‘కొత్త’ వ్యాఖ్యలతో పొలిటికల్‌ వార్‌.. కాంగ్రెస్‌ రియాక్షన్‌ | Congress Leaders Counter On Kotha Prabhakar Reddy Comments | Sakshi
Sakshi News home page

‘కొత్త’ వ్యాఖ్యలతో పొలిటికల్‌ వార్‌.. కాంగ్రెస్‌ రియాక్షన్‌

Apr 15 2025 11:51 AM | Updated on Apr 15 2025 1:10 PM

Congress Leaders Counter On Kotha Prabhakar Reddy Comments

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసుగుచెందరని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

అధికార దాహంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు.. మంత్రి పొంగులేటి
కాంగ్రెస్‌ పాలన వచ్చినప్పటి నుంచి కూలుస్తామంటున్నారు.. అధికారదాహంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. భూ భారతి తీసుకొచ్చామని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భూ భారతి తీసుకొచ్చాక భూములు కొల్లగొట్టినవారి గుండెల్లో  రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్‌ ఆత్మ కొత్త ప్రభాకర్‌రెడ్డి. కేసీఆర్‌ సూచన మేరకే ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అధికారంలోకి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారు. భూ భారతితో పేదవాడికి న్యాయం జరుగుతోంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.

కేసు బుక్‌ చేయాలి.. ఆది శ్రీనివాస్‌
కొత్త ప్రభాకర్‌రెడ్డి వాఖ్యలు సీరియస్‌గా పరిగణించాలంటూ ప్రభుత్వ విప్‌, వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కేసు బుక్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తా. సంక్షేమం  ప్రజలకు అందుతుందనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

BRS MLA కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సీరియస్ గా పరిగణిస్తాం: ఆది

 

Advertisement
 
Advertisement
Advertisement