
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు.
కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన వేరొకరు మాట్లాడ్డం ఏంటని పీసీసీ ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు చేయోద్దని, మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేతల్ని సున్నితంగా మందలించారు.