Chandrababu Naidu
-
చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ చోరీపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తాను చేయని దానిని చేసినట్లు చెప్పుకోవడంపై వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. దీనిలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరి హయాంలో ఏం చేశారో లెక్కలతో సహా వివరించారు వైఎస్ జగన్. ఈ మేరకు ‘ ఎక్స్’లో పోస్ట్ చేశారాయన. చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ యత్నాలు‘నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని. కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. చంద్రబాబూ.. వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది… సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది. కీలక జంట సొరంగాల పూర్తి మా ప్రభుత్వానిది. మీరు ఖర్చు చేసింది కేవలం రూ. 10 లక్షలుఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ. చంద్రబాబూ… మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావిడిగా అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు. వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైఎస్సార్ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికీ కూడా బ్రేక్త్రూ సాధించలేకపోయారు. మొత్తం మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తిచేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేము సిద్ధం చేశాం. మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?, ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?, అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి మరోవైపున తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు?, వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు?చంద్రబాబూ.. ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండిప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?, వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?, జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధంచేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు?, నల్లమలసాగర్కు నీటిని ఎందుకు తరలించలేదు?, రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు?, మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా?, చంద్రబాబూ.. ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండి. నల్లమలసాగర్ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి.పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి’ అని డిమాండ్ చేశారు. నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక… pic.twitter.com/nDineOXzWb— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2026 ఇదీ చదవండి:బాబూ.. చిరిగిన బ్యాగూ! -
‘ఏపీలో ప్రభుత్వం అనేది ఉందా?’
విశాఖపట్నం: ఏపీలో ఎక్కడ చూసినా అనిశ్చితి పరిస్థితే కనిపిస్తోందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఒకవైపు రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని, కరువు నెలకొందని, మరొకవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నా, కూటమి పాలకులు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(ఆదివారం) విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స.. రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం ఉంటే, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యక్తిగత ఆరోపణలతోనే కాలక్షేపం చేస్తుందని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు.. కరువు నెలకొంది, రోజుకు 10 సార్లు కరెంట్పోతుంది. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు. డీఎస్సీలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకుంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. జీవోలు ఇవ్వడం.. రద్దు చేయడం ఏంటి?, గ్యాస్ రూ. 937.. మధ్య తరగతి ప్రజలు ఎలా బ్రతకాలి?, అన్నపూర్ణ లాంటి ఏపీలో కిలో బియ్యం రూ. 70 ఉందిరాష్ట్రంలో చంద్రబాబులా అందరూ డబ్బులొన్న వాళ్లు ఉండరు. ధరలు పెరిగినట్లు తలసరి ఆదాయం పెరుగుతుందా?, పంచదార కేజీ రూ. 75 ఎలా కొనాలి?, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగితే ప్రజలు ఎలా బతకాలి. రాష్ట్రంలో క్రైం పెరిగింది. హత్యలు, అత్యాచారాలు, గంజాయి ఇవే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు, కరువు నెలకొంది. పబ్లిక్ మీటింగ్ల్లో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. టైం పాస్ చేయడానికి చంద్రబాబు అరకు రావాలా?, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా?’ అని ప్రశ్నించారు బొత్స. ఇదీ చదవండి:కూటమి సర్కార్కు జోగి రమేష్ సవాల్ -
కూటమి సర్కార్కు జోగి రమేష్ సవాల్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కూటమి సర్కార్ వచ్చిన దగ్గర్నుంచి తానను టార్గెట్ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. గుంటూరులో కోట్ల విలువైన ఇరిగేషన్ భూమి విషయంలో నాపై వార్తలు రాశారు. నిస్సిగ్గుగా నాపై ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ప్రభుత్వం రాగానే నా కుమారుడిపై కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసులో నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైల్లో పెట్టారు. నా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేయించారు’’ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు.‘‘నా కుమారుడు, నాపై పెట్టిన కేసుల్లో మా పాత్రను నిరూపించలేకపోయారు. నా కుమారుడి వ్యక్తిగత వ్యవహారాన్ని కూడా రోడ్డుకి ఈడ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ప్రభుత్వాన్ని కోరుతున్నా.. గుంటూరులో ఇరిగేషన్ భూముల వ్యవహారంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తి ఎవరో వాస్తవాలు వెల్లడించండి. నన్ను, నా కుటుంబాన్ని అన్ని రకాలుగా టార్గెట్ చేశారు. గుంటూరు ఇరిగేషన్ భూముల విషయంలో నాపై వచ్చిన ఆరోపణలపై విచారణకు నేను సిద్ధం. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతున్నా. విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతున్నా..అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో నాపై బురద చల్లాలని చూస్తున్నారు. నా గొంతు నొక్కాలని చూడటం మీకు సాధ్యం కాదు. అప్పులను తీర్చుకోవడానికి నాకు ఉన్న భూములను అమ్ముకుంటున్నా.. నాకు గుంటూరు ఇరిగేషన్ భూములతో ఎలాంటి సంబంధం లేదు. నాపై మీకు కక్ష తీరకపోతే ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నా భార్య బైబిల్ చదివితే తప్పేంటి? నాతో పాటు నా భార్య కూడా ఆలయాలకు వస్తుంది. మొన్ననే నేను, నా భార్య కాశీ విశ్వేశ్వరుడి వద్దకు వెళ్లొచ్చాం. మూడేళ్ల క్రితం నా ఇంట్లో జరిగిన ఛండీయాగంలో నా భార్య, నేను పాల్గొన్నాం. తప్పుడు ప్రచారాలు చేయొద్దని చంద్రబాబును కోరుతున్నా’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?
-
ఏపీలో ‘CLP’ ట్యాక్స్.. ఆక్వా రంగం కుదేలు: వడ్డీ రఘురాం
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగం పూర్తిగా కుదేలైందని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, అప్సడా (APSADA) మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు అద్భుతంగా ఉన్నాయంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వాస్తవాలను తొక్కిపెట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అండదండలతో ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆక్వా డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉండి కూడా ఫీడ్ మాఫియాను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి కంపెనీలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా రఘురాం.. ‘రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే ఫీడ్ రేట్లను కేజీకి రూ.14 నుంచి రూ.15 వరకు పెంచేశారు. ఫిబ్రవరి 26న కేజీకి రూ.4, మళ్లీ జూన్ 12న రూ.10 పెంచారు. టన్ను ఫీడ్పై ఏకంగా రూ.15,000 అదనపు భారం పడటంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పంట సాగు చేసినా నష్టాలే మిగులుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.ఫీడ్ కంపెనీల వద్ద విలువేది?గతంలో ఫీడ్ రేట్లు పెంచినప్పుడు రైతులు ఆందోళనలు చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు స్వయంగా రూ.4 తగ్గించమని కోరితే.. కంపెనీలు కేవలం రూ.2 మాత్రమే తగ్గించాయి. అంటే సీఎం మాటకు కూడా ఆ కంపెనీల వద్ద విలువ లేకుండా పోయింది. ధరల నియంత్రణ కోసం కమిటీని వేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ కమిటీని ధరలు తగ్గించడానికి వేశారా లేక పెంచడానికా? ఆక్వా అసోసియేషన్ను అడ్డం పెట్టుకుని ఫీడ్ కంపెనీలు ఆడిందే ఆటగా మార్చేశారు.గుజరాత్ కంపెనీ సర్క్యులర్..ఆక్వా రైతుల గోడును పట్టించుకోకుండా ఫీడ్ కంపెనీలు మళ్లీ ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి వనామీ ఫీడ్పై రూ.5.70, టైగర్ ఫీడ్పై రూ.3.85 పెంచుతున్నట్లు గుజరాత్కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో లాలూచీ పడటం వల్లే వారు ఇలా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో కేజీకి రూ.2.85 పెరిగినప్పుడు నానా యాగి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వ హయాంలో రూ.14 పెంచితే ఎందుకు నోరు మెదపడం లేదు? గతంలో జే-ట్యాక్స్ అంటూ అవాకులు చవాకులు పేలినవారు.. ఇప్పుడు ఫీడ్ కంపెనీల నుంచి 'CLP ట్యాక్స్' (C-చంద్రబాబు, L-లోకేష్, P-పవన్ కళ్యాణ్) కింద ఎన్ని వేల కోట్ల ముడుపులు దండుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ముడుపులు అందుతున్నాయి కాబట్టే రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసింది.నాడు ఆక్వాకు స్వర్ణయుగం..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆక్వా రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఫీడ్, సీడ్ నాణ్యత, ధరల నియంత్రణ కోసం చట్టబద్ధంగా 'అప్సడా'ను ఏర్పాటు చేశాం. కోవిడ్ వంటి గడ్డు కాలంలోనూ మార్కెట్ పడిపోకుండా రైతులకు అండగా నిలిచాం. రైతుల కోరిక మేరకు ఫీడ్ ధరల హెచ్చుతగ్గులు ఏడాదికి ఒకసారి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఆక్వా రైతుల కష్టాలను గుర్తించి, ఫీడ్ ధరల నియంత్రణతో పాటు ఆక్వా రైతులకు అండగా నిలవాలని రైతులు, ఆక్వా రైతుల సంఘాలు వైఎస్ జగన్ను కోరారు. రైతుల విజ్ఞప్తి మేరకు జగన్ గారు భీమవరం వచ్చి ఆక్వా రైతులకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ భీమవరం వస్తున్నారని తెలిసిన సమయంలో 100 కౌంట్ రొయ్యల ధర రూ.240 నుంచి రూ.250కి పెరిగింది. ఇవాళ అదే 100 కౌంట్ రొయ్యల ధర దాదాపు రూ.290–300 వరకు చేరింది. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఆక్వా అథారిటీ పెట్టాలనే ఆలోచన కూడా రాలేదు.విద్యుత్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకు జీవో 169, 57 కుట్రలు..ఎన్నికల్లో యూనిట్ రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు జీవో నంబర్ 169, జీవో నంబర్ 57ల పేరుతో మోసం చేస్తోంది. 0.90 నుంచి 0.95 వరకు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలనే అసాధ్యమైన నిబంధన పెట్టి సబ్సిడీని ఎత్తేసే కుట్ర చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు 0.78 పవర్ ఫ్యాక్టర్ మించి మెయింటైన్ చేయలేరు. 50 హెచ్పీ కెపాసిటీకి పవర్ ఫ్యాక్టర్ పరికరాలు అమర్చాలంటే హెక్టారుకు రూ.70 వేలు ఖర్చవుతుంది. రాష్ట్రంలోని 2 లక్షల హెక్టార్ల సాగుపై రూ.1,400 కోట్ల భారాన్ని మోపుతున్నారు. సెప్టెంబర్ 5న వచ్చే విద్యుత్ బిల్లులతో ప్రభుత్వ దగాకోరుతనం పూర్తిగా బయటపడుతుంది.ధరలు తగ్గించకపోతే ఉద్యమం..ఫీడ్ ధరల పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించి... గుజరాత్కు చెందిన స్క్రెట్టింగ్ కంపెనీ వనామీ రొయ్యల ఫీడ్ ధరను కిలోకు రూ.5.70, టైగర్ రొయ్యల ఫీడ్ ధరను కిలోకు రూ.3.85 పెంచింది. ఈ పెంపును వెంటనే రోల్బ్యాక్ చేయ రఘురాం డిమాండ్ చేశారు. మరోవైపు ఆక్వా రైతుల అసోసియేషన్ పేరుతో ప్రభుత్వం కుమ్మక్కై రూ.14–15 వరకు ఫీడ్ ధరలు పెంచే ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని... లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులను ఏకం చేసి ప్రభుత్వం మెడలు వంచేలా భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
‘హామీలు నెరవేర్చమంటే రాజకీయ అజెండా అంటారా?’
సాక్షి, విజయవాడ: మాది ఉద్యోగుల అజెండా... రాజకీయ అజెండా కాదంటూ ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హామీలు నెరవేర్చమంటే రాజకీయ అజెండా అంటారా? అంటూ కూటమి సర్కార్ఫై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం తమపై చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు.‘‘ఏపి జేఏసీ అమరావతి పక్షాన 28న జరిగిన సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సామరస్యంగా జరుగుతున్న చర్చలకు మేము విఘాతం కలిగించామని.. సీఎంను అవమానించేలా కుట్ర పూరితంగా మాట్లాడామంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి మూడో సంవత్సరం జరుగుతుంది. మాకు రావాల్సిన డబ్బులు, మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలనే అడుగుతున్నాం’’ అంటూ బొప్పరాజు ధ్వజమెత్తారు...మీరు కాలయాపన చేసినంత వరకు మేం ఓపిగ్గా ఉన్నాం. ఉద్యమం వైపు వెళ్తున్న మమ్మల్ని చర్చలకు వెనక్కి పిలిచారు. ఈ నెల 28న కూడా మా సమస్యలు, మీరు ఇచ్చిన హామీలు ప్రస్తావించాం. అనేక ఉద్యోగ సంఘాల జేఏసీని పిలిచి చర్చించారా లేదా?. ఐదుగురు మంత్రులు, పది మంది ఐఏఎస్ లతో కూడిన కమిటీ మాతో చర్చించారు. నలభై రోజులుగా మీరు చర్చించిన అంశాలు అమలు చేయలేదు. మా సభలను వాయిదా వేయించారా లేదా?. చర్చల తర్వాత ఆ సారాంశాన్ని ఎందుకు వెల్లడించలేదు’’ అంటూ బొప్పరాజు నిలదీశారు...ప్రతినెల జీతంలో 25 శాతం కోల్పోతుంటే ఇంకా భరించాలా? మా బకాయిలపై వివరాలను పే స్లిప్లలో ఇవ్వమని అడిగాం.. కానీ స్పందించలేదు. విధిలేని పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం చేసిన ప్రకటన ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ఉంది. ఉద్యోగ సంఘాలు ఎప్పుడూ కోరుకునేది చర్చలే. చర్చల సారాంశాన్ని వెల్లడించమనే మేం కోరాం. మాకు ఎలాంటి రాజకీయ అజెండాలు లేవు’’ అని బొప్పరాజు పేర్కొన్నారు. -
వెలిగొండ వెలుగులు జగన్ వే
-
షాక్ లో యాంకర్ ఈశ్వర్.. తమాషా కాదు అడిగితే కాల్చి పడేస్తారు.. కారుమూరి సంచలన నిజాలు
-
సిగ్గు తెచ్చుకోండి... నిర్మలా సీతారామన్ అప్పుడే చెప్పారు.. నాగ మల్లీశ్వరి షాకింగ్ నిజాలు
-
ఇది సార్ మీ అసలు రూపం.. చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వరుదు కళ్యాణి
-
బీడు పడ్డ కేసీ ఆయకట్టు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమకు తిండి గింజలు.. పశువులకు పశుగ్రాసం అందించే కేసీ కాలువ ఆయకట్టు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైంది. 31.90 టీఎంసీల నీటి కేటాయింపులున్నా ఈ ఏడాది కేసీ ఆయకట్టుకు చుక్కనీరు విడుదల చేయకపోవడంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మరో 1.76 లక్షల ఎకరాల ఆయకట్టుపైనా ఈ ఏడాది తీవ్ర ప్రభావం పడనున్నది. నీళ్లొస్తాయన్న ఆశతో రైతులు వేసిన వరిపంటలు, నారుమళ్లు ఎండిపోవడంతో పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. ఏటా రెండు లక్షల ఎకరాలకు పైగా వరి సాగయ్యే కేసీ ఆయకట్టు ప్రాంతంలో ఈసారి సాగు నిలిచిపోవడంతో రాయలసీమలో తిండిగింజలతోపాటు పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది.బీళ్లుగా మారిన పంటపొలాలు.. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో విస్తరించిన కేసీ కాలువ పరిధిలో నేరుగా 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉండగా.. పరోక్షంగా కేసీ చివరి ఆయకట్టు నీరు కడప జిల్లాలోని పెన్నానది గుండా సోమశిలకు చేరి నెల్లూరు జిల్లాలో 1.36 లక్షల ఎకరాలతోపాటు కండలేరు ద్వారా చిత్తూరు జిల్లాలోనూ 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. కేసీకి 31.90 టీఎంసీల నీటి కేటాయింపులున్నా ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కేసీ ఆయకట్టుకు చుక్క నీరివ్వలేదు. దీంతో ఆయకట్టు మొత్తం బీడుగా మారింది. నీళ్లొస్తాయన్న ఆశతో అరకొరగా ఎదపద్ధతిలో సాగుచేసిన వరిపంటతోపాటు, నారుమళ్లు కూడా ఎండిపోయాయి. దీంతో పెట్టుబడులు నష్టపోయి అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సీమలో తిండిగింజలు, పశుగ్రాసం కష్టాలు నీటికోసం రైతులు వేడుకుంటున్నా.. చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడాలేదు. కేసీకి నీళ్లిచ్చే ఆలోచన ఏమాత్రం కనిపించడంలేదు. కేసీ పరిధిలో ఏటా 2 లక్షల ఎకరాలకు పైగా రైతులు వరిపంట సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కేసీకి నీళ్లివ్వకపోతే వరితోపాటు ఇతర పంటలసాగు కూడా లేకుండా పోతుంది. తిండి గింజలతోపాటు సీమలో పశుగ్రాసం కొరత తీవ్ర రూపం దాల్చనుంది. ఏటా కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలోని ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల రైతులు కేసీ పరిధిలోని గ్రామాలనుంచి ధాన్యం, పశుగ్రాసం తీసుకు వెళ్లేవారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలతోపాటు లక్షలాది పశువులకు ఈ ఏడాది గ్రాసం దొరికే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే గ్రాసం కొరతతో మూగ జీవాలను కబేళాలకు అమ్ముకుంటున్నారు.వైఎస్ జగన్ పాలనలో కేసీ కింద ఏటా రెండు పంటలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాయలసీమలోని కేసీ, తుంగభద్ర ఎగువకాలువ, దిగువకాలువ, గోరకల్లు, అవుకు, గండికోట, బ్రహ్మంసాగర్, మైలవరం, చిత్రావతి, అన్నమయ్య, సోమశిల, కండలేరుతో సహా అన్ని సాగునీటి వనరులను నీటితో నింపారు. ఐదేళ్లపాటు పంటలకు అదునులో నీళ్లిచ్చారు. దీంతో రైతులు కేసీ పరిధిలో ఎకరాకు 40 బస్తాలు (75 కిలోలు) లెక్కన 30 క్వింటాళ్ల ధాన్యం పండించారు. ఈ లెక్కన 2లక్షల ఎకరాల్లో ఒక పంటకు 60 లక్షల క్వింటాళ్ల చొప్పున రెండు పంటలకు 1.20 కోట్ల క్వింటాళ్ల ధాన్యం పండించారు. బస్తా ధాన్యం రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకూ ధరపలికింది. సీమలో తిండిగింజలు, పశుగ్రాసం కొరతలేకుండా పోయింది.వరిపంట మొత్తం ఎండిపోయిందిఐదు ఎకరాల సొంత భూమితో పాటు మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. ట్రాక్టర్లతో దుక్కి దున్ని వరి పంట సాగు చేశాను. కేసీ కెనాల్కు సాగు నీరు రాకపోవడంతో ఐదు ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. ఇప్పటికే ఎకరాకు రూ. 15,000 చొప్పున రూ. 75000 పెట్టుబడి పెట్టాను. మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. – పల్లె వెంకట సుబ్బారెడ్డి, రైతు, ఈర్నపాడు గ్రామం, బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా.పెట్టుబడి మొత్తం నష్టపోయాంకేసీ కెనాల్ ఆయకట్టు కింద ఐదు ఎకరాల ఆలయ మాన్యం భూమి, రెండున్నర ఎకరాలు కౌలు భూముల్లో వరి సాగు చేస్తున్నాను. ఎకరాకు రూ.18వేల చొప్పున మొత్తం రూ.1.30లక్షల దాకా ఖర్చు పెట్టాను. వర్షాలు కురవక పోవడం, కేసీకి సాగునీరు రాకపోవడంతో వరి పైరు మొత్తం ఎండిపోతోంది. – సూరిపల్లి మధుబాబు గౌడ్, కానాల గ్రామం, నంద్యాల మండలంభూములన్నీ బీడు పడ్డాయిఈ ఏడు వర్షాలు కురవలేదు. కేసీ కెనాల్ నీళ్లన్నా ఇస్తారనుకుంటే ప్రభుత్వం చుక్కనీరివ్వలేదు. దీంతో భూములన్నీ బీడు పడ్డాయి. వైఎస్ జగన్మోహన్నెడ్డి హయాంలో కేసీ కాలువకు ఐదేళ్లు వరుసగా నీళ్లిచ్చారు. ఏటా రెండు పంటలు పండించుకున్నాం. – ఆంజనేయులు, రైతు, సిద్దారెడ్డిపల్లె, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా -
Putta Shiva Shankar : బాబు ఉంటే బతుకు ఇంతే
-
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్.. చంద్రబాబు
-
అవమానించిన ఒక్కొక్కరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి.. జగనన్న 2.0 మీ ఊహకే వదిలేస్తున్న
-
ప్రొద్దుటూరులో వ్యభిచారం.. TDPపై MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
‘కరువు-చంద్రబాబు కవల పిల్లలు’
తాడేపల్లి : చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అన్ని వర్గాలకు నష్టమేనని, ఫస్ట్ ఎఫెక్ట్ రైతుల మీద పడుతుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రైతులు గిట్టుబాటు ధరలేక రోడ్డున పడటం కామనైపోయిందని స్పష్టం చేశారు. కరువు-చంద్రబాబు కవల పిల్లల మాదిరే ఉంటాయనేది తాజా పరిస్థితులు మరోసారి అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిని తీరును పుత్తా శివ శంకర్ వివరించారు. ‘పంచదార రూ.40 నుండి రూ.75 కి పెరిగింది. బియ్యం రూ.48 నుండి రూ 65లకు పెరిగింది. ఉల్లిపాయలు రూ.18ల నుండి రూ .70లకు పెరిగింది. నూనెల ధరలు రూ.140 ల నుండి రూ. 215 పెరిగాయి. ఇక కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి క్వార్టర్ లిక్కర్ బాటిల్ మీద రూ.40 ల వరకు పెంచారు. కరెంటు ఛార్జీల పరిస్థితీ దారుణంగా ఉంది. పెరిగిన ధరలపై చంద్రబాబు కనీసం ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించటం లేదు?,’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి:రైతులను ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?: కాకాణి -
5 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే.. మీరు వాళ్ళని ఏం చేసారో తెలుసా
-
బాబు బుద్ధులే కొడుక్కి వచ్చాయి... నువ్వు ఓ పిరికిపందవి... ఉతికారేసిన కారుమూరి
-
ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు.. ఆదుకుంటాం అని చెప్పి ఎక్కడికి పోయావ్?
-
రైతులను ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని ఉపయోగించుకోవడంలో కూటమి పూర్తి స్థాయిలో విఫలం అయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలంలో నుంచి సోమశిల, కండలేడు జలాశయాలకు ఎందుకు విడుదల చేయడం లేదు? అంటూ ప్రశ్నించారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్ను ఉపయోగించి వెంటనే ఎందుకు నీరు వినియోగించడం లేదు. నెల్లూరు, రాయలసీమ రైతులను నిట్టనిలువుగా ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?. నెల్లూరులో జలాశయాలు అడుగంటి పోయే పరిస్థితి ఏర్పడింది. 71 శాతం వరకు పుష్కలమైన నీరు శ్రీశైలంలో వున్న నీటిని వినియోగించుకోకపోవడంలో మీ దురుద్దేశం ఏంటి? అంటూ కాకాణి నిలదీశారు.‘‘మరో వైపు తెలంగాణ శ్రీశైలం నీటి ఎడాపెడా దోచుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ రైతుల జీవితాలను తాకట్టు పెడుతున్నాడా..?. నీటి యాజమాన్య పద్దతులను ఏనాడు పాటించిన పాపాన పోలేదు. మొదటి పంటకే నీరు కరువైంది. నెల్లూరు జిల్లా రైతాంగం ఆందోళన చేపట్టే పరిస్థితులు తలెత్తాయి’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్ -
జీవో నెం. 3 అమలు చేసి అరకు పర్యటనకు రండి బాబుపై రేగం మత్యలింగం ఫైర్
-
కూటమి మానిఫెస్టోని చూపించి బాబుని ఒక రేంజ్ లో ఏకిపారేసిన బొప్పరాజు
-
వైఎస్సార్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి సర్కార్
సాక్షి, అల్లూరి జిల్లా: విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మారికవలస గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది మారికవలస గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని.. లేదంటే నేడు సీఎం చంద్రబాబు అరకు పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సారర్సీపీ హెచ్చరించింది. తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మారికవలస స్కూల్ యథాతదంగా కొనసాగించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన అధికారులు.. అల్లూరి జిల్లా నుంచి మారికవలసకు బస్సుల్లో విద్యార్థలను తరలించారు. మారికవలస స్కూల్ యథావిధిగా కొనసాగించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తల్లిదండ్రుల పోరాటానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది.వైఎస్ జగన్ హెచ్చరికలతో..అమరావతి: పంటల బీమా పథకం ద్వారా పెండింగ్లో ఉన్న రాష్ట్ర వాటా ప్రీమియం సబ్సిడీ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరికలతో సర్కారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) ద్వారా పెండింగ్ ప్రీమియం బకాయిలు రూ.500 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ జీవోఆర్టీ నంబర్ 821ను జారీ చేశారు.ఇదీ చదవండి: సంక్షోభంలో కృష్ణా బేసిన్కరువు కాటేస్తున్నవేళ చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించు కోకుండా కుంభకర్ణుడి నిద్రలో ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఆఘమేఘాల మీద పెండింగ్ ప్రీమియం బకాయిల కోసం నిధులు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. -
గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబు పేరు చెప్తుంటే సల సల మండిపోతున్నారు..
-
గెలిచాడు.. పొడిచాడు.. బాబుకు ఉద్యోగుల వార్నింగ్
-
బడ్జెట్ పద్మనాభం.. ధరాఘాతం
రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటడంతో సామాన్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. ఒకప్పుడు రూ.40 వేలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వారు.. ఇప్పుడు అదే అవసరాలకు మరో రూ.8ృ10 వేల వరకు అదనంగా వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. బియ్యం, పంచదార, నూనె, పప్పులు, ఉల్లిపాయలు, కూరగాయలు.. ఇలా వంటింట్లో అడుగుపెట్టిన ప్రతి సరుకూ ధరల షాక్ ఇస్తోంది. సామాన్యుల ఆదాయం పెరగక.. ఖర్చులు తగ్గించుకోలేక.. చివరకు ప్రతి నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: విశాఖలోని ఎండాడలో ఉంటున్న సత్యకృష్ణది నలుగురు సభ్యుల సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఈమెతో పాటు భర్త నగేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. ఇద్దరు స్కూల్కు వెళ్లే పిల్లలతో సంసారం నెట్టుకొస్తున్నారు. ప్రతి నెలా జీతం చేతికందే రోజు లెక్కలు వేసుకొని ఖర్చు చేస్తున్నారు. అయితే ఆరు నెలలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు వీరికి శరాఘాతంగా మారాయి. నెలకు రూ.40 వేల ఖర్చుతో కూడిన వీరి బడ్జెట్ తల్లకిందులైంది. గత ఆరు నెలలతో పోలిస్తే ఇప్పుడు అధికంగా మరో ఎనిమిది వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెరగక పోవడంతో ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం అప్పు చేయక తప్పని పరిస్థితి. ఇవన్నీ తప్పనిసరిగా ఖర్చు చేయాల్సినవి కావడంతో ప్రతి నెలా అప్పు కోసం చేయి చాచాల్సి వస్తోంది. ఇలా కేవలం ఒక్క సత్యకృష్ణే కాదు.. రాష్ట్రంలో ఏ దిగువ మధ్య తరగతి వారిని కదిపినా ఇదే ఆవేదన వ్యక్తమవుతోంది. పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలు ఇంతగా విలవిల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. బియ్యం, పంచదార, ఎండుమిర్చి, నూనె, ఉల్లిపాయలు, కందిపప్పు, కూరగాయలు, పెట్రోల్.. ఇలా ఏ వస్తువు ముట్టుకున్నా షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. చౌక ధరలు, రైతు బజార్ల ద్వారా సరుకులు సరఫరా చేసి ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం అలాంటి ఆలోచనే చేయడం లేదు. గత ఆరు నెలలుగా ధరలు విపరీతంగా పెరిగిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్యాష్ బోర్డే గణాంకాలతో సహా వివరిస్తున్నా, ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించక పోవడం దారుణం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులపాలవుతున్న పేదలుప్రభుత్వ డ్యాష్ బోర్డులో హోల్సేల్ ధరల కంటే రిటైల్ మార్కెట్లో ధరలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం రిటైల్ మార్కెట్లో కేజీ బియ్యం రూ.58–60 ఉంటే ఇప్పుడే అదే రకం ధర రూ.75కు చేరింది. జూలైలో రూ.45గా ఉన్న కిలో పంచదార (చక్కెర) ఇప్పుడు రూ.70 దాటింది. నెల రోజుల క్రితం రూ.100కు మూడు కేజీల ఉల్లిపాయలు వస్తుంటే, ఇప్పుడు రూ.150కి కేవలం రెండు కేజీలు మాత్రమే ఇస్తున్నారు. ఇక మిర్చి పేరు ఎత్తగానే కళ్లలో నీళ్లు వస్తున్నాయి. కనీసం రూ.350 పెడితే కానీ కిలో ఎండుమిర్చి లభించని పరిస్థితి. వంట నూనెల విషయానికి వస్తే ఏడాది క్రితం రూ.120–150 మధ్య ఉంటే లీటరు వంట నూనె ధర ఇప్పడు రిటైట్ మార్కెట్లో ఏకంగా రూ.160–190 అయ్యింది. ఏ కూరగాయ తీసుకున్నా ఒక్క బెండకాయ మినహా కిలో రూ.40 పైమాటే. ఇలా వంట గ్యాస్, పెట్రోల్.. ఇతర నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. పెరిగిన ధరలతో సరిపడా సరుకులు కొనలేక, కుటుంబాన్ని ఎలా నడపాలో అర్థంకాక లక్షలాది కుటుంబాలు అప్పులపాలయ్యే పరిస్థితి తలెత్తింది.మొద్దు నిద్రలో సర్కారునిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి తాకి రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడుతున్నా కూడా చంద్రబాబు సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. చౌక ధరల దుకాణాల ద్వారా పంచదార, కందిపప్పు, వంట నూనెలు వంటివి అందించి.. సామాన్యులకు ఊరట కలిగించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆరు నెలలుగా పెరిగిన ధరలపై కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. బియ్యం ధరలు పెరిగినప్పుడు రైతు బజార్లు ద్వారా చౌకగా అందిస్తామంటూ చేసిన ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, కూరగాయల ధరలు పెరిగిపోయినా రైతు బజార్ల ద్వారా చౌకగా అందించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు వస్తున్న తరుణంలో ఏం వండుకుంటాం.. ఏం తింటాం.. అంటూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉల్లి.. మళ్లీ వంటింట్లో లొల్లికొద్ది రోజులుగా ఉల్లి వంటింట్లో మళ్లీ కలకలం రేపుతోంది. ఉన్నట్లుండి ఉల్లి ధర అమాంతం పెరగడమే ఇందుకు కారణం. కర్నూలు వ్యవసాయ మార్కెట్ శుక్రవారం క్వింటా కనిష్ట ధర రూ.1,201 కాగా, గరిష్ట ధర రూ.3,975 పలికింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని హోల్సేల్ మార్కెట్లోనూ మహారాష్ట్ర పాత ఉల్లిపాయల ధర క్వింటాలు రూ.4,200 పలికింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో ఏకంగా 65–70 అమ్ముడవుతుండటం గమనార్హం. ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులు రాజ్యమేలుతున్నారని మండిపడుతున్నారు.ధరలు షాక్ కొడుతున్నాయిరిటైల్ మార్కెట్లో కేజీ పంచదార రూ.70కి పైగా ఉంది. బియ్యం, నూనె, ఉల్లిపాయలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీగా పెరిగిన ధరలు సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. ఇలా అయితే వచ్చే పండుగలు ఎలా చేసుకునేది? – తాళ్లపూడి పరమేశ్వరరావు, భీమవరం, పశ్చిమ గోదావరిచేదెక్కిన పంచదారకొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.55 ఉన్న పంచదార ధర ఒక్కసారిగా రూ.70–75 వరకు పెరిగింది. శ్రావణ మాసం మొదలుకుని రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలకు స్వీట్ల తయారీకి పంచదారనే ఎక్కువగా వాడతారు. ఈ స్థాయిలో ధరలు పెరిగితే సామాన్యుడు ఎలా బతకాలి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. – గంధం నరేష్, శ్రీకాకుళం ఇలాగైతే ఎలా? నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగాయి. బియ్యం ధర కిలోకు రూ.70 దాటిపోయింది. గతంలో రూ.45 నుంచి రూ.50కి మంచి బియ్యం లభించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాలాంటి మధ్య తరగతి ప్రజలపై భారీగా భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. – కె.నాగమల్లీశ్వరి, విజయవాడఉల్లిపాయల ధరకు మళ్లీ రెక్కలుఉల్లిపాయలు కొనే పరిస్థితి లేదు. మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ.60–70 ఉంది. ఇలాగైతే ఏం వండుకోవాలి? పంచదార సైతం కిలో రూ.70 దాటింది. పెరిగిన ధరలతో సామాన్యుల పరిస్థితి దారుణంగా మారింది. వచ్చే ఆదాయం పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోవటం లేదు. పేద కుటుంబాలు చాలా ఇబ్బందులెదుర్కొంటాయి. ప్రభుత్వం ధరలు తగ్గించాలి. – రెహిమా, విజయవాడకూరగాయలకు పూటకు రూ.100 మార్కెట్కు వెళ్లి రూ.100కు కూరగాయలు కొనుగోలు చేస్తే ఒక్క పూటకు సరిపోతున్నాయి. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలకు కూరగాయల కోసం రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే నెలకు రూ.6,000 కూరగాయలకు ఖర్చు పెడితే.. పేద కుటుంబం ఎలా జీవనం సాగించాలి? గతంలో రూ.100 కూరగాయలు 2 రోజుల పాటు వచ్చేవి. నెలకు రూ.1,500 ఖర్చు చేస్తే సరిపోయేది. ప్రస్తుతం కూరగాయల కోసం నెలకు రూ.4,500 అదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. – సరోజమ్మ, తిరుపతి -
ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు..
-
చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా..
-
చంద్రబాబు పచ్చి అబద్దాలు.. లైవ్ లో అందరి ముందు వీడియో ప్లే చేసి పరువు తీసిన బొప్పరాజు
-
‘చంద్రబాబు చేసిందేమైనా ఉంటే ఆధారాలతో చూపించగలరా?’
తాడేపల్లి : తాను చేయనిది కూడా చేశానని నిస్సిగ్గుగా చెప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజీఆర్ సుధాకర్బాబు విమర్శించారు. చంద్రబాబు అబద్దాల కోరని, ఆయన చేసిందేమైనా ఉంటే ఆధారాలతో చూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. ఈరోజు(శుక్రవారం, ఆగస్గు 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. క్రెడిట్ చోరీకి పాల్పడటం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు అబద్దాల కోరు. తాను చేయనిది కూడా నిస్సిగ్గుగా చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేశాక ప్రాజెక్టు కోసం ఏమీ చేయలేదు. 9 ఏళ్లపాటు సీఎంగా ఉన్నా ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు, శంకుస్థాపన సభ కోసం అప్పట్లో రూ.11 లక్షలు ఖర్చు పెట్టారే తప్ప ప్రాజెక్టుకు పైసా ఖర్చు చేయలేదు. వైఎస్సార్ హయాంలో రెండు టన్నెళ్లలో 20.3 కి.మీ. తవ్వకాలు చేశారు. తర్వాత చంద్రబాబు హయాంలో కేవలం 6.6 కి.మీ.లు మాత్రమే పనులు జరిగాయి. అనంతరం జగన్ వచ్చాక 10.5 కి.మీ టన్నెళ్లు తవ్వించారు. రెండేళ్లపాటు కరోనాతో తీవ్ర ఇబ్బందులు తలెత్తినా పనులు ఆపలేదు. వెలిగొండకు ఎవరేం చేశారో చర్చకు వచ్చే దమ్ముందా?, టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలలో గెలవగలరా?, ఆ ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల రెఫరెండం పెట్టే దమ్ముందా?, చంద్రబాబు చేసిందేమైనా ఉంటే ఆధారాలతో చూపించగలరా?, నిర్మాణం చేయకుండానే ప్రారంభోత్సవాలు చేయటం చంద్రబాబుకు అలవాటు. అమరావతికి ఇప్పటికీ కనెక్టివిటీ రోడ్లు లేవు. కానీ ఏదేదో చేసినట్టు ఎల్లోమీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వెలిగొండ విషయంలోనూ అదే చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా న్యాయం చేయని వ్యక్తి. కేవలం రూ.112 కోట్లు చెల్లిస్తే రైతులకు మేలు జరుగుతుంది. అమరావతిలో పూలమొక్కలకు వందల కోట్లు చేస్తున్నారేగానీ నిర్వాసితులకు మాత్రం పైసా విదల్చటం లేదు. బాధితులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నా చంద్రబాబుకు మనసు కరగడం లేదు’ అని విమర్శించారు. ఇదీ చదవండి:నిమ్మల రామానాయుడికి చేదు అనుభవం -
కూటమి సర్కార్పై మా పోరాటం ఆగదు: బొప్పరాజు
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని.. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మరోమారు గుర్తుచేసిన ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ సదస్సు.. ఎన్నికల సమయంలోనూ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోను ప్రదర్శించారు.ప్రభుత్వం బెదిరింపులకు ఏపీ జేఏసీ అమరావతి భయపడదు. మా డబ్బును కూడా ప్రభుత్వం వాడుకుంది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తున్నారు.. ఇక్కడ ఎందుకు ఇవ్వరు. ఇతర రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్లు ఇస్తున్నారు. మా ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలనే మేం అడుగుతున్నాం. మాకు రావాల్సిన హక్కులనే మేం ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వలేదు. ఇలా జరగడం చరిత్రలో తొలిసారి’’ అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘స్మార్ట్ హెల్త్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అసలు హెల్త్ కార్డులు ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు. కళ్లద్దాలకు కూడా బిల్లులు పెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు తీసుకుంటున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి సదుపాయం లేదు. 60 రోజుల్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సమస్య పరిష్కారం కావాలని గత ఏడాది చంద్రబాబు జీవో ఇచ్చారు. ఈ రోజుకీ జీవో అమలు కాలేదు’’ అంటూ బొప్పరాజు మండిపడ్డారు.ఇదీ చదవండి: జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ -
టీడీపీలో ‘లేఖ’లుకలు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. కొంతమంది పచ్చనేతలపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రధానంగా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డి మరికొందరు నేతలపై కృష్ణమ్మ లేఖాస్త్రం సంధించినట్లు ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. వైరి వర్గానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఆమె అధిష్టానానికి లేఖ పంపినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే, ఆదోని టీడీపీ ఇన్చార్జ్జ్ మీనాక్షి నాయుడును టీడీపీ నుంచి బయటకు సాగనంపి ఆదోని ఇన్చార్జ్ బాధ్యతలు సొంతం చేసుకునేందుకే కృష్ణమ్మ ఫిర్యాదులకు తెరతీసినట్లు ‘పచ్చ’పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె పాచిక పారి అధిష్టానం మాజీ ఎమ్మెల్యే మీనాక్షికి చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఆమె కోరిక నెరవేరి ఆదోని ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార«థి సైతం కూటమి తరఫున మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. తిక్కారెడ్డిని వదిలించుకున్నట్లేనా? మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డికి సైతం పచ్చపార్టీ ప్రాధాన్యత తగ్గించిన దూరంపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్లు మంత్రాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశం టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్రారెడ్డి స్వగృహంలో నిర్వహించడంతో ఆ సమావేశానికి తిక్కారెడ్డి వర్గీయు లు గైర్హాజరయ్యారు. అయినా అధిష్టా నం తిక్కారెడ్డిని బుజ్జగించే ప్రయత్నమేమీ చేయకపోవడం గమనార్హం. గత జూన్ నెలలో మంత్రాలయం వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిక్కారెడ్డి సేవలు బయట ఉపయోగించుకుంటామంటూ వ్యాఖ్యానించారు. మంత్రాలయం రాజకీయాల నుంచి తిక్కారెడ్డిని తప్పించినట్లు చంద్రబాబు స్వయంగా సంకేతాలిచ్చారు. దీంతో తిక్కారెడ్డివర్గం భగ్గుమంటోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ తిక్కారెడ్డి వర్గం మండిపడుతున్నట్లు సమాచారం. సత్తా చాటుతాం ఇప్పటికీ టీడీపీలో బలంగా ఉన్న మీనాక్షి నాయుడు పచ్చపార్టీతో అమీతుమీకి సిద్ధపడనున్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. మీనాక్షి నాయుడుని కాదని గుడిసె కృష్ణమ్మకు ఆదోని ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే తమ సత్తా చాటుతామని మీనాక్షి నాయుడి వర్గం బహిరంగంగానే విరుచుకుపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తంగా జిల్లా టీడీపీలో వర్గవిబేధాలు తారస్థాయికి చేరడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఓటమికి కృష్ణమ్మ రిటర్న్ గిఫ్ట్ కృష్ణమ్మకు మీనాక్షి నాయుడుతో ఆది నుంచి విబేధాలు ఉన్నాయి. ఆదోని నుంచి ఐదుసార్లు పోటీ చేసిన మీనాక్షి నాయుడు 1991, 1999, 2009లలో ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2004 ఎన్నికల్లో మీనాక్షి నాయుడుని కాదని టీడీపీ అధిష్టానం గుడిసె కృష్ణమ్మను బరిలో నిలిపింది. టికెట్ ఇవ్వకపోవడంతో మీనాక్షి నాయుడు వర్గం రచ్చచేసింది. గొడవలు సృష్టించింది. అయినా బెదరక అధిష్టానం చివరకు కృష్ణమ్మనే అభ్యర్థిగా నిలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వై.సాయిప్రసాదరెడ్డి చేతిలో ఆమె ఓటమి చవిచూశారు. మీనాక్షి నాయుడువర్గం కృష్ణమ్మ ఓటమికోసం పనిచేసినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆమె మీనాక్షితో పాటు ఆయన వర్గంపై ఆగ్రహంతో ఉంది. అవకాశం కోసం ఎదురు చూసిన కృష్ణమ్మ అధిష్టానంతో సయోధ్య నెరిపి ఇప్పడు మీనాక్షి నాయుడుకి చెక్ పెడుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చజరుగుతోంది.సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు జిల్లా అధ్యక్ష పదవి? గుడిసె కృష్ణమ్మ స్థానంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించనున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోమిశెట్టికి దాదాపుగా జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలంతా మద్దతుగా నిలిచినట్లు సమాచారం. కృష్ణమ్మ టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికంటే ఆదోని ఇన్చార్జ్ పదవిపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మంత్రి లోకేష్ సూచనలతో వ్యూహం ప్రకారమే మీనాక్షి నాయుడుకు కృష్ణమ్మ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.చదవండి: ఒంటెత్తు పోకడలతో ఒంటరై! -
వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న బాటింగ్ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న దిగులు ఎల్లో మీడియాకు బాగానే పట్టుకున్నట్లు ఉంది. అందుకే జగన్ మీడియా సమావేశంపై నేరుగా దాడి చేయడానికి ఈ తెలుగుదేశం మీడియా పడరాని అగచాట్లు పడుతోంది.జగన్ బుధవారం నాడు కరువు సమస్య, బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వ డ్రామా, గంజాయి ప్రదేశ్గా మారిన ఏపీ, వెలిగొండ క్రెడిట్ చోరీ మొదలైన అంశాలపై డిటైల్డ్గా తన మీడియా సమావేశంలో మాట్లాడారు. వీటన్నిటికి ఆయన ఆధారాలు, సాక్ష్యాలు చూపుతూ తన వాదన వినిపించారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వలేక, టీడీపీ నేతలు, మంత్రులు కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. కాని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి మాత్రం రాజును మించిన రాజభక్తితో, టీడీపీని కాపు కాసే బాధ్యత తమదే అన్నట్లుగా జగన్పై నేరుగా దాడి చేసింది. జగన్ చెప్పినవి అబద్దాలని రాసేసుకుంది. ఆ రకంగా జగన్పై బురద వేసి ఆ మీడియా సంతృప్తి చెందింది.జగన్ చెప్పిన విషయాలను పరిశీలిద్దాం.. ముందుగా కరువు ప్రస్తావనను జగన్ చేశారు. రాష్ట్రంలో కరువు ఉందన్నది వాస్తవమే కదా!స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆ విషయాన్ని చెబుతున్నారు కదా! అయినా పట్టిసీమ నుంచి నీరు వచ్చేసిందని చెప్పి ప్రకాశం బారేజీ వద్ద పూజలు చేసి నీళ్లు వదలి కృష్ణా డెల్టా కింద మంత్రులు నీరు ఇస్తున్నట్లు చెప్పింది అవాస్తవమా? ఆ సందర్భంలో వీరంతా ఏ రకంగా గప్పాలు పోయారో తెలియదా! ఆ విషయాలనే కదా జగన్ గుర్తు చేసింది.వాటికి ఆధారంగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను కూడా చూపించారు కదా! కాకపోతే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు కరువు అన్న పదాన్ని వాడకుండా ఎల్నినో అని చెప్పుకుని జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. మంత్రుల మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు నష్టపోతున్నారని జగన్ తెలిపారు. ఇందులో తప్పేముంది? అబద్దం ఏమి ఉంది. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ మొదలైన ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వార్తలు ఎల్లో మీడియాలో కూడా వచ్చాయి కదా!రైతులను, కరువు బారిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు కరువును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలేమిటి? ఇంకా ప్లానింగ్లోనే ఉన్నామని కదా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది. పలు చోట్ల ముఖ్యంగా రాయలసీమ నుంచి వలసలు ఎలా సాగుతున్నాయో పత్రికలలో వార్తలు వచ్చాయి కదా!ఆగస్టు 11నాటికి శైశైలంలో 879 అడుగుల నీటి మట్టం వచ్చినా పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎందుకు ఇవ్వలేదన్నది జగన్ ప్రశ్న. రైతులకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వంటి పాలకులు ఉంటారనే, తాము రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ను ఆరంభించామని జగన్ తెలిపారు. ఇది వాస్తవమే కదా! ఈ స్కీమ్ను జగన్ వేగంగా ముందుకు తీసుకువెళుతున్న సమయంలో ప్రభుత్వం మారడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారని చంద్రబాబు ఈ స్కీమ్ను నిలిపివేయడం కరెక్టే కదా! రేవంత్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినా చంద్రబాబు ఖండించలేకపోయారే. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు జగన్ చేసిన విమర్శలకు జవాబు ఇస్తూ ప్రతి విమర్శలు చేశారే కాని, ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నది వివరించినట్లు కనిపించలేదు.జగన్ టైమ్లో రైతులకు ఉచిత భీమా అమలు చేస్తే ఈ ప్రభుత్వం దానిని ఎందుకు కొనసాగించలేకపోయింది? రామానాయుడు మాత్రం కరువు నేపథ్యంలో తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ తర్వాత ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కరువు సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులు గడ్డుగా మారాయి. వాటిని ఎలా నివారిస్తారన్న జగన్ ప్రశ్నకు బదులు ఇచ్చినట్లు లేదు.జగన్ టైమ్లో వివిధ స్కీమ్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలవారికి ఆర్థిక సాయం అందించడంతో చేతిలో డబ్బులు ఆడాయి. వ్యాపారాలు కూడా సాగాయని ఆర్థిక నిపుణులు కూడా అంగీకరించారు. జగన్ టైమ్లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వస్తే ఈ ఎల్లో మీడియా ఎంత నీచమైన రాతలు రాసిందో మర్చిపోయి ఉండవచ్చు. ప్రపంచం అంతటా ఏర్పడినట్లే ఏపీలో కూడా అప్పట్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం సూచనల ప్రకారం రుణం తీసుకోవలసి వచ్చింది. మిగిలిన రాష్ట్రాలకన్నా మెరుగ్గా కరోనాను జగన్ ప్రభుత్వం ఎదుర్కుంది. అయినా జగన్ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసిందా? లేదా? ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయితే కోర్టులలో కేసులు వేయించి వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశాలు తెచ్చింది ఎవరో తెలియదా!తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అని చంద్రబాబు అంటే అదేమిటని ప్రశ్నించకపోగా, ఎల్లో మీడియా ఔను, ఔను అని భజంత్రి వాయించాయే. ఇప్పుడు కరువు సమస్య వల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంటే వారిని మభ్య పెట్టడానికి ఎల్లో మీడియా ఎల్నినో, యుద్దం అంటూ సాకులు ప్రచారం చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ గురించి కూడా ఎల్లో మీడియా తనదైన శైలిలో టీడీపీ ఖాతాలో వేయడానికి తహతహలాడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ లేకపోతే ఈనాటికి కూడా ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చేది కాదన్నది పచ్చి నిజం.జగన్ రెండేళ్ల క్రితం సొరంగాలకు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ,నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయిర్లోకి నీరు తరలిస్తామని ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. రెండేళ్ల క్రితం ఈ పని పూర్తి చేయకుండా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం కాదా! వైఎస్సార్సీపీ, జగన్ కలిసి సుమారు 31 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్విస్తే, చంద్రబాబు హయాంలో 6.68 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారన్నది నిజమా? కాదా? ఈ క్రెడిట్లో ఎవరి వాటా ఎంతో చెబితే తప్పుకాదు. మొత్తం క్రెడిట్ను చోరీ చేయాలని చూస్తేనే ఇబ్బంది. ఇక ఏపీ గంజాయి ప్రదేశ్గా మారిందని జగన్ ఆరోపణ.ఈ మధ్యనే ఏకంగా పోలీసుల వాహనంలోనే గంజాయి తరలించిన వార్తను ఎల్లో మీడియా మర్చిపోయిందా? నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. వంద రోజుల్లో గంజాయి నిరోదించి చూపుతామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు చేసిన ప్రగల్బాలను జగన్ ప్రస్తావించారు. ఆ ప్రకారం వారు చేయలేకపోయిన విషయాన్ని జగన్ ఎండగట్టారు. ఇక బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఎల్లో మీడియా నిస్సిగ్గుగా భుజాన వేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తోంది.గతంలో జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జీఓ ఇస్తే తప్పుపట్టారా?లేదా?దానిపై టీడీపీ నేతే కోర్టుకు వెళ్లారా?లేదా?ఆ తర్వాత అది ఆగిపోతే జగన్ పార్టీపరంగా ఆయా పదవులను ఏభై శాతం పైగా బీసీలకు ఇచ్చారే! ఆ విషయాన్ని ఆయన లెక్కలతో సహా చూపించారు. మరి చంద్రబాబు మళ్లీ ఇప్పుడు జీఓ ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే దానికి కోర్టు ఆమోదం తెలుపుతుందా?పార్లమెంటులో సంబంధిత చట్ట సవరణ చేయిస్తామని ఎందుకు టీడీపీ ప్రకటించలేదు?ఇక వైఎస్సార్సీపీ బీసీ నేతలపై కేసులు అక్రమమా? కాదా? అన్నది అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలపై అప్పట్లో అవినీతి కేసులు వస్తే ఇదే ఎల్లో మీడియా గుండెలు బాదుకుని గోల, గోల చేసిందే. టీడీపీ ముఖ్యనేత పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలను కనుగొన్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం బహిరంగ రహస్యమే కదా! ఆ కేసు ఏమైందో చెప్పి, ఆ తర్వాత వైఎస్సార్సీపీపై ఎన్ని ఆరోపణలు చేసినా ఆలోచించవచ్చు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లు టీడీపీతో పాటు ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న విషయాన్ని జనం గమనించరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇవి కూడా చదవండి: బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి? -
2003 - 2004 లో అసలు ఏమి జరిగిందంటే.. సాక్ష్యాలతో చంద్రబాబు బండారం బట్టబయలు
-
40 ఏళ్ళ రాజకీయ అనుభవంతో చెప్తున్నా... స్థానిక ఎన్నికల్లో జరగబోయేది ఇదే..
-
TDP నుంచి కోటం రెడ్డి ఔట్...!
-
మీ ఓటు డిలీట్.. SIR తో ఓట్ల మాయాజాలం.. లోకల్ ఎన్నికల్లో బాబు కుట్ర
-
అక్రమ మైనింగ్ సామాజిక రుగ్మత
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ అండదండలతో తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా కొండలను గుల్ల చేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న నేపథ్యంలో అక్రమ మైనింగ్పై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అక్రమ మైనింగ్ అనేది సమాజాన్ని పీడిస్తున్న ఒక పెద్ద సామాజిక రుగ్మత. దీన్ని మనం అందరం తప్పనిసరిగా గుర్తించుకుని తీరాల్సిందే. ఎటువంటి భయం, సిగ్గు లేకుండా విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. ఇందుకు మనిషి అత్యాశే ప్రధాన కారణం. ఆ విధ్వంస పర్యవసానమే ఇప్పుడు మనకు మన కళ్ల ముందు కనిపిస్తున్న వినాశకరమైన ఫలితాలు.’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు 2020లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనల సవరణలను హైకోర్టు సమర్థించింది. ఆ సవరణలు చట్టబద్ధమైనవేనని తేల్చి చెప్పింది. ఎంఎంఆర్డీ చట్టంలోని సెక్షన్ 15, 23సీ ప్రకారం మైనర్ మినరల్స్ అక్రమ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు నిబంధనలు తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. మైన్స్ అండ్ మినరల్ అభివృద్ధి, క్రమబద్దీకరణ చట్టం (ఎంఎండీఆర్), ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ (ఎంఎంసీ) రూల్స్ను ఉల్లంఘిస్తూ అక్రమ తవ్వకాలకు పాల్పడే కంపెనీలకు, వ్యక్తులకు జరిమానా విధించే అధికారం గనుల శాఖ అధికారులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే శిక్ష విధించే అధికారం మాత్రం సంబంధిత న్యాయస్థానానికే ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ఏపీ ఎంఎంసీ రూల్స్కు ప్రభుత్వం చేసిన సవరణలు కేంద్ర చట్టమైన ఎంఎంఆర్డీకి విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల అవి చెల్లుబాటు కావంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అప్పట్లో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం అనుమతిస్తూ ఈ మేరకు తీర్పు వెలువరించింది. గనుల శాఖ అధికారుల నుండి డిమాండ్ నోటీసు అందుకున్న మైనింగ్ కంపెనీలు ఈ తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చిన 15 రోజుల్లో చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత అప్పిలేట్ అథారిటీ వద్ద అప్పీల్ వేసుకోవచ్చని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ కఠిన చర్యలు రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్కు సంబంధించి చట్ట నిబంధనల సవరణలు చేస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం 2020 జూలై 1న జీవో 35 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అక్రమ మైనింగ్కు పాల్పడినా, పర్మిట్ లేకుండా రవాణా చేసినా, భారీ జరిమానా, సీనరేజ్ ఫీజు విధించవచ్చు. అంతేకాక డిమాండ్ నోటీసు జారీ, మెరిట్ వసూలు, వాహనాలు, యంత్రాలు సీజ్ చేసే అధికారం గనుల శాఖ అధికారులకు ఉంటుంది. ఈ నేపథ్యంలో భవనాల నిర్మాణాలకు అవసరమైన రాళ్లు, రహదారి మెటల్ కోసం అనుమతులకు మించి తవ్వకాలు చేసిన మైనింగ్ కంపెనీలకు జరిమానా నిమిత్తం అధికారులు డిమాండ్ నోటీసులు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను సవాలు చేస్తూ శ్రీదుర్గా భవానీ గ్రానైట్స్, సల్సార్ గ్రానైట్స్, జీఎంబీ రాక్స్, జీఎస్ఆర్ స్టోన్ క్రషర్స్ తదితర కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర చట్టమైన మైన్స్ అండ్ మినరల్ అభివృద్ధి, క్రమబద్ధీకరణ చట్టం (ఎంఎండీఆర్) 1957కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఏపీ ఎంఎంసీ నిబంధనలు చెల్లవని పేర్కొన్నాయి. ఎంఎంఆర్డీ చట్టం కింద జరిమానాలు, శిక్షలు విధించే అధికారం కేవలం సంబంధిత క్రిమినల్ కోర్టులకు మాత్రమే ఉంటుంది తప్ప అధికారులకు లేదని ఆ కంపెనీలు వాదించాయి. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందన్రావు, డిమాండ్ నోటీసులు జారీ చేసే పరిధి మాత్రమే అధికారులకు ఉందని జరిమానాలు, శిక్షలు విధించే అధికారం సంబంధిత కోర్టులకు మాత్రమే ఉంటుందంటూ 2020లో తీర్పునిచ్చారు. చట్ట నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ పలు కంపెనీలకు జరిమానా నిమిత్తం గనుల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేశారు. దీంతో తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఎంఎంసీ నిబంధనల్లోని రూల్ 26(3)(2), 34(1) చట్టబద్ధతను సవాలు చేస్తూ అంజనీ స్టోన్ క్రషర్స్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం విచారణ జరిపింది. -
‘100 రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానన్న హోంమంత్రి ఎక్కడ?’
సాక్షి, తాడేపల్లి : ఏపీ గంజాయి స్టేట్గా మారిపోయిందని.. పోలీసులతోనే గంజాయిని రవాణా చేసే దుస్థితికి తెచ్చారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఎక్కడ ఉన్నారంటూ నిలదీశారు. లిక్విడ్ రూపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇప్పటికే 70 లక్షల లీటర్ల లిక్విడ్ పట్టుబడింది. గంజాయి డాన్ సోహెల్ని పోలీసుల నుంచి తప్పించిందెవరు?’’ అంటూ నాగ మల్లీశ్వరి ప్రశ్నించారు.‘‘హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. హోంమంత్రితో పోలీసులతో కూడా తప్పు చేయిస్తున్నారు. అత్యంత అసమర్థ మంత్రిగా హోంమంత్రి చరిత్రలో నిలిచిపోయారు. వైఎస్ జగన్ హయాంలో గంజాయి సాగుపై యుద్ధం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు నడిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్ళీ గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది’’ అంటూ మలీశ్వరి ధ్వజమెత్తారు.‘‘గంజాయిని నిర్మూలించామంటున్న హోంమంత్రి మాతో చర్చకు రాగలరా?. హోంమంత్రికి నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్మటం తప్ప మరో పనిలేదు. సోహెల్ పోలీస్ స్టేషన్ నుండి పారిపోతే ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇదీ హోంమంత్రి పనితీరు. హోంమంత్రి అనిత దగ్గరకు ఫైల్ వెళ్తే ఐదు రోజులపాటు చూడరు. ఇది ప్రభుత్వమే చేయించుకున్న సర్వేలో తేలిన అంశం. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకేం బాగుపడుతుంది?’’ అంటూ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?
ఏపీలో ప్రస్తుత సచివాలయంలో సుమారు మూడువేల మంది పనిచేస్తుంటారు. పోనీ ఏ రకంగా చూసినా ఐదువేల మంది మించి ఉండరు. కాని అమరావతి రాజధానిలో సచివాలయం కోసం చేపట్టిన భారీ టవర్లలో 16వేలమంది పని చేయవచ్చట. అంత పెద్ద టవర్లు ఏం చేస్తారు? ఈ సందేహం ఏ సామాన్యుడికైనా వస్తుంది? కాని అంతర్జాతీయ మీడియాగా పేరొందిన న్యూయార్క్ టైమ్స్కు రాకపోవడమే విచిత్రం అనిపిస్తుంది.ఈ మీడియా అమరావతిపై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. దానిని తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఆంధ్రజ్యోతి అయితే అమరావతి.. అనితర సాధ్యం అన్న శీర్షికన ఈ వ్యాస కథనాన్ని అందించింది. ఒక అంతర్జాతీయ మీడియా అమరావతికి సంబంధించి మంచి, చెడు లేదా లాభ, నష్టాలు రెండూ ఇస్తే ఎవరూ తప్పు పట్టనక్కర్లేదు. కానీ, ఆ వ్యాసం చదివితే ఇంత పెద్ద మీడియా సంస్థలు కూడా ఏకపక్షంగా కథనాలు ఇస్తాయా? అమెరికాలో కూడా పత్రికా ప్రమాణాలు దిగజారి ఉంటాయా అన్న సందేహం కలుగుతుంది.మోస్ట్ లివబుల్ సిటీ అమరావతి అని ఈ వ్యాసానికి శీర్షిక పెట్టారు. వినడానికి ఎంత బాగుంది. అమరావతిలో నివసిస్తే ఓ పాతికేళ్లు అధికంగా బతకవచ్చని చంద్రబాబు తన ఉపన్యాసాలలో చెబుతున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషిస్తారు. కానీ, ఈ వ్యాసం వచ్చిన కొద్ది రోజులకే, చంద్రబాబు స్పీచ్ ఇచ్చిన కొన్నాళ్లకే జరిగిన శాసనసభ సమావేశాలలో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే టీడీపీ ఎమ్మెల్యే శ్రావణకుమార్ ఏమి చెప్పారో తెలుసా! అమరావతిలో గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారని, సరైన రోడ్లు లేవని, ఇతర వసతులు లేవని, రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండడం లేదని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. మంత్రులు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదని ఆయన వాపోయారు.న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రతినిధులు నిజంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే రాశారా? లేక ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రాసిచ్చిన దానిని ముద్రించారా అన్నదానిపై కొందరికి డౌట్లు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఏ వ్యాసం రాసినా పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ, ఇందులో పూర్తిగా ఏకపక్షంగా పాజిటివ్ వ్యాఖ్యలే కనిపిస్తాయి. ఇది పెయిడ్ ఆర్టికిల్ వంటిదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దానిని కూడా పట్టించుకోనవసరం లేదు. అయితే ఈ వ్యాసకర్తలు అనుసరించాల్సిన ప్రమాణిక సూత్రాలు పాటించినట్లు కనిపించకపోవడమే అసలు సమస్య.న్యూయార్క్ టైమ్స్ విలేకరులు అమరావతి సందర్శించడం చంద్రబాబుకు లేదా మంత్రి నారాయణకు తెలియకుండా జరుగుతుందా? పైగా అంతర్జాతీయ మీడియా వారు వస్తుంటే చంద్రబాబు కలవకపోవడమన్నది నిజంగా జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే మామూలు స్థానిక మీడియాకే విశేష ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి అంతర్జాతీయ మీడియా వస్తుంటే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారా! అమరావతిని ఫలానా పెద్ద మీడియా వారు చూసి వెళ్లారన్న వార్తనే హడావుడి చేసి ఉండేవారు కదా! వారు మంత్రి లోకేష్తో మాత్రమే ఎందుకు మాట్లాడారో తెలియదు. సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను సంప్రదించలేదా? నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నంత వరకు ఆక్షేపణ లేదు. కానీ, వారు అమరావతి గురించి మరీ అతిగా పొగిడారా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.ఏపీకి రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనడం లేదు. అవసరమైన భవనాలు కట్టుకోవచ్చు. కాని ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?వారికి ఎంత విస్తీర్ణంలో భవనాలు కావాలి? ఎంత నిర్మిస్తున్నారు? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది కదా! అలా కాకుండా అవసరాన్ని మించి నాలుగైదు రెట్ల అదనంగా నిర్మాణం చేపట్టిన తీరును ప్రశ్నించాలి కదా! అమెరికాలోని కాపిటల్ హిల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు ఉన్న విస్తీర్ణం గురించి గూగుల్లో అడిగితే వచ్చిన సమాధానం ఇది.. Capitol Hill is a historic residential neighborhood and the legislative center of the United States government in Washington, D.C., covering just under 2 square miles (5 square kilometers).ఇవి కూడా చదవండి: రేవంత్ టూర్కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?కాపిటల్ హిల్ అనేది వాషింగ్టన్, డీ.సీ.లోని ఒక ప్రాంతం, ఇది ఈశాన్య మరియు ఆగ్నేయ చతుర్భుజాలలో విస్తరించి ఉంది. బహుశా అన్ని ప్రభుత్వ ఆఫీస్లు ఇందులో ఉన్నాయో లేదో తెలియదు. కాని అంత పెద్ద రాజధానిలో కేవలం 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఈ భవనాలు ఉంటే, భారత్లో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది.మరో ఉదాహరణ చూద్దాం. అమెరికాలో అతి పెద్దదైన రాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో అనే చోట ఉంది. అక్కడ కేవలం 39 ఎకరాలలో పది బ్లాక్లలో ఆఫీస్లు ఉన్నాయట. అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ ఆఫీస్లు అన్నీ కలిపి 4,72,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని గూగుల్ చెబుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అన్ని ఆఫీస్లు కలిపి 300 ఎకరాలలోనే ఉన్నాయన్నది ఒక అంచనా. అమరావతిలో ఏభై లక్షలు, అరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఈ విషయాలేవీ న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులకు తెలియవా? అంటే ఏమి చెబుతాం. అమరావతిలో కేవలం సచివాలయానికే, పరిపాలన కార్యాలయాలకు ఐదు టవర్లు, అతి పెద్ద టవర్పై అంతస్తులో సీఎం ఆఫీస్, ఆ పైన హెలిపాడ్ ఉంటాయట.అప్పుల కుప్పగా ఉన్న ఏపీకి ఇంత ఆర్భాటం, అట్టహాసం అవసరమా? దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వేశారో, లేదో తెలియదు. క్వాంటమ్ వ్యాలీ గురించి, ఇతరత్రా చంద్రబాబు చేస్తున్న కృషి గురించి వివరించారు. యధా ప్రకారం లోకేష్ విభజన సమయంలో కట్టుబట్టలతో ఏపీకి తరలివచ్చేశామని కూడా వారికి చెప్పేశారట. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను వదలి ఎందుకు అలా చేయవలసి వచ్చిందన్న ప్రశ్న సహజంగా జర్నలిస్టులకు వస్తుంది. మరి వీరికి ఎందుకు రాలేదో అర్థం కాదు.ఈ అమరావతి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏభై వేల కోట్ల అప్పు ఎందుకు సమీకరించారు. ఇంకా మరో 1.75 లక్షల ఎకరాల భూమి సేకరణ అవసరం ఏమిటి? ఆ భూములలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి? ఈ అప్పులు ప్రజలపై భారం కాదా? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు? వారికి అవసరమైన మౌలిక వసతులకు అయ్యే వ్యయం ఎంత? పూలింగ్కు భూములు ఇవ్వని రైతులను వేధించారన్నది నిజమా? కాదా? రైతుల గోడును విన్నారా? లేదా? మూడు పంటలు పండే భూములను ఇలా చేయడం పర్యావరణ విధ్వంసం అవుతుందా? కాదా? వరదపీడిత ప్రాంతంలో రాజధాని ఎలా కడుతున్నారు? ఆ వరదను ఎత్తిపోయడానికి లిఫ్ట్లు కట్టడమేమిటి? ఇలాంటి అనేక సందేహాలను వారు ముఖ్యమంత్రి లేదా కీలక మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకుని అన్ని విశేషాలతో వ్యాసం రాసి ఉంటే దానికి విలువ వచ్చేది కదా!అలాకాకపోతే తెలుగుదేశం మీడియాకు, ఈ అంతర్జాతీయ మీడియాకు తేడా ఏముంటుందని కొందరు ఢిల్లీ జర్నలిస్టులు తమ కామెంట్లలో ప్రశ్నించారట. అది న్యాయార్క్ టైమ్స్ మీడియాకు శోభనిస్తుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇవి కూడా చదవండి: మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా? -
గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు!
చంద్రబాబు పాలనలో ఈ రాష్టంలో ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. కానీ.. ఒక్క గంజాయికి మాత్రం గిట్టుబాటు ధర వస్తోంది. గంజాయి రవాణా స్థాయి నుంచి మాఫియా స్థాయికి చేరింది. పోలీసులనే వాటాదారులుగా చేసి చినబాబు, పెదబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు.నేరస్తులు, పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారు. రేంజ్లుగా విభజించి సిండికేట్గా ఫామ్ అయ్యి.. ఆర్గనైజ్్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు.నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడింది. విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సొహైల్ను విశాఖలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడన్నారు. అసలు అతను తప్పించుకున్నాడా? తప్పించబడ్డాడా? జూన్ 9న ఘటన జరిగితే ఇప్పటి వరకు సొహైల్ను పట్టుకోలేకపోయారు.పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్.. బాధ్యత గల డిపార్టుమెంట్.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలన సర్వం గంజాయి, డ్రగ్స్ మయం అని, మట్టి, ఇసుక, క్వార్ట్జ్, సిలికా, కల్తీ లిక్కర్ అన్నింటా మాఫియానేనని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒకవైపు రాజకీయ వేధింపులకు పాల్పడుతూ, తప్పుడు కేసులు పెడుతూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా పంచేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ దిగజార్చిన తీరును వీడియోలు ప్రదర్శించి చూపుతూ.. ఫోటోలు, సాక్ష్యాధారాలు చూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి వీధికీ బెల్ట్ షాపు..‘‘రాష్ట్రంలో ఒకవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియానే. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను వాళ్లకు నచ్చినవాళ్లకు, వాళ్ల మనుషులకు, బంధువులకు పప్పుబెల్లాలకు కట్టబెడుతున్నారు. రాజధాని పేరుతో అమరావతిలో బిల్డింగ్లు ఎస్ఎఫ్టీకి రూ.21 వేల నుంచి 22వేలు దాటింది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను శెనక్కాయలు, బఠాణీలకు అమ్మేస్తున్నారు. విలువైన భూమి ఎక్కడ కన్పించినా వదలడంలేదు. విశాఖపట్నంలో ఏ భూమినీ వదలడంలేదు. స్కాములు చేస్తున్నారు. ఇవన్నీ గాక డ్రగ్స్, గంజాయి.. బెల్ట్ షాపుల పేరిట కల్తీ లిక్కర్. ప్రతి ఊరుకు, ప్రతి వీధికి చంద్రబాబు తీసుకుపోయాడు. ఇదే రాష్ట్రంలో జరుగుతున్న పాలన. ఎస్సైలు జేమ్స్బాండ్లు అయితే.. చర్యలెందుకు?నిజంగానే ఎస్పీ చెబుతున్నట్టుగా సమాచారం మేరకు రెయిడ్ చేశారంటే.. డీఎస్పీ చెబుతున్నట్టు ఇద్దరు ఎస్సైలు వెళ్తుంటే.. రోడ్డు పక్కన ఒక వ్యక్తి అనుమాస్పదంగా కన్పిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలేసి పారిపోయి ఉంటే.. జేమ్స్బాండ్ 117 మాదిరిగా ఇద్దరు ఎస్సైలు ఛేజ్ చేసి ఉంటే.. వాళ్లకు నువ్వేం చేస్తావ్? శభాష్ అంటూ వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, సీఎం మెడల్, ఇంకో మెడల్ ఇచ్చేలా చేస్తావ్. కానీ అంతటి జేమ్స్బాండ్లకు వీఆర్ ఎందుకు ఇచ్చారయ్యా? నువ్వే ఒకవైపు వాళ్లు జేమ్స్బాండ్లు అంటున్నావ్.. నువ్వే మళ్లీ వాళ్లను వీఆర్ అంటున్నావ్.. చార్జీషీటు అంటున్నావ్.. యాక్షన్ అంటున్నావ్.. మళ్లీ ఇంకొక పక్కన డీఎస్పీ, ఎస్పీ అందరూ వారిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో గంజాయి వదిలి బైక్లో పారిపోయాడంటూ ఎవరిని ఇరికిస్తారో పాపం. ఇప్పటికే ఇరికించే కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా చేస్తున్నారు.పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో!నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది చెప్పడానికి మరో ఉదాహరణ.. మొన్న విజయవాడలో సీఐ వేధింపులు భరించలేక వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతికుమార్ కుటుంబం చేస్తున్న ఆరోపణ ఏంటి? నా కొడుకు చేత చేయకూడని పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇంకో పిల్లాడు సాయికృష్ణ పోలీస్ స్టేషన్లోనే హత్యకు గురై బూడిద కూడా దొరకని పరిస్థితి. ఆ వ్యవహారంలో కూడా ఇలాంటి చర్చే నడుస్తోంది. నిజంగా వ్యవస్థ అన్నది ఏ స్థాయికి దిగజారిపోతుందనేందుకు ఇవన్నీ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్. గ్రానైట్ మాఫియా నుంచి చినబాబు, పెదబాబుకు కలెక్షన్లుఅద్దంకి ఘటనలో వస్తున్న సమాచారం.. ఆ తర్వాత జరుగుతున్నవి చూస్తా ఉంటే.. గ్రానైట్ మాఫియా నుంచి పోలీసులే కలెక్షన్ చేసి ఎమ్మెల్యేకు ఇంత? చినబాబుకు ఇంత? పెదబాబుకు ఇంత? పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ మత్తులోకి వెళ్లిపోయారు. ఆ మత్తులోనే ఎస్సైలు కారులో వెళ్తూ దారిలో ఇదంతా జరిగింది. నిజంగా పోలీసుల సౌలభ్యం కోసం ఐజీలకు రాయలసీమ, కోస్తా అనే రేంజ్లు ఇస్తారు. ఫస్ట్టైమ్ ఏం చూస్తున్నామో తెలుసా? రేంజ్లుగా విభజించి సిండికేట్గా ఫామ్ అయ్యి.. కలెక్షన్ల వసూళ్లలో పాత్రధారులుగా పోలీసులే ఉండటం. ఎమ్మెల్యేల మద్దతుతో వసూళ్లు చేసి చినబాబుకు ఇంత, పెదబాబుకు ఇంత? అని ఆర్గనైజ్్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు. కుప్పంలోనూ విచ్చలవిడిగా గంజాయి..ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి, గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వాళ్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికారపార్టీకి చెందిన నేత అనుచరులు తమిళనాడులో 220 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఇవన్నీ నిజాలు. కుప్పం టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. చంద్రబాబు పాలనలో సర్వం గంజాయి మయం.. సర్వం దోపిడీ మయం.. సర్వం డ్రగ్స్ మయం.. సర్వం నకిలీ లిక్కర్ మయం..క్రమశిక్షణా చర్యలంటూ కప్పిపుచ్చడమెందుకు?» మరి ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని కవరప్ చేసేందుకు ఏంచేశారో గమనించాలి. (వీడియోలు ప్రదర్శించి వివరించారు.) డీఎస్పీ చెబుతున్న మాటలకు.. ఎస్పీ చెబుతున్న మాటలకు.. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిపోర్టుకు పొంతనలేదు. డీఎస్పీ, ఎస్పీ, ఎఫ్ఐఆర్లలో మూడు వేర్వేరు వెర్షన్లు చెప్పారు.» ఇద్దరు ఎస్సైలు కారులో వెళ్తుంటే.. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కన్పిస్తే.. ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా.. వీరిద్దరు కారులో ఛేజ్ చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ చెప్పాడు.» కాదు కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున.. ఆ సమాచారం మేరకు రెయిడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. » ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరు ఎస్సైల వాంగ్మూలం చూడండి. ఇద్దరు ఎస్సైల్లో ఒక ఎస్సై కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురవ ఎస్సై పిలిస్తే.. సంతమాగులూరు ఎస్సై వెళ్లాడంట. కాంట్రడిక్షన్ చూడండి. మూడు వెర్షన్స్ ప్లే చేస్తాను చూడండి. (డీఎస్పీ, ఎస్పీ వీడియోలు ప్లే చేసి చూపించారు). » గంజాయిని సీజ్ చేశారని, వేగంగా వెళ్లే క్రమంలో ఆటోను ఢీకొట్టారని, ప్రమాదం జరగడంతో 108కు ఎస్సై ఫోన్ చేశాడని, గాయపడిన వారిని ఎస్సై అంబులెన్స్లో ఎక్కించి పంపించాడని ఎస్పీ చెప్పాడు. కానీ 108 రికార్డులో సమాచారం ఇచ్చింది స్థానికుడు అని రిపోర్టు అయ్యి ఉంది. చంద్రబాబు వచ్చాక 108 కాంట్రాక్ట్ తమ వాళ్లకే కట్టబెట్టారు. ఆ నిర్వాహకులే.. స్థానికుడు సమాచారం ఇచ్చినట్టు 108 పేషెంట్ కేర్ రికార్డులో పేర్కొన్నారు. » ఎస్సైలు ఆ రోజు మత్తులో కారులో వెళ్తూ ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ఉన్న వారు గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. కారు నడుపుతున్న ఎస్సై, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్నారు. ఎస్సైలు ప్రయాణిస్తున్న ఆ కారులో గంజాయి ఉంది. లిక్కర్ బాటిల్ ఉంది. పోలీస్ యూనిఫాం ఉంది. » ఇన్ని కన్పిస్తుంటే.. వాళ్లను డీఎస్పీ రక్షించేందుకు ప్రయత్నం చేస్తాడు.. తప్పుడు వాగ్మూలం ఇస్తాడు. వీడియోలు తీసినప్పుడు సీఐ బెదిరిస్తాడు.. వీడియోలు తీయొద్దని. వీడియోలు, ఫొటోలు తీస్తే అరెస్టు చేస్తానని బెదిరిస్తాడు. ఐపీఎస్ చేసిన ఎస్పీ కూడా గంజాయి తరలిస్తున్న ఎస్సైలను ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తున్నాడు. » పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్.. బాధ్యత గల డిపార్టుమెంట్.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. కానీ చంద్రబాబూ నువ్వేం చేస్తున్నావ్ ఆ ఎస్సైలను కాపాడేందుకు తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు ఆధారాలు అన్నీ బిల్డ్ చేస్తా ఉన్నావ్. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రజలకు ఏమనిపిస్తుంది? అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు.. గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారు.. అని ప్రజలకు సంకేతాలు ఇవ్వడం కాదా? ఇలా జరుగుతోంది రాష్ట్రంలో పరిపాలన.పోలీసులే వాటాదారులుగా గంజాయి మాఫియా..!మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన నిజంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఓ ఊదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థతోనే.. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థతోనే.. దగ్గరుండి వారిని కూడా వాటాదారులుగా చేస్తూ.. డ్రగ్స్, గంజాయి మాఫియాను ఆ స్థాయికి తీసుకుపోతే ప్రజలు ఇక ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని నమ్మాలి? అద్దంకి ఘటనలో తాజా సమాచారం ప్రకారం మత్తులో ఉన్న ఒక ఎస్సై కారు నడిపితే మరో ఇద్దరు ఎస్సైలు మత్తులో వెనుక సీట్లో కూర్చున్నారు. ఆ కారుతో ఒక ఆటోని ఢీకొట్టడం.. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం.. అందులోనివారంతా మత్తులో ఉండడాన్ని ప్రజలు చూడటం.. వెనక సీటులో, డిక్కీలో గంజాయి, లిక్కర్, పోలీస్ యూనిఫామ్ దొరకడం.. ఇదంతా చూసి ప్రజలు షాక్కు గురయ్యారు. మనం నిజంగా ఏపీలో ఉన్నామా? లేక కొలంబియాలో ఉన్నామా? అని అన్పిస్తోంది. రాష్ట్రంలో ఈ పరిస్థితులు చూసి ప్రతీ ఒక్కరు కూడా ఆందోళన చెందారు. గ్రామస్తులు ఆ ఘటనను వీడియోలు తీస్తుంటే సీఐ వచ్చి బెదిరించాడు. వీడియో తీస్తే జైలులో పెడతా అన్నాడు. (ఈ ఘటనను వీడియో, ఫొటోలతో వైఎస్ జగన్ వివరించారు).మా హయాంలో.. ఉక్కుపాదం మోపాం..ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పెట్టి గంజాయి, డ్రగ్స్పై మా హయాంలో ఉక్కుపాదం మోపాం. 11,550 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం చేశాం. 4.50కోట్ల గంజాయి మొక్కలు తొలగించాం. 13,210 మందిని అరెస్టు చేశాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా రూట్లన్నీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి.. వారు చెప్పినట్టుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ట్రైబల్స్ను గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. రూ.144కోట్లు ఖర్చు చేసి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సహించాం. దాదాపు 3లక్షల ఎకరాలకుపైగా పోడు భూములు గిరిజనులకు పంచిపెట్టాం. ఈ రోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే గంజాయి వ్యాపారం చేయిస్తూ, వారిని భాగస్వాములను చేస్తూ టీడీపీ నాయకులు అందరూ కలిసి చేస్తున్న మాఫియా సామ్రాజ్యం. -
వెలిగొండలో చంద్రబాబు క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో ఏమీ చేయకపోయినా, ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. పనులు వేగంగా చేశారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు సొరంగాల పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిటనేది చంద్రబాబు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబుది క్రెడిట్ చోరీ.. ఏమీ చేయకున్నా ఘనత(క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్) తనదేనంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సూటిగా సమాధానాలు చెప్పారు. ‘స్థానిక ఎన్నికలను చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుపుతాడన్నది అనుమానమే. కానీ, ప్రజాస్వామ్యంలో పోరాడక తప్పదు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పోలీసులను ఉపయోగించి.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించి.. నోట్ల కట్టలను వెదజల్లారు.. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది.. 2019 ఎన్నికల్లో నంద్యాల శాసనసభ స్థానంలో 37 వేల ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలి.డీబీటీ ద్వారా ప్రజలకు మేం చేసిన మంచి చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్లాం.. అందుకే భారీ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు’ అని వైఎస్ జగన్ ఓ ప్రశ్నకు స్పష్టంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వెఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని తేలిందని సర్వే సంస్థలు వెల్లడించడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘చంద్రబాబు పాలన ఈ విధంగా ఉంటే వెన్నుపోటు పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారు?’ అని అన్నారు. -
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇసుక దందా సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
-
కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా స్పందించని బాబు..
-
పోరాటం చేయాల్సిందే.. వెళ్తూ వెళ్తూ వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ అదుర్స్
-
డేంజర్ బెల్స్ మోగుతున్నా చలనం ఉండదా చంద్రబాబు..
-
పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో ఓ వైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే.. మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు.రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు అందునా కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతీ చోటా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో వాటాదారులుగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో.. మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయి. డ్రైవర్తో సహా మరో ఇద్దరూ పోలీసులు మత్తులోనే ఉన్నారు. సీఐ వచ్చి వీడియోలు తీసే జనాల్ని తీయొద్దని బెదిరించారు. అలాంటప్పుడు ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ప్రజలు ఎవరిని నమ్మాలి? అని వైఎస్ జగన్ నిలదీశారు.పైగా అద్దంకి ఘటనను కవర్అప్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటనలు చేశారు. వాళ్ల మాటలకు ఎఫ్ఐఆర్కు పొంతనే లేదు(ఈ సందర్భంగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధనరాజుల వేర్వేరు స్టేట్మెంట్ల వీడియోలను ప్రదర్శించారు). ఇలాంటి పోలీసులను జైలుకు పంపకుండా.. తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారు. కూటమి పాలనలో అద్దంకి ఘటనే కాదు.. కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని కట్టడి చేశాం. గంజాయి కేసుల్లో 13,210 మంది అరెస్ట్ చేశాం. 11 వేల ఎకరాల్లో గంజాయి పంటల్ని ధ్వంసం చేశాం.ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకి దూరం చేశాం. ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశాం అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీ మయం.. గంజాయి మయం. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు.. పెదబాబుకి ఇంత అని వాటేలేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది.. అది గంజాయే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే! -
ఫోటోలకు భలే ఫోజులు ఇస్తాడయ్యా.. నిమ్మలపై జగన్ సెటైర్లు
-
వెలిగొండ ప్రాజెక్ట్ పేరుతో దోచుకున్నారు.. చంద్రబాబుపై ఎమ్మెల్యే ఫైర్
-
కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది వైఎస్సార్సీపీనే. మా కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని వైఎస్ జగన్ వెల్లడించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మేం ఎన్నికలకు వెళ్లాం. సుప్రీంకోర్టు, హైకోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది మేమే. మా కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాం. 40 శాతం మంత్రి పదవులు బీసీలకే ఇచ్చాం. 11 రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలను పంపింది మేమే. రెండు డిప్యూటీ సీఎం పదవులు కూడా బీసీలకే ఇచ్చాం.అలాగే, 13 జెడ్పీ చైర్మన్ సీట్లలో ఆరు బీసీలకే ఇచ్చాం. 13 మేయర్ స్థానాల్లో బీసీలకే 9 ఇచ్చాం. 636 ఎంపీపీ స్థానల్లో బీసీలకే 239 ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకే ఇచ్చాం. 196 ఏఎంసీ చైర్మన్ స్థానాల్లో బీసీలకే 76 ఇచ్చాం. ఇవ్వన్నీ చట్టం చేసి మరీ ఇవ్వడం వైఎస్సార్సీపీకే సాధ్యపడింది. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం కేటాయించాలని పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టించాం. బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాం. వివిధ పథకాల ద్వారా డీబీటీ పద్దతిలో ఇచ్చాం. రూ.లక్షా 30వేల కోట్లు బీసీలకు అందజేశాం.బీసీల బతుకులను చంద్రబాబు బుగ్గిపాలు చేశాడు. మా హయాంలో అమలైన పథకాలను రద్దుచేశాడు. మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో వేశాడు. రాజకీయంగా ఎదిగే బీసీలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి సీదిరి అప్పలరాజును జైలులో పెట్టించారు. ఓ మహిళా ఎస్ఐను అడ్డుపెట్టుకుని చింతాడ రవిని అక్రమంగా జైలుకు పంపారు. కర్నూలులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తే విరూపాక్షిపై తప్పుడు కేసులు పెట్టారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
బాబు చాప్టర్ క్లోజ్... తేల్చేసిన సర్వేలు! టీడీపీ క్యాంపులో మొదలైన టెన్షన్..
-
నార్లు ఎండుతున్నా.. చంద్రబాబు ధ్యాసంతా వాటి మీదే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా దాన్ని గుర్తించేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదని అన్నారు. జూన్, జులైలోనే 52 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని వైఎస్ జగన్ వెల్లడించారు.బుధవారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేశారు. కూటమి పాలనతో ఇప్పటిదాకా రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. 2025 అక్టోబర్లో మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నా.. ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా కూడా అందలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచామని జగన్ గుర్తు చేశారు. అయితే బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారని, పంటలు దెబ్బతిన్న రైతులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం డైవర్షన్, రెడ్బుక్ రాజకీయాలపై దృష్టి సారిస్తోందని జగన్ విమర్శించారు. మంత్రులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంపైనే చంద్రబాబు దృష్టి ఉందని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా తాను ఏం చేస్తున్నానో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.ఇదీ చదవండి: చంద్రబాబు అలా చేస్తే మనదే విజయం: వైఎస్ జగన్ -
కోడిగుడ్డు మీద ఈకలు పీకి.. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
తీవ్రకరువులో కుంభకర్ణుడి మాదిరిగా చంద్రబాబు తీరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ సవాల్ విసిరితే ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలోనూ తీవ్ర కరువు నెలకొంది. అంత తీవ్ర పరిస్థితులు ఉన్నా చంద్రబాబు స్పందించడం లేదు. పైగా కుంభకర్ణుడిలా నిద్ర నటిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటిదాకా 52 శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు....ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలుసు. జులైలోనూ అదే పరిస్థితి. అయినా పంటలకు నీళ్లు ఇస్తామని ఫోజులు ఇచ్చారు. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా.. ఎకరాకు 15 వేలు నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్న చంద్రబాబు కనీసం స్పందించడం లేదు అని వైఎస్ జగన్ అన్నారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు నీటిని విడుదల విషయంలో చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ, ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి మీద చంద్రబాబు దృష్టి సారించారని జగన్ ధ్వజమెత్తారు. అవకాశమున్నా పొత్తిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదీ చదవండి: అదే గనుక జరిగితే వైఎస్సార్సీపీదే విజయం -
పది కోట్ల మంది భక్తులు వస్తారు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనుల పురోగతిపై సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. దేశ విదేశాల్లోని ప్రముఖులందరినీ పుష్కరాలకు ఆహ్వానించామన్నారు. ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. 2015 పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో 4.86 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా.. రానున్న పుష్కరాల్లో రోజుకు సుమారు కోటి మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందన్నారు. రద్దీని తట్టుకునేలా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. -
కరువు కాటుకు మూగజీవాల బలి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కరువు రాయలసీమ రైతు బతుకును ఛిద్రం చేస్తోంది. పొలంలో పంట లేదు.. పశువులకు మేత లేదు.. చేతిలో డబ్బు లేదు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యుల్లా చూసుకున్న ఎద్దులు, ఆవులు, గేదెలను కళ్లముందే ఇతరులకు అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులది. పశువులను అమ్మాలని కాదు.. వాటిని బతికించలేక అమ్ముకుంటున్నాం అంటున్నారు రైతులు. రెండు నెలలుగా చినుకు జాడ లేక, సాధారణ వర్షపాతంలో 30 శాతం కూడా నమోదు కాక, పచ్చిమేత మాట అటుంచితే ఎండుగడ్డి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మార్కాపురం ప్రాంతాల్లోని సంతలకు పశువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. రైతుల ఆవేదనకు ఈ పశువుల అమ్మకాలు అద్దం పడుతున్నాయి. అమ్ముడైన పశువులు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తీవ్రకరువు పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేత లేక అమ్ముకుంటున్నాం పది ఎకరాల్లో పత్తి, మూడెకరాల్లో ఆముదం, ఉల్లి పంటలు వేశాం. సరైన వానల్లేవు. పత్తి పంట మొత్తం ఎండిపోయింది. పశువులకు మేత కూడా లేదు. ట్రాక్టర్ వరిగడ్డి రూ.18వేలు అమ్ముతున్నారు. అది కూడా దొరకడం లేదు. మనుషులం గంజైనా తాగి బతుకుతాం. మేత లేకపోతే పశువులు ఎలా బతుకుతాయి. వాటి బాధ చూడలేక తప్పనిసరి పరిస్థితుల్లో కాడెద్దులు అమ్ముకోవాల్సి వస్తోంది. – గోవిందు, రైతు, పులకుర్తి, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా పంట పోయింది.. పశువుల మేతా పోయిందిఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలు సాగుకునోచుకోలేదు. అరకొర వర్షాలతో కొన్నిచోట్ల మొక్కుబడిగా పంటలు సాగుచేసినా మొత్తానికి పంటలసాగు 40 శాతానికి మించలేదు. మార్కాపురం, కడప లాంటి జిల్లాల్లో 20 శాతం కూడా పంటలు సాగుకాలేదు. అరకొరగా సాగైన వేరుశనగ, కంది, ఆముదం, పత్తి పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కృష్ణాజలాలు వస్తాయని నమ్ముకొని కొంతమేర సాగుచేసిన వరిపంట ఎండుతోంది. దీంతో పశువులకు గ్రాసం దొరికేపరిస్థితి లేకుండా పోయింది. సీమ వ్యాప్తంగా లక్షలాది ఎద్దులు, ఆవులు, బర్రెలు, కోట్లాది గొర్రెలు, మేకలతోపాటు పలురకాల మూగజీవాలు గ్రాసంకోసం అల్లాడిపోతున్నాయి.ఒక్కొక్క ఎద్దు లేదా బర్రెకు రోజుకు 5 కిలోల ఎండుగడ్డి లేదా 15 కిలోల పచ్చిగడ్డి అవసరమవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆ స్థాయిలో గ్రాసం అందుబాటులో లేదు. గ్రాసంలేక కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు పశువులను సంతలకు తెచ్చి తెగనమ్ముకుంటున్నారు. తక్కువ ధరలకే విక్రయించి నష్టపోతున్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, పత్తికొండ, అనంతపురం జిల్లా కదిరి,గోరంట్ల ఇతర ప్రాంతాల్లోని సంతలకు పశువులు వేలాదిగా తరలివస్తున్నాయి. నెలరోజులుగా పశువుల విక్రయాలు పెరిగాయని సంత నిర్వాహకులు చెపుతున్నారు. కొన్న పశువులను వ్యాపారులు కేరళ, కర్ణాటక, తెలంగాణ, కోల్కతా ప్రాంతాల్లోని కబేళాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎటు చూసినా కరువే.. కర్నూలు జిల్లాలో.. కరువు తీవ్రతతో ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, నియోజకవర్గాల నుంచి నిత్యం పశువులు తరలిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోనూ వరిసాగులేకపోవడంతో గ్రాసం దొరికే పరిస్థితులు లేక రైతులు పశువులను విక్రయిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ, కంది పంటలు ఎండిపోయాయి. బోర్లకింద సాగుచేసిన వరిపంట ఎండిపోవడంతో లక్షలాది పశువులకు గ్రాసం దొరక్క సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మార్కాపురం జిల్లా పూర్తిగా కరువు బారినపడి పంటలసాగు లేకుండా పోయింది. దీంతో గ్రాసం దొరక్క లక్షలాదిగా ఉన్న ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, మేకలను తెగనమ్ముకుంటున్నారు. సీమ జిల్లాల్లో ఎద్దులు, ఆవులు 15 లక్షల పైగా ఉండగా బర్రెలు 18.75 లక్షలు, గొర్రెలు, మేకలు కోట్లలోనే ఉన్నాయి. ఎన్నడూ లేని కరువు గతంలో ఎన్నడూ లేని కరువు ఇది. వానా కాలం వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇంత వరకు పదునైన వాన లేదు. ఉన్న ఐదెకరాల్లో కంది పంట వేశా. వానల్లేక పంట చేతికందే పరిస్థితి లేదు. మేత లేక పశువులు అల్లాడి పోతున్నాయి. పశుపోషణ భారమై అమ్ముకుంటున్నాం. గతంలో మహా అంటే 20, 25 రోజులు బెట్ట ఉండేది. పశువులను కాపాడుకునేందుకు బోదగడ్డి, జానాకు వంటివి తెచ్చి వేసేవాళ్లం. వానల్లేక ఇప్పుడు అది కూడా లేదు. – గోకారి, రైతు, పి.కోటకొండ, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లామూడు ఎకరాల్లో పత్తి అంతా పోయిందిమూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట అంతా ఎండిపోయింది. ఎకరాకు రూ.50వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. కోడుమూడు ప్రాంతంలో వర్షం అంతంత మాత్రమే కురిసింది. వేసిన పంట ఎండిపోయి పశువులకు మేత లేకుండా పోయింది. అందుకే అమ్ముకొంటున్నా. – వెంకటేష్, చిల్లబండ, కర్నూలు జిల్లామేత లేక అమ్మేస్తున్నానాకు నాలుగు ఎద్దులున్నాయి. పొలం గుత్తకు తీసుకొని పత్తి సాగు చేశా. వర్షాలు కురవక పంట వాడుముఖం పట్టింది. కరువు కారణంగా ఎద్దులకు గ్రాసం కూడా పెట్టలేని స్థితిలో వున్నా. వాటి పోషణ భారమై రెండు ఎద్దులను అమ్ముకొనేందుకు సంతకు తీసుకొచ్చా. – నర్సప్ప, రైతు, జగ్గాపురం నందవరం మండలం, కర్నూలు జిల్లాఎద్దులను అమ్ముకొని వలసపోతున్నాంఉన్న ఎద్దులకు మేతలేక, మేపలేక అమ్ముకొనేందుకు సంతకు తీసుకొచ్చా. నాకైతే పొలం కూడా లేదు. ఎవరైనా పొలం పనులకు పిలిస్తే ఎద్దులను బాడుగకు తీసుకొనిపోయేవాడిని. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు. వ్యవసాయ పనులకు పిలిచే రైతుల్లేరు. అందుకే కుటుంబంతో పాటు వలస వెళ్లాలనుకుంటున్నా. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటలు బాగున్నాయంటున్నారు. అక్కడికి పోవాలని ఆలోచిస్తున్నాం. – మాదన్న, గోనెగండ్ల, కర్నూలు జిల్లా -
కరువు కోరల్లో సీమ రైతు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తీవ్ర వర్షాభావం.. దానికి తోడు చంద్రబాబు ప్రభుత్వ దారుణ నిర్లక్ష్యం.. రాయలసీమను మరోమారు కరువు కోరల్లోకి నెట్టాయి. రైతాంగానికి భరోసాగా కరువు సహాయక చర్యలు అనేకం చేపట్టాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో రైతు కుటుంబాలు గుడ్లనీరు కుక్కుకుని బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నాయి. జూన్ నుంచి ఆగస్టు ముగింపు దశకు చేరుకున్నా సీమ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అరకొరగా పడిన వానలకు సాగు చేసిన పత్తి, వేరుశనగ, కంది, ఉల్లి, మొక్కజొన్న వంటి పంటలు తేమ అందక ఎండిపోతున్నాయి. కాలువల కింద వరి సాగుకూ నీటి కొరత వెంటాడుతోంది. దాంతో పొలాలు బీళ్లుగా మారుతుండగా.. పశువులకు గ్రాసం కరువై.. రైతు కుటుంబాలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నాయి. రైతులు ఎద్దులతోపాటు పాడి పశువులను, గొర్రెలను, మేకలను తెగనమ్ముకుంటున్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ కేసీ కాలువ, తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువలు, హంద్రీ కాలువల పరిధిలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల రైతులు కనీసం కొంతమేరైనా నీరివ్వాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. పంటలమీద ఆశవదులుకొని అటు తెలంగాణ, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. సెపె్టంబర్ మొదటివారం నుంచి వలసలు మరింతగా పెరగనున్నాయి. పశువులు తెగనమ్మి వలసబాట..కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన పల్లె ఈరప్ప కుటుంబం ఇది. నాలుగు ఎకరాల పొలంలో పత్తి సాగుచేసింది. ఎకరాకు రూ. 25 వేల చొప్పున రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. మూడు నెలల పైరు.. వర్షాలు లేక నిలువునా ఎండిపోయింది. ఈరప్పకు నలుగురు ఆడబిడ్డలు. కరువుతో గ్రాసం దొరకదన్న భయంతో 1.20 లక్షలకు కొన్న రెండు ఎద్దులను కూడా ఇటీవల నష్టానికి అమ్మేశాడు. బతుకుదెరువుకోసం తెలంగాణాకు వలస వెళ్లేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. కరువు ప్రభావం–5 దశలు 1) చినుకు లేదు.. 2) పంటల సాగు తగ్గింది 3) సాగు చేసిన పంటలు ఎండిపోయాయి 4) పశుగ్రాసం కొరత, పశువుల అమ్మకాలు 5) వ్యవసాయం దెబ్బతిని కుటుంబాలతో రైతుల వలసలు మొదట పొలాలు ఎండాయి.. తర్వాత పశువులు అమ్ముకున్నారు.. ఇప్పుడు కుటుంబాలతో సహా రైతులు వలసబాట పడుతున్నారు.!బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నా మాకు 4 ఎకరాల పొలం ఉంది. పత్తి పంట సాగు చేశా. ఎకరాకు రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.లక్ష ఖర్చు అయ్యింది. పంట ఎండిపోయింది. అప్పులు తీరేపరిస్థితి కనిపించడంలేదు. నా ముగ్గురు సోదరులు నెల క్రితం బెంగళూరుకు వలస వెళ్లారు. రెండు రోజుల క్రితం పత్తి పంట పొలాన్ని గొర్రెలకు మేతగా వదిలేశాను. నేను కూడా కుటుంబంతో బెంగళూరుకు వెలస వెళ్లాలని నిర్ణయించుకున్నా. – గాది లింగప్ప, రైతు, నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం కేసీకి నీళ్లివ్వక పొలం బీడుపడింది.. కేసీ కాలువకు శ్రీశైలం నుంచి కృష్ణ నీళ్లు విడుదల చేస్తేనే మా 8 ఎకరాల్లో వరిపంట సాగవుతుంది. ఈ ఏడాది ఇప్పటికీ నీళ్లు విడుదల చేయలేదు. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పొలం మొత్తం బీడుపడింది. వరి పండకపోతే తిండిగింజలు, పశువుల మేత దొరికే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఆదుకోవాలి. పశు గ్రాసమన్నా సరఫరా చేయాలి. – శీలం భాస్కర్రెడ్డి, విశ్వనాథపురం, చాపాడుమండలం. వైఎస్సార్ కడప జిల్లా. పంటలన్నీ దెబ్బతిన్నాయి...కర్నూలు4,34,996 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,44,171 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఆదోని, ఆలూరు, మంత్రాలయం ప్రాంతాల్లో పత్తి, వేరుశనగ, కంది, సన్ఫ్లవర్, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. 14 వేల హెక్టార్ల సాధారణ వరి సాగుకు 2 వేల హెక్టార్లలోపే సాగు జరిగింది. పంటలు ఎండిపోవడంతో ఈ ప్రాంత రైతులు వలసలకు సిద్ధమయ్యారు. కొందరు ఎద్దులను, ఇతర పశువులను అమ్ముకొని వలసపోగా మిగిలినవారు బెంగుళూరు, తెలంగాణా ప్రాంతాలకు వలసకు సిద్ధమయ్యారు. అనంతపురం 3,43,394 హెక్టార్ల సాధారణ సాగుకు 1,87,598 హెక్టార్లలోనే పంటలు వేశారు. 1.48 లక్షల హెక్టార్ల వేరుశనగ కేవలం 44 వేల హెక్టార్లలో సాగైంది. 22,868 హెక్టార్ల సాధారణ వరి సాగుకు 4,168 హెక్టార్లలోనే బోరుబావులకింద సాగు జరిగింది. వర్షాభావంతో చీనీ తోటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న, సజ్జ ఆముదం పంటలదీ ఇదే పరిస్థితి. కంది 90వేల హెక్టార్లలో సాగవుతోందని చెబుతున్నా వర్షాలు లేక పంట నిలువునా ఎండిపోతోంది. నంద్యాల2,20,230 హెక్టార్ల సాధారణ సాగుకు 1,33,039 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. 70,201 హెక్టార్లలో సాగవ్వాల్సిన వరి కేవలం 16 వేల హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న, కంది, మినుము, పత్తి పంటలూ వర్షాభావంతో దెబ్బతిన్నాయి. చిత్తూరు44,267 హెక్టార్ల సాధారణ సాగుకు కేవలం 10,026 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. 21,903 హెక్టార్ల వేరుశనగకు 2,615 హెక్టార్లు, 9,068 హెక్టార్ల వరికి 1,833 హెక్టార్లు, 1,495 హెక్టార్ల కందికి కేవలం 110 హెక్టార్లలో సాగు జరిగింది.మార్కాపురంకరువు తీవ్రతను సాగు గణాంకాలే చెబుతున్నాయి. 27,203 హెక్టార్ల సాధారణ కంది సాగు కేవలం 192 హెక్టార్లలో, 19,711 హెక్టార్ల పత్తి 3,953 హెక్టార్లలో. 6,202 హెక్టార్ల వరి కేవలం 33 హెక్టార్లలో. 3,104 హెక్టార్ల మొక్కజొన్న 331 హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశనగ, ఆముదం తదితర పంటలు సాగుకు నోచుకోలేదు. కడప76,469 హెక్టార్ల సాధారణ సాగుకు కేవలం 24,092 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. అంటే సాగు మూడోవంతు కన్నా దిగువకు పడిపోయింది. కేసీ కెనాల్ ఆయకట్టుతోపాటు తెలుగుగంగ, మైలవరం, చిత్రావతి, గండికోట తదితర ప్రాజెక్టుల పరిధిలో 33,078 హెక్టార్లలో వరి సాగుకావాల్సి ఉండగా కేవలం 9,327 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 22,469 హెక్టార్ల పత్తికి 7,742 హెక్టార్లు, 5,992 హెక్టార్ల కందికి కేవలం 352 హెక్టార్లలో సాగు జరిగింది. 1495 హెక్టార్లలో సాగుకావాల్సిన మొక్కజొన్న 1213 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 3745 హెక్టార్లలో సాగు కావాల్సిన మినుము 1488 హెక్టార్లలో సాగైంది. -
జూడాల స్టైపెండ్పైనా వెన్నుపోటు ముఠా పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: జూనియర్ వైద్యుల(జూడాల) స్టైపెండ్ పెంచకుండా తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వంపై బురద జల్లుతోంది. జూడాల స్టైపెండ్ తగ్గింపును గత ప్రభుత్వం సమర్థించిందని మంగళవారం ఓ మెమోను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేసి లబ్ధి పొందేందుకు కుటిలయత్నం చేసింది. అయితే, వాస్తవానికి జూనియర్ డాక్టర్ల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి స్టైపెండ్నూ పెంచి మేలు చేసింది. దీనికి బలమైన ఆధారాలు ఉండడంతో చంద్రబాబు సర్కారు దుష్ట కుయుక్తులు పారలేదు. జూనియర్ వైద్యులు గతంలో వైఎస్ జగన్ చేసిన మేలును గుర్తు చేసుకుని దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు. 2020లో జూడాల స్టైపెండ్ పెంచుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అసలేం జరిగిందంటే.. జూడాలకు స్టైపెండ్ చెల్లింపులకు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై వైద్య విభాగాధిపతుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2022లో నవంబర్ 28న వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి.. డీఎంఈకి ఓ మెమో జారీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్టైపెండ్ విధానాన్ని పరిశీలించాలని మాత్రమే ఆ మెమోలో సూచించారు. ఈ మెమోను గత వైఎస్ జగన్ సర్కారు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఇది జరిగిన కొద్దినెలలకే అంటే 2023లో బ్రాడ్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్తో సమానంగా తమ స్టైపెండ్స్ పెంచాలని సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొద్ది నెలల వ్యవధిలోనే స్టైపెండ్స్ పెంచుతూ 2023 అక్టోబర్ 10న వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 624 విడుదల చేసింది. దీంతో మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.70 వేలు, రెండో ఏడాదికి నెలకు రూ.72 వేలు, మూడో ఏడాదికి నెలకు రూ.74 వేల మేరకు అప్పట్లో స్టైపెండ్లు పెరిగాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ఆ మెమో.. వైద్య శాఖ అధికారుల మధ్య సమాచార మార్పిడికి జారీచేసింది మాత్రమేనని తేటతెల్లమైంది. దీనిని అప్పటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోకపోయినా చంద్రబాబు సర్కారు దానిపై దుష్ప్రచారం చేస్తోంది.కోవిడ్ విపత్తులోనూ స్టైపెండ్ పెంపు 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది తిరగకుండానే కోవిడ్ మొదలైంది. 2021, 2022లో వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఆ సంక్షోభ పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ సర్కార్ జూడాల స్టైపెండ్ కోతకు ఆలోచన కూడా చేయలేదు. వరుసగా 2020, 2022, 2023, 2024లలో జూడాల స్టైపెండ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచింది. ఆయుష్ వైద్య విద్యార్థులకూ అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైపెండ్ పెంపును వర్తింపజేసింది. 2009లో ఇచ్చిన 287 జీవో ప్రకారం 15 శాతానికంటే అధికంగా మొత్తంగా 42.4శాతం స్టైపెండ్ వైఎస్ జగన్ పెంచారు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు వర్తింపజేశారు. ఇలా వైఎస్ జగన్ చేసిన మేలు కళ్లెదుటే కనిపిస్తుంటే బాబు సర్కార్ దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గిరిజన టీచర్లపై పోలీస్ ప్రతాపం
సాక్షి, అమరావతి/ తాడేపల్లి రూరల్: తమ ఉద్యోగాలు రెన్యువల్ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ఆందోళన చేపట్టిన గిరిజన టీచర్లపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆందోళన విరమించి వెళ్లకపోతే కేసులు పెడతామని బెదిరించి, వారి ఆందోళనను భగ్నం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం గిరిజన టీచర్లు శాంతియుత ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకోవడం పట్ల గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన గురుకులాల్లో 10–15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చంద్రబాబు, సంధ్యారాణి ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అదే హామీని అసెంబ్లీలోను మంత్రి సంధ్యారాణి ప్రస్తావించారని చెప్పారు. ఈ హామీని అమలు చేయకుండా మూడునెలలుగా తమ కుటుంబాలను రోడ్డున పడేశారని చెప్పారు. గతేడాది డీఎస్సీలో తమ పోస్టులు కలపవద్దని కోరినా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం గురుకులం బైలాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని తమ ఉపాధిని దెబ్బతీసిందని విమర్శించారు. ఇటీవల 15 రోజులు ఆందోళన చేయడంతో ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీలను భర్తీచేసి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఈ మాటలు చెప్పి నెలరోజులు గడుస్తున్నా.. ఔట్ సోర్సింగ్ టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వలేదని యూనియన్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో గిరిజన గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జుననాయక్, నాయకులు పరమేశు, మస్తానుబాబు, రామకృష్ణ, కళ్యాణ్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు సంపద సృష్టి అంటే ఇదేనా?’
తిరుపతి: ఏపీలో మద్యం ఏరులై పారుతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రీమియం లిక్కర్ బ్రాండ్లకు సైతం తలుపులు తెరిచి మరీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్లాన్ చేశారన్నారు. చంద్రబాబు సంపద సృష్టి అంటే ఇదేనా? అని ప్రశ్నించారు భూమన. ‘మద్యం సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. 5వేలకు పైబడిన మద్యానికి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో 535 తీసుకు వచ్చింది. ప్రీమియర్ లిక్కర్కు బార్లా తలుపు తెరిచింది. ప్రతి చోట మద్యం దుకాణాలు.. ఊరూ-వాడ తేడా లేకుండా బెల్ట్ షాపులు విక్రయాలు సాగిస్తున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రజల రోగ్యం పూర్తిగా గాలికి వదిలి వేసింది. రాష్ట్రంలో 3లక్షలకు పైగా బెల్ట్ షాపులు విళయ తాండవం చేస్తున్నాయి. మద్యం తాగాలి.. తూగాలి అనే నినాదం తో వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఖరీదైన మద్యం అమ్మకాలు ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. రూ. 20 లక్షల కోట్లు పరిశ్రమలు వచ్చాయని ఉదరకొడుతున్నారు.. అది ఇదేనా.?’ అని నిలదీశారు.మీరెన్ని కేసులు పెట్టినా.. నా గొంతు ఆగదు: అంబటి -
ఆగస్టు 25.. ఎన్టీఆర్ జీవితంలో చీకటి రోజు
-
నువ్వు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి...? దమ్ముంటే చర్చకు రండి...
-
సంపద సృష్టి పోయి అప్పుల ముష్టి.. ఈ వార్త చూస్తే బాబుగారు ఎదో ఉద్ధరిస్తున్నాడు అనుకుంటాం
-
స్థానిక ఎన్నికల్లో ఏమైనా ఓవర్ యాక్షన్ చేయాలని చూస్తే... జగనన్న మాతో చెప్పిన విషయాలు ఇవే
-
స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికలు–బలమైన అభ్యర్థులుస్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతోపాటు బలం లభిస్తుంది. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికీ వెనకాడవద్దు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలిఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయంఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కో-ఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటా. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారన్నదానిపైనా నివేదికలు తీసుకుంటా. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే, మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు.గ్రామస్థాయి ప్రచార కార్యక్రమం“వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన”పై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలి. ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామగ్రిని పార్టీ అందిస్తుంది. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం జరగాలి.14–15 లక్షల గుర్తింపు కార్డులుపార్టీ కేడర్ కోసం దాదాపు 14–15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయి. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తాం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలి. సమావేశాల్లో గుర్తింపు కార్డులతోపాటు ఇంటింటి ప్రచార సామగ్రినీ కేడర్కు పంపిణీ చేయాలి. గుర్తింపు కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది; కార్యకర్తలు తమ ఫోన్లలోనే సమాచారాన్ని పొందవచ్చు. సెప్టెంబరు 5,6,7 తేదీల్లో ఒకరోజు ఏదో ఒకరోజు జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. సెప్టెంబరు 8,9,10,11 తేదీల్లో ఏదో ఒకరోజు అసెంబ్లీ నియోజవకర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. ఇక మండల, వార్డు, డివిజన్ స్థాయిల్లో సెప్టెంబరు 12 నుంచి 22 వరకూ సమావేశాలు నిర్వహిద్దాం. లీగల్, మీడియా సెల్స్ యాక్టివ్గా ఉండాలిప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్లను వెంటనే బలోపేతం చేయాలి. పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కేడర్పై దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉంది; కార్యకర్తలను రక్షించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్ సెల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేయాలి. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలి. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్, మీడియా వ్యవస్థలన్నీ ఒకే యూనిట్గా పనిచేయాలి.సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యంప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి, మిగిలిన వారినీ యాక్టివేట్ చేయాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపైకి మొత్తం పార్టీ కేడర్ను తీసుకురావాలి. సోషల్ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలి. జగన్ 2.0 సూపర్ యాప్, వైయస్సార్సీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాలి. పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవాలి. పార్టీ కేడర్కు వాస్తవ సమాచారం, అవసరమైన న్యూస్ కంటెంట్ నిరంతరం అందాలి. నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వ్యక్తిగతంగా కలిసి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరాలి. ఎందుకంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రతికూల మీడియా వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం.నాయకులకు హెచ్చరికనియోజకవర్గాల్లో మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్స్పై యాక్టివ్గా లేని నాయకులు ఇప్పటికైనా గేర్ మార్చాలి. నాయకులు కార్యకలాపాలను తమ నియంత్రణలోకి తీసుకోకపోతే కార్యకర్తలు నష్టపోతారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైయస్సార్సీపీ–కూటమి పాలన మధ్య తేడాను వివరించాలి.ఈగోలకు తావులేదుస్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలి. తొమ్మిది ఓట్లతో గెలిచిన సందర్భాలు, తొమ్మిది ఓట్లతో ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటూ కీలకమే. “జో జీతా వహీ సికందర్”.. గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి. ప్రతి గ్రామంలో పార్టీని బలంగా కన్సాలిడేట్ చేసి, సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం సృష్టించాలి. రాబోయే 60–70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టిపెట్టాలి. సరైన శ్రద్ధ, పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటే స్థానిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాంవాళ్ల పేర్లు డిజిటల్ బుక్లోకి..పోలీసు అధికారులు పదవిని దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. కానీ అలా జరగడం లేదు. కార్యకర్తలను వేధించే, అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తప్పవు. ప్రతి పోలీసు అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థలో నిష్పాక్షికత తీసుకురావడానికి పార్టీ నాయకులు గట్టి ప్రయత్నం చేయాలి అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: ఆలయాల విధ్వంసం.. పవన్ కంటికి కనిపించడం లేదా? -
నా ఛానల్ లో ఆ సాంగ్ పెట్టినందుకు నాపై ఎన్ని కేసులు పెట్టారంటే...
-
ఆరోజు అలా చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఉష శ్రీ చరణ్ మాస్ వార్నింగ్
-
రెండేళ్లకే మోగుతున్న రెడ్ సైరన్.. ఈ కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది
-
ఆ 8లక్షల డబ్బు లిక్కర్ స్కామ్ కావు కారుమూరి అక్రమ అరెస్ట్ పై నాగార్జున యాదవ్
-
మీరెన్ని కేసులు పెట్టినా.. నా గొంతు ఆగదు: అంబటి
సాక్షి, గుంటూరు: తనపై నమోదైన కేసులన్నీ ప్రస్తుతం ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఛార్జ్షీట్లు దాఖలు చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఒకే ఘటనకు సంబంధించి పలు కేసులు నమోదు చేసి తనను వేధించాలని చూస్తున్నారని చెప్పారు. రాజకీయ విమర్శలు చేసినందుకే కేసులు పెడుతున్నారని, వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.తనపై వరుస కేసుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు సీఐడీతో పాటు మరో కేసు నమోదు చేశారని, ఇటీవల పట్టాభిపురం పోలీసులు కూడా తనపై కేసు పెట్టారని తెలిపారు. తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో ‘ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన పార్టీ’ అంటూ పాటను పోస్టు చేశానని చెప్పారు. చంద్రబాబు తరచూ ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా ‘వెన్నుపోటు పార్టీ’ అంటూ రాజకీయ వ్యంగ్యంతో పోస్టు చేశానన్నారు.ఎన్టీఆర్ మీద కృష్ణ సినిమాలే తీశారువైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏఐ వీడియోలతో అత్యంత అవమానకరంగా పోస్టులు పెట్టిన వారిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని అంబటి ఆరోపించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు, వ్యంగ్యాలు ప్రజాస్వామ్యంలో సాధారణమేనన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని అంబటి నిలదీశారు.‘‘రాజకీయ విమర్శలు చెయ్యకూడదా?. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై వ్యంగంగా అనేక చర్యలు కనిపించాయి. ఎన్టీఆర్ను పోలిన వేషధారణతో క్యారెక్టర్తో హీరో కృష్ణ ఏకంగా సినిమాలు తీశారు. ఆ కాలంలో ఇలాంటివేవీ జరగలేదే’’ అని అంబటి గుర్తు చేశారు.‘కేసులకు భయపడేది లేదు’కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ప్రాంతాలలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఐజీ త్రిపాఠికి వాటాలు వస్తున్నాయి. పోలీసులే గంజాయి అమ్మి ఐజీకి డబ్బులు ఇస్తున్నారు. అందరూ కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారు అని అన్నారు. రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తోంది టీడీపీ కాదని, ‘వెన్నుపోటు పార్టీ’ అని విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా రాజకీయ విమర్శలు చేయడం ఆపబోనని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బాలయ్య తంతారేమోనని భయపడి.. -
పవన్కు ఇవేవీ కనిపించడం లేదా?: భూమన
సాక్షి, తిరుపతి: పురాతన ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. సనాతనిగా తనను తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇవేవీ కనిపించడం లేదా? అని నిలదీశారు. మంగళవారం ఈ వ్యవహారం భూమన కరుణాకర్ స్పందించారు. కడప–చెన్నై రహదారి వెంట ఉన్న అనేక ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేణిగుంట–రైల్వే కోడూరు మార్గంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించడంపై తీవ్రంగా మండిపడ్డారు.అంజనేయపురం గ్రామానికి ఆ ఆలయం వల్లే ఆ పేరు వచ్చిందని భూమన పేర్కొన్నారు. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య తిరుమలకు అడవి మార్గంలో వెళ్తూ ఇక్కడి స్వయంభూ ఆంజనేయస్వామిని పూజించిన చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో 1871లోనే అంజనేయపురంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.‘తెల్లోడు కాపాడితే.. నల్లోడు కూల్చేస్తున్నాడు’బ్రిటిష్ పాలకులు ఆలయాలను సంరక్షిస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు వాటిని కూల్చేందుకు సిద్ధమవుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. తిరుపతి–చెన్నై మార్గంలోని నగరి సమీపంలోని కీలపట్టు సర్కిల్లో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఇప్పటికే కూల్చివేశారని చెప్పారు. 1993లో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఆలయాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారని ఆరోపించారు.‘పవన్కు కనిపించడం లేదా?’సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఆలయాల ధ్వంసం కనిపించడం లేదా? అని భూమన ప్రశ్నించారు. ‘‘అన్న ఆలయాన్ని ప్రారంభిస్తే.. తమ్ముడు అధికారంలో ఉండగా అదే ఆలయాన్ని కూల్చివేశారు. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ?’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్న భూమన.. ఆలయాల పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రఘురామరాజుపై కేసు ఏదీ? -
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
-
YS జగన్ పాలనలో విద్యా వికాసం, ఇప్పుడు విధ్వంసం
-
కూటమి సర్కార్ పై ఉద్యోగుల దండయాత్ర...!
-
సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలే అనేందుకు ఇది మరో తార్కాణం!! 2026–27 బడ్జెట్లో రాజధాని నిర్మాణ పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, అందులో రెండో త్రైమాసికానికి రూ.1,200 కోట్లను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనులకు బడ్జెట్ నుంచి ఒక్క పైసా కేటాయించడం లేదని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.. రాజధాని కోసం చేస్తున్న అప్పులను అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూమి అమ్మి తీర్చుతామని.. పైసా భారం కూడా ప్రజలపై పడదని.. అమరావతి ‘సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు’ అని ఆయన తరచూ చెబుతుంటారు. కానీ, అది పచ్చి అబద్ధమని తేలిపోయింది. రాజధాని కోసం 2014–19 మధ్య హడ్కో నుంచి రూ.1,151.60 కోట్లు, బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,862 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు.. వెరసి– రూ.5,013.60 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పును తీర్చేందుకు 2026–27 బడ్జెట్లో రూ.836.26 కోట్లు కేటాయించి, ఇప్పటికే రూ.421.99 కోట్లను చెల్లించారు. అంటే రాజధాని నిర్మాణ పనుల కోసం చేస్తున్న అప్పులను తీర్చేందుకు రాష్ట్ర ఖజానా నుంచే నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే కౌలు, పెన్షన్లకు రూ.3,077.63 కోట్లు రాష్ట్ర విభజన తర్వాత 2014లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలను రాజధానిగా చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం 53,748 ఎకరాలు (217.23 చదరపు కిలోమీటర్లు)ను ల్యాండ్ పూలింగ్(భూసమీకరణ) కింద సమీకరించింది. ఇందులో 29,892 మంది రైతుల నుంచి 35,351 ఎకరాలను సమీకరించింది. పదేళ్లపాటు కౌలు చెల్లించడంతోపాటు పదేళ్లలోగా అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక 2024లో చంద్రబాబు సర్కార్ మళ్లీ అధికారంలోకి రాగానే కౌలు చెల్లింపును మరో ఐదేళ్లపాటు పొడిగించింది. గత 12 ఏళ్లుగా 29,892 మంది రైతులకు రూ.2,214.12 కోట్లను రాష్ట్ర ఖజానా నుంచే కౌలు రూపంలో చెల్లించారు. 2015లో రాజధాని రైతులకు రుణ మాఫీ రూపంలో రూ.85.19 కోట్లు, 17,525 మంది వ్యవసాయ కూలీలకు జూలై వరకూ రూ.778.31 కోట్లను పెన్షన్ రూపంలో చెల్లించింది. వెరసి ఇప్పటికే కౌలు, పెన్షన్, రుణ మాఫీ రూపంలో రాజధాని రైతులు, రైతు కూలీలకు రాష్ట్ర ఖజానా నుంచే రూ.3,077.63 కోట్లు వ్యయం చేసింది.అప్పులు.. స్కాములు.. ఆర్థిక సంక్షోభం2.29 లక్షల ఎకరాలు.. 4.58 లక్షల కోట్ల అప్పు + వడ్డీలు.. వందల ఏళ్లు.. ఇదీ చంద్రబాబుగారి కలల రాజధాని పరిస్థితి. ఇదంతా కలల్లోనే.. నిజానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికి చంద్రబాబుగారు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది.. రాజధాని నిర్మాణం కోసం 2024, జూన్ 12 నుంచి ఇప్పటివరకూ ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ.. హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వద్ద ఇప్పటికే రూ.47,687 కోట్లు అప్పు చేసింది. ఇక రాజధాని కోసం 2015లో 53,748 ఎకరాలు(217.23 చదరపు కిలోమీటర్లు) సమీకరించిన సర్కార్.. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 20,494 ఎకరాల(82.9 చకిమీలు) సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ ప్రక్రియను ప్రారంభించింది. తాజాగా రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2,344.12 ఎకరాల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతటితో ఈ భూసమీకరణ ప్రక్రియ ఆగదని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. కొత్తగా సమీకరిస్తున్న మోతడకతోపాటు.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాల (626.67 చదరపు కిలోమీటర్లు) మేర రాజధాని విస్తరణకు అవసరమైన మాస్టర్ ప్లాన్ను రూపొందించే బాధ్యతను సింగపూర్కు చెందిన సుర్బానా–జురాంగ్ సంస్థకు రూ.45.14 కోట్లకు అప్పగించింది. అంటే.. మొత్తం 2,29,095 ఎకరాలలో(926.8 చ.కి.మీ.లు) రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి 29 గ్రామాల్లో 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికే వందేళ్ల సమయం పడుతుందని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల ప్రభుత్వమే చెప్పింది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందన్నది అంచనా వేయలేని పరిస్థితి. ఇక చంద్రబాబు సర్కార్ కేంద్రానికి సమరి్పంచిన డీపీఆర్ల ప్రకారమే రాజధాని నిర్మాణంలో రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయమవుతుందని పేర్కొంది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్ల అవసరం అవుతాయి. ఆ అప్పు, వడ్డీతో కలిసి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో!? ఈ అప్పును వడ్డీతోసహా రాష్ట్ర ఖజానా నుంచే అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. దీన్ని బట్టి చూస్తే స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాదు.. రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి సీఎం చంద్రబాబు నెడుతున్నారంటూ విద్యార్థులు, ఆర్థికవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల(జూడా)ను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని స్టైపెండ్ను 15 శాతం కంటే మెరుగ్గా పెంచాలని జానియర్ డాక్టర్లు కోరుతుంటే కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని ప్రభుత్వం చెప్పడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో జీవో 287లో నిర్దేశించిన 15 శాతం కంటే అధికంగా.. మొత్తంగా 42.4 శాతం స్టైపెండ్ పెంచామని గుర్తు చేశారు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు వర్తింపజేశామన్నారు. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచామని చెప్పారు. ఇప్పటికైనా అహంకారం వీడి, జూడా ప్రతినిధులతో వెంటనే చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చంద్రబాబుకు సూచించారు. తగిన స్థాయిలో స్టైపెండ్ పెంచి, సమ్మెను విరమింపజేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెండు వారాలైనా స్పందించరా?‘రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలు కావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపేశారు? జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరి కారణం కాదా? ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేపట్టాం. ఐదింటిని పూర్తి చేసి, తరగతులు కూడా ప్రారంభించాం. మరో కాలేజీని క్లాసులకు సిద్ధం చేశాం. ఇలా మొత్తంగా 6 కళాశాలలు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తి చేయాల్సి ఉండగా, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. డబ్ల్యూహెచ్వో/జీఎంపీ ప్రమాణాలు ఉండే మందులు లేక ప్రభుత్వాస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్య రంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. -
కూటమి ఇంత దిగజారుతోంది వాళ్ల టార్గెట్ బిసీలే..! కడిగిపారేసిన విడదల రజిని
-
చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: వైఎస్సార్సీపీ బీసీ నేతలు
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలను దగా చేస్తోందని వైఎస్సార్సీపీ బీసీ నేతలు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య బీసీ నేతలు వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వెన్నుపోటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలైన 50 ఏళ్లు దాటిన మహిళలకు రూ.4 వేల పెన్షన్, కురువ, చేనేత, రజక, నాయిబ్రాహ్మణ తదితర కులవృత్తుల సంక్షేమ పథకాలను నిలిపివేసి తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశంలో చట్టబద్ధత లేకుండా కేవలం జీవో నంబర్ 105 ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, గతంలో వైఎస్.జగన్ 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయిస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. మరోవైపు మంత్రివర్గంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు, ప్రశ్నించే బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై అక్రమ కేసులు, భౌతిక దాడులతో కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.వైఎస్.జగన్ ప్రభుత్వంలో బీసీలంటే 'బ్యాక్వర్డ్ క్లాసెస్' కాదు, వారు సమాజానికి 'బ్యాక్ బోన్ క్లాసెస్'గా గుర్తించారని గుర్తుచేశారు. డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లకు పైగా సంక్షేమ నిధులను నేరుగా బీసీల ఖాతాల్లో జమ చేయడమే కాకుండా, 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, రాజ్యసభ, లోకల్ బాడీస్, నామినేటెడ్ పదవుల్లో సింహభాగం కేటాయించి రాజకీయంగా, ఆర్థికంగా వారికి ఆత్మగౌరవం కల్పించారని వివరించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోటు, వంచనా పూరిత రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జోనల్ స్థాయిలలో విస్తృతంగా సదస్సులు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కూటమి సర్కారుకు బీసీ సమాజం ద్వారా తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు స్పష్టం చేశారు.చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై రీజనల్ స్థాయి నుంచి పోరాటంతాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సుదీర్ఘంగా బీసీ నేతల సమావేశం నిర్వహించాం. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ బీసీలను మోసం చేస్తున్నారు. బీసీలకు వెన్నుముక అని చెప్పి వెన్నుపోటు పొడిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. టీడీపీ మోసపూరిత విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు రీజనల్, జిల్లా, మండల స్థాయిల్లో సదస్సులు నిర్వహిస్తాం. చంద్రబాబు నాయుడు పాలనలో బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డిగారు నేరుగా డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లు బీసీల ఖాతాల్లో వేశారు. అమ్మ ఒడి, అన్నదాత సుఖీభవ, చేనేతలకు ఇచ్చే సాయం వంటి పథకాలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది.స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పేరుతో జీవో నంబర్ 105 ఇచ్చి చంద్రబాబు మరో పెద్ద డ్రామాకు తెరలేపారు. గతంలో వైయస్. జగన్మోహన్రెడ్డి 34 శాతం రిజర్వేషన్ ఇస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్న ఘనత చంద్రబాబుదే. ఉప ముఖ్యమంత్రి స్థానంలో బీసీ నేతను కూర్చోబెట్టకుండా కూటమి ప్రభుత్వం తీవ్ర అవమానం చేసింది.-చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబుకు దమ్ముంటే తేల్చి చెప్పాలిఅసెంబ్లీ సాక్షిగా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. స్థానిక సంస్థల్లో బీసీలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?. అమలు కాని జీవోలను అడ్డుపెట్టుకుని పాలాభిషేకాలు చేయించుకుంటూ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా 139 కులాల ప్రతినిధులం ఒక్కటయ్యాం. ఇందుకోసం జోనల్, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కార్యాచరణ చేపడతాం. ఐదేళ్ల పాలనలో బీసీలను రాజ్యాధికారంలో నిలబెట్టి బ్యాక్ బోన్గా మార్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి.ప్రశ్నించే బీసీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, భౌతిక దాడులకు దిగుతోంది. కారుమూరి నాగేశ్వరరావు,వారి కుమారుడు కారుమూరు సునీల్, డాక్టర్ సీదిరి అప్పలరాజు, నేను, నా తమ్ముడు, అదే విధంగా చింతాడ రవికుమార్, విడదల రజిని సహా పలువురు వైఎస్సార్సీపీ బీసీ నేతలపై అక్రమ వేధింపులు కొనసాగుతున్నాయి. కూటమి నేతలు ఊదరగొడుతున్న రెడ్ బుక్ ఇప్పటికే డెడ్ బుక్ అయిపోయింది, త్వరలోనే డెత్ బుక్ కాబోతోంది. బీసీల గొంతు నొక్కాలని చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారు.బలహీన వర్గాల వారందరం ఒక తాటి మీదకు వచ్చి వైయస్.జగన్ ని సీఎం చేసుకోబోతున్నాం.-జోగి రమేశ్, మాజీ మంత్రిబీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా?వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ నాయకులందరం గళమెత్తాం. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే చెల్లని 34 శాతం రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చి బీసీలను వాడుకుంటున్నారు.తెచ్చిన జీవో ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం రాజీనామా చేస్తుందా?.వైయస్. జగన్మోహన్రెడ్డి హయాంలో ముగ్గురు బీసీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సముచిత గౌరవం కల్పించారు.చంద్రబాబు తన మంత్రివర్గంలో బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం బీసీలకు తీవ్ర అవమానం.పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన చంద్రబాబుకు ఒక బీసీని తన పక్కన కూర్చోబెట్టుకునే మనసు రాలేదు.బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఎన్నికల ముందు బీసీలను వెన్నుముక అని పొగిడి, గెలిచాక తలలోని వెంట్రుకలా తీసిపారేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను బీసీలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరం ఐక్యంగా పోరాటం చేస్తాం.-రమేష్ యాదవ్, ఎమ్మెల్సీమేనిఫెస్టో హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీసీలను తీవ్రంగా వంచిస్తున్నారు. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ తరపున చేపట్టబోయే బీసీ ప్రజా పోరాట కార్యాచరణపై విస్తృతంగా చర్చించాం.వైయస్.జగన్మోహన్రెడ్డిహయాంలో రూ.4.5 లక్షల కోట్ల సంక్షేమంలో రూ.2 లక్షల కోట్లకు పైగా బీసీలకే నేరుగా అందించాం. కూటమి 27 నెలల పాలనలో బీసీలకు ఇచ్చిన ఒక్క ప్రధాన హామీ కూడా అమలు కాలేదు. 50 ఏళ్లు నిండిన బీసీ మహిళలకు ఇస్తామన్న రూ.4,000 పెన్షన్ హామీపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ లేదు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పి, వైఎస్సార్సీపీ బీసీ నేతలపైనే అక్రమ కేసులు, దాడులు చేయిస్తున్నారు. సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే అసెంబ్లీలో 34 శాతం రిజర్వేషన్ డ్రామా ఆడారు. గతంలో వైయస్. జగన్ ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నిరుపేద బీసీలు తీవ్ర వైద్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు నేటికీ చైర్మన్లను నియమించకుండా నిధులు నిలిపివేశారు.-విడదల రజని, మాజీ మంత్రిబీసీ డిక్లరేషన్ అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలిగత రెండు ఆర్థిక సంవత్సరాలు, మూడు బడ్జెట్లలో బీసీలకు కేటాయింపుల్లో లయన్ షేర్ ఎక్కడా కనిపించలేదు. 50 ఏళ్లు దాటిన మహిళలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దానిపై నోరు మెదపడం లేదు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి మహిళ అయి ఉండి కూడా బీసీ మహిళల సమస్యలపై చర్చకు రావడం లేదు.కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 34 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తేవాలి.గతంలో వైయస్. జగన్ రిజర్వేషన్లు ఇస్తుంటే కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు నేడు బీసీల ముందు నవ్వులపాలయ్యారు.కురువ కులస్తులకు గుడికట్లు పూజారుల గౌరవ వేతనం రూ.5,000 ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారు. చేనేతలకు ఇచ్చే పథకాల్లో తీవ్ర కోతలు పెట్టి, అర్హులైన వేలాది మంది పేర్లను తొలగించారు.టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణులకు జగన్మోహన్రెడ్డి అందించిన ప్రోత్సాహకాలను కూటమి సర్కార్ రద్దు చేసింది. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలను మోసం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు.-ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రిబీసీలకు నిజమైన సాధికారత అందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేచంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో బీసీలకు జరిగిన లబ్ధికి, జగనన్న ఐదేళ్ల పాలనలో జరిగిన లబ్ధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దాదాపు రెండు దశాబ్దాల రాజకీయాల్లో చంద్రబాబు బీసీలను రాజ్యసభకు ఒకరిద్దరిని పంపించి ఉంటారు. కానీ వైయస్.జగన్ నలుగురు బీసీలను పెద్దల సభకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓసీ జనరల్ స్థానాల్లోనూ బీసీలకు మేయర్లు, చైర్మన్లుగా జగన్ గారు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సింహభాగం ఇచ్చి జగన్మోహన్రెడ్డి ముందు నిలిచారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నా 34 శాతం రిజర్వేషన్లకు ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేకపోయారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే ఎన్నికల ముందు చంద్రబాబు ఉత్తుత్తి జీవోలను తెస్తున్నారు. చంద్రబాబు బీసీలను కేవలం పాత కులవృత్తులకే పరిమితం చేయాలని చూశారు తప్ప ఉన్నత స్థానాలకు చేర్చలేదు. గతంలో నాయిబ్రాహ్మణులపై చంద్రబాబు చూపిన అహంకారపూరిత వైఖరిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.27 నెలల కూటమి పాలనలో బీసీ నేతలపై పీడీ యాక్ట్లు, 307 అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు.నేటి యువత, బీసీలు చైతన్యవంతంగా ఉన్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పదు.-మార్గాని భరత్, మాజీ ఎంపీ -
బాబూ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?
ఆంధ్రప్రదేశ్లో విశ్వసనీయతతో కూడిన రాజకీయానికి, బుకాయింపు రాజకీయానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. డీఎస్సీ అక్రమాలపై సాక్ష్యాధారాలు చూపుతూ మీడియా సమావేశంలో వివరించడమే కాకుండా, వైఎస్సార్సీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేసిన ఆరోపణలు అన్నింటికి జవాబు ఇచ్చిన తీరు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచిందని చెప్పాలి.ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చంద్రబాబు, మంత్రి లోకేష్లు డీఎస్సీపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి, విపక్షం ఉన్న శాసనమండలిలో అసలు చర్చకే వెనుకాడడం, దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఏపీపీఎస్సీపై ఆరోపణలు చేసిన వైనంతో వారు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో లోకేష్ పరిణితితో వ్యవహరించలేకపోతే, చంద్రబాబు మాత్రం డబాయింపు విధానాన్ని అనుసరించారన్న అభిప్రాయం కలుగుతుంది. అన్నింటికి మించి డీఎస్సీ, ఏపీపీఎస్సీలు రెండిటి పైన సీబీఐ విచారణకు అప్పగించాలని జగన్ సవాల్ విసరడంతో చంద్రబాబు, లోకేష్లకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.మామూలుగా అయితే జగన్ మీడియా సమావేశం పూర్తి కాగానే టీడీపీ అధినేతలు దానికి కౌంటర్గా వారే మాట్లాడడం కాని, లేదా పార్టీ ఇతర నేతలతో కాని జవాబు ఇప్పించేవారు. కాని అలా చేసినట్లు కనిపించలేదు. అసెంబ్లీలో వీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూటమి ఎమ్మెల్యేలు దాదాపు మౌన ప్రేక్షకుల మాదిరిగానే ఉన్నారనిపించింది. దాదాపుగా ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం, ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న దానిలో హేతుబద్దత లేదన్న భావన కలుగుతున్నా వాటిని ఎత్తిచూపలేకపోవడం వారి బలహీనతగా తీసుకోవాలి. టీచర్ల నియమాకాలకు సంబంధించి జరిగే డీఎస్సీ ప్రక్రియలో, ప్రత్యేకించి క్రీడా రిజర్వేషన్ విభాగంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ నిర్దిష్ట ఆధారాలతో ఆరోపిస్తోంది. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు పోరాటం చేశారు. వెంటనే ఆ అక్రమాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాని అధికార టీడీపీ చర్చకు ముందుకు రాలేదు. పోనీ అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు పెట్టకుండా ఉంటే అదో పద్దతి అనిపించేది. చంద్రబాబు, లోకేష్లు డీఎస్సీ అక్రమాలు జరగలేదని చెప్పడానికి చేసిన వాదనలో చాలా లోపాలు కనిపించాయి. జగన్ చేసిన ఆరోపణలు ఒక్కోదానికి క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోయారు. వాటిలో కొన్నిటిని పరిశీలించండి.జగన్ తన వాదనలో ప్రధానంగా క్రీడా కోటాలో 372 పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చిన విదానాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం రెండు జీఓలు ఇచ్చి, వారికి ఉద్యోగాలు ఇచ్చేశాక మళ్లీ ఆ జీఓలను రద్దు చేస్తూ వేరొక జీఓ ఇవ్వడం గురించి జగన్ ప్రస్తావించారు. తమకు కావల్సినవారికి ఉద్యోగాలు ఇచ్చి, తదుపరి గేట్లు మూసివేశారా అన్నది ఆయన వేసిన ప్రశ్న. దీనికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా జవాబు ఇచ్చినట్లు కనిపించలేదు. ప్రఖ్యాత క్రీడాకారిణి పీవీ సింధూతో ఈ టీచర్లను లోకేష్ పోల్చడాన్ని యావన్మంది తప్పుపట్టారు. ఈ విషయం కూటమి ఎమ్మెల్యేలకు కూడా అర్థం అయి ఉండాలి. కాని అధికార పక్షంలో ఉన్నందున వారు అడగలేకపోయి ఉంటారు. లోకేష్ తీరు ఇమ్మెచ్యూర్గా ఉందని పలువురు విశ్లేషకులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మేధావులు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖల ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారో అర్థం కాదు. కేవలం స్థానికంగా ఆటలలో పాల్గొంటే చాలన్న పద్దతి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండి ఉండదు. చిత్రంగా జాతీయస్థాయి క్రీడలలో మెడల్స్ సంపాదించిన కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వారు బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించడం, ఆ తర్వాత అతనిని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం, పరీక్ష పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఒకరికే అప్పగించడం వంటివాటిని లోకేష్ సమర్ధించుకున్న తీరు కూడా అంత బాగోలేదు.టీచర్ల పోస్టులకు బేరాసారాలు సాగిన ఆడియో తదితర విషయాలను కూడా జగన్ ఆధారసహితంగా చూపించారు. చంద్రబాబు, లోకేష్లు ఇచ్చిన సమాధానాలలో పరస్పర విరుద్దంగా ఉన్న అంశాలను కూడా ప్రస్తావించారు. జగన్ లేదా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసినంతనే లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. కాని తన వైపు తప్పులేదని చెప్పుకోవడానికి ఆయన పడిన పాట్లు, ఆయనను రక్షించడానికి తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన యత్నాలు అందరికి అర్థం అయిపోయాయన్నది పలువురి భావన.చంద్రబాబు తనదైన శైలిలో ఎదురుదాడి చేయడానికి యత్నించారు. పనికట్టుకుని ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ, తన జీవితంలోనే ఎన్నడూ ఇలాంటి కుంభకోణం చూడలేదంటూ పెద్ద హడావుడి చేయాలని ఆయన తలపెట్టారు. కాని అది పండలేదు. అసెంబ్లీలో అయినా, బయట అయినా ఆయన ఎంత గట్టిగా మాట్లాడితే, అంత అసత్యం అయి ఉంటుందని, గతంలో వైఎస్సార్సీపీలో ఉండి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటుండేవారు. పనికట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అధికారి గురించి చంద్రబాబు ప్రస్తావించడంపై రకరకాల చర్చలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబుపైన పలు కీలకమైన కేసులు రావడానికి ఆ అధికారి కారణమన్న కోపం ఉండి ఉండవచ్చని, దానిని ఈ సందర్భంగా బయటపెట్టారని కొందరు అంటున్నారు.అయితే జగన్ తన వివరణలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్నిటిని పటాపంచలు చేసే విధంగా మాట్లాడారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు తమ ప్రభుత్వంలో జరిగాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. అసలు సంబంధం లేని డిజిటల్ వాల్యుయేషన్, హాయ్ లాండ్ ఇష్యూలను తెరపైకి తెచ్చి, వాస్తవాలు మరుగున పరచడానికి ముఖ్యమంత్రి యత్నించారని ఆయన ఆరోపించారు. వాటిని కూడా ప్రస్తావించి జగన్ హైకోర్టు తప్పుపట్టలేదన్న సంగతిని గుర్తు చేశారు.గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగలేదని చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, పేపర్ టాంపర్ కాలేదని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక పేర్కొందని జగన్ వెల్లడించడంతో కూటమి ప్రభుత్వ వాదనంతా వీగిపోయినట్లయింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, వాల్యుయేషన్ మూడు ప్రదేశాలలో జరపడం, అన్నిచోట్ల సిసిటీవీ కెమెరాల అమరిక జంబ్లింగ్ మొదలైన పద్దతులను కట్టుదిట్టంగా అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్లు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారిలో తమ ప్రభుత్వం తప్పు చేయలేదన్న కాన్పిడెన్స్ను చూపించలేకపోయారన్న అభిప్రాయం పలువురిలో ఏర్పడింది.అదే టైమ్లో జగన్ తన ప్రజెంటేషన్లో ఒక స్పష్టత, వీడియో, ఆడియో ఆధారాలు, ప్రభుత్వ జీఓలు, కోర్టు తీర్పులలోని వివిధ భాగాలు మొదలైనవాటిని చూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. ఈ వివాదాల నుంచి బయటపడాలంటే, అవినీతి జరగలేదని, తాము అసత్యాలు చెప్పడం లేదని ప్రజలను నమ్మించాలంటే చంద్రబాబు ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే జగన్ విసిరిన సవాల్కు ధైర్యంగా స్పందించి డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండిటిపైన సీబీఐ విచారణకు ఆదేశించడమే. మరి వారు అలా చేయగలుగుతారా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
సాక్షి, విజయవాడ: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘనకు సంబంధించిన వివాదంలో తన కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ సంచలన వీడియోను విడుదల చేసిన ఆయన.. మేఘనను కన్నకూతురిలా చూసుకున్నామని, పిల్లల మధ్య వచ్చిన విభేదాలను పెద్దవి చేసి రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు.నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని జోగి రమేష్ పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం, చదివించడం, వారికి వివాహం చేయడం తమ బాధ్యత అని చెప్పారు. అదే బాధ్యతలో భాగంగా తన కుమారుడు రాజీవ్కు మేఘనతో ఘనంగా వివాహం జరిపించామని తెలిపారు.వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయని, పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారని అన్నారు. విడిపోవాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా పరిస్థితి కోర్టు వరకు వెళ్లిందని చెప్పారు. జూన్ 8న తన కుమారుడు రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడని, జూలై 24న మేఘన తమ కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని జోగి రమేష్ తెలిపారు. విడాకుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు.మతమార్పిడి ఆరోపణలపై స్పందనమేఘన ఇచ్చిన ఫిర్యాదులో మతమార్పిడికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంపై జోగి రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భార్య బైబిల్ చదివితే తప్పా? ఏసుక్రీస్తు బోధనలు వినడం తప్పా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పారు. తిరుపతి వెళ్తామని, దుర్గగుడికి వెళ్తామని, యాగాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. కేవలం మత విశ్వాసాల ఆధారంగా తన కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.ఎల్లో మీడియాపై ఆగ్రహంటీడీపీ అనుకూల ఎల్లో మీడియా సంస్థలు తన కుటుంబ సమస్యను పదేపదే ప్రసారం చేసి వ్యాపారం చేసుకున్నాయని జోగి రమేష్ అన్నారు. ఒక కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా బహిరంగంగా చర్చించడం సమంజసం కాదన్నారు. “మీకు పిల్లలు లేరా? మీకు కుటుంబాలు లేవా?” అంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ వ్యవహారాలను రోడ్డుపైకి తీసుకురావద్దని కోరారు.మహా టీవీ వంశీని ఉద్దేశించి కూడా జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ వివాదంపై నెల రోజులుగా వార్తలు ప్రసారం చేస్తూ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తన కుమారుడు రాజీవ్ సామర్థ్యం గురించి ప్రశ్నించే ముందు.. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిని ప్రశ్నించాలని అన్నారు. కుటుంబ విషయాలను రాజకీయ, మీడియా అంశంగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించారు.చంద్రబాబు, లోకేష్.. ఏ ఇంట్లో లేవు?తనపై రాజకీయ కక్షతోనే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని జోగి రమేష్ చెబుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బీసీ నేతలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కారుమూరి, సునీల్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నికల తర్వాత తన కుమారుడిని అరెస్ట్ చేయించారని, నకిలీ మద్యం కేసులో తనను.. తన సోదరుడిని 83 రోజుల పాటు జైలులో పెట్టారని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. “రాజకీయంగా నాపైకి రండి.. వ్యక్తిగత విషయాల్లోకి రావద్దు” అని చంద్రబాబు, నారా లోకేష్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఆధారాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలుతన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతానని జోగి రమేష్ తెలిపారు. కుటుంబ వివాదాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికారు. తన కుమారుడు, మేఘన మధ్య సమస్యలు ఉన్నప్పటికీ.. మేఘనను తాను కన్నకూతురిలానే చూసుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. “ఏ కుటుంబంలో సమస్యలు లేవో చంద్రబాబు చెప్పాలి” అని ప్రశ్నించిన ఆయన.. ప్రముఖుల కుటుంబాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు.వసంత కృష్ణప్రసాద్ వల్లే ఇదంతా..మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయానికి తన కోడలు మేఘన వెళ్లిన సంచలన వీడియోను విడుదల చేసిన జోగి రమేష్.. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. తాను ఏ రోజూ వసంత కృష్ణప్రసాద్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పారు. వ్యక్తిగత అంశాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదన్నారు.“ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. ప్రజా సమస్యలపై నా పోరాటం కొనసాగుతుంది” అని జోగి రమేష్ పేర్కొన్నారు. తన గొంతు నొక్కేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: గంజాయి ఊడలు..'కుప్పంలో గుప్పు'! -
అమరావతి దేశంలోనే అతిపెద్ద దోపిడీ.. ప్రొ. యోగేంద్ర యాదవ్ సంచలన కామెంట్స్
-
అప్పులే ప్ర‘గతి’
సాక్షి, అమరావతి: అనుభవం, విజన్, సంపద సృష్టిస్తా అంటూ నిత్యం గొప్పలు చెప్పుకొనే సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి, అధఃపాతాళానికి తొక్కేస్తున్నారు. ఆస్తుల కల్పన లేదు.. ఆదాయం లేదు.. అప్పులు మాత్రం బోలెడు. వారం వారం వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత చంద్రబాబుదే. రెవెన్యూ లోటులోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ అప్పులు, రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నెల నెలా దిగజార్చేస్తూ సంపదను పెంచడంలో వెనుకబడిపోయిన చంద్రబాబు సర్కారు.. అప్పులు, రెవెన్యూ లోటును పెంచేస్తూ రాష్ట్రాన్ని నెంబర్ ఒన్ స్థానంలోకి తీసుకెళ్లినట్లుకంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి నాలుగు నెలల (ఏప్రిల్ నుంచి జూలై వరకు) రాష్ట్రాల బడ్జెట్ కీలక సూచికలను కాగ్ వెల్లడించింది. ఈ నాలుగు నెలల్లో రాష్ట్ర బడ్జెట్ అప్పులు దేశంలోని మిగతా రాష్ట్రాలకన్నా అత్యధికంగా ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఏపీ సగటున నెలకు రూ.12,300 కోట్ల చొప్పున నాలుగు నెలల్లోనే రూ.49,134 కోట్లు అప్పు చేసింది. జూలై నెలలోనే ఏకంగా రూ.15,521 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పులో నాలుగు నెలల్లోనే 64.76 శాతం మేర చేసినట్లు వెల్లడించింది. నెల నెలా అప్పులు పెంచేస్తుండగా ఆస్తుల కల్పన వ్యయం తగ్గిపోతోందని కాగ్ పేర్కొంది. అప్పుల్లో భారీ వృద్ధి నమోదు చేస్తున్న చంద్రబాబు సర్కారు ఆస్తుల కల్పన వ్యయంలో తిరోగమనంలో పయనిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం జూలై నెల వరకు ఆస్తుల వ్యయంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు ఆస్తుల కల్పన వ్యయం 23.0 శాతం తగ్గిపోయింది. అలాగే జూన్ నెలతో పోల్చితే జూలైలో ఆస్తుల కల్పన వ్యయం ఏకంగా 42.8 శాతం పడిపోయింది. ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో రెవెన్యూ లోటు కూడా నెల నెలా పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం రెవెన్యూ రాబడులను పెంచకపోవడమేనని స్పష్టమవుతోంది. రెవెన్యూ రాబడులను మించి వ్యయం చేస్తున్నారు. అంటే చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఎటువంటి ప్రతిఫలం లేని రంగాలకు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
‘సీమ’కు జలద్రోహంపై వైఎస్సార్సీపీ సమరభేరి
సాక్షి, అమరావతి: దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు చంద్రబాబు సర్కారు చేస్తున్న జలద్రోహంపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు తక్షణమే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్తో సోమవారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద రైతులతో కలిసి భారీఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం ఉ.6 గంటల వరకూ 203.67 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అందులో కేవలం ఏడెనిమిది టీఎంసీలు మాత్రమే ఇప్పటివరకూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా ద్వారా సరఫరా చేశారు. మరోవైపు.. ఎడమ గట్టు విద్యుత్కేంద్రం విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు నాలుగు టీఎంసీలు.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు తరలిస్తూ తెలంగాణ సర్కారు శ్రీశైలాన్ని ఖాళీ చేస్తోంది. అయినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు గరిష్ఠంగా ఎనిమిది వేల క్యూసెక్కులను మాత్రమే చంద్రబాబు సర్కారు విడుదల చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలించేలా రూ.3,500 కోట్లతో హంద్రీ–నీవాను అభివృద్ధి చేశామని పదేపదే సర్కారు చెబుతున్నప్పటికీ మూడు వేల క్యూసెక్కులకు మించి ఎత్తిపోయడంలేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 876 అడుగుల్లో 168.26 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 35–40 వేల క్యూసెక్కులు తరలించే అవకాశమున్నప్పటికీ చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి అంచనాల మేరకు వరద ప్రవాహం వచ్చే అవకాశంలేదు. అయినా, తెలంగాణ సర్కారు ఇదే రీతిలో నీటిని తోడేస్తే కొద్దిరోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తక్షణమే పోతిరెడ్డిపాడు ద్వారా గరిష్ఠ స్థాయిలో నీటిని తరలించకపోతే సాగునీటికే కాదు.. తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, గాలేరు–నగరి ఆయకట్టులో కనీసం ఆరుతడి పంటలకు కూడా నీళ్లివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. కరువు పరిస్థితులవల్ల పశుగ్రాసం లేక పశువులను తెగనమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు దన్నుగా సర్కారుపై వైఎస్సార్సీపీ కదనభేరి మోగించింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందం మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులను ఆపేసి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టిన చంద్రబాబు తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసిన విషయం విదితమే.కరువులోనూ వెన్నుపోటు పొడుస్తారా?.. వెన్నుపోటు, చంద్రబాబు పర్యాయ పదాలని మరోసారి నిరూపితమవుతోంది. తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనూ గుక్కెడు తాగునీళ్లు ఇవ్వకుండా పురిటిగడ్డ రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు. తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేస్తుండటంవల్ల శ్రీశైలం ఖాళీ అవుతోంది. అయినాసరే.. పోతిరెడ్డిపాడుకు కేవలం 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తక్షణమే పోతిరెడ్డిపాడుకు పూర్తిసామర్థ్యం మేరకు నీటిని విడుదలచేసి.. ఆ రిజర్వాయర్లకు నీటిని చేర్చకపోతే తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హంద్రీ–నీవాకూ సామర్థ్యం మేరకు 3,850 క్యూసెక్కులు సరఫరా చేయాలి. ఇదే డిమాండ్తో రైతులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాం. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి -
అమరావతిలో అతిపెద్ద భూ దోపిడీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట దేశంలోనే అతిపెద్ద భూ దోపిడీ జరుగుతోందని ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. రాజధాని పేరుతో మూడు పంటలు పండే పొలాలు లాక్కోవడం సమంజసం కాదన్నారు. అమరావతిలో భూ దోపిడీపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా గళం వినిపిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రొఫెసర్ రామచంద్రయ్య, సామాజికవేత్త డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్లో యోగేంద్ర యాదవ్ను కలిసి రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీని వివరించారు. ఈ సందర్భంగా రైతులు శ్రీధర్రెడ్డి, శ్రీకాంత్, సంజీవరెడ్డి తదితరులు మాట్లాడుతూ భూములు ఇవ్వలేదనే అక్కసుతో ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందన్నారు. పొలాల చుట్టూ భారీ గుంతలు తవ్వడంతో పాటు వరద నీటిని విడిచి పెడుతున్నట్లు తెలిపారు. తమ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు..? ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? అని ఆరా తీస్తూ ఒత్తిడి తెస్తోందని వాపోయారు. మూడు పంటలు పండే తమ భూములు తమకు కావాలని స్పష్టం చేశారు. డబ్బు కన్నా... కూడు అవసరమని.. తమ భూములు తమకు వదిలేయాలని కోరుతున్నా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. రాజధాని ప్రకటించిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు కూడా ఇవ్వడం లేదని, ఇల్లు కట్టుకోవాలన్నా అవస్థలు పడుతున్నామన్నారు. గతంలో భూములు సేకరించిన రైతులకు 12 ఏళ్లుగా ప్లాట్లు అప్పగించలేదన్నారు. 29 గ్రామాల పరిధిలో చెరువులు, కుంటలు 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ప్రభుత్వం మాత్రం 800 ఎకరాలే అని ప్రకటిస్తోందని చెప్పారు. రైతులకు బఫర్జోన్, వాటర్ బాడీస్లో ఇస్తున్నారని వాపోయారు. భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఉచిత వైద్యం, పిల్లలకు ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని చెప్పారు. సంఘటితంగా పోరాడండి రైతుల కష్టాలు సావధానంగా విన్న ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ భూ యజమానుల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. హైదరాబాద్ విస్తీర్ణంతో సమానంగా భూములు సేకరించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. పరిశ్రమలు, ఆర్థిక కార్యకలాపాలు లేకుండా, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రైతులంతా సంఘటితంగా పోరాటం చేయాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఎలాంటి న్యాయం సహాయం కావాలన్నా.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలన్నా సహాయం అందిస్తామని యోగేంద్రయాదవ్ ప్రకటించారు. -
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24లో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 5.56 లక్షలు తగ్గిందని కేంద్ర విద్యా శాఖకు చెందిన యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్–యూడీఐఎస్ఈ) గణాంకాలు తేల్చిచెబుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందంటూ చంద్రబాబు సర్కార్కు చురకలంటించారు. ‘యూడైస్+’ గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో కూటమి సర్కార్ అనుసరిస్తున్న తీరును కడిగిపారేశారు. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయని, విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా.. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఎత్తిచూపారు. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామమంటూ ‘ఎక్స్’లో తన ఖాతాలో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఆ పోస్టులో ఏమన్నారంటే.. బాబు ప్రభుత్వ డొల్ల ప్రచారం.. ఈ లెక్కలే సాక్ష్యం.. ‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంతో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో 5,56,666 మంది విద్యార్థులు తగ్గినట్లు వెల్లడిస్తున్న యూడైస్ ప్లస్ నివేదిక 2023–24 విద్యాసంవత్సరంతో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కు, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 991 నుంచి 797కు తగ్గినట్లు వెల్లడిస్తున్న యూడైస్ ప్లస్ నివేదిక » నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యూడైస్’ వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది. » అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రైవేటు విద్యా సంస్థలతో టీడీపీకి ఉన్నఅపవిత్ర సంబంధం కారణంగానే.. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది. విద్యారంగంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు» వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు–నేడు కార్యక్రమం కోసం మా ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది.» ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం.» ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. » ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం. -
‘బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గం’
తాడేపల్లి : మాజీ మంత్రి, బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గమని ఎమ్మెల్యే తాటపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉన్న బీసీ నేతలపై కక్ష సాధింపు సరికాదని హెచ్చరించారు. బీసీ నేతలను టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు చాలా ఎద్ద తప్పు చేస్తున్నారన్నారు. లేని మద్యం కేసులో కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలను డైవర్షన్ చేసేందుకు కారుమూరి అరెస్టు చేశారన్నారు. బీసీ సోదరులంతా చంద్రబాబు వైఖరిపై తీవ్ర అగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు.కారుమూరి అక్రమ అరెస్టును ఖండించిన బీసీ నేతలు -
బాబు టైమింగ్, రైమింగ్... నవ్వకండి.. సీరియస్ మ్యాటర్...
-
కడపలో TDP పని క్లోజ్
-
ప్రభుత్వ బడులు ఖాళీ.. 5.56 లక్షల మంది విద్యార్థులెక్కడ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. ‘UDISE+’ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి అని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది’.‘నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యుడైస్’( యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ – యూడీఐఎస్ఈ) వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది’.‘అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం’.𝗧𝗵𝗲 𝗣𝗹𝗶𝗴𝗵𝘁 𝗼𝗳 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁 𝗦𝗰𝗵𝗼𝗼𝗹𝘀 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵: 𝗔 𝗖𝗿𝗶𝘀𝗶𝘀 𝗼𝗳 𝗘𝗻𝗿𝗼𝗹𝗺𝗲𝗻𝘁 𝗮𝗻𝗱 𝗣𝘂𝗯𝗹𝗶𝗰 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻𝗧𝗵𝗲 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 𝗕𝗲𝗵𝗶𝗻𝗱 𝘁𝗵𝗲 𝗘𝗻𝗿𝗼𝗹𝗺𝗲𝗻𝘁 𝗖𝗹𝗮𝗶𝗺𝘀 𝗼𝗳 𝘁𝗵𝗲… pic.twitter.com/iJEkKuRO6w— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2026‘ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది’.‘2019–24 మధ్య గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం కోసం మన ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది’.‘ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం’.ఇది కూడా చదవండి: అల్లూరి గుహలపై టీడీపీ నేతల కన్ను.. ‘ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం’ అని వెల్లడించారు. -
చంద్రబాబు సభలో కుప్పకూలి పారిశుధ్య కార్మికుడు మృతి
-
బాబూ.. లోకేష్ను కాపాడే ప్రయత్నమా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ, గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సవాల్పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు తన కుమారుని కాపాడుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ సమస్యలు మీద కాకుండా రాజకీయాలు మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన స్కాం నుంచి బయట పడటం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్-1 అవకతకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ సవాల్పై నోరు మెదపలేదు. తన కుమారుని కాపాడుకోవటం మీద చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.ప్రజాధనంతో సభలు పెడుతూ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు. లోకేస్ తోడల్లుడు భరత్, ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు. మీ వారిని కాపాడుకోవడానికి తాపత్రయమా చంద్రబాబు?. పనిక కాక ముందు ఒక జీవో.. పని అయ్యాక ఒక జీవోనా? సీబీఐ విచారణ జరిపించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?.ఇది కూడా చదవండి: తగ్గితే నెగ్గుకురాలేం.. జనసేనలో కొత్త ఆందోళనఒకొక్క టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షలు వరకు అమ్ముకున్నారు. వైఎస్ జగన్ లక్ష 30 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేశారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎక్కడా ఒక అవినీతి ఆరోపణ వినిపించలేదు. అది వైఎస్ జగన్ క్రెడిబిలిటి. మీ పార్టీ నాయకులు సంతకాలు పెట్టిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అని ప్రజలు నమ్ముతున్నారు. డేటా సెంటర్లకు మేము వ్యతిరేకం కాదు. డేటా సెంటర్లకు 10 టీఎంసీ నీళ్లు అవసరం. ఆ నీటిని డేటా సెంటర్లకు ఎలా ఇస్తారు?. చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు. చంద్రబాబు పాదంతో మరోసారి కరువు సంభవించింది. ఆంధ్రప్రదేశ్ను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం కోసమే బహిరంగ సభ పెట్టారు అంటూ మండిపడ్డారు. -
సాగు నీరివ్వని సర్కారుపై రైతుల ఆగ్రహం
కణేకల్లు: సాగు నీరివ్వని చంద్రబాబు ప్రభుత్వంపై అనంతపురం జిల్లాలోని హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు తిరగబడ్డారు. కణేకల్లు, బొమ్మనహళ్, డి.హీరేహళ్ మండలాల్లోని హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగు నీటి కోసం ఆందోళనలు, హెచ్చెల్సీ కార్యాలయాల ముట్టడి చేసినా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేకపోవడంతో కోపోద్రిక్తులైన రైతులు శనివారం గుండ్లపల్లిక్రాస్–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ ఎత్తున ధర్నా చేశారు. టీబీ డ్యామ్లో నీరు భారీగా చేరుతున్నా నీరు వదలకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పొరుగున ఉన్న కర్ణాటకలో ఇదే హెచ్చెల్సీ కింద నీరు విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో మాత్రం సాగు నీరు ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే వరినారు పోసుకుని నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వందలాది రైతులు గుండ్లపల్లిక్రాస్–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ ధర్నా చేశారు. ఈ నెల 29 లోపు నీరివ్వకపోతే కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని మెట్టు గోవిందరెడ్డి హెచ్చరించారు. కణేకల్లు క్రాస్లో జరిగే నారా లోకేశ్ సభను అడ్డుకుంటామన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా కొనసాగింది. ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో వారికి, మెట్టు గోవిందరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
స్టార్ హోటళ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
తిరుపతి మంగళం: తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు, లోకేశ్ ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రెడిసన్ బ్లూ (ఫైవ్ స్టార్), సీఆర్ఆర్ హాస్పిటాలిటీ (ఫైవ్ స్టార్), ఎసెన్షియల్ (త్రీ స్టార్) హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు. 9 నెలల క్రితమే ఏర్పడిన సీఆర్ఆర్ హాస్పిటాలిటీకి తిరుచానూరు సమీపంలోని దామినేడులో 1.71 ఎకరాల ప్రైవేట్ స్థలంలో ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు,ఐదేళ్ల ఉచిత విద్యుత్, యూడీఎస్, జీఎస్టీ తదితర రాయితీలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఆ సంస్థకు హోటల్ రంగంలో అనుభవం, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు లేవని చెప్పారు. అనుమతుల వెనకున్న వ్యక్తులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే తిరుచానూరు సమీపంలో 21ఎకరాల టూరిజం భూమిని ఎకరాకు రూ.90 లక్షల చొప్పున 2 సంస్థలకు కేటాయించారని, ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.4.5 కోట్లు ఉన్నప్పటికీ, తక్కువ ధరకే అప్పగించారన్నారు. రూ.వందల కోట్ల కమీషన్ల కోసం చంద్రబాబు, లోకేశ్ బరితెగించి, ఇష్టానుసారంగా అనుమతులివ్వడందారుణమన్నారు. స్టార్ హోటళ్ల పేరుతో భూ కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
చంద్రబాబు అనకాపల్లి సభలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి!
అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి సభలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు పర్యటన ముగిసే వరకూ వీరబాబు అనే పారిశుద్ధ్య కార్మికుడి మరణాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయాన్ని సీఐటీయూ బహిర్గతం చేసింది. పారిశుద్ధ్య కార్మికుడు వీరబాబు డెడ్బాడీని కె కోటపాడు ఆస్పత్రికి తరలించారని, ఆగమేఘాల మీద డెడ్బాడీకి పోస్టుమార్టం నిర్వహించి ఇంటికి తరలించాలని యత్నం చేస్తున్నారని అనకాపల్లి జిల్లా సీఐటీయూ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.చంద్రబాబు పర్యటన సందర్బంగా గత రెండు రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులను తరలించి అక్కడ పనులు చేస్తుండగా వీరబాబు అనే కార్మికుడు మృతి చెందాడన్నారాయన. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారన్నారు. వీరబాబు కుటుంబానికి న్యాయం చేయాలని, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ. 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ తరఫున డిమాండ్ చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు గుర్తు పెట్టుకోండి’ -
‘సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్కు బీపీ ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్లకు బీపీ పెరుగుతోందని.. డీఎస్సీలో అక్రమాలపై విచారణ అంటే తట్టుకోలేక పోతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.‘‘కొత్తకొత్త జీవోలతో గేట్లు ఎత్తి తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మెరిట్ లిస్టుల పేరుతో మరో మోసం చేశారు. డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చుకోవటానికే గ్రూప్-1ను తెర మీదకు తెచ్చారు. సిట్తో విచారణ జరిపినా గ్రూప్-1లో తప్పులు కనపడలేదు. అందుకే రెండో సిట్ వేసి తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దమ్ముంటే సీబీఐతో విచారణ జరపాలి. డీఎస్సీ, గ్రూప్-1 రెండిటి పైనా సీబిఐ విచారణ చేయించాలి’’ అని అరుణ్కుమార్ డిమాండ్ చేశారు.శాసనమండలిలో దీనిపై చర్చిద్దామంటే చంద్రబాబు, లోకేష్ పారిపోయారు. సీబీఐతో విచారణ అంటే ఎందుకంత భయం?. తప్పు చేసినట్టు ఇప్పటికైనా ఒప్పుకోండి. డీఎస్సీ అక్రమాలపై జనసేన, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. స్పోర్ట్స్ లో పాల్గొనడమే అర్హతగా ఉద్యోగాలు ఇస్తారా?. ఇలాంటి వారు పిల్లలకు ఏం పాఠాలు చెప్తారు?ఇదీ చదవండి: ‘సర్’లో ఈ నాలుగైదు రోజులే కీలకం..ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఏపీని గంజాయి విక్రయ రాష్ట్రంగా మార్చారు. లింగమనేని రమేష్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్తో ఒకరిని చంపేస్తే కేసులు ఉండవా?. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా చర్యల్లేవు. ఆదినారాయణ రెడ్డి కొడుకు గంజాయి తాగుతూ దొరికినా కేసుల్లేవు. కూటమి నేతలు, వారి పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయా?’’ అంటూ అరుణ్కుమార్ ప్రశ్నించారు. -
ఒక్కో పోస్టు 15 లక్షలు.. అడ్డంగా దొరికాక తండ్రి.. కొడుకు గజగజ
-
ఆరోగ్యశ్రీలో అవినీతి ‘శ్రీ’
సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అక్రమాలకు చిరునామాగా మారింది. 2024లో ప్రభుత్వం మారిన వెంటనే ‘ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఫిఫో)’ నిబంధనలను తుంగలో తొక్కి బంధువులు, అస్మదీయుల ఆస్పత్రులకు వేగంగా బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వ పెద్దలకు అక్రమాలకు బాట వేశారు. సందట్లో సడేమియా అన్నచందంగా ఇటీవల ట్రస్ట్లో తిష్టవేసిన ఓ అధికారి ఏకంగా జిల్లాల వారీగా టార్గెట్లు విధించి నెలవారీ అక్రమ వసూళ్ల విధానానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలక ప్రజాప్రతినిధికి, ఉన్నతాధికారులకు ఇవ్వాలంటూ ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్లకు నెలవారీ వసూళ్లకు తెరలేపారు. నెలకు రూ.కోటి చొప్పున వసూళ్లే లక్ష్యంగా టార్గెట్లు పెట్టినట్లు తెలుస్తోంది. రూ.3 లక్షల నుంచి.. రూ.5 లక్షల వరకు వైద్య శాఖతో సంబంధం లేని సదరు అధికారి సుదీర్ఘ పోరాటం చేసి ఇటీవలే ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో తిష్ట వేశారు. ఉన్నతాధికారులు వద్దని వారించినా పట్టుబట్టి కీలక ప్రజాప్రతినిధి ఆ అధికారిని ట్రస్ట్లో నియమించారు. కాగా, అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని భుజానికి ఎత్తుకున్న ఆ అధికారి జిల్లాల్లో పనిచేసే నమ్మకస్తులైన కో–ఆర్డినేటర్లు, మేనేజర్ల ద్వారా వసూళ్ల తంతు కొనసాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు అధికంగా ఉన్న తిరుపతి, కర్నూలు, ఎన్టీఆర్, గుంటూరు, విశాఖ వంటి జిల్లాలకు రూ.5 లక్షల చొప్పున, మిగిలిన జిల్లాలకు రూ.3 లక్షల చొప్పున ప్రతి నెలా పంపాలని హుకుం జారీ చేయడంతో కో–ఆర్డినేటర్లు లబోదిబోమంటున్నారు. ప్రతినెలా అంత మొత్తంలో ఇవ్వలేమంటూ కొందరు కో–ఆర్డినేటర్లు టార్గెట్లను తగ్గించి ఇచ్చేలా అంగీకరించినట్టు సమాచారం. బెంగళూరు, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని కో–ఆర్డినేటర్లకు సైతం వసూళ్ల టార్గెట్లు ఇచ్చినట్టు తెలిసింది. బ్యాంకర్లతో బెడిసికొట్టిన బేరసారాలు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఇతర కార్యక్రమాల అమలు కోసం బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ట్రస్ట్ డబ్బు డిపాజిట్ చేస్తుంది. ఈ క్రమంలో ట్రస్ట్ కార్యకలాపాల కోసం కొత్త బ్యాంక్ ఖాతా తెరవడానికి ఇటీవల ప్రైవేట్ బ్యాంకర్లతోనూ ప్రజాప్రతినిధి తాలూకా అధికారి బేరసారాలకు దిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఓ ప్రైవేట్ బ్యాంక్లో కొత్త ఖాతా తెరవడం కోసం పెద్ద మొత్తంలో బ్యాంకర్లను డబ్బు డిమాండ్ చేసినట్టు వెల్లడైంది. ఈ వ్యవహారం ఆ నోటా, ఈ నోటా ఉన్నతాధికారికి తెలియడంతో సదరు అధికారి ప్లాన్ బెడిసికొట్టిందని ట్రస్ట్ ఉద్యోగులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ట్రస్ట్లో తిష్టవేస్తున్న అధికారులు అక్రమ సంపాదనే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ఆస్పత్రుల ఎంపానెల్మెంట్, బిల్లుల విడుదల, మెడికల్ రీయింబర్స్మెంట్, ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ ఇలా ప్రతిచోట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొద్ది నెలల కిందట ఓ పెద్ద ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి బిల్లులు మంజూరు పేరిట ట్రస్ట్ ఉద్యోగులు జరిపిన బేరసారాల ఆడియో కూడా కలకలం రేపింది. -
వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్లీ అప్పు
సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం రూ.2,600 కోట్లు బడ్జెట్ అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం ద్వారా విక్రయించడంతో ఈ మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. -
పదోన్నతి ఎప్పుడు.. బదిలీ ఎక్కడికి?
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పేరుతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలోకి నెట్టింది. ఒకవైపు ఉత్తర్వుల అమలుపై స్పష్టత లేక ఆ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులపై నిషేధాన్ని కొనసాగిస్తుండడంపై ఆందోళన నెలకొంది. గత నెల 13వ తేదీ నుంచి ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జోన్ల విధానం, స్థానిక కేడర్ కేటాయింపు అంశాలు ఖరారయ్యే వరకూ ఇది కొనసాగుతుందని తెలిపింది. అయితే రకరకాల గందరగోళాలతో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియనే తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ బదిలీలు, పదోన్నతులపై నిషేధాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియనే నిలిపేసిన ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులపై నిషేధం ఎందుకు కొనసాగిస్తోందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాల పునరి్వభజన ప్రకారం ఉద్యోగులను ఏ ప్రాతిపదికన బదిలీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన ఇస్తారా, స్థానికతను చూస్తారా, జనాభా శాతాన్ని బట్టి నిర్ణయిస్తారా.. అన్న దానిపై స్పష్టత లేదు. ఒక్కో జిల్లా రెండు, మూడు, నాలుగు ముక్కలుగా విడిపోయిన నేపథ్యంలో.. 10–15 కిలోమీటర్ల పరిధిలో కాకుండా 100–150 కిలోమీటర్ల దూరం బదిలీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఏడాది మధ్యలో ఉండగా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నాలుగులక్షల మంది ఉద్యోగులకు లోకల్ క్యాడర్ కేటాయింపు అంత సులభంగా అవుతుందా.. అందుకోసం బదిలీలు ఆపడం ఏమిటి.. అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు. ప్యానల్ ఇయర్ మిస్ అయితే... ఇక ఆ ఏడాదికి పదోన్నతి లేనట్లే ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు నిర్దిష్ట గడువు (ప్యానల్ ఇయర్ – సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు) ఉంటుంది. 2025–26 ప్యానల్ ఇయర్ ఈ నెల 31తో ముగుస్తోంది. ఈలోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిగాకపోతే ఆ అవకాశం ఈ ఏడాదికి లేనట్టే. ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసం పదోన్నతులు నిలిపివేయడంతో ప్యానల్ ఇయర్లో పదోన్నతులు పొందాల్సినవారు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వివిధ శాఖల్లో ఐదువేల మందికి పదోన్నతులు నిలిచిపోయినట్లు ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు. అంటే వారి పదోన్నతి ఒక సంవత్సరం ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. 2025–26 ప్యానల్ ఇయర్లో ఖాళీలకు పదోన్నతులు ఇవ్వకుండానే.. సెపె్టంబర్ నుంచి మొదలయ్యే 2026–27 ప్యానల్ ఇయర్కు డీపీసీ ప్రక్రియ మొదలుపెట్టాలని జూలై 31న సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియను మధ్యలోనే నిలిపేసిన ప్రభుత్వం, పదోన్నతులు, బదిలీలపై నిషేధాన్ని మాత్రం కొనసాగించడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత నెల 13వ తేదీ నుంచి అమల్లో ఉన్న ఈ నిషేధాన్ని తక్షణమే ఎత్తేసి పదోన్నతులు, బదిలీలపై స్పష్టమైన విధానం ప్రకటించాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే నిషేధం ఎత్తేయాలి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో హడావుడి చేయకుండా ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి. కేంద్రం ఇచి్చన 27 నెలల గడువును సముచితంగా వినియోగించుకుని చట్టబద్ధంగా, పారదర్శకంగా అమలు చేయాలి. నిషేధం వల్ల చాలా శాఖల్లో పదోన్నతులు నిలిచిపోయాయి. ఇది చాలా బాధాకరం. ఈ ఏడాది ప్యానల్ ఇయర్ ముగింపు రోజైన ఆగస్టు 31 నాటికైనా పదోన్నతులకు అవకాశం కల్పించాలి. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వానికి స్పష్టత లేదు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయడంపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఏ ప్రాతిపదికన ఉత్తర్వులను అమలు చేస్తారో చెప్పడంలేదు. సీనియారిటీ ప్రాతిపదికన ఇస్తారా, స్థానికతను చూస్తారా? రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసమే పెట్టిన బ్యాన్ను.. ఆ అమలు ప్రక్రియనే నిలిపివేసినప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు? ప్రభుత్వ వైఖరితో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. – బాజీ పఠాన్, అధ్యక్షుడు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం -
టీడీపీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: పొత్తులో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చంద్రబాబు మరోసారి మొండిచేయి చూపడం చర్చనీయాంశమైంది. ఇటీవల గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను వర్ల రామయ్య, రమాదేవికి ఇచ్చారు. దీంతో ఆ పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వర్మతో పాటు మిగిలిన సీనియర్ నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదు.తొలి ఎమ్మెల్సీ ఇస్తానని.. రెండేళ్లయినా పట్టించుకోని వైనంపిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం వదులుకొన్నందుకు ప్రభుత్వం ఏర్పడగానే తొలి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని వర్మకు చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచార సమయంలోనే హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ని విస్మరించారు. రెండేళ్లయినా, పలుమార్లు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం వచ్చినా చంద్రబాబు ఆయన్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. తన నియోజకవర్గంలో మరో అధికార కేంద్రం ఉండకూడదని పవన్ కళ్యాణ్ కోరడం వల్లే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలేదని తెలుస్తోంది. అయితే పైకి మాత్రం వర్మను పిలిచి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రతిసారీ చెబుతున్నారు. తీరా వాటిని భర్తీ చేసేటప్పుడు మాత్రం పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి కూడా తొలగించేశారు. ఆ సమయంలో కూడా ఎమ్మెల్సీని చేస్తామని, పార్టీ పదవి ఏముందని బుజ్జగించారు. తీరా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న వర్మను రెండు రోజుల క్రితం చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని మరోమారు బుజ్జగించారు. సామాజిక సమీకరణల వల్ల ఒక ఎస్సీ, ఒక బీసీకి అవకాశం ఇవ్వాల్సి వచ్చిందని, ఈసారి సర్దుకుపోవాలని, మరోసారి చూద్దామని చెప్పి పంపించేశారు. దీంతో ఆయనకు పదవి మున్ముందు కూడా డౌటే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లకు భంగపాటే మరోవైపు ఈసారైనా తమకు కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఎదురుచూసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు నిరాశ తప్పలేదు. మైలవరం సీటు వదులుకున్నాను కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని దేవినేని ఉమా ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఆయన పేరును అసలు పరిగణనలోకే తీసుకోలేదని సమాచారం. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు సమాచారం. వంగవీటి రాధాకృష్ణను ఎమ్మెల్సీని చేస్తామని స్వయంగా లోకేశ్ హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆయన ఊసే మర్చిపోయారు. ఈసారి కచ్చితంగా తనకు అవకాశం వస్తుందని భావించి, భంగపడ్డ రాధాకృష్ణ తన భవిష్యత్తు ఏమిటనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఎదురు చూసినా నిరాశ తప్పలేదు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి, చంద్రబాబు పక్కనే ఉండే టీడీ జనార్థన్ వంటి నేతలకూ భంగపాటు తప్పలేదు. ఇప్పుడు భర్తీ చేసిన రెండు పదవుల్లో ఒకటి వర్ల రామయ్యకు ఇవ్వడంపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని చెప్పి రామయ్యకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజా పామర్రు ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. తమ సీనియారిటీ, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా అవమానిస్తున్నారని పలువురు నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. -
ఉలకవేం బాబూ.. పలకవేం లోకేశ్.. వైఎస్ జగన్ సవాల్పై నోరు మెదపరేం?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి బట్టబయలు చేశారు. ఈ స్కామ్ నుంచి తన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ను కాపాడుకోవాలన్న ఆరాటంతో ఏపీపీఎస్సీ–2018 గ్రూప్–1 నియామకాలపై సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువేనంటూ సాక్ష్యాధారాలతో బహిర్గతం చేశారు. గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, మరి డీఎస్సీ–2025పై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబు, లోకేశ్కు వైఎస్ జగన్ సవాల్ విసిరారు. సిద్ధమైతే రెండింటిపై తక్షణమే సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ఛాలెంజ్ చేశారు. వైఎస్ జగన్ సవాల్ విసిరి.. ఛాలెంజ్ చేసి 36 గంటలు గడిచినా అటు సీఎం చంద్రబాబుగానీ.. ఇటు మంత్రి లోకేశ్గానీ దానిపై నోరు మెదపడం లేదు. సవాల్ను స్వీకరిస్తున్నట్లుగానీ.. ఛాలెంజ్కు సిద్ధపడుతూ సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాస్తామనిగానీ వారిద్దరూ ప్రకటించలేదు. డీఎస్సీ కుంభకోణానికి పాల్పడ్డారు కాబట్టే తండ్రీకొడుకులు ఇద్దరూ మౌన ముద్ర దాల్చారని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, విద్యావేత్తలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. ‘నీట్ ప్రశ్నపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, లోకేశ్కు మరో నీతి ఉంటుందా?’ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మెగా డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అడ్డంగా దొరికిపోయిన తండ్రీ కొడుకులు » డీఎస్సీ కుంభకోణం, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు, లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి చూపుతూ వారు చెబుతున్నవన్నీ అబద్ధాలేనంటూ వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. » రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్ స్వయంగా అంగీకరించడాన్ని గుర్తు చేస్తూ, ప్రశ్నల లీకేజీకి ద్వారాలు తెరిచిన వైనాన్ని వివరించారు. » ‘డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారీ విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు తొలి ర్యాంక్ వచ్చి ందని చంద్రబాబు, లోకేశ్ అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మొదటి మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది. రెండో లిస్ట్లో నవీన్ పేరు తీసేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చి న నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి. ఆయనకు ప్రశ్నపత్రం యాక్సెస్ ఉంది కాబట్టి. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. నవీన్కు ఉద్యోగమిస్తే గోల అవుతుంది కాబట్టి. అందువల్ల ముందస్తుగానే మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు తొలగించారు. నవీన్ కోర్టుకు వెళ్లాడు. ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నాడు. మరి ఇది నవీన్ దగ్గరే ఆగిపోయిందా? లేక ఇంకా జరిగిందా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. » చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేశ్ ఒప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ దీన్ని సమర్థించుకోవడానికి క్రీడాకారులకు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని.. పీవీ సింధుకు నేరుగా ఉద్యోగం ఇచ్చిన రీతిలోనే 372 టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చామని చెప్పడాన్ని ఎత్తిచూపారు. వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా జీఓ నెం.4, జీవో నెం.47 ఇచ్చి గేట్లు ఎత్తారని.. పని పూర్తయిన తర్వాత జీవో నెం.23, జీవో నెం.56 ఇచ్చి మళ్లీ గేట్లు మూసేశారని చెప్పారు. ఇంతకు ముందు పరీక్షలతో సంబంధం లేదన్నారని.. తర్వాత జీవోల్లో పరీక్షలో అర్హత సాధించాల్సిందేనన్నారని.. అంటే మళ్లీ గేట్లు మూసేశారని వివరించారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ‘సాఫ్ట్బాల్’ అసోసియేషన్ నుంచి, అలాగే లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న ‘జూడో’ అసోసియేషన్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు భర్తీ చేసిన వైనాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో చంద్రబాబు, లోకేశ్ ఒప్పుకున్నారని.. కానీ బేరసారాలు జరిపిన వ్యక్తిని అరెస్టు కూడా చేయకపోవడాన్ని ఎత్తిచూపారు. » వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో డీఎస్సీ కుంభకోణాన్ని బట్టబయలు చేయడంతో తండ్రీకొడుకులు అడ్డంగా దొరికిపోయారని.. తేలుకుట్టిన దొంగల్లా నోరు మెదపడం లేదని డీఎస్సీ అభ్యర్థులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం డీఎస్సీ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ.. ఎన్నో కీలక డాక్యుమెంట్లను ప్రదర్శిస్తూ.. సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అంటూ వైఎస్ జగన్ సవాల్ విసిరారు. 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గ్రూప్–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏకంగా గంటా 54 నిమిషాల పాటు సుదీర్ఘంగా వీటి గురించి వివరిస్తూ మాట్లాడారు. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నేరుగా స్పందించకుండా ఎప్పటిలాగే టాపిక్ డైవర్షన్కు తెర తీశారు. ఇన్ని ముఖ్యమైన అంశాలపై స్పందించకుండా డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకటే అన్నారంటూ నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో తమకు అలవాటైన రీతిలో విష ప్రచారం చేస్తున్నారని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు మండిపడుతున్నారు. కళ్లెదుటే డీఎస్సీ కుంభకోణంపై సాక్ష్యాలు కనిపిస్తుంటే వాటిపై స్పందించే దమ్ము, ధైర్యం లేక ఇలా పలాయన మంత్రం పఠిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. -
మరో ‘పవర్’ కంపెనీ పరార్
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి మరో ‘పవర్’ కంపెనీ పారిపోయింది! నిన్న నెల్లూరు జిల్లా నుంచి టాటా పవర్ పెట్టె బేడా సర్దుకొని ఒడిశాకు వెళ్లిపోగా తాజాగా తిరుపతి జిల్లా నాయుడు పేట నుంచి వెబ్సోల్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రానికి బైబై చెప్పేసి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయింది. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టాక జీవోలు సైతం వెలువడిన అనంతరం ఏకంగా రూ.16,248 కోట్ల విలువైన ఏడు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. టాటా పవర్, కోకోకోలా, వెబ్సోల్, అజాద్ మొబిలిటీ, జ్యూపిటర్, జినాఫ్రా, ఐస్పేస్ లాంటి ప్రముఖ సంస్థలు జీవోలు వెలువడిన తర్వాత ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు తట్టుకోలేక రాష్ట్రం నుంచి పారిపోవడం గమనార్హం. ఇటు రాయితీలు.. అటు కప్పం వసూళ్లు! నాయుడు పేట వద్ద రూ.3,538 కోట్లతో 4 గిగావాట్ల సోలార్ సెల్స్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన వెబ్సోల్ కప్పం కట్టలేక తాజాగా ఏపీ నుంచి నిష్క్రమించింది. వెబ్సోల్ యూనిట్ ఏర్పాటుకు 2025 నవంబర్ 15న ఏపీఈడీబీతో ఒప్పందం చేసుకోగా డిసెంబర్లో ఎస్ఐపీబీ ఆమోదం తెలపడం, 2026 జనవరి 10న జీవో జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. నాయుడుపేట వద్ద 123.45 ఎకరాల భూమిని కేటాయించి టైలర్మేడ్ రాయితీల కింద పెట్టుబడి విలువలో 69 శాతం వరకు సుమారు రూ.2,212 కోట్లు వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేసి మిషనరీ బిగించే ప్రకియ మొదలు పెట్టి 2027 జూలై నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా వెబ్సోల్ ప్రణాళికలు కూడా రచించుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు విలవిల్లాడుతూ పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయింది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కంటే పశ్చిమ బెంగాల్ అనువైనదిగా ఉన్నందున యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనలను ఉపసంహరించుకుని వెళ్లిపోతున్నట్లు వెబ్సోల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా ఖైతాన్ పెట్టుబడిదారులతో నిర్వహించిన ఇన్వెస్టర్ కాల్లో ప్రకటించారు. సోలార్ విద్యుత్కు పశ్చిమ బెంగాల్ అనువైనదిగా ఉందని, మూడు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫాల్తాలోనే వెబ్సోల్ యూనిట్ స్థాపించనున్నట్లు ఖైతాన్ తెలిపారు. రంగంలోకి ప్రభుత్వ పెద్దల సలహాదారుడు..! ఏపీలో వెబ్సోల్ యూనిట్ ఏర్పాటుకు జీవో జారీ చేసిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఢిల్లీలో ఉంటున్న ఓ సలహాదారుడు నేరుగా రంగంలోకి దిగి కప్పం డిమాండ్ చేయడమే ఆ కంపెనీ బెంగాల్ వెళ్లిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సలహాదారుడు కీలక మంత్రికి స్నేహితుడే కాకుండా పలు విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండటంతో రాష్ట్రంలో నెలకొల్పే విద్యుత్ ప్రాజెక్టులకు ఆయన్ను కలిసిన తర్వాతే ఆమోదం లభిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. అడిగినంత కప్పం చెల్లించకుంటే జీవో విడుదలైనా పెట్టుబడుల ప్రతిపాదనలు ఒక్క కూడా అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. టాటా పవర్, వెబ్సోల్ ఎనర్జీ ఉదంతాలే దీనికి నిదర్శమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. నెల రోజుల్లో రెండు కంపెనీలు ‘టాటా’ రూ.కోట్ల విలువైన భూములు కేటాయించడమే కాకుండా టైలర్మేడ్ రాయితీల కింద పెట్టుబడిలో దాదాపు 70 శాతం వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా కంపెనీలు మొహం చాటేయడంపై వ్యాపారవేత్తలు, అధికారుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పక్క పక్క జిల్లాల నుంచి రూ.10,213 కోట్ల విలువైన రెండు భారీ ప్రాజెక్టులు అది కూడా నెల రోజుల వ్యవధిలో రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం.. రెండూ విద్యుత్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. నెల్లూరు క్రిబ్కో సెజ్లో టాటా పవర్కు 250 ఎకరాలు కేటాయించిన తర్వాత ఏపీ కంటే ఒడిశానే బెస్ట్ అని టాటాపవర్ పర్వీర్సిన్హా ప్రకటించగా... తాజాగా ఏపీ కంటే పశ్చిమ బెంగాల్ పెట్టుబడులకు అనువుగా ఉందంటూ వెబ్సోల్ ఈడీ సంజనా ఖైతాన్ సైతం స్పష్టం చేయడం రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. -
‘రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయమే జరుగుతుందని.. ఆయన పక్కా రాయలసీమ అభివృద్ధి నిరోధకుడని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ, పార్టీ రైతు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నేతలతో కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. పాలకుల మొద్దునిద్రను విడదీసేందుకు, రాయలసీమ రైతుల హక్కులను కాపాడేందుకు ఈ నెల 24న వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీమ ప్రాంత రైతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజా పోరాటానికి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే..సీమపై చంద్రబాబుది మొదటి నుంచీ కక్షపూరిత వైఖరే..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలం రిజర్వాయర్లో దాదాపు 185 టీఎంసీల నీరు చేరింది. డ్యామ్ 90 శాతం నిండి పూర్తి స్థాయికి చేరువలో ఉంది. కానీ దానిపై ఆధారపడిన రాయలసీమ రిజర్వాయర్లన్నీ సగానికి పైగా ఎండిపోయి ఉన్నాయి. రైతులకు మేలు చేయాల్సింది పోయి, పంటలు వేసుకోవద్దని బాబు ఉచిత సలహాలు ఇస్తున్నారు.రైతులను వ్యవసాయానికి, భూములకు దూరం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు?. శ్రీశైలం నిండితే దిగువన ఉన్న వెలుగోడు, బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు, గోరకల్లు, ఔకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, చిత్రావతి ప్రాజెక్టులు ఎందుకు నిండటం లేదు? 11 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరకల్లులో కేవలం 4 నుంచి 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు? సీమ ప్రాజెక్టులను ఎండగడతామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా మాట ఇచ్చారా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 40,400 క్యూసెక్కులు అయితే.. కేవలం 8 వేల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. 850 అడుగులు దాటిన తర్వాత కనీసం 30 నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని వదిలే అవకాశం ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారు?.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను అడ్డుకున్న ద్రోహి చంద్రబాబుగతంలో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్' ప్రాజెక్టును తలపెట్టారు. 90 శాతం పనులు పూర్తయిన ఆ ప్రాజెక్టును చంద్రబాబు.. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నిలిపివేశారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే 800 అడుగుల నుంచే రోజుకు 80 వేల క్యూసెక్కుల వరద నీటిని ఒడిసిపట్టి సీమ ప్రాజెక్టులన్నింటినీ క్షణాల్లో నింపేవాళ్లం. అలాంటి మహోన్నత ప్రాజెక్టును గతంలో 'బురద నీళ్లు' అంటూ చంద్రబాబు హేళన చేశారు. అలాగే హంద్రీ-నీవా ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైయస్.జగన్ ఇచ్చిన టెండర్లను రద్దు చేసి, దాన్ని 3,800 క్యూసెక్కులకు కుదించి రాయలసీమ రైతుల నోట్లో మట్టి కొట్టారు.ఆల్మట్టి, అప్పర్ భద్రలపై ఎందుకు మౌనం?కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రోజుకోసారి జపం చేసే చంద్రబాబు.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం వల్ల తుంగభద్రకు 25 టీఎంసీల నీరు ఆగిపోయి ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటుంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? పులిచింతల పరివాహక ప్రాంత రైతుల గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చంద్రబాబుకు నీళ్ల మీద, రైతుల మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు.24న 'పోతిరెడ్డిపాడు' వద్ద మహా పోరాటం..ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని శైలజనాథ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీ సోమవారం నాడు గ్రేటర్ రాయలసీమ జిల్లాల పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతు విభాగాలతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను సందర్శిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడును పూర్తి సామర్థ్యంతో, హంద్రీ-నీవాను పూర్తి సామర్థ్యంతో నడిపించి రాయలసీమ ప్రాజెక్టులను నింపాలని.. 6,300 క్యూసెక్కుల హంద్రీ-నీవా సామర్థ్యాన్ని తగ్గించి 3,800 క్యూసెక్కులకు పరిమితం చేయడం ఎందుకని నిలదీశారు.దీనిపై రైతులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. తక్షణమే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి ద్వారా పూర్తి సామర్థ్యంతో 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శైలజానాధ్ హెచ్చరించారు. -
చంద్రబాబుకు ఉద్యోగ JAC నేతలు వార్నింగ్
-
సీమ అంటే ఇంత ద్వేషమా రేవంత్ కోసం బాబు తలొంచాడు.. రాయలసీమ కరువుకు బాబే కారణం
-
‘డైవర్షన్ కోసమే మరోసారి తెరపైకి వివేకా కేసు’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు, పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటన, సుగాలి ప్రీతి తల్లి వీల్చైర్ యాత్రను అడ్డుకోవడం, అధికార పార్టీ ఎంపీ కుమారుడు కారు నడుపుతూ యువతిని ఢీకొట్టి చంపిన ఘటన వంటి దారుణమైన అంశాలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివేకా హత్య కేసును మరోసారి తెరపైకి తెచ్చారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ఆక్షేపించారు.ఆ దిశలోనే తొలిసారి ఈడీని రంగ ప్రవేశం చేయించి, వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఇంట్లో సోదాలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. దాని వల్ల ఏదో విజయం సాధించినట్లు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:అంతా డైవర్షన్ పాలిటిక్స్:డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? గత ప్రభుత్వంలో గ్రూప్-1 అవకతవకలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు కదా.. వాటిపై సీబీఐ విచారణకు మేము సిద్ధం. మరి మీ హయాంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా? పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో గంజాయి అరాచకాలు పెరిగిపోతుంటే, యువత తప్పుదోవ పడుతుంటే దానిపై మాట్లాడకుండా ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు?న్యాయం కోసం శాంతియుతంగా వీల్చైర్లో యాత్ర చేస్తున్న సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు హింసించారు? ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అధికార పార్టీకి చెందిన ఎంపీ కుమారుడి హిట్ అండ్ రన్ ఘటనపైనా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఘటనపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణమైన అంశాలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకే అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలను ఏదో సాధించినట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.వివేకానంద రెడ్డి హత్య కేసుపై టీడీపీకి సవాల్:వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత సీబీఐ విచారణ కూడా జరిగింది. ఇప్పుడు ట్రయల్ జరగాలి అంటుంటే.. ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు? అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. కేసు ట్రయల్ సజావుగా సాగకుండా ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? సీబీఐ విచారణ జరిగింది. కేసు కోర్టుల పరిధిలో ఉంది. నిందితులపై విచారణ జరిగి నిజాలు బయటకు రావాలి. ట్రయల్ జరగడానికి మీకు అభ్యంతరం ఏమిటి?చంద్రబాబుకి సంబంధించిన అనేక కీలక కేసుల్లో వాదిస్తున్న అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాయే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడి తరఫున కూడా వాదిస్తున్నారు. ఈ సంబంధాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల పన్నుల డబ్బుతో కోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ, కేసు విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? విచారణ జరపండి.. ట్రయల్ జరపండి.. నిజాలు ప్రజల ముందుకు రానివ్వండి. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. సుగాలి ప్రీతి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసైనా సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధంగా లేరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఫాల్స్ ప్రాపగండా, ఫాల్స్ నేరేటివ్, డైవర్షన్ రాజకీయాలు మానండి. వ్యవస్థలపై నమ్మకం ఉంచండి. నిజాయితీగా విచారణ జరగనివ్వండి. మీ మీడియా శక్తితో ఎంత ప్రచారం చేసినా నిజాన్ని దాచలేరు. వివేకానంద రెడ్డి మా మనిషి. దివంగత వైఎస్సార్ సోదరుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు. ఆయన హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలి. వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేలాలి. విచారణ జరగాలి. నిజం ప్రజల ముందుకు రావాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. -
పీపీపీ ముసుగులో ఏపీ ఫర్ సేల్..!?
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన సందర్భంలో చెప్పిన విషయాలు రానున్న ప్రమాదానికి సంకేతమా అన్న అభిప్రాయం అప్పుడే కలిగింది. సరిగ్గా వారం తిరగకముందే అసలు విషయం బయటకు వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం 16 శాఖలకు సంబందించి వివిధ కార్యక్రమాలను పీపీపీ పద్దతిలో ప్రైవేటువారికి అప్పగించబోతున్నట్లు మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.టీడీపీ, జనసేనలు కలిసి మానిఫెస్టో విడుదల చేసినప్పుడు కాని, ఆ తర్వాత బీజేపీతో కలిసి ఎన్నికల ప్రచారాలు నిర్వహించినప్పుడు కాని తాము పీపీపీ విధానంలో వివిధ రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తామని, యూజర్ చార్జీలు వసూలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా గత ప్రభుత్వం పట్టణాలలో పారిశుధ్ద్యం నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఏభై నుంచి వంద రూపాయల చార్జీలు వసూలు చేస్తే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు నానా యాగీ చేశారు. చెత్తపన్నువేసే చెత్త ప్రభుత్వం అని ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే చెత్తపన్ను తొలగించామని అన్నారు. అయినా పిఠాపురం తదితర చోట్ల యధాప్రకారం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.నిజానికి దీనివల్ల ప్రజలపై పెద్దగా భారం పడింది లేదు. అయినా అంత రచ్చ చేసిన చంద్రబాబు ఇప్పుడేమో విద్య, వైద్యం, రవాణా మొదలైన 16రంగాలలో యూజర్ చార్జీలు వసూలుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీనిని ఏ తరహా ప్రభుత్వం అని జనం అనుకోవాలి?ప్రజలకు సంపద సమకూర్చి పెడతానని పదే, పదే ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టేమో కాని, ఉన్న ప్రజల సంపదను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి తయారవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.విపక్షంలో ఉన్నప్పుడు రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్లు అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తివేస్తామని చెప్పారు. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి మీటర్లను పగలకొట్టండని పిలుపు ఇచ్చారు. పవర్లోకి వచ్చాక వాటిని తొలగించలేదు సరికదా.. ఇళ్లకు కూడా కొత్త మీటర్లు పెడుతూ జనానికి చిర్రెత్తిస్తున్నారు. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన రోజున ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన 23 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలలో 11.37 లక్షల కోట్ల పెట్టుబడుల పనులు ఆరంభం అయ్యాయని, వీటిలో అధిక భాగం పీపీపీ మోడల్ అని అన్నారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలలో 1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు పీపీపీ విధానంలో ఉన్నాయని తెలపడం విశేషం. దేనిని నమ్మాలో తెలియదు.అదలా ఉంచితే పీపీపీ వ్యవస్థలో భవిష్యత్తులో యూజర్ చార్జీల రూపేణా లక్షల కోట్ల మేర ప్రజలపై భారం వేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారనుకోవాలా! ఈ ప్రైవేటు కంపెనీలకు వయబిలీటి గ్యాప్ ఫండ్ ఇస్తారట. వడ్డీ లేని రుణం ఇస్తారట. వయబిలిటి ఫండ్ కోసం ప్రభుత్వం 1500 కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీల మూలధనంలో ప్రభుత్వం 20 నుంచి నలభై శాతం గ్రాంట్గా కూడా ఇస్తుందట. జగన్ ప్రభుత్వం పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వపరంగా నిర్మిస్తే, వాటిని ప్రైవేటువారికి అణాకు, బేడాకు ఆ సంపదను అప్పగించే కుట్ర జరుగుతోందన్నది వైఎస్సార్సీపీ నేతల విమర్శగా ఉంది.వేల కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత, దానిపై ఏ ప్రభుత్వమైనా ఆదాయం పొందాలని చూస్తుంది. కాని చిత్రంగా కూటమి ప్రభుత్వం దానిని వదలుకుని, ప్రైవేటువారికి అప్పగించి యూజర్ చార్జీల రూపేణా ప్రజలపై అదనపు భారం వేయడానికి రెడీ అయిందన్నమాట.భోగాపురం విమానాశ్రయం ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్మించడాన్ని, మెడికల్ కాలేజీలు ప్రైవేటువారికి అప్పగించడాన్ని ఒక రీతిలో చంద్రబాబు చూడడాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుపట్టారు. విమానాలు ఎక్కేవారు, ఆరోగ్యం కోసం వచ్చే పేదవారు ఒకటేనా అని ఆయన ప్రశ్నించి, చంద్రబాబు ఆలోచన ధోరణి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని అన్నారు. పీపీపీ ముసుగులో వనరుల దోపిడీ జరగబోతోందని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పీపీపీ కాదు.. ఏపీ ఫర్ సేల్, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్న కొత్త విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇదంతా పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు.కాగా ఈనాడు మీడియా మాత్రం ప్రైవేటుకు ప్రోత్సాహం ప్రజలకు ప్రయోజనం అన్న శీర్షిక పెట్టి తెలుగుదేశంపై తన భక్తిని ప్రదర్శించింది. అంతే తప్ప విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సేవలకు యూజర్ చార్జీలేమిటి అని ప్రశ్నించలేదు.2004 కి ముందు కూడా చంద్రబాబు ఇదే విధానం అమలు చేయాలనుకునేవారు. ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ చార్జీలను కూడా కొన్నిచోట్ల పెట్టారు. నష్టాలలో ఉన్నాయని పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటువారికి కారుచౌకగా కట్టబెట్టారు. వాటిలో పెక్కు సంస్థలు అక్కడ పరిశ్రమలు నడపడం లేదు. ఆ పరిశ్రమల భూమిని ప్రైవేటు యాజమాన్యాలు రియల్ ఎస్టేట్కు వాడుకుని భారీగా లబ్ది పొందాయని అంటారు. చంద్రబాబు అప్పట్లో ఏది ఉచితం కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని అనేవారు. ఆ రోజుల్లో జన్మభూమి పేరుతో ఏభైశాతం ఖర్చు పెట్టే వారి ప్రాంతంలోనే రోడ్లను వేసేవారు.2004లో ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ పద్దతులకు గుడ్ బై చెప్పి, ప్రజల సాధారణ అవసరాలకు ప్రభుత్వమే పూర్తి వ్యయం భరించే విధానం అమలు చేశారు. చంద్రబాబు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన మైండ్ సెట్ ఎప్పుడూ ఆ రకంగానే ఉంటుందని వైఎస్సార్సీపీ వారు వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం తీసుకువచ్చిన పీపీపీ విధానం కూటమి ప్రభుత్వానికి మరణశాసనం అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని కొందరు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు ప్రజలకు ఆందోళన కలిగించేదిగా ఉందన్నది వాస్తవం.ప్రైవేటువారు అభివృద్ది చేసుకునే రాజధాని అమరావతిలో ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్దం అవుతూ, ప్రభుత్వపరంగా పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ప్రైవేటువారికి అప్పగించి యూజర్ చార్జీల భారం మోపడానికి తయారవుతున్న వైనం చూస్తే ఇదంతా రివర్స్ ప్రభుత్వం అన్న భావన కలగదా! సామాజిక రంగాలలో సేవలన్నిటిని ప్రైవేటుకు అప్పగించాక ప్రభుత్వ బాధ్యత ఏమి ఉంటుంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప అని కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అది నిజమేకదా అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇది కూటమి సర్కారువారి డైవర్షన్ డ్రామా!
సాక్షి, గుంటూరు: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ఏపీలో రాజకీయ వేడిని పెంచింది. ఇన్నాళ్లుగా సీబీఐ విచారణలో కనిపించని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు పీఎంఎల్ఏ పేరిట హఠాత్తుగా రంగంలోకి రావడంపై వైఎస్సార్సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ సోదాలు కూటమి ప్రభుత్వం వారి కొత్త డైవర్షన్ డ్రామా అంటూ మండిపడుతోంది.వివేకా హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్లో రెండు, కడప జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో.. మొత్తం పది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డికి సంబంధించిన ప్రాంతాలతో పాటు ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఈ కేసులో హవాలా మనీ కోణం తెరపైకి రావడం పలు అనుమాలకు తావిస్తోంది.ఇంతకాలం ఈడీ ఎక్కడ?2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. అనంతరం కేసు సీబీఐకి వెళ్లింది. సీబీఐ 2020 నుంచి దర్యాప్తు కొనసాగిస్తూ చార్జ్షీట్లు, అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసింది. తాజాగా మూడో అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసిన అనంతరం.. ఇకపై మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి మాత్రం కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తిచేసినట్లు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆ దశలో తదుపరి దర్యాప్తుపై జోక్యం చేసుకోలేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా ప్రశ్నలకు తావిస్తోంది. సీబీఐ దర్యాప్తు దాదాపు ముగిసిందని చెబుతున్న సమయంలో.. కొత్తగా ఈడీ ఎందుకు రంగంలోకి వచ్చింది? ఇంతకాలం ఈడీ పేరు ఎక్కడా లేకుండా ఇప్పుడు హఠాత్తుగా సోదాలు ఎందుకు? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తోంది.డీఎస్సీ వివాదం.. అవినీతి ఆరోపణల వేడిఇదే సమయంలో.. ఏపీలో కూటమి ప్రభుత్వం డీఎస్సీ వ్యవహారం సహా పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. డీఎస్సీలో అవకతవకలు జరగడం.. అసెంబ్లీ సమావేశాల్లో వాటిని పరోక్షంగా ఒప్పుకోవడం.. మండలిలో చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టడం.. భయపడి కూటమి ప్రభుత్వం పారిపోవడం తెలిసిందే. అటు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ కుంభకోణాన్ని బయటపెట్టి.. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ను ఏకీపారేశారు. 2018 గ్రూప్-1 విషయంలో తాము సీబీఐ విచారణకు సిద్ధమని, డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వివేకా కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘డైవర్షన్ డ్రామా’నేఈడీ సోదాల వెనుక కేంద్ర దర్యాప్తు అవసరం కంటే రాజకీయ ప్రయోజనమే ఎక్కువగా కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు దీని వెనుక ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.‘‘కూటమి ప్రభుత్వ తప్పులను, అవినీతి ఆరోపణలను, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ఏదో ఒక డైవర్షన్ డ్రామాకు దిగుతుంది. గత రెండేళ్లలో ఏపీలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు కూడా ఇంతే’’ అని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మొత్తానికి వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసినట్లు చెబుతున్న వేళ.. అదే కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో మరో హైడ్రామాకు తెరలేపినట్లైంది. -
TDP నేతకు బిగ్ షాక్
-
బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!
-
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
-
అబ్బా.. కొడుకులకు ఫైనల్ వార్నింగ్.. DSC కుంభకోణంలో సంచలన నిజాలు
-
కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీ కుమారులకో నీతా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో తప్పులపై ప్రశ్నిస్తే అబ్బాకొడుకులు గింజుకుంటారే గానీ సీబీఐ విచారణకు అంగీకరించడం లేదంటూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ల వ్యవహార శైలిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘నీట్ ప్రశ్నపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, ఆయన కుమారుడికి వేరే నీతి ఉంటుందా?’ అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీ 2025 కుంభకోణం, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1ల నియామకాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడిన మాటల వీడియోలను చూపుతూ.. వారు చెబుతున్నవన్నీ అబద్ధాలేనంటూ సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. మెగా డీఎస్సీ విషయంలో లీకేజీ, అక్రమాలపై తాము ఇప్పటివరకూ ఏ అంశాలనైతే ప్రజలముందు ఉంచామో అవన్నీ వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చిందని వైఎస్ జగన్ తెలిపారు. ఇవన్నీ గట్టిగా ప్రస్తావిస్తామనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరకు ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని చెప్పారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం తమదని, ప్రతిపక్ష నాయకుడిగా తనను గుర్తిస్తే, సభా నాయకుడు సీఎంతో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి గుర్తించడం లేదన్నారు. గ్రౌండ్లో ప్రత్యర్థి జట్టు లేనిచోట.. బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీ కుమారులు ఇద్దరూ బ్యాటింగ్ చేస్తూ, తాము అద్భుతంగా చేశామని తమకు తాము కితాబు ఇచ్చుకుంటున్నారంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలపై చర్చ చేపట్టాలంటూ నాలుగు రోజులపాటు శాసన మండలిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్తంభింపచేశారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడతారేగానీ పక్కనే ఉన్న మండలిలో మాత్రం చర్చకు ముందుకు రావడం లేదన్నారు. ఎందుకంటే అక్కడ తమ పార్టీ బలం ఉంది కాబట్టి చర్చ జరిగితే వారి తప్పులన్నీ బయటకు వస్తాయని, డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేసి తప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ తేటతెల్లం అవుతోంది కాబట్టి అక్కడ చర్చించడానికి ముందుకు రావడం లేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ స్కామ్ను అంశాలవారీగా ఎండగడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఒక్కరికే రెండు బాధ్యతలా..?డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ అనేది ఒక అంశం. పరీక్ష నిర్వహణ అనేది మరో అంశం. ఈ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు అసెంబ్లీలో లోకేశ్ స్వయంగా అంగీకరించారు. పైగా తప్పేముంది? అని దబాయిస్తున్నారు. ప్రశ్న పత్రం తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. పరీక్షల నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ బాధ్యత. ఈ రెండూ ఒక్కరి చేతే చేయిస్తే పారదర్శకత లోపిస్తుంది. లీకేజీకి ఎక్కువ అవకాశం ఉంది. ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి నిర్వహించిన చరిత్ర ఎన్నడూ లేదు. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణను ఒకే వ్యక్తికి అప్పగించామని లోకేశ్ తనకు తానుగా ఒప్పుకున్నారు. పరీక్ష పత్రం తయారీ, నిర్వహణ ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చెక్స్ అండ్ బ్యాలన్స్ అనేది తొలగిపోయింది. లీకేజీకి ద్వారాలు తెరిచారు. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం.ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు తొలి ర్యాంక్ వచ్చిందని తండ్రీ కుమారులు అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మొదటి మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది. రెండో లిస్ట్లో అతడి పేరు తీసేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేశారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు కాబట్టి ఇవ్వలేదని చంద్రబాబు, లోకేశ్ చెబుతున్నారు. ఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? తన ఐడీని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని నవీన్ కోర్టుకు వెళ్లాడు. తన ఐడీ బ్లాక్ అయ్యిందని, కాల్ లెటర్ రాలేదని, డీఎస్సీలో మంచి మార్కులు వచ్చాయని, అయినా ఎందుకు కాల్ లెటర్ రాలేదని, ఇది నా జీవితానికి చివరి ఛాన్స్ అని విద్యాశాఖకు నవీన్ మెయిల్ పెట్టాడు. ఇదే విధంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. క్యాండిడేట్ ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు అతడు వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? దీనికి అసెంబ్లీలో అబ్బా కొడుకులిద్దరూ ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే కారణం.. నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి. ఆయనకు ప్రశ్నపత్రం యాక్సెస్ ఉంది కాబట్టి. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. అతడికి ఉద్యోగం ఇస్తే గోల అవుతుంది కాబట్టి. ముందస్తుగానే మెరిట్ లిస్ట్లో అతడి పేరు తొలగించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడీని బ్లాక్ చేశారు. కాల్ లెటర్ పంపలేదు. మొదటి లిస్ట్లో అతడి పేరు ఉంది, రెండో లిస్ట్లో తీసేశారు. ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. తన ఉద్యోగం తనకు ఇవ్వాలని అడుగుతున్నాడు. మరి ఇది నవీన్ దగ్గరే ఆగిపోయిందా? ఇంకా జరిగిందా? సీబీఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది.పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలా?ఒకవైపు సింధు పేరు చెప్పి వీళ్ల అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన ఎస్టీ అభ్యర్ధి దుర్గయ్యకు కాల్ లెటర్ పంపి ఉద్యోగం ఇవ్వలేదు. అతను ఆర్చరీలో బంగారు పతకం సాధించాడు. ఆశ్చర్యమేమిటో తెలుసా? వీళ్ల పార్టీకి చెందిన నేతలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ‘‘సాఫ్ట్బాల్’’ అసోసియేషన్ నుంచి, అలాగే లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న ‘‘జూడో అసోసియేషన్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఏకంగా 372 పోస్టులు భర్తీ చేశారు. సాఫ్ట్బాల్ సంఘ అధ్యక్షునిగా ఉన్న కూన రవికుమార్, జూడో సంఘ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ భరత్ గతంలోనూ స్పోర్ట్స్ కోటా ఉండేది. కానీ డీఎస్సీ క్వాలిఫై అవ్వాలి. కానీ ఇప్పుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇంటర్ కాలేజీ స్థాయిలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఉద్యోగాలిచ్చారు. పని అయిపోయిన తరువాత ప్రభుత్వమే ఈ జీవోలను రద్దు చేసింది. ఇక మీదట క్వాలిఫై అయితేనే అర్హత అని మరలా పాత పద్ధతికే వచ్చారు. ఇలా ఎందుకు జీఓలు మార్చారు? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయికి స్కామ్ వెళ్లిందంటే పైనుంచి కింద వరకూ అందరూ ఉన్నట్టే కదా! మంత్రి సంతకం లేకుండా జీవో ఇస్తారా? దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాలా వద్దా?బేరసారాలు జరిగినట్లు ఒప్పుకున్నా చర్యలేవీ?స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ వ్యక్తి ఎవరో పోలీసులు కనుక్కోకుండా, ఎఫ్ఐఆర్లో ఆ వ్యక్తి పేరు రాయకుండా కేవలం ‘సస్పెక్ట్’ అని మాత్రమే రాశారు. పైగా అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణం.. సీనియర్ అధికారులతో మాట్లాడినట్లు రాశారు. మరి ఎవరితో మాట్లాడినట్లు? అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి. అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, బెయిల్పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అసెంబ్లీలో తండ్రీ కుమారులు చెప్పినట్లు నిజంగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారా? కోర్టు ముందు ప్రవేశపెట్టారా? జైలుకు పంపారా? ఆ అరెస్ట్ ఉత్తదేనన్న సీసీటీఎన్ఎస్..కేంద్రం ఆధ్వర్యంలోని ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్’ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే.. ఆ వ్యక్తిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఉంది. ఆ విషయం డాక్యుమెంట్లో ఉంది. నిజానికి ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. కానీ, తండ్రీ కుమారులు ఇద్దరూ ఈ విషయంలో చాలా సీరియస్గా వ్యవహరించినట్టు, అతడిని అరెస్టు చేసినట్లు, చర్యలు తీసుకున్నట్లు పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామా చేశారు. స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం రూ.14.10 లక్షలు లంచంఒంగోలులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. డీఎస్సీలో జాబ్ ఇప్పిస్తామని నమ్మించి తమను మోసం చేశారని ఓ మహిళా అభ్యర్థి రాధిక నుంచి ఫిర్యాదు వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం రూ.14.10 లక్షలు లంచం ఇచ్చినట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. రిఫరెన్స్గా మరో వ్యక్తికీ ఇలా చేస్తున్నామని ఆమెకు చెప్పారు. రిఫరెన్స్గా చూపిన వ్యక్తికి వచ్చింది. కానీ ఈ అమ్మాయికి రాలేదు. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా నిలదీస్తే ఏపీ టూరిజంలో మరో పోస్టు ఇస్తామని మభ్యపెట్టారు. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లో డీఎస్సీ పోస్టు కోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరిజం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు. గతేడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంత వరకూ ఎలాంటి చర్యలు లేవు. అరెస్టులు లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆ అమ్మాయి ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా ఎక్కడికక్కడే వదిలేయాలని తండ్రీ కుమారులు ఇచ్చిన ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తున్నారు. డీఎస్సీ లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్ కోటా బేరసారాల వరకూ అన్నీ సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేశ్ తక్షణం రాజీనామా చేయాలి.పీవీ సింధూతో పోలికా..? పరీక్ష రాయకుండానే ఉద్యోగాలా?డీఎస్సీ పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని కూడా ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామూలుగా లేవు. స్పోర్ట్స్ పర్సన్స్కు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదంట! పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువుచెప్పే 372 టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట! సింధూకి ఏ రూల్ పాటించారో ఇక్కడ కూడా అదే రూల్ పాటించారంట! 372 ఉద్యోగాలు పరీక్ష లేకుండా సింధూ పేరు చెప్పి తీసుకొచ్చారు. ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం ఆ అబ్బా కొడుకులు ఇద్దరికే మినహా ఎవరికైనా సాధ్యం అవుతుందా? పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? అసలు డీఎస్సీ ఎందుకు? పిల్లలకు చదువు చెప్పే సామర్ధ్యం ఉందో లేదో చూసేందుకే కదా? మరి బుద్ధి ఉన్న వాళ్లెవరైనా ఇలా చేస్తారా? అసలు పీవీ సింధుతో ఎలా పోలుస్తారు? పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్లో వెండి పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం వచ్చాయి. ఒలింపిక్స్ నుంచి నేషనల్ గేమ్స్ వరకు ఏ మెడల్ సాధించిన వారికి ఎటువంటి పోస్టులు ఇవ్వాలనేది స్పష్టంగా వివరిస్తూ 2024 డిసెంబర్ 10న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 18 ఇదీ.. దీనిలోనే శాప్ కోచ్లకు ఇచ్చే పోస్టుల గురించి కూడా పేర్కొన్నారు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్ ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. ఇలాంటివాళ్లకి ప్రత్యేక పాలసీ ఉంది. ఆమేరకు కేబినెట్ నిర్ణయాలు తీసుకుని వారికి మేలు చేస్తుంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్ వచ్చాయని అడుగుతున్నా. అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నారు.సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెబుతున్న ఈ చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు. మరి తర్వాత వచ్చేవాళ్లు క్రీడాకారులు కాదా? వాస్తవం ఏమిటంటే.. వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోడానికి ప్రత్యేకంగా జీఓ నెం.4, జీవో నెం.47 ఇచ్చి గేట్లు ఎత్తారు. పని పూర్తయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.56 ఇచ్చి మళ్లీ గేట్లు మూసేశారు. ఇంతకు ముందు పరీక్షలతో సంబంధం లేదన్నారు. తర్వాత జీవోల్లో పరీక్షలో అర్హత సాధించాల్సిందేనన్నారు. అంటే మరలా గేట్లు మూసేశారు. -
25 గంటల్లో 22 గంటలు అబద్ధాలే!
సాక్షి, అమరావతి: నాలుగు రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆత్మస్తుతి, పరనిందలా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను తిట్టడానికే చంద్రబాబు ఈ సమావేశాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. మరోవైపు.. తన పాలన గురించి, ఈ రెండేళ్లలో జరిగిన కుంభకోణాల గురించి ఆయన తన తనయుడు లోకేశ్తో కలిసి ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడారు. ఈసారి అసెంబ్లీ మొత్తం 25.15 గంటలపాటు సాగింది. అందులో ఏకంగా 22 గంటలు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లేందుకే వెచ్చించారు.చంద్రబాబు మొదలు ఆయన తనయుడు లోకేశ్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ను ఆడిపోసుకోగా, మంత్రులు, ఎమ్మెల్యేలు తండ్రీకొడుకులను మెప్పించడం కోసం జగన్ను లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారం మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా చెప్పుకోవడానికి చేసిందేమీలేక జగన్ను తిట్టడం ద్వారా డైవర్షన్ రాజకీయాలకు దిగారు.అసెంబ్లీలో దాటవేత రాజకీయం..అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో డీఎస్సీ నియామకాల కుంభకోణంపై చర్చ పెట్టి అసలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా జబ్బలు చరుచుకున్నారు. చంద్రబాబు, లోకేశ్లు ఇదే అంశంపై ఒకే ప్రజెంటేషన్ను రెండుసార్లు చూపిస్తూ మాట్లాడారు. కానీ, కుంభకోణానికి సంబంధించిన కీలకమైన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పలేక నీళ్లు నమిలారు. సభలో తమను ప్రశ్నించేవారు ఎవరూ లేకపోవడం, తాము చెప్పిన అబద్ధాలనే గొప్ప శ్లోకాలుగా కీర్తించే ఎమ్మెల్యేలు ఉండడంతో అసెంబ్లీని అందుకోసం ఉపయోగించుకున్నారు. డీఎస్సీపై చర్చకు బెదిరి ‘మండలి’లో పరార్..మరోవైపు.. డీఎస్సీ అంశంపై శాసనమండలిలో చర్చించేందుకు ముందుకురాకుండా కూటమి సభ్యులు పారిపోయారు. డీఎస్సీ కుంభకోణంపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు నాలుగు రోజులపాటు పట్టుబట్టారు. అసెంబ్లీలో చెప్పినట్లే మండలిలో ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్పడం కుదరదని, నిజాలు బయటపడతాయన్న భయంతో చర్చకు దిగే ధైర్యం చేయలేక తప్పించుకుని పారిపోయింది. డీఎస్సీపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించిన ఆ శాఖా మంత్రి లోకేశ్.. మండలిలో చర్చించేందుకు భయపడి వెనక్కి వెళ్లిపోవడాన్ని బట్టి తాను పేపర్ టైగర్నని నిరూపించుకున్నారు. డైవర్షన్ కోసం గ్రూప్–1 నియామకాలపై చర్చ..అదే సమయంలో డీఎస్సీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏపీపీఎస్సీ గ్రూప్–1 నియామకాలపై చర్చను తెరపైకి తెచ్చారు. ఈ చర్చలో చంద్రబాబు వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తూ కళ్లుమూసుకుని అబద్ధాలు వల్లించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి, నిండు సభలో నిస్సిగ్గుగా అవాస్తవాలు చెప్పి తనకు రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టవని మరోసారి నిరూపించారు. చివరి రోజు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేసినట్లు సభ్యులతో మాట్లాడించి ప్రజలను వంచించే ప్రయత్నం చేశారు. సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి్సన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానన్న సంగతే మరిచిపోయి ఎప్పటిమాదిరిగా టీడీపీ నేతలా వ్యవహరించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. మొత్తంగా ఈ నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలను చర్చించడానికి కాకుండా జగన్ని తిట్టిపోయడానికి, డీఎస్సీ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసలు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తండ్రీకొడుకులు వాడుకున్నారని స్పష్టమైంది. -
ఉద్యోగులకు బాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఉద్యోగులకూ వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ‘ఉద్యోగులను చంద్రబాబు చాలా దారుణంగా మోసం చేశారు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ రద్దు చేశారు. కొత్త పీఆర్సీ వేయలేదు. 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి.ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్ల బాకీ ఉంది. సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీ కూడా నెరవేర్చలేదు. అదే గత మా ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ పథకం (జీపీఎస్) అమలు చేసి ఉద్యోగులకు మేలు చేసింది. కాగా, ఉద్యోగులకు అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు’ అంటూ ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ద్రవ్యోల్బణం ఒక మిథ్య అన్న సీఎం చంద్రబాబు ఐక్యూ ఎలా ఉందనేది అందరికీ తెలుస్తోందంటూ వైఎస్ జగన్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధన తప్పు..‘సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష నిర్ణయం తప్పు. టీచర్లు వారి సమస్యల కోసం మా పార్టీ ఎంపీలతో కలిసి, కేంద్రంలో విజ్ఞాపన పత్రం ఇస్తే, వారిని సస్పెండ్ చేశారు. అది హేయమైన చర్య. ఇంకా 20 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న టీచర్లను ఇప్పుడు టెట్ రాయమనడం ఎంత వరకు సబబు?. వారు ఇంతకాలం ఒకే సబ్జెక్ట్ బోధిస్తున్నారు. టెట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. వారు అవన్నీ పాస్ కావడం కష్టం. నాడు వారు ఎంపికైనప్పుడు టెట్ లేదు. ఇప్పుడు రాయాలంటే ఎలా?. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించాలి. వారి నిర్ణయాన్ని ఎండగట్టి, చట్ట సవరణ కూడా చేయించాలి. దాని ఆధారంగా కోర్టులో పోరాడాలి. అంతేకానీ, ఆ పని చేయకుండా, మా ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీచర్లను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం. ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ప్రశ్నిస్తే వేధిస్తూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారంటూ మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ చెప్పారు. డీఎస్సీపై కోర్టుకు వెళ్లాం.. కేంద్రానికి నివేదించాం..డీఎస్సీపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధపడడం లేదు కదా.. మీరే అన్ని వివరాలతో సీబీఐకి ఏమన్నా లేఖ రాసే అవకాశం ఉందా అని విలేకరులు అడగ్గా.. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేశాం. విచారణ జరుగుతోంది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రధానమంత్రికి లేఖ కూడా రాశాం. మా పార్టీ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కలిసి డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అబ్బాకొడుకులకు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలని మరోసారి చాలెంజ్ విసిరారు. -
రఘురామకృష్ణరాజు బారినుంచి కాపాడండి
సాక్షి, అమరావతి: పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ చెప్పుకునే తండ్రీ, కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేశ్లకు తమ పార్టీ నేత, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అరాచకాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఓ వ్యాపారవేత్త చేసేదేమీ లేక భద్రత కోసం హైకోర్టు తలుపుతట్టారు. రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకుని దారి మళ్లించిన వ్యవహారంలో తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐ, ఎస్ఎఫ్ఐఓకి ఇవ్వొద్దంటూ బెదిరిస్తున్నారని, తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాసు హైకోర్టులో గురువారం అత్యవసరంగా లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 2+2 భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని, అందుకయ్యే ఖర్చును తానే భరిస్తానని శ్రీనివాసు తన పిటిషన్లో పేర్కొన్నారు. కృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ పవర్ జెన్కాం కంపెనీని వేలం పాటలో కొనుగోలు చేసినందుకు తనపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన మనుషులు తన ఇంటికి వచ్చి బెదిరించారని, ఈ ఘటనకు సంబంధించి తానిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నమోదుచేయలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా గుంటూరు, పట్టాభిపురం పోలీసులను ఆదేశించాలని కూడా ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయినంత మాత్రాన ఆయన చేసే నేరపూరిత చర్యలకు చట్టపరమైన రక్షణ ఏదీ లేదన్నారు. కాగా, కోర్టు సమయం అయిపోవడంతో ఆయన పిటిషన్ విచారణకు రాలేదు. క్రిమినల్ కేసులు వెంటాడతాయన్న భయంతోనే..‘తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న 189 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ కంపెనీ ఇండ్–భారత్ పవర్ జెన్కామ్ గతంలో రఘురామకృష్ణరాజు, ఆయన కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉండేది. భారీ ఆరి్థక బకాయిల వల్ల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ సదరు కంపెనీ లిక్విడేషన్కు ఆదేశించింది. 2022 మే 13న జరిగిన బహిరంగ ఈ–వేలంలో నేను, నా సతీమణి అనిత కన్సారి్టయం రూ.101.42 కోట్లకు (వడ్డీతో కలిపి) కంపెనీని కొనుగోలు చేశాం. రఘురామకృష్ణరాజు చెల్లించాల్సిన రూ.267.88 కోట్లను వసూలు చేసుకోవడానికి, న్యాయస్థానాల్లో కేసులను కొనసాగించడానికి చట్టబద్ధమైన బాధ్యత, హక్కులను ఈ ఎన్సీఎల్టీ మాకు ఈ సందర్భంగా ఇచ్చింది. రూ.1,185 కోట్ల బ్యాంకు రుణాన్ని రఘురామకృష్ణరాజు దారి మళ్లించిన వ్యవహారంపై సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కంపెనీ ప్రస్తుత యజమానిగా, అధికారిక రికార్డుల కస్టోడియన్గా ఎస్ఎఫ్ఐఓ జారీ చేసిన సమన్ల ప్రకారం, పాత రికార్డులు, లావాదేవీల చిట్టాలు, ఇతర కీలక ఆర్థిక పత్రాలను దర్యాప్తు సంస్థల ముందు ప్రవేశపెట్టాల్సిన చట్టబద్ధమైన బాధ్యత నాపై ఉంది. ఈ కీలకమైన రికార్డులు గనుక సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ చేతికి చిక్కితే తనపై క్రిమినల్ కేసుల విచారణ వేగవంతమై శిక్ష పడుతుందనే భయంతో రఘురామకృష్ణరాజు మా ఇంటిపై దాడి చేయించి ఆ పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారు’ అని పిటిషనర్ పేర్కొన్నారు. -
‘స్థానిక’ పదవులకూ కోత
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల్లో పదవులకూ చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో పదవుల సంఖ్యను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంతోపాటు మున్సిపల్ చట్టాలకు సవరణలు చేస్తూ అసెంబ్లీ, శాసనమండలిలో గురువారం ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోదం లభించింది. జిల్లా పరిషత్లలో ప్రస్తుతం ఇద్దరేసి చొప్పున ఉండే వైస్ చైర్పర్సన్, మండల పరిషత్లలో రెండేసి చొప్పున ఉండే ఉపాధ్యక్ష పదవులను, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో ఇద్దరు చొప్పున ఉండే డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ పదవులను ఒకటికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వైస్ చైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్ వంటి పదవులు రెండేసి ఉండేలా చర్యలు చేపట్టారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో ఇలా.. ప్రస్తుతం జిల్లా పరిషత్లలో ఇద్దరేసి చొప్పున ఉన్న వైస్ చైర్పర్సన్ పదవులను ఒకటికి కుదించారు. మండల పరిషత్లలో రెండేసి చొప్పున ఉన్న ఉపాధ్యక్ష పదవులను ఒకటికి తగ్గించారు. బహుళ నాయకత్వం వల్ల పరిపాలనాపరంగా ఎలాంటి ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తాజా బిల్లులో పేర్కొంది. పురపాలనలోనూ.. నగరపాలక సంస్థల్లో రెండేసి చొప్పున ఉన్న డిప్యూటీ మేయర్ పదవులను ఒకటి చొప్పున తగ్గించారు. మున్సిపాలిటీలలో రెండు చొప్పున ఉన్న వైస్ చైర్పర్సన్ పదవులను ఒకటికి కుదించారు. నగరపాలక సంస్థల్లో మేయర్లు, మున్సిపాలిటీలలో చైర్పర్సన్లను నేరుగా ఓటర్లే ఎన్నుకునేలా ప్రత్యేక ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.ఎన్నికల విధానంలో కొత్త నిబంధనలు నగరపాలక సంస్థ మేయర్ లేదా మున్సిపల్ చైర్పర్సన్ పదవులకు పోటీ చేసేవారు ఆయా కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ పరిధిలో ఓటరు అయి ఉండాలి. వార్డు సభ్యులు/కార్పొరేటర్లు, మేయర్/చైర్పర్సన్లను ఒకేసారి రెండు ఓట్ల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పదవీ కాలం ముగియడానికి 6 నెలల ముందు ఖాళీ ఏర్పడితే తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదు. ఎన్నికైన తొలి సమావేశంలోనే వార్డు సభ్యులు లేదా డివిజన్ కార్పొరేటర్ల ద్వారా పరోక్ష విధానంలో డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరిస్తే అనర్హత వేటువేసే నిబంధన వర్తిస్తుంది. మేయర్ లేదా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన వారు ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవుల్లో ఉంటే.. స్థానిక సంస్థల ఫలితం వెలువడిన 15 రోజుల్లోగా ఏదో ఒక పదవిని ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ స్థానిక సంస్థలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లుజీఓ జారీచేసిన ప్రభుత్వం సాక్షి, అమరావతి : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది. పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులు, సర్పంచి పదవులు.. మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ, ఎంపీపీ పదవులు.. జిల్లా పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఆయా రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అయితే, రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బుధవారం ప్రభుత్వం హైకోర్టులో నివేదిక అందజేయగా హైకోర్టు ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతానికి దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అంటూ రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు సూచించిన విషయం తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీఓలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇచ్చే మొత్తం రిజర్వేషన్ల శాతాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కారణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించే పరిస్థితి ఉండగా, కోర్టు సూచన తర్వాత కూడా బీసీలను మోసంచేస్తూ ప్రభుత్వం ఈ జీఓ జారీచేసిందన్న చర్చ సాగుతోంది -
కొడుకును కాపాడుకోవడం కోసమే.. ఏపీపీఎస్సీపై అభాండాలు
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు, కుంభకోణానికి పాల్పడి, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన తన కొడుకును కాపాడుకోవాలన్న ఆరాటంతో సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా గ్రూప్–1 నియామకాలపై పచ్చి అబద్ధాలు వల్లెవేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వల్లెవేసిన అబద్ధాలను సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. గురువారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ గ్రూప్–1పై చంద్రబాబు ప్రభుత్వమే వేసిన సిట్ ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ, ఇంటర్వూ్యలు జరిగాయని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పారన్నారు.‘నిజానికి నాడు చంద్రబాబు హయాంలోనే గ్రూప్–1 పరీక్షల ప్రిలిమ్స్ జరిగాయి. మేము వచ్చాక మెయిన్స్ మాత్రమే నిర్వహించాం. ఎక్కడా తప్పు చేయలేదు. అక్రమాలు చోటు చేసుకోలేదు. డీఎస్సీ కుంభకోణం నుంచి కొడుకును కాపాడుకోవడం కోసమే నాలుగేళ్లుగా పనిచేస్తున్న 163 మంది ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడటం లేదు’ అని జగన్ విమర్శించారు. ఏపీపీఎస్సీపై చంద్రబాబు అబద్ధాలను అంశాలవారీగా ఆధారాలతో సహా జగన్ ఖండించారు. వైఎస్ జగన్ ఏమి మాట్లాడారంటే...డీఎస్సీలోలా పేపర్ లీకేజీ లేదు‘‘చంద్రబాబు తన కొడుకును కాపాడుకోవడానికి ఏ విధంగా బురద జల్లుతున్నాడో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు మరింత దిగజారిపోయి తన ప్రభుత్వమే 2018లో ప్రకటించిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పోస్టుల భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్ చేశాడు. బాబు ప్రభుత్వ హయాంలోనే ప్రిలిమ్స్ అయిపోయాయి. మేము చేసింది కేవలం మెయిన్స్ నిర్వహించడమే. ఇక ఎక్కడ నుంచి వస్తాయి స్వార్థ ప్రయోజనాలు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో లాగా పేపర్ లీకేజీ జరగలేదు. ఇప్పటి డీఎస్సీలో లాగా ప్రశ్నపత్రాల తయారీ విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు తీసుకురాలేదు. మా ప్రభుత్వంలో పరీక్షలే రాయకుండా ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు అమ్ముకున్నట్లుగా, బేరసారాలు చేస్తున్నట్లుగా, డబ్బులు ఇచ్చినట్లుగా ఎవరివీ ఆడియోలు, వీడియోలు ఎలాంటి ఆధారాలు మా ప్రభుత్వ హయాంలో రాలేదు. మా ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు జరుగుతున్న డీఎస్సీ స్కాంకు మధ్య తేడా ఇదే. కేవలం కొడుకును కాపాడుకోవడం కోసం చంద్రబాబు ఆక్రోశం, ఆరాటం బయటకు వస్తోంది.చంద్రబాబు వేసిన సిట్టే క్లీన్ చిట్ ఇచ్చిందిఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలపై వాస్తవాల్లోకి వెళ్దాం.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2025 ఏప్రిల్లో ఒక సిట్ వేశారు. ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని నవంబర్14, 2025న చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఒకవైపు జరుగుతుండగానే ఈ సిట్ ఇలా హైకోర్టులో అఫిడవిట్లు వేస్తుండటంతో ఎలాగోలా ఇరికించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ఫిబ్రవరి14, 2026న రెండో సిట్ వేశారు. బాబు కింద పనిచేసేవారే కదా ఆ సిట్లో ఉండేది. అధికారులను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటే కదా.. నిజాలు ఎవరూ దాచిపెట్టలేరు.ఎప్పటికైనా బయటకు వస్తాయి. 2019 ఎన్నికలకు 76 రోజుల ముందు చంద్రబాబు నోటిపికేషన్ ఇచ్చారు. మా ప్రభుత్వం మే 30న రాక మునుపే మే 26, 2019 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి. మేం వచ్చాక ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించి 2020 డిసెంబర్లో మెయిన్స్ నిర్వహించాం. బాబు హయాంలో నిర్వహించిన ప్రిలిమ్స్లో ఎంపికైన వారికి మెయిన్స్ నిర్వహిస్తే వారిపై బురద జల్లుతున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే మొత్తం ప్రక్రియకోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం. అటువంటి సమయంలో పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యం కాకూడదని అప్పటి అధికారులు డిజిటల్ ఎవాల్యుయేషన్కు వెళ్లాలని నిర్ణయించారు. అప్పటి కమిషన్లో మునుపటి ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నియమించిన ఐదుగురు సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. బోర్డులో ఉన్న 10మంది సభ్యుల్లో ఐదుగురు వాళ్ళే ఉన్నారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే.. రాసిన పరీక్షల స్క్రిప్ట్స్ను స్కాన్చేసి పరీక్ష దిద్దే వారికి పంపిస్తారు. ఆన్లైన్లో వారు మార్కులు వేస్తారు. ఇది కూడా కోవిడ్ వల్ల.. అప్పటి పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రక్త సంబంధీకులు చనిపోతే కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి భయపడే పరిస్థితులు అవి. గ్రూప్స్ కింద ఒకే చోట తీసుకువచ్చి ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేయలేని పరిస్థితి. అయినా కొంత మంది హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ పరిగణనలోకి తీసుకోలేదు. ప్రక్రియ ముందుకు సాగలేదు. డిజిటల్ ఎవాల్యుయేషన్ను తప్పుపట్టలేమని, కానీ నోటిఫికేషన్లో ఈ విషయం పేర్కొనకపోవడం వల్ల తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నట్లు హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొంది. హైకోర్టు చెప్పిన తర్వాత డిజిటల్ ఎవాల్యుయేషన్ అన్నది పరిగణనలోకి తీసుకోలేదు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసి ఆ మార్కుల ఆధారంగా ఇంటర్వూ్యలు పూర్తి చేసి, 163 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నాలుగేళ్ల నుంచి ఈ 163 మంది ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు వీరిపై విషం కక్కుతున్నారు.⇒ మెగా డీఎస్సీ స్కామ్లో కుమారుడిని కాపాడుకునేందుకే గ్రూప్ 1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు.⇒ చంద్రబాబు ఆరోపణలపై సీబీఐ విచారణకు మేం సిద్ధమే. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? చంద్రబాబు, లోకేశ్ సిద్ధమైతే సీబీఐకి లేఖ రాయాలి.⇒ 1.30 లక్షల ఉద్యోగాలు ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇచ్చిన చరిత్ర మాది⇒ అసలు పరీక్షే రాయకుండా ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారా? ⇒ స్కామ్ల కోసం జీవోలు ఇచ్చి పని పూర్తయ్యాక వాటిని రద్దు చేశారు⇒ మీ స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి అంతర్జాతీయ క్రీడాకారిణి సింధును అడ్డుపెట్టుకుంటారా?⇒ డీఎస్సీలో అక్రమాలు జరిగాయనేందుకు ఎన్నో సాక్షా్యలున్నాయి..⇒ ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ కోటా పేరిట ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చి ఎందుకు మార్చారు? పార్టిసిపెంట్ సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియో కాల్పై తీసుకున్న చర్యలేమిటి? డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇప్పిస్తామని తన దగ్గర రూ.14.10 లక్షలు లంచం వసూలు చేశారని బాధిత అభ్యర్థి రాధిక తాజాగా ఫిర్యాదు చేయడం స్కామ్కు నిదర్శనం కాదా?⇒ హైకోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగిన గ్రూప్ 1కి.. స్కామ్లు జరిగిన మెగా డీఎస్సీకి అసలు పోలిక ఉందా?చంద్రబాబు ఆరోపణలుృవాస్తవాలు1 డిజిటల్ ఎవాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయి.వాస్తవం: అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ను పూర్తిగా పక్కన పెట్టి, హైకోర్టు సూచనల మేరకు మాన్యువల్ ఎవాల్యుయేషన్లో ప్రక్రియ పూర్తి చేసినప్పుడు, ఈ ఆరోపణకు విలువేముంది?2 గ్రూప్1 ఎవాల్యుయేషన్ హాయ్ల్యాండ్లో ఏదో జరిగింది.వాస్తవం: హాయ్ల్యాండ్లో జరిగిన ప్రక్రియకు, తుది ఫలితాల వెల్లడికి ఏ సంబంధం లేదు. ఆ మేరకు 2025, నవంబరు 11న చంద్రబాబు ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మాన్యువల్ ఎవాల్యుయేషన్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అన్నీ నియమానుసారం జరిగాయని అధికారులు అందులో తేల్చి చెప్పారు. అందుకే హాయ్ల్యాండ్ అనేది టాపిక్ కాదు. అది అప్రస్తుతమని స్పష్టం చేశారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ కూడా ఏపీపీఎస్సీ, ఎస్ఆర్ఆర్ అండ్ సీఆర్ఆర్ కాలేజీలో జరిగాయని, ఎక్కడా అక్రమాలు లేవని, అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో జరిగిందని చెప్పారు.3 జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందివాస్తవం: జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, సిట్ (చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిందే) స్పష్టమైన నివేదిక ఇచ్చినా, అబద్ధాలు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారు. నిజానికి మాన్యువల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు ఏనాడైనా, అలా జవాబుపత్రాలు దిద్దించారా? ఆయన హయాంలో 2016, 2017లో పరీక్షలు నిర్వహించినప్పుడు పేపర్లు దిద్దేటప్పుడు సీసీ కెమెరాలు లేవు. మా హయాంలో ఏపీపీఎస్సీలో పనిచేసిన సవాంగ్లాంటి అధికారులు చాలా సమర్థులు.వీళ్లు అల్లాటప్పా మనుషులు కాదు. ఎప్పుడూలేని విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలు, వాటిని దిద్దడంలో కానీ, ఓఎంఆర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)లో కానీ ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, సీఎఫ్ఎస్ఎల్ స్పష్టంగా ధ్రువీకరించిందని సిట్ నివేదిక ఇచ్చింది. అయినా తన కొడుకును కాపాడుకునేందుకు, చంద్రబాబు గ్రూప్ృ1 పరీక్షపై అభాండాలు వేస్తున్నారు. ఇక ఇక్కడ వివాదం ఎక్కడుంది?.4 ఓఎంఆర్ షీట్ల సవరణలు గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారు. వారికి ఎలాంటి అర్హత లేదు.వాస్తవం: చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అంతా దొంగలే. అంతా తప్పుడు ప్రచారం చేస్తూ, నిందలు వేస్తున్నారు. అసలు వారు నియమించిన సిట్, చాలా స్పష్టంగా చెప్పింది. ఎక్కడా, ఏ తప్పు జరగలేదని తేల్చి చెప్పింది. ఇంకా సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. సీఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ గుర్తించాల్సిన ఒక అంశం ఏమిటంటే, మేము అధికారంలోకి వచ్చే నాటికే, ప్రిలిమ్స్ ముగిశాయి. మరి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ఏపీపీఎస్సీ బోర్డులో ఎక్కువ మంది టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే.5 పేపర్లు ఒకసారి దిద్దిన తర్వాత మళ్లీ కరెక్షన్స్ చేశారు.వాస్తవం: అసలు ఏపీపీఎస్సీ పరీక్షల మూల్యాంకనం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఎక్కడా అభ్యర్థికి అన్యాయం జరగకుండా అనేక మంది బాధ్యులు ఉంటారు. ఇంకా పలు దశలు ఉంటాయి. చీఫ్ ఎగ్జామినర్ మొదలు, స్క్రూటినైజర్, సూపర్వైజర్లు ఉంటారు. అంత మంది చెక్ చేస్తారు. కంట్రోల్ బండిల్ స్లిప్లు ఉంటాయి. వాటిపై అందరి సంతకాలు ఉంటాయి. అదొక పక్కా విధానం. ఎక్కడా ఏ అభ్యర్థికి నష్టం జరగకుండా ఒక పక్కా విధానం, వ్యవస్థ ఉంటుంది. ఇంకా ఏ పేపర్ ఎవరిదని ఎవరికీ తెలియదు. కేవలం బార్కోడ్ మాత్రమే ఉంటుంది. దిద్దేవారికి అది ఎవరి ప్రశ్నపత్రం అనేది అస్సలు తెలియదు. ప్రతి దానికి బార్ కోడ్, క్యాంప్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటుంది. వీటన్నింటిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా ఒక ప్రొసీజర్. ఏదో ఆరోపణ చేయాలని, బండపడేయాలన్నట్లు బురదజల్లుతున్నారు.6 రాతపరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపణ.వాస్తవం: ఇక్కడ నా సవాల్. చంద్రబాబుగారి హయాంలో గతంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల వివరాలు బయట పెట్టగలరా? నిజానికి ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు మా హయాంలో తెచ్చాం. అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహించాం. ఫేషియల్ రికగ్నిషన్, థంబ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారిగా పరీక్ష హాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశాం.మా తర్వాతే యూపీఎస్సీలో కూడా అమలు చేశారు. మా ప్రభుత్వం రాకముందు, ఏపీపీఎస్సీకి సంబంధించి ఒకటే ఇంటర్వ్యూ బోర్డు. అందులో ఒకరు మాత్రమే సివిల్స్ సర్వీసెస్ అధికారి ఉండేవారు. మేము వచ్చిన తర్వాత మూడు ఇంటర్వ్యూ బోర్డులు పెట్టాం. 24 మంది ఐఏఎస్, ఐపీఎస్లు, వివిధ వర్సిటీలకు చెందిన ఆరుగురు వీసీలను పెట్టాం. అభ్యర్థులకు జంబ్లింగ్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించాం.అంటే ఏ అభ్యర్థి, ఏ బోర్డు ముందుకు వెళ్తారో వేరెవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక, మళ్లీ పాత విధానం. ఒకటే బోర్డు, ఒకే ఐఏఎస్ అధికారి. మా హయాంలో ఒకేసారి 1.30 లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు వచ్చిందా? అంత పారదర్శకంగా ఆ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క ఆరోపణ వచ్చిందా? మా హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6296 పోస్టులు భర్తీ చేశాం. కానీ, ఎక్కడా వివాదాలు లేవు. మేము ఇచ్చిన రెండు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ.7 కొంత మంది ఎవాల్యుయేటర్లు సెల్ఫోన్లో మాట్లాడారు. వాస్తవం: అసలు తాను దిద్దేది ఎవరి పేపరో ఎవాల్యుయేటర్కు ఎలా తెలుస్తుంది? అక్కడ అభ్యర్థి పేరు, ఇతర వివరాలు ఏవీ ఉండవు. కేవలం ఒక్క బార్కోడ్ మాత్రమే ఉంటుంది. పైగా అన్నిచోట్ల సీసీ కెమేరాలు కూడా ఉన్నాయి. వక్రీకరణకైనా హద్దూ, పొద్దు ఉందా?చివరిగా చంద్రబాబుకు ఇదే నా సవాల్చంద్రబాబు ఆరోపణలు చేస్తున్న గ్రూప్ృ1 పరీక్ష, గత ఏడాది మీరు నిర్వహించిన డీఎస్సీ. రెండింటిపై సీబీఐ విచారణ జరిపిద్దాం. ఒక్క డీఎస్సీృ2025పైనే కాదు. గ్రూప్ృ1. 2018పైనా సీబీఐ విచారణకు మేము రెడీ. నీవు రెడీనా? మేము తప్పు చేయలేదు. మాకు ఆ ధైర్యం ఉంది. మరి మీకు ఆ ధైర్యం ఉందా? -
‘అందుకే చంద్రబాబు సర్కార్ తోకముడిచింది’
సాక్షి, విజయవాడ: గత నాలుగు రోజులుగా డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు రాలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. డీఎస్సీలో అవకతవకలున్నాయనే మేం విచారణ జరిపించాలని కోరాం. మార్కెట్లో వస్తువుల్లా ఉద్యోగాలు అమ్ముకున్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగింది వాస్తవం.. అందుకే ప్రభుత్వం తోకముడిచింది’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘డీఎస్సీతో పాటు గ్రూప్-1 పైన కూడా సీబీఐ విచారణ జరిపించండి. 1998 డీఎస్సీలో 5887 మందికి ఉద్యోగాలిచ్చింది మేమే. 2008 డీఎస్సీలో 2193 మందికి ఉద్యోగాలిచ్చింది కూడా మేమే. 2019లో స్పెషల్ డీఎస్సీ నిర్వహించి 521 మందికి ఉద్యోగాలిచ్చాం. 1250 మంది కేజీబీవీ టీచర్లకు ఉద్యోగాలు కల్పించాం. మార్కెట్లో ఉద్యోగాలు అమ్ముకుని అండపిండ బ్రహ్మాండం బద్దలైపోయినట్లు డాంబికం ఎందుకు?. ఈ ప్రభుత్వం పనైపోయింది. రెండేళ్లలోనే ప్రభుత్వం మోసం తెలిసిపోయింది..మాట్లాడితే సవాళ్లు విసురుతారు.. చర్చకు రమ్మంటే రారు. ప్రజల సమస్యల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సభలో చర్చించాలని కోరాం. మీలా ప్రతిదీ రాజకీయ కోణంలో మేం చూడలేం. మా ఇంటికొస్తే మీరు ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే మాకేమిస్తారు అనేలా ఉంది ప్రభుత్వం తీరు. రెండేళ్లలోనే లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు?. విద్యావ్యవస్థలో లోపం ఉంది కాబట్టే ప్రైవేట్కు తరలిపోయారు...విద్యావ్యవస్థను బలోపేతం చేసింది వైఎస్ జగన్. నాడు నేడు పెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చింది వైఎస్ జగన్. ఐబీ వంటి సిలబస్లు పెట్టి విద్యా ప్రమాణాలు పెంచింది వైఎస్ జగన్. జగన్ గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించాం. వైఎస్ జగన్ అమ్మ ఒడిని సక్రమంగా అమలు చేశారు’’ అని బొత్స వివరించారు. -
కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు..
-
బాబు, లోకేశ్కు వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ చెప్పిందని.. అయినా దుష్ప్రచారం ఆపడం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ఓపెన్ చాలెంజ్ విసిరారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 చంద్రబాబు హయాంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎన్నికల ముందు హడావిడిగా ఆయన దానిని రిలీజ్ చేశారు. మేం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయి. ప్రిలిమ్స్లో పాసైన వాళ్లకే మేం మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఎలాంటి అవకతవకలు జరగలేదని.. చంద్రబాబు వేసిన సిట్ చెప్పింది. వాల్యూయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా కూడా పదే పదే తప్పుడు ప్రచారాలు చేశారు. అసలు ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత మాది. మరి బాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయటపెట్టగలరా? అని సవాల్ విసిరారు. బాబు హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఫలితాలను బయటపెట్టగలరా?.. రిటన్ టెస్ట్లో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చాం. మా హయాంలో 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలిచ్చాం. ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. మా హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ.. మీ హయాంలో జరిగిన 2025 డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబుకి వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్ విసిరారు.తప్పు చేయలేదు కాబట్టే తల ఎత్తుకుని అడుగుతున్నాం. ఫస్ట్ ర్యాంకర్ నవీన్కు ఎందుకు ఉద్యోగం రాలేదు?. విద్యాశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా జీవోలు ఇవ్వగలరా?. బేరసారాల ఆడియో, వీడియో టేపులపై చర్యలేవీ?. సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశాం. సీబీఐ విచారణ చేయించాలని కోర్టును కూడా ఆశ్రయించాం. సవాల్కు సిద్ధమైతే.. విచారణకు సిద్ధమైతే దర్యాప్తు సంస్థకు లేఖ రాయండి అని వైఎస్ జగన్ అన్నారు. -
కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: స్పోర్ట్స్కోటాలో ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నాలు జరిగాయన్నది వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వమే ఒప్పుకుందని వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయని.. కేసు కూడా నమోదైందని ఆయన గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవోలిచ్చే స్థాయికి డీఎస్సీ స్కాం వెళ్లింది. మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?. డీఎస్సీ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. టేపులు బయటకు వచ్చినట్లు బాబు, లోకేశ్లు ఒప్పుకున్నారు. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ, జరిగింది ఏంటో తెలుసా?.. ఎఫ్ఐఆర్ కాపీలో నిందితుడిని సస్పెక్టెడ్ అని రాశారు. అరెస్ట్ శిక్ష సంగతి పక్కన పెడితే.. ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అసలు వెంటనే ఎఫ్ఐఆర్ రాయకుండా ఉన్నతాధికారులతో ఎందుకు మాట్లాడారు?. ఆడియో, వీడియో టేపుల్లో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ బయటకు వచ్చింది. ఆ నెంబర్ ఎవరిదనేది కనుక్కోవడం పోలీసులకు ఎంత సేపు పని?. దారుణంగా అబద్దాలు ఆడుతున్నారు.. నిందితులను కాపాడుతున్నారు అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీలో జాబ్ ఇస్తారని ఓ మహిళా అభ్యర్థి దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆపై మోసం చేశారు. ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తారని మభ్య పెట్టారు. ఆమె తనను మోసం చేశారని కంప్లయింట్ చేశారు. ఎవరికి రూ.14 లక్షలు ఇచ్చారో అనేది కూడా ఉంది. డీఎస్సీ అని పేర్కొనకుండా.. ఏపీ టూరిజంలో మోసం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో రాశారు. గతేడాది నవంబర్లోనే ఇది జరిగితే.. ఇప్పటిదాకా ఎలాంటి కేసు లేదు. కేసులో పురోగతి లేదని ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసినా.. పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవే కాదు.. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ, ఇక్కడ నారా లోకేశ్తో చంద్రబాబు రాజీనామా చేయట్లేదు. పైగా మరింత దిగజారిపోయారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని దుష్ప్రచారానికి దిగారు. కానీ, ఆ వ్యవహారం అయన ప్రభుత్వం చివర్లోనే ప్రిలిమ్స్ జరిగింది.ఆక్రోశంతో దుష్ప్రచారం2019కి ముందే బాబు హయాంలో ఆ నోటిఫికేషన్ వచ్చింది. మా ప్రభుత్వం అధికారం చేపట్టకముందే(2019 మే 26న).. ప్రిలిమ్స్ జరిగాయి. మేం ప్రిలిమ్స్లో పాసైన వాళ్లకు మెయిన్స్ మాత్రమే నిర్వహించాం. ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిజిటల్ వాల్యూయేషన్ జరిపించాం. అయితే కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. డిజిటల్ వాల్యూయేషన్ను పరిగణనలోకి తీసుకోకుండా మాన్యువల్ వాల్యూయేషన్ చేయాలని కోర్టు చెప్పింది. అలా చేశాకే.. నియామకాలు జరిపాం. అలాంటప్పుడు అక్రమాలకు తావెక్కడిది?. అయితే చంద్రబాబు ప్రభుత్వం.. డిజిటల్ వాల్యూయేషన్లో అవకతవకలు జరిగాయని అంటోంది. హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని పక్కన పెట్టాక ఆ ప్రస్తావన మళ్లీ ఎందుకు వస్తోంది?. అంటే.. ఇది 165 మంది జీవితాలను అతలాకుతలం చేసే ప్రయత్నమా?. ఇదే గ్రూప్-1 వ్యవహారంపై నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. 2025లో సిట్ వేశారు. ఆ సిట్ అధికారులు ఏ తప్పు జరగలేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇరికించే కుట్రలో భాగంగా మరో సిట్ వేశారు. సిట్లో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వంలో పని చేసేవారే కదా?. నిజాలను ఎవరూ దాచిపెట్టలేరు.. బయటకు రావాల్సిందే. మా హయాంలో ఇప్పటి డీఎస్సీ మాదిరి ఏ స్కాంలు జరగలేదు. మేమేం పరీక్షలే నిర్వహించకుండా.. ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవరికీ అనుకూలంగా జీవోలు తేలేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్లు.. బేరసారాలు జరిగినట్లుగా.. ఆడియో, వీడియోలు ఇలాంటి ఆధారాలేవీ బయటకు రాలేదు. మా హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబుకి ఈ ఆక్రోశం’’ అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీలో లీకేజీల నుంచి బేరసారాల వరకు పరిశీలించాలి. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాల్సిందే. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
PPPT-వేసి మరి అబ్బాకొడుకులను ఆడుకున్న YS జగన్
-
అసెంబ్లీలో గింజుకోవడం... బౌలింగ్ లేకుండానే తండ్రి కొడుకుల బ్యాటింగ్..
-
అసెంబ్లీ సాక్షిగా అబ్బా కొడుకులే నిజం ఒప్పుకున్నారు... లైవ్ లో వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
పీవీ సింధులా ఎంత మందికి మెడల్స్ వచ్చాయి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకే స్పోర్ట్స్ కోటాను ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన డీఎస్సీ అవకతవకలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.డీఎస్సీ పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్ నిలదీశారు. పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అసలు ఎలా అనగలిగిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చే సమయంలో కనీసం అభ్యర్థుల విద్యా సామర్థ్యాన్ని కూడా పరీక్షించాల్సిన అవసరం లేదా? అని అన్నారు. ‘‘చదువు చెప్పే వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తారా? చంద్రబాబు, లోకేశ్ మైండ్లో చిప్లు ఉన్నాయా? లేదా?’’ అని మండిపడ్డారు. స్పోర్ట్ కోటాలో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా జీవోలు కూడా జారీ చేశారని.. రిక్రూట్మెంట్లు అయ్యాక వాటిని వెనక్కి కూడా తీసుకున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పీవీ సింధుకు ఇచ్చినట్లుగానే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు.. కానీ పీవీ సింధులా ఎంతమంది అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని పతకాలు సాధించారు? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని దేశానికి ఎన్నో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగం ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరని ఆయన అన్నారు. కానీ అదే పేరుతో సాధారణ నియామక ప్రక్రియను పక్కనపెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.పీవీ సింధు స్థాయిలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారు ఎంతమంది? దేశానికి, రాష్ట్రానికి పతకాలు సాధించినవారు ఎంతమంది? అనేది చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అర్హతలు, వారు సాధించిన పతకాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు, నారా లోకేశ్ల అబద్ధాలు ఏస్థాయిలో ఉన్నాయంటే.. ఆర్చరీలో గోల్డ్ మెడల్ అందుకున్న దుర్గయ్యకి కూడా ఉద్యోగం రాలేదు. కాల్లెటర్ పంపిన తర్వాత కూడా.. ఉద్యోగం ఇవ్వలేదు అంటే అర్థం చేసుకోవాలి అని వైఎస్ జగన్ అన్నారు. అందుకే తాము సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. -
బౌలింగ్ లేకుండానే తండ్రి కొడుకుల బ్యాటింగ్.. లోకేష్ అసెంబ్లీ స్పీచ్ పై జగన్ ఫైర్
-
బాబూ...! 'ఓటుకు నోటు' కేసు మరిచిపోయావా?
ఎన్నికలలో డబ్బులు తీసుకోవడం మానేయలేమా? ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వచ్చిన ఒక పెద్ద సందేహం!కొందరు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం అయిన సందర్భంలో ఆయన ఈ ప్రశ్న వేశారు. నిజానికి చంద్రబాబు ప్రశ్న వేసుకోవలసింది తనకే కదా అని ఎవరికైనా డౌటు రావచ్చు. అసలు చంద్రబాబు చెప్పవలసిన మాటేమిటి? ఇకపై వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ఏ ఎన్నికలోను తాము పార్టీపరంగా ఓటర్లకు డబ్బు పంచబోమని, అలాగే ఏ పార్టీని పంచబోనివ్వబోమని కదా! నిజంగా ఈ మాట అని ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది.ఇంతకాలం జరిగిన విషయాల సంగతెలా ఉన్నా ఇకపై ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గించడానికి చంద్రబాబు ఇప్పటికైనా పూనుకోవడం మంచి పరిణామం కదా అని అంతా అనుకునేవారు. వాస్తవంగా అలా జరుగుతుందా? లేదా? అన్నది పక్కనబెడితే, కనీసం మాటవరసకైనా అన్నారులే అని భావించవచ్చు. ఇప్పుడు ఆ మాట చెప్పకపోవడంతో ఆయన చిత్తశుద్దిని శంకించే పరిస్థితి ఏర్పడుతుంది కదా! పైగా మహిళలే డబ్బు తీసుకుంటున్నట్లు మాట్లాడడంపై మాజీ మంత్రి రోజా వంటి వారు అభ్యంతరం చెప్పారు. ఇది మహిళలను అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే ఘాటు వ్యాఖ్య చేస్తూ రాజకీయాన్ని వ్యాపారమయం చేసిందే చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని ఈసీకి లేఖ కూడా రాశారు. నాయకులు రెండువేలు ఇస్తే, రెండు లక్షలు సంపాదించుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు లక్షలేమి ఖర్మ.. రెండు కోట్లు అయినా కావచ్చు. అదేమి రహస్యం కాదు. మాకు నీతి ఉంది.. డబ్బులు తీసుకోబోమని చెప్పండి అని ఆయన అన్నారు. నేతలు డబ్బు ఇస్తుంటే తమకు నీతి ఉందని చెప్పండని, డబ్బు తీసుకోకుండా ఓటేయండి అని ఆయన అన్నారు. ఇది మంచిమాటే.ఎన్నికలలో డబ్బు ఇచ్చేవారిది తప్పుకాదా! తీసుకునేవారిదే అవుతుందా? ఒకప్పుడు ఈ డబ్బు ప్రభావం పెద్దగా ఉండేది కాదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత, అది చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాకే ఇది బాగా అధికం అయిందని వివిధ రాజకీయ పక్షాల నేతలు విమర్శిస్తుంటారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ డబ్బు ఖర్చు పెడుతోందా? లేదా? ఓట్ల కొనుగోలుకు డబ్బు వ్యయం చేయడం లేదని చంద్రబాబు గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేముందు ఆయా అభ్యర్దులను వారి పరిస్థితిని బట్టి 25 కోట్ల నుంచి ఏభై కోట్ల వరకు ఖర్చు చేయగలరా? లేదా? అని అడుగుతున్నారా? లేదా? కొందరి నుంచి కోట్ల రూపాయలు టిక్కెట్ కోసం వసూలు చేస్తున్నారా? లేదా? ఇతర పార్టీలు చేయడం లేదా?అని అడగవచ్చు.ఒకరిని బట్టి మరొకరు చేసే పరిస్థితి ఎలా వచ్చింది? చంద్రబాబు ఈ సుభాషితాలు చెప్పగానే అనేక పాత విషయాలు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో సహిత వ్యాఖ్యలు వచ్చాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసును పలువురు ప్రస్తావించారు. 2015లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికిగాను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్న ఆరోపణ వచ్చింది. ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏభై లక్షల రూపాయలు తీసుకువెళ్లి ఏసీబీకి పట్టుబడిన వైనం, ఆ తర్వాత ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి భరోసా ఇవ్వడం వంటి సన్నివేశాలు మరోసారి తెరపైకి వచ్చాయి.ఆ క్రమంలో అప్పటి సీఎం అయిన కేసీఆర్తో రాజీలో భాగంగానే అప్పటికప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదలుకుని చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారు. 1995లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి కోట్లు వెచ్చించారని చంద్రబాబుపై స్వయంగా ఆయన మామ ఎన్టీ.రామారావు ఆరోపించారు. ఆ రోజుల్లో అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఓటుకు 500 రూపాయలు చొప్పున టీడీపీ పక్షాన పంచామని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఒక టీవీ షోలో ఓపెన్గానే కొన్నేళ్ల క్రితం చెప్పారు. అప్పటి నుంచి ఓటు రేటు పెరుగుతూ రెండువేలకు చేరుకుందని అంటారు.ఇక 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేసింది అందరికి తెలుసు. ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తనకు ఏడు కోట్లు టీడీపీ నాయకత్వం ఇచ్చిందని ఆ రోజుల్లో బహిరంగంగానే వెల్లడించారు. మరో ఎమ్మెల్యే తనకు బెంగుళూరులో డబ్బు అందచేశారని అంటే, ఇంకొకరు తన అప్పు మొత్తం తీరిపోయిందని, అందుకే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించానని ఆంతరంగికంగా చెప్పేవారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది చంద్రబాబు అభిప్రాయం.కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఒక ఉపన్యాసంలో ఈ ప్రస్తావన చేశారు. ఇతర విషయాల సంగతేమో కాని, ఎన్నికల విషయంలో ఆయన డబ్బు వ్యయంలో రాజీపడరని కొందరు సీనియర్ టీడీపీ నేతలు చెబుతుంటారు. అవసరమైతే అప్పు చేయడానికి వెనుకాడరు. అలా అప్పులు ఇచ్చినవారిలో కొందరు ఎన్ఆర్ఐలు ఉన్నారని ప్రచారం జరిగేది.తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ కొత్తగా రాజకీయాలలోకి వచ్చి ఓటర్లకు డబ్బు ఇవ్వకుండా విజయం సాధించారని చెబుతారు. ఆయన మాదిరి ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు అదేబాటలో నడుస్తానని చెప్పి ఉండాల్సింది కదా! ఉచిత బస్ స్కీమ్ వల్ల మహిళల ఆత్మగౌరవం పెరిగిందట. అది ఎలా ఉందో కాని, బస్లలో జరుగుతున్న గొడవలపై పలుచోట్ల ప్రజలు చికాకు పడుతున్నారు. ఒకప్పుడు ఏదీ ఉచితం కాదని చెప్పిన చంద్రబాబు తాను ఉచిత బస్ వంటి స్కీమ్ అమలు చేస్తే మాత్రం గొప్ప సంగతి అని చెప్పుకుంటారు. అది ఆయన ప్రత్యేకత.ఈ సందర్భంలో ఒక మహిళ తాను ఫ్రీబస్ ఉందని హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని, విజయనగరం నుంచి రోజూ ఉచిత ప్రయాణం వల్ల 3500 రూపాయలు సేవ్ అవుతున్నాయని అన్నారు. తీరా చూస్తే ఆమె ఏదో చీరల వ్యాపారం చేస్తున్నారని, రీల్స్ చేస్తుంటారని సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఈ ఉదంతం నవ్వులపాలైనట్లయింది. పైగా హైదరాబాద్లో కూడా ఫ్రీబస్ స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది కదా అని కొందరు పేర్కొంటున్నారు.మహిళలకు ఇచ్చిన ఇతర హామీల గురించి ప్రస్తావించకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతుంటారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఇస్తానన్న ఆడబిడ్డ నిధి గురించి మాత్రం మాట్లాడలేదు. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బు ఇస్తామని, వేలంపాట మాదిరి ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. దాని గురించి ఏమనుకుంటున్నారని చంద్రబాబు మహిళలను అడగలేదు. ఒక్కో కుటుంబానికి నాలుగు పథకాలు వస్తున్నాయని ఆయనే అంటారు. చేపలు ఇవ్వడం కాదు. చేపలు పట్టడం నేర్పాలి.. అని ఆయనే చెబుతారు. దేనిని నమ్మాలి!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబుకు ఊహించని షాక్.. ఎదురు తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
-
ఏపీకి తుంగభద్ర నీరు వద్దా?
హొసపేటె: ఎల్నినో వల్ల ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుంది. తాగు, సాగు నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పొరుగు రాష్ట్రాల నుంచి తమకు రావాల్సిన నీటివాటా కంటే ఎక్కువ అడిగి ప్రజల కష్టాలను తీర్చాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా రాయలసీమకు తుంగభద్ర నుంచి రావాల్సిన నీటి విషయంలో చంద్రబాబు సర్కారు తీరు రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా కర్నూలు జిల్లాకు లో లెవెల్ కెనాల్(ఎల్ఎల్సీ) ద్వారా తుంగభద్ర నీరు వెళ్తుంది. తమకు ఎంత నీరు కావాలి, ఎప్పటి నుంచి ఎప్పటివరకు నీటిని విడుదల చేయాలి... అనే వివరాలతో కర్నూలు జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ లేఖలు పంపిస్తారు. కానీ ఇప్పటి వరకు కర్నూలు జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ లేఖలు తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్లకు చేరలేదు. దీంతో డ్యామ్ అధికారులు కూడా కర్నూలుకు నీటి విడుదల గురించి పట్టించుకోవడం లేదు. ఆగస్టు మూడో వారం వచి్చనా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటి వాటాపై ఏపీ అధికారుల నుంచి అధికారిక లేఖ (ఇండెంట్) తుంగభద్ర డ్యామ్ కార్యాలయానికి రాకపోవడం కర్ణాటక అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నిండుకుండలా తుంగభద్ర ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ సుమారు 80 టీఎంసీలతో నిండుకుండలా తొణికిసలాడుతుంది. ఆదివారం డ్యామ్కు 18,550 క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యామ్లో నీటిమట్టం 1,630 అడుగులకు చేరుకుంది. డ్యామ్ పూర్తిగా నిండేందుకు ఇంకా 3 అడుగులు మాత్రం మిగిలి ఉంది. కర్ణాటక ప్రభుత్వం తమ వాటా కింద హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకి నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కర్నూలుకు వచ్చే నీటిని అడ్డుకున్న కర్ణాటక రైతులు కర్నూలు జిల్లా నుంచి అధికారిక ఇండెంట్ రాకపోవడంతో ఎల్ఎల్సీ ద్వారా ఏపీకి వస్తున్న కొద్దిపాటి నీటిని కూడా కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం వద్ద ఏపీలోకి ప్రవేశించే చోట ఎల్ఎల్సీ 155వ కిలోమీటరు వద్ద భారీ సంఖ్యలో కర్ణాటక రైతులు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి నీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారు. టీబీ డ్యామ్లో నీటిమట్టం సంతృప్తికరంగా లేదని, తమ పొలాలు ఎండిపోతాయనే సాకుతో ఏపీకి రావాల్సిన నీటిని అడ్డుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి తుంగభద్ర డ్యామ్ అధికారులకు అధికారిక ఇండెంట్ పంపించి కర్నూలు జిల్లాకు నీరు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. -
అవిటి మహిళను ఇబ్బందిపెడితే మీకేమొస్తుంది?
కర్నూలు (సెంట్రల్): సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి కర్నూలు నుంచి విజయవాడ వరకు తలపెట్టిన వీల్చైర్ యాత్రపై చంద్రబాబు కూటమి సర్కారు ఉక్కుపాదం మోపింది. యాత్ర ప్రారంభం కాగానే.. అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎంతో క్రూరంగా, కర్కశంగా వ్యవహరించిన పోలీసులు ఆమెను ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనీయలేదు. తాను న్యాయం కోసం ఈ యాత్ర చేపట్టానంటూ కన్నీళ్లతో వేడుకున్నా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె వీల్చైర్ యాత్రను విరమిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. తన కుమార్తె సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్యచేసిన వారిని శిక్షించాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. తన యాత్రను ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. నిందితులు విదేశాల్లో తిరిగేందుకు అనుమతించిన ప్రభుత్వం.. తాను న్యాయం కోసం వీల్చైర్ యాత్ర చేపడితే పోలీసుల సాయంతో ఎందుకు అడ్డుకుంటోందని నిలదీశారు. అవిటి మహిళను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ఆరి్టకల్ 19 ప్రకారం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించుకునే హక్కును ప్రసాదించిందని, అయితే కూటమి ప్రభుత్వం మాత్రం క్రూరత్వంతో పౌరుల స్వేచ్ఛను హరిస్తోందని దుయ్యబట్టారు. ఉదయం నుంచే కాపుకాసిన పోలీసులు సుగాలి ప్రీతిబాయి 9వ వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు నుంచి విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఆఫీసు వరకు ఈ నెల 19న వీల్చైర్ యాత్ర చేపడతానని పార్వతీబాయి గతంలోనే ప్రకటించారు. ఆమె యాత్రకు అనుమతి లేదంటూ ఎస్పీ విక్రాంత్పాటిల్ మంగళవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన నోటీసులను పోలీసులు ఆమె ఇంటికి అతికించారు. పార్వతీబాయి బుధవారం ఉ.8 గంటలకే సుంకేశుల రోడ్డులోని క్రిస్టియన్ శ్మశానవాటికలో ప్రీతిబాయి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మ«.ఒంటిగంట వరకు ప్రీతిభాయి సంస్మరణ సభను నిర్వహించి, వీల్చైర్ యాత్ర మొదలుపెట్టారు. ఉదయం నుంచే అక్కడ కాపేసిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతల ప్రోద్బలంతో దాదాపు 80 మీటర్ల వరకు వీల్చైర్ యాత్ర అతికష్టం మీద పోలీసుల తోపులాటల మధ్య కొనసాగింది. చివరికి పోలీసులు రోప్ల సాయంతో యాత్రను అడ్డుకున్నారు. తన కుమార్తెను హత్యచేసిన వారిని శిక్షించాలని తొమ్మిదేళ్లుగా కోరుతున్నానని, వీల్చైర్ యాత్ర చేసుకుంటానని ఆమె ఆవేదనతో అర్థించినా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె యాత్రను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి ప్రభుత్వం అడ్డుకుని ఉంటే లోకేశ్, పవన్ యాత్రలు చేసేవారా? అనంతరం పార్వతీబాయి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం నిందితులను కాపాడటానికి ప్రయత్నిస్తోం దని, అందుకే తన యాత్రను అడ్డుకుందని విమర్శించారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్యచేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వమే ఉందని చెప్పారు. తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పరిగణనలోకి తీసుకుని ఇల్లు, పొలం, ఉద్యోగం, డబ్బులు ఇచ్చి ఆదుకుందన్నారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రీతిబాయికి న్యాయం చేసేందుకు తనపక్షాన ఉంటానని ప్రకటించారని గుర్తుచేశారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక 11 సార్లు కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. తన కుమార్తె కేసును ఆయన ఎన్నికల కోసమే వాడుకున్నారని అర్థమైందన్నారు. ఎన్నికలకు ముందు పవన్కళ్యాణ్, లోకేశ్ చేసిన వారాహి, యువగళం యాత్రలకు అప్పటి ప్రభుత్వం అనుమతిచ్చి రక్షణ కల్పించిందని గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం అడ్డుకుని ఉంటే వారు యాత్రలు చేసేవారా.. అని ప్రశ్నించారు. విజయకుమార్, రజని, పలువురు నేతల మద్దతు సుగాలి పార్వతీబాయి వీల్చైర్ యాత్రకు లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్, జనసేన మాజీ నేత రజని, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల నుంచి వచ్చిన పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ పవన్కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక అసలు రంగు బయటపడిందని విమర్శించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలన్నీ స్వార్థం కోసమే చేశారని తేలిందని చెప్పారు. జనసేన మాజీ నేత రజని మాట్లాడుతూ కేవలం పవన్కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం కోసమే అప్పట్లో ప్రీతి కేసు గురించి మాట్లాడారని విమర్శించారు. ఇవిగో ఆధారాలు తమ కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగినట్లు నిరూపించేందుకు అనేక ఆధారాలున్నాయని చెప్పారు. పోస్టుమార్టం ఎగ్జామినేషన్, పెథాలజీ, సైటాలజీ, సీడీఎఫ్డీ సెంట్రల్ ల్యాబ్ (హైదరాబాద్) రిపోర్టులు, కర్నూలు జిల్లా కలెక్టర్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక, ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ సిఫారసు మేరకు కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక ఉన్నాయని తెలిపారు. వీటన్నింటితో నిందితులెవరో చెప్పవచ్చన్నారు. కేసును సీబీఐ విచారిస్తే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని చెప్పారు. నిందితులు ఎవరో తేలేవరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. -
నేర చరిత్రలో 4వ స్థానంలో చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసుల జాబితాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబుపై 19 కేసులు నమోదు కాగా 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు నియమించిన సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి 22వ నివేదిక సమర్పించారు. ఇందులో పలు కీలక వివరాలను వెల్లడించారు. సీఎంల జాబితాలో రేవంత్ టాప్.. దేశంలో 28 రాష్ట్రాలకుగాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికల ఆధారంగా అమికస్ క్యూరీ తెలిపారు. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి 89 కేసులతో (72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 160 ఇతర ఐపీసీ సెక్షన్లు) దేశంలోనే తొలి స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. ఆందోళనకరంగా తెలుగు రాష్ట్రాల చట్టసభలు.. చట్టసభల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల సంఖ్య తీవ్ర ఆందోళనకరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల గణాంకాలను నివేదికలో విపులంగా ప్రస్తావించారు. ఏపీ అసెంబ్లీలో 2024 ఎన్నికల నాటికి ఉన్న ఎమ్మెల్యేల్లో 138 మందిపై (79 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 98 మంది (56 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏపీకి చెందిన 25 మంది లోక్సభ సభ్యుల్లో 13 మందిపై (52 శాతం) కేసులు ఉండగా 9 మందిపై (36 శాతం) తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలోని 2023 ఎన్నికల నాటికి ఉన్న ఎమ్మెల్యేల్లో 81 మందిపై (68 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 58 మంది (49 శాతం) తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తెలంగాణలోని 17 మంది లోక్సభ ఎంపీల్లో 14 మంది (82 శాతం) క్రిమినల్ కేసులు, 12 మంది (71 శాతం) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్...దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ఏకంగా 4,192 కేసులు ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ దశలో పెండింగ్లో ఉన్నట్లు హైకోర్టులు ఇచ్చిన సమాచారం ద్వారా నివేదిక స్పష్టం చేసింది.పదేళ్లకు పైగా విచారణకు నోచుకోని కేసులు 519 ఉన్నాయి. ఐదు నుంచి పదేళ్ల మధ్య పెండింగ్లో ఉన్నవి 754 కేసులుగా తేలింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఉన్నవి 562 కేసులు ఉన్నాయి. మూడేళ్ల లోపు ఉన్నవి 1,095 కేసులుగా నమోదయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలపై 335 కేసులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు విచారణ దశలో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఛార్జ్షీట్ దాఖలు కాకుండా దర్యాప్తు దశలోనే 700 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తు దశలోనే ఉండిపోయాయి. ఏపీ హైకోర్టు నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై 18 విచారణ కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సమర్పించిన నివేదికలో కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 21 కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొనగా హైకోర్టు అధికారిక వెబ్సైట్లో రాష్ట్రవ్యాప్తంగా 300 కేసులు పెండింగ్లో ఉన్నట్లు నమోదైంది. 2025లో దేశవ్యాప్తంగా 1,243 కేసులు పరిష్కారం కాగా కొత్తగా 1,050 కేసులు నమోదయ్యాయి. అమికస్ క్యూరీ కీలక సిఫార్సులు...ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా పలు కీలక సూచనలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు కేవలం ఆ కేసులనే విచారించాలి. ఆ కేసులు పూర్తయిన తర్వాతే సాధారణ కేసులను వాటికి కేటాయించాలి. హైకోర్టులు సుమోటోగా కేసుల పురోగతిని ప్రతి నెలా పర్యవేక్షించాలి. ఛార్జ్ ఫ్రేమ్ చేసిన ఏడాది లోపు విచారణను తప్పనిసరిగా పూర్తి చేయాలి. మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను జాప్యం లేకుండా రోజువారీగా విచారించాలి. వరుసగా రెండు వాయిదాలకు నిందితులు హాజరు కాకపోతే తక్షణమే నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి. సాక్షులను కోర్టులో హాజరుపరిచే బాధ్యతను నోడల్ ప్రాసిక్యూషన్ అధికారికి అప్పగించాలి. ఒకవేళ విఫలమైతే సదరు అధికారిపై జిల్లా ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. కేసుల వివరాలు, రోజువారీ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రియల్ టైమ్ డేటా ద్వారా పొందుపరచాలి. -
బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడీ
సాక్షి, అమరావతి: బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధమైన ప్రక్రియను పక్కనపెట్టిన చంద్రబాబు సర్కారు ఒక్కపక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై బీసీలను మ«భ్యపెడుతూ మరోపక్క న్యాయస్థానాలు తప్పుబట్టే నిర్ణయాలతో ఆటలాడుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం బుధవారం నివేదిక అందజేసిన సందర్భంగా ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలంటూ హైకోర్టు రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు సూచించటాన్ని బట్టి చంద్రబాబు బురిడీ రాజకీయాలు స్పష్టమవుతున్నాయి. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపులు కొనసాగుతుంటాయి. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూడాలంటే బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ రిజర్వేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందువల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే పరిస్థితి ఉంటే హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లే తగ్గించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత కావాలని బీసీ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు దీన్ని విస్మరించి న్యాయస్థానాలు తప్పుబట్టేలా వ్యవహరించటాన్ని బట్టి బీసీ రిజర్వేషన్లపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందనే చర్చ జరుగుతోంది. రెండేళ్లుగా చిన్న ప్రయత్నమైనా చేయకుండా డ్రామాలు.. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పరమైన రక్షణ లేకపోవడం, జనాభా లెక్కలు లేకపోవడంతో స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛకు వదిలిపెట్టారు. చట్టబద్ధమైన బీసీ జనాభా లెక్కల వివరాలు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో ప్రస్తుతం టీడీపీపై ఆధారపడిన ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతున్నప్పటికీ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై రెండేళ్లుగా సీఎం చంద్రబాబు చిన్న ప్రయత్నం కూడా చేయకుండా డ్రామాలాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తాజాగా శాసనసభలో చర్చ సందర్భంలో సైతం దీనికి చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కనీసం తీర్మానం చేయకపోవటాన్ని బట్టి చంద్రబాబు అసలు నైజం తెలుస్తోందనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేవలం మంత్రివర్గం నిర్ణయంతో సరిపెట్టడం బట్టి రిజర్వేషన్ల చెల్లుబాటుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బీసీల కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గత ప్రభుత్వం అసెంబ్లీలో సైతం తీర్మానం చేసి కేంద్రానికి పంపి చిత్తశుద్ధి చాటుకుంది. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని నాడు వైఎస్ జగన్ కోరడం గమనార్హం. బీసీ రిజర్వేషన్లపై మరో కుట్ర» 34 శాతం రిజర్వేషన్లపై రేపు కోర్టుకు వెళ్లేది చంద్రబాబే » వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి అనిల్కుమార్యాదవ్ సాక్షి, అమరావతి: స్థానికసంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతున్నట్లు వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు డప్పు కొట్టుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి పి.అనిల్కుమార్యాదవ్ విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచితే, తన మనుషులతో కోర్టులో పిటిషన్లు వేయించి అడ్డుకున్న ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. అనిల్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని, ఈసారి కూడా తన మనుషులతో వీటిపై పిటిషన్లు వేయించి వైఎస్సార్సీపీ మీదకు నెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పారు. అందుకే ముందస్తుగా లీకులిస్తున్నారన్నారు. ‘బీసీలకు 50 శాతం పదవులిచ్చింది వైఎస్ జగన్. కోర్టు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయంగా పదవులిచ్చారు. బీసీలను నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది. స్థానికసంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారు. జగన్ ఇచ్చిన రిజర్వేషన్లను అడ్డుకుంది మీరేగా గతంలో జగన్ రాజకీయ పదవుల్లో 50 శాతాన్ని బీసీలకు ఇచ్చారు. 25 మంది ఎంపీలుంటే అందులో 11 ఎంపీ సీట్లు ఇచ్చారు, రాజ్యసభలో సైతం మొదటిసారి నాలుగు ఎంపీ పదవులు ఇచ్చారు. 58 ఎమ్మెల్సీ పదవుల్లో 28 మంది బీసీలకు అవకాశం కల్పించారు. 13 మేయర్ పోస్టుల్లో తొమ్మిది బీసీలకు ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ పదవులు 13లో ఆరు బీసీలకు ఇచ్చారు. 84 మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చారు. ఇలా చూసుకుంటే 40 నుంచి 60 శాతం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవుల్ని జగన్ బీసీలకు ఇచ్చారు. పార్లమెంట్లో 50 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రైవేటు బిల్లు పెట్టించిన ఘనత జగన్దే. మీరు ఒక్కసారి అయినా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇప్పుడు మొదట వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొంటున్నారు. అసలు బీసీలకు ఈ విధంగా పదవులు ఇవ్వాలని జగన్ అంకురార్పణ చేస్తే, దాన్ని అమలుచేయక తప్పని పరిస్ధితి మీది. 2019కి ముందు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో ఎంత మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో చూడాలి. జగన్ హయాంలో 196 మార్కెట్ యార్డుల్లో 76 చోట్ల బీసీలు చైర్మన్లు అయ్యారు. వడ్డెర్లకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఓడిపోయినా ఏసురత్నం రూపంలో మండలిలో స్థానం కల్పించారు’ అని అనిల్కుమార్ పేర్కొన్నారు. చాలా చిన్నస్థాయిలో ఉన్నవారికి కూడా జగన్ ఊహించని పదవులు ఇచ్చారన్నారు. -
నేర చరిత్రలో టాప్లో రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి 89 కేసులతో (72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 160 ఇతర ఐపీసీ సెక్షన్లు) దేశంలోనే తొలి స్థానంలో ఉన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబుపై 19 కేసులు నమోదు కాగా 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు నియమించిన సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి 22వ నివేదిక సమర్పించారు. ఇందులో పలు కీలక వివరాలను వెల్లడించారు. దేశంలో 28 రాష్ట్రాలకుగాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికల ఆధారంగా అమికస్ క్యూరీ తెలిపారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్కు చెందిన సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ 19 కేసులతో మూడో స్థానంలో ఉన్నారు. ఆందోళనకరంగా తెలుగు రాష్ట్రాల చట్టసభలు.. చట్టసభల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల సంఖ్య తీవ్ర ఆందోళనకరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల గణాంకాలను నివేదికలో విపులంగా ప్రస్తావించారు. ఏపీ అసెంబ్లీలో (2024 ఎన్నికల నాటికి) మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 138 మందిపై (79 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 98 మంది (56 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏపీకి చెందిన 25 మంది లోక్సభ సభ్యుల్లో 13 మందిపై (52 శాతం) కేసులు ఉండగా 9 మందిపై (36 శాతం) తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలోని (2023 ఎన్నికల నాటికి) 119 మంది ఎమ్మెల్యేల్లో 81 మందిపై (68 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 58 మంది (49 శాతం) తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తెలంగాణలోని 17 మంది లోక్సభ ఎంపీల్లో 14 మంది (82 శాతం) క్రిమినల్ కేసులు, 12 మంది (71 శాతం) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్... దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ఏకంగా 4,192 కేసులు ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ దశలో పెండింగ్లో ఉన్నట్లు హైకోర్టులు ఇచ్చిన సమాచారం ద్వారా నివేదిక స్పష్టం చేసింది. పదేళ్లకు పైగా విచారణకు నోచుకోని కేసులు 519 ఉన్నాయి. ఐదు నుంచి పదేళ్ల మధ్య పెండింగ్లో ఉన్నవి 754 కేసులుగా తేలింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఉన్నవి 562 కేసులు ఉన్నాయి. మూడేళ్ల లోపు ఉన్నవి 1,095 కేసులుగా నమోదయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలపై 335 కేసులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు విచారణ దశలో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఛార్జ్షీట్ దాఖలు కాకుండా దర్యాప్తు దశలోనే 700 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తు దశలోనే ఉండిపోయాయి. ఏపీ హైకోర్టు నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై 18 విచారణ కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సమర్పించిన నివేదికలో కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 21 కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొనగా హైకోర్టు అధికారిక వెబ్సైట్లో రాష్ట్రవ్యాప్తంగా 300 కేసులు పెండింగ్లో ఉన్నట్లు నమోదైంది. 2025లో దేశవ్యాప్తంగా 1,243 కేసులు పరిష్కారం కాగా కొత్తగా 1,050 కేసులు నమోదయ్యాయి. అమికస్ క్యూరీ కీలక సిఫార్సులు... ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా పలు కీలక సూచనలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు కేవలం ఆ కేసులనే విచారించాలి. ఆ కేసులు పూర్తయిన తర్వాతే సాధారణ కేసులను వాటికి కేటాయించాలి. హైకోర్టులు సుమోటోగా కేసుల పురోగతిని ప్రతి నెలా పర్యవేక్షించాలి. ఛార్జ్ ఫ్రేమ్ చేసిన ఏడాది లోపు విచారణను తప్పనిసరిగా పూర్తి చేయాలి. మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను జాప్యం లేకుండా రోజువారీగా విచారించాలి. వరుసగా రెండు వాయిదాలకు నిందితులు హాజరు కాకపోతే తక్షణమే నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి. సాక్షులను కోర్టులో హాజరుపరిచే బాధ్యతను నోడల్ ప్రాసిక్యూషన్ అధికారికి అప్పగించాలి. ఒకవేళ విఫలమైతే సదరు అధికారిపై జిల్లా ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. కేసుల వివరాలు, రోజువారీ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రియల్ టైమ్ డేటా ద్వారా పొందుపరచాలి. -
జీతాలకే 98 శాతమా? చంద్రబాబు లెక్కలపై ఉద్యోగుల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు ఎంత వ్యయం అవుతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 94 నుంచి 98 శాతం వ్యయం అవుతోందని, సంక్షేమ స్కీములకు అప్పులు తెస్తున్నామని ఆర్ధిక పరిస్థితి శ్వేతపత్రం విడుదల సందర్భంగా చెప్పారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన పడుతున్నారు. వారి సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వీరిలో కొందరు టీడీపీ అనుకూల నేతలు కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఏపీ ఎన్జీవోల గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడుగా ఉన్న అలపర్తి విద్యాసాగర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి కాదని అంటారు. కాని ఆయన సైతం చంద్రబాబు అసత్యపు లెక్కలు చెప్పారని అంటున్నారు.చంద్రబాబు చెప్పేదానిలో నిజం ఉంటే, ఈ నేతలు ఇంత ధైర్యంగా ఖండించగలుగుతారా అన్నది చర్చ. చంద్రబాబు లెక్కల్లో ఎక్కువ సందర్భాలలో నిర్దిష్టత అన్నది ఉండదు. అందువల్ల ఆయన చెప్పేదానిలో సత్యం ఎంత ఉంది? అసత్యం ఎంత ఉంది అన్నది తేల్చడం అంత తేలికకాదు. మొత్తం ప్రభుత్వ లెక్కలన్నీ పరిశీలించి ఒక అవగాహనకు రావల్సి ఉంటుంది. అందువల్లే ఉద్యోగ సంఘాల నేతలు అన్నిటిని సరిపోల్చుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంంది. విద్యాసాగర్ చెబుతున్నదాని ప్రకారం 30 నుంచి 35 శాతమే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ఉ ద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో వంచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరింత వివరంగా ఈ అంశంపై మాట్లాడారు. 2025లో ప్రభుత్వం వ్యయం చేసిన 2.26 లక్షల కోట్లలో 37.4 శాతం మాత్రమే ఉద్యోగులకు అయిన ఖర్చు అని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే పన్నుల రాబడిలో 59 శాతం, ఇతర రాబడి కూడా కలిపితే 49 శాతం మాత్రమే ఉద్యోగులకు పెడుతన్న ఖర్చు అని ఆయన వివరించారు. ఈ రెండేళ్లలో 41 వేల మంది రిటైరైతే, వచ్చే ఐదేళ్లలో లక్షన్నర మందికి పైగా రిటైర్ కాబోతున్నారని, అదే సమయంలో కొత్త రిక్రూట్ మెంట్ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సంపద సృష్టించి హామీలు నెరవేర్చుతామని చంద్రబాబు అన్నారని, ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించారని, జాబ్ కాలెండర్ ఇస్తామన్నారని, కాని ఇప్పుడేమో డబ్బంతా ఉద్యోగులకే అయిపోతోందని ప్రచారం చేస్తున్నారని వలిశెట్టి దామోదర్ అనే మరో ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు.గతంలో ఉద్యోగుల నేతగా ఉండి, ప్రభుత్వ ఆగ్రహానికి గురైన మరో ప్రముఖుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఉద్యోగులకు 30 వేల కోట్ల బకాయిలు చెల్లించామని ఆయన అనడం అసత్యమని అన్నారు. ఉద్యోగుల జీతాల ఖర్చు 35 నుంచి నలభై శాతమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికి 50 వేల కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పినా, ఆచరణలో జరగడం లేదని ఈ నేతలంతా అంటున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు ఇంకో విధంగా ఉన్నాయి. వారు సభలు పెట్టుకుని ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.తమపై పనిభారం పెంచడమేకాకుండా,తమ 22 డిమాండ్లను పక్కనబెట్టిందని వారు ధర్నా చేశారు. కరపత్రాలు పంచడానికి తమను ఇంటింటికి వెళ్లమంటున్నారని,సర్వేల పేరుతో విసిగిస్తున్నారని, ఆ క్రమంలోతాము ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కుంటున్నామని చెబుతున్నారు. ఇవన్ని చూస్తుంటే ప్రభుత్వంలో ఉద్యోగులలో దాదాపు ఎవరూ సంతోషంగా లేరనిపిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,కీలక మంత్రి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతూ కోట్లు వ్యయం చేస్తున్నారని,మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రం ప్రజలలో చెడు అభిప్రాయం కలిగించడానికి యత్నిస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు.వీరు చెప్పే విషయాలలో చాలావరకు వాస్తవాలు ఉండవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని చెప్పడం ద్వారా కొత్తగా పిఆర్సి వేయలేమని, ఇంటెరిమ్ రిలీఫ్ ఇవ్వలేమని చంద్రబాబు సంకేతం పంపినట్లయిందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తున్న వైనాన్ని ఉద్యోగులు కూడా గమనిస్తున్నారు. ఏకంగా నాలుగు భవనాల అద్దాలకు 2500 కోట్లు, రీడిజైనింగ్ కన్సల్టెన్సీకి అదనంగా 206 కోట్లు, హైకోర్టు వెలుపల సుందరీకరణకు 540 కోట్లు.. ఇలా మితిమీరి ఖర్చు చేసే ప్రభుత్వం ఉద్యోగుల వద్దకు వచ్చేసరికి ఆదాయం అంతా జీతాలకే సరిపోతోందని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడానికేనన్నది వారి భావన. ఉద్యోగ సంఘాల నేతలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం చేయకపోలేదు. అయినా వెంకట్రామిరెడ్డి వంటివారు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోలో ఉద్యోగులకు ఏమి హామీలు ఇచ్చారో గమనించండి. ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్టిస్తామని ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టే యత్నం చేశారు. కాని ఇప్పుడేమో అవమానించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన ఉద్యోగులలో కలుగుతోంది. జగన్ ప్రభుత్వం జిపిఎస్ తీసుకువచ్చి ఒక పరిష్కారాన్ని కనుగొనే యత్నం చేస్తే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దానిపై దుష్ప్రచారం చేశారు.తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్, జిపిఎస్ విధానాలను పునఃసమీక్షించి పరిష్కారం చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆ ఊసే తేవడం లేదు. మెరుగైన పీఆర్సీ,ఐఆర్. వెంటనే ప్రకటిస్తామని మానిఫెస్టోలో చెప్పినా అతీగతీ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరైనవారికి మొదటి తేదీనే జీతాలు పెన్షన్ ఇస్తామని,వారికి రావల్సిన బకాయిలు చెల్లిస్తామని వాగ్దానం చేశారు. కాని చంద్రబాబు ఈ విషయంలో చెబుతున్న లెక్కలు తప్పని ఉద్యోగ నేతలు విమర్శిస్తున్నారు. వలంటీర్ల గౌరవ వేతనాన్ని ఐదువేల నుంచి పదివేలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దేవుళ్ల సాక్షిగా ప్రకటించారు కాని, అసలు మొత్తం వ్యవస్థనే లేకుండా చేయడం మోసం కాదా అన్నది వారి ప్రశ్నగా ఉంది. ఈ నేపధ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సన్నద్దమవుతున్నాయి.అయితే ఏదో రకంగా వారిని భయపెట్టో, మభ్యపెట్టో వారి ఉద్యమానికి ప్రభుత్వపరంగా అడ్డుకట్ట వేసే యత్నం జరుగుతుంది. విశేషం ఏమిటంటే ఎల్లో మీడియా ద్వారా మాత్రం ఉద్యోగులకు ఏదో చాలా జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. గత జగన్ ప్రభుత్వ టైమ్లో ఉద్యోగులను ఎన్నిరకాలుగా రెచ్చగొట్టాలో అన్ని విదాలుగా టీడీపీ,జనసేనలతో పాటు ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదేమీడియా ఉద్యోగులను మభ్యపెట్టే పనిలో పడింది. ప్రభుత్వ ఉద్యోగులు గత జగన్ టైమ్ లో తమ టైమ్ ప్రకారం డ్యూటీ చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు జనాన్ని పోగు చేసే పనే ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఇప్పటికైనా పాలేవో,నీళ్లేవో ఉద్యోగులు గమనించారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఒక అవిటి తల్లికి భయపడే చేతకాని చెత్త ప్రభుత్వం..
-
కుప్పంలో TDPకి బిగ్ షాక్
-
పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలు
సాక్షి, అమరావతి: పట్టణ స్థానిక సంస్ధల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం 1955 సెక్షన్ 90, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965 సెక్షన్ 23 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్ధల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని, పట్టణ స్థానిక సంస్ధల్లో 33.33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని, ప్రస్తుతం అమల్లో ఉన్నవి యథాతథంగా కొనసాగుతాయని కేబినెట్ వెల్లడించింది. ౖబీసీ రిజర్వేషన్లకు సంబంధించి నియమించిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికారులు కేబినెట్కు వెల్లడించారు. 13 జిల్లా పరిషత్ల స్థానంలో జిల్లాల విభజనకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్ల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది.కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా..⇒ ఏపీఎస్బీసీఎల్ రూ.5,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణం తీసుకునేందుకు ఆమోదం. బేసిక్ ధర రూ.5,000 అంతకంటే ఎక్కువ ఉన్న కేటగిరీ మద్యం (ఐఎంఎఫ్ఎల్), వైన్, ఆర్టీడీ విదేశీ మద్యం టెండర్ల పరిశీలన నిబంధనల సవరణకు ఆమోదం.⇒ పట్టణ స్థానిక సంస్ధల్లో రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ మీడియన్లు, వీధి దీపాలు, పార్కులు తదితర పనులను రూ.7,469.46 కోట్లతో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్లో చేపట్టాలని నిర్ణయం. ఇందులో ప్రాజెక్టు వ్యయం రూ.5,500 కోట్లు కాగా వడ్డీ రూ.1,969.46 కోట్లకు పరిపాలన అనుమతి. ⇒ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ రూ.2,500 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.2,000 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.4,500 కోట్లు అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం. ⇒ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ (14 పోస్టులు), హైకోర్టు ఆర్బిట్రేషన్ సెంటర్ (15 పోస్టులు) మొత్తం 29 పోస్టుల సృష్టికి ఆమోదం.⇒ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కార్యాలయం నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్–అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిప్యుటేషన్ ప్రాతిపదికన హైకోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు సృష్టికి ఆమోదం.⇒ తిరుపతి రూరల్ మండలం దామినేడులో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎకరం రూ.2.50 కోట్ల చొప్పున ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్, హైదరాబాద్కు ఎకరం కేటాయింపు.⇒ అవయవ మార్పిడి, దాన కార్యకలాపాలను నియంత్రించేందుకు ఆర్డినెన్స్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మానవ అవయవ మార్పిడి (సవరణ) చట్టం 2026 బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం.⇒ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం 2023 షెడ్యూల్లో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ చేర్చుతూ సవరణకు ఆమోదం.⇒ వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఖాళీల ప్రత్యక్ష భర్తీకి అనుమతి.⇒ రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లా కేంద్రాల్లో హెచ్ఆర్ఏ 12 నుంచి 16 శాతానికి పెంపు, రాయచోటిలో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 16 శాతం రద్దుకు ఆమోదం.⇒ ఉన్నత విద్య రెగ్యులేటరీ మానిటరింగ్ చట్టం 2019 సవరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం. ⇒ హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 2లో మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్లతో పరిపాలన అనుమతి.⇒ శ్రీసత్యసాయి జిల్లా మెయిన్ కాలువ లైనింగ్ పనులకు రూ.750.07 కోట్లు, అన్నమయ్య జిల్లాలో మెయిన్ కాలువ పనులకు రూ.573.68 కోట్లకు ఆమోదం.⇒ ఇటీవల ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. -
మళ్లీ మాయోపాయం!
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి బీసీ రిజర్వేషన్లపై కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఒకవైపు బీసీల ఎదుగుదలను అడ్డుకునే రాజకీయాలు చేస్తూనే వారికోసం తానే అంతా చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఆయనకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించేస్తున్నామని, అది ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నుంచీ రిజర్వేషన్లను లాక్కోవడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధమైన తీర్పులిస్తున్నాయి. ఈ మధ్యే తెలంగాణ హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ దాటరాదంటూ తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే పార్లమెంటులో చట్టబద్ధత తీసుకురావడమొక్కటే మార్గమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇపుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నప్పటికీ అలాంటి చట్టబద్ధత కోసం ప్రయత్నించకుండా తూతూమంత్రంలా 34శాతం రిజర్వేషన్ ప్రకటన చేసేసి చేతులుదులుపుకుంటే ప్రయోజనమేమిటి..? ఇది బీసీలను మరోసారి మోసం చేయడం కాదా? బీసీలను వంచించడంలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు అందుకోసం ఎంత కష్టపడి చదివారో చూస్తే ఆశ్చర్యపోవలసిందే.. ఏపీ హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ దాటకూడదంటూ గతంలో తీర్పు ఇచ్చింది. దానికి కారకుడు చంద్రబాబే.. తమ పార్టీ నాయకుడితో కేసు వేయించి బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే ఇప్పుడు బీసీల ఉద్ధారకుడిగా మాట్లాడుతుండడం గమనార్హం... కోర్టు కేసుతో అడ్డుకున్నా వైఎస్ జగన్ బీసీల తరఫున నిలబడ్డారు. వారిని బ్యాక్బోన్ క్లాస్గా నిలబెట్టారు. మంత్రి పదవులు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు.. ఇలా అన్నింటిలోనూ బీసీలకు గణనీయమైన ప్రాతినిద్యం కల్పించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ జీవోను అడ్డుకున్నా అంతకుమించి గరిష్ట సంఖ్యలో బీసీలకు పాతినిధ్యం కల్పించి రాజకీయ సాధికారతకు కొత్త అర్థం చెప్పారు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జగన్ జీవో ఇస్తే అడ్డుకున్నది చంద్రబాబే.. 2020–21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీనే జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాప్రెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకం ఆడించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రతాప్రెడ్డి ఓ నామినేటెడ్ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు కోర్టులో ఎందుకు అడ్డుకున్నారు చంద్రబాబూ..? బీసీలకు 34శాతం రిజర్వేషన్ వస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని సొంత పార్టీలోనే కొందరు నాయకులు విమర్శించడం నిజం కాదా..? మేనిఫెస్టోలోనూ మోసమే.. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన చిక్కుల మధ్య ఉన్నా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 34శాతం రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇది అమలు జరగాలంటే మొక్కుబడి ప్రకటనలు సరిపోవని, పార్లమెంటులో చట్టబద్ధత అవసరమని తెలిసినా చంద్రబాబు మోసగించారు. కేంద్రంలో తమపై పూర్తిగా ఆధారపడిన ప్రభుత్వమే కొనసాగుతున్పప్పటికీ రెండేళ్లగా ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.. కేంద్రానికి ఓ వినతిపత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. ధోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.. ధోకా.. బీసీలకు సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.. మూడు బడ్జెట్లలో బీసీలకు సబ్ప్లాన్ ఉందా.. వీటిని బట్టి అర్థం కావడంలేదూ వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్మెడల్ హోల్డరని... బీసీలకు మేలు జరిగింది జగన్ హయాంలోనే.. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు.. బీసీలు అంటే రాష్ట్రానికి బ్యాక్బోన్ క్లాసెస్ అని వైఎస్ జగన్ నమ్మారు.. నమ్మిన మాటను చేతల్లో చేసి చూపించారు. బీసీలకు అధికారం దక్కకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు వెనుక నుంచి రాజకీయాలు చేస్తే.. జగన్ మాత్రం బీసీలను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 2019లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని 50 శాతం రిజర్వేషన్ పరిమితిని సాకుగా చూపుతూ కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం జరిగినా.. జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ, డిప్యూటీ సీఎం, కేబినెట్ పదవుల నుంచి బీసీ కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. ఎంపీపీలు, జిల్లాపరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్ల వంటి కీలక పదవుల్లో 34 శాతానికి మించి బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజకీయ సాధికారతకు కొత్త నిర్వచనం ఇచ్చారు. రాజ్యాధికారంలో బీసీలకు సమున్నత వాటా ఇచ్చిన జగన్ మంత్రివర్గంలో 25 మంది సభ్యులుండగా ఏకంగా 11 మంది బీసీలకు జగన్ స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్ను డిప్యూటీ సీఎంలుగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను బీసీలకే అప్పగించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా నలుగురు బీసీలను జగన్ రాజ్యసభకు పంపారు. అంతకు ముందు టీడీపీ హయాంలో చంద్రబాబు, ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అలాగే శాసన మండలిలో జగన్ 28 పదవులు.. అంటే 48 శాతం పదవులు బీసీలకు ఇచ్చారు. పథకాల రూపంలో రూ.1.83 లక్షల కోట్లు లబ్ధి వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ రూపంలో ఒక్క బీసీల ఖాతాల్లోనే జమ చేసిన మొత్తం రూ.1,29,866.54 కోట్లు కాగా, నాన్ డీబీటీ రూపంలో బీసీలకు అందించిన లబ్ధి విలువ మరో రూ.52,884.18 కోట్లు. అంటే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన వ్యయం రూ.1,82,750.71 కోట్లు. ఈ స్థాయిలో గతంలో ఏనాడైనా, చంద్రబాబు తాను పదవిలో ఉన్నప్పుడు అప్పుడైనా, ఇప్పుడైనా బీసీలకు ప్రయోజనాలు అందించారా? కోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాప్రెడ్డితో చంద్రబాబు (ఫైల్) చట్టం చేసి మరీ ‘నామినేటెడ్’దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వు చేస్తూ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు. 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకే (42 శాతం) ఇచ్చారు.స్థానిక సంస్థల్లోనూ బీసీలకు జగన్ పెద్దపీట స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి కోర్టు తీర్పు అడ్డం వచ్చినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన జగన్, దాన్ని ఆచరించి చూపారు. బీసీలకు పదవులు ఇచ్చారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 636 మండలపరిషత్ అధ్యక్ష పదవుల్లో 239 పదవులను బీసీలకు అంటే.. 38 శాతం పదవులను బీసీ వర్గాలకే ఇచ్చారు. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా తొమ్మిది చోట్ల మేయర్ పదవులు (69 శాతం) బీసీలకు ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవశం చేసుకోగా చైర్పర్సన్ పదవులు బీసీలకు 44 (53 శాతం) ఇచ్చారు. చట్టసభల్లో 50శాతం సీట్లపై పార్లమెంటులో వైఎస్సార్సీపీ బిల్లుబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టించి జగన్ చరిత్ర సష్టించారు. 2019 మార్చిలో వైఎస్సార్సీపీ ఎంపీలు చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతూ పార్లమెంట్లో బిల్లు ప్రతిపాదించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కూడా జగన్ కేంద్రాన్ని కోరారు. కుల గణన కోసం బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, బీసీల కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జగన్ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపించారు. -
అసెంబ్లీ అనుకున్నావా.. నీ ఇల్లు అనుకున్నావా? నోటికొచ్చినట్లు మాట్లాడకు చంద్రబాబు
-
ఇంకెంతకాలం పారిపోతారు.. - దమ్ముంటే చర్చకు రండి...!
-
ఇంకెంతకాలం జగన్ పై నీ ఏడుపు చంద్రబాబు? ఏమైంది నీ నలభై ఏళ్ల చరిత్రా...
-
ప్రొద్దుటూరులో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ కుటుంబాలు
-
అసెంబ్లీ సాక్షిగా ఆ ఇద్దరు దొరికిపోయారు
-
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటం కోసం పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఒడిశా కూలీలు.. ఫేక్ జెన్జీలు!
సాక్షి, అమరావతి: ‘మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదు. అయినా డీఎస్సీపై ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల ఫేక్ జెన్జీ వ్యక్తులతో ధర్నాలు చేయించారు..’ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియ వివరాలన్నీ పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచినా వైఎస్సార్సీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ 14 డీఎస్సీలు జరిగితే టీడీపీ, ఎన్డీఏ హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. 2019–24 మధ్య 10–12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లకు రావటం మానేశారని, అందుకే తల్లికి వందనం అమలు చేశామన్నారు.ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా 2019–24 మధ్య పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారని విమర్శించారు. ఓ మాజీ ఐఏఎస్, మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు..తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని, కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టామన్నారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామని తెలిపారు. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను పారదర్శకంగా విడుదల చేసి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేశామన్నారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఏఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు వందల కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని, అధికారికంగా వివరణ ఇచ్చినా రోజుకో కుట్ర చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారని విమర్శలు చేశారు. -
టీచర్లపై ఇంతలా కక్షగడతారా?
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను కాపాడటం కోసం పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలన్న నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఎత్తిచూపారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తామని... వారికి భరోసా ఇస్తామని.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని తేల్చిచెబుతూ ‘ఎక్స్’లో తన ఖాతాలో సోమవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వినతిపత్రం ఇవ్వడమే నేరమా? ‘‘చంద్రబాబు గారూ.. ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా? మొదటి రోజు వైఎస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి అన్న టెట్ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా? ఉద్యోగులకూ మోసం..ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తోంది ! ఐఆర్ లేదు! పీఆర్సీ లేదు! 5 డీఏలు పెండింగ్ ! సీపీఎస్/ఓపీఎస్ను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపారు. చివరకు సీపీఎస్కు ప్రత్యామ్నాయంగా మేం ప్రకటించిన జీపీఎస్ను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో పెట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్మెంట్ లీవులు ఇలా దాదాపు రూ. 35వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుంటే ఒక్క పైసా ఇవ్వరు. కానీ వారికి సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తున్నారు. ఇదేనా ఉద్యోగుల పట్ల మీ గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత? అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుగారూ. చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్లిపోయారు. వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటాం. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’’.మీరు చేయలేని పని చేయడానికి వారు ప్రయత్నించడమే తప్పా?మీ రెడ్బుక్ అరాచక జంగిల్రాజ్ చివరకు ప్రభుత్వ టీచర్లనూ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు గారూ అసలు ఈ టెట్ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరు కాదా? ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? మీరు చేయాల్సిన పని చేయలేదు. సీనియర్ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు.తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా? మీరు చేయలేని పని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా? వినతిపత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా? ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా? -
సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు
-
మీరు తప్పు చేశారనే ఆ G.Oను రద్దు చేశారు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన వరుదు కళ్యాణి


