. ధరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ లింక్ చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు 40 రోజుల్లో హామీలు అమలు చేయడం లేదని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 40 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తామెక్కడ చెప్పలేదని, వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పామని అన్నారు. ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎవరెన్నీ విమర్శలు చేసినా, మేం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన మాట అమలు చేస్తామని తెలిపారు. -
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను ఆర్థికంగా కొల్లగొట్టారు: పొంగులేటి
సాక్షి, పాలేరు: ప్రజా సేవకులుగా ఉన్నాం.. ప్రజల కష్టాలు తీరుస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పాలేరు నియోజకవర్గంలో పలు ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు దారులతో మాట్లాడి ప్రజాపాలన కార్యక్రమం పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పామని కేబినెట్ మీటింగ్లో తొలి సంతకం ఆరు గ్యారెంటీలపైనే చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన రెండు అంశాలు ప్రారంభించామన్నారు. నిబద్ధతతో పనిచేసి ప్రతీ హామీని నెరువేరుస్తామన్నారు. ప్రజా సమస్యలు తీర్చేందుకే ఈ ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణను ఆర్ధికంగా ఎంతో కొల్లగొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో ప్రతి పక్ష నాయకుల ముందే చర్చ పెట్టామన్నారు. అధికారం ఉంది కదా అని సంతకం పెట్టి అప్పులు చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సొమ్ముతో పెద్ద ఇల్లు కట్టాడని మంత్రి విమర్శించారు. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో ‘కమలం’ కొత్త ఆశలు -
భూముల సర్వేకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములను సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, సర్వేకు సంబంధించిన ప్ర తిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆ దేశించారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భూముల సర్వేలను పరిశీలించండి. అత్యాధునిక పరిజ్ఞానంతో సర్వే ఎలా చేయాలన్న దాని పై నివేదిక తయారు చేయండి’అని నిర్దేశించా రు. బుధవారం సచివాలయంలో భూపరిపాల న, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. భూపరిపాలన, సర్వే విభాగాల అధికారులతో సమీక్ష సందర్భంగా భూముల సర్వే అంశం చర్చకొచ్చింది. ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్లో సర్వేలు జరుగుతున్నాయని, ఏపీలో జరుగుతున్న సర్వే మోడల్ సర్వేగా ఉపయోగపడుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన పొంగులేటి.. ఏపీలో ఏం జరుగుతోందో పరిశీలించడంతోపాటు మంచి, చెడులను విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. భూముల క్రమబద్దీకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రెవెన్యూ రికార్డుల్లో దాపరికం ఉండకూడదని చెప్పారు. వీఆర్ఏలకు త్వరలోనే ఐడీ కార్డులు, వేతనాలివ్వాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షల్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీసీఎల్ఏ, సర్వే–ల్యాండ్ సెటిల్మెంట్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయమెందుకు తగ్గింది? రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ వృద్ధి గతంతో పోలిస్తే సహేతుకంగా లేదని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. దీనికి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పందిస్తూ గతంలో పంచాయతీల లేఅవుట్లను కూడా రిజిస్ట్రేషన్ చేసేవారమని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవి పెండింగ్లో పడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు తెచ్చిన సవరణలు ఇబ్బందికరంగా మారాయని, ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు . దీనిపై స్పందించిన పొంగులేటి.. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతోనూ తాను మాట్లాడతానని, సుప్రీం తీర్పు ఉల్లంఘన జరగకుండా ఎల్ఆర్ఎస్ విషయంలో ఏం చేయాలో నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. -
250 గజాల స్థలం.. వడ్డీలేని రుణం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కొక్కరికి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందజేస్తామని ప్రకటించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల్లోని బొగ్గు గనుల వద్ద జరిగిన సభల్లో మాట్లాడారు. సింగరేణి డే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తామని, మహిళా ఉద్యోగులకు అండర్ గ్రౌండ్లో కాకుండా సర్ఫేస్ విధులు కేటాయించేలా ఆధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఏరియాలో రాంపూర్ భూగర్భ గని, వీకే– 7తో పాటు మరో ఓసీ ఏర్పాటుకు కృషి చేస్తామని, గత ప్రభుత్వ నిర్వాకంతో తగ్గిన కార్మికుల సంఖ్యను గణనీయంగా పెంచుతామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మెడికల్ ఇన్వాలిడిటేషన్ కోసం కార్మికులు రూ.6 నుంచి రూ.8 లక్షలు వెచ్చించాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అర్హులందరికీ అవకాశం కలి్పస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి అందరి నాయకుడని, కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు కార్మికుల ఓట్లతో గెలుపొందిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్గాంధీ ప్రధానమంత్రి కాగానే, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూని గెలిపించాలని పొంగులేటి కోరారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు. -
పొంగులేటి మార్క్ పాలిటిక్స్.. ఖమ్మంలో ఎంపీ సీటు ఖరారు?
అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ తీవ్రంగా ఉంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే సీటే దక్కుతోంది. ఈసారి ఒక్కటి మినహా మిగిలిన అసెంబ్లీ సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో ఖమ్మం ఎంపీ సీటు కోసం డిమాండ్ బాగా పెరిగింది. మరి కాంగ్రెస్ గ్యారెంటీగా గెలుస్తామంటున్న ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్న నేతలెవరు?.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో సీపీఐ పోత్తుల్లో భాగంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే అత్యధికంగా ముగ్గురు మంత్రులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మెజార్టీ స్థానాలు రావడంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ తరువాతి టార్గెట్ లోకసభ ఎన్నికలే. తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఒక ఎత్తైయితే కీలకమైన లోకసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించడం కూడా అంతే కీలకం. దీంతో అభ్యర్థుల వేటలో కూడికలు తీసివేతలు ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో అప్పుడే పోరు మొదలైంది. జిల్లాలోనే కీలక నేతగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ప్రసాద్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ మోజార్టీ రావడం వెనుక ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకమనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినందున లోక్సభ ఎన్నికల్లో సీటు కోసం ప్రసాద్రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా ప్రసాద్ రెడ్డికి ఉందని అంటున్నారు. పైగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ కేంద్రమంత్రి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రేణుకా చౌదరి సైతం ఎంపీ టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం భరోసా ఇచ్చిందని ఆమె చెప్పుకుంటున్నారట. ఇప్పటికే తన టిక్కెట్ విషయంపై రేణుకా చౌదరి చెప్పాల్సిన వారికి చెప్పుకున్నారట. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోకసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే, ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే పోటీ ఉండనుంది. అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్లో టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. -
పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ.. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, ముఖ్య నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యాన అన్ని స్థానాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల బాధ్యతను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను సికింద్రాబాద్, హైదరాబాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్లుగా నియమించారు. సీఎం రేవంత్రెడ్డి తర్వాత జిల్లాకు చెందిన భట్టి, పొంగులేటికి రెండేసి పార్లమెంట్ స్థానాల బాధ్యతలు కట్టబెట్టడం విశేషం.' రాజకీయంగా సీనియర్ నాయకులు, మంత్రులైన భట్టి, తుమ్మలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చి రాజధానిలోని పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. సామాజిక సమీకరణలు, గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని భట్టిని సికింద్రాబాద్, హైదరాబాద్, తమ్మలను మల్కాజ్గిరి ఇన్చార్జిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భట్టి హైదరాబాద్లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యాన జోష్లో ఉన్న పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు సై అంటున్నాయి. పొంగులేటికి కీలకంగా.. ఖమ్మం పార్లమెంట్ స్థానం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో విస్తరించి ఉండగా, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు స్థానాల ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి కొనసాగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా మహబాబాబాద్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి వెళ్లిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే తమ లక్ష్యమని చెప్పగా.. భద్రాచలం మినహా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించాయి. ఈ మేరకు భట్టి, తుమ్మలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పొంగులేటిని అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించినట్లు రెండు పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో స్పష్టమవుతోంది. ఈ రెండింటి పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, భద్రాచలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ దక్కించుకోగా.. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. దీంతో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో పొంగులేటికి ఉన్న పరిచయాలు, పార్టీ కేడర్, కుటుంబ బంధుత్వం లోక్సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల విజయానికి కలిసొస్తుందన్న భావనతో ఆయనకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. కాగా, ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబాబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవి కూడా చదవండి: ‘పార్లమెంట్’పై కాంగ్రెస్ 0గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా.. -
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రోడ్లు భవనాల శాఖలోకి మారిన గృహ నిర్మాణ శాఖ విభాగాలను పునరుద్ధరించనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను ఆ విభాగాన్ని పునరుద్ధరిస్తూ, చాలినంత సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై సమకూర్చుకోనున్నట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు, నాలుగు నమూనాలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి గృహనిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, గృహనిర్మాణ మండలి అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున, వాటి నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభిస్తామని పొంగులేటి చెప్పారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్షించనున్నారని, ఈ సందర్భంగా విధి విధానాలపై స్పష్టత ఇవ్వనున్నారని తెలిపారు. రాజీవ్ స్వగృహ ఇళ్ల విక్రయాల కోసం మార్కెటింగ్ నిపుణులను నియమించండి కొనుగోళ్లు కాకుండా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను విక్రయించేందుకు వీలుగా మార్కెటింగ్ చేయాల్సి ఉందని, ఇందుకు నిపుణులను నియమించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ సముదాయాలను ఏ ధరకు విక్రయించాలన్న విషయంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. వాటి ద్వారా సమకూరే మొత్తాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదు: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఖమ్మం పాత బస్టాండ్లో మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత టికెట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేస్తాం, సంపాదను సృష్టిస్తాం, సంపాదను ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. మహిళలు ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం అమలు చెయ్యలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకోచ్చని, ఎలాంటి నిర్భందాలు ఉండవని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాలల్లో ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు ఆఫీస్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులు ప్రజల ఇంటికి వచ్చి పనులు చేస్తారని తెలిపారు. రెవేన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇప్పుడు రెండు పధకాలను అమలు చేశామని తెలిపారు. మహిళ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. వ్యవసాయం ,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న మీ ఋణం తీర్చుకోలేమని అన్నారు. తన రాజకీయ జీవితం 40 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం కల్పించారని అన్నారు. గతంలో కొందరు పనికిరాని వ్యక్తుల వలన తప్పులు జరిగాయని మండిపడ్డారు. -
ఖమ్మం జిల్లాలో భట్టి, పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం
-
ఇదీ తెలంగాణ మంత్రుల బయోడేటా
జూపల్లి కృష్ణారావు పుట్టిన తేదీ: ఆగస్టు 10, 1955 స్వస్థలం: పెద్దదగడ, చిన్నంబావి మండలం (వనపర్తి జిల్లా) విద్యార్హత: బీఏ తల్లిదండ్రులు: జూపల్లి రత్నమ్మ – శేషగిరిరావు భార్య, పిల్లలు: జె.సుజన, వరుణ్, అరుణ్ రాజకీయ నేపథ్యం: బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే: కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1999 (కాంగ్రెస్), 2004 (స్వతంత్ర), 2009 (కాంగ్రెస్), 2012 ఉపఎన్నిక, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి: 2009 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినెట్లలో ఆహార, పౌరసరఫరాలు, తూనికలు – కొలతలు, వినిమయ వ్యవహారాల శాఖల మంత్రిగా, ఆ తర్వాత నల్లారి కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, ధర్మాదాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో కేసీఆర్ కేబినెట్లో తొలుత ఐటీ, పరిశ్రమలు, ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కొండా సురేఖ పుట్టిన తేదీ: 19 ఆగస్టు 1965 స్వస్థలం: వంచనగిరి, గీసు కొండ మండలం (వరంగల్ జిల్లా) విద్యార్హత: బీకాం తల్లిదండ్రులు: తుమ్మ రా«ద – చంద్రమౌళి భర్త: కొండా మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్సీ కూతురు: సుష్మితాపటేల్ రాజకీయ నేపథ్యం: 1995లో వంచనగిరి ఎంపీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించి గీసుకొండ ఎంపీపీ నుంచి మంత్రి దాకా ఆమె ప్రస్థానం కొనసాగింది. ఎమ్మెల్యే: శాయంపేట సెగ్మెంట్ నుంచి 1999, 2004 (కాంగ్రెస్), పరకాల నుంచి 2009 (కాంగ్రెస్), వరంగల్ తూర్పు నుంచి 2014 (టీఆర్ఎస్), 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి: 2009 వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో శిశు మహిళా సంక్షేమ అభివృద్ధిశాఖ మంత్రి. పార్టీ పదవులు: పీసీసీ సభ్యురాలు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారి, ఏఐసీసీ సభ్యురాలు. కెప్టెన్ నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పుట్టిన తేదీ: జూన్ 20, 1962 స్వస్థలం: తాటిపాముల, తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా) విద్యార్హత: నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. (సీనియర్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్నారు) తల్లిదండ్రులు: ఉషాదేవి– పురుషోత్తంరెడ్డి భార్య: పద్మావతి (కోదాడ ఎమ్మెల్యే) రాజకీయ నేపథ్యం: రాష్ట్రపతి భవన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే: 1999, 2004లో కోదాడ నుంచి, 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు మంత్రి: ఉమ్మడి ఏపీలో కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎంపీ: 2019 లోక్సభఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎన్నిక పార్టీ పదవులు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన తేదీ: మే 20, 1953, స్వస్థలం: గండుగులపల్లి, దమ్మపేట మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) తల్లిదండ్రులు: మాణిక్యమ్మ– లక్ష్మయ్య, విద్యాభ్యాసం: బీకాం భార్య: భ్రమరాంబ, కుమారుడు యుగంధర్, కుమార్తెలు డాక్టర్ జగన్మోహిని, చంద్రిక రాజకీయ నేపథ్యం: టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజాగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఏపీలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్అండ్బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యే: 1985, 1994, 1999 (సత్తుపల్లి), 2009 (ఖమ్మం), 2016 (పాలేరు), 2023 (ఖమ్మం) మంత్రి: ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, కేసీఆర్ కేబినెట్లలో ఎమ్మెల్సీ: టీఆర్ఎస్ నుంచి 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ధనసరి అనసూయ (సీతక్క) పుట్టిన తేదీ: జూలై 9, 1971 స్వస్థలం: జగన్నపేట, ములుగు మండలం (ములుగు జిల్లా) విద్యార్హత : ఎల్ఎల్బీ, ఆదివాసీల జీవనం – సంప్రదాయాలు – నైపుణ్యంపై పరిశోధన చేసి ఉస్మానియూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తల్లిదండ్రులు: సమ్మక్క–సారయ్య, భర్త, పిల్లలు: రామన్న, సూర్య (కుమారుడు) రాజకీయ నేపథ్యం: 10వ తరగతి పూర్తయ్యాక 1988లో విప్లవోద్యమంలో చేరిక. సీపీఐ (ఎంఎల్) జనశక్తిలో చేరిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి దళ లీడర్గా ప్రధాన భూమిక. 1997లో సాధారణ క్షమాభిక్ష పథకం కింద పోలీసులకు లొంగిపోయారు. 2001లో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే: ములుగు అసెంబ్లీ సెగ్మెంట్కు 2009 (టీడీపీ), 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే. పార్టీ పదవులు: తెలుగు మహిళా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రస్తుతం ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన తేదీ: అక్టోబర్ 28, 1965, స్వస్థలం: నారాయణపురం, కల్లూరు మండలం(ఖమ్మం జిల్లా) తల్లిదండ్రులు: స్వరాజ్యం– రాఘవరెడ్డి, విద్యాభ్యాసం: బీఏ భార్య: మాధురి, కుమారుడు హర్షారెడ్డి, కుమార్తె సప్నిరెడ్డి రాజకీయ నేపథ్యం: 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2014లో ఖమ్మం లోక్సభ స్థానంలో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2016 బీఆర్ఎస్లో చేరిన ఆయన 2014 సెప్టెంబర్ 1 నుంచి 2019 వరకు రవాణా, పర్యాటక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జూలై 2న రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరి, ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్గా నియమితులయ్యారు. ఎంపీ: 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యే: 2023 పాలేరు సెగ్మెంట్కు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సీలారపు దామోదర రాజనర్సింహ పుట్టిన తేదీ: డిసెంబర్ 5, 1958 స్వస్థలం: జోగిపేట (సంగారెడ్డి జిల్లా) విద్యార్హత: ఇంజనీరింగ్ తల్లిదండ్రులు: జానాబాయి– రాజనర్సింహ (మాజీ మంత్రి) భార్య, కూతురు: పద్మిని, త్రిష రాజకీయ నేపథ్యం: వారసత్వంగా రాజకీయాల్లో వచ్చారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఎమ్మెల్యే: అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 1989, 2004, 2009, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి: 2006 వైఎస్ రాజశేఖర్రెడ్డి కేబినెట్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ పనిచేశారు. 2010–2014 వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. పార్టీ పదవులు: సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ పుట్టిన తేదీ: డిసెంబర్ 9, 1967 స్వస్థలం: కరీంనగర్ విద్యార్హత: ఎంఏ, ఎల్ఎల్బీ తల్లిదండ్రులు: మల్లమ్మ–సత్తయ్యగౌడ్ భార్య, పిల్లలు: మంజుల, పృథ్వీ, ప్రణవ్ రాజకీయ నేపథ్యం: ఎస్ఆర్ఆర్ కాలేజీకి కాంగ్రెస్ అనుబంధ విభాగమైన ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2005–09 మధ్యకాలంలో మార్క్ఫెడ్ చైర్మన్ పనిచేశారు. ఎంపీ: 2009 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఎమ్మెల్యే: 2023 ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ పదవులు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పుట్టినతేదీ: మే, 23 1965 స్వస్థలం: బ్రాహ్మణవెల్లెంల, నార్కట్పల్లి మండలం (నల్లగొండ జిల్లా) విద్యార్హత: ఇంజనీరింగ్ (సివిల్) తల్లిదండ్రులు: సుశీలమ్మ–పాపిరెడ్డి భార్య, పిల్లలు: భార్య సబిత, కూతురు శ్రీనిధిరెడ్డి, కుమారుడు ప్రతీక్రెడ్డి (కుమారుడు 2011లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు) రాజకీయ నేపథ్యం: 1986–1993 వరకు ఎస్ఎస్యూఐ నల్లగొండ జిల్లా ఇన్చార్జ్గా, 1993– 1998 వరకు యువజన కాంగ్రెస్ రాష్ట్రనేతగా పనిచేశారు. ఎమ్మెల్యే: నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి: వైఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లో. ఎంపీ: 2019 లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. దుద్దిళ్ల శ్రీధర్బాబు పుట్టిన తేదీ: జూన్ 6, 1969 స్వస్థలం: మంథని (పెద్దపల్లి జిల్లా) విద్యార్హత: ఢిల్లీ యూనివ ర్సిటీ నుంచి న్యాయశాస్త్రం, హెచ్సీయూ నుంచి పొలిటికల్ సైన్స్లో పీజీ తల్లిదండ్రులు : జయశ్రీ – దుద్దిళ్ల శ్రీపాదరావు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్) భార్య, పిల్లలు: శైలజ రామయ్యర్ (సీనియర్ ఐఏఎస్), ఆదిత శ్రీపాద, అనిరుధ్ శ్రీపాద రాజకీయ నేపథ్యం: దుద్దిళ్ల శ్రీపాదరావును నక్సలైట్లు హత్య చేయడంతో ఆకస్మికంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యే: మంథని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. విప్: ఉమ్మడి ఏపీలో 2004–2009 వరకు మంత్రి: 2009–14లో వైఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లలో ఉన్నత విద్యా శాఖ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. పార్టీ పదవులు: ఏఐసీసీ సెక్రటరీ మల్లు భట్టి విక్రమార్క పుట్టిన తేదీ: జూన్ 15, 1961 స్వస్థలం: స్నానాల లక్ష్మీపురం, వైరా, ఖమ్మం జిల్లా. విద్యార్హత: ఎంఏ తల్లిదండ్రులు: మాణిక్యమ్మ – అఖిలాండ భార్య, పిల్లలు: నందిని, కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య రాజకీయ నేపథ్యం: మధిర సెగ్మెంట్ నుంచి 2009 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన సోదరులైన మల్లు అనంతరాములు, మల్లు రవిలు నాగర్కర్నూల్ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అనంతరాములు పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీ: ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 2007లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఎమ్మెల్యే: మధిర నుంచి 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా గెలిచారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్: 2009 నుంచి 2011 ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్: 2011 నుంచి 2014 వరకు సీఎల్పీ నేత: 2019 నుంచి 2023 పార్టీ పదవులు: పీసీసీ కార్యదర్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ -
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో త్రిమూర్తులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా... ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఉమ్మడి జిల్లా రాజకీయ చరిత్రలో ముగ్గురికి అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తర్వాత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఆరో వరుసలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పదో వరుసలో తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో భట్టి, తుమ్మల దైవసాక్షిగా, పొంగులేటి పవిత్ర హృదయంతో ప్రమాణ స్వీకారం చేశారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం భట్టికి ఉన్నత పదవి అంతా అనుకున్నట్లే భట్టికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవి లభించింది. సీఎం పదవి కోసం భట్టి పోటీ పడినా.. చివరకు అధిష్టానం ఆయనను డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తపరిచింది. జలగం వెంగళరావు తర్వాత ఉమ్మడి జిల్లాకు దక్కిన అత్యున్నత పదవి ఇదే. రేవంత్రెడ్డి తర్వాత అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో ప్రస్తుతం భ ట్టి కీలక నేతగా వ్యవహరించనున్నారు. గత ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో భట్టి నేతృత్వాన ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయని అనుచర నేతలు పేర్కొంటున్నారు. వైఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన భట్టి 2009 నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ప్రజలకు శీనన్నగా.. మాజీ ఎంపీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అతి తక్కువ కాలంలోనే మాస్ లీడర్గా ఎదిగి.. రాజకీయాలను శాసించే స్థాయి పొందారు. తొలుత కాంట్రాక్టర్గా పనిచేసిన పొంగులేటి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో 2013 ఫిబ్రవరి 23న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పొంగులేటి అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆయనతోపాటు పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, పొత్తులో భాగంగా భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలుపునకు కృషి చేశారు. పాలేరు ఉప ఎన్నికల సమయాన 2016 మే 3న బీఆర్ఎస్లో చేరిన పొంగులేటి ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు. తిరుగుబాటు చేసి.. ఏడేళ్లపాటు బీఆర్ఎస్లో కొనసాగిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. కేంద్ర రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీలో తనకు సముచిత స్ధానం దక్కలేదనే కారణంతో ఈ ఏడాది జనవరి 1న పార్టీపై తిరుగుబాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుండడంతో ఆయనను ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. అనంతరం జూలైలో ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షాన కాంగ్రెస్లో చేరిన పొంగులేటిని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్గా నియమించింది. ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ పేరిట ప్రచారం నిర్వహించడమేకాక ఉమ్మడి జిల్లాలో గడపగడపకు కాంగ్రెస్ను తీసుకెళ్లారు. తొలిసా రి ఎమ్మెల్యేగా తాజా ఎన్నికల్లో పాలేరు నుంచి గెలి చిన ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు. సముచిత గౌరవం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంలో అంతా తామై వ్యవహరించిన ముగ్గురు నేతలకు సముచిత గౌరవం దక్కింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ సత్తా చాటినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్కు అధిక స్థానాలు దక్కాయి. ఈసారి కూడా మెజార్టీ స్థానాలు దక్కడంలో భట్టి, పొంగులేటి, తుమ్మల కృషి ఉంది. వీరు తమ నియోజకవర్గాలే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తూ నాయకులను సమన్వయపరిచారు. దీంతో కార్యకర్తలు, నేతలు ఒకతాటిపైకి చేరగా కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. దీంతో ఈ ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం దక్కగా.. హైదరాబాద్లో జరిగిన ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా నుంచి అనుచర నేతలు భారీగా తరలివెళ్లారు. మూడు ప్రభుత్వాల్లో మంత్రి జిల్లా రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల ప్రస్థానం కలిగిన నేత తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం, బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రివర్గంలోనూ స్థానం దక్కడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి. 1985, 1995, 1996, 1999, 2001 ఏడాదిలో టీడీపీ హయాంలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్అండ్బీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014లో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన సమయాన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2018లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్పై ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. -
10 గెలిపిస్తానని నన్ను చెప్పమన్నది వాళ్లే..
-
‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’ అన్నట్లుగా ఎన్నికల ఫలితాల్లో పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరు కనిపించింది. జిల్లాలో తిరుగులేని మాస్ లీడర్గా ఉన్న ఆయన మరోసారి తన చరిష్మా చూపించారు. బీఆర్ఎస్పై తిరుగుబాటుతో.. వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యత లభించక ఈ ఏడాది ఆరంభంలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ ఆయన విసిరిన సవాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ను వీడిన తర్వాత పొంగులేటి రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యాన బీజేపీలోకి వెళ్లాలని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ రాజకీయంగా ఓసారి దెబ్బతిన్న ఆయన తొందరపాటు నిర్ణయాలకు పోకుండా ఆచితూచి అన్ని అంశాలు బేరీజు వేసుకుని కాంగ్రెస్లో చేరారు. తగ్గేదే లే... కాంగ్రెస్లో చేరే సమయంలో పదింట ఎనిమిది సీట్లు పొంగులేటి వర్గీయులకే ఇస్తారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. కమ్యూనిస్టుల కోసం కొత్తగూడెం సీటు వదులుకోవాల్సి వచ్చింది. పాలేరు, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట సీట్లు పొంగులేటి వర్గానికి దక్కాయి. గత అనుభవాలు నేర్పిన పాఠంతో ఓర్పుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. ఓవైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే తన అనుయాయుల గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థుల గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు పొంగులేటి ఎంట్రీ ఇచ్చేవరకు కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆశించిన స్థాయిలో సఖ్యత కనిపించలేదు. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి రాకతో పరిస్థితి మారిపోయింది. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారు. క్రాస్ ఓటింగ్కు అవకాశమే లేకుండా జాగ్రత్త పడ్డారు. వెరసి నాలుగు స్థానాల్లో విజయఢంకా మోగించడమే కాదు మెజార్టీలోనూ దుమ్ము రేపారు. -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు: పొంగులేటి
-
కాళేశ్వరం కుంగిపోతే కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు: పొంగులేటి
-
పొంగులేటి నివాసం నుంచి కీలక పత్రాలు స్వాధీనం?
సాక్షి, హైదరాబాద్: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆదాయపన్నుల విభాగం(ఐటీ) సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం అధికారులు తమ వెంట కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. శుక్రవారం జూబ్లీహిల్స్లోని పొంగులేటి నివాసంలో రెండు బృందాలుగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నివాసంలోని ఓ రూంలో అధికారులు చాలాసేపు ఉన్నారు. ఆఖర్లో ఆ గది నుంచి మూడు బ్యాగులు, బ్రీఫ్ కేసు, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లు తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న రాఘవా ప్రైడ్ ఆఫీస్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం నుంచి ఖమ్మంలోని పొంగులేటి నివాసం, ఆయనకు చెందిన కంపెనీలు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, లాంకోహిల్స్, రాయదుర్గం, బషీర్బాగ్ ప్రాంతాలతోపాటు ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, పాలేరు, స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో ఈ సోదాలు జరిగాయి. కాంగ్రెస్ ఈ ఐటీ రైడ్స్ను ప్రతీకార రాజకీయ చర్యగా అభివర్ణించింది. తాను నామినేషన్ వేసిన సమయంలోనే ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, అధికారులు తమల్ని ఇబ్బందిపెట్టారంటూ సోదాలు ముగిసిన అనంతరం పొంగులేటి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సమాచారం. -
జాగ్రత్త బిడ్డ..అధికారులకు పొంగులేటి వార్నింగ్
-
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు
-
ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్
-
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: పొంగులేటి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐటీ దాడులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొంగులేటి అనుచరుడు ఉపేందర్ ఆయన ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, ఉదయం 5 గంటల నుండి పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటికి మద్దతుగా అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పొంగులేటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయంటూ నిరసన తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇవాళ నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కనుసైగల్లో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని ప్రకటించాను. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రుల 30 మంది ఇళ్లపై 400మంది అధికారులు దాడులు చేస్తున్నారు. నారాయణపురంలోని మా తల్లి ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. కనీసం లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారు. నా దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు, బంధువులపై మాన్ హ్యండలింగ్ చేశారు. నా భార్యను, కుమారుడిని వాళ్ల ఆఫీస్కి తీసుకెళ్లారు. నన్ను ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపై సోదాలు ఎందుకు జరగట్లేదు?. ఈ పరిణామాలను ప్రజలంతా గమనించాలి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆర్ఎస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. చదవండి: ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం -
నన్ను జైలుకు పంపుతారా?.. ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్
సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూరల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. శ్రీనివాసరెడ్డి నామినేషన్కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. తన నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందించారు. శ్రీనివాస్రెడ్డి నామినేషన్ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను దూరంగా పంపించడంతో పోలీసులు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, నామినేషన్ దాఖలు అనంతరం సాక్షి టీవీతో మాట్లాడిన పొంగులేటి.. తన ఇంటిపై జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందించారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రులు 32 ఇళ్లపై 400 మంది అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు’’ అని తెలిపారు. నామినేషన్ వేస్తానని తెలిసి ఐటీ అధికారులు వచ్చారు. నన్ను నామినేషన్ వేయడానికి వెళ్లకూడదన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న 10వేల మంది కార్యకర్తలు, నాయకులు నా ఇంటికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందని రాష్ట్రంలోని ఆపద్ధర్మ, కేంద్ర ప్రభుత్వాలు భయపడ్డాయి. అందుకే నాకు నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆరెస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం. ఏ వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా నామినేషన్ వేయవచ్చు. ఐటీ అధికారులకు సహకరిస్తాను. నియోజకవర్గంలో పర్యటిస్తాను. నా ఆస్తులను సీజ్ చేస్తారా? నన్ను జైలుకు పంపుతారా.? నన్ను ఏం చేసినా వెనుకడుగు వేయను. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది’’ అని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
-
ఐటీ దాడులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. తనను ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుల వద్ద ఉన్నాయి. వారిపై దాడులు చేయకుండా.. నాపై, కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. నాపై ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. తనను విమర్శించే వారిని వేధించడం కేసీఆర్కు అలవాటే. . బీఆర్ఎస్ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే తనిఖీలు ఎందుకు చేయడంలేదు. ఐటీ దాడులు ఊహించినవే. కాంగ్రెస్ నేతలే టార్గెట్ ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలపైనే దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. అర చేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. రేవంత్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఐటీ దాడులపై రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని… — Revanth Reddy (@revanth_anumula) November 9, 2023 మరోవైపు.. ఖమ్మం, హైదరాబాద్లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఎనిమిదికిపైగా వాహనాల్లో ఐటీ అధికారులు ఖమ్మం చేరుకుని పొంగులేటీ ఆఫీస్, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అధికారులకు పొంగులేటి సహకరిస్తున్నట్టు సమాచారం. దీంతో, పొంగలేటి అనుచరులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్
-
పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు
-
పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత పొంగులేటికి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే ఎనిమిది వాహనాల్లో ఐటీ అధికారులు వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. ఖమ్మంలోని ఆయన ఇంట్లో, పాలేరులోని క్యాంపు ఆఫీసులు దాడులు తనిఖీలు జరుపుతున్నారు. ఇక, త్వరలోనే తనపై ఈడీ, ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని పొంగులేటి బుధవారం మీడియాలో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, నేడు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి నేడు నామినేషన్ వేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. -
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం: పొంగులేటి
-
తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులకు ప్లాన్ రెడీ: పొంగులేటి వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చే తామే అంటూ కామెంట్స్ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఎన్నికల వేళ తెలంగాణలో ఐడీ, ఈడీ దాడులు జరుగుతాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి. దీంతో, ఆయన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. పొంగులేటి శ్రీనివాస్ బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు జరుగుబోతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్పై దాడికి సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే దాడులకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్లో చేరిన తర్వాత బీఆర్ఎస్ సూచనల మేరకు కేంద్ర సంస్థలు నామీద, నా కుటుంబ సభ్యుల మీద, నాకు మద్దతిచ్చే వారిపై దాడులు చేసేందుకు రెడీ అవుతున్నారు. కాళేశ్వరం ఖేల్ ఖతం.. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. కానీ, కాళేశ్వరం నిజ స్వరూపమేంటో కేంద్రం నివేదికల్లో వెల్లడించింది. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడినట్టు అర్థం అవుతోంది. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ఏదో ఒకరోజు కూలిపోతాయి. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని చెప్పిన బీజేపీ.. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. కేసీఆర్ను ఎందుకు విచారించడం లేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ను మాయం చేసే అవకాశం ఉంది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రియాంక, రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు. తెలంగాణలో దొరల పాలన వద్దు. ప్రజల పాలన కావాలి. ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు. తెలంగాణ పోలీసులు వారి పరిధిలో పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: తప్పు చేసిన వారిని వదలం.. మోదీ ఫైర్ -
ఖమ్మంజిల్లా మునిగేపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ఎన్నికల ప్రచారం
-
కేసీఆర్ను ఫామ్హౌస్కే పరిమితం చేయాలి: పొంగులేటి ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ను ఫామ్హౌస్కే పరిమితం చేయాలని ప్రజలను ఆయన కోరారు. ఇదే సమయంలో తెలంగాణతో గాంధీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. కాగా, పొంగులేటి సోమవారం నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ దీవెనలు ఇవ్వాలి. పది సంవత్సరాలపాటు తుపాకి రాముడు కథలు చెప్పి సీఎం కేసీఆర్ భారీగా ఆస్తులు సంపాదించుకున్నాడు. పదేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పులు చేశాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బుల సంచులతో వస్తారు. ఎంత అడిగితే అంత ఇస్తారు. మనం పన్నులు కట్టి ప్రభుత్వానికి డబ్బుల ఇస్తే.. వాటిని కొల్లగొట్టి మళ్లీ మన దగ్గరకే తీసుకువస్తున్నారు. తెలంగాణలో యాదవులు గొర్రెల కోసం డీడీలు కడితే ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో, ఇక్కడి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అబద్దాలు చెప్పేటప్పుడు తడుముకోకుండా చెప్పడంతో కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే. ప్రజల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్ను ఫామ్హౌస్కే పరిమితం చేయాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలకు అడియాశలు చేసింది’ అని అన్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్కు చెక్.. బీఆర్ఎస్లోకి విష్ణువర్ధన్ రెడ్డి -
ఇజ్జత్ కా సవాల్
ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి తొలినుంచీ కొరుకుడు పడటంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ చేదు అనుభవాలే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తనను ధిక్కరించిన ఇద్దరు నేతలను ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. ఆ రెండు చోట్లా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను సైతం ఏమరుపాటు లేకుండా ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్కు కోపం తెప్పించిన ఆ ఇద్దరు ఎవరు? గత రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ పునాదులు వేసుకోలేకపోయింది. రెండుసార్లు కూడా ఒక్కో సీటు మాత్రమే గెలవగలిగింది. ఏదైతేనేం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరిగింది. ఈసారి పదికి పది స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో తమతో కలిసి ప్రయాణించిన ఇద్దరు నాయకులు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరి బరిలో నిలవడంతో వారిద్దరు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కేసీఆర్. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. అదేవిధంగా పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం అభ్యర్థిగా నిలుస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్తితుల్లోనూ బీఆర్ఎస్ చేజారనీయకుండా చూసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు గులాబీ బాస్. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులు. జిల్లా అంతటా ఇద్దరికీ అనుచర బలగం ఉంది. రెండు బలమైన సామాజికవర్గాలకు చెందిన వీరిద్దరు జిల్లా అంతటా తమ ప్రభావం చూపగలుగుతారు. గులాబీ పార్టీలో సీట్లు రావని తేలడంతో ఇద్దరు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దిరికీ టిక్కెట్లు కేటాయించింది. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఓడించడం ద్వారా గులాబీ పార్టీ బలోపేతం అయిందని.. కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని నిరూపించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అందుకే ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్తో... పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డితోను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తూ...అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రెండు నియోజకవర్లాల్లోనూ నెలకొన్న పరిస్తితులపై నిత్యం తెలుసుకుంటూ అక్కడి నేతలకు మార్గదర్శనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి రెండు సార్లు గెలిచిన పువ్వాడ అజయ్ తాజా ఎన్నికల్లో కూడా గెలిచి హ్యట్రిక్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అటు తుమ్మల కూడ ఈ ఎన్నికలతో పువ్వాడ అజయ్ పొలిటికల్ చాప్టర్ ముగిసిపోతుందని ప్రచారం చేస్తున్నారు. పాలేరులో సైతం కందాల, పొంగులేటి మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. పొంగులేటికి పాలేరులో బలమైన క్యాడర్ ఉండటం బాగా కలిసివస్తుందని అంటున్నారు. అయినప్పటికీ కందాలను ఏమాత్రం లైట్ తీసుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ధీమాగా చెబుతూ ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఆపరేషన్ ప్రారంభించగా...అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఆపరేషన్ తీవ్రం చేసింది. కేసీఆర్ ప్లాన్స్ తిప్పికొట్టడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. రెండు పక్షాల నుంచీ ఢీ అంటే ఢీ అని పరిస్థితి ఏర్పడటంతో ఖమ్మం జిల్లాలో పోరు యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. నామినేషన్లు పూర్తయ్యే నాటికి జిల్లాలో పొలిటికల్ వార్ మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కేసీఆర్
-
కేసీఆర్.. నీ పక్కన ఉన్న వాళ్లంతా ఎవరు?: పొంగులేటి కౌంటర్
సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం అనే పదం వాడే హక్కులేదన్నారు. మీరా డబ్బుల కట్టల గురించి మాట్లాడేది అంటూ కేసీఆర్ను ఎద్దేవా చేశారు. కాగా, మాజీ ఎంపీ పొంగులేటీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాలేరు సభలో సీఎం కేసీఆర్ అనేక అవాకులు, చవాకులు పేలారు. నా పేరు ప్రస్తావించకుండా నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. ప్రజాస్వామ్యం, నోట్ల కట్టల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడటం విడ్డురంగా ఉంది. మీ పక్కన కూర్చున్నోళ్లు ఏ పార్టీ నుండి గెలిచారు.. ఎంత ప్యాకేజీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలు నవ్వు కునేలా చేసింది ఎవరు?. ప్రజాస్వామ్యం అనే పదం వాడే హక్కు మీకు ఉందా?. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, జాతీయ రాజకీయలలో డబ్బు మదంతో అహాంకారంతో మాట్లాడేది ఎవరు?. కాంట్రాక్ట్లు చేసి, పైరవీలు చేసి నేను డబ్బు సంపాదించానని మాట్లాడారు. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. తడి బట్టలతో వస్తాను.. ఏ గుడికి ఎప్పుడు వస్తారో రండి నేను కూడా వస్తాను. కేసీఆర్ నీ ఆస్తుల సంగతేంటి? హుజురాబాద్లో ఉప ఎన్నికల ఓటమి భయంతో దళితబంధు మొదలుపెట్టారు. దళితబంధు తెచ్చినా ఓట్లు పడలేదు. సత్తుపల్లి, పాలేరు సభలో దళితబంధు పథకం అమలు చేస్తారా?. రాష్ట్రంలో ఎక్కడా దళితులు లేరా?. అక్రమంగా సంపాదించిన డబ్బు, నోట్ల కట్టలతో ఎన్నికలకు వస్తున్నారు. కేసీఆర్.. మీరు అన్ని వేల కోట్ల డబ్బు ఎలా సంపాదించారు. ధనిక రాష్ట్రాన్ని దోచుకుని దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. మేడిగడ్డ అసలు రూపం బయటపడింది. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎం లాంటిది. మేడిగడ్డతో మీ అసలు రూపం బయటపడింది. మీ పార్టీలోకి వచ్చిన తరువాత నేను ఎలాంటి పదవులు అనభవించలేదు. ఆ రోజు నీ కోడుకు, అల్లుడు, నీ తొత్తులు వచ్చి వందల సార్లు అడిగితేనే మీ పార్టీలోకి వచ్చాను. నిన్న సభలో తుమ్మల పేరు చెప్పారు.. పొంగులేటి పేరును ఉచ్చరించి ఉంటే అదే సభలో మీకు తెలిసేది. నవంబర్ 30న జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్కు ప్రజలు ఓటు వేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇది కూడా చదవండి: రేవంత్కు కొత్త టెన్షన్.. 19 స్థానాల్లో ఎవరు? -
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోడానికి కేసీఆరే కారకులు
-
ఢిల్లీలో ‘పాలేరు’ సీటు పంచాయితీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. పాలేరు సీటు కోసం కాంగ్రెస్, సీపీఎం మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం మధ్య పాలేరు సీటు పంచాయితీ సాగుతోంది. పాలేరు సీటు తమకే కావాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తుండగా, పాలేరుకు బదులు వైరా స్థానం ఇస్తామని కాంగ్రెస్ నచ్చచెబుతోంది. పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతుంది. సీటు వ్యవహారంపై పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చిస్తున్నట్లు సమాచారం. పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు. చదవండి: తెలంగాణలో మరో సర్వే.. ఆ పార్టీకే ఆధిక్యం -
పాలేరులోనే పొంగులేటి!
సాక్షిప్రతినిది, ఖమ్మం: పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది! త్వరలో కాంగ్రెస్ విడుదల చేసే రెండో జాబితాలో ఆయన పేరు ఉంటుందని అనుచర వర్గం చెబుతోంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అనుచరులు ప్రచారం మొదలుపెట్టగా.. ఆయన సోదరుడు ప్రసాదరెడ్డి నాలుగు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. తాజాగా శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలోని సాయిగణేష్ నగర్లో నియోజకవర్గ స్థాయి క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే, ప్రచార సామగ్రి, వాహనాలు కూడా సిద్ధమయ్యాయని... జాబితా వెలువడగానే పొంగులేటి నేరుగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. గడపగడపకూ... గత నెలరోజులుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు. గడప గడపకూ కాంగ్రెస్ పేరిట నాలుగు మండలాల్లో ప్రసాదరెడ్డితోపాటు తుంబూరు దయాకర్రెడ్డి తదితరులు పర్యటిస్తూ కాంగ్రెస్ గ్యారంటీలను వివరించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ ప్రచార సరళిపై సూచనలు చేస్తున్నారు. అందరినీ కలుపుకుని.. పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ ఖాయమైనట్లు తెలుస్తుండగా.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కలుపుకువెళ్లేలా వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ టికెట్లు ఆశించిన నేతలను కలిసి చర్చించారు. అలాగే, స్థానిక నేతలను ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో శ్రేణులు, సానుభూతిపరులను సమన్వయం చేసే బాధ్యతను ప్రసాదరెడ్డి తీసుకోగా.. ఆయనకు తోడు తుంబూరు దయాకర్రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ హోదాలో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో జరిగే ప్రచారంలో కూడా ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. ఈనేపథ్యాన పాలేరు నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను ప్రస్తుతానికి ప్రసాదరెడ్డి చూస్తున్నారు. జాబితా వస్తే మరింత హోరు ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో ప్రసాదరెడ్డి పర్యటిస్తుండగా, రాష్ట్రస్థాయి వ్యవహారాల్లో పొంగులేటి బిజీగా ఉన్నారు. రెండో జాబితాలో ఆయన పేరు వెలువడ్డాక నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలుస్తోంది. అభ్యర్థిత్వం ఖరారై.. నామినేషన్ దాఖలు అనంతరం పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు పొంగులేటి ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఇంతకుముందే నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు పొంగులేటి హాజరయ్యారు. అయితే, అభ్యర్థి పేరు అధికారికంగా వెలువరించని నేపథ్యాన ఆయన సోదరుడి నేతృత్వాన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. క్యాంపు కార్యాలయం ప్రారంభం నియోజకవర్గ వ్యవహారాలు చక్కపెట్టేందుకు ఖమ్మం రూరల్ మండలం సాయిగణేష్ నగర్లో ఏర్పాటుచేసిన క్యాంపు కార్యాలయాన్ని ప్రసాదరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అలాగే, నేలకొండపల్లిలో మండల క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. రెండు రోజుల్లో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో కూడా కార్యాలయాలను ప్రారంభించనుండగా.. సాయిగణేష్ నగర్లోని క్యాంపు కార్యాలయం ద్వారానే నియోజకవర్గ స్థాయి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇక ప్రచారానికి సంబంధించి వాహనాలు, జెండాలు, స్టిక్కర్లు ఇతర ప్రచార సామగ్రి సైతం సిద్ధమయ్యాయని.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. -
కేసీఆర్ పై పొంగులేటి ఫైర్
-
TS Election 2023: కాంగ్రెస్ దూకుడు! ఖమ్మంపై తుమ్మల, పొంగులేటి స్కెచ్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ దూకుడు పెంచింది. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన రోజే ఖమ్మంలో చోటు చేసుకున్న పరిణామాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాన్ని వేడెక్కించాయి. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్ఎస్కు రాజీనామా చేయడం, వెంటనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం.. ఆ తర్వాత ముగ్గురు కార్పొరేటర్లు, పలువురు నేతల ఇంటికి వెళ్లడం చకచకా సాగాయి. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జరిగిన ఈ పరిణామాలు ఉత్కంఠగా కొనసాగాయి. ఇరువురు నేతలు గుంభనంగా చేసిన రాజకీయంతో బీఆర్ఎస్ షాక్కు గురైంది. నిర్బంధ రాజకీయం తట్టుకోలేకనే.. నిర్బంధ రాజకీయం తట్టుకోలేకనే తాము బీఆర్ఎస్ను వీడి తుమ్మల, పొంగులేటి బాటలో నడుస్తున్నట్లు కార్పొరేటర్ కమర్తపు మురళి, చావా నారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు. దీంతో నియోజకవర్గ బీఆర్ఎస్లో ఇంకా ఎవరు అసంతృప్తిగా ఉన్నారు?, ఎవరు కాంగ్రెస్లో చేరుతారనే చర్చ జరుగుతోంది. ఒకే రోజు ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలినట్లయింది. మంత్రి పువ్వాడ ప్రగతి భవన్లో బీ ఫామ్ తీసుకుంటన్న సమయంలోనే ఖమ్మంలో జరిగిన రాజకీయం ఆ పార్టీని ఉలికిపాటుకు గురి చేసింది. ఆ తర్వాత మంత్రి హుటాహుటిన ఖమ్మం చేరుకొని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, రఘునాథపాలెం మండలంలోని పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బాలసాని రాజీనామా చేసి.. బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని ముందుగా ఆపార్టీకి రాజీనామా చేసి, కేసీఆర్కు లేఖ పంపారు. పార్టీపై అసంతృప్తిగా ఉండడం, భద్రాచలం నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి తప్పించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బాలసానితో ఇటీవల పొంగులేటి, తుమ్మల పలుమార్లు వేర్వేరుగా చర్చలు జరిపినట్లు తెలిసింది. తుమ్మలకు కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం సీటుపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలసాని ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. బాలసాని కాంగ్రెస్లో చేరేందుకు సుముఖంగా ఉండడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తుమ్మల, పొంగులేటి నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వా నించారు. పార్టీ బలోపేతానికి తాను కృషి చేసినా అనుభవం లేని వారికి పలు బాధ్యతలు ఇచ్చి తనను అవమానించారని బాలసాని ఎమ్మెల్సీ తాతా మధునుద్దేశించి ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి.. బాలసాని పార్టీ మారుతారని బీఆర్ఎస్ అధిష్టానం ముందే ఊహించినా ముగ్గురు కార్పొరేటర్లు, పలువురు నేతలు ఇదే బాట పట్టడంతో అటు హైదరాబాద్, ఇటు ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర చర్చ జరిగింది. తుమ్మల, పొంగులేటి బాలసాని ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించాక కార్పొరేటర్లు కమర్తపు మురళి, చావా మాధురి నారాయణ, రావూరి కరుణసైదుబాబు ఇంటికి వెళ్లి వారిని కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అనంతరం అల్లీపురంలోని బీఆర్ఎస్ నేతలు సంక్రాంతి నాగేశ్వరరావు, పత్తిపాటి వీరయ్య, మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు ఇంటికి తుమ్మల, పొంగులేటి వెళ్లారు. సుడా డైరెక్టర్లు కోసూరి రమేష్గౌడ్, ఎండీ ఖాదర్బాబా, మాజీ కార్పొరేటర్ భర్త పోట్ల వీరేందర్, ఏలూరి శ్రీనివాస్ కూడా తుమ్మల, పొంగులేటి వెంట నడవనున్నట్లు ప్రకటించారు. -
ఖమ్మం కాంగ్రెస్ కీలక నేతల సీట్లు ఖరారు
సాక్షి, ఢిల్లీ: ఖమ్మం కాంగ్రెస్ కీలక నేతల సీట్లు ఓ కొలిక్కి వచ్చాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పోటీ చేయబోయే స్థానాలపైన స్పష్టత వచ్చింది. పాలేరు పొంగులేటి, ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మలను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ ఇద్దరు నేతలు ఇవాళ(అక్టోబర్ 14, శనివారం) ఢిల్లీ వెళ్లి అగ్రనేతల్ని కలిశారు. అయితే.. రాహుల్ గాంధీ సూచన తర్వాత తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి నేతల సీట్ల కోసం జరుగుతున్న పంచాయితీ ముగిసింది. వామపక్ష పార్టీల పొత్తుపై.. వామపక్షాల పొత్తు అంశంపై కేసీ వేణుగోపాల్ నివాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టి, ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు, అలాగే సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
పెద్దల సమక్షంలోనే.. రసాభాసగా ఖమ్మం కాంగ్రెస్ సమావేశం
సాక్షి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో గ్రూప్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ ఎత్తున తుక్కుగూడలో(రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో) బహిరంగ సభకు సిద్ధమవుతోంది. అయితే ఈ సభకు సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయగా.. అది రసాభాసకు దారి తీసింది. సీనియర్ నేత వీహెచ్ మాట్లాడే సమయంలో కార్యకర్తలు అడ్డుపడడంతో.. ఆయన వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మంలో తుక్కగూడ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్తో పాటు వీ హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నియోజకవర్గ ఇంఛార్జిలు, కొందరు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే వీహెచ్ మాట్లాడే సమయంలో కొందరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జిల్లాలో మీ కో అర్డినేషన్ ఏమిటి? అంటూ వీహెచ్పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీహెచ్ సైతం కౌంటర్గా వాళ్లపై మండిపడ్డారు. దీంతో.. అరుపులు కేకలు వేసిన కార్యకర్తలపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కార్యకర్తలు ఎవరికి వారే.. ‘జై పొంగులేటి’, ‘జై రేణుకా చౌదరి’, ‘జై భట్టి’.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశం గందరగోళంగా తయారైంది. పెద్దల్ని గౌరవించండి మనలో మనం కొట్టుకుంటే పార్టీకే నష్టమంటూ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పొంగులేటి, రేణుకాచౌదరి. పార్టీ పెద్దలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ లో గ్రూప్ గొడవలు ఉండొద్దు. అందరం కలిసి పని చేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పది కి పది స్థానాలు గెలుస్తామన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ‘‘నాకు చేదు నిజం చెప్పే అలవాటు ఉంది. నలభై ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన కొంతమంది నాయకులకు గౌరవం దక్కట్లేదు. పార్టీ కోసం పని చేసిన నేతలకు న్యాయం జరగాలి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. ఖబర్దార్ అజయ్ కుమార్(మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను ఉద్దేశించి).. దమ్ముంటే రా. పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకు. గాలి మారిపోయింది. రాబోయేది కాంగ్రెస్.. ఉండబోయేది కాంగ్రెస్.. గుర్తుంచుకో. కేసీఆర్, మోదీ తోడు దొంగలు. ఈ విషయం.. కవిత లిక్కర్ కేసుతో రుజువైందని రేణుక చౌదరి మండిపడ్డారు. -
కాంగ్రెస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు
-
‘కేసీఆర్.. ఈ మూడు స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేసి గెలవండి’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేసి విజయం సాధించాలంటూ సీఎం కేసీఆర్కు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన గజ్వేల్తో పాటు మైనార్టీలు ఎక్కువగా ఉండే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని, వీటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే బాగుంటుందని అన్నారు. ఒకవేళ కేసీఆర్ ఇక్కడ పోటీకి దిగితే ఆయనపై బ్యాలెట్ పోరుకు తాను సిద్ధమేనని తెలిపారు. తనకు, కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా కుటుంబసభ్యులతో చర్చించాకే బీఆర్ఎస్ను వీడానని పొంగులేటి చెప్పారు. చదవండి: ర్యాలీలు.. సభలు -
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పొంగులేటి
-
జోష్... కాంగిరేస్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీలో సందడి నెలకొంది. పార్టీలోకి కొత్త నేతల చేరికలతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మంలోని ఆయన నివాసంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఇరువురు నేతలు కొద్ది సేపు రాష్ట్ర రాజకీయాలపై ముచ్చటించారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఇటీవల తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కలవగా ఇప్పుడు పొంగులేటి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇక లాంఛనమే కానుంది. బీఆర్ఎస్ టు కాంగ్రెస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజకీయ ప్రస్థానం సత్తుపల్లి నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. సత్తుపల్లి నుంచి తుమ్మల రాజకీయ అరంగేట్రం చేశారు. పొంగులేటి ఇదే నియోజవకర్గంలోని తన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇద్దరూ రాజకీయాల పరంగా చూస్తే ఎత్తుపల్లాలు చవిచూశారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు సీఎంలుగా ఉన్నప్పుడు తుమ్మల పార్టీ పరంగా ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించారు. బీఆర్ఎస్లో చేరాక కూడా ఇదే స్థాయిలో వ్యవహరించారు. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడంతో ఆయన ఆధిపత్యానికి గండి పడుతూ వచ్చింది. ఒకప్పుడు అనుచరులకు టికెట్లు ఇప్పించిన ఆయనకు ఈసారి బీఆర్ఎస్ మొండి చేయి చూపించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలవడంతో తుమ్మల పయనం హస్తం గూటికేనని తేలింది. ఇక వైఎస్సార్సీపీ నుంచి పొంగులేటి రాజకీయ ప్రస్థానం మొదలు కాగా.. బీఆర్ఎస్లో చేరాక అనుచరులను అంటిపెట్టుకుని ఉన్న ఆయనకు గత ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. అనంతర పరిణామాలతో పొంగులేటి కాంగ్రెస్లో చేరి ఇప్పటికే కీలక పదవిలో ఉండగా... తుమ్మల కూడా చేరితే తగిన గౌరవం దక్కుతుందనే అభిప్రాయం ముఖ్య అనుచరుల్లో వ్యక్తమవుతోంది. పాలేరు, ఖమ్మంపై ఫోకస్ మారుతున్న రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరితే పాలేరు నుంచే బరిలోకి దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. అలాగే, శ్రీనివాసరెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో ఎవరికి టికెట్ ఖాయమవుతుందనే అంశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని జనరల్ స్థానాలైన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో అధికార పార్టీకి దీటుగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈనేపథ్యాన శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావుల్లో పాలేరులో ఒకరిని, ఖమ్మంలో మరొకరిని పోటీకి దింపాలని భావనతో ఎవరికి ఏ స్థానం కేటాయిస్తే సమీకరణలు ఎలా ఉంటాయనే అంశంపై అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మరోపక్క పాలేరు నుంచి ఆ పార్టీ నేతలు రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్రెడ్డి, ఎడ్ల శ్రీరాంయాదవ్ తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, కొత్తగూడెం టికెట్ కోసం కూడా దరఖాస్తులు అందిన నేపథ్యాన వీరి బలాబలాలను గుర్తించేందుకు పార్టీ ఇప్పటికే చేయించిన సర్వే నివేదికలతో అంచనా వేస్తోంది. హైదరాబాద్ లేదా ఢిల్లీ పాలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులతో తుమ్మల చర్చలు జరుపుతున్నారు. అనుచర గణం, కేడర్ అభిప్రాయం మేరకు పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయనను శనివారం కూడా పాలేరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కలిశారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చే సమాచారంతో హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో తుమ్మల చేరిక ఉండొచ్చన్నది సమాచారం. ఇక ఉమ్మడి ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఉన్న తన సామాజికవర్గ నేతలు కొందరితోనూ ఆయన పార్టీ మార్పుపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ సభలో కుదరదని భావిస్తే అంతకన్నా ముందే ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతల సమక్షానలో కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. చేరికలతో మళ్లీ రేసులోకి... సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరాక పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కానీ తాజా పరిణామాలు ఆ పార్టీని వచ్చే ఎన్నికల రేసులో నిలబెట్టాయనే విశ్లేషణ మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటితోపాటు పలు నియోజకవర్గాల్లోని ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్లో చేరారు. ఇక తుమ్మల సైతం హస్తం గూటికి చేరనుండడంతో ఉమ్మడి జిల్లాలోని ఆయన అనుచరులు అదే దారిలో నడుస్తారు. తద్వారా మొన్నటి వరకు నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్లోని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు బలాన్ని ఇచ్చినట్లవుతుందనే చర్చ జరుగుతోంది. -
కాంగ్రెస్లోకి క్యూ కట్టిన నేతలు.. పొంగులేటి పోటీ ఎక్కడ?
సాక్షి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సీట్లు కేటాయింపుల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్స్వీప్ కొట్టాలనే టార్గెట్ చేసిన కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్లో తుమ్మల నాగేశ్వర రావు చేరిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం లేదా కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తుమ్మల కాంగ్రెస్లో చేరిక దాదాపు ఖరారైన నేపథ్యంలో సీట్లు సర్దుబాటు విషయంలో హస్తం పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, తుమ్మల పాలేరు నుంచి మాత్రమే బరిలో ఉంటానని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపించారు. దీంతో, పాలేరులో తుమ్మలకు గ్రీన్సిగ్నల్ వస్తే పొంగులేటి శ్రీనివాస్ ఎక్కడి నుంచి బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పొంగులేటిని ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సీనియర్ల ధీమా ఇదే.. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కాంగ్రెస్లో చేరితే కొత్తగూడెం టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు హస్తం పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అప్పుడు.. పొంగులేటిని ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపే అవకాశాలను కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక, ఉమ్మడి జిల్లాలో మూడు జనరల్ స్థానాల్లో బలమైన నేతలను పోటీ చేయించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆలోచన అని సీనియర్లు చెబుతున్నారు. తద్వారా ఖమ్మం జిల్లాలో 10 సీట్లను గెలుచుకోవచ్చనే ధీమాతో హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: వేములవాడలో నో టికెట్.. చెన్నమనని పొలిటికల్ కౌంటర్ ఇదే.. -
గాంధీభవన్లో మార్మోగుతున్న ఇల్లెందు పేరు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని హస్తం గుర్తుపై పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు సమాయత్తం అవుతున్నారు. పార్టీ పెద్దలు ఎవరికి టికెట్ కేటాయిస్తారనే అంశంపై స్పష్టత లేకున్నా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవడం, సభలు, సమావేశాల నిర్వహణలో బిజీ అవుతున్నారు. ఈ విషయంలో కొత్తగూడెం నియోజకవర్గ ఆశావహులు ముందు వరుసలో ఉన్నారు. జనరల్ స్థానంలో పోటాపోటీ.. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇందులో కొత్తగూడెం ఒక్కటే జనరల్గా ఉంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు నేతల మధ్య పోటీ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా బలమైన అనుచరగణం కలిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి హస్తం గుర్తుపై పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొత్తగూడెంలో క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కొత్తగూడెంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. హంగూ ఆర్భాటం లేకుండా చాపకింద నీరులా ఇతర పార్టీలకు చెందిన కేడర్ను కాంగ్రెస్లో చేర్పిస్తున్నారు. పొంగులేటి నియోజకవర్గంలో అందుబాటులో లేనప్పుడు ఆయన అనుచర గణం తమ పని తాము చేసుకుపోతోంది. అయితే పొంగులేటి వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం, ఖమ్మంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడం గమనార్హం. అడపదడపా పోట్ల పర్యటన.. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు.. బీఆర్ఎస్ మీదుగా కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వర్గం నేతగా కొనసాగుతున్నారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది ఇక్కడ క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేయడం తప్ప నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీ పిలుపు మేరకు అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎడవల్లి ఎడతెగని ప్రయత్నాలు.. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని గత 15 ఏళ్లుగా ఎడవల్లి కృష్ణ ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన మూడు ఎన్నికల్లో వివిధ గుర్తులపై ఆయన పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అనుచరుడిగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలో అందరి కంటే ముందుగా టికెట్ కోసం గాంధీభవన్లో దరఖాస్తు సమర్పించారు. మార్మోగుతున్న ఇల్లెందు పేరు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో ఇల్లెందు పేరు మార్మోగుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 115 నియోజకవర్గాలకు సంబంధించి 306 దరఖాస్తులు రాగా, ఇందులో రికార్డు స్థాయిలో ఇల్లెందు స్థానం నుంచి ఏకంగా 40 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గాంధీభవన్లో ఇల్లెందు హాట్ టాపిక్గా మారింది. కాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు గాంధీభవన్లో దరఖాస్తు సమర్పించే అవకాశం ఉంది. ఖమ్మం, కొత్తగూడెంతో పాటు పాలేరుకు కూడా ఆయన దరఖాస్తు సమర్పిస్తారని సమాచారం. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు సైతం రేపు గాంధీభవన్లో తమ నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తు చేసే అవకాశం ఉంది. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 25 వరకు అవకాశం ఉంది. బల ప్రదర్శనకు సిద్ధం.. టికెట్ కోసం పోటీ నెలకొన్న వేళ.. బలప్రదర్శనకు ఎడవల్లి కృష్ణ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బుధవారం కొత్తగూడెంలో ప్రజా చైతన్యం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితో పాటు ఏఐసీసీ కీలక నేతలు హాజరవుతున్నారు. రేణుకాచౌదరి గత కొంతకాలంగా జిల్లా రాజకీయాలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా ఆమె కార్యక్రమాలన్నీ ఢిల్లీ, హైదరాబాద్, ఖమ్మం వరకే పరిమితం అవుతున్నాయి. అయితే టికెట్ల కేటాయింపు అంశం ముదురుపాకాన పడిన సమయాన రేణుకాచౌదరి జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధ, గురువారాల్లో కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో ఆమె పర్యటన ఖరారైంది. అయితే ప్రధాన కార్యక్రమాలన్నీ కొత్తగూడెం నియోజవర్గ పరిధిలోనే ఉండడం విశేషం. -
ఖమ్మంలో పువ్వాడ హ్యాట్రిక్ కొడతారా?.. మంత్రిని ఢీకొట్టేది ఎవరు?
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం హాట్ సీట్గా మారనుందా? తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇప్పటికే రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పువ్వాడకు పోటీగా నిలిచి గట్టి అభ్యర్థి ఎవరు? బలమైన ప్రత్యర్థి బరిలో నిలిస్తే పువ్వాడకు ఇబ్బందేనా? అసలు ఖమ్మంలో మంత్రి మీద పోటీ చేయబోయేది ఎవరు? రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక స్థానాల్లో సంచలనాలు సృష్టించబోతున్నాయి. పలు కీలక నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. అటువంటి వాటిలో ఖమ్మం అసెంబ్లీ సీటు కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇప్పటికి రెండు సార్లు వరుసగా విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచేది తానే అంటూ ధీమాగా ఉన్నారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలోని ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు.. ఖమ్మంలో చేసిన అభివృద్దిని చెప్పుకుంటు వచ్చే ఎన్నికల్లో తననే మరోసారి దీవించాలని కోరుతున్నారు. మళ్లీ గెలిపిస్తే ఖమ్మం నగరాన్ని ఇంకా అభివృద్ది చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పువ్వాడ అజయ్కు కాంగ్రెస్ నుంచి పొటీ తీవ్రంగా ఉండబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొంగులేటి అనుచరులు ఆయనపై ఖమ్మంలో పొటీ గురించి తీవ్రస్తాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని పొంగులేటి అనుకుంటున్నప్పటికీ... అనుచరుల ఒత్తిడి మేరకు ఖమ్మంలోనే నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా పొంగులేటికి మంచి ఓటు బ్యాంక్ ఉంది. అనుచరబలం కూడ గట్టిగానే ఉంది. కొత్తగూడెంలో ఓటు బ్యాంక్ ఉన్నా అనుచరుల బలం అంతగా లేదని టాక్. దీంతో ఫైనల్ గా తన అనుచరుల అభిప్రాయం మేరకు పొంగులేటి ఖమ్మం సెగ్మెంట్నే తన ఎన్నికల రణ క్షేత్రంగా ఏంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు కీలక నిర్ణయాలను అనుచరుల సూచన మేరకే పొంగులేటి తీసుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి, ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో నిలిస్తే ఈ సెగ్మెంట్ హాట్ సీట్ గా మారనుంది. అజయ్ వర్సెస్ పొంగులేటి మధ్య సై అంటే సై అన్నట్లు రసవత్తరమైన పోరు కొనసాగుతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఏస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేయబోతున్నారని ఇప్పటికే ఖమ్మం ఓటర్లు డిసైడ్ అయిపోయారు. చదవండి: గులాబీ బాస్ ప్రయోగం చేయబోతున్నారా?.. నిజంగానే అలా జరిగితే.. ఖమ్మంలో ప్రస్తుతం ఏ ఇద్దరిని కదిలించిన పొంగులేటి, పువ్వాడ అజయ్ పొటీ చేస్తే ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. అధికార బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్కుమార్ పోటీ చేయడం అనేది ఖాయమైంది. మరి కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆయన పేరు కూడా ఖరారైంతే ఇక ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. -
బీఆర్ఎస్లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అనుచరుడు తెల్లం వెంకటరావు
-
వెంక్రటావ్ భవిష్యత్త్కు మాది భరోసా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్కు బిగ్ షాక్ తగిలింది. పొంగులేటి కీలక అనుచరుడు తెల్లం వెంకట్రావ్ అధికార బీఆర్ఎస్లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోని వెంక్రటావ్ను మంత్రులు కేటీఆర్, హరీష్రావు ఆహ్వానించారు. ఇక, వెంకట్రావ్ భద్రాచలం టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే. వెంకట్రావ్కి ఈ విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంక్రటావ్ భవిష్యత్త్కు మాది భరోసా. జల్, జంగల్, జమీన్ విషయంలో ఏం జరుగుతుందో అందరూ చూడాలి. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోంది. ప్రాజెక్టుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం పెరిగింది. ..కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో నీటి కష్టాలు, విద్యుత్ వెతలు తీరిపోయాయి. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎవరెన్ని మొరిగిన మళ్ళీ గెలిచేది మనమే, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. వచ్చే రోజుల్లో భద్రాచలం గుడి అభివృద్ది చేస్తాం. గోదావరి నది కరకట్ట మరమత్తులు కూడా చేపడతాం’ అని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడే బయటకు వస్తాయి. ప్రజాసేవ చేసే నాయకత్వం కావాలి. ఎన్నికలప్పుడే కొందరు నేతలు ప్రజల్లోకి వస్తారు అంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. తొలి లిస్ట్లో అభ్యర్థులు వీరే! -
పొంగులేటికి హ్యాండిస్తూ.. తిరిగి బీఆర్ఎస్లోకి తెల్లం
-
పొంగులేటికి భారీ ఝలక్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి పెద్ద ఝలకే తగిలింది. గత నెలలో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో తనతో పాటే కాంగ్రెస్లో చేరిన పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు మనసు మర్చాకున్నాడు. తిరిగి బీఆర్ఎస్లోకే వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకపోవడం, అదే సమయంలో తనను నమ్ముకున్న కార్యకర్తల నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేకనే తిరిగి బీఆర్ఎస్ వెళ్తున్నట్లు ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారాయన. భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపు(గురువారం) ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లం వెంకటరావు మొదటి నుంచి పొంగులేటికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు. 2018లో టీ(బీ)ఆర్ఎస్ తరపున తెల్లం పోటీ చేసి ఓడిపోయారు(32 శాతం ఓటింగ్.. దాదాపు 36వేల ఓట్లు పోలయ్యాయి). అయితే రాబోయే ఎన్నికల్లో భద్రాచలం టికెట్ ఆశించి మరీ ఆయన పొంగులేటితో కాంగ్రెస్లో చేరారు. అయితే ఇక్కడే ఆయనకు ఆటంకాలు ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పొదెం వీరయ్యకే కేటాయించే అవకాశం ఉండడంతో.. వెంకటరావు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో మరోపక్క నుంచి బీఆర్ఎస్ ముఖ్యనేతలు వెంకటరావుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ హామీ ఇస్తేనే బీఆర్ఎస్లోకి వస్తానని ఆయన కరాకండిగా చెప్పినట్లు ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. చివరకు ఏమైందో తెలియదుగానీ.. ఆయన బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన చేసేశారు. ఇదీ చదవండి: జెండా వందనంలో కొట్టుకున్న బీజేపీ నేతలు -
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పొంగులేటి అడుగులు
-
సిట్టింగ్లందరికీ బీఫామ్ ఇచ్చే దమ్ముందా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పాలన అందించి ఉంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ బీఫామ్ ఇచ్చే దమ్ముందా అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణను బంగారుమయం చేసి ఉంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్లోని 25–30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారంతా దొంగలని, ప్రజలను ఇబ్బందు లపాలు చేసేందుకే మార్చాలని అనుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పొంగులేటి కోరారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి గ్రామపంచాయతీ మొదలు పార్లమెంటు వరకు కాంగ్రెస్ జెండాను రెపరెప లాడించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న వారు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా.. అది ఇంకా 55 రోజులు మాత్రమేనని, బీఆర్ఎస్కు కౌంట్డౌన్ మొదలైందని పొంగులేటి చెప్పారు. ప్రచార కమిటీ కోచైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిల్లాకు వచ్చిన పొంగులేటికి పార్టీ నాయకులు జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద ఘనస్వాగతం పలికారు. డీసీసీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఖమ్మం, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పొంగులేటి సోదరులకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్: ఖమ్మం శివారు వెలుగుమట్లలోని ఎస్ఆర్ గార్డెన్ వివాదంలో మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వినర్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేయడంతో పాటు తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు 20 గుంటల భూమిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. సర్వే చేపట్టాలని నోటీసులు... ఎస్ఆర్ గార్డెన్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన భూమి ఉందని...సర్వే చేపట్టాలని శ్రీనివాస్రెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డికి ఈ నెల 14న అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ప్రసాద్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా అధికారుల నిర్ణయం ఉందని, సహజ న్యాయసూత్రాలను కూడా ఉల్లంఘించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. తమకు సంబంధించిన భూమిలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, నోటీసులను కొట్టివేయాలని కోరారు. దీనిపై జస్టిస్ విజయ్సేన్రెడ్డి మంగళవారం విచారణ చేపట్టి స్టేటస్ కో ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేయడంతోపాటు ఆ విచారణ నాటికి సర్వే నివేదికను అందజేయాలని పేర్కొన్నారు.