breaking news
Chandrababu Naidu
-
కనిగిరి పొగాకు రైతులకు అండగా దీక్ష.. మాస్ వార్నింగ్ బాబుకి
-
‘కూటిలో రాయి తియ్యలేనోడు.. ఏటిలో రాయి తీస్తాడా?’
ప్రకాశం: కుప్పంకి నీళ్లవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులకు మేలు చేస్తాడని అనుకోవడం మన భ్రమే అవుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటిలో రాయి తియ్యలేనోడు.. ఏటిలో రాయి తీస్తాడా? అని ప్రశ్నించారు. అన్నం పెట్టిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు చంద్రశేఖర్. కుప్పానికి నీళ్లు ఇచ్చి రైతులల కళ్లలో ఆనందం నింపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. మత్సకారులు గల్లంతైతే ఆ కుటుంబాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పలకరించలేదని, పేదలంటే వారికి చిన్నచూపని విమర్శించారు. మహా మాయగాడు చంద్రబాబని, భారత దేశంలోనే చెప్పింది చేయకుండా.. మోసం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో మంచి జరగదని చంద్రశేఖర్ విమర్శించారు. -
‘చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు’
సాక్షి,గుంటూరు: చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏదో విధంగా నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కిర్లంపూడిలో జరిగిన ఘటనపై అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్, డీజీపీ నాపై కక్ష కట్టారు. ఏ విధంగా నన్ను అణచివేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబాన్ని వేధించారు. మహిళలను అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించారు. అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబమే చెప్పింది. అయినా పోలీసులు ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించారు. -
ఏపీలో పాలన గాలికి ఎగిరిపోయింది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. వాటికోసం గళం విప్పాలని పిలుపునిచ్చారు.‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరిపోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్పీ పోస్టుల భర్తీ పెద్ద స్కాం చోటు చేసుకుంది. పోటీపరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. డీఎస్సీ భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. డీఎస్సీ పరీక్ష పేపర్లుకూడా లీక్కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తీవ్ర అవకతవకలు. తమ వాళ్లకోసం జీవోలు ఇచ్చారు. ఈ పని అయిపోగానే ఆ జీవోలను రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడీ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నాడు. మరో వైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలపైనే పెడుతున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్నవారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు...సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరిమీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టెట్ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాక ముందు నుంచీ టీచర్లుగా పనిచేస్తున్నవారికి టెట్ను తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అయినవారే. వీళ్లు ఉద్యోగాలు పొందనప్పుడు వీళ్లకు టెట్ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యంకాదు. సుదీర్ఘకాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్నవారిని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి, వారికి సమస్యను నివేదించాలి. ..రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. ప్రైవేటు పేరుతో దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. వీటి పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని కూడా, దాదాపుగా పూర్తైనవాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కాం ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం దారుణం. వైఎస్సార్సీపీ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏంటి?. రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1500 కోట్లుకు ఇవ్వడం స్కాం కాదా?. ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి...రాష్ట్రంలో ప్రతిదీ అవినీతి, దోపిడీయే. ఇష్టాను సారంగా భూముల కేటాయింపులు, ఇసుక, లిక్కర్, మైన్స్.. అన్నీ దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇష్టానుసారం ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో 3.6లక్షల కోట్లమేర అప్పులు చేశారు. విపరీతంగా అప్పులు చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసిన ప్రజలకు చేసింది శూన్యం...సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు తీవ్రంగా నష్టోతున్నారు. భీమవరం సభ ద్వారా రైతులు ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీలేదు. ఐఆర్ లేదు. 5 డీఏలు పెండింగ్, సరెండర్ లీవ్స్ పెండింగ్.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే.’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
పవన్కు బిగ్ షాకిచ్చిన బొలిశెట్టి సత్యనారాయణ
సాక్షి, విశాఖ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. గతంలో అమరావతిలో బలవంతపు భూసేకరణను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని సత్యనారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే మాటకి పవన్ కల్యాణ్ కట్టుబడి ఉండాలన్నారు. కూటమిలో ఉన్నాము కదా రైతులను ఉరితీసిన పరవాలేదు అనుకుంటే కుదరదు అంటూ హితవు పలికారు.జనసేన బహిష్కృత నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. అమరావతిలో బలవంతపు భూసేకరణపై ప్రజలకు పవన్ కల్యాణ్ వైఖరి చెప్పాలి. గతంలో చంద్రబాబు చేసింది తప్పు అయితే.. నేడు చేసేది కూడా తప్పే అవుతుంది కదా?. గతంలో కంటే నేడు దారుణంగా బలవంతపు భూసేకరణ జరుపుతున్నారు. అమరావతికి 33 వేల ఎకరాలు భూమి సరిపోతుందన్నారు. నేడు లక్ష 75 వేల ఎకరాలు భూమి సేకరిస్తున్నారు. ఈ భూమి అంతా ఎవరి ప్రయోజనాల కోసం? అని ప్రశ్నించారు.🚨అమరావతిలో రాజధాని అంటూ బలవంతపు భూసేకరణ చేస్తే...అక్కడ ఎవరు ఉన్నా...అడ్డుకొని తీరుతాం..!- జనసేన బహిష్కృత నేత బోలిశెట్టి సత్యనారాయణ గారు#APCapital Source: Media and Press Meet of #BolisettySatyanarayana Janasena Ex. Leader pic.twitter.com/4ERTGYjKQJ— UttarandhraNow (@UttarandhraNow) July 16, 2026ఇదే సమయంలో త్వరలోనే బలవంతపు భూసేకరణ పై సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ను కూడా ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు ఉన్నది చట్టాలను గౌరవించడానికి... అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. మొదటి విడత భూసేకరణలో 13వేల ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదని ఎన్జీటీ తీర్పునిచ్చింది. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరుపుతున్నారు. రాత్రికి రాత్రి జీవోలు విడుదల చేస్తున్నారు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
బూటకాల‘మారి టైం’!
సాక్షి, అమరావతి: కార్పొరేట్లకు భూ సంతర్పణలో చంద్రబాబు సర్కారు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతకాలం అస్మదీయులు, అప్పుడే ఏర్పాటు చేసిన కంపెనీలకు భూములు కేటాయిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా భవిష్యత్తులో పెట్టే కంపెనీకి భూమిని గంపగుత్తగా కేటాయిస్తూ ఏకంగా ఉత్తర్వులనే ఇచ్చిపడేసింది. ఇంకో విచిత్రం ఏమిటంటే కంపెనీ యాజమాన్యం దగ్గర ప్రస్తుతం పెట్టుబడికీ డబ్బులు కూడా లేవట... బ్యాంకుల నుంచి రూ.165.75 కోట్లు రుణం తీసుకొని మరీ ఏర్పాటు చేస్తారంట.. ఈ విషయం జీవోలోనే స్పష్టంగా చెప్పిన సర్కారు రూ.వందల కోట్ల విలువైన భూమిని పప్పుబెల్లం కింద ధారాదత్తం చేసిందంటే దీనివెనుక ఉన్న శక్తుల పవర్ ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అనే సంస్థ రూ.255 కోట్లతో తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నఈటిపాకం వద్ద ఏర్పాటు చేసే లాజిస్టిక్ పార్క్ కోసం ఎకరా రూ.28 లక్షలు చొప్పున 63.01 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీసిటీ రెండో దశలో కేటాయించిన భూమిలో ఏర్పాటు చేస్తున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్కు, అలాగే కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్కు మధ్యలో ఈ భూమి ఉంది. శ్రీ సిటీకి ఎదురుగా ఉండటమే కాకుండా పలు కంపెనీల మధ్యలో ఈ భూమి ఉండటంతో భూమి ధర రూ.కోట్లలో పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో ఈ 63 ఎకరాల భూమి ధర రూ.252 కోట్లపైనే ఉంటుందని, ఇంతటి విలువైన భూమిని నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్కు కేవలం రూ.17.64 కోట్లకే ఇచ్చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏఐకీ దొరకని కంపెనీరిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లోనే కాదు గ్రోక్, చాట్జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్కూ నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అనే కంపెనీ ఎక్కడుందన్న విషయం అంతుపట్టడం లేదు. ఆర్వోసీలో నెక్సస్ పేరున చాలా కంపెనీలు ఉన్నా ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం భూములిచ్చిన కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ కంపెనీ గురించి పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ అధికారులను ఆరాతీయగా చెన్నైకి చెందిన అజూర్ ట్రేడింగ్ అండ్ స్టోరేజ్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఆతోట వెంకటేశ్వర్లు, తారకేశ్వర టెక్స్టైల్ పార్క్ ఎండీ జవ్వాజి రామాంజనేయులు మరో ఇద్దరు కలిసి ఈ ప్రతిపాదన పంపారని, దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నామే కానీ ఆ పేరు మీద కంపెనీ ఏర్పాటైందా లేదా అన్న విషయాన్ని పరిశీలించలేదని వివరించారు. ఈ నలుగురు కలిసి రూ.89.25 కోట్ల నిధులను సమకూర్చుకుంటామని, మిగిలిన రూ.165.75 కోట్లు బ్యాంకుల నుంచి రుణం ద్వారా ఈక్విటీగా సేకరిస్తామని ప్రతిపాదనలను ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మారిటైం బోర్డుకు సంబంధం ఏంటి?అక్కడ ఎటువంటి పోర్టులూ లేవు.. భూమి మొత్తం పారిశ్రామిక పార్కుల మధ్యలో ఉంది. అటువంటి భూమిని ఏపీఐఐసీ కాకుండా ఏపీ మారిటైం బోర్డు సేకరించి ఇస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేటు పార్కుల పాలసీ ద్వారా ఈ భూమిని అభివృద్ధి చేయకుండా కారు చౌకగా ఒక సంస్థకు కట్టబెట్టడంపై అధికారవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏదైనా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) భూమి సేకరించి ఇస్తుందని, కానీ ఎక్కడో అమరావతిలో కార్యాలయం ఉన్న ఏపీ మారిటైం బోర్డుకు ఈ భూసేకరణ పని అప్పగించడంపై పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.ప్రస్తుతం ఆ భూమికి ఇంకా ఎటువంటి సరిహద్దులు కూడా నిర్ణయించలేదు.. భూ సేకరణ పూర్తి కాలేదు. కానీ 63.01 ఎకరాలను నెక్సస్ ఇంటిగ్రేటెడ్ పార్కుకు కేటాయిస్తూ హడావిడిగా ఉత్తర్వులు జారీ చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మారిటైం బోర్డు చైర్మన్గా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత దామచర్ల సత్యకి ఆతోటి వెంకటేశ్వర్లుకి వ్యాపార సంబంధాలుండటమే దీనికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అప్పుడు బాదేసి ఇప్పుడు డప్పేసి..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల ఖర్చులు తగ్గించామని, ట్రూడౌన్ చేసి ప్రజలకు విద్యుత్ బిల్లులు తగ్గించామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇచ్చిన తాజా ట్రూ అప్ నివేదికలో అసలు నిజాలు బయటపడ్డాయి. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు ఛార్జీల (ఎఫ్పీపీసీఏ) పేరిట ప్రజలపై మోపుతున్న తీరు వెలుగులోకి వచ్చింది. ఏపీఈఆర్సీ ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒక ప్రాథమిక విద్యుత్ కొనుగోలు ధర (బీపీపీసీ)ను నిర్ణయిస్తుంది.అయితే.. డిస్కంలు మార్కెట్లో, విద్యుత్ ఎక్స్చేంజ్లలో లేదా స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా కొనుగోలు చేసే విద్యుత్ ధర (ఏపీపీసీ) ఆమోదించిన ధర కంటే ఎక్కువైతే, ఆ వ్యత్యాసాన్ని ఎఫ్పీపీసీఏగా వినియోగదారులపై మోపుతారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నెలవారీ ఎఫ్పీపీసీఏ గణాంకాలను ఏపీఈఆర్సీ ఆమోదించిన బీపీపీసీ కంటే, డిస్కంలు వాస్తవంగా చెల్లించిన ఏపీపీసీ చాలా నెలల్లో అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యత్యాసంతో ఏర్పడిన అదనపు భారాన్ని ఎఫ్పీపీసీఏ రూపంలో వినియోగదారుల నుంచి వసూలుచేస్తున్నారు.తూర్పు డిస్కంలో భారీ వ్యత్యాసం..ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఫిబ్రవరి–2026లో ఏపీఈఆర్సీ ఆమోదించిన ధర యూనిట్కు రూ.5.1031 మాత్రమే. కానీ, డిస్కం రూ.6.6915కు విద్యుత్ కొనుగోలు చేసింది. అంటే.. యూనిట్కు రూ.1.5883 అదనంగా వెచ్చించింది. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలను కలుపుకుని ఎఫ్పీపీసీఏ రూ.1.7539కు చేరగా, వినియోగదారులపై వసూలుచేయాల్సిన భారం రూ.2.0173గా నమోదైంది. అలాగే, ఏప్రిల్లో రూ.0.8956, జూన్లో రూ.1.1338, జులైలో రూ.0.7920, డిసెంబర్లో రూ.0.6717, జనవరిలో రూ.0.7321 చొప్పున అదనపు భారం నమోదైంది. ఆగస్టు (–0.6404), సెప్టెంబర్ (–0.3644)లో మాత్రమే తగ్గింది.మధ్య డిస్కంలోనూ అదే పరిస్థితి..ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఏప్రిల్లో ఆమోదించిన ధర రూ.5.3581 కాగా.. వాస్తవ కొనుగోలు ధర రూ.6.4469. అంటే, యూనిట్కు రూ.1.0888 అదనంగా చెల్లించారు. దీంతో ఎఫ్పీపీసీఏ రూ.1.2147గా నమోదైంది. ఫిబ్రవరిలో ఆమోదించిన ధర రూ.5.1527 కాగా, కొనుగోలు ధర రూ.5.8978. వ్యత్యాసం 74.51 పైసలు. వినియోగదారులపై రూ.0.9149 అదనపు భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, ఏప్రిల్లో రూ.0.8854, జూన్లో రూ.0.5013, జులైలో రూ.0.4312, అక్టోబరులో రూ.0.5410, నవంబరులో రూ.0.5291 చొప్పున అదనపు భారం నమోదైంది. సెప్టెంబరులో మాత్రమే – 0.0031గా స్వల్ప ఉపశమనం కనిపించింది.దక్షిణ డిస్కంలోనూ ఎక్కువకు కొనుగోళ్లు..ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో కూడా ఏప్రిల్లో ఆమోదించిన ధర రూ.5.4700 కాగా.. కొనుగోలు ధర రూ.6.4309. అంటే, యూనిట్కు 96.09 పైసలు అధికంగా చెల్లించారు. ఆగస్టులో ఈ వ్యత్యాసం రూ.1.1246 వరకు చేరింది. ఏప్రిల్లో రూ.0.6217, నవంబరులో రూ.0.1197, ఫిబ్రవరిలో రూ.0.4421 అదనపు భారం నమోదైంది. మే నుంచి అక్టోబరు వరకు కొన్నినెలల్లో ప్రతికూల విలువలు నమోదైనా, ఏడాది మొత్తం పరిశీలిస్తే ప్రజలపై భారమే అధికంగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.ప్రజలపైనే భారం..విద్యుత్ కొనుగోలు ప్రణాళికలో లోపాలు, డిమాండ్ అంచనాల్లో పొరపాట్లు, ఖరీదైన స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడటం వంటి కారణాలతో డిస్కంల వ్యయం పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఆ అదనపు వ్యయాన్ని ప్రభుత్వం భరించకుండా నేరుగా ఎఫ్పీపీసీఏ పేరుతో వినియోగదారులపై మోపడం అన్యాయమని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే వివిధ పేర్లతో పెంచిన విద్యుత్ చార్జీలతో బిల్లులు రెట్టింపు వస్తున్నాయని గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకూ వసూలుచేసిన మొత్తం ట్రూ అప్ చార్జీలను తిరిగి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముందే వసూలుచేసి ఇప్పుడు గొప్పలా..అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మరోలా డబ్బా కొట్టుకుంటోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు.. 2025–26కు రూ.2,800.28 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలుచేసింది. ఇలా ఇప్పటివరకూ వేసిన భారం రూ.21,072.82 కోట్లు. ఇదికాక మరో రూ.555.30 కోట్ల భారం వేసేందుకు రెడీగా ఉంది. ఈ లెక్కన మొత్తం రూ.21,628.12 కోట్ల విద్యుత్ చార్జీల షాక్ ఇచ్చింది. అయితే, 2024–25 ఆర్థిక సంవత్సరంలో అధికంగా వసూలుచేసిన రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. దానినే యూనిట్కు రూ.0.13 పైసలు చొప్పున ప్రభుత్వం వినియోగదారులకు వెనక్కిస్తోంది. ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఊరికే ఇస్తున్నట్లు డప్పు కొట్టుకుంటోంది. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,800.28 కోట్లు వసూలుచేశాయి. కానీ, అనుమతించిన విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.1,918.32 కోట్లు మాత్రమే. అంటే.. రూ.881.96 కోట్లు ఎక్కువ వసూలుచేసేశారు. క్యారీయింగ్ కాస్ట్ రూ.58.11 కోట్లతో కలిపి రూ.940.07 కోట్లు అదనంగా లాగేశారు. దీనిని కూడా ఏపీఈఆర్సీ ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని చెప్పే అవకాశముంది. దీంతో కూటమి నేతలు ఆ రూ.940.07 కోట్లు తామే తగ్గించామంటూ ముందుగానే తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిజానికిది ప్రజల నుంచి ఇప్పటికే వసూలుచేసిన సొమ్మే. -
బాబుకు పవన్ బిగ్ షాక్
-
సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. మరోసారి హోంమంత్రి అనిత శాఖలో పవన్ జోక్యం చేసుకున్నారు. పోక్సో చట్టం అమలుపై ఏపీ సీఎస్, డీజీపీకి పవన్ లేఖ రాశారు. సీఎంకు రాయకుండా సీఎస్, డీజేపీలకు పవన్ లేఖ రాయడం గమనార్హం.మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా పవన్ లేఖ రాశారు. ఏపీలో మాత్రం సీఎంకు కాకుండా అధికారులకు లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేసింది పవన్ లేఖ.తమ పాలనలో మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో విచారణ అలస్యమవుతుందని పవన్ కల్యాణ్ అంగీకరించారు. చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోక్సో కేసుల దర్యాప్తును 60 నుంచి 90 రోజుల్లోగా పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయాలని పవన్ సూచించారు. ఈ అంశంలో తీసుకున్న చర్యలపై 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. -
‘ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధింపు’
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రభుత్వ తీరుపై ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దన్నా కానీ, ప్రభుత్వం.. గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు గోబ్యాక్ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడలేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ‘‘ఈ దుష్ట ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ ఎప్పుడో చెప్పారు. అధికార లాంఛనాలు వద్దన్నా పోలీసులు తుపాకులతో వచ్చారు. ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధిస్తూనే ఉన్నారంటూ అంబటి మండిపడ్డారు. -
‘టీడీపీ నేతల తీరు మారకపోతే జనం తరిమికొడతారు’
సాక్షి, తాడేపల్లి: వేదిక ఏదైనా చంద్రబాబు, లోకేష్, కూటమి నేతల ధోరణి మారడం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామనే అహంకారంతో పేట్రేగిపోతున్నారని.. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ తిడుతున్నారు. వ్యక్తిగత దూషణలు మా విధానం కాదు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు తానే కట్టానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటన్నాడు. ప్రాజెక్టులు కట్టడం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు శిలాఫలకానికి తప్ప చంద్రబాబు ఖర్చు చేసిందేమీ లేదు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది వైఎస్సార్...వైఎస్ జగన్ సీఎం అయ్యాక వెలిగొండ టన్నెల్స్ ప్రారంభమయ్యాయి. నీ హయాంలో వెలిగొండకు ఎంత ఖర్చు చేశావో లెక్కలు చెప్పగలవా?. పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వించింది వైఎస్సార్. పోలవరం కుడి, ఎడమలకు పేర్లు పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. నాగార్జున సాగర్ నీరు రావడానికి కారణం బ్రహ్మనందరెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎక్కడికి చర్చకు రమ్మన్నా వస్తా మీరు రాగలరా?. నిధులు ఎంత ఖర్చు పెట్టావని అడిగితే చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నాడు’’ అంటూ శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు.‘‘పోలవరం ప్రాజెక్టు అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నేనే పూర్తిచేశానని చెప్పుకుంటున్నాడు. వివేకా హత్య వైఎస్ జగన్ చేయించారని చెప్పడానికి లోకేష్కు కొంచెమైనా విజ్ఞత ఉందా? వివేకా హత్య జరిగింది మీ హయాంలో కేసు దర్యాప్తును సాగకుండా అడ్డుకున్నది మీరుకాదా?. నిందితుల తరపున న్యాయవాదులు మీవారేనా కాదా?. వాస్తవాలపై చర్చ జరగకుండా బూతులు తిడుతున్నారు. తిట్టడం కాదు ఎవరు చర్చకు వస్తారో రండి. మీరు ఇలాగే రోజూ వ్యక్తిగత దూషణలు చేస్తూ పోతే మిమ్మల్ని ప్రజలు తరిమికొడతారు’’ అంటూ గడికోట శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. -
YS Jagan: నువ్వు మారుతావా.. నన్ను మార్చమంటావా..?
-
వెళ్తూ వెళ్తూ చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
CM చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ
-
జగన్ ని డ్యామేజ్ చేయడం అసాధ్యం.. లోకేష్ ని తొక్కేసి విజయ్ లా NTR సక్సెస్ అయితే!
-
చంద్రబాబు ఇది నీకు ట్రైలర్ మాత్రమే! జగన్ స్పీచ్ దద్దరిల్లిన భీమవరం
-
రూ.2 ముష్టి వేస్తున్నావా.? బాబు పై జగన్ ఉగ్రరూపం
-
జగన్ అస్త్రాల పదును.. కూటమి సమాధానం సున్నా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు, ప్రకటనలకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఎంత తేడా ఉంటుందో గమనించండి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు జగన్ను ఎలా దూషించాలా, వైఎస్సార్సీపీపై ఎలా ఆరోపణలు చేయాలా అన్నదానిపైనే కేంద్రీకరిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాక ఆయా టూర్ లలో ప్రజలను , అధికారులను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన తొట్రుపడుతున్న తీరును కూడా అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు ఎక్కడా ఆధారాలు ఉండవు. అదే జగన్ చాలా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడతారు. ఈ మధ్య ఏపీలో జరిగిన లాకప్ డెత్ కేసులు, పోలీసుల వేధింపులు తాళలేక జరుగుతున్న ఆత్మహత్యల కేసులు చంద్రబాబు ప్రభుత్వ పరువును బాగా దిగజార్చుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన అన్నది సర్వసాధారణం అయిపోతోంది.ఈ విషయాలను జగన్ ప్రస్తావిస్తూ ఎక్కడా కులాలు,మతాల గురించి మాట్లాడకుండా స్పెసిఫిక్గా ఆయా ఘటనలను వివరించారు. అదే చంద్రబాబు మాత్రం కులాలు,మతాలు గురించి మాట్లాడుతుండడం, రౌడీయిజం అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తుండడం కనిపిస్తుంది. చంద్రబాబు అంత సీనియర్ అయినప్పటికీ ఎందుకో బాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారా అన్న భావన కలుగుతుంది. అది వయసు ప్రభావం కావచ్చని కొన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతుంటే, అదేమీ కాదని, కావాలనే ఆయన డైవర్షన్ రాజకీయాలలో భాగంగా అలా మాట్లాడుతుంటారని మరికొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కుప్పం టూర్ లో ఒక అధికారిని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును ఉదహరిస్తున్నారు. ఏదో పని గురించి ఆయన అడగగా, ఆ అధికారి నిధుల ప్రస్తావన తేగానే ,వెంటనే ఆ మాటను తప్పించారు.మీకు అవకాశం ఇచ్చానని, ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని అంటూ ఏదో మాట్లాడారు. మరో సందర్భంలో ఒక పౌరుడి ఇంటి వంటగదిలో ఆంగ్లంలో మాట్లాడిన వైనం కూడా ఎవరికి అర్దం కాలేదు. ఇలాంటి ప్రయోగాలను చంద్రబాబు చేయకుండా ఉంటే బెటరేమో అని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ హే రామ్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేస్తూ,ఆయా ఘటనలను ప్రస్తావించారు. పోలీసుల పక్షపాత ధోరణి, రాష్ట్రంలో శాంతి భద్రతల లేమి ,సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణమైన కేసులు పెట్టడం వంటి వాటిని ఆయన వివరిస్తూ ఏపీకి కావాల్సింది రౌడీ రాజ్యం కాదని, జింగిల్ రాజ్ కాదని అన్నారు. ప్రజలకు భద్రత,బాదితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ లేవనెత్తిన అంశాలపై ఒక్కదానికి కూడా చంద్రబాబు బదులు ఇచ్చినట్లు అనిపించదు.పైగా తాను రౌడీలు, మాఫియాతో రాజకీయాలు చేయవలసి వస్తోందని అనడంలో అర్ధం ఉన్నట్లు కనిపించదు. ఆయన ఉద్దేశం వైసిపిని ప్రజలలో పలచన చేయడం కావచ్చు. కాని ఆయన ఆ మాట అనగానే జనానికి ఈ రెండేళ్లలో టీడీపీ,జనసేన నేతలు, కార్యకర్తలు పలువురు చేస్తున్న రౌడీయిజం,అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి.గతంలో టీడీపీకి చెందిన కొందరు చేసిన హత్యలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోందన్న వ్యాఖ్యలు కూడా ఆయా వర్గాలు చేస్తున్నాయి. యూట్యూబర్ రావణ అరెస్టు జరిగిన తీరు, ఆ క్రమంలో జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రౌడీయిజం చేసిన తీరేమిటి?పోలీస్ స్టేషన్ ల పైనే దాడులు చేయడం ఎప్పుడైనా గతంలో జరిగిందా?అది ప్రభుత్వ అసమర్ధత కాదా! దీని గురించి జవాబు చెప్పకుండా రౌడీ రాజకీయం అంటూ ఎవరిమీదో నెట్టాలని ఎందుకు చూస్తున్నారు?గాదె సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలలో జగన్ స్వయంగా రంగంలో దిగేవరకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది. అది కూడా అరకొరగా చేస్తూ పోలీసుల తప్పులను కప్పిపుచ్చే రీతిలో వ్యవహరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా?పైగా సాయికృష్ణ కాపు కులమేనని,సిఐ నాగరాజు అదే కులమని చెప్పడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏమి చెప్పదలిచారు?దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులతో టీడీపీకే చెందిన మరో నాయకుడి ఇంటిపైకి వెళ్లి కూల్చివేయడానికి చేసిన ప్రయత్నం చంద్రబాబు దృష్టిలో రౌడీయిజం అవుతుందా?కాదా?రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై చేసిన దారుణాల గురించి ఎందుకు చర్య తీసుకోలేకపోయారు. రౌడీలు రాజకీయం చేయడం వల్లే వివేక హత్య జరిగిందట.ఆ కేసులో దస్తగిరి అనే నిందితుడికి ఎందుకు టీడీపీ మద్దతు ఇస్తోందన్నదానికి జవాబు దొరకదు. మరి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను ఏ రౌడీలు హత్య చేశారు? టీడీపీ వారినే కదా ఆ రోజుల్లో అరెస్టు చేసింది?ఆనాడు జరిగిన ఘటనలపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఏమి రాశారు?నేరస్తులతో సమాజానికి నష్టం అని అంటున్నారు.నిజమే!కాని 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా!అందులో 80 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని వచ్చిన లెక్కలపై ఎప్పుడైనా స్పందించారా?ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఏదైనా ప్రచారం చేయవచ్చనుకుంటే రోజులు మారాయి. సోషల్ మీడియా విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. అందులో వాస్తవాలు చెప్పి ప్రశ్నిస్తున్నవారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు అంతగా తాపత్రయపడుతుంది అర్ధం కావడం లేదా?ఒకవైపు వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నీచాతీనీచంగా మాట్లాడిన టీడీపీ నేతలు కొందరిని ఎమ్మెల్యేలుగా చేసేది ఆయనే. జగన్ కుటుంబ సభ్యులను దారుణంగా బూతులు తిట్టిన వారితో టీడీపీ మహానాడులో ఉపన్యాసాలు ఇప్పించేది ఆయనే ! మళ్లీ బహిరంగ సభలలో అదేదో వైఎస్సార్సీపీఇలాంటివి చేస్తున్నట్లు ప్రచారం చేసేది ఆయనే!ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైఎస్సార్సీపీ ఫండింగ్ ఇస్తోందట. దానికి ఆధారం ఉంటే చూపించాలి కదా!అనేక యూట్యూబ్ చానళ్లను టీడీపీ పోషిస్తున్నదన్న అరోపణలు ఉన్నాయి కదా! ఈ చానళ్ళు ఎంత అసభ్యంగా ప్రచారం చేసిన చర్యలు ఉండవు.కాని అదే వైఎస్సార్సీపీపై మాత్రం విరుచుకుపడుతుంటారు. సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకరంగా ప్రచారం చేస్తే చర్య తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారు వేసే ప్రశ్నలకు జవాబు లేక ఏదో రకంగా కేసులు పెడుతున్న వైనాన్ని సమర్దించుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయమే కలుగుతుంది.ఐ టీడీపీ పేరుతో ఏమి చేసింది ఎవరికి తెలియదనుకుంటే ఎలా ? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తనకు రౌడీయిజం తెలియదని,తానెప్పుడు హత్యలు చేయలేదని అనవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఇలాంటి మాటలు అన్నప్పుడే సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుందని ఆయన అర్దం చేసుకోవాలి. మావిగన్ అని జగన్అంటే దానిని వాటికన్ తో పోల్చడం ఏమిటి?యధా ప్రకారం లడ్డూ కల్తీ అని స్పీచ్ ఇస్తున్నారు. ఆ కల్తీ ఫిర్యాదు తన హయాంలో వచ్చినా దానిని ఎదుటివారిపై రుద్దుతారు. అసలు ఆయన చేసిన జంతు కొవ్వు ఆరోపణ ఏమిటి?అలా మాట్లాడడం పాపం కాదా?ఇప్పటికీ భక్తుల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఎందుకు మాటలు కొనసాగిస్తున్నారు.ఏది ఏమైనా చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడలేకపోతున్నారన్న భావన జనంలో ఏర్పడుతోంది.జగన్ మాత్రం స్పష్టమైన ఆధారాలతో తన అభిప్రాయయాలు చెప్పడం ద్వారా తన విశ్వసనీయతను పెంచుకుంటున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సిండికేట్లను కూకటివేళ్లతో పెకలిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో అక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్బంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.అక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. అక్వా రైతులు దీనావస్థలో ఉన్నారు. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే పండగ.. రైతన్నలకు కన్నీరే. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్గా ఏర్పడ్డారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారు. చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది. ఆ సిండికేట్ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.అక్వా రంగంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకే మా ప్రభుత్వంలో రెగ్యులేటరీ బోర్ (అప్సడా) ఏర్పాటు చేశాం. సీడ్, ఫీడ్ మార్కెటింగ్లో సమస్యలు వస్తే పరిష్కరించాం. అక్వా రైతులకు యూనిట్కు రూ.1.50కే విద్యుత్ అందించాం. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశాం. ఐదేళ్లలో సబ్సీడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించాం. ఇందులో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల బకాయిల్ని మేమే చెల్లించాం. ఫీడ్రేట్లు, ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు పెట్టాం. ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించాం. మా హయాంలో అక్వా ఎగుమతుల విలువ రూ.20 వేల కోట్లు. బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నాం అని జగన్ గుర్తు చేశారు.కానీ, చంద్రబాబు మేం తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీలో అక్వా రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రోజు కేజీ రొయ్య కౌంట్ రూ.230 దాటని పరిస్థితి. నాలుగు నెలల్లో ఫీడ్పై కేజీకి 14-16 రూపాయలు ఎడా పెడా పెంచేశారు. ఏకపక్షంగా ధరలు పెంచొద్దని అనేకసార్లు చెప్పాం. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ వచ్చారు. రేట్లు పెంచితే పెంచారు.. తగ్గినప్పుడు తగ్గించరా?. ముష్టి వేసినట్లు రూ.2 లు తగ్గిస్తే సరిపోతుందా?. చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అన్నట్లు ఉంది అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోనీ.. చంద్రబాబు అక్వా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. చంద్రబాబు ప్రతీ అడుగు మోసం.. మోసం. నరసాపురంలో మేం తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారు. రూపాయిన్నర విద్యుత్కు కోత పెట్టారు. రైతులకు ఇవ్వాల్సిన 12 వేల విద్యుత్కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. అక్వా రైతులకు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా.. జనరేటర్లు పెట్టుకుని సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి.. భీమవరం మెడికల్ కాలేజీ పనులు కూడా నిలిపివేశారు అని జగన్ అన్నారు.అక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. నేనున్నాను. రైతుల కోసం ఉద్యమబాట పడతాం. మూడేళ్ల తర్వాత మన రైతు ప్రభుత్వం వస్తుంది. అప్సడాకు పూర్వవైభవం తెస్తాం. చంద్రబాబు సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెలికిస్తాం’’ అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
ఎందుకు ఆగిపోతున్నావ్ పవన్ కళ్యాణ్ నీకు చేతకాదా...? అడ్వకేట్ రజిని ఫైర్
-
ఉపాధ్యాయుల రణగర్జన
సాక్షి, అమరావతి: తమ ఆర్థిక, సర్వీసు ప్రయోజనాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కదం తొక్కారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించి.. కలెక్టరేట్లను ముట్టడించారు. తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకపోగా.. వివిధ మార్గాల్లో వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని.. 30% మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని, 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్ ఉన్న 5 డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 23(1)కు సవరణ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. కరోనా సమయంలో చనిపోయిన ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుతో పాటు 2025 సాధారణ బదిలీల్లో స్థానచలనం కల్పించిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలన్నారు. ఇన్ సర్వీస్ టెట్ మినహాయింపుపై ప్రభుత్వ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులు మూడు గంటలకు పైగా కూర్చొని ఏకధాటిగా కంప్యూటర్లో పరీక్ష రాయగలరా? అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ నేతృత్వంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలపగా.. పోలీసులు అడ్డుకొని ఆయనతో పాటు జిల్లా చైర్మన్ విజయరామరాజును అరెస్టు చేశారు. -
బాబు అప్పుల పద్దు రూ.3,59,157 కోట్లు
సాక్షి, అమరావతి: అప్పులతో పాటు నిత్యం చేబదుళ్లు, ఓడీలతో పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు మంగళవారం ఖాతాలో మరో రూ.3,800 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా ఈమేరకు అప్పులు చేసింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట, రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.3,59,157 కోట్లకు చేరాయి. ఇన్ని అప్పులు చేసినా సంక్షేమం, అభివృద్ధిని అటకెక్కించింది. కొత్తగా సంపద సృష్టించకపోగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు పనులతో ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తోంది. సూపర్ సిక్స్ ప్రధాన హామీలను సైతం అమలు చేయకపోగా గత ప్రభుత్వం ఇ చ్చిన పథకాలను సైతం రద్దు చేసింది. రెండేళ్ల పాలనలో అప్పుల మీద అప్పులు చేస్తున్నా హామీల ఊసు విస్మరించింది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదు. సంపద సృష్టీ లేదు. ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు అప్పులు చిట్టా: రూ.3,59,157 కోట్లు బడ్జెట్ అప్పులు: రూ.1,98,666 కోట్లు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి అప్పులు: రూ.1,13,104 కోట్లు రాజధాని అప్పులు: రూ.47,387 కోట్లు -
సర్కారు కిరాతకంలో మరో లాకప్డెత్!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు సర్కారులో వరుస లాకప్ డెత్లు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కారు కిరాతకానికి పరాకాష్ట. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారు గొలుసు చోరీ కేసులో నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులు తీసుకొచ్చిన బొల్లి ఏడుకొండలు (50) మంగళవారం పోలీసు స్టేషన్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసు దెబ్బలకే అతను చనిపోయాడని స్థానికులు అంటుండగా.., గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ బంగారు గొలుసు దొంగతనం కేసులో చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలును మనుబోలు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచి పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరుకుమూడి వెళ్లి ఏడుకొండలును తిరిగి అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదినట్లు సమాచారం. దెబ్బలకు తాళలేక అతను మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుమూడి దారిలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడుకొండలు మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏడుకొండలు సోదరి మంగళవారం రాత్రి స్టేషన్ చేరుకుని మా తమ్ముడిని తీసుకొ చ్చి, ఏమి చేశారంటూ విలపించడం కంట తడి పెట్టించింది. కాగా, ఏడుకొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. -
గోవిందా.. గోవింద.. రూ.వెయ్యి కోట్ల భూమి రూ.19 కోట్లకే ధారాదత్తం
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే చంద్రబాబు కూటమి సర్కారు దందాకు ఈసారి కలియుగ వైకుంఠం తిరుపతి వేదికైంది. రూ.వెయ్యికోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.19 కోట్లకే ఇచ్చేశారు. తిరుపతి కలెక్టరేట్కు కూతవేటు దూరంలో, రూరల్ మండలం దామినీడులోని 21.10 ఎకరాల విలువైన ప్రభుత్వభూమిని తిరుపతి వన్ ప్రాజెక్టు పేరుతో దివ్యశ్రీ హోల్డింగ్స్, సైబర్సిటీ బిల్డర్స్ కన్సార్షియంకు కారుచౌకగా కట్టబెడుతూ ప్రభుత్వం మంగళవారం జీవో ఎంఎస్ నంబరు 417 జారీచేసింది. ఈ భూమిని ముందుగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి బదలాయించి అటునుంచి ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా పకడ్బందీ స్క్రిప్టు రాశారు. కలెక్టరేట్కు సమీపంలోని ఈ ప్రైమ్ల్యాండ్ బహిరంగ మార్కెట్ విలువ ఎకరా దాదాపు రూ.50 కోట్లని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే 21.10 ఎకరాల విలువ రూ.వెయ్యికోట్లకుపైనే. అలాంటి భూమిని ఎకరా కేవలం రూ.90 లక్షల చొప్పున మొత్తం రూ.19 కోట్లకే దివ్యశ్రీ, సైబర్సిటీ కంపెనీలపరం చేశారు. మార్చి ఐదోతేదీ జరిగిన ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీఎల్ఎంఏ) సమావేశం ఈ భూమి ధరను ఎకరాకు రూ.2.25 కోట్లుగా నిర్ధారించి, మొత్తం రూ.47.47 కోట్లు వసూలు చేయాలని సిఫారసు చేసింది. కానీ నెల తిరక్కుండానే ఏప్రిల్ ఏడోతేదీ జరిగిన ఎస్ఐపీబీ భేటీలో ఆ రేటుకు కత్తెరేసి ఎకరా రూ.90 లక్షలకు తగ్గించారు. ఏపీఎల్ఎంఏ చెప్పిన ధరతో పోల్చినా ఖజానాకు 28.5 కోట్ల నష్టం. మార్కెట్ ధరతో పోలిస్తే రూ.980 కోట్లకుపైనే దోపిడీ. డబ్బు రాకముందే రిజిస్ట్రేషన్ ఈ భూమి రేటు బుక్ వాల్యూ ప్రకారం రూ.90 లక్షలు ఉంది కాబట్టి ఆ రేటే ఖరారు చేసి జీవోలో పొందుపరచాలని దివ్యశ్రీ, సైబర్సిటీ కన్సార్టియం ఎస్ఐపీబీని కోరింది. సర్కారు అక్షరం పొల్లుపోకుండా అదే చేసింది. ప్రభుత్వభూమి ధరను కొనే ప్రైవేటు కంపెనీలే నిర్ణయించడం బాబు పాలనలోనే సాధ్యమైంది. పైగా ఈ కంపెనీల కోసం రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఏ నిబంధనలను సడలించారు. ఖరారు చేసిన అత్తెసరు డబ్బూ ప్రభుత్వ ఖాతాలో పడకముందే డెవలపర్ల పేరిట లీజు/సేల్ డీడ్లు రిజిస్టర్ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. షరతులతో కూడిన సేల్డీడ్ పేరుతో మొత్తం 21.10 ఎకరాలను ఒకేదెబ్బకు దివ్యశ్రీ, సైబర్సిటీకి కట్టబెట్టేందుకు లైన్క్లియర్ చేశారు. ముఖ్యనేత తనయుడికి కమీషన్లు? ఈ ప్రాజెక్టుకు అల్ట్రా మెగా హోదా ఇచ్చి 15 ఏళ్లపాటు నికర ఎస్జీఎస్టీ వందశాతం తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. రూ.40 కోట్ల వరకు క్యాపిటల్ సబ్సిడీ, స్టాంప్డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీయింబర్స్మెంట్, ఐదేళ్లు పరిశ్రమల టారిఫ్పైనే కరెంటు సరఫరాకు అంగీకరించి ఆ రెండు కంపెనీలపై రాయితీల వర్షం కురిపించారు. ఒకవైపు భూమి కారుచౌక.. మరోవైపు పన్నుల మాఫీ. ఈ కారుచౌక కేటాయింపు వెనుక ముఖ్యనేత తనయుడికి రూ.వందల కోట్ల కమీషన్ల ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఆక్వా రైతు ఆక్రోశం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆక్వారంగం చంద్రబాబు సర్కారు నిర్వాకంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రూ.వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే ఆక్వా రంగం కకావికలం కావడంతో రైతుల గుండె చెరువైంది. కూటమి సర్కారు చేష్టలుడిగి చూస్తుండటంతో ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. కనివినీ ఎరగని రీతిలో ఓవైపు మేత ధరలు ఆకాశాన్నంటుతుంటే రొయ్యల కౌంట్ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే ఆక్వాకు సబ్సిడీ విద్యుత్ అందిస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించడమే కాదు.. అమలులో ఉన్న సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లకు ‘పవర్ ఫ్యాక్టర్’ నిబంధనల పేరిట కోతలు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు సర్కార్ అసమర్థత, కంపెనీల సిండికేట్ మాయాజాలం మధ్య చిక్కుకుని ఆక్వా రైతు విలవిల్లాడిపోతున్నాడు. కౌంట్ ధరల్లో ఎడాపెడా కోత ఈ – ఫిష్ డేటా ప్రకారం రాష్ట్రంలో 1.62 లక్షల మంది రైతులు 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేçస్తున్నారు. ఏటా 10 లక్షల టన్నులకుపైగా దిగుబడులొస్తున్నాయి. ఆక్వా సాగుదారుల్లో నూటికి 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వైరస్లు, వాతావరణ ప్రభావంతో కనీస దిగుబడులు కూడా రాని దుస్థితిలో కూరుకుపోయారు. ఓ వైపు దిగుబడులు నేలచూపులు చూస్తున్నాయి. మరొక వైపు పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్ చార్జీల కారణంగా 100 కౌంట్కు రావాలంటే కిలోకు రూ.250, 50 కౌంట్కు రూ.300, 30 కౌంట్కు రూ.350కి పైగా ఖర్చవుతోంది.ట్రంప్ సుంకాల పేరిట కౌంట్ ధరలు గత ఏడాది కిలోకి రూ.30–70 మేర తగ్గించగా, పశ్చిమాసియా యుద్దం బూచితో మళ్లీ రూ.30–80 మేర తగ్గించేశాయి. మూడు నెలల క్రితం కిలో రూ.275 పలికిన 100 కౌంట్ ప్రస్తుతం రూ.235కి దిగజారింది. అందులో కూడా రూ.10–15 మేర కోతలేస్తూనే ఉన్నారు. మరొకవైపు గతంలో కౌంట్కు, కౌంట్కు మధ్య రూ.30–50 మేర వ్యత్యాసం ఉండేది. నేడు కంపెనీల సిండికేట్ కారణంగా ఆ వ్యత్యాసం కేవలం రూ.10–30కి పరిమితం కావడంతో ఆక్వా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మేత ధర టన్నుకు రూ.16 వేలు పెంపు లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.90 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.4 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేత కోసం రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72 – 80 వేలు ఉండగా ప్రస్తుతం పెరిగిన ఫీడ్ ధరల కారణంగా వెనామీ ఫీడ్ రూ.1.13 లక్షలు, టైగర్ ఫీడ్ రూ.1.26 లక్షలకు చేరింది. ఆక్వా రైతులకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టాన్ని చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేయడంతో ఫీడ్ కంపెనీలు దోపిడీకి పాల్పడుతున్నాయి. అప్పడా చట్టానికి విరుద్ధంగా గడిచిన 5 నెలల్లో మేత ధరలు టన్నుకు రూ.16 వేలు చొప్పున పెంచాయి. సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో రూ.4 వేలు తగ్గించేందుకు అంగీకరించిన కంపెనీలు 24 గంటలు తిరక్కుండానే యూటర్న్ తీసుకున్నాయి. టన్నుకు రూ.2 వేలకు మించి తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. మరొకవైపు ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాల ధరలను కంపెనీలు ఇటీవలే భారీగా పెంచేశాయి. ఒక్కో ఏరియేటర్ సెట్పై రూ.3 వేలు, సాధారణ, ప్రీమియం మోటార్లపై రూ.1,000కిపైగా పెంచారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు అర్దరూపాయి కూడా పెరగని రొయ్యల సాగులో ఉపయోగించే మందుల రేట్లు ఇప్పుడు రెండేళ్లలో 30 శాతం పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో సీడ్ ధరలు 35 నుంచి 33 పైసలకు తగ్గిస్తే ఇప్పుడు మళ్లీ 35 పైసలకు పెంచేశారు. విద్యుత్ సబ్సిడీకీ ఎగనామం జోన్, నాన్జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామంటూ ఇచ్చిన హామీకి చంద్రబాబు నీళ్లు వదిలారు. పవర్ ఫ్యాక్టర్ పేరిట ఉన్న విద్యుత్ కనెక్షన్లకు కోత పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. మరోవైపు సర్చార్జీ, సర్దుబాటు చార్జీలంటూ ఎడాపెడా బాదేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో సబ్సిడీకి అర్హత పొందిన రైతులు మినహా ఈ రెండేళ్లలో కొత్తగా ఏ ఒక్క రైతు విద్యుత్ సబ్సిడీ పొందలేని దుస్థితి నెలకొంది. సబ్సిడీ పొందే రైతులు సైతం అదనపు చార్జీల పేరిట యూనిట్ రూ.2.50కుపైగా చెల్లిస్తున్నారు. ఇక సబ్సిడీ వర్తించని రైతులకు వాస్తవంగా యూనిట్ రూ.3.85 పైసలకే విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, రూ.5కు తక్కువ కాకుండా బిల్లులొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ లోడ్, అదనపు చార్జీల పేరిట ఒక్కో సర్వీసుకు రూ.8 వేల నుంచి రూ.12వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో రూ.3,804 కోట్ల సబ్సిడీ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2019లో అధికారం చేపట్టిన మరుక్షణం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్ రూ.1.50కే ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. టీడీపీ హయాంలో ఎగ్గొట్టిన రూ.309.95 కోట్ల బకాయిలను సైతం చెల్లించింది. అస్తవ్యస్థంగా ఉన్న ఆక్వా జోనేషన్ను చక్కదిద్దింది. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 విద్యుత్ సబ్సిడీని వర్తింప చేసింది. ఆక్వా చెరువులకు 64,735 కనెక్షన్లు ఉండగా జోన్ పరిధిలో ఉన్న 54,033 సర్వీస్లకు సబ్సిడీ విద్యుత్ను సరఫరా చేశారు. 84 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు. పాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3,804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్ట్లను తెచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడుసార్లు ఉపసంహరింపచేయడం ద్వారా టన్నుకు రూ.8,600 వరకు రైతులపై భారం పడకుండా ఆదా చేశారు. 15 రోజులకు ఒకసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేశారు. -
‘రైతుల్ని గాలికొదిలేసి అమరావతి దోపిడీకి ప్రాధాన్యం’
తాడేపల్లి: తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతోపాటు ఎరువుల కొరతతో రైతాంగం అల్లాడిపోతుంటే కనీసం రివ్యూ కూడా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్రెడ్డి నిలదీశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డెల్టా ప్రాంతాల్లో కొద్దిపాటి పంటలు వేసుకున్న రైతులకు కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని చేతకాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి యూరియా కోసం వెళ్లి రైతులు అసువులు బాసిన రైతుల మరణాలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేసి, రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని లూఠీ చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ఏం రంగం చూసినా వెనుకబాటుతనమే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ప్రశ్నించే గొంతులను నొక్కడమే ధ్యేయంగా సోషల్ మీడియాని కట్టడి చేయాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు.ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించే చంద్రబాబు కుట్రను అర్థం చేసుకున్నాం కాబట్టే వీటన్నింటినీ సంస్కారంతో భరిస్తున్నామని చెప్పారు. కానీ తప్పుడు కేసులకు భయపడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.వర్షాభావ పరిస్థితులపై ముందస్తు ప్రణాళిక లేదురాష్ట్రంలో ఎలినినో ఎఫెక్ట్ వల్ల జూన్ నుండి సెప్టెంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ 6 నెలల ముందే హెచ్చరించింది. అయినా ఈ ప్రభుత్వం కనీసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోకుండా రైతులను గాలికి వదిలేసింది. ఖరీఫ్ సీజన్ మొదలై ఒకటిన్నర నెల గడుస్తున్నా.. ఇంతవరకు విత్తన సాగు లేక రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. మే నెలలోనే విత్తన సరఫరా జరగాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. డెల్టా ప్రాంతాల్లో కొద్దిపాటి పంటలు వేసుకున్న రైతులకు కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని చేతకాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. శ్రీకాకుళంలో ఎరువుల కోసం వెళ్లిన మహిళ చనిపోవడం అత్యంత విచారకరం. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేదు. రాష్ట్రంలో పశుగ్రాస కొరత తీవ్రమవుతోంది. రైతులకు అందాల్సిన ఉంచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, పెట్టుబడి సాయంపై ఈ ప్రభుత్వం కనీసం అధికారులతో ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం.రాజధాని నిర్మాణాల పేరిట వేల కోట్ల దోపిడీరాజధాని పేరుతో రూ.50వేల కోట్లు అప్పులు తెచ్చి, ప్రజల నెత్తిన భారం వేస్తూ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట దోపిడీ చేస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో కేవలం 10 లక్షల చదరపు అడుగులతో రూ. 670 కోట్లలో అద్భుతమైన సచివాలయం నిర్మించుకున్నారు. కానీ ఇక్కడ 52 లక్షల చదరపు అడుగులతో సచివాలయం ఎందుకు కడుతున్నారు? ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సచివాలయమే 6.8 లక్షల చదరపు అడుగులు ఉంది. అది సరిపోవడం లేదా? చదరపు అడుగుకు రూ. 20వేల చొప్పున ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. సంవత్సరానికి కేవలం 40 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆంధ్ర భవన్ను చదరపు అడుగుకు రూ. 4,500 ఖర్చుతో నిర్మిస్తుంటే, ఇక్కడ అన్ని వనరులు ఉచితంగా ఉన్నా రూ. 20వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మేము అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వైఎస్సార్సీపీ రాజధానికి వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలోనే వాస్తవ అభివృద్ధిదివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞం వల్లే ఇవాళ గ్రామాలు పచ్చగా ఉన్నాయి. పోలవరం సహా ఏ ప్రాజెక్టు చూసినా వైఎస్సార్ పేరే వినిపిస్తుంది. వైఎస్ జగన్ రెడ్డి గారి హయాంలోనే గ్రామ సచివాలయాలు వచ్చాయి, 17 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది. నిన్న పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి కేంద్రం నుండి 100 సీట్లు మంజూరు కావడం జగన్ దూరదృష్టికి నిదర్శనం. నూతన పోర్టుల నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైంది. గతంలో జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఫ్రీబీస్ అంటూ విమర్శించారు. జగన్ పేద ప్రజల చదువు, ఆరోగ్యం, మహిళల ఆర్థిక స్థితిగతుల కోసం నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు వేశారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఎకరా 99 పైసల చొప్పున భూములను ధనవంతులకు దోచిపెడుతోంది. మీవి అవినీతి ఫ్రీబీస్ అయితే, జగన్ సామాన్యుడికి చేసిన సహాయం.ముఖ్యమంత్రి స్థాయికి తగని బూతుల పురాణందేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడనంతటి అసభ్యకరమైన భాషను, బూతులను చంద్రబాబు వేదికలపై మాట్లాడుతున్నారు. వయసులో తన కొడుకు సమానమైన వైఎస్ జగన్ గారు ఇప్పటికీ చంద్రబాబు గారిని 'పెద్దమనిషి' అని, 'గౌరవ ముఖ్యమంత్రి' అని సంబోధిస్తారు. కానీ చంద్రబాబు గారు కింది స్థాయి నేతలకు కూడా బూతులు నేర్పిస్తూ వ్యవస్థలను దిగజారుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రూ. 3.36 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కేవలం రెండుళ్లలోనే చంద్రబాబు రూ. 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం లేకనే ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వ అవినీతిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారా లేదా? ప్రజాస్వామ్య విధ్వంసం - సోషల్ మీడియాపై ఉక్కుపాదంనిన్న గంట సేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే.. అందులో 90శాతం సమయం కేవలం సోషల్ మీడియాను ఎలా అణచివేయాలి, ప్రశ్నించే వారిపై ఎలాంటి కేసులు పెట్టాలి అనేదానిపైనే చర్చించారు. మిగిలిన 10 నిమిషాలు భూములు ఎలా పంచుకోవాలనే దానికి కేటాయించారు. ప్రశ్నించిన వారిని హింసించడం, యూట్యూబర్స్ ఇళ్లకు పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేయడం చూస్తుంటే తాలిబాన్ల పరిపాలన మేలనేలా ఉంది. నాగార్జున యాదవ్ ఎప్పుడో రెండేళ్ల క్రితం మాట్లాడిన మాటలకు ఇప్పుడు చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారు. క్రాంతి అనే దళిత యువకుడు పోలీసుల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. జ్ఞానేశ్వరి అనే చిన్నారి అదృశ్యమై 30 రోజులు దాటినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. లాకప్లో మరణించిన సాయికృష్ణ కేసు ఈ ప్రభుత్వం మెడకి చుట్టుకుంది. వీటన్నింటికీ సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాటిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారనే కోపంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వ్యక్తిగత దూషణలు చేసినా సంస్కారంతో భరిస్తాం. కానీ, ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ ఎప్పటికీ ఆపదని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. -
రావణ్ ను ఉరితీస్తారా...!? పొన్నవోలు షాకింగ్ కామెంట్స్
-
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ సంచలన లేఖ
విజయవాడ: సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన లేఖ రాశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు కేటాయింపులు, అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ లేఖ రాశారు. గన్నవరం ఎయిర్ పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టు పనులను కేఎంవీ సంస్థకు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇవ్వడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్ర విమర్శలు చేశారు. కేఎంవీ సంస్థ వల్లభనేని వంశీకి సన్నిహితుడిదని యార్లగడ్డ వెంకట్రావ్ ప్రచారం చేయడాన్ని వల్లభనేని వంశీ సవాల్ చేశారు. యార్లగడ్డ వెంకట్రావ్ ఆరోపణల నేపధ్యంలో సిబిఐతో సమగ్ర విచారణ చేయించాలని వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. కేఎంవీ సంస్థలకు పనుల కేటాయింపులో అవినీతి ఆరోపణల పై దర్యాప్తు చేయించాలన్నారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉందంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. సిబిఐతో విచారణ చేయించి నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విచారణలో అవినీతి జరిగినట్లు తేలితే బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందులో తన ప్రమేయం ఉందని నిర్ధారణ జరిగితే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని చాలెంజ్ చేశారు వల్లభనేని వంశీ. -
5 లక్షలు ముష్టి వేస్తున్నావా.. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు, కొత్త ఇల్లు
-
జగన్ అంటే ఎందుకంత భయం విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసుల ఆంక్షలు
-
‘ఏపీ అంతా ఏసీ చేయిస్తానని చెప్పగలరు’.. భూమన వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, తిరుపతి: అమరావతిలో అమెజాన్ అడవుల సృష్టిపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి సెటైర్లు విసిరారు. ‘‘అమరావతిలో మినీ అమెజాన్ నిర్మించబోతున్నట్లు పచ్చ పత్రిక ప్రచురించింది. 5 ఎకరాల్లో 20 వేలకు పైగా చెట్లు, 400 జాతులు మొక్కలు ఉంటాయని, పొడవైన చెట్లు ఏర్పాటు, జీవ వైవిధ్యం పెంపొందిస్తామని, కృత్రిమ సెలయేళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు...శిక్షణ కేంద్రం ఉంటుందని పొగమంచుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అంటున్నారు. అమెజాన్ అడవులు వాతావరణంలో 4 డిగ్రీలు తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. 7 ఎకరాల్లో పసిఫిక్ మహా సముద్రం కూడా తీసుకురావాలి. టైటానిక్ షిప్ను కూడా ఏర్పాటు చేయాలి’’ అంటూ భూమన వ్యంగ్యాస్త్రాలు సంధించారు...అమరావతిలో హిమాలయ పర్వతం ఏర్పాటు చేయండి. ఇంద్రుని అమరావతి కంటే.. మీ అమరావతిలో గొప్పగా సృష్టించండి. అన్ని ఎయిర్పోర్టుల్లో బార్లు తెరడానికి నిర్ణయించారు. ఏపీ అంతా ఏసీ చేయిస్తా అని చెప్పగలరు.. మీ పత్రికలు ద్వారా నమ్మించగలరు.’’ అంటూ భూమన మండిపడ్డారు. -
చంద్రబాబుకు తెలియని నిజం, అమరావతికి లక్ష ఎకరాలు!
-
కోటను తవ్వి ఎలుకనూ పట్టలేదు!
సాక్షి ప్రతినిధి, కడప: పర్యాటక ప్రాంతమైన గండికోటలో గత ఏడాది (2025 జూలై 14న) చోటుచేసుకున్న మైనర్ బాలిక అత్యంత క్రూరమైన హత్య కేసు జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, టవర్ లొకేషన్లు, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ వంటి అత్యాధునిక పరీక్షలు నిర్వహించి, ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు పర్యవేక్షించినా క్షేత్రస్థాయిలో ఫలితం మాత్రం ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ చందంగా మారింది. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు శరవేగంగా అర్ధరాత్రి పూట కూడా స్పందించే సీఎం చంద్రబాబు సర్కార్.. ఒక అబల ప్రాణం పోయి ఏడాదైనా నిందితులెవరో తేల్చలేక చేతులెత్తేయడం గమనార్హం. మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ దాకా.. ఇంటర్మీడియట్ చదువుతున్న సదరు బాలిక కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2025 జూలై 14న ప్రొద్దుటూరు పోలీసులు క్రైమ్ నెంబర్ 257/2025 కింద మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గండికోట పరిసరాల్లో బాలిక హత్య వ్యవహారం బహిర్గతం కావడంతో జమ్మలమడుగు పోలీసులు క్రైమ్ నంబర్ 498/2025 కింద హత్య కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ మైనర్ బాలిక హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. లోకేష్కు క్లీన్చిట్ ఇచ్చిన డీఐజీ.. ఆంతర్యమేమిటి? ఈ మైనర్ బాలిక హత్య కేసులో కర్నూల్ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ అత్యంత వేగంగా ఒక నిర్ధారణకు రావడం సర్వత్రా అనుమానాలకు తావిచ్చింది. అప్పట్లో ఘటన స్థలానికి చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్, అప్పటి ఎస్పీ అశోక్కుమార్ సమక్షంలోనే విలేకరులతో మాట్లాడుతూ.. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని హడావుడిగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, “ఈ రోజు సాయంత్రానికే నిందితులను అదుపులోకి తీసుకుంటామని, ఎస్పీ పూర్తి వివరాలు తెలియజేస్తారన్ఙి మీడియాకు వివరించారు. అయితే, సీసీటీవీ ఫుటేజీలలో బాలిక లోకేష్ బైక్పై గండికోటకు వెళ్లినట్లు, తిరుగు ప్రయాణంలో లోకేష్ ఒక్కడే వస్తున్నట్లు స్పష్టంగా రికార్డు అయినా.. డిఐజీ స్థాయి అధికారి కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే లోకే‹Ùకు క్లీన్చిట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు మాయం ముఖ్య అనుమానితుడు లోకేష్కు డీఐజీ క్లీన్ చిట్ ఇవ్వడంతో దర్యాప్తు దృష్టి ఒక్కసారిగా మృతురాలి సమీప బంధువుల వైపు మళ్లింది. స్నేహితుడు హత్య చేయలేదంటే, ఇది కచ్చితంగా బంధువులే చేసిన ‘పరువు హత్య’ అయ్యి ఉంటుందనే కోణంలో విశ్లేషణలు నడిచాయి. పోలీసులు మృతురాలి బంధుగణాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణకు బంధువులంతా పూర్తిగా సహకరించినప్పటికీ, అటు వైపు కూడా ఎలాంటి క్లూస్ కానీ, ఆధారాలు కానీ లభ్యం కాలేదని పోలీసులు తేల్చేశారు. ఇద్దరు ఎస్పీలు మారినా తేలని మిస్టరీ.. జవాబు చెప్పాల్సింది విజనరీ సీఎంగండికోట మైనర్ బాలిక హత్య కేసును వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు ఏడాది దాటినా చేధించలేకపోవడం పోలీసు యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. అప్పటి ఎస్పీ అశోక్కుమార్తో పాటు ప్రస్తుత ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సైతం ఈ కేసును స్వయంగా పర్యవేక్షించారు. టవర్ లోకేషన్ల ద్వారా ఫోన్కాల్స్ విశ్లేషణ, అనుమానిత వాహనదారుల విచారణ వంటి అన్ని సాంకేతిక వ్యవహారాలను ఉపయోగించి దర్యాప్తు చేసినా సంక్లిష్టత అలాగే ఉండిపోయింది.అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా ఈ కేసు చేధించలేకపోవడం వెనుక ఉన్న తెరవెనుక రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఏమిటో ‘విజనరీ సీఎం’ అని చెప్పుకునే చంద్రబాబు సర్కారే తేల్చి చెప్పాలని రాజకీయ విశ్లేషకులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఏపీలో నయా స్కీమ్.. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
-
బద్వేల్ టీడీపీలో కోల్డ్ వార్ కొత్త నాయకత్వం వైపు చంద్రబాబు
-
పోలవరానికి చంద్రబాబు ఉరి...!
-
Exclusive Visuals: పోరాటం ఆపను... యనమల నాగార్జున యాదవ్
-
Magazine Story : రాజధానికి భూములిచ్చిన రైతులను నిలువునా ముంచేశారు
-
బాబు సభ నుంచి వెళ్ళిపోతున్న జనం వైరల్ అవుతున్న వీడియో
-
రావణ్ ఎపిసోడ్.. పరువు పోగొట్టుకున్న బాబు, పవన్!
రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సామర్థ్యం దేశంలో మరే పార్టీకి ఉండకవచ్చు. రావణ్ అనే యూట్యూబర్పై దేశద్రోహం కేసు పెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అయింది. అంతా ఇదేమి పద్దతి అని నొచ్చుకున్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తీరని అప్రతిష్ట వస్తే,ఎపి పోలీసు వ్యవస్థకు కళంకం ఏర్పడిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ వెంటనే వ్యూహం మార్చి వైఎస్సార్సీపీపై బురద చల్లడం ఆరంభించింది. ఎల్లో మీడియాతో పాటు, సోషల్ మీడియాలో తనకు ఉన్న పట్టు మేరకు విపరీతమైన వ్యతిరేక ప్రచారం సాగించింది.అదే టైమ్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో వైఎస్ జగన్పైన, వైఎస్సార్సీపీపైన నిందలు వేయడం ఆరంభించారు. రావణ్ అరెస్టు చేశాక జరిగిన పరిణామాలలో జనసేన పరువు పోగొట్టుకుంటే, తీవ్రవాద నిరోధచట్టం కింద కేసులు, దేశద్రోహం కేసులు వంటివి పెట్టి తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. జనసేన క్యాడర్ కొంతమంది అరాచకంగా పోలీస్ స్టేషన్లపై దాడులు చేసినా వారిని అరికట్టలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసులు పెట్టలేదు. జనసేన వారిపై కేసులు పెడితే ఎక్కడ పవన్ కళ్యాణ్కు, ఆ పార్టీ వారికి కోపం వస్తుందన్న భయం కావచ్చు.జనసేన జనంలో పలచన అయినా ఫర్వాలేదులే అన్న వ్యూహం కావచ్చు. కాని న్యాయ వ్యవస్థ తగురీతిలో స్పందించి రావణ్ కు బెయిల్ ఇచ్చేస్తుండడంతో పవన్ను సంతృప్తి పరచడానికిగాను అన్నట్లు తీవ్రమైన నేరారోపణ చేస్తూ రావణ్పై కేసులు పెట్టింది. ఈ ఫిర్యాదు చేసింది జనసేనకు చెందిన ఒక స్థానిక నేత అయినా, దానిని ఆమోదించడం ద్వారా టీడీపీ కూడా భాగస్వామి అయినట్లయింది. చంద్రబాబు ఆధ్వర్యంలోనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీతో పాటు, వామపక్షాలు, ఆలోచనాపరులు, విజ్ఞులైనవారంతా స్పందించారు. న్యాయవాది జడ శ్రావణ్ ఇదంతా కుట్ర పూరితంగా చేస్తున్నారని విమర్శించారు.సామాజిక అంశాలపై కూడా స్పందించే నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు రావణ్ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పలువురు సీనియర్ పాత్రికేయులు, యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కొంతమంది ప్రభావశీలురు కూడా ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వీడియోలు చేశారు. రావణ్ చేసిన విషయాలలో తప్పు ఉంటే చర్య తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు.కాని తప్పుడు కేసులు పెట్టడం, అది కూడా ఏకపక్షంగా చేయడంపైనే అంతా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గతంలో నక్సల్సిజంకు సంబంధించి చేసిన అనుకూల ప్రకటనల వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.దీంతో రావణ్ విషయంలో తప్పుడు కేసు పెట్టిన విషయం జనం అందరికి తెలిసిపోయిందన్న ఆందోళనతో చంద్రబాబు సర్కార్ వ్యూహాత్మక ఎదురుదాడి చేయడం ఆరంభించింది. రావణ్ దేశద్రోహి అని, సమాజ విధ్వంసకుడు అని, హిందూ మత వ్యతిరేకి అని ఇలా పలు ఆరోపణలు సంధిస్తూ ప్రచారం చేయడానికి టీడీపీ, జనసేనలు యత్నించాయి. వారికి బీజేపీ కూడా జత కలిసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ పైన, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పైన పలు విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టారు. చివరకు చంద్రబాబు కూడా ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. రావణ్కు జగన్ మద్దతు ఇస్తారా అంటూ టీడీపీ గంభీరంగా మాట్లాడే యత్నం చేసి దొరికిపోయిందని చెప్పాలి. నిజానికి రావణ్ ఎప్పుడూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒకప్పుడు వపన్ కళ్యాణ్ అభిమాని.ఆ విషయం ఆయనే పలుమార్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై వ్యతిరేక వీడియోలు చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలు విమర్శలతో వీడియోలు చేసిన వ్యక్తి రావణ్. అయినా రావణ్పై కూటమి సర్కార్ తీవ్రమైన కేసులు పెట్టడం మీద జగన్ మానవత్వంతో స్పందించారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కులాలు, మతాలకు అతీతంగా ఆయన వ్యవహరిస్తే సమాజ విధ్వంసకుడు రావణ్ను సమర్థిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.అయితే అదే టైమ్లో వామ పక్షాలు కూడా రావణ్పై ఉపా కేసులు పెట్టడంపై మండిపడ్డాయి. వారి జోలికి మాత్రం టీడీపీ, జనసేనలు వెళ్లలేదు. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ చాలా ఘాటుగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది తప్పుడు కేసు అని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్పై కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెట్టిందని ఆయన తెలిపారు. రావణ్పై పెట్టిన కేసులకు ఆధారంగా అక్కడక్కడ, ఆయా సందర్భాలలో మాట్లాడిన మాటలను కట్ చేసి, ముక్కలు, ముక్కలు అతికించి వీడియోల రూపంలో పోలీసులు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇతర మతాలను దారుణంగా అవమానించే రీతిలో మాట్లాడితే దానికి జవాబు ఇచ్చారే కాని రావణ్ స్వయంగా మతాలను దూషించలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో ఏపీ పోలీసుల దుశ్చర్య ప్రజలకు మరింత స్పష్టంగా తెలిసింది. మరి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎందుకు టీడీపీ విమర్శలు చేయలేకపోయింది. ఆయన అడిగినవాటికి ఎందుకు జవాబులు ఇవ్వడం లేదు. ఇప్పటికే సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగవ్వ, తదితర కేసులలో పోలీసులపై మచ్చపడింది. దానికితోడు రావణ్ పై తప్పుడు కేసు పెట్టారని ఒక రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించడంతో అటు చంద్రబాబు, పవన్లకు, ఇటు పోలీసు అధికారులకు బాగా డామేజీ అయిందని చెప్పాలి.చిత్రమేమిటంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్సార్సీపీకి చెందిన ఒక నేత పార్టీపై అసమ్మతితో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా రోజూ మాట్లాడుతుంటే వైఎస్ జగన్ ప్రభుత్వంపై దారుణమైన ఆరోపణలు చేస్తుండేవారు. దానిని ఎల్లో మీడియా లైవ్ కవరేజీ ఇచ్చి అదేదో పండగ మాదిరి సంబర పడేది. అంతే తప్ప ఆయన సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారని ఎక్కడా రాయలేదు.రాజద్రోహం కేసు పెట్టి ఆయనను అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ నానా రచ్చ చేసింది. ఇప్పుడేమో అదే రాజద్రోహం కేసును రావణ్పై బనాయిస్తోంది. దాస్ అనే వ్యక్తి చేస్తున్న దారుణ ప్రసంగాలపై చర్య తీసుకుని ఉంటే కూటమి ఇప్పుడేమి చెప్పినా అర్థం ఉండేది. పవన్ కళ్యాణ్ తాను గతంలో నక్సలిజానికి, చెగువేరాకు ఎందుకు మద్దతు ఇచ్చింది చెప్పి తప్పు చేశానని ప్రకటించి ఉంటే ఆయనలో నైతికత ఉందన్న అభిప్రాయం కలిగేదన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన అంశాలకు ఏపీ పోలీసులు సమాధానం ఇస్తారా? ఆయనపై కూడా టీడీపీ దాడి చేస్తుందా? టీడీపీ, జనసేనలు ఈ అంశంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే వారే సెల్ప్ గోల్ వేసుకున్నట్లవుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ తో పైసా పని లేదు.. బాబు మాఫియా
-
సీపీఎస్ ఉద్యోగులకు వెన్ను పోటు!
సాక్షి, అమరావతి: అందరినీ మోసం చేసినట్లే చంద్రబాబు ఉద్యోగులనూ మోసగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా తుంగలో తొక్కుతూ పాలన సాగిస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మేనిఫేస్టోలో ఇచ్చిన హామీకి మంగళం పాడేశారు. అధికారంలోకి రాగానే సీపీఎస్, ఓపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్ల పాలన పూర్తయినప్పటికీ ఆ హామీని నెరవేర్చడానికి ఎటువంటి చర్యలనూ తీసుకోకుండా లక్షలాదిమంది సీపీఎస్ ఉద్యోగులను మోసం చేశారు.సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి సోమవారం ప్రభుత్వమిచ్చి న ఉత్తర్వులే దీనికి నిదర్శనం. 2004 సెపె్టంబర్ 1కి ముందు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేసి, దాని ఆధారంగా ఆ తరువాత ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు మాత్రమే అది కూడా ఒకేసారి సీపీఎస్ నుంచి ఓపీఎస్కు మారేందుకు అవకాశమిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. దీనివల్ల కేవలం 10 వేల మంది ఉద్యోగులకు మాత్రమే సీపీఎస్ నుంచి ఓపీఎస్కు మారేందుకు అవకాశం కలిగింది. మిగతా మూడు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఈ పదివేల మందికి అవకాశం కల్పిస్తూ ఇచ్చిన జీవో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇచ్చిందే తప్ప చంద్రబాబుకు ఉద్యోగుల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధీలేదని స్పష్టమయ్యింది. -
చంద్రన్న బోడిగుండు పథకం!
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు’ అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారికి రెగ్యులర్గా రావాల్సిన డీఏలు, ఐఆర్, పీఆర్సీ వంటివి కూడా ఇవ్వకుండా ఉద్యోగులు అందరికీ నున్నగా క్షవరం చేసే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు బోడిగుండు పథకం అమలు చేస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు అందరిముందర గుండ్లు చేయించుకున్నారు. ఉద్యోగులు కోల్పోయింది రూ. 37 వేల కోట్లకు పైమాటే..ప్రతినెలా ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న క్షవరం విలువ అక్షరాలా రూ.1500 కోట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఉద్యోగులకు చేసిన మొత్తం క్షవరం విలువ సుమారు రూ.37 వేల కోట్లని చెప్పారు. ఇవి తాను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పడంలేదని, పూర్తి లెక్కలు ఇస్తున్నానని చెప్పి ఆ వివరాలు విడుదల చేశారు. ఈ రూ.37 వేల కోట్లు కేవలం కూటమి రెండు సంవత్సరాల పాలనకు సంబంధించిన బకాయిలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. ఉద్యోగులను ఈ స్థాయిలో ముంచిన ఘనత గతంలో ఎవరికీ లేదన్నారు. అమరావతికి సోకులు.. తుగ్లక్ పాలనకు నిదర్శనం..ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా అమరావతిలోని భవనాల సోకులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుడుతున్నారని తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల ముందు పక్క బిగించే అద్దాల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోందని, చదరపు అడుగుకు అద్దాల కోసం రూ.5 వేలు ఖర్చు పెడుతోందన్నారు. ఈ భవనాల నిర్మాణం సోకులు, అన్నీ కలిపి చదరపు అడుగుకి రూ.20 వేల ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఒక పక్క ఉద్యోగులకు వేల కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టి, అమరావతిలో సోకులకు రూ.వేల కోట్లు ఖర్చు బెట్టడం తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులపై సానుకూలంగా లేదన్నారు. ఆత్మహత్యలే మేలనుకుంటున్నారు..ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక గత జూన్ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయలేమంటూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి రాజరికపు కాలం నాటి బానిసల కంటే హీనంగా ఉందని, వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవని అయినా అడిగే దిక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు పెట్టి ఉద్యోగుల సమస్యలు వినేదని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు వినే వారు కూడా లేరన్నారు. ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు సరిగా స్పందించడం లేదన్నారు. -
కర్రలతో TDP నేతల కొట్లాట తలలు పగిలి.. రక్తపాతం
-
కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ను నిర్వీర్యం చేశారు
-
బాబుపై తిరగబడ్డ సొంత ఎమ్మెల్యే యార్లగడ్డ
-
వైసీపీ అయితే లోపలేస్తావా..? నీకు టైమ్ దగ్గరపడింది లోకేశ్..! మాస్ వార్నింగ్
-
ఏపీ ఉద్యోగులకు మరో ఎదురుదెబ్బ..?
-
ఇదిగో సీఎం గారి ఇల్లు ఏంటి మాకు ఈ కష్టాలు..
-
చేతకానోడివి హామీలేందుకు ఇచ్చావ్.. చంద్రబాబు పై ఉద్యోగుల ఆగ్రహం
-
స్వలాభం కోసమే రాయలసీమ లిఫ్ట్ తాకట్టు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్
సాక్షి,నెల్లూరు: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడంతో పాటు, దాని కోసం పోరాటాన్ని బలోపేతం చేయడానికే టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ డీల్గా మార్చారని వ్యాఖ్యానించారు.రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపివేత వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సజ్జల అన్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై చేసిన పోరాటం కంటే మరింత తీవ్రంగా ఈ అంశంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే చంద్రబాబు ప్రభుత్వ విధానాల అసలు స్వరూపం అర్థమవుతుందని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి, ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాధాన్యంపై మేధావులు, విద్యావంతుల మధ్య విస్తృత చర్చ జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ రూటు.. ప్రైవేట్ రేటు
-
'జగనన్న వస్తానన్నారు.. ధైర్యం వచ్చింది'
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదం బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ చిన్నా.. సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ఓదార్పు ఎంతో ధైర్యం ఇచ్చిందని అంటున్నారు. బోటు పూర్తిగా దగ్ధమవడంతో జీవనాధారం కోల్పోయా. ఈ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఈ కష్ట సమయంలో జగనన్న నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. "నీకు అండగా ఉంటాను.. సాయం చేస్తాను" అని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన మాటలతో ఎంతో ధైర్యం వచ్చింది. రేపు ఆయన విశాఖకు వస్తున్నారని తెలిసి సంతోషంగా ఉంది అని చిన్నా అన్నారు. అలాగే..గతంలో కూడా బోటు ప్రమాదాలు జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం బాధితులను ఆదుకుందని చిన్నా గుర్తుచేశారు. అప్పట్లో దెబ్బతిన్న బోట్లకు సుమారు 80 శాతం వరకు ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నామని చెప్పారు.వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. -
రైతులపై బాబు మరో బాంబు
-
బాబు మరో పేరు కరువు చంద్రబాబు ఉంటే కరువు ఉండాల్సిందే..
-
టీడీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే యార్లగడ్డ తిరుగుబావుటా!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ అధిష్టానంపై ప్రభుత్వ విప్, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరుగుబావుటా ఎగరేశారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో ఆదివారం జరిగిన ఒక సభలో పార్టీ అధిష్టానంపై బహిరంగానే విమర్శలు చేశారు. ‘గత ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యరి్థతో కలిసి పనిచేసిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి రూ.కోటి–రూ.2 కోట్ల విరాళాలు తీసుకుని కాంట్రాక్టులు, ఆరి్థక ప్రయోజనాలు చేకూర్చుతున్నారు. ఇప్పుడు ప్రతి వాడూ టీడీపీ అంటున్నాడు. పార్టీకి సపోర్ట్ చేశామని ఇప్పుడు చెబుతున్న కొంత మంది.. నేను గన్నవరం ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ కలవలేదు. గన్నవరం విమానాశ్రయం కాంట్రాక్ట్కు సంబంధించి కేఏంవీ ప్రాజెక్ట్ నిర్వాహకులు ఎవరో కూడా నాకు తెలియదు. ప్రత్యర్థికి పనిచేసిన వారికి కాంట్రాక్ట్ రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పార్టీ గెలుపు కోసం నేను యుద్ధం చేసి.. నా రెక్కల కష్టం ఖర్చు పెడితే.. మీరు ఇలా అవమానాల పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. నా ప్రత్యర్థులతో కలిసి పనిచేసిన పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయడాన్ని ఒప్పుకోను’ అని హెచ్చరించారు. నా ప్రత్యర్థి మీద యుద్ధం చేసినందుకు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కార్యకర్తలతో త్వరలో సమావేశం ఏర్పాటుచేసి ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తానన్నారు. రగిలిపోతున్న ఎమ్మెల్యే యార్లగడ్డ తొలి నుంచి పారిశ్రామికవేత్తలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు పార్టీ అధిష్టానంతో కలుస్తున్నారని, తనను కలవటం లేదని ఆయన రగిలిపోతున్నట్లు సమాచారం. ఆయన చెప్పిన వారికి ఎయిర్ పోర్ట్ కాంట్రాక్టు దక్కలేదన్న అక్కసు ఆయన తాజా మాటల్లో వ్యక్తం అవుతోందని టీడీపీ వర్గాలే విశ్లేషించడం గమనార్హం. -
అమరావతిలో దోమలు ఉండవట..! మరి వేల కోట్ల ఖర్చు ఎందుకు?
ఏపీ రాజధాని అమరావతిలో దోమలు ఉండవట.. ఇదినిజంగా మంత్రి నారాయణ చెప్పిన మాట. తెలుగుదేశం పత్రిక ఈనాడులో రాసిన వార్తే. అందువల్ల ఇక్కడ భవనాల నిర్మాణానికి అయ్యే వ్యయంతో ఇతర చోట్ల నిర్మాణాలతో పోల్చరాదట. వినేవ్యక్తి వెర్రివాడు అయితే చెప్పేవ్యక్తి ఏపీ మంత్రి నారాయణ అనుకోవాలి. విద్యా సంస్థలను పెద్ద ఎత్తున నిర్వహించే నారాయణ ఇలాంటి మాటలు చెబుతుంటే కనీసం ఆయన విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్ధులైనా నమ్ముతారా? ఇంతకీ విషయం ఏమిటి?ఇంతకాలం అమరావతిలో జరిగే నిర్మాణాల వ్యయంపై తీవ్ర విమర్శలు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగింది. కాని కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో నిర్మించదలచిన భవనాల సముదాయం నిమిత్తం చదరపు అడుగుకు సుమారు ఐదువేల రూపాయల నుంచి ఆరువేల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అంచనా వేసింది. ఇదే చంద్రబాబు సర్కార్ గొంతులో వెలక్కాయిపడినట్లు చేసింది. కేంద్రంతో పోల్చితే నాలుగురెట్లు అధికంగా వ్యయం చేస్తుండడంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. చదరపు అడుగుకు రాష్ట్రం సుమారు చదరపు అడుగుకు 17వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు వెచ్చిస్తుండడంలో అవినీతి భారీగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి ప్రభుత్వం బదులు ఇవ్వలేకపోయింది.ఈ నేపథ్యంలో ఎలాగోలా తాము చేస్తున్న అధిక వ్యయాన్ని సమర్థించుకోవడానికి నారాయణ గత కొన్నాళ్లుగా రకరకాలుగా తంటాలు పడుతున్నారు. అమరావతిలో ఇలా వేల కోట్ల వ్యయం చేయడంపై ప్రజలలో కూడా అసహనం పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా జగన్ మావిగన్ అనే ప్రతిపాదనను తీసుకురావడం మరింత సమస్య అయింది. దాంతో జగన్ పైన, వైఎస్సార్సీపీపైన ఏవేవో ఆరోపణలు చేయడం, అమరావతి ఖర్చును సమర్ధించుకోవడానికి నానా పాట్లు పడడం టీడీపీ వంతు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మావిగన్ అన్న పదంతో తొట్రుపాటుకు గురవుతున్నట్లు కనిపిస్తుంది.అమరావతిని ఎవరూ ఆపలేరని, మావిగన్ అని, విజయవాడ అని ఇలా రోజుకొకటి మాట్లాడుతున్నారని, మావిగన్ అంటే వాటికన్ కావాలంటారని అంటూ దీనిని ఒక మతపరమైన వివాదంగా మార్చడానికి చంద్రబాబు యత్నించిన తీరే ఇందుకు ఉదాహరణ అవుతుంది. ఎక్కడైనా రాజధానిలో ప్రజలు ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం దేవతల రాజధాని సెంటిమెంట్ డైలాగు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంటారు. అమరావతి దేవతల రాజధాని అయితే మిగిలిన రాష్ట్రం అంతా ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా వాటికన్ ప్రస్తావన తెచ్చి తన అసహనాన్ని బయటపెట్టుకున్నారు.చంద్రబాబుకు నిజంగానే మావిగన్ అంటే భయం ఏర్పడకపోతే, జగన్ చేసిన ట్వీట్ను సోషల్ మీడియా ప్లాట్ ఫారంలపై లేకుండా పోలీసుల ద్వారా ఎందుకు చేశారో చెప్పాలి. వచ్చే ఎన్నికలలో మావిగన్ VS అమరావతి ఒక అంశం అవుతుందని, మావిగన్ కావాలి అనేవారు వైఎస్సార్సీపీకి, అమరావతి కావాలనేవారు టీడీపీకి ఓటేస్తారు అన్న జగన్ చాలెంజ్ను స్వీకరిస్తున్నామని చంద్రబాబు లేదా టీడీపీ నేతలు ఎందుకు అనలేకపోతున్నారు? మావిగన్ అంటూ ఏదో ఎద్దేవ చేసేలా మాట్లాడుతున్న కూటమి నేతలు అమరావతిలో అయ్యే వ్యయంపై, వేల కోట్ల అప్పులపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఒకప్పుడు ప్రభుత్వ ధనం రూపాయి అవసరం లేదని అదే సొంతంగా సంపాదించుకుని నిర్మాణాలు చేసుకుంటుందని చంద్రబాబు చెప్పేవారు కదా! మరి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి వేల కోట్ల నిధులే కాకుండా నలభైఏడువేల కోట్లను ఎందుకు అప్పు చేశారంటే జవాబు ఇవ్వలేకపోతున్నారు. ప్రజలలో కూడా రాజధాని పేరుతో లక్షల కోట్ల వ్యయం ఏమిటన్న చర్చ జరుగుతోంది. పైగా నిర్మాణ వ్యయంపై కేంద్ర ప్రకటన ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం బాగా ఎక్స్ పోజ్ అయిపోయింది. రాష్ట్రం నాలుగు భవనాల అద్దాలకు చేసే ఖర్చు 2500 కోట్లుగా ఉంది. అంతే మొత్తంతో కేంద్రం తన భవనాలన్నిటిని నిర్మించుకుంటోంది. అది కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో జరుగుతుందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు ఇంతకన్నా స్టాండర్డ్ ఏమి ఉంటుందన్న ప్రశ్న వచ్చింది. దీంతో నారాయణ సాధారణ నిర్మాణాలకు ఐకానిక్ భవనాలతో పోలికా అంటూ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చే యత్నం చేశారు. ఈ వ్యాఖ్య అర్ధరహితంగా కనిపిస్తుంది.డిల్లీలో పార్లమెంటు భవనానికి 16,910 రూపాయలు చదరపు అడుగుకు ఖర్చు అయిందని, తెలంగాణ సచివాలయానికి అడుగుకు 13,762 రూపాయలు అయిందంటూ ఏవో కాకి లెక్కలు చెప్పడం ఆరంభించారు. అది నిజమే అయితే అంతా కలిపి పార్లమెంటు భవనానికి సుమారు 1100 కోట్లు, తెలంగాణ సచివాలయానికి వెయ్యి కోట్ల లోపు మాత్రమే ఎందుకు ఖర్చు అయింది? ఏపీలో మాత్రం సచివాలయ భవనాలకు వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారన్నదానికి సమాధానం దొరకదు. దీనిపై ఎందుకు శ్వేతపత్రం ఇవ్వలేకపోతున్నారు.ఇక రాజధాని రహదారుల నిర్మాణం అంటే కేవలం రోడ్లు వేయడం కాదట. తాగునీరు, మురుగునీరు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, గ్యాస్, టెలికమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలను రోడ్ల వెంటే ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. అంటే ఇవేవి తెలంగాణలో, ఢిల్లీలో ఏర్పాటు చేయకుండానే నిర్మాణాలు చేశారా? ఎన్ని చెప్పినా జాతీయ రహదారులకు కిలోమీటర్కు 23 కోట్లు ఎందుకు అవుతుంది? ఏపీలో రాజధాని రహదారికి సుమారు ఏభై కోట్లు ఎందుకు అవుతోందో అర్ధం కాదు.అంతేకాక అమరావతి రాజధానిని దోమల్లేని నగరంగా చేస్తున్నారట. దీనిని ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికే అమరావతికి సంబంధించి చంద్రబాబు చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేశారు. ఉదాహరణకు అమరావతిలో పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అదికారులను చంద్రబాబు కిందటి టరమ్లోనే ఆదేశించారు. గతంలో నవ నగరాలు, అంతర్జాతీయ నగరం అన్నారు. ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని మాదిరి అమరావతి అవుతుందంటూ కథలు చెబుతూ వచ్చారు. సింగపూర్ కబుర్లు సరేసరి. మొదట సేకరించిన ఏభైవేల ఎకరాలు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ నగరం ఎలా అయింది? రెండేళ్ల నుంచి అదే ప్రాంతం మున్సిపాల్టీగా ఎలా మారిపోయింది? అందుకే మళ్లీ లక్షన్నర ఎకరాలను సేకరిస్తాం అంటూ ఎందుకు బయల్దేరారు? కొండవీటి వాగు, పాలవాగులపై 69 వంతెనలు నిర్మాణం చేస్తామని నారాయణ ఎందుకు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఏ దేశంలో అయినా ఉంటుందా?పైగా ఎప్పటికప్పుడు వర్షం నీరు ఎత్తిపోసుకునే నగరం ఇంకేదైనా ఉందా? ఇలా పర్యావరణానికి విరుద్దంగా నగర నిర్మాణం చేయడం సరైనదేనా? దోమల సంగతి దేవుడెరుగు. రక్తాన్ని పీల్చే దోమల మాదిరి, అమరావతి అప్పుల పేరుతో ప్రజలపై భారం వేయకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తితో.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. సోమవారం నగరంలో ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. బాబు సర్కార్పై వాళ్లు ఆగ్రహం వ్యకక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని ఫెడరేషన్ ఆరోపించింది. పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఐఆర్ విషయంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని నేతలు విమర్శించారు. సరెండర్ లీవ్లకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు.నెలకు రూ.1500 కోట్లు క్షవరం.. ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఫెడరేషన్ నేతలు మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఉద్యోగులకు కూడా పూర్తిగా తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని(క్షవరం చేస్తోందని) విమర్శించారు.వలంటీర్ల హామీలపైనా ప్రశ్నలుఉద్యోగులతో పాటు వలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఫెడరేషన్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
అమ్మను బూతులు తిడుతున్నారు..! దేవుడు కొంచెం కూడా సిగ్గు పెట్టలేదా
-
తెలంగాణలోనూ రెడ్బుక్ అరాచకమా?: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామంపై ఎర్రగొండపాలెం(ప్రకాశం) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. "తెలంగాణలోనూ రెడ్బుక్ అరాచకమే నడుస్తోందా?" అంటూ ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఎలా సాధ్యమైంది? అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలంగాణ పోలీసులను నిలదీస్తున్నారు. ‘‘చట్టపరమైన ప్రక్రియను పక్కనబెట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. 41(A) నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం చట్టబద్ధమేనా?. ఏపీ తరహాలో తెలంగాణలోనూ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందా?.. వెంటనే నాగార్జున యాదవ్ను విడుదల చేసి, ఈ ఘటనపై వివరణ ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న నాగార్జున యాదవ్ను ఆదివారం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్స్టేషన్కు చెందిన సిబ్బందిమని చెబుతూ.. స్థానిక నల్లపాడు పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే అరెస్ట్కు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కారణాలను కూడా స్పష్టంగా చెప్పలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరని ప్రశ్నించినందుకు.. నాగార్జున యాదవ్ భార్యతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. బూతులు తిడుతూ ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చినా స్పందన రాలేదని నాగార్జున కుటుంబ సభ్యులు వాపోయారు.ఒకే రోజులో మూడు పోలీస్స్టేషన్లు తిప్పి..నాగార్జున యాదవ్ను మొదట గుంటూరులోని నల్లపాడు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి హైదరాబాద్లోని పురానా హవేలీ టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. అక్కడ కొంతసేపు ఉంచిన అనంతరం బేగంబజార్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఒకే రోజులో మూడు ప్రాంతాలకు తిప్పి తీవ్ర వేధింపులకు గురిచేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఏ కేసులో అరెస్ట్?తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై లైవ్ డిబేట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అడ్వకేట్ కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 10న హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్స్టేషన్లో నాగార్జున యాదవ్, ఇతరులపై కేసు నమోదు చేశారు. లైవ్ చర్చలో నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 192, 352, 353(1), 353(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ వ్యవహారం వెనుక ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమే ఉందని వైఎస్సార్సీపీ అంటోంది. ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కక్ష గట్టిన చంద్రబాబు సర్కార్.. రెండేళ్ల కిందటి నాటి వ్యాఖ్యలను ఇప్పుడు బయటకు తీసి కేసు నమోదు చేయించారని, చట్టపరమైన నిబంధనలను పాటించకుండా అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇందుకు వినియోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు. -
జగన్ కు అధికారం.. నీకు జైలు.. గెట్ రెడీ చంద్రబాబు...!
-
నువ్వు మనిషివేనా... భూములు ఇవ్వకపోతే చంపేస్తావా.. పొలాల్లోకి దూసుకొచ్చిన బుల్డోజర్లు
-
మీ తాత సొమ్ము అనుకున్నావా.. చంద్రబాబు, లోకేష్ పై రైతుల ఆగ్రహం
-
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై సాగతీతే
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా సాగదీస్తోంది. ఇంజనీరింగ్ అసిసెంట్లు, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిసెంట్లు, వార్డు అమెనిటీస్ సెక్రటరీల పదోన్నతులపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో మొత్తం 24 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తుండగా 20 విభాగాలకు సంబంధించి పదోన్నతుల ఛానల్స్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఖరారు చేసి వారికి పదోన్నతులు కూడా కల్పించారు. మిగిలిన నాలుగు విభాగాలకు సంబంధించి 2024 జూన్లో సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే పక్కన పెట్టేసింది. వారికి పదోన్నతులు కల్పించకుండా మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా తమ పదోన్నతుల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని నాలుగు విభాగాలకు చెందిన సచివాలయాల ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగాల్లో బోలెడు ఖాళీలు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఎక్కడిదక్కడే ఆగిపోయిందని ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్ – ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, రోడ్లు – భవనాలు, జలవనరులు తదితర విభాగాల్లో భారీ సంఖ్యలో మండల స్థాయి ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి ప్రాంతీయ కార్యాలయాలతో పాటు టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల్లో ఖాళీలను వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల ద్వారా భర్తీకి అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. ఏడాది క్రితం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో వీలైనంత త్వరగా ఖాళీలు ఉన్న ప్రతిచోట పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడుతున్నారు. రేషనలైజేషన్ పేరిట ఎడాపెడా కుదింపు.. వైఎస్సార్ సీపీ హయాంలో 2019–24 మధ్య పౌర సేవలు, పథకాలను ప్రజలకు ఇంటివద్దే అందించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచి నిర్వీర్యం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల పేరును సైతం మార్చేసింది. వలంటీర్లకు వేతనాలను పెంచకపోగా ఏకంగా వ్యవస్థనే రద్దు చేసింది. మరోవైపు రేషనలైజేషన్ పేరిట సచివాలయాల ఉద్యోగుల సంఖ్యను సగానికి కుదించింది. పౌర సేవలకు పాతర వేసి సచివాలయాల ఉద్యోగులను ఇంటింటి సర్వేలు, సమాచార సేకరణ, ఇతర విధులకు పరిమితం చేసింది. -
ప్రశ్నిస్తే జైలు.. నిలదీస్తే ఉపా!
సాక్షి, అమరావతి: తాను ప్రతిపక్షంలో ఉంటే సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి గొంతుక. అధికారంలోకి వచ్చాక అదే సోషల్ మీడియా ఒక ముప్పు. ఇదీ చంద్రబాబు నైజం. 2024 ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వేల మంది సోషల్ మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానళ్లు, ఇన్ఫ్లుయెన్సర్ల సైన్యంతో విష ప్రచారం చేయిస్తూ యుద్ధం నడిపిన టీడీపీ, జనసేన కూటమి.. ఇప్పుడు తమను ప్రశ్నించే ప్రతి గొంతుపైనా ఉక్కుపాదం మోపుతోంది. కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, నిర్బంధాలు, ఖాతాల ఫ్రీజ్లు, చివరికి ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టం దాకా అణచివేత పరంపర కొనసాగిస్తోంది.సోషల్ మీడియా గొంతు పిసికేందుకు ఏకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసే వరకూ వెళ్లింది. తన వైఫల్యాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను చంద్రబాబు భరించలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కనిపించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయె న్సర్లు.. ఇప్పుడు చంద్రబాబుకు నేరగాళ్లుగా కనిపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా నోరెత్తే వారిని జైలుకు పంపుతామని స్వయంగా ఆయనే బెదిరించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది.జిల్లాకొక నిఘా విభాగంతో వేట సోషల్ మీడియా ద్వారా తమను విమర్శిస్తున్న, ప్రశ్నిస్తున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సైబర్ గార్డ్ విభాగాలు, జిల్లా స్థాయి సోషల్ మీడియా పర్యవేక్షణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి గత రెండేళ్లలోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారితోపాటు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఏకంగా 2వేల వరకూ కేసులు నమోదు చేశారు. సాక్ష్య పోర్టల్ ద్వారా తమకు అనుకూలంగా లేవంటూ 15 వేల వెబ్ లింకులను తొలగించారు. సగటున రోజుకు రెండు కేసులు పెడుతున్నారు. 20 లింకులను తొలగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారి అభిప్రాయాలపై ఇంత భారీగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజాగా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని విమర్శకుల వేటకు వాడుతుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. రెండేళ్లలో ఎన్నెన్నో అరాచకాలుఈ రెండేళ్లలో ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎలా విరుచుకుపడ్డారో చూస్తే ప్రభుత్వ కక్షసాధింపు తీరు అర్థమవుతుంది. యూరియా కొరతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోస్టు పెట్టాడనే కారణంతో సాయి భార్గవ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును ఏకంగా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక సోషల్ మీడియా పోస్టుకు సీఐడీ రంగంలోకి దిగడం విశేషం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే కారణంతో బొసా రమణ అనే యాక్టివిస్టును వేధించి అరెస్టు చేశారు. ఈ అరెస్టు వ్యవహారంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రమణ కోసం భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. తమను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతుండడంతో వైఎస్సార్సీపీకి చెందిన అవుతు శ్రీధర్రెడ్డిని అరెస్టు చేయగా, ఆయనకు కింది కోర్టు విధించిన రిమాండ్ చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టేసింది. ఏకంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలోకి వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కేవీఆర్ను అర్ధరాత్రి హైదరాబాద్లో అరెస్టు చేశారు. అడ్డుకోబోయిన ఆయన భార్యను పోలీసులు బలవంతంగా నెట్టేసిన దృశ్యాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. యూట్యూబర్ రావణ్పై ఏకంగా ఉపా ప్రయోగం కలకలం రేపింది.నాడు టీడీపీ కోసం వేల మంది.. సోషల్ మీడియా వారియర్లు 2024 ఎన్నికల ముందు ఇదే సోషల్ మీడియాను టీడీపీ, జనసేన ఏ స్థాయిలో వాడుకున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారానికి, అసత్య కథనాలకు వేల మంది సోషల్ మీడియా వారియర్లను రంగంలోకి దింపి పని చేయించారు చంద్రబాబు. అప్పటి సీఎం జగన్ చెప్పిన ప్రతి మాట, ప్రభుత్వం చేసిన ప్రతి పని మీద సోషల్ మీడియాను ప్రయోగించారు చంద్రబాబు. అప్పుడు అది ఆయనకు భావ ప్రకటనా స్వేచ్ఛగా కనిపించింది. 2023లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తాను అరెస్టయినప్పుడు దేశ విదేశాల్లోని టీడీపీ సానుభూతిపరులతో సోషల్ మీడియాలో ఉద్యమమే నడిపించింది టీడీపీ. అప్పుడు సోషల్ మీడియా వారికి రక్షణ కవచంగా ఉపయోగపడింది. ఇప్పుడు అదే చంద్రబాబుకు నేరగాళ్ల వేదికగా కనిపిస్తోంది. ఆయన్ను విమర్శించే ప్రతి ఒక్కరికీ జగన్ ద్వారా ఫండింగ్ అందుతోందంటూ నేరస్తులుగా ముద్ర వేస్తున్నారు. తాను అధికారంలోకి రావడానికి నిచ్చెనగా ఉపయోగపడిన సోషల్ మీడియానే ఇప్పుడు తన ప్రభుత్వ అసలు రూపాన్ని ప్రజల ముందు పెడుతుంటే చంద్రబాబు ఏ మాత్రం భరించలేకపోతున్నారు.సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని అడిగే గొంతులను టాస్క్ఫోర్స్తో మూయించాలని చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగాలు, మానసిక వేధింపులు, యాక్టివిస్టులను నేరస్తుల తరహాలో మీడియా ముందు నిలబెట్టడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పని చేస్తోంది. తద్వారా తన ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు బయటకు రాకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఇలా ఎన్ని చేసినా రోజుకో బాగోతం వెలుగు చూస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలే బ్లాక్ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతానే తొలగించడం, పార్టీ ఫేస్బుక్ పేజీని భారత్లో అందుబాటులో లేకుండా చేయడం దాకా ఈ అణచివేత వెళ్లింది. ఐటీ యాక్ట్ కింద సోషల్ మీడియా పోస్టులకు నేరుగా అరెస్టులు చేయొద్దన్న సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా, రాష్ట్రంలో అవి అమలు కావడం లేదంటే అణచివేత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు 'రేటు'
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. ఆర్టీసీ ఆర్థిక మూలాలపై దెబ్బతీసే రీతిలో ఇ–బస్సుల విధానాన్ని ఖరారు చేస్తోంది. ఇ–బస్సుల కాంట్రాక్టు ధర పెంపుదల అధికారం ప్రైవేటు సంస్థల గుప్పెట్లో ఉంచేందుకు సిద్ధపడుతోంది. తద్వారా ఆర్టీసీ ఖజానాపై ప్రైవేటు సంస్థలకే పెత్తనాన్ని కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థలకే ఇ–బస్సుల కాంట్రాక్టు కట్టబెట్టాలన్నది అసలు ఎత్తుగడ. తమ వారికి అడ్డగోలుగా ప్రయోజనం కలిగించేందుకు తాజా పన్నాగం ఇలా ఉంది.హక్కు ప్రైవేటు సంస్థలదే...ఆర్టీసీ నిర్వహిస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెట్టే ఇ–బస్సులను నిర్వహించే ప్రైవేటు సంస్థలకు కిలోమీటర్కు రూ.74.50 చొప్పున చెల్లించాలని చంద్రబాబు సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందులో కేంద్ర ప్రభుత్వం కి.మీ.కి రూ.24.50 చెల్లిస్తుంది. కి.మీ.కి మిగిలిన రూ.50 చొప్పున ఆర్టీసీయే భరించాలి. ప్రైవేటు సంస్థలకు చెల్లించే ఈ ధరను 6 నెలలకు ఒకసారి పెంపుదల చేసే అవకాశాన్ని కల్పించాలని సర్కారు నిర్ణయించింది. మరీ విడ్డూరం ఏమిటంటే.. ఆ పెంపుదల హక్కు ప్రైవేటు సంస్థల ఇష్టం. ఈ మేరకు వెసులుబాటు కల్పించారు. అంటే కి.మీ.కి రూ.74.50 గిట్టుబాటు కావడం లేదని ప్రైవేటు సంస్థలు భావిస్తే.. ప్రభుత్వానికి కేవలం సమాచారం ఇచ్చి ధర పెంచుకోవచ్చు. ఆ విధంగా 6 నెలలకోసారి సమీక్షించి ధర పెంపుదలను ప్రతిపాదించవచ్చు. అంటే ప్రైవేటు సంస్థలకు కిలోమీటరుకు చెల్లించే ధరను ప్రతి 6 నెలలకోసారి పెంచేందుకు ప్రభుత్వం ముందుగానే మార్గం సుగమం చేసింది.అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వాటాను పెంచదు. పెరిగిన ఆర్థిక భారాన్ని ఆర్టీసీయే భరించాలి. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్న డీజిల్ అద్దె బస్సుల కాంట్రాక్టు విధానంలో ఆ నిబంధన లేదు. టెండరు సమయంలో ఖరారు చేసిన ధరనే కాంట్రాక్టు కాలపరిమితి ఉన్నంత కాలం కొనసాగిస్తున్నారు. కానీ ఇ–బస్సుల విషయంలో మాత్రం 6 నెలలకోసారి ధర పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. ఆర్టీసీ ఖజానా గుల్ల.. ప్రైవేటు గల్లా గలగలాప్రైవేటు సంస్థలకు అడ్డగోలు ప్రయోజనం కల్పించేందుకే ఈ నిబంధనను పొందుపరుస్తున్నారు. దాంతో ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం మొదటి దశలో 1,450 ఇ–బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2029 నాటికి దశలవారీగా 10 వేల ఇ–బస్సులను ప్రవేశపెడతామని ప్రకటించింది. అంటే 100 శాతం ఇ–బస్సులే ఉంటాయి. వాటిని ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. టీడీపీ మద్యం సిండికేట్ మాదిరిగానే.. టీడీపీ అస్మదీయ సంస్థలతో ఇ–బస్సుల సిండికేట్ను అధికారికంగా ఏర్పాటు చేస్తున్నట్టేనని ఆర్టీసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ సిండికేట్ ప్రతి 6 నెలలకోసారి కాంట్రాక్టు రేటును పెంచుతూ ఆర్టీసీ ఖజానాకు కొల్లగొట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీసి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం పక్కాగా పావులు కదుపుతోందనే విషయం స్పష్టమవుతోంది. -
నీళ్లు అడిగితే రక్తం కావాలా?
సాక్షి, హైదరాబాద్: రైతులు సాగునీరు అడిగితే రక్తం కావాలంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన నరహంతకుడికి పెద్దగా తేడా కనిపించడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలని, బెల్టుతో కొట్టాలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత జుగుప్సాకరమని మండిపడ్డారు. హిట్లర్ను ఆదర్శంగా చెప్పుకునే రేవంత్ అదే తరహా హంతక భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈగోతో కన్నెపల్లి, దేవాదుల మోటార్లను నిలిపివేసి రాష్ట్రాన్ని కరువు వైపు నెడుతోందన్నారు. తనను జైల్లో వేసినా, తన ప్రాణం పోయినా అభ్యంతరం లేదని, కానీ వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులను ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తడం లేదు గోదావరిలో ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తున్నా ప్రభుత్వం కావాలనే నీటిని ఎత్తడం లేదని హరీశ్ ఆరోపించారు. మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నెపల్లి మోటార్లు నడపొచ్చని, ఇదే విషయాన్ని నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వానికి స్పష్టం చేశారని తెలిపారు. కేవలం రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎల్లంపల్లికి తరలించొచ్చని అధికారులు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం బయటపడుతుందనే భయంతోనే మోటార్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు నీటిని ఎత్తకపోతే ఎన్టీపీసీ, సింగరేణి, హైదరాబాద్ తాగునీటి అవసరాలు దెబ్బతినడంతోపాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేడిగడ్డపై నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ అధికారులే పోలవరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల నష్టానికి బాధ్యులని హరీశ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే వ్యవసాయ విప్లవం కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా, బీఆర్ఎస్ హయాంలో 48.74 లక్షల ఎకరాలకు నీరందించామని హరీశ్ పేర్కొన్నారు. దేవాదులలో పూర్తిస్థాయిలో మోటార్లు నడపకుండా, గోదావరి జలాలను కిందకు వదిలి పట్టిసీమకు మేలు చేస్తూ సీఎం తన రాజకీయ గురువు చంద్రబాబుకు గురుదక్షిణ ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ కక్షలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని, వెంటనే కన్నెపల్లి, దేవాదుల మోటార్లను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
‘రైతుల బతుకులపై చంద్రబాబు దండయాత్ర’
సాక్షి, తాడేపల్లి: రైతుల బతుకుల మీద చంద్రబాబు దండయాత్ర చేశారని.. వందలాది మంది పోలీసులతో ఉండవల్లి రైతుల భూములను లాగేసుకున్నారని వైస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ భూముల కేసు హైకోర్టులో ఉండగానే బలవంతపు స్వాధీనం అన్యాయం. తుది తీర్పు రాకముందే భూములపై బాబు సర్కార్ దుర్మార్గపు చర్యలు అంటూ దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు కరకట్ట బంగ్లా సమీపంలోనే ఈ దుర్మార్గం జరిగింది. జనవరి 8 భూసేకరణ నోటిఫికేషన్ను రైతులు హైకోర్టులో సవాలు చేశారు. భూ సేకరణకు పరిపాలనా అనుమతి లేదని రైతులు కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయపరమైన అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని హైకోర్టు చెప్పింది. భూ సేకరణ ప్రక్రియ, అవార్డు రెండూ తుది తీర్పునకు లోబడి ఉంటాయని కూడా చెప్పింది. తుది విచారణ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ భూముల్లోకి బుల్డోజర్లు పంపారు. రైతులు స్వచ్చందంగా ఇస్తే తీసుకోవాలి. కానీ ఇలా బెదిరించి లాక్కుంటారా?’’ అని మనోహర్రెడ్డి నిలదీశారు.‘‘అప్పటికప్పుడు అవార్డు ప్రకటించి భూములు లాక్కోవటం దుర్మార్గం. ప్రత్యామ్నాయం కూడా చూపకుండా భూమి లాక్కున్నారు. రైతులను తీవ్రంగా క్షోభ పెట్టారు. రైతులు కోర్టుకు వెళ్లకుండా శని, ఆదివారం చూసి భూముల్లోకి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి కోర్టులపై గౌరవం ఉంటే ఇలా చేస్తారా?. ఉండవల్లిలో ఎకరం రూ.8 కోట్లు ఉంది. కానీ రూ.2.60 కోట్లు మాత్రమే ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తారు?. చంద్రబాబు బినామీలు ఆ చుట్టుపక్కలే రూ.8 కోట్ల చొప్పున కొన్నారు. మరి రైతులకు ఆ విధంగా పరిహారం ఎందుకు ఇవ్వటం లేదు?..రైతుల నుంచి భూములు లాక్కుని ఎవరికి కట్టబెట్టబోతున్నారు?. రానున్న రోజుల్లో ఉండవల్లి గ్రామమే కనుమరుగు కాబోతోంది. ఇప్పటికైనా బలవంతపు భూసేకరణను నిలిపేయాలి. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు భూముల్లోకి రాకూడదు. పంటలను ధ్వంసం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఉండవల్లి, పెనుమాక ప్రాంతంలో టీడీపీ నేతలు కొన్న భూముల వివరాలు బయట పెట్టాలి’’ అని మనోహర్రెడ్డి డిమాండ చేశారు. -
మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్
-
రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...
-
ప్రశ్నిస్తే ప్రతీకారమా.. కేసులతో కట్టడి చేయగలరా?
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం పత్రికా రంగం అయితే, నేటి ఆధునిక సమాజంలో సామాన్యుడి ఆయుధం, ఐదో స్తంభం 'సోషల్ మీడియా'. కోట్లాది మంది ప్రజలు తమ భావాలను పంచుకోవడానికి, పాలకుల తప్పులను ఎండగట్టడానికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి సోషల్ మీడియా ఒక వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, పాలకులలో జవాబుదారీతనాన్ని పెంచుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భిన్నమైన, తీవ్ర ఆందోళనకరమైన మార్గంలో ప్రయాణిస్తోంది.ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని, సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించే వారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. ఇది కేవలం ఒక వర్గాన్నో, ఒక పార్టీ కార్యకర్తనో కట్టడి చేసే చర్య కాదు. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను ఖూనీ చేసే కుట్ర. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకమైనది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీసే హక్కు, విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తుంటే విమర్శిస్తే అర్ధరాత్రి అరెస్టులు, ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు బనాయించే సంస్కృతి రాజ్యమేలుతోంది. ఇటీవల కాలంలో పోలీసులు ఏర్పాటు చేసిన సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్లు, ప్రభుత్వ విమర్శకులను ఏరివేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్లు రాజ్యాంగ రక్షణల కంటే పాలకుల అజెండాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనేది స్పష్టమవుతోంది.తాజాగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సోషల్ మీడియాను క్రమబద్ధీకరించడం కాదు, పాలకులపై వస్తున్న వ్యతిరేక గొంతులను శాశ్వతంగా నొక్కేయడమేనని మేధావులు, హక్కుల సంఘాల నేతలు భావిస్తున్నారు. తప్పులను సరిదిద్దుకోవాల్సిన పాలకులు, తప్పులను ఎత్తిచూపిన వారిపై పగబట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా సోషల్ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర యూట్యూబర్లపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టుల పరంపర అమానుష కాండను తలపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వ్యక్తిపై వరుసగా కేసులు పెట్టడం, ఒక కేసులో బెయిల్ రాగానే మరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకో కేసులో అరెస్ట్ చేయడం వంటి అప్రజాస్వామిక చర్యలు నిత్యకృత్యమయ్యాయి.ఈ అణచివేత పర్వంలో కొన్ని ప్రధానమైన ఉదాహరణలను పరిశీలిస్తే వ్యవస్థ ఎంతలా దుర్వినియోగం అవుతుందో అర్థమవుతుంది. యూట్యూబర్లపై ‘ఉగ్రవాద’ ముద్ర వేయడం దారుణమైన విషయం. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసినందుకు 'ప్రశ్న' యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్ ను పోలీసులు ఐదు రోజుల్లో ఐదుసార్లు వరుసగా అరెస్ట్ చేశారు. కోర్టులు ఒకదాని తర్వాత ఒకటి బెయిల్స్ ఇస్తున్నా, అతను జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడానికి ఏకంగా అత్యంత కఠినమైన 'ఉగ్రవాద నిరోధక చట్టం' UAPA కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట. కేవలం మాటలతో విమర్శలు చేసిన ఒక సామాజిక కార్యకర్తపై దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించాడనే నెపంతో దేశద్రోహం, ఉగ్రవాద చట్టాలు ప్రయోగించడం విస్మయానికి గురిచేస్తోంది.ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను, నెటిజన్లను కక్షపూరితంగా టార్గెట్ చేస్తున్నారు. వందలాది మంది కార్యకర్తలపై పాత పోస్టులను వెలికితీసి, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కేసులు పెడుతున్నారు. వేల సంఖ్యలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలపై నిఘా ఉంచి, ఇళ్లకు వెళ్లి వేధించడం, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం వంటి పద్ధతులు నేడు ఏపీలో సాధారణమైపోయాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం కాదు అని పదే పదే స్పష్టం చేశాయి. కక్షపూరిత రాజకీయం కోసం ఐపీసీ ప్రస్తుత బీఎన్ఎస్, ఐటీ చట్టాలను దుర్వినియోగం చేయవద్దని కోర్టులు గైడ్లైన్స్ ఇచ్చినా, క్షేత్రస్థాయిలో పోలీసులు పాలకుల మెప్పు కోసం చట్టాలను చుట్టాలుగా మార్చేస్తున్నారు.ప్రభుత్వం అధికారికంగా మహిళల రక్షణ, అసభ్యకర పోస్టుల అదుపు పేరుతో చట్టాలను కఠినతరం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఆచరణలో అవి కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికే ఉపయోగపడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షాల మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎంతటి దారుణమైన పోస్టులు పెట్టినా, మార్ఫింగ్ వీడియోలు చేసినా ఎలాంటి చర్యలు ఉండవు. కానీ, ప్రతిపక్ష లేదా తటస్థ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలును ప్రశ్నిస్తే మాత్రం ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ లోని కఠిన సెక్షన్లు తెరపైకి వస్తాయి. పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగాలు, మానసిక వేధింపులు, సోషల్ మీడియా కార్యకర్తలను నేరస్థుల తరహాలో మీడియా ముందు నిలబెట్టడం వంటి చర్యల ద్వారా సమాజంలో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారు. 'మేము చెప్పిందే వినాలి, మేము చేసిందే రాయాలి, ప్రశ్నిస్తే జైలు గదులు సిద్ధంగా ఉంటాయి' అనే అలిఖిత నియంతృత్వ విధానాన్ని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు.తుపాకీ గుండ్లకైనా ఎదురొడ్డి నిలబడే శక్తి అక్షరానికి మరియు ఆలోచనకు ఉంటుంది. చరిత్రలో ఏ రోజూ అణచివేత శాశ్వతంగా గెలవలేదు. గతంలో సామాజిక మాధ్యమాల గొంతు నొక్కాలని చూసిన ఏ ప్రభుత్వమూ ప్రజా క్షేత్రంలో నిలబడలేకపోయింది. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది పాలకులను సరైన దారిలో పెట్టే ఒక టానిక్ లాంటిది. దాన్ని విషంగా భావించి నెటిజన్ల మీద యుద్ధం ప్రకటించడం చంద్రబాబు ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు.ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఇప్పటికైనా తన కక్షసాధింపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా విమర్శించే హక్కును గౌరవించాలి. అక్రమ అరెస్టులు, ఉపా వంటి కఠిన చట్టాల దుర్వినియోగాన్ని తక్షణమే ఆపాలి. లేనిపక్షంలో, ఈ రోజు నెటిజన్ల గొంతు నొక్కడానికి ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు, రేపు పాలకుల పతనానికి పునాదిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాను నిషేధించవచ్చు లేదా కట్టడి చేయవచ్చు.. కానీ ప్రజల మనసుల్లో రగిలే అసంతృప్తిని ఏ చట్టాలూ ఆపలేవు!-కంచర్ల యాదగిరిరెడ్డిమేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ. -
హెలీకాప్టర్ ని ఆపితే భీమవరానికి జగన్ రైలెక్కి వెళ్తాడు.. పేర్ని నాని మాస్ వార్నింగ్
-
ఆంధ్రుల హక్కుకు 'ఉరి'
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కును కాపాడతామని పదేపదే హామీలు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తెర వెనుక కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్లాంట్ను ప్రైవేట్పరం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం విశాఖ ఉక్కుని ప్రాధాన్యతగా తీసుకోకుండా, ప్రైవేట్ సంస్థ అయిన ‘సింహాద్రి టీఎంటీ’ (స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్– ఎస్ఈఐఎల్) స్టీల్కు సీఆర్డీఏ ఆమోదముద్ర వేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భారీ వ్యయంతో అమరావతి రాజధాని నగర నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇంత భారీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణ సామగ్రి ‘స్టీల్’ ప్రాజెక్టు కోసం ఏపీసీఆర్డీఏ ‘సింహాద్రి టీఎంటీ’ బ్రాండ్కు అధికారికంగా ఆమోదం తెలిపింది. రాజధానిలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఎఫ్ఈ550, ఎఫ్ఈ500డీ, ఎఫ్ఈ550డీ వంటి గ్రేడ్ల స్టీల్ను సింహాద్రి టీఎంటీ ద్వారా కొనుగోలు చేయడానికి ఈప్రొక్యూర్మెంట్(ఈపీసీ) కాంట్రాక్టర్లకు సీఆర్డీఏ అనుమతులు జారీ చేసింది. చెప్పేదొకటి చేసేదొకటి ఒకవైపు వైజాగ్ స్టీల్ప్లాంట్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిర్వహణ మూలధనం (వర్కింగ్ క్యాపిటల్) లేక, బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడి ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం.. ప్లాంట్ను మరింత అగాథంలోకి నెట్టేసింది. ఇలాంటి తరుణంలో అమరావతి నిర్మాణానికి అవసరమైన లక్షలాది టన్నుల ఉక్కును ‘వైజాగ్ స్టీల్ప్లాంట్’ నుంచే సేకరించేందుకు నిర్ణయం తీసుకుంటే సంస్థకు భారీ ఆర్థిక ఊరట లభించేది.నిరంతర ఆర్డర్లు, అడ్వాన్స్ చెల్లింపుల ద్వారా ప్లాంట్లో ఉత్పత్తి పెరిగి ప్లాంట్ తిరిగి గాడిన పడే అవకాశం ఉండేది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం కావాలని.. ప్లాంట్ తిరిగి కోలుకోకూడదన్న దురుద్దేశంతోనే ప్రైవేట్ కంపెనీల వైపు మొగ్గుచూపుతోందని వైజాగ్ స్టీల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక భారీ ముడుపులు చేతులు మారాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పునరాలోచనకు డిమాండ్ సింహాద్రి టీఎంటీ బ్రాండ్ ఉత్పత్తులను విక్రయించే ఎస్ఈఐఎల్.. ఇప్పటికే లాభాల బాటలో నడుస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ రూ. 1,066.42 కోట్ల ఆదాయాన్ని, రూ. 26.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆర్థికంగా బలంగా ఉన్న ఇలాంటి సంస్థలకు రాజధాని పనుల కాంట్రాక్టుల ఆమోదం లభించడం ద్వారా ఆ సంస్థ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. కానీ, వేలాది మంది కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్న ‘విశాఖ స్టీల్ప్లాంట్’కు రూ.కోట్ల భారీ ప్రాజెక్టు నుంచి తగిన భరోసా దక్కకపోవడం చంద్రబాబు నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఉద్యోగ, కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి అమరావతి నిర్మాణంలో సింహభాగం ‘విశాఖ ఉక్కు’నే వినియోగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. భారీ ముడుపులు చేతులు మారాయన్న అనుమానం సొంత ప్లాంట్ను కాదని సింహాద్రి టీఎంటీ, జిందాల్ వంటి ప్రైవేటు సంస్థల ఉక్కును వాడటం వెనుక భారీ ముడుపులు చేతులు మారాయన్న అనుమానం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేసే కుట్రలా కనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కేవలం విశాఖ ఉక్కును మాత్రమే వినియోగించాలి. అమరావతిలో స్టీల్ ప్లాంట్ యార్డు కోసం పది ఎకరాలు కూడా కేటాయించాలి. – ఎం జగ్గునాయుడు, స్టీల్ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ జగన్ దార్శనికత చంద్రబాబులో ఏది? నాడు–నేడు, గృహ నిర్మాణాలకు విశాఖ ఉక్కు వినియోగం నాడు జగన్ ప్రభుత్వ దార్శనికత చంద్రబాబులో మచ్చుకైనా కనబడ్డంలేదని ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ హయాంలో చేపట్టిన పలు కీలక ప్రభుత్వ నిర్మాణాలకు విశాఖ ఉక్కును అధికారికంగా వినియోగించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలన్న ప్రధాన ఉద్దేశంతో తగిన అన్ని చర్యలూ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ద్వారా కొంత ఆర్థిక తోడ్పాటు అందించేందుకు అప్పట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో విశాఖ ఉక్కును భారీగా వినియోగించారు. సొంత ఇళ్లు నిర్మించుకునే లబ్దిదారులకు మార్కెట్ ధర కంటే తక్కువకే నాణ్యమైన ఇనుమును అందించేందుకు ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నేరుగా వైజాగ్ స్టీల్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా లక్షలాది టన్నుల స్టీల్ను ప్రభుత్వమే కొనుగోలు చేసి గోడౌన్ల ద్వారా లబ్దిదారులకు సరఫరా చేసింది.అదేవిధంగా.. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన ‘నాడు–నేడు’ మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల్లో కూడా అధిక శాతం విశాఖ ఉక్కును వాడాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా నేరుగా ఆర్ఐఎన్ఎల్ నుంచి కొనుగోళ్లు జరిపారు. ఇలా చిత్తశుద్ధితో ప్లాంట్ కాపాడేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తే.. ప్లాంట్ను విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఆగని భూ పందేరం
సాక్షి, అమరావతి : ఉమ్మడి విశాఖ జిల్లాలోని విలువైన భూములను చంద్రబాబు సర్కారు కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోంది. గడిచిన రెండేళ్లలో వందల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్, బినామీ సంస్థలకు కట్టబెట్టిన సర్కారు.. తాజాగా పలు సంస్థలకు తక్కువ ధరకే భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎకోబాక్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనే సంస్థ ఆనందపురం వద్ద ఏర్పాటు చేసే లాజిస్టిక్ పార్క్ కోసం 91.38 ఎకరాలను ఎకరా రూ.55 లక్షలు చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి వీఎంఆర్డీఏ, ఏపీఐఐసీ మౌలిక వసతులను కల్పించనున్నాయి. అక్షత్ గ్రీన్టెక్ లిమిటెడ్ అనకాపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న 3.5 గిగావాట్ల సోలార్ సెల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్కు పరవాడలో ఎకరం రూ.65 లక్షల చొప్పున చౌక ధరకు 34.02 ఎకరాలు కేటాయించింది. బెర్రీ అల్లాయిస్ ఏర్పాటు చేయనున్న మాంగనీస్ సింటర్ ప్లాంట్కు విజయనగరం బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఎకరం రూ.77.25 లక్షలు చొప్పున 93.43 ఎకరాలను కేటాయించింది.కర్నూలులో దేవదాయ భూముల సేకరణకర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ కంపెనీ జీయో మైసూర్ కంపెనీకి 998.10 ఎకరాలను సేకరించి ఇవ్వడానికి ఏపీఐఐసీకి అనుమతిస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఇందులో 40.12 ఎకరాలుగా ఉన్న దేవదాయ భూములను లీజు విధానంలో సేకరించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రాజధానిలో రాక్షసకాండ!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: అది చంద్రబాబు కలల రాజధాని.. కానీ రైతుకంట నిత్యం కన్నీరే.. బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, పంటపొలాలు తవ్వేస్తున్నారని రాజధాని రైతులు రోదించడం రోజూ చూస్తూనే ఉన్నాం.. తమ పొలాలను కాపాడి తమను ఆదుకోవాలని అందరినీ అరి్ధంచడం వింటూనే ఉన్నాం.. ఉండవల్లి రైతులపై చంద్రబాబు ప్రభుత్వం శనివారం ఒక్కసారిగా దౌర్జన్యకాండకు తెగబడింది. రైతుల పొలాల్లో శనివారం వందలాది పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములివ్వని రైతుల పొలాల్లోకి పోలీసులు చొరబడ్డారు. జేసీబీలతో ఆ పొలాల్లో ఉన్న పంటలను ధ్వంసం చేశారు. కాస్త సమయమిస్తే పంట కోసుకుంటామని రైతులు వేడుకున్నా వినలేదు. అడ్డొచ్చిన రైతులను పక్కకు ఈడ్చేశారు. రైతు కుటుంబాలలోని మహిళలను తాళ్లు అడ్డు పెట్టి వెనక్కి నెట్టేశారు. ఒక పథకం ప్రకారం.. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావడంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా శనివారం తెల్లవారుజామునుంచే ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డులో ఉన్న పంట పొలాలను పోలీసులు రౌండప్ చేశారు. అధికారులు వచ్చీ రాగానే అక్కడ ఉన్న జేసీబీ, పెద్ద పెద్ద బుల్డోజర్లతో పంటలను నేలమట్టం చేసేసి భూమిని చదును చేసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన రైతులను పక్కకు ఈడ్చి పడేశారు. అధికారులతో మాట్లాడతాం, పంటలు నాశనం చేయొద్దంటూ రైతులు జేసీబీలకు అడ్డుపడి వేడుకున్నా వినలేదు. పోలీసులు రైతులను పక్కకు లాగేశారు.మొత్తం సీడ్యాక్సెస్ రోడ్డులో 2.47 ఎకరాలు పెండింగ్లో ఉండగా, 10మంది రైతులున్నారు. ఆ పొలాలు కూడా ఒకచోట 10సెంట్లు, మరోచోట్ల 5సెంట్లు, మరోచోట 20 సెంట్లు ఉండటంతో రైతులందరూ ఒక్కచోట లేరు. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి సంఘ విద్రోహక వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరిస్తారో అలా రైతుల పట్ల వ్యవహరించారు. తాము తాతలు, తండ్రుల హయాం నుంచి ఈ పొలంలోనే వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నామని, తమ ఆస్తి మీద ఎటువంటి హక్కు లేకుండా ఎలా దౌర్జన్యం చేస్తారని వారు ప్రశ్నించారు. కొందరు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ నలుగురు, ఐదుగురు రైతులను పంట పొలాల నుంచి ఎత్తుకెళ్లారు. తాము అధికారులతో మాట్లాడాలని, తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని మొత్తుకుంటున్నా వినకుండా ఈడ్చుకెళ్లారు. కన్నీరు మున్నీరైనా కనికరించలేదుచంద్రబాబు ఇంటి సమీపంలో ఉన్న ఒక రైతు పోలీసుల నుంచి తప్పించుకుని అక్కడ ఉన్న సీఆర్డీఏ ఉండవల్లి డెప్యూటీ కలెక్టర్ చిన్ని కృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. నీతో నేను మాట్లాడను, నువ్వు ఇక్కడినుంచి బయటకు వెళ్లు, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకుందామని చేతులు ఊపుతూ వ్యంగ్యంగా మాట్లాడారు. మరో మహిళ పరిస్థితి ఇలానే ఉంది. కుమార్తెను, కొడుకును ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి కిందపడేసి లాక్కెళ్లారు. ఆ మహిళా రైతు ఎంత ఏడ్చినా కనికరించలేదు. మీరు అన్నం తినే బతుకుతున్నారు.రోడ్లువేస్తే ఆ మట్టి తిని బతకరు కదా అంటూ మహిళా రైతు పోలీసులను ప్రశి్నంచింది. ఓ కానిస్టేబుల్ చెయ్యిఎత్తి కొట్టే ప్రయత్నం చేశారు. ఇస్కాన్ టెంపుల్ వద్ద ఇద్దరు రైతులు 60 సెంట్లు, 1.20 ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. దొండ కోతకు వచ్చింది, గంట సమయం ఇవ్వండి కాయలు కోస్తామని రైతు వేడుకున్నా మూడు నిమిషాల్లో మూడు పొక్లెయిన్లతో దొండతోటను నాశనం చేసేశారు. అక్కడ ఉన్న నీటి పైపులను లాక్కునేందుకు కూడా అక్కడ ఉన్న సీఆర్డీఏ అధికారులు సమయం ఇవ్వలేదు. రైతులకు వైఎస్సార్సీపీ భరోసా చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యకాండకు గురైన ఉండవల్లి రైతులను వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి ఉండవల్లి రైతులతో వారు సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త, దొంతిరెడ్డి వేమారెడ్డి, సీపీఎం రైతుసంఘం జిల్లా కార్యదర్శి జొన్నా శివశంకర్, ఇంకా రెండుపారీ్టలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. భూములిచ్చిన రైతులకే ఇంతవరకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, ఇక భూములివ్వని రైతుల భూములు లాక్కుని ఏం చేస్తారని వేమారెడ్డి, శివశంకర్ ప్రశ్నించారు. రైతుల పక్షాన న్యాయపోరాటానికి సహకరిస్తామని, శనివారం నాటి దౌర్జన్యానికి కారకులైన వారికి శిక్షపడేలా చేస్తామని పేర్కొన్నారు.కోర్టు సెలవుల నేపథ్యంలో అర్ధరాత్రి దౌర్జన్యం ‘మేం కోర్టును ఆశ్రయించాం. కోర్టు సెలవులు చూసుకుని శుక్రవారం అర్ధరాత్రి, ఇళ్లల్లో మగవాళ్లు లేని సమయంలో ఉండవల్లి సీఆర్డీఏ డెప్యూటీ కలెక్టర్ చిన్నికృష్ణ సిబ్బందితో మా ఇళ్లకు వచ్చి దౌర్జన్యం చేశారు. మహిళలు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అవార్డు పాస్ చేసిన పత్రాలు కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. రైతులకు ఏమీ ఇవ్వకుండా కోర్టు సెలవు దినాల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పొలాలను పూడ్చేసిన వెంటనే రోడ్డు వేసే పనులు మొదలుపెట్టేశారు. రైతులు సోమవారం కోర్టును ఆశ్రయించేలోగా రోడ్డు పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు.మా శవాలపై రోడ్లు వేయండి మా తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులపై వీళ్ల దౌర్జన్యం ఏమిటో అర్థం కావడం లేదు. 60 సెంట్ల పొలంలో సాగు చేసుకుంటున్న పంటను నాశనం చేశారు. వందలాదిగా పోలీసులు, అధికారులు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని మహిళలని కూడా చూడకుండా పొలంలోంచి బయటకు నెట్టేసి మా షెడ్డును ధ్వంసం చేశారు. చంద్రబాబు రోడ్లు వేయాలనుకుంటే మా శవాలపై వేయమనండి. కోర్టులో విషయం తేల్చకుండా ఇలాంటి దౌర్జన్యాలు చేయడం చాలా దుర్మార్గం. బాబుకి ఓటు వేసినందుకు మాకు బుద్ధి చెప్పారు. – సింగంశెట్టి అనుపమ, బాధితురాలుమాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు సీఆర్డీఏ అధికారులు, పోలీసులు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. నాకు నా తండ్రి నుంచి 40 సెంట్లు వచ్చింది. ఆ భూమి ఆడపిల్లకు ఇచ్చాం. ఇప్పుడు వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి. మేం అమ్ముకుంటాం రిజి్రస్టేషన్ చేయమని పలుమార్లు అడిగాం. అమ్ముకునే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఈ పరిస్థితుల్లో ఈ భూమిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇలా దౌర్జన్యం చేస్తే రైతులు ఎలా బతకాలి. – చందు బసవయ్య, బాధిత రైతుమరీ ఇంత దౌర్జన్యమా..? మనుషలమని కూడా చూడకుండా ఇక్కడకు వచ్చిన పోలీసులు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారు. రైతులు వ్యవసాయం చేస్తారే తప్ప, దౌర్జన్యం చేయడం తెలియదు. చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు ఇలాంటి అవమానాలు రైతులకు తప్పడం లేదు. ఎన్నోసార్లు మా అభిప్రాయాలు చెబుతామని కుటుంబంతో సహా సీఆర్డీఏ ఆఫీస్కు వెళ్లాం. అక్కడ మాగోడు పట్టించుకున్న నాథుడు లేరు. పంట సాగులో ఉన్న సమయంలో యంత్రాలతో నాశనం చేయడం దుర్మార్గం. – అనూష, బాధిత మహిళా రైతు రూ.రెండు లక్షలు నష్టం ఉండవల్లిలో 70 సెంట్ల పొలం రూ.50 వేలకు కౌలుకు తీసుకుని దొండపాదులు పెట్టాం. రెండో కోత కోస్తున్నాం. ఇప్పటికే రూ.1.30 లక్షలు ఖర్చు అయ్యింది. మందులు మరో రూ.10 వేలు అయ్యింది. పొలం దున్నుతున్న సమయంలో నేను అక్కడ ఉన్న అధికారులను అడిగాను. పొలం సాగు చేస్తున్న సమయంలో ఏ అధికారి వేయవద్దని చెప్పలేదు. నేను ఖర్చు పెట్టిన రూ.2 లక్షలు ఎవరిస్తారు. – వలీ, పెనుమాక కౌలు రైతు -
పాడి రైతులకు హెరిటేజ్ కుచ్చుటోపి!
గంగాధర నెల్లూరు: సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పాడి రైతులకు ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్ శఠగోపం పెడుతోందని రైతులు భగ్గుమన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పెద్ద కాలువ పంచాయతీలోని హెరిటేజ్ డెయిరీ వద్ద పలువురు రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ఇలాగైతే తామెలా బతకాలంటూ మేనేజర్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హెరిటేజ్ సంస్థ డెయిరీకి పాలు పోస్తుంటే వెన్న శాతం తక్కువగా వస్తోందని చెబుతున్నారని, ఆయా రోజుల్లో పాలకు డబ్బులు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో పేమెంట్ కింద చేర్చి రెండేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరు మండలంలోని కలిజవేడు పంచాయితీ కె.నాసంపల్లి గ్రామంలో పలు కుటుంబాలు పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాయి. చాలా ఏళ్లుగా హెరిటేజ్ సంస్థకు పాలు పోస్తున్నారు. అయితే రెండేళ్లుగా వెన్న శాతం 8 కంటే తక్కువగా ఉన్న రోజుల్లో పోసిన పాలను జీరో పేమెంట్ కింద నమోదు చేసి డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవి అనే మహిళ హెరిటేజ్ డెయిరీకి సరఫరా చేసిన పాలల్లో దాదాపు 600 లీటర్లకు జీరో పేమెంట్ పడింది. దీంతో శనివారం ఆమె పలువురు రైతులతో కలిసి హెరిటేజ్ డెయిరీ వద్దకు వచ్చారు. జీరో పేమెంట్ ఎలా వేస్తారని మేనేజర్ను ప్రశ్నించారు. ఆ సొమ్ము ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మేనేజర్ ధనుంజయులు స్పందిస్తూ.. సంస్థ పెద్దలతో చర్చించి ఏం చేస్తామన్నది తర్వాత చెబుతాము. అలాగని ఇప్పుడు ఏ హామీ మేము ఇవ్వలేము’ అని తెలిపారు. ఈ సమాధానంతో రైతులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.ఇది చాలా అన్యాయంనాసంపల్లిలో మాకు 25 పాడి ఆవులు ఉండేవి. డెయిరీ ఫాం పెట్టుకున్నాం. ప్రసు్తతం ఖర్చులు ఎక్కువై 10 మాత్రమే ఉన్నాయి. మా డెయిరీ ఫాం నుంచి 20 ఏళ్లుగా హెరిటేజ్ సంస్థకు పాలు పోస్తున్నాం. రెండేళ్లుగా అప్పుడప్పుడు వెన్న శాతం తక్కువగా ఉందంటూ ఆ రోజు పోసిన పాలను మొత్తం జీరో కింద చూపిస్తున్నారు. ఇది అన్యాయమని పలుమార్లు సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – నీలావతి, మాజీ సర్పంచ్, కలిజవేడు పంచాయతీజీరో పేమెంట్ కింద చూపించడం దారుణం హెరిటేజ్ సంస్థకు రోజూ 50–60 లీటర్ల పాలు పోస్తున్నాం. లీటరుకు రూ.35 నుంచి రూ.42 వరకు వస్తుంది. కానీ వెన్న శాతం తక్కువగా ఉందని నాకు దాదాపు 600 లీటర్ల వరకు డబ్బులు ఇవ్వకుండా జీరో పేమెంట్ అని పెట్టేశారు. అడిగితే ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. జీరో పేమెంట్ అన్నప్పుడు ఆ రోజున ఆ పాలు ఎందుకు వాడుకుంటున్నారు? – దేవి, నాశంపల్లి పాడి రైతుఈ తరహాలో ఎక్కడా జీరో పేమెంట్ లేదుజిల్లాలో ఎక్కడా లేని పద్ధతిని హెరిటేజ్ తీసుకువచ్చింది. కచి్చతమైన పాల దిగుబడి అనేది మన చేతుల్లో ఉండదు. ఎండగా ఉంటే పాలల్లో వెన్న శాతం తక్కువవుతుంది. వెన్న 8 శాతం కంటే తక్కువగా ఉందని జీరో పేమెంట్ వేస్తున్నారు. అలాంటప్పుడు మా పాలు వాడుకోవడం ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా పాలను వాడుకున్నప్పుడు మా డబ్బులు చెల్లించాలి. ఈ విధానం మార్చుకోలేమంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – ప్రభాకర్ నాయుడు, డెయిరీ ఫాం నిర్వాహుకుడు, నాశంపల్లి -
‘ఆక్వా రైతులను చంద్రబాబు సర్కార్ మోసం చేసింది’
సాక్షి, కృష్ణా జిల్లా: ఆక్వా రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీడ్ ధర పెంచి రైతుల నడ్డి విరిచిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రొయ్యల కంపెనీల గూడు పుఠాణిని రైతులు పసిగట్టారు.. అందుకే రైతులు పోరాటం మొదలుపెట్టారు. రొయ్యల మేత తయారీ దారులంతా చంద్రబాబు చందాదారులే. ధరలు పెంచే ప్రసక్తే లేదని మంత్రి అచ్చెన్నాయుడు కబుర్లు చెప్పాడు. కేజీకి 12 రూపాయలు పెంచి 2 రూపాయల తగ్గించారు’’ అని దుయ్యబట్టారు.‘‘రొయ్యల రైతుకు అండగా నిలిచేందుకు ఈనెల 15వ తేదీన జగన్ భీమవరం వెళ్తారు. హెలీకాప్టర్కు పర్మిషన్ లేదంటున్నారు. రొయ్యల రైతు కోసం బెజవాడ నుంచి భీమవరానికి జగన్ రైలెక్కి వెళ్తారు. వైఎస్ జగన్ను ఆపలేరు.. కష్టం చెప్పుకోవడానికి వచ్చే రైతులను ఆపలేరు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని మేల్కొలపడానికి ఒక్కోసారి యుద్ధం తప్పదన్నారు. -
రాజధాని రైతులపై రాక్షసకాండను ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని రైతులపై రాక్షసకాండను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వ నిర్వాకాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?..ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? చంద్రబాబుగారి అస్మదీయులా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబూ.. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో… pic.twitter.com/rA7pC3hXRS— YS Jagan Mohan Reddy (@ysjagan) July 11, 2026 -
మంగళగిరికి సెక్యూరిటీ లేకుండా వెల్లు ఎంత మంది కాలర్ పెట్టుకుంటారో చూస్తావ్
-
స్వాతి రెడ్డి కాదు.. శ్వేతా చౌదరి అడ్డంగా దొరికిన చంద్రబాబు
-
అమరావతి లో బలవంతంగా భూసేకరణ పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్
-
ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కేసులు పెట్టిన YSRCP కార్యకర్త అనేవాడు తగ్గడు
-
యూట్యూబర్లకు పేమెంట్ ఇస్తాం..పచ్చిగా చెబుతున్న చంద్రబాబు
-
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్...!
-
మేమెంటో కూడా నీకు చూపిస్తాం బాబుకు అమరావతి రైతు స్టాంగ్ వార్నింగ్
-
ఉండవల్లిలో ఉద్రిక్తత..మమ్మల్ని తాళ్లతో కట్టేసి రోడ్లు వేస్తున్నారు
-
రైతులను కొట్టి లాక్కోవడమేనా... అమరావతికి మీరు చేసే భూసేకరణ
-
ఉద్యోగులకు మళ్లీ చంద్రబాబు సర్కార్ టోకరా
సాక్షి, విజయవాడ: ఉద్యోగులకు మళ్లీ ఏపీ ప్రభుత్వం టోకరా వేసింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ఒక్క సమస్య పరిష్కారానికి కూడా మంత్రులు హామీ ఇవ్వలేదు. ఇద్దరు మంత్రులతోనే చర్చలు సరిపెట్టింది. ఉద్యోగులతో మంత్రులు అనగాని, పార్థసారథి చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రి, అధికారులు లేకుండా తూతూమంత్రంగా చర్చలు సాగాయి. పీఆర్సీ, ఐఆర్, సీపీఎస్ రద్దు, అరియర్స్ పై హామీ ఇవ్వని ప్రభుత్వం.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపైనా కూడా హామీ ఇవ్వలేదు.23 డిమాండ్లు పెడితే ఒక్కదానిపైనా హామీ ఇవ్వని మంత్రులు.. ఆర్థిక మంత్రి లేకుండా తూతూ మంత్రంగా చర్చలు జరిపారు. కేవలం బొప్పరాజు జేఏసీ ప్రతినిధులతోనే చర్చలు జరిపారు. ఇతర ఉద్యోగ సంఘాలు లేకుండా చర్చలు జరిపిన మంత్రులు., ఇతర సంఘాలు లేకుండా చర్చలు పేరుతో హాడావుడి చేశారు. ఒక్క నిర్ణయంపైనా కూడా మంత్రులు సానుకూలత ప్రకటించలేదు. ఉత్తుత్తి చర్చలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యమ కార్యాచరణ సమావేశాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు వాయిదా వేశారు. -
నువ్వు, మీ బాబు కలిసి చేసే దందా మాకు తెలియదనుకున్నావా..!
-
హాస్పిటల్ లో కుక్కలు తిరగడం ఏంటి..? చంద్రబాబు పై మల్లాది విష్ణు సీరియస్
-
నీకు దమ్ముంటే జగన్ ను ఆపి చూడు... చంద్రబాబుకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
బాబు సర్కారు ‘సోషల్’ వేట!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను గుప్పిట పట్టి బరి తెగించి వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు తన నిరంకుశ, అరాచక పోకడలను ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమైంది! తన తప్పిదాలను ఎండగట్టే సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతులు నొక్కడం.. అక్రమ కేసులు బనాయించడం.. జైళ్లకు పంపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. సోషల్ మీడియాను కట్టడి చేయడమే పనిగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా, ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొనసాగుతున్న వ్యక్తులు చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే సరిదిద్దుకోవడానికి బదులుగా విద్వేషంతో ఏకంగా ఆ గళాలను పెగలకుండా చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వంలోని వ్యక్తులను అవమానపరుస్తూ దాడులు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనే ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు సమాచార శాఖ మంత్రి కె. పార్ధసారధి మీడియాతో పేర్కొన్నారు.ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారని చెప్పారు. సోషల్ మీడియా దుర్వినియోగం ఆరోపణలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటుకు సీఎం ఆదేశించారని తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. సమాజానికి ఒక రోగంలా మారింది..!సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ విద్వేషాలు, వ్యక్తిత్వ హననం, దాడులు చేసే వారిని గుర్తించేందుకు ఆధునిక ఫోరెన్సిక్ పరికరాలను సమకూర్చుకోవాల్సిందిగా పోలీసు శాఖను సీఎం ఆదేశించారని మంత్రి పార్ధసారధి తెలిపారు. ఐటీ చట్టంలోని లొసుగులు, లోపాలతో తప్పించుకుంటున్నారని.. ఆ చట్ట పరిధిలో న్యాయస్థానాల పనితీరుపైన, కేసులు నడుస్తున్న తీరుపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. సోషల్ మీడియా సమాజానికి ఒక రోగంలా మారిందని, ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ కలిగిస్తోందన్నారు. రాజకీయ ప్రత్యర్ధులను అవమాన పరిచేందుకు, ప్రజల్లోకి అబద్ధాలను తీసుకువెళ్లడానికి కొన్ని పార్టీలు, వ్యక్తులు సోషల్ మీడియాకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ఆ రాజకీయ పార్టీలను, వ్యక్తులను గుర్తించారా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఎవరినీ గుర్తించలేదని, ప్రొసీజర్పై ఇప్పుడే నిర్ణయం తీసుకున్నామని , అందుకు అనుగుణంగా విచారణ జరిపిన తరువాత ఎవరు ఉన్నారనేది తెలుస్తుందని చెప్పారు. మహిళలు, బాలికలు, మైనర్లపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అవమానకర ప్రచారం, అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననంపై ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తోందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాచార, సాంకేతిక చట్టాల్లో ఉన్న అవకాశాలు, లోపాలను పరిశీలించి చట్టపరమైన అన్ని మార్గాలను వినియోగిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే నేరస్థులను జైలుకు పంపే చర్యలు కూడా తీసుకుంటామన్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత..వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారం, దుష్ప్రచారం నిర్వహిస్తున్న సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించేందుకు అత్యాధునిక డిజిటల్ ఫోరెన్సిక్ సాంకేతికత వినియోగం... సోషల్ మీడియా నేరాలపై జిల్లా స్థాయి పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ, సైబర్ నేరాల దర్యాప్తు, న్యాయపరమైన వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం లాంటి చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. అవసరమైతే సైబర్ నిపుణులను పోలీసు శాఖకు అనుసంధానించి మద్దతు అందిస్తామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని సమర్థంగా అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ నివేదికను మంత్రివర్గం పరిశీలించాక రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పసుపు కార్యాలయాలకు పచ్చజెండా..!» అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఏపీ ఆయిల్ ఫెడ్కు చెందిన 2 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు ఆమోదం. » గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో 0.50 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 చొప్పున 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించేందుకు ఆమోదం. » అనంతపురం జిల్లా రాయదుర్గంలో 50 సెంట్ల భూమిని టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం ఏడాదికి రూ.వెయ్యి చొప్పున 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించేందుకు ఆమోదం.» ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయంలో నెలకు రూ.70,000 వేతనంతో అవుట్ సోర్సింగ్పై కెమెరామెన్ పోస్టుకు ఆమోదం.» 2024 జూన్ 12 తర్వాత రాజధానికి ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన యజమానులకు పదేళ్ల పాటు కౌలు చెల్లించేందుకు ఆమోదం. ఏడాదికి యాన్యుటీ మెట్ట భూములకు ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పెంపు. జరీబు భూములకు యాన్యుటీ ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేలకు పెంచేందుకు ఆమోదం. » రాజధానిలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు 12 నెలల పాటు అద్దె కింద నెలకు రూ.10,000 చొప్పున చెల్లింపునకు ఆమోదం. » ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి వచ్చే పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని ఏడు గ్రామాల్లో రుణమాఫీ పథకానికి ఆమోదం. -
వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్లీ అప్పు
సాక్షి, అమరావతి: మంగళవారం... మంగళవారం అప్పుల పరంపరను చంద్రబాబు సర్కారు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పరిధిలో రూ.3,800 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. -
బాబూ.. మాట తప్పారు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: కనీస వేతనం నెలకు రూ.26 వేలతోపాటు పెన్షన్ తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీలు శుక్రవారం కదం తొక్కారు. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట నిలుపుకోలేనప్పుడు హామీ ఎందుకిచ్చారంటూ చంద్రబాబు సర్కారును నిలదీశారు. అఖిల భారత కోర్కెల దినంలో భాగంగా శుక్రవారం వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ల వద్ద నిరసన తెలిపారు. విశాఖలో జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీలపై పని ఒత్తిడి తగ్గించాలని, వేధింపులు ఆపాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తిరుపతిలో అంగన్వాడీ వర్కర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. భీమవరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు తదితర కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్దకు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ భారీగా తరలివచ్చి మహా ధర్నాలు నిర్వహించారు. విజయనగరంలో మానవహారం చేపట్టిన అంగన్వాడీలు ఈ సందర్బంగా ఆయా జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన సభల్లో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.బేబీరాణి, కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర నాయకులు చంద్రావతి, నాగశేషు, లక్ష్మీదేవి, ఎన్సీహెచ్ సుప్రజ, వాణీక్షి, అన్నపూర్ణ, రమాదేవి తదితరులు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రాజకీయంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు సుప్రీం కోరు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం దారుణమన్నారు. హెల్పర్ల పదోన్నతుల్లో రాజకీయ జోక్యం వల్ల అనేక మందికి అన్యాయం జరుగుతోందని వాపోయారు. ప్రభుత్వానికి పలుమార్లు వినతులు ఇచ్చినా.. స్వయంగా కలిసి విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్పర్ ప్రమోషన్లలో రాజకీయ జోక్యం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని, టీడీపీ సిఫార్సు చేసిన వారికే ప్రమోషన్లు వస్తున్నాయని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న 164 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రెండు వారాల్లో సానుకూలంగా స్పందించి, తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఈ నెల 31న అన్ని జిల్లాల కలెక్టరేట్లను పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. హోరెత్తిన జిల్లా కేంద్రాలు » సీఎం చంద్రబాబు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలని, సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు పట్టు పడితే తాడో పేడో తేల్చుకునే వరకు పోరాటం ఆపరని విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు హెచ్చరించారు. అంగన్వాడీలు తలుచుకుంటే ప్రభుత్వాలను కూలగొట్టే సత్తా ఉందని, అందుకే వారితో పెట్టుకోవద్దని హితవు పలికారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలో నినదిస్తున్న అంగన్వాడీలు » మచిలీపట్నంలో అడ్డుకోవడంతో అంగన్వాడీలు, పోలీసుల మధ్య కొద్దిసేపు తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. బందరులో బారికేడ్లతో అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు.. » ఏలూరులో కలెక్టరేట్ వద్ద పోలీసులకు, యూనియన్ నాయకులు.. అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. » రాజమహేంద్రవరంలో ఏకంగా 2,500 మంది అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జోరువానను సైతం లెక్కచేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. గుంటూరులో అంగన్వాడీ వర్కర్లను అడ్డుకుంటున్న పోలీసులు » శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలెక్టరేట్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. » కడపలో అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కొంత మంది కలెక్టరేట్ గేటును ఎక్కేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. మదనపల్లెలో బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కడప కలెక్టరేట్ వద్ద లోపలకు రాకుండా అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు » చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీలు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్ల వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో ఇచ్చిన హామీలు నమ్మి.. ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు రెండేళ్లయినా పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు మండిపడ్డారు. ఇవీ ప్రధాన డిమాండ్లు » సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి. » ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, గ్రాట్యూటీ, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. » అంగన్వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయడంతోపాటు గుజరాత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి. » మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్కు ఐదేళ్ల సీనియారిటీ నిబంధన రద్దు చేయాలి. » సిగ్నల్ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) యాప్తోపాటు పని భారం పెంచే నవ చేతన యాప్ను తక్షణం రద్దు చేయాలి. » పెండింగ్లో ఉన్న టీఏ, మెయింటెనెన్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. » సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ ఇవ్వాలి. సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి.ఫొటోలకు ఇచ్చిన పోజులు చాల్లేండన్న సీఐనంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లి మార్కెట్ యార్డ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. భోజనానికి వెళుతున్న జిల్లా కలెక్టర్కు మెయిన్ గేట్ వద్ద ఆందోళన కారులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అంగన్వాడీలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారని నినాదాలు చేశారు. ఈ క్రమంలో త్రీటౌన్ సీఐ వేణుగోపాల్ ‘ఫొటోలకు ఇచ్చిన పోజులు చాల్లేండి.. వెళ్లిపోండిక’ అనడంతో మరింత ఆగ్రహానికి లోనయ్యారు. సీఐ అన్న మాటలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. తాలూకా అర్బన్ సీఐ, టూ టౌన్ సీఐలు ఆందోళన కారులకు నచ్చజెప్పారు. -
ఉత్తిపుణ్యానే రూ.1,111 కోట్ల భూ పందేరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ బరితెగించి ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు పంచి పెడుతోంది. పెట్టుబడుల ముసుగులో ప్రైవేటు సంస్థలకు, అస్మదీయులకు పక్కా స్కెచ్తో అప్పనంగా దోచి పెడుతోంది. నిషేధిత జాబితాలోని (22ఏ) భూములను సైతం రాజమార్గంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ యథేచ్ఛగా భూ పందేరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములను ముందుగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు నామ మాత్రపు రేటుతో బదిలీ చేస్తోంది. ఇలా బదిలీ చేసే భూమికి విలువ కట్టి, ఆ మొత్తాన్ని కేవలం బుక్ అడ్జెస్ట్మెంట్లో చూపిస్తుండటం విస్తుగొలుపుతోంది. ఆ తర్వాత ఏపీటీడీసీ ద్వారా ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు హోటళ్లు, రిసార్టుల నిర్మాణాల పేరుతో లీజు ప్రాతిపదికన/అవుట్రేట్ సేల్కు విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నంలోని మధురవాడలో అత్యంత ఖరీదైన 9.39 ఎకరాల భూమిని ఏపీటీడీసీకి బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎఫ్ఏసీ) హోదాలో సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.ఎప్పుడో కేటాయింపు.. ఇప్పుడు బదిలీవిశాఖపట్నం మధురవాడలో భూమి విలువ ఆకాశాన్ని తాకుతోంది. ఇక్కడ 426/3 సర్వే నంబర్లోని 9.39 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్ విలువ రూ.1,111 కోట్లకు పైగా ఉంది. అయితే ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లకు భూ బదిలీని ప్రాతిపదికగా తీసుకుని 9.39 ఎకరాలకు రూ.199.96 కోట్లుగా విలువ కట్టింది. ఇంతటి ఖరీదైన ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల రిసార్టులు, హోటళ్లకు చంద్రబాబు ప్రభుత్వం భూములిస్తూ.. తద్వారా నాకింత–నీకింత స్కీమ్ను నడిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 13న మెగ్లాన్ కన్సార్టియంకు మధురవాడలో 5 ఎకరాల భూమిని, ఈ నెల 2వ తేదీన ఒడిశాకు చెందిన పద్మా హాస్పిటల్స్ ప్రైవేటు లిమిటెడ్కు 4.39 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. తాజాగా ఈ 9.39 ఎకరాల భూమిని 22(ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి ఏపీటీడీసీ పేరిట బదిలీ చేసింది. అంటే ఇక్కడ మెగ్లాన్, పద్మా హాస్పటాలిటీస్ సంస్థలకు రూ.వందల కోట్ల విలువైన భూములను ముందుగానే కట్టబెట్టిందనేది గమనార్హం.అంతా బుక్ అడ్జెస్ట్మెంట్!దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో పెట్టుబడుల పేరుతో భూ దోపిడీ జరుగుతోంది. ఇక్కడ పర్యాటక సంస్థ భూములనే కాకుండా ప్రైవేటు వ్యక్తులు తమకు నచ్చిన ప్రభుత్వ భూమిని ఎంపిక చేసుకుని వస్తే, ఆ భూమిని సైతం ఏపీటీడీసీకి బదిలీ చేసి తర్వాత లీజుకు/అవుట్రేట్ సేల్కు ఇచ్చేందుకు ఇటీవల కొత్త జీవోలు ఇచ్చింది. ఇందులో బిడ్డింగ్, టెండర్లు లేకుండానే కేవలం కాగితాలపై పెట్టుబడి ప్రతిపాదనల ఆధారంగా భూములు కేటాయిస్తోంది. వాస్తవానికి సదరు సంస్థలకు ఆతిథ్య రంగంలో అనుభవాన్ని సైతం చూడట్లేదు. వాస్తవ బ్రాండింగ్ సంస్థలతో కన్సార్టియం లేకుండా మొక్కుబడి బ్రాండింగ్తో వచ్చిన వారికి ఏకంగా రూ.వందల కోట్ల విలువైన భూములు ఇచ్చేస్తోంది. పైగా నోవేషన్ క్లాజ్ లేకుండా చేసి అవుట్రేట్ సేల్కు భూములు అమ్మేస్తోంది. తాజాగా రూ.1,111 కోట్ల విలువైన 9.39 ఎకరాల 22(ఏ) నిషేధిత భూమి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ భూమిని గతంలోనే మెగ్లాన్, పద్మా హాస్పటాలిటీస్కు కేటాయించగా.. తాజాగా ఆ భూమిని ఏపీటీడీసీ పేరిట బదిలీ చేసింది. ఇక్కడ, మొత్తం 9.39 ఎకరాల భూమికి ఏపీఎల్ఎంఏ (ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ) రూ.1,111 కోట్లకుపైగా విలువ కడితే.. ఏపీటీడీసీకి రూ.199.96 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాలోకి రాకపోగా, ఈ మొత్తాన్ని బుక్ అడ్జెస్ట్మెంట్గా మాత్రమే చూపిస్తుండం ప్రభుత్వ దుర్నీతికి అద్దం పడుతోంది. రూ.1,111 కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తుల చేత్లులో దాదాపు 99 ఏళ్లు పాటు శాశ్వతంగా పెడుతోంది. -
కూటమి పాలనలో ప్రభుత్వ స్కూల్ పని అయిపోయింది
-
‘కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది’
తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను పూర్తిగా బ్రష్టుపట్టించిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. కేవలం ప్రచార ఆర్భాటాలు, రంగుల ప్రకటనలపై ఉన్న శ్రద్ధ.. పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందని ఆక్షేపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైఎస్ జగన్ హయాంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, కార్పొరేట్ సంస్థలు అసూయపడేలా వెలిగిపోయిన ప్రభుత్వ పాఠశాలలను.. నేడు చంద్రబాబు, లోకేష్లు కలిసి మళ్లీ 2014-19 నాటి చీకటి రోజుల్లోకి, అధ్వాన్న స్థితికి దిగజార్చారని ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం పిల్లలకు సురక్షిత మంచినీరు, నాణ్యమైన భోజనం కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజారిందని... ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..నెల దాటినా అందని విద్యామిత్ర కిట్లు – అరకొరగా పుస్తకాలు..రాష్ట్రంలో పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు కనీస అవసరాలైన విద్యామిత్ర కిట్లు, బూట్లు, బెల్టులు, బ్యాగులు అందలేదు. జిల్లాలకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు కూడా అరకొరగానే చేరాయ,గతంలో మిగిలిపోయిన పాత స్టాక్తో అడ్జస్ట్ చేసే దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ నేతృత్వంలో బడులు తెరిచే ఆరు నెలల ముందే భారీ కసరత్తు చేసి, పాఠశాల ప్రారంభమైన మొదటి వారంలోనే విద్యార్థుల చేతికి పుస్తకాలు, యూనిఫాం, షూ, బ్యాగులు అందించాం.ప్రచారానికే పెద్దపీట – విద్యార్థులపై నిర్లక్ష్యం..ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి కేవలం ప్రచారాలకే పరిమితమైంది. బడ్జెట్లో అత్యధిక నిధులను ప్రచారానికే కేటాయించి, విద్యావ్యవస్థకు అన్ని హంగులు అద్దినట్లుగా రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ తల్లిదండ్రులను, పిల్లలను మభ్యపెడుతున్నారు. మహిళల భద్రత గురించి మాట్లాడే కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు కనీసం టాయిలెట్లు కూడా కల్పించడంలో విఫలమైంది.2014-19 నాటి చీకటి రోజుల్లోకి ప్రభుత్వ బడులు..గత చంద్రబాబు హయాంలో (2014-19) సుమారు 1700 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, పెచ్చులూడిన స్లాబులు, నేలపై చదువులు, కనీసం బ్లాక్ బోర్డులు లేని దుస్థితిని కల్పించారు. మళ్లీ ఇప్పుడు అదే విధంగా పాఠశాలల్లో మూలపడిన ఫర్నీచర్, కింద కూర్చునే విద్యార్థులు, తాగునీటి కోసం బోర్ వెల్స్ వద్ద బారులు తీరే దారుణ పరిస్థితులను తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం ద్వారా పేద విద్యార్థులను కార్పొరేట్ సంస్థలకు దాసోహం చేసే కుట్ర జరుగుతోంది.వైఎస్ జగన్ హయాంలో విద్యా విప్లవం – రూ. 73 వేల కోట్ల ఖర్చు..2019లో వైఎస్. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. జూన్ 2019 నుండి ఫిబ్రవరి 2024 వరకు విద్యాశాఖపై రూ. 72,919 కోట్లు ఖర్చు చేశారు. 'నాడు-నేడు' ద్వారా రెండు దశల్లో 44,617 స్కూళ్లను సుమారు రూ. 11,000 కోట్లతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. పెయింటింగ్స్, ఫర్నీచర్, డిజిటల్ క్లాస్ రూములు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్ వంటి 11 రకాల మౌలిక వసతులను తప్పనిసరి చేశారు. 'అమ్మఒడి' పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 25,809 కోట్లు జమ చేశారు.ఇంగ్లిష్ మీడియం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ల పంపిణీ, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలో ఇంగ్లిషులో ప్రసంగించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు పెడుతున్న పేరెంట్ టీచర్ మీటింగ్స్ (పీటీఎం) సభల్లో కనిపిస్తున్న ఫర్నీచర్, టేబుల్స్ అన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వ హాయంలో సమకూర్చినవే.ప్రాణాంతకంగా మారిన 'గోరుముద్ద' – పెరిగిన డ్రాపౌట్స్..వైఎస్ జగన్ గారి హయాంలో రోజుకో మెనూతో, పౌష్టికాహారంతో రూ. 7,244 కోట్లు ఖర్చు చేసి 'జగనన్న గోరుముద్ద' అందిస్తే.. నేడు కూటమి ప్రభుత్వంలో అది పిల్లల ప్రాణాలకే ముప్పుగా మారింది. పాఠశాలల్లో నీళ్ల సాంబారు, ముద్దన్నం పెడుతున్నారు. కలుషిత నీరు తాగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చూస్తున్నాం. గతంలో 43 లక్షలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం 30 లక్షలకు పడిపోయిందని.. డ్రాపౌట్ రేట్ ఇంత దారుణంగా పెరగడానికి ప్రభుత్వ అసమర్థతే కారణం.మంత్రి లోకేష్ ద్వంద్వ వైఖరి...స్టాన్ఫర్డ్లో చదువుకున్నానని చెప్పుకునే విద్యాశాఖ మంత్రి లోకేష్ రోజుకో దేశం తిరుగుతూ క్వాంటమ్ వ్యాలీ, ఏఐ టెక్నాలజీ అని మాట్లాడుతున్నారు, మరి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసురూములు, ట్యాబులు, నాడు-నేడు పనులను ఎందుకు ఆపేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అబ్బకూడదనేదే లోకేష్ ఉద్దేశమా? గతంలో లోకేష్ ఆర్భాటంగా ప్రకటించిన రూ. 7వేల కోట్ల 'మన బడి - మన భవిష్యత్తు' నిధులు ఏమయ్యాయి, ఆ పథకం కింద కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. వైఎస్ జగన్ హాయంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ విధానం ప్రవేశపెడితే దాన్ని తీసేసి, మళ్లీ ఏకోపాధ్యాయ పాఠశాలల (సింగిల్ టీచర్ స్కూల్స్) స్థాయికి విద్యావ్యవస్థను దిగజార్చారు. వైఎస్సార్సీపీ డిమాండ్లు..ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు, బాలికలకు టాయిలెట్లు, సురక్షిత తాగునీరు వెంటనే కల్పించాలి. నిలిచిపోయిన డిజిటల్ తరగతులు, 'నాడు-నేడు' ఫేజ్-3 పనులను పునఃప్రారంభించాలి. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతూ, విద్యావ్యవస్థను సంస్కరించడం చేతకాకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.చివరిగా విద్య అనేది వ్యాపార వస్తువు కాదు.. అది పేదవాడి హక్కని... ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రచార ఆర్భాటాలు పక్కనబెట్టి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతూ, కనీస మౌలిక వసతులు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ విద్యాశాఖను నడపడం చేతకాకపోతే, మంత్రి లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని... పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే వరకు, ప్రభుత్వ బడులకు వైఎస్ జగన్ హయాం నాటి పూర్వ వైభవాన్ని, ఆ స్వర్ణ యుగాన్ని మళ్లీ తీసుకొచ్చే వరకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు -
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పోర్టులు, భూములను తమ వారికి కట్టబెట్టటానికే చంద్రబాబు కేబినెట్ సమావేశమంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదుగురు మంత్రులు గైర్హాజరయ్యారంటే ఎంత నాన్ సీరియస్గా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రజలకు మేలు చేసే అంశాలపై చర్చించటం మానేశారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘కేబినెట్కి డీజీపీ వెళ్లి సోషల్ మీడియా కట్టడిపై మాట్లాడటం ఏంటి?. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో మా పార్టీ నేతలను తిట్టిస్తున్నారు. జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. కానీ మావారిపై అక్రమ కేసులు పెట్టి 1,394 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబు భయపడిపోతున్నారు. అందుకే టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నారు. గాదె సాయికృష్ణను దారుణంగా లాకప్ డెత్ చేస్తే ఈ డీజీపీ ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు?. ఇలాంటి వాటిపై కేబినెట్లో చర్చించరా?. ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్ తల పగలకొట్టిన టీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసు పెట్టలేదు?. ఉత్తుత్తి కేబినెట్లు కాకుండా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కేబినెట్కి ఎందుకు రావటం లేదు?. ఆ కారణాలు ఏంటో సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి.’’ అని అంబటి నిలదీశారు.‘‘రావణ్కు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తోందని ఉపా చట్టం ప్రయోగించారు. రావణ్ టీమ్లోని ఒక మహిళ జగన్ని కలిసి న్యాయ సహాయం కావాలని కోరారు. వైఎస్ జగన్ సరే అన్నారు.. అంతే తప్ప రావణ్కు మాకు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ కార్యకర్తలు అడిగినా న్యాయ సహాయం చేస్తాం. తీవ్ర వాదుల మీద పెట్టాల్సిన చట్టాన్ని అమాయకులపై పెట్టటం ఏంటి?. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
జీతం 26 వేలు ఇవ్వాల్సిందే.. రోడ్డెక్కిన అంగన్వాడీలు
-
AP కేబినెట్ చెత్త నిర్ణయం: ప్రశ్నిస్తే బొక్కలో వేయండి..
-
బయటపడ్డ కూటమి అసలు రంగు...వైరల్ అవుతున్న TDP నేత పీఏ కాల్ రికార్డింగ్
-
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులే
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియాపై డీజీపీ, ఉన్నతాధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం, టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. -
చంద్రబాబు కు పిచ్చి పట్టింది.. CPI రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
-
ఎందుకు మీకా పదవులు... చంద్రబాబు, పవన్ పై అంగన్వాడీల ఆగ్రహం
-
కొంచమైనా సిగ్గనిపించట్లేదా బాబు.. నిద్రలో కూడా జగన్ పేరేనా..
-
ఖాళీ కుర్చీలతో చంద్రబాబు కేబినెట్ సమావేశం!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి కొందరు మంత్రులు గైర్హాజరయ్యారు. దీంతో కీలక సమావేశంలో పలువురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కుర్చీలు ఖాళీగా కనిపించాయి.ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి మరోసారి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన ముంబై వెళ్లనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. గత రెండు కేబినెట్ సమావేశాల్లోనూ నడుం నొప్పి, ఇతరత్ర కారణాలతో పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆ కారణంతోనే ఆయన సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఇక మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. మంత్రి టీజీ భరత్ ఏమో అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మంత్రులంతా విదేశీ పర్యటనలు చేయొద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తిగత కారణాలతో(బెంగళూరు పర్యటనలో ఉన్నట్లు సమాచారం) హాజరు కాలేదు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుపతికి కేంద్రమంత్రి రాక సందర్భంగా ప్రొటోకాల్ విధుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా హాజరు కాలేదని తెలుస్తున్నా.. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయా కారణాలతోనే మంత్రులు గైర్హాజరయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు దాదాపుగా లేకున్నా.. మీటింగ్ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు పంక్చువాలిటీ పేరిట మంత్రివర్గ భేటీ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
116 ఏళ్ల నవనీతమ్మ వీడియో ఫేక్.. ముసలావిడతో బాబు పబ్లిసిటీ వెనుక అసలు కథ
-
బూడిద పార్టీ దందా.. బినామీలకు బంపర్ ఆఫర్
-
నోరు జారిన నారాయణ... అమరావతి వద్దు మావిగాన్ ముద్దు
-
ఒకరికి అమరావతి.. ఇంకొకరికి పోర్టులు.. దిల్ సినిమాలో వేణుమాధవ్, MS నారాయణలా..
-
116 ఏళ్ల ముసలమ్మతో పబ్లిసిటీ.. తెలుగు బూడిద పార్టీ మరో డ్రామా!
-
బాబు మమ్మల్ని చంపేస్తున్నారు!
సీతానగరం: దౌర్జన్యంగా భూములు లాక్కున్న చంద్రబాబు సర్కారు నిర్వాసితులకు కనీసం పరిహారం కూడా చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ రైతులు, మహిళా రైతులు తమ కుటుంబాలతో కలసి ఆందోళనకు దిగి కూటమి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల నవీన్లను బాధిత రైతులు అడ్డుకున్నారు. తామందరం టీడీపీకి చెందినవారమని... పాము తమ పిల్లలను ఎలా చంపుతుందో చంద్రబాబు తమను అలా చంపుతున్నారని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం వడ్డీతో సహా చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇదే పథకం వద్ద చంద్రబాబు హామీ ఇచ్చారని, దానిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీయే తమను రోడ్డున పడేసిందన్నారు. పిల్లలకు వివాహాలు చేసినా వారి కాపురాల్లో కలహాలు వస్తున్నాయని మహిళా రైతులు కంటతడి పెట్టారు.భూముల పట్టా పుస్తకాలపై జగన్ ఫొటో వేస్తున్నాడని విమర్శించారని.. మరి తమ భూములు తీసుకుని చంద్రబాబు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పురుషోత్తపట్నం, రామచంద్రపురం ప్రాంతానికి చెందిన బాధిత రైతులను బుజ్జగించేందుకు పోలీసులు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. భూములిచ్చి ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని బాధిత రైతులు కలగర బాలకృష్ణ, పెండ్యాల పుల్లారావు, కోడేబత్తుల ప్రసాదరావు, దుద్దిపూడి శ్రీను, కొండిపాటి కోటేశ్వరరావు, కూచిపూడి సుబ్రహ్మణ్యం, కలగర సుబ్బారావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నమ్మబలికి అన్యాయం చేశారు..ఎత్తిపోతల పథకం కోసం 2017లో దౌర్జన్యంగా భూములు తీసుకున్నారని, రూ.24 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు పరిహారం అందిస్తామని అప్పట్లో నమ్మబలికారని బాధిత రైతులు పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని కోరగా రూ.17 లక్షలు రివార్డు ప్రకటించి తమకు అన్యాయం చేశారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 72 ఎకరాలకు సంబంధించి సుమారు వందమంది రైతులు హైకోర్టును ఆశ్రయించగా ఆరు శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని కొద్ది నెలల క్రితం తీర్పు ఇచ్చినా తమకు అందించాల్సిన రూ.30 కోట్లు ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.45 రోజుల్లో అందిస్తామని హామీనిర్వాసిత రైతుల నిరసనతో కంగుతిన్న టీడీపీ ప్రజాప్రతినిధులు ఫోన్లో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. 45 రోజుల్లో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. లేదంటే తాము కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు. దీంతో బాధిత రైతులు నిరసన విరమించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనలు గుప్పించారు. ఎన్జీటి నుంచి ఎటువంటి అనుమతులు లేని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని విడుదల చేయడం గమనార్హం. -
భూములపై బుకాయింపు
సాక్షి, అమరావతి: తాను చేసిన తప్పులు, అరాచకాలను ఇతరులకు ఆపాదించి బురద చల్లడంలో ఆరితేరిన సీఎం చంద్రబాబు భూముల విషయంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ పేరుతో నెలకో జిల్లాలో బహిరంగ సభలు పెడుతూ తన అబద్ధాల ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుండడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వాటి పంపిణీయే ఒక ప్రహసనమైతే దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రీసర్వే చేసి ఇచ్చిన పాసు పుస్తకాలపై అభూత కల్పనలతో విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వాటిని రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా తప్పుల తడకలతో పాస్ పుస్తకాలు ఇస్తూ అందుకోసం ప్రతి నెలా సభలు పెడుతున్నారు. తానేదో భూముల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన సభలోనూ ఇదే ప్రయత్నం చేశారు. నిజానికి ఆంగ్లేయుల తరువాత దేశ చరిత్రలో తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల రీ సర్వేను ప్రారంభించి విజయవంతంగా నిర్వహించిందని, విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని పరిశీలకులు, రైతులు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇందుకోసం శాటిలైట్, డ్రోన్, జీపీఎస్, కోర్ స్టేషన్లు, రోవర్లు లాంటి సాంకేతికతను వినియోగించింది. సర్వే కోసం ఏకంగా 10,185 మంది గ్రామ సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. గ్రామ సచివాలయాల ద్వారా ఈ మహా యజ్ఞాన్ని చేపట్టారు. ఐదేళ్లలో 6,800 గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తవగా మొత్తం 17 వేల గ్రామాల్లో డ్రోన్ సర్వే కూడా పూర్తయింది. భూముల సర్వే కోసం ఏ రాష్ట్రంలోని లేని విధంగా నాడు ఏపీలో డ్రోన్లు ఉపయోగించారు. సర్వే చేశాక ఉచితంగా 4 కోట్ల హద్దు రాళ్లు కూడా పాతించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పట్టాదార్ పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలపై క్యూఆర్ కోడ్, భూమి హద్దులు తెలిపే జియో కో–ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ముద్రించారు. జియో హద్దులతో ఇకపై ఎవరూ భూమి హద్దులు మార్చలేని విధంగా చర్యలు తీసుకున్నారు. రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సర్వేపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అయితే చంద్రబాబు నోటికి తాళం వేస్తూ నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నివేదిక భూముల రీ సర్వేలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని ధ్రువీకరించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పనితీరుకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ.500 కోట్లు ఇన్సెంటివ్ రాష్ట్రానికి ఇవ్వగా అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తాన్ని తీసుకుంది. అంటే మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమానికి బాబు సర్కారు ప్రోత్సాహకాలు అందుకుంది. 22 ఏ జాబితాలో 20 లక్షల ఎకరాలు ఈ రెండేళ్లలో టీడీపీ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22 ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనా«దీనం భూములను అకారణంగా నిషేధిత భూములుగా ప్రకటించింది. ఇవి కాకుండా పలు జిల్లాల్లో గతంలో 22 ఏ జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎకరాల భూములను టీడీపీ ఎమ్మెల్యేలు 22 ఏ జాబితాలో పెట్టించారు. పట్టా భూములు, ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం 27 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ పరిధిలోకి తెచ్చి ఎన్నికల సమయానికి 13.59 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమాల పేరుతో వాటిని మళ్లీ 22 ఏ జాబితాలో పెట్టేసింది. రెండేళ్లయినా ఆరోపణలు నిరూపించలేకపోయింది. ఆ భూములపై రైతులకు హక్కులు పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి పైకి మాత్రం ఆ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు మభ్యపెడుతున్నారు. విలేజ్ సర్వీస్ ఈనాం భూములపై అడ్డగోలుతనం 1.39 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనాం భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి తొలగిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని 22ఏ జాబితాలో పెట్టారు. రెండేళ్ల తర్వాత అందులో తప్పులు లేవని తేలడంతో తాజాగా వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారు. కానీ సభల్లో మాత్రం వైఎస్సార్సీపీ విలేజ్ సర్వీస్ ఈనాం భూములను 22ఏ జాబితాలో పెట్టినట్లు అబద్ధాలు వల్లె వేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ఆటో మ్యుటేషన్, పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లను తానే ముద్రించినట్లు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పేస్తున్నారు.గూటుపల్లి భూముల పేరుతో తహశీల్దార్ కార్యాలయంలో షో తాజాగా నంద్యాల జిల్లాకు వెళ్లిన చంద్రబాబు బనగానపల్లె సభలో అబద్ధాల నైపుణ్య ప్రదర్శన తర్వాత అక్కడి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి పబ్లిసిటీ స్టంట్ నిర్వహించారు. బేతంచర్ల మండలం గూటుపల్లిలో సర్వే నెంబర్ 215లో ఉన్న 2,669 ఎకరాలను గత ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టిందని, ఇప్పుడు వాటిని తాను తొలగించినట్లు అడ్డగోలుగా అబద్ధాన్ని చెప్పారు. వాస్తవానికి ఆ భూముల్ని 1963లో వక్ఫ్ భూములుగా ప్రకటించి 22ఏ జాబితాలో పెట్టారు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ బుధవారం జారీ చేసిన జీఓ ఆర్టీ నెంబర్ 77లో స్పష్టంగా పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని 22ఏ జాబితాలో పెట్టినట్లు బుకాయించడం గమనార్హం. బేతంచర్ల మండలంలోని భూములను తొలగించడానికి బనగానపల్లె మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లడాన్ని బట్టి చంద్రబాబు చేసింది పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. వివిధ దశల ప్రతిపాదనలు, వెరిఫికేషన్లు చేశాక చివరిగా ప్రొసీడింగ్స్ కలెక్టర్ ఇస్తే జిల్లా రిజిస్ట్రార్ అమలు చేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం బేతంచర్ల భూములను బనగానపల్లె మండలంలో పరిష్కరించినట్లు బిల్డప్లు ఇచ్చుకోవడం విశేషం. -
అమరావతిలో అడుగడుగునా అవినీతి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో కూటమి సర్కార్ రాజధాని పేరుతో వేల కోట్లు ప్రజా ధనాన్ని దుబారా చేస్తోందని, ప్రశ్నిస్తే మంత్రి నారాయణ బుకాయిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అమరావతిలో పేర్లు మార్చి నిర్మాణాల ఖర్చు పెంచేస్తున్నారని, కాంట్రాక్టర్లకు అడ్డంగా దోచిపెట్టేందుకే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు.ఇప్పటికైనా ప్రభుత్వం జగన్గారు ప్రతిపాదిస్తున్న మావిగన్ రాజధానిపై దృష్టి సారించాలని, తద్వారా అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో సాకే శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:అమరావతిపై నారాయణ బుకాయింపులు:మంత్రి నారాయణ అమరావతిగా పిలుస్తున్న 28 గ్రామాల పరిధిలో కడుతున్న కట్టడాలపై విస్మయానికి గురయ్యే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాల్లో ఎక్కడా లేని విధంగా అవినీతి జరుగుతోందని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు కదా, మీ సమాధానం ఏంటని అడిగితే.. నారాయణ మాత్రం తమ చర్యల్ని సమర్ధించుకున్నారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అమరావతిలో అవినీతి ప్రవాహం జరుగుతోంది.వరద నీళ్లే కాదు, వరద నీళ్ల కంటే మహా జోరుగా అవినీతి ప్రవాహం అక్కడ జరుగుతోందన్న విషయాన్ని ప్రజలు చెప్తుంటే, దాన్ని సమర్థించుకోవడం కోసం నారాయణ నానా పాట్లూ పడ్డారు. మామూలు ఇళ్లకైతే ఒక లెక్క, ఐకానిక్ భవనాలకైతే మరో లెక్క అంటూ చెప్పుకొచ్చారు. ఐకానిక్ బిల్డింగ్ అంటే ఎవరికీ అర్థం కానట్లు మాట్లాడారు. అది చూస్తే మా పిల్లలు కూడా ఇడ్లీ పాత్ర లాగా ఉంటుందని చెప్తున్నారు. అడ్డంగా పెట్టినా, క్రాస్గా పెట్టినా, తలకిందులుగా పెట్టినా అది ఇడ్లీ పాత్రే అవుతుంది. దానికి అయ్యే ఖర్చు ఎలా పెరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది.నిర్మాణాల రేట్లు పెంచేసి అడ్డగోలుగా దోపిడీ:మీరు దాదాపు 52,20,496 చదరపు అడుగుల నిర్మాణాలు చేస్తున్నారు. ఇందులో చదరపు అడుగుకు మీరు చెబుతున్న లెక్క దాదాపు రూ.20,427. ఇదేం లెక్క అని అడుగుతున్నాం. ఇదే బిల్డింగ్ కి 2017–18 సంవత్సరాల్లో మీరు టెండర్ పిలిచినప్పుడు, రూ.2271.14 కోట్లతో టెండర్లు ఖరారు చేశారు. వచ్చిన కంపెనీలు ఎన్సిసి, షాపూర్జీ–పల్లోంజీ, ఎల్ అండ్ టీ. అయినా ఈ నిర్మాణాలు చేపట్టకుండా వదిలేసి, ఇప్పుడు మళ్లీ వాళ్లకే ఇచ్చి మొదలు పెట్టించారు. కానీ ఖర్చు మాత్రం రూ.4354.43 కోట్లకు పెంచేశారు. అంటే దాదాపు రూ.2033.29 కోట్ల మేర రేట్లు పెరిగిపోయాయి. ఇది నారాయణకో లేక చంద్రబాబుకో ఆశ్చర్యం కలగకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్లకి ఆశ్చర్యం కలుగుతోంది.అందులో ఒకటి, రెండు టెండర్లు అయినా వేరే కంపెనీలకు ఇవ్వలేరా? ప్రపంచ స్థాయి బిడ్డింగ్ ఇచ్చినప్పుడు, మిమ్మల్ని అడిగే పాయింట్ ఒక్కటే. మీరు మీ సొంత భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.20 వేలు ఎక్కడైనా ఇచ్చారా నారాయణ గారు అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు ఇంటికీ దాదాపు చదరపు అడుగుకు రూ.5 వేలు ఖర్చు పెడుతున్నారు. కానీ అమరావతి నిర్మాణాల రేట్లు బొంబాయిలో గాని, బెంగళూరులో కానీ, ఎక్కడ లేవు. వాటి గురించి మాట్లాడితే.. మా వైఎస్సార్సీపీ అమరావతికి వ్యతిరేకం అని ఆడిపోసుకుంటారు. అమరావతి పేరు మీద వృథా, దోపిడి అవుతున్న ప్రజాధనాన్ని, ప్రజల శ్రమను మీరు నాశనం చేస్తున్నారు. దాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం.అమరావతి అని పేరు పెట్టిన మెటీరియల్ ఏమైనా ఆ ఇంద్రుని ఊరి నుంచి తెప్పిస్తున్నారా? ఎందుకంటే చంద్రబాబు మాట్లాడితే చాలు దేవతల రాజధాని అంటుంటాడు. దేవతలు ఏమైనా కంపెనీ పెట్టారా? పైన ఎక్కడో నాకు తెలియదు, కానీ ఇంద్రలోకం నుంచో, ఎక్కడి నుంచో ఆ మెటీరియల్ వస్తోంది. అదన్నా ఎక్కడో చెప్పాలి. అక్కడి నుంచి రవాణా చేయాలి కాబట్టి ఖర్చు పెరిగినట్లుంది.అంతులేని నిర్మాణ వ్యయం:చంద్రబాబు అమరావతిలో దాదాపు రూ.680 కోట్లు రకరకాల రాయితీల రూపంలో ఇస్తున్నారు. నిజానికి అక్కడ ఇప్పటికే ఇసుక ఫ్రీ. జీఎస్టీ లేదు. సీవరేజ్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. పన్నులు కట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అన్నీ వెనక్కి ఇచ్చేస్తారంట!. ఆ భవనాల కరెంటుకి, ఫైర్కి, లిఫ్ట్కి, ప్లంబింగ్ కి రూ.4354.43 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఇంకా తమాషా, ఘోరం ఏంటంటే ఆ గ్లాస్ ఫేస్డ్ వర్క్ ఏంటో మాకు అర్థం కాదు. అంటే బహుశా అద్దాలు వేస్తారేమో, ఈ అద్దాలకి మీరు రూ.2,31,688 కోట్లు ఖర్చు పెడుతున్నారు.అది రూ.2,540 కోట్ల గ్లాసుల కంటే అద్దాలు వేసే ఖర్చు ఎక్కువ. అక్కడ ఇంకా రోడ్లు, డ్రైనేజ్ లు ఇవన్నీ ఉన్నాయట. అయినా ప్రత్యేకంగా రోడ్లు, కాలవలకు మళ్ళీ రూ.1,052 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిజైన్లకు రూ.401 కోట్లు, బొమ్మలు వేసినోడికి రూ.400 కోట్లు, గ్లాసులు వేసేవాడికి గ్లాస్, అద్దాలకేమో రూ.2,540 కోట్లు. కరెంటుకి , ప్లంబింగ్ లాంటి పనులకేమో దాదాపు రూ.2,316 కోట్ల పైచిలుకు ఖర్చు చేస్తున్నారు. ఇలా మొత్తం నిర్మాణ ఖర్చు రూ.4354 కోట్ల రూపాయలకు చేరింది. అసలు కంటే కొసర ఎక్కువైందని బిల్డింగ్ కి దాదాపు 100 శాతం కంటే ఎక్కువ డబ్బుల్ని మీరు అదనంగా ఖర్చు పెడుతున్నారు.కేంద్రాన్ని మించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యయం:కేంద్ర ప్రభుత్వం కూడా బిల్డింగులు కడుతోంది. మీరు వాళ్లను మించి పోతున్నారు. కేంద్రం దాదాపు 54 లక్షల 45 వేల చదరపు అడుగుల నిర్మాణం మొదలు పెడితే, దానికి వాళ్ళు పెడుతున్న ఖర్చు రూ.2,533.99 కోట్లు. 54 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు ఇచ్చే డబ్బులు రూ.2,534 కోట్లు. వాళ్ళ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి మొత్తం రెండు కలిపేస్తే సాధారణ ఆఫీస్ కి, రెసిడెన్షియల్ అకామిడేషన్ రెండు కలిపితే రూ.4,645. ఇది వాళ్ళ లెక్క, వాళ్ళ డొమైన్ లో నుంచి తీసిన పేపర్ ఇది. మరి మీకెందుకు అదే చదరపు అడుగుకు రూ.20 వేలు అవుతుందో చెప్పాలి.నారాయణ మూడు రిజర్వాయర్లు కడతాం, పది లిఫ్టులు పెడతాం, వరద నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ ఎత్తి మళ్ళా కృష్ణానదిలోకి పోస్తాం అంటారు. మీ అమరావతికి ప్రజల ఆమోదం లేదన్న సంగతి మీకు అర్థమైతే, జగన్గారు చెప్పిన మాటకు మీకు అర్థమవుతుంది. ఈరోజు మావిగన్ కి ప్రజల మద్దతు ఉంది. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కొత్తగా ఎయిర్ పోర్ట్, రైల్వేస్టేషన్ కడతారట. 28 గ్రామాల రాజధానిలో రైతులు కూడా ఉండటం లేదు, బయటకు వచ్చేస్తున్నారు.మావిగన్ రాజధాని తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం:అభివృద్ధికి పనికొచ్చే గ్రోత్ ఇంజన్ క్యాపిటల్ మావిగన్ ద్వారానే సాధ్యమవుతుంది. మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు ఉన్న 110 కిలోమీటర్ల ప్రాంతం. ఒక మూడు ప్రధాన పట్టణాలు, మంచి భూభాగాలు, దాదాపు 60 లక్షల జనాభా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్ ఉన్నాయి. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పి, ఇప్పటికి 60 వేల కోట్లు అప్పులు తెచ్చి నిర్మిస్తున్నారు.అది పూర్తయ్యే సరికి మరో 2 లక్షల కోట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే లక్ష ఎకరాల భూసేకరణలో ఉన్నారు. ఎకరా అభివద్ధికి మీరు చెప్పిన లెక్కే రెండు కోట్లు. లక్ష ఎకరాల అభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయలు. ఇవన్నీ ఎవరి డబ్బులు ? ఓ రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే, రాయలసీమలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఇంకొక 10 వేల కోట్లు ఖర్చు పెడితే ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఆ ఆలోచన రాదా మీకు? సరిగ్గా అక్కడే మీ గురించి అనుమానాలు వస్తున్నాయి.మీరు దానికి ఏ పేరు అయినా పెట్టండి. ఐకాన్ అనండి. గోల్డెన్ ఐకాన్ అనండి. ప్రశ్నిస్తే మాత్రం మీకు కోపాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నిర్బంధ అభివృద్ధి కేంద్రీకరణ ఆపండి. దీని వల్ల ఎలాంటి లాభం లేదు. అమరావతి పేరు మీద జరుగుతున్న ప్రహసనం కాంట్రాక్టర్ల కోసమే. ఐదేళ్ల కింద అదే కాంట్రాక్టర్ మళ్ళా అదే కాంట్రాక్టర్. అదనపు ఖర్చు అద్దాల కోసమే. కనుక మసిపూసే మాటలను మానేసి, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టి, ప్రజల రాజధాని కాబోయే మావిగన్ ను ఆలోచించి నిర్మించమని కోరుతున్నామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చెప్పారు. -
బాబు, పవన్ ఒక్కసారి ఈ రోడ్లని చూడండి
-
‘ప్రశ్నించకపోతే ఏపీని కూడా బాబు అమ్మేస్తారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రజల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ వర్గాల సమస్యలను పరిష్కరించడం లేదని.. వీటిని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీని దుర్మార్గంగా చూపిండానికి కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు.‘‘మాటిమాటికి వైఎస్ జగన్, వైఎస్సార్సీపీని దూషిస్తోంది. వైఎస్ జగన్ను దూషించడానికి చంద్రబాబు దిగజారిపోతున్నాడు. 17 ఏళ్ల పాటుగా సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఇది సంస్కారమా?. మీ వ్యవహారంలో తీవ్రమైన ప్రస్టేషన్ ఎందుకు కనిపిస్తోంది. బహిరంగ సభల్లో వైఎస్ జగన్ కుటుంబం కోసం ఎందుకు మాట్లాడుతున్నారు?. వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. మీ పార్టీ బూడిద పార్టీనా?. రాష్ట్ర వనరులు దోచి.. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకలేక బూడిద చేస్తున్న మీమ్మల్ని బూడిద పార్టీ అనొచ్చా?..సంక్షేమాన్ని, అభివృద్ధిని బూడిద చేశారు. దీనికి డైవర్షన్గా రాముడ్ని, రావణ్ని తీసుకువస్తారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ మీ సంపద సృష్టి మీ అనుయాయులకు, కార్పొరేట్ సంస్థలకు సంపద సృష్టిస్తున్నారు. రామాయంపట్నం పోర్ట్ను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఐదు వేల కోట్లతో శరవేగంగా జగన్ పనులు పూర్తి చేశారు. మరో ఐదు శాతం పనులు పూర్తి చేయాలి. వైఎస్ జగన్ నిర్మాణం చేసిన పోర్ట్లను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు...ఎవరైనా చంద్రబాబుపై గొంతెత్తి ప్రశ్నిస్తే వారిపై దుర్మార్గమైన కేసులు, వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి కొట్టుకుపోయాయి. సాయికృష్ణ తల్లి బూడిద అడిగినా ఇవ్వరు. తునిలో చిన్నారి అదృశ్యమైనా.. విశాఖలో మత్స్యకారులు గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టలేరు. శాంతిబద్రతలు కుప్పకూలిపోతే... రావణ్ లాంటి యూట్యూబర్లపై ఉపా చట్టాలను పెడుతున్నారు. పెట్టాల్సిన చట్టాలు కాకుండా.. చట్టాలను అతిక్రమించడానికి మేము వ్యతిరేకం. నాలుగు కేసుల్లో రావణ్కు బెయిల్ వస్తే.. ఐదో కేసులో ఉపా చట్టాన్ని పెట్టారు. రావణ్ భావజాలానికి మేము అనుకూలం కాదు. తమ రాజకీయం కోసం రాముడు, రావణ్ను వాడుకుంటున్నారు...కుల ప్రస్తవన లేకుండా చంద్రబాబు రాజకీయం చేయలేకపోతున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబు హుందాగా ప్రవర్తించాలని చెబుతున్నాము. ఆడబిడ్డ నిధి ఏమైందంటే చెప్పడు.. కానీ సభల్లో తాను సంక్షేమ పథకాల రథసారధిగా చెబుతారు. రైతుల మీద విపరీతమైన భారాన్ని మోపారు. వైఎస్ జగన్ భూములు రీ సర్వే చేయిస్తే మీ భూములు లాగేసుకుంటారంటూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు రేషన్ కార్డుల మీద మీ ఫోటోలు ఉన్నాయి.. అంటే రేషన్ మీరు లాగేసుకుంటారా?. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పట్టాదారు పుస్తకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది...ప్రచారం మీద తప్పా.. ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టలేదు. దోచుకోవడం...దాచుకోవడంలో నిమగ్నమయ్యారు. మావిగన్లో అన్నీ ఉన్నాయి. మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రశ్నించకపోతే చివరకు ఏపీని కూడా బాబు అమ్మేస్తారు’’ అంటూ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు చిర్రు.. బుర్రు మహిళపై అనుచిత ప్రవర్తన వీడియో లీక్
-
ఏయ్ ఉండమ్మా.. మహిళపై చంద్రబాబు ఆగ్రహం
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లెలోని మీ భూమి-మీ హక్కు సభలో ఓ మహిళపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సమస్య చెప్పేందుకు ప్రయత్నించిన మహిళపై చంద్రబాబు మండిపడ్డారు. ఏయ్ ఉండమ్మా.. అంటూ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. ఇది పవిత్ర కార్యక్రమం అంటూనే సమస్య వినకుండా చంద్రబాబు దాటవేశారు.మహిళను అడ్డుకోలేదని పోలీసులపై కూడా చంద్రబాబు చిందులు తొక్కారు. ఏయ్ గీయ్ అంటూ కాసేపు హడావుడి చేసిన చంద్రబాబు తీరుపట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పలుసార్లు చంద్రబాబు ఇలాగే ప్రవర్తించారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.2018లో సచివాలయం బయట నాయీ బ్రాహ్మణులతో చంద్రబాబు ఇలానే బిహేవ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇయ్యమయ్యా... కనీస వేతనాలు ఇవ్వమని చెబుతున్నా. ఇవ్వం... మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తోక జాడిస్తే కట్ చేస్తా. బీ కేర్పుల్. బెదిరిస్తే తోక కట్ చేస్తా’ ‘పిచ్చాటలాడితే మాత్రం.. చాలా సీరియస్గా ఉంటది’ ‘ఏం తమాషాలాడుతున్నారా...’ అంటూ బెదిరింపులకు దిగారు. చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడుతూ.. వేలు చూపిస్తూ హెచ్చరికలు చేయటంతో నాయీ బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. అప్పటి ఘటనను కూడా గుర్తు చేస్తూ.. సోషల్ మీడియాలో ప్రజలు మండిపడుతున్నారు. -
చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం రెండు లేవు
-
అన్నీ ప్రైవేట్ పరం.. ప్రజలకు బూడిద . బాబు ప్రభుత్వంపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
బాబు పాలనపై పద్యం పాడిన లక్ష్మి పార్వతి.. ఈ వీడియో చూస్తే బాబు నిద్రపోడు
-
మత్స్యకారుల గల్లంతు ఘటన.. బయటపడ్డ ప్రభుత్వ వైఫల్యం
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల గల్లంతు ఘటనలో చంద్రబాబు ప్రభుత్వ ఘోర వైఫల్యం బయటపడింది. 4వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు బోటు ప్రమాదానికి గురికాగా.. రాత్రి 7 గంటల వరకు చూసిన కుటుంబ సభ్యులు.. ఆ తరువాత అధికారులకు సమాచారం ఇచ్చారు. 4వ తేదీ రాత్రి 7 గంటల తరువాత తమకు సమాచారం వచ్చిందని ఆర్డీవో తెలిపారు. అయితే, 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చినట్టు రిపోర్టులో త్రీ మెన్ కమిటీ పేర్కొంది.తనకు 5వ తేదీ ఉదయం 10 గంటలకు సమాచారం వచ్చిందని ఫిషరీస్ కమిషనర్ తెలిపారు. తప్పుని కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రభుత్వం అడ్డంగా దొరిపోయింది. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు మండిపడుతున్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించలేదని మొదటి నుంచి బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు తాము గల్లంతు అయిన ప్రాంతానికి ఒక్క బోటు, హెలికాప్టర్ కూడా రాలేదని బోటు డ్రైవర్ చిన్నా తెలిపారు.బాధ్యత గల ప్రభుత్వం అంటే.. ఆఖరి ఆశ ఆరిపోయే వరకూ ప్రాణాలను కాపాడేందుకు శ్రమించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బాధితుల గొంతు నొక్కేస్తూ, సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 72 గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం.. ఏమయ్యారో తెలియకుండానే వారు బతికి లేరని నిర్థారించేసింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం పేరుతో రూ.10 లక్షలు అందజేశారు.అది కూడా.. మత్స్య శాఖ నుంచి రూ.5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించడంపైనా విమర్శలొస్తున్నాయి. 2023లో హార్బర్లో బోట్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైతే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్కో బోటు, వలలకు రూ.20 లక్షలకు పైగా పరిహారం అందించింది. చిన్న వల కాలిపోయినా.. దానికీ పరిహారం అందించింది. కానీ.. ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి కనిపించకపోతే.. గాలించడం వదిలేసి.. కేవలం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
‘ఏపీలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులే. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకూ కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. కూటమి కార్యకర్తలు, నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కేసులు పెట్టటం లేదు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా?. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా?. పోలీసులు లాకప్డెత్లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి కమీషను గుంజుతున్నారు. లక్షల కోట్లు దోచుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.రష్యాలో తప్ప అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు.వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రక్షణ లేదు. టిప్పర్తో ఢీ కొట్టి చంపాలని చూశారు. పైగా ఆయన మీదే కేసు పెట్టారు. సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని దారుణం ఏపీలో నెలకొంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని రెండేళ్ల పాటు ఆపారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదు. దావోస్ పర్యటనలకు వెళ్లి ఏ పరిశ్రమను తెచ్చారు?. రాష్ట్రంలో జనం భయం భయంగా బతుకుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబును నమ్ముకుంటే జనసేన మునిగినట్టే!: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ కేసుతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించిన ఆయన.. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్మ కులానికి చెందిన రావణ్ను.. ఐడెంటిటీ మార్చి దళితుడిగా.. క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నించిందటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు. అతను క్రిస్టియన్ కాదు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా అతడి ఐడెంటిటీని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మార్చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించాయి అని అన్నారు. అరెస్ట్, బెయిల్పై ప్రశ్నలురావణ్ అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సెక్షన్లు చదివారు. అయితే జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడానికి ఎవరు సహకరించారో చెప్పాలి. “జగన్ గానీ, మేము గానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. చంద్రబాబు పాత్ర లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇకనైనా స్టోరీలు ఆపాలని.. ఈ బురద మాపై జల్లవద్దని నాని హితవు పలికారు.అతని వీడియోలే అన్నీ చెబుతాయిరావణ్ గత వీడియోలను పరిశీలిస్తే అతను ఎవరికీ అనుకూలంగా ఉన్నారో అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం.. రావణ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. “మావోయిస్టులకు మద్దతుగా పోస్ట్ పెట్టారని ఏడాది తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకాలం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అంటూ పశ్నలు గుప్పించారు.జనసేనపై వ్యాఖ్యలుచంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునిగిపోతుందని.. రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు.“పిఠాపురం పోలీస్ స్టేషన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు. బిగ్బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, డమ్మీ సీఎం పరిస్థితి ఇదే. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మతాల మధ్య చిచ్చు పెట్టొద్దుహిందూ, క్రిస్టియన్ వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని కొడాలి నాని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెప్పారు.ఆ మాటకు కట్టుబడి ఉన్నా2029 ఎన్నికల్లో పరుశురాముడి గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని రాజకీయంగా సమాధి చేస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదు అంటూ కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
ఉద్యమానికి ఉద్యోగులు శ్రీకారం... బాబు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం
-
5 కోట్లు పెట్టి ఉండవల్లిలో హెలిపోర్ట్.. ఎవడి సొమ్ముతో కడుతున్నావ్...
-
TDP పార్టీని వీడుతున్న MLA మాధవి రెడ్డి?
-
చూస్తుండగానే ప్రాణాలు గాల్లో.. 6 ప్రాణాలు తీసిన.. 20 గంటల ఆలస్యం
-
పది నెలల తర్వాత ‘స్పెషల్ టెట్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖకు బుధవారం మెమో జారీ చేసింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలని, పార్లమెంటులో చట్టం చేయించాలని కోరుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. మంగళవారం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. టెట్ మినహాయింపునకు కృషి చేస్తానని, పార్లమెంటులో చట్ట సవరణ కోసం పోరాడతామని, ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దని వారికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేగాక, ఇన్ సర్వీస్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళనను ఎందుకు పట్టించుకోవడంలేదని బుధవారం సీఎం చంద్రబాబునాయుడిని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేసిన 2 గంటల్లోనే ప్రభుత్వం ప్రత్యేక టెట్కు ఉత్తర్వులివ్వడం గమనార్హం. టీచర్ల ఘోషను పట్టించుకోని సర్కారు గత ఏడాది సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో 2011 కంటే ముందు డీఎస్సీ ద్వారా ఎంపికైన లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 ఏళ్లకు పైగా బోధన అనుభవంతో పాటు నాటి నిబంధనల ప్రకారం డీఎస్సీ ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు ఇప్పుడు టెట్ ఏమిటని ఉపాధ్యాయులంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, వీరి ఘోషను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి, రద్దుకు కృషి చేస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించి, ఆ తర్వాత ముఖం చాటేశారు. ఈ 74 వేల దరఖాస్తుల సంగతేంటి? మరోపక్క, సుప్రీం కోర్టు తీర్పు, ఉపాధ్యాయుల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి చంద్రబాబు ప్రభుత్వం గతేడాది సెపె్టంబర్లో టెట్కు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ–2026 స్కామ్ నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం గత నెల 5న ‘ఏపీ టెట్ జూన్ – 2026’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ఈనెల 5వ తేదీతో ముగిసింది. ఈ పరీక్ష కోసం 2,13,540 దరఖాస్తులు రాగా, వాటిలో 74,295 దరఖాస్తులు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులవి. వీరి నుంచి ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజు వసూలు చేశారు. ఇప్పుడు స్పెషల్ టెట్ నిర్వహిస్తే ఈ దరఖాస్తులను ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పడంలేదు. జీవో ఎందుకు ఇవ్వలేదు? మరోపక్క స్పెషల్ టెట్ నిర్వహించాలంటే ప్రభుత్వం జీవో విడుదల చేయాలి. ఆ తర్వాతే సిలబస్, పరీక్షా విధానం తదితర అంశాలపై పాఠశాల విద్యా శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా స్పెషల్ టెట్కు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి ‘మెమో’ ఇవ్వడంపై ఉపాధ్యాయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత తేదీలతో మెమో బుధవారం విడుదల చేసిన ఈ మెమోను జూన్ 25న సిద్ధం చేసినట్లు, జూలై ఒకటో తేదీ విడుదల చేసినట్లు పాత తేదీలు ఉండటం గమనార్హం. అంతేగాక టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ స్పెషల్ టెట్పై జూన్ 1న విజ్ఞప్తి చేశారంటూ పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకే 2025 అక్టోబర్లో 28న ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి, రద్దుకు కృషి చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చి, ఆ తర్వాత ముఖం చాటేశారు. -
బాబు సర్కారు ఘోర వైఫల్యం
సాక్షి, విశాఖపట్నం: గంగమ్మ అలల హోరు ఆ కుటుంబాలకు ఇప్పుడు మృత్యుఘోషలా వినిపిస్తోంది. బతుకు పోరాటం కోసం పడవెక్కి కడలి ఒడిలోకి వెళ్లిన ఆరుగురు గంగపుత్రులు ఏమయ్యారో తెలియక ఆ ఇళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. రోజుల తరబడి రేవు వైపు ఆశగా చూస్తున్న కళ్లలో నెత్తురు సుడులు తిరుగుతోంది. కానీ.. ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ అభాగ్యులను నిలువునా దగా చేసింది. బాధితులకు భరోసా ఇవ్వాల్సిన యంత్రాంగం.. కనీస కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా గాలింపు చర్యలను అర్ధాంతరంగా నిలిపివేసి చేతులెత్తేసింది. అదేమని కన్నీటితో ప్రశ్నిస్తున్న కుటుంబాలపైకి ఖాకీలను ఉసిగొల్పి గొంతునొక్కేందుకు యత్నిస్తోంది. కర్కశత్వాన్ని చాటుకుంటోంది. దీంతో గంగపుత్రుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ గోడు వినే నాథుడే లేడా అంటూ రోదిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు పేదలంటే గౌరవం.. మత్స్యకారులంటే ప్రాణమని డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. అరకొర పరిహారంతో బాధ్యత నుంచి తప్పుకుంటారా? కనీసం గల్లంతైనవారు బతికున్నారా, లేదా సముద్ర గర్భంలోనే కలిసిపోయారా అన్నది నిర్ధారించకుండానే వెతుకులాట ఎలా ఆపేస్తారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మనిషి ప్రాణానికి రూ.10 లక్షల వెలకట్టి, పరిహారం ఇచ్చేశాం కదా అని చంద్రబాబు సర్కారు బాధ్యత నుంచి తప్పుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మా వాళ్లు బతికుంటే ప్రాణాలతో.. లేదంటే వాళ్ల మృతదేహాలైనా తెచ్చివ్వండి‘ అంటూ కడుపుకోతతో ఆక్రోశిస్తున్నారు. అయినా బాధితుల ఆర్తనాదాలు మాత్రం పాలకుల చెవికెక్కడం లేదు. ప్రశ్నిస్తే.. పోలీసులతో తోసేస్తారా.? బాధితుల చెంతకు మొక్కుబడి పరామర్శకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రకు విశాఖ ఫిషింగ్ హార్బర్లో బుధవారం చేదు అనుభవం ఎదురైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ తమ ఆవేదనను చెప్పుకునేందుకు ఆయన కారును మత్స్యకార మహిళలు అడ్డుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలిసేంత వరకూ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కారుకు అడ్డంగా నిలుచున్నారు. అంతే పోలీసులు కనీస మానవత్వం లేకుండా పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళలపై తమ ప్రతాపం చూపారు. ఆడపడుచులని కూడా చూడకుండా, అత్యంత అమానుషంగా వారిని పక్కకు తోసేసి కర్కశత్వం ప్రదర్శించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టగా మారింది. దీనిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే తోసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మిన్నగా..బాధ్యత గల ప్రభుత్వం అంటే.. ఆఖరి ఆశ ఆరిపోయే వరకూ ప్రాణాలను కాపాడేందుకు శ్రమించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బాధితుల గొంతు నొక్కేస్తూ, సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 72 గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం.. ఏమయ్యారో తెలియకుండానే వారు బతికి లేరని నిర్థారించేసింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం పేరుతో రూ.10 లక్షలు అందజేశారు. అది కూడా.. మత్స్య శాఖ నుంచి రూ.5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించడంపైనా విమర్శలొస్తున్నాయి. 2023లో హార్బర్లో బోట్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైతే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్కో బోటు, వలలకు రూ.20లక్షలకు పైగా పరిహారం అందించింది. చిన్న వల కాలిపోయినా.. దానికీ పరిహారం అందించింది. కానీ.. ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి కనిపించకపోతే.. గాలించడం వదిలేసి.. కేవలం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.వారిని మృతులుగా నిర్ధారించలేదుగల్లంతైన మత్స్యకారులపై త్రిసభ్య కమిటీ నివేదికమహారాణిపేట : సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదని, వారిని మృతులుగా అధికారికంగా నిర్ధారించలేదని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఆర్డీవో కళ్యాణ్ చక్రవర్తి, ఏసీపీ చిట్టిబాబు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్తో కూడిన కమిటీ తొమ్మిది పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కోస్ట్ గార్డ్ అందించిన వివరాలు, ప్రభుత్వ జీవోలు (జీఓలు), అమల్లో ఉన్న నిబంధనలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. గల్లంతైన మత్స్యకారుల ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు, నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు, పరిహారానికి సంబంధించిన అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. -
చంద్రబాబుపై కేసులు కొట్టివేత ఫైనల్ ఆర్డర్ ప్రతులు అందజేత
విజయవాడ లీగల్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, మద్యం, ఇసుక, అసైన్డ్ ల్యాండ్.. కేసులకు సంబంధించిన ఫైనల్ ఆర్డర్ రిపోర్టులను విజయవాడ ఏసీబీ కోర్టు పాత్రికేయుడు తిలక్కు అందజేసింది. 2014–2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా ప్రయోజనాలను విస్మరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి.అనంతరం ఈ కేసులను ఏసీబీ న్యాయస్ధానం కొట్టివేసింది. ఆ తీర్పులకు సంబంధించి ఫైనల్ ఆర్డర్ రిపోర్టులు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్ తరఫున న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి ఏసీబీ న్యాయస్ధానంలో పిటీషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఎల్.తేజోవతి ఫైనల్ ఆర్డర్ రిపోర్టులను పిటిషనర్కు అందజేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో బుధవారం ఆ కాపీల ప్రతులను పిటిషనర్కు అందజేశారు. -
నువ్వు సౌత్ కొరియా వెళ్ళకు! బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు..
-
అమరావతిలో తవ్వేకొద్దీ అక్రమాలు
-
నీ కొడుకు సింగిల్ సీటు గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. చంద్రబాబుకు సవాల్
-
చంద్రబాబు చెప్పాడా.. రిపోర్టర్ ప్రశ్నకు పెద్ది రెడ్డి అదిపోయే కౌంటర్
-
బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు.. దొంగ సర్టిఫికెట్ల వాడికి విద్యాశాఖా..?
-
స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2014–19 మధ్య జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి తాము వెలువరించిన తుది తీర్పు కాపీలను బహిర్గతం చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అంగీకరించింది. తుది తీర్పు కాపీలను స్కిల్ కుంభకోణంలో థర్డ్ పార్టీ అయిన కొట్టి బాలగంగాధర తిలక్కు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్.తేజోవతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే కేసుల మూసివేత 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అసైన్డ్ భూములు, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం అమ్మకాలు, ఇసుక విధానం తదితర కుంభకోణాలు జరగ్గా, వీటిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. పలు కేసుల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. 2024లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే, సీఐడీలో తనకు కావాల్సిన అధికారులను నియమించి, వారి చేత కోర్టుల్లో ఆ కుంభకోణాల తాలూకు కేసులను మూసివేయించేలా పథక రచన చేశారు. చంద్రబాబు చెప్పినట్లే వాటిపై తాము నమోదు చేసిన కేసులను ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పేర్కొంటూ వాటిని మూసివేయాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్టులు దాఖలు చేసింది. ఈ క్లోజర్ రిపోర్టులను అనుమతించిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుపై గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను మూసివేసింది. అందులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు కూడా ఉంది. కేసుల మూసివేత కాపీలు ఇచ్చేందుకు నిరాకరించిన అప్పటి న్యాయాధికారి స్కిల్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తాను హైకోర్టులో పిల్ దాఖలు చేశానని, అది తేలేంత వరకు కేసును మూసివేయొద్దంటూ పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. అన్ని కుంభకోణాల్లో సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ల తాలూకు డాక్యుమెంట్లను ఇవ్వాలని పలువురు రాతపూర్వకంగా కోరినా ఏసీబీ కోర్టు అప్పటి న్యాయాధికారి తిరస్కరించారు. థర్డ్ పార్టీలకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దీనిపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. స్కిల్ కేసులో తుది తీర్పు కాపీ కోసం తిలక్ పిటిషన్ ఆ కుంభకోణాల కేసులను మూసివేస్తూ ఇచ్చిన తుది తీర్పు కాపీలను అందచేయాలని బాలగంగాధర్ తిలక్ ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు తుది తీర్పు కాపీని కోరారు. తిలక్ తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్కిల్ కుంభకోణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారని, అది పెండింగ్లో ఉందని ఏసీబీ కోర్టుకు వివరించారు. తాము దాఖలు చేసిన పిల్పై సరైన, పారదర్శక విచారణ కోసం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఇచ్చిన తుది తీర్పు కాపీ అత్యంత అవసరమని వివరించారు. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు ముందు పూర్తి, ఖచ్చితమైన వాస్తవాలను ఉంచడానికి ఈ తుది ఉత్తర్వుల కాపీ ఎంతో అవసరమని తెలిపారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం, దేశంలోని అన్ని హైకోర్టులు, దిగువ కోర్టులు పారదర్శకతను పెంచడానికి, ప్రజలకు అందుబాటులో ఉంచడానికి రోజువారీ ఉత్తర్వులు, తుది తీర్పులను అధికారిక వెబ్సైట్లో ఉంచడం తప్పనిసరని దుష్యంత్ తెలిపారు. అయితే, స్కిల్ కుంభకోణం కేసులో ఇచ్చిన తుది తీర్పు కాపీని ఏసీబీ కోర్టు ఇప్పటివరకు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. పిటిషనర్ తిలక్ కోరిన విధంగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తాలూకు తుది తీర్పు కాపీని అందచేసేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘హెరిటేజ్’కు షోకాజ్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ విక్రయిస్తున్న ‘హెరిటేజ్ ఫ్రెష్ పనీర్’ ఉత్పత్తిపై కేంద్ర ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్పత్తి లేబులింగ్, బ్రాండింగ్లో ‘ఫ్రెష్’, ‘హెల్తీ’ వంటి పదాలను వినియోగించడం ఆహార భద్రతా నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006లోని నిబంధనల ప్రకారం ఈ ఉత్పత్తికి ‘ఫ్రెష్’ అనే పదాన్ని ఉపయోగించే అవకాశం లేదని నోటీసుల్లో పేర్కొంది. అయినప్పటికీ ‘హెరిటేజ్ ఫ్రెష్ పనీర్’ పేరుతో విక్రయించడం ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా, ట్రేడ్ మార్క్ లేదా బ్రాండ్ పేరులో ‘హెల్తీ’ అనే పదాన్ని వినియోగించడంపైనా ఎఫ్ఎఫ్ఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వరై్టజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్–2018లోని రెగ్యులేషన్ 8(3) ప్రకారం ఇటువంటి పదాల వినియోగం వినియోగదారుల్లో ఆ ఉత్పత్తి ఆరోగ్యానికి ప్రత్యేక ప్రయోజనం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని కలిగించే అవకాశముందని, ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 నిబంధనల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హెరిటేజ్ ఫుడ్స్ను ఆదేశించింది. -
విద్యార్థి దళం.. పోరు గళం
విజయనగరం గంటస్తంభం: ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం, హామీలు కాదు. .హక్కులు కావాలి, చేతగాని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డౌన్డౌన్’ అంటూ విద్యార్థులు నినదించారు. స్కాలర్షిప్ బకాయిల మంజూరు, హాస్టల్ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలో మంగళవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. దారిపొడవునా చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్లోకి వెళ్లి అధికారులకు వినతిపత్రమిచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులను పోలీసులు మెడపట్టి గెంటేయడంతో కొందరికి స్వల్పగాయాలయ్యాయి. -
నారాయణ ఫుల్ పర్మిషన్స్...దర్జాగా ఇసుకు దందా
-
ఈ బస్సు నడపటం నావల్ల కాదు సామీ..!
మార్కాపురం జిల్లా: మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆర్టీసీ డ్రైవర్కు చుక్కలు చూపింది. పరిమితికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో ‘ఈ బస్సు నడపటం నా వల్ల కాదు సామీ.. ’అంటూ డ్రైవర్ బస్సు దిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన మార్కాపురం జిల్లా పొదిలిలో సోమవారం చోటుచేసుకుంది. పొదిలి నుంచి కొండపి వెళ్లే బస్సులో 80 మందికిపైగా ప్రయాణికులు ఎక్కారు. పెద్ద బస్టాండ్కు బస్సు చేరుకునే సరికి అక్కడ కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. వారిని చూసిన డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘బస్సు ఎక్కే ప్రయాణికులు అంతా లోపలికి రావాలి. ఫుట్ బోర్డు ప్రయాణం ఇబ్బంది. రోడ్డు కూడా బాగా లేదు. ఏదైనా అయితే నా ఉద్యోగానికి ముప్పు’ అంటూ డ్రైవర్ సుమారు ఐదు నిమిషాల పాటు ప్రయాణికులను ప్రాధేయపడ్డాడు. అయినా వారు బస్సులోపలికి వెళ్లలేదు. ఎంత చెప్పినా వినకపోయేసరికి బస్సును పెద్ద బస్టాండ్ సెంటర్లో ఆపి కిందకు దిగిపోయాడు డ్రైవర్. అయినా బస్సులో నుంచి ఒక్కరూ దిగలేదు. లోపలికీ వెళ్లలేదు. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డుకు పరిస్థితి వివరించి, నీవైనా చెప్పి వారిని బస్సు లోపలికి పంపించమని డ్రైవర్ కోరాడు. దీంతో హోంగార్డు కూడా ప్రయాణికులను బతిమిలాడాడు. అయినా ప్రయాణికుల్లో చలనం లేదు. చివరకు మహిళా కండక్టర్ అందరినీ లోపలకు పంపించే ప్రయత్నం చేసింది. బస్సు ఆగి అప్పటికే 50 నిమిషాలు దాటింది. చేసేదేమీ లేక డ్రైవర్ బస్సును కదిలించాడు. చిన్నగా వెళతాను.. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించాడు. -
భూమా అఖిలప్రియ అరాచకాలు బయటపడ్డ సంచలన ఆడియో
-
నిజం ఒప్పుకున్న చంద్రబాబు 2029 లో జగనే సీఎం..!
-
APSRTC జేఏసీ నేతల ఆందోళన.. ప్రభుత్వ విద్యుత్ బస్సులే ముద్దు
-
కూటమి సర్కార్పై ప్రకాష్రాజ్ మరో ట్వీట్
సాక్షి, అమరావతి: కూటమి సర్కార్పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రతీకార రాజకీయాలు ఆపాలన్న ప్రకాష్రాజ్.. ‘‘మాపై రుద్దబడుతున్న ఈ కఠినమైన ఉపా చట్టాన్ని తొలగించండి అంటూ ట్వీట్ చేశారు.కాగా, యూట్యూబర్ ప్రశ్న రావణ్పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకాష్రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్ వేదికగా టీడీపీ కూటమి ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. ‘ఉపా చట్టం కింద ఓ యూట్యూబర్ను రిమాండ్కు పంపుతారా? ప్రశ్నించడం ఏమైనా దేశద్రోహమా?’ అంటూ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘ఇంకా ఇంకా దిగజారండి..’ అంటూ ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.మరో వైపు, విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కూటమి నేతల తీరును ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే అందరి వెనుక వైఎస్సార్సీపీ ఉందంటారా? రేపొద్దున కూటమి పార్టీల మధ్య విభేదాలొస్తే దాని వెనుక కూడా వైఎస్సార్సీపీ ఉందని ఆరోపిస్తారా?’ అంటూ ఆయన మండిపడ్డారు.ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలపై లేదా అధికార కూటమిపై విమర్శలు వినిపించిన ప్రతిసారీ వాటివెనుక వైఎస్సార్సీపీ ఉందని ఆరోపించడం కూటమి నేతలకు అలవాటైపోయింది. సామాజిక కార్యకర్తలు, మేధావులు, సినీ ప్రముఖులు లేదా సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వారిని ప్రతిపక్షంతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా సినీ నటుడు ప్రకాష్రాజ్ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటే.. ఆయన వెనుక వైఎస్సార్సీపీ ఉందనే ప్రచారాన్ని కూటమి నేతలు చేస్తున్నారంటూ నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బయటపడ హెరిటేజ్ ఫుడ్స్ లీలలు బట్టబయలు!
-
దొరకని నిధి
సాక్షి, రాజమహేంద్రవరం : బూటకపు హామీలతో ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు తీరని అన్యాయం చేసింది. ఆడబిడ్డ నిధి పేరిట 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 చొప్పున అందిస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి రెండేళ్లయినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా జిల్లాలోని అర్హులైన 5.3 లక్షల మంది మహిళలు గత రెండేళ్లలో సుమారు రూ.1,908 కోట్లు నష్టపోయారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ 4 (ప్రజా భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన) కార్యక్రమానికి అనుసంధానం చేస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేస్తున్నారే తప్ప, మహిళలకు న్యాయం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించడం లేదు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 73,927 బంగారు కుటుంబాలను గుర్తించినప్పటికీ వారి దత్తత ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు. పీ4 పేరుతో కాలయాపనప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, రాజానగరం, మండపేట, అనపర్తి, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో 133 స్వర్ణ వార్డు, 455 స్వర్ణ గ్రామ సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 73,927 బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరిని దత్తత తీసుకునేందుకు జిల్లాలో 4,868 మంది మార్గదర్శులు ముందుకొచ్చారని, ఇప్పటికే 30,696 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, మిగిలిన కుటుంబాల దత్తత ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో బంగారు కుటుంబాలుగా గుర్తించిన వాటిలో ఏ ఒక్క కుటుంబాన్నీ ఎవరూ దత్తత తీసుకోలేదు. పీ4 సర్వే పేరుతోనే చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన గడిచిపోయింది. అనంతరం వారిని దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి పెంచారు. దాతలను గుర్తించి, ఒప్పించే బాధ్యత అధికారులదే అని పాలకులు తేల్చేయడంతో వారు కొన్నాళ్లపాటు వ్యాపారులను ఒప్పించేందుకు ప్రయతి్నంచారు. దత్తత తీసుకోవాలని బలవంతం చేసినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం పీ4 ను మరిచిపోయారు. 5.3 లక్షల మందికి అన్యాయం జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో 4,81,940 మంది పేద, దిగువ మధ్య తరగతి మహిళలు ఉన్నారు. వివిధ కారణాలతో డ్వాక్రా గ్రూపుల్లో చేరని పేద మహిళలు సుమారు 48 వేల మంది ఉన్నారు. మొత్తంగా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారు 5.3 లక్షల మందికి పైనే ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి రెండేళ్లు (24 నెలలు) గడిచిపోయాయి. ఈ లెక్కన ఒక్కో మహిళకు నెలకు రూ.1500 చొప్పున 24 నెలలకు కలిపి రూ.36 వేలు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని అర్హులైన 5.3 లక్షల మహిళలందరికీ కలిపితే సుమారుగా రూ.1,908 కోట్లు చెల్లించాలి. ఎన్నికల వేళ అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేశ్ ఉదరగొట్టారు. పోనీ ప్రభుత్వం గుర్తించిన 73,927 బంగారు కుటుంబాలనే ప్రాతిపదికగా తీసుకుని... ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి అయినా ఆడబిడ్డ నిధి అందించేందుకు చంద్రబాబు సర్కార్ ముందుకు రావడం లేదు.మహిళలకు వెన్నుపోటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ నిధి పేరిట ఆర్థిక సాయం అందించకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఓట్లు దండుకునేందుకు సూపర్ సిక్స్ పేరిట అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకున్నారు. కాపు నేస్తం, బీసీ నేస్తం పేరిట ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. – తానేటి వనిత, మాజీ హోం మంత్రి, గోపాలపురం -
బడికెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులతో రోడ్డు కోసం దండం పెట్టేలా చేస్తున్న కూటమి ప్రభుత్వం!
-
ఒక్కటే అడుగుతున్న.. నీ తల్లి దండ్రులతో ఉన్న ఒకేఒక్క ఫోటో చూపించు..
-
అంతా నా ఇష్టం


