Chandrababu Naidu
-
రెడ్ బుక్ అరాచకం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు, మార్గదర్శకాలనే కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఈ 20 నెలల్లో ఇప్పటికే 270కుపైగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల్లో దాదాపు 100మందిని అక్రమంగా అరెస్టులకు తెగబడింది. ఆ క్రమంలోనే ఈసారి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరుజిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు. తక్షణం స్పందించిన వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. అయినా సరే పోలీసులు శ్రీహరిని బుధవారం అర్ధరాత్రి దాటినా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి వేధిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ మార్కు బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఎంవో, డీజీపీ కార్యాలయం కనుసన్నల్లోనే... ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయం స్థాయిలోనే పక్కాగా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఓ సోషల్ మీడియా పోస్టుపై కుప్పం టీడీపీ నేత వినోద్ కుమార్ మూర్తితో ఫిర్యాదు ఇప్పించారు. ఆ వెంటనే అనంతపురం జిల్లా రాప్తాడులోని సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిని మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు. ఆ వెంటనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి( మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కుప్పం పోలీసులు మఫ్టీలో మంగళవారం రాత్రే తాడేపల్లి చేరుకున్నారు. శ్రీహరి నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో శ్రీహరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్నవారు పోలీసులో.. ఎవరైనా అసాంఘిక శక్తులో కూడా అంతుబట్ట లేదు. ‘అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారు... సోషల్ మీడియా పోస్టుతో నాకేం సంబంధం... నా సోషల్ మీడియా ఖాతా నుంచి ఎటువంటి పోస్టు పెట్ట లేదు కదా.. అసలు బీఎన్ఎస్ 35(3) కింద నోటీసులు ఇవ్వాలి కదా’అని శ్రీహరి పోలీసులను అడిగినా సరే పోలీసులు బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఆయన ఫోన్, ల్యాప్టాప్ను స్వాదీనం చేసుకున్నారు. శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి తరలిస్తున్న పోలీసు వాహనాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు సింహాచలం నాయుడు కొద్ది దూరం అనుసరించారు. కానీ పోలీసులు ఆయన్ని బలవంతంగా వెనక్కి పంపించి వేశారు. అనంతరం మరో బృందం పోలీసులు శ్రీహరి నివాసంలో దాదాపు 3గంటల పాటు సోదాలు చేసింది. ఆయన నివాసంలో పలు రికార్డులు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. బెడిసికొట్టిన కుట్ర... గిరీశ్కు బెయిల్ మంజూరు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా పోలీసులు తెగబడ్డ అక్రమ అరెస్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన గిరీశ్ కుమార్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. కాగా సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు అక్రమ అరెస్టు చేశారని నిందితుల తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అక్రమమని వాదనలు వినిపించారు. సోషల్ మీడియా పోస్టులపై నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. గిరీశ్కు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం ఏమిటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏ1 గా పేర్కొన్న గిరీశ్ కుమార్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. శ్రీహరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిస్తే బెయిల్ మంజూరు అవుతుందని పోలీసులకు స్పష్టమైంది. అందుకే కుప్పం పోలీస్ స్టేషన్లోనే విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. సాయంత్రం 6గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన శ్రీహరిని అర్ధరాత్రి వరకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచలేదు. శ్రీహరితో మాట్లాడేందుకు ఆయన తరపు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు.హెబియస్ కార్పస్ పిటిషన్తో... కిడ్నాప్ పన్నాగానికి తెర...శ్రీహరి అరెస్టుతో అప్రమత్తమైన వైఎస్సార్సీపీ న్యాయ విభాగం వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. శ్రీహరి ఆచూకీ తెలియజేయాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును గురువారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. దాంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో పూడి శ్రీహరిని సాయంత్రం 6 గంటలకు కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటించి కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్ నమోదులోనూ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 కింద కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేశాయి. వ్యవస్థీకృత నేరాల కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ను సోషల్ మీడియా పోస్టులకు వర్తింపజేయడం చెల్లదని తేల్చి చెప్పాయి. అయినా సరే కుప్పం పోలీసులు బీఎన్ఎస్ 111 తోపాటు 196(1)ఎ, 352(2), 336(1), 340(2), 61(2) సెక్షన్లు, ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని ఏ1గా, పూడి శ్రీహరిని ఏ2గా పేర్కొన్నారు. -
పోలీసులు సీజ్ చేసిన బోట్లు దొంగతనమా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబునాయుడు మత్స్యకారులకు మేలు చేయకపోగా వారి కడుపు మీద కొడుతున్నాడని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించిన అనంతరం అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఇది మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ ఏరియా. ఈ ప్రాంతంలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు ఎవరూ రాకూడదు. అందుకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. అయినా వాటిని ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంత జలాల్లోకి ప్రవేశించి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన మత్స్యకారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారికి కడుపు మండి వారే స్వయంగా రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీజ్ చేసిన ఆ బోట్లను బీద సోదరులు కుట్ర పన్ని దొంగతనంగా తీసుకెళ్లిపోయారు. ఇందుకు బీద సోదరులు, ఆయన అనుచరుడు కొండూరు పోలిశెట్టి, అక్కడి బోటు యజమాని అశోక్ మధ్య జరిగిన సంభాషణ, వారి కాల్ డేటానే సాక్ష్యం. నారా లోకేశ్ మార్చి 12న జువ్వలదిన్నెకు వస్తే, మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోయారు. మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంతో మంది ఏకమయ్యారు. వారు కుట్ర పన్నినట్టు కాల్ డేటా ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పోలీస్ అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబును ఒకటే అడుగుతున్నా.. పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనగా చూస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?’ అంటూ మండిపడ్డారు.ఫిషింగ్హార్బర్ మీకే.. ఇదే నా భరోసామీ అందరికీ భరోసా ఇస్తున్నా. కళ్లు మూసుకుని తెరిచే లోపల మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కు. ఈ ఫిషింగ్ హార్బర్ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగేలా ఒక్కో బోటుకు 10, 12 మందిని యజమానులను చేస్తాం. ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు అంకితం చేస్తాం. ఇక్కడ పాళెం మత్స్యకారులు కొంత మంది పట్టపు కార్పొరేషన్ కావాలని అడిగారు. నాడు మన ప్రభుత్వంలో అడిగిన వారికి కాదనకుండా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పట్టపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా.ఈ ప్రభుత్వం మా కడుపు కొడుతోంది అన్నా..అన్నా.. ఇక్కడ హార్బర్కు 79 ఎకరాల స్థలం ఉందన్నా. ఆరు జిల్లాల్లో సుమారు 150 మరపడవలు ఉన్నాయి. కావలి నియోజకవర్గంలోని ఆరు తీర ప్రాంత పంచాయతీల్లో మరో వెయ్యి వరకు సంప్రదాయ పడవలు ఉన్నాయి. హార్బర్ అందుబాటులోకి వస్తే నిత్యం నాలుగు వేల మంది వరకు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. చేపలు ఆరబెట్టుకోవడం, ఐస్ ఫ్యాక్టరీలు, వలల రిపేర్లు, తదితర పనులకు ఉన్న స్థలం సరిపోదనుకుంటుంటే కూటమి ప్రభుత్వం హార్బర్ స్థలంలో సగం ప్రైవేట్ సంస్థకు కేటాయించడం అంటే హార్బర్ను పూర్తిగా మూసివేయడంతో సమానం. మీ హయాంలో 95 శాతం పూర్తయిన హార్బర్లో మిగిలిన ఐదు శాతం పూర్తి చేసి, అందుబాటులోకి తేకపోవడం మా కడుపులు కొట్టడమే. మీరే మాకు అండగా నిలబడి న్యాయం చేయాలన్నా. మావాళ్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు అర్జీలు ఇచ్చి విసిగిపోయిన తర్వాత, ప్రాణాలకు తెగించి అక్రమంగా వేట సాగిస్తున్న కడలూరుకు చెందిన పడవలను పట్టుకుని నాలుగు జిల్లాల్లోని 160 గ్రామాలకు చెందిన మత్స్యకారులు వంతుల వారీగా కాపలా ఉంటే పోలీసుల సాయంతో పడవలు తప్పించేశారు. ఈ విషయంలో కూడా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నా. – రామచంద్రయ్య, మత్స్యకారుడు, అన్నగారిపాళెం, కావలి రూరల్ మండలం ఇలాగైతే మేము బతకలేం జగనన్నా..అన్నా.. మీ హయాంలో హార్బర్ వచ్చింది. త్వరత్వరగా నిర్మాణం కూడా పూర్తి చేశారు. మాకు చాలా సంతోషం కలిగిందన్నా. హార్బర్ రాక ముందు మేము తెప్పల్లో వెళ్లి పది కిలోలు, 20 కిలోలు చేపలు తెచ్చుకునే వాళ్లం. వాటిని ఇక్కడ అమ్ముకునే వీలు లేక పల్లెలకు వెళ్లి అమ్ముకునేవాళ్లం. హార్బర్ వచ్చిన తర్వాత మా కష్టాలు తీరుతాయని ఆశ పడ్డాం అన్నా. వలసలు ఆగిపోతాయని, ఇక్కడే పని దొరుకుతుందని సంబర పడ్డాం. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వం హార్బర్లో మిగిలిన కొద్దిపాటి పనులు నిలిపేసి, ప్రైవేట్ సంస్థకు భూములు ఇచ్చిందన్నా. మాకు ఆస్తిగా మీరు ఇచ్చిన హార్బర్ను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడితే ఎలా అన్నా? మీరే మా మత్స్యకారులకు న్యాయం చేయాలన్నా. హార్బర్ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మా పరిస్థితి ఏమిటన్నా.. ఇలాగైతే మేము బతకలేం జగనన్నా.– రంగయ్య, మత్స్యకారుడు, అలిచెర్ల బంగారుపాళెం, జువ్వలదిన్నె -
అ్రల్టాటెక్కు ‘ఆది’ సెగ..!
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్సార్ కడప జిల్లా చిలంకూరులోని అ్రల్టాటెక్ సిమెంటు పరిశ్రమపై మరింతగా రెచ్చిపోయారు. తాజాగా చంద్రబాబుతో నేరుగా భేటీ అనంతరం అ్రల్టాటెక్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ఆది ముప్పుతిప్పలకు గురి చేస్తున్నారు. బుధవారం తన అనుచరులను పంపి పరిశ్రమలోకి కార్మికులు వెళ్లకుండా అడ్డుకున్నారు. క్వారీ నిర్వహణను అడ్డగించారు. వాహనాలను కూడా అనుమతించలేదు. రాకపోకలను స్తంభింపజేశారు. బెదిరించి దారికి తెచ్చుకుని.. చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమపై ఆధిపత్యం చలాయించేందుకు కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేయని దౌర్జన్యమంటూ లేదు. ఎన్ని సమస్యలు సృష్టించినా యాజమాన్యం దిగిరాకపోవడంతో మరింత చెలరేగిపోతున్నారు. తన దుశ్చర్యలకు పచ్చ సిగ్నల్ కోసం చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ‘కమ్మ’గా సాగుతోందని, కమ్మ కులస్తులకే ప్రాధాన్యం లభిస్తోందని తిరుపతిలో బాహాటంగానే వ్యాఖ్యానించారు. అనంతరం కూటమి సర్కార్లో తన పనులేమీ జరగడం లేదని, ఇలాగైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పిలిపించి మాట్లాడారు. ఆ వెంటనే ఎమ్మెల్యే ఆది కార్యాచరణకు ఉపక్రమించారు. తన అనుచరులతో అ్రల్టాటెక్ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద తిష్ట వేయించారు.దీంతో అల్ట్రాటెక్ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆందోళనకు దిగి.. కాంట్రాక్టులు పట్టేసి! అ్రల్టాటెక్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత లేదని.. కాలుష్య నియంత్రణ సక్రమంగా చేపట్టడం లేదని.. చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏవీ లేవంటూ ఎమ్మెల్యే ఆది తన అనుచరుల ద్వారా ఫిర్యాదు చేయించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికార యంత్రాంగం అ్రల్టాటెక్ సిమెంటు ఫ్యాక్టరీలో 89 శాతం మంది ఉద్యోగులు స్థానికులే ఉన్నట్లు గుర్తించింది. కాలుష్య నియంత్రణ చర్యలు సైతం సక్రమంగా ఉన్నట్లు రూఢీ అయ్యింది. దీంతో తిరిగి బుధవారం స్థానికులకు ప్రాధాన్యత లేదంటూ మరో నాటకం తెరపైకి తెచ్చారు. ఇలా ఆందోళన చేసిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక కాంట్రాక్టు తనకు అనుకూలంగా ఇప్పించుకోగల్గుతున్నారు. ఇందుకోసం పరిశ్రమ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముడిఖనిజం సరఫరా చేసే టిప్పర్లపై కేసులు పెట్టించి ట్రాన్స్పోర్టర్లను కట్టడి చేసే యత్నం చేశారు. ఫ్యాక్టరీ తమ చెప్పు చేతుల్లో ఉండాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబుతో సమావేశమైన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. -
న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి
సాక్షి, విజయవాడ: ఈ నెల 18వ తేదీన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన నిరాహార దీక్ష చేస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నాతో చట్టవ్యతిరేకంగా ప్రవర్తించారు. నన్ను హింసించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను. నన్ను హింసించిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను’’ అని అంబటి తెలిపారు.‘‘నన్ను హింసించిన అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి. నాపై, నా ఇల్లు, నా ఆఫీస్, నా కుటుంబంపై దాడి చేసి చంపాలని చూసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి. నాకు జరిగిన అన్యాయంపై పోరాటంలో భాగంగానే 12 గంటల పాటు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నా.. నా దీక్షకు మద్దతు పలకాలని అందరినీ కోరుతున్నా. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల్లో నన్ను ఇరికించింది. అన్యాయంగా నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించింది...నేను జైల్లో ఉన్నప్పుడు జడ శ్రావణ్ కుమార్ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నా కుటుంబంతో పాటు జైల్లో ఉన్న నన్ను కలిసి జడ శ్రావణ్ కుమార్ ధైర్యం చెప్పారు. జడ శ్రావణ్ కుమార్కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన్ని కలిశాను. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా ఎత్తుకుపోయారు. కుప్పంలో సోషల్ మీడియా కేసు పెడితే రౌడీల్లాగా వచ్చి ఎత్తుకుపోయారు. పోలీసు వ్యవస్థ ఉన్నది దేనికి.. చంద్రబాబు, లోకేష్ చేతిలో ఆయుధంలా పనిచేయడానికేనా? ప్రభుత్వం, పోలీసులు ఉన్నది కక్ష సాధించడానికి కాదు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.పూడి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా: జడ శ్రావణ్ కుమార్ అంబటి రాంబాబును ప్రభుత్వం వేధించిన తీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సాటి న్యాయవాదిగా నేను అంబటికి సంఘీభావం తెలిపాను. 2024 జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అప్రజాస్వామ్యకమైన పాలన సాగుతోంది. పోలీసులు సీఆర్పీసీ, ఐపీసీని కాకుండా కూటమి నేతలు రాసిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో మతపరమైన అంశాలను చొప్పించాలని కూటమి నేతలు ప్రయత్నించారు.అంబటి రాంబాబు ఇంటిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు పరిస్థితిని తలుచుకుని నేటికీ అంబటి కుటుంబం వణికిపోతోంది. అంబటి ఇంటిపై దాడి చేసేందుకే మీకు 164 సీట్లు ఇచ్చారా అని లోకేష్ ను ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించకుండా లోకేష్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు. కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది మీడియాపైన దాడిగానే జై భీమ్ పార్టీ భావిస్తోంది. అరెస్టుల ద్వారా మీ చిలిపి ఆనందాలు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మీరు తీర్చుకోవాల్సిన చిలిపి ఆనందాలు ఏవైనా ఉంటే ఈ రెండేళ్లలో తీర్చేసుకోండి. ఆ తర్వాత మీ చిన్న చిన్న ఆనందాలు మీకు పెద్ద శాపాలుగా మారడం ఖాయం. నన్ను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి అన్యాయాల పై చేసే న్యాయ పోరాటాలకు నా మద్దతు కచ్చితంగా ఉంటుంది -
పోలీసులు చట్టాన్ని ఫాలో కావడం లేదు: పొన్నవోలు
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ పెడితే, పూడి శ్రీహరి, గిరీష్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. యూనిఫాం లేకుండా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. పోలీసులు చట్టాన్ని ఫాలో కావడం లేదు. సెక్షన్ 24,25 కింద న్యాయ పోరాటం చేస్తాం’’ అని పొన్నవోలు తెలిపారు.‘‘తప్పు అని ఎత్తి చూపిస్తే.. అరెస్ట్ చేస్తున్నారు. గిరీష్రెడ్డికి సెల్ఫ్ బాండ్పై బెయిల్ మంజూరు చేశారు. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారు. హైకోర్టు పదే పదే చెప్పినా కూడా 111 సెక్షన్లు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యంతో ఇబ్బందులు పెడుతున్నారు. ఏపీలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులు దాని కింద పనిచేస్తున్నారు’’ అంటూ పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. -
మూడు రోజుల నుంచి రెక్కీ... YSRCP పూడి శ్రీహరి అరెస్ట్
-
బాబు, లోకేష్.. పర్యవసానాలు అనుభవిస్తారు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: టీడీపీ వాళ్ల కళ్లల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు.. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దగ్గరున్న వారిని భయపెట్టాలనుకుంటున్నారా?.. లోకేష్ ఒక్కడికే విద్య తెలుసు అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పూడి శ్రీహరిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. ఏం నేరం చేశారని శ్రీహరిని అరెస్ట్ చేయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఒక విలేకరిగా ఎదిగి పైకొచ్చిన వ్యక్తి పూడి శ్రీహరి. మీరు చేసేది చట్టబద్ధమైన చర్య అయితే ప్రెస్ మీట్ పెట్టి శ్రీహరిని అరెస్ట్ చేయించండి. శ్రీహరి ఏమైనా నేరాలు చేశాడా?. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు.సోషల్ మీడియా కేసుకు ఇలా తీసుకెళతారా. చంద్రబాబు మీరు ఏం నేర్పిస్తున్నారు?. మీ తప్పులను ప్రశ్నిస్తున్నందుకు 20 నెలల నుంచి అందరినీ లోపల వేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మంగళహారతి పాడేందుకు జనం సిద్ధమైపోయారు. తప్పుడు కేసులు పెట్టి శ్రీహరిని ఓ 15 రోజులు జైల్లో పెట్టగలరు.. అంతకంటే ఏం చేయగలరు?. జైలు నుంచి బయటకి వచ్చాక జగన్ దగ్గర పనిచేయకుండా ఆపగలరా?. ఒకవేళ శ్రీహరి తప్పు చేస్తే అందరి ముందు అరెస్ట్ చేయండి. అలా కాకుండా దొంగతనంగా ఎత్తుకెళ్లడం దేనికి.. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు సీజ్ చేయడం దేనికి?. ఎవరిని భయపెడదామనుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు పోకడగలకు ఏ ప్రభుత్వాలు పోలేదు. రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుకున్న వాడు బతికిబట్టకట్టలేదు.40 ఏళ్ల ఇండస్ట్రీ అని నీతులు చెప్పడం సరికాదు. ఏపీలో పోలీసు వ్యవస్థను పతనావస్థకు తీసుకెళుతున్నారు. మీ కొడుకు మాటలు విని వ్యవస్థను నాశనం చేస్తే పర్యవసనాలు మీరు అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఏమైపోతారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఏం చేయలేరు. మీ కేసులు అరెస్టులు జగన్ వెంట జెండా మోయకుండా ఆపలేరు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. తప్పుడు పనులు మానుకోవాలని లోకేష్ సూచిస్తున్నాం’ అని హితవు పలికారు. -
ఆటలో అరటిపండు.. చివరికి పవన్ నెత్తిన స్కామ్
-
ఏ ప్రైవేట్ కంపెనీకి ఇస్తావా ఇచ్చుకో... మా ప్రభుత్వం వచ్చాక మాత్రం
-
వచ్చేది YSRCP ప్రభుత్వమే... వెళ్తూ వెళ్తూ ఇచ్చిపడేసిన జగన్
-
2029లో వచ్చేది నేనే.. నీ తాత కూడా ఆపలేడు..
-
ఎవడికి ఇస్తావో ఇచ్చుకో.. నువ్వు కాదు నీ తాత దిగి వచ్చినా.... మాస్ వార్నింగ్
-
వైఎస్ జగన్, మత్స్యకారుడు బాబును ఓ రేంజ్ లో ఏకిపారేశారు
-
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వ(వైఎస్సార్సీపీ) హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చంద్రబాబు సర్కార్ను వైఎస్ జగన్ నిలదీశారు.మత్స్యకారుల నుంచి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబ్టి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి. కళ్లుమూసి తెరిచే లోపే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
గొడ్డుకన్నా హీనం - గాడ్సే కన్నా ఘోరం.. చంద్రబాబు ఎంత నీచుడో ఈ ఒక్క వీడియో చాలు
-
రాజకీయ రాబందు.. అవినీతి చంద్రిక
సాక్షి, అమరావతి: రావణుడి గుట్టు విభీషణుడికి తెలుసు అన్నట్టు.. తెలుగు రాజకీయ రావణుడు చంద్రబాబు గుట్టు, గూడుపుఠాణి అంతా ఆయన సొంత కుటుంబ సభ్యుల కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది...! అందుకే చంద్రబాబు అవినీతి చరిత్ర, రాజకీయ కుట్రల గురించి ఆయనకు సొంత మామ ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎనాడో సవివరంగా వెల్లడించారు. 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర అనంతరం ఎన్టీ రామారావు ఆనాడు ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ నైచ్యాన్ని ఎండగట్టారు. చంద్రబాబును ఏకంగా ‘గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం’అని దుయ్యబట్టారు. తెలుగు చరిత్రలో అభినవ ఔరంగజేబ్ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక చంద్రబాబు కుతంత్రాల చరిత్ర మాటలతో చెప్పడం సాధ్యం కాదని చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావించారు. అందుకే ‘ఒక చరిత్ర.. కొన్ని నిజాలు’ శీర్షికతో ఓ పుస్తకమే రాశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, అవినీతి గురించి సోదాహరణంగా ఎండగట్టారు. ఎన్టీ రామారావు ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి చేసిన విమర్శలనూ ఆ పుస్తకంలోనే ప్రస్తావించారు. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ఒక చరిత్ర – కొన్ని నిజాలు పుస్తకంలోని కొన్ని భాగాలు ఇవీ... ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకంలోని అంశాలు సంక్షిప్తంగా.. కాంగ్రెస్లో ఉండగానే అవినీతికి శ్రీకారంచంద్రబాబు కాంగ్రెస్ పారీ్టలో ఉండగానే అవినీతికి పాల్పడ్డారు. అసలు మంత్రి పదవి కోసమే చేయరాని పనులు చేశారు. మద్రాసులోని సవేరా హోటల్లో ఎన్నో చెప్పలేని, చేయరాని పనులు చేశారు. ఇక మంత్రి అయిన తరువాత అవినీతికి బరితెగించారు. ఆయనకు టార్చ్లైట్ మినిస్టర్ అని ఆనాడే ముద్ర వేశారు. అంటే రాత్రి వేళల్లో టార్చ్లైట్లతో పనులను తనిఖీ చేస్తున్నట్టు హడావుడి చేసి కాంట్రాక్టర్లను బెదిరించేవారు. అనంతరం వారి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేసేవారు. ఎన్టీఆర్ గ్లామర్కు ఐదు శాతం ఓట్లు కూడా రావని ఎద్దేవా సీనీ రంగంలో ఉన్న ఎనీ్టరామారావు 1982లో టీడీపీని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు ఆయన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయన తాను టీడీపీలో చేరనని ప్రకటించారు. అంతేకాదు ఎన్టీ రామారావు తిరుపతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే చంద్రబాబు ఆయన్ని ఎగతాళి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే సొంత మామ అయినా ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానన్నారు. చంద్రబాబును టీడీపీలో చేరాలని కోరినప్పుడు ఎద్దేవా చేశారు. కాగితాలపై ఏవేవో లెక్కలు వేసి ఎన్టీ రామారావు సినీ గ్లామర్కు ఐదు శాతం ఓట్లు రాలవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు చేతి నుంచి పైసా కూడా తీయరని కూడా హేళన చేశారు. అటువంటి ఎన్టీ రామారావు పార్టీని నడపలేరని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిన చంద్రబాబు 1983 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచి్చంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబూ ఓడిపోయారు. దాంతో ఆయన వెంటనే ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతానన్నారు. చంద్రబాబును పారీ్టలో చేర్చుకోవడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే ఎన్టీ రామారావు పార్టీ నేతలను ఒప్పించి చంద్రబాబు టీడీపీలో చేరికకు సమ్మతించారు. టీడీపీలో చేరగానే వసూళ్ల పర్వం చంద్రబాబు టీడీపీలో చేరగానే తన నైజాన్ని చూపించారు. మహానాడు, ఇతర పార్టీ కార్యక్రమాల పేరిట రాష్ట్రంలో భారీగా వసూళ్లు మొదలుపెట్టారు. ఇవన్నీ ఎన్టీ రామారావుకు తెలియకుండానే చేసేవారు. వసూలు చేసిన నిధులను పార్టీ ఖాతాలో జమ చేసేవారు కూడా కాదు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా కొనుగోలు చేసే సామగ్రిలో కూడా చంద్రబాబు కమీషన్లు తీసుకునేవారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తూ టీడీపీలో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. ఎనీ్టఆర్ కుటుంబ సభ్యులను అణచివేసిన చంద్రబాబు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు టీడీపీలో రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు అణచివేశారు. హరికృష్ణను తన వారసుడిగా చేయాలని ఎన్టీ రామారావు భావించారు. దాంతో హరికృష్ణను పార్టీ కార్యక్రమాలకు చాకచక్యంగా దూరం చేశారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ ఎదుగదలను అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడ్డారు. 1986లో మదనపల్లి సభలో ఎన్టీ రామారావు బాలకృష్ణను తన వారసుడిగా ప్రకటించారు. దాంతో చంద్రబాబు ఎన్టీ రామారావుపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటనకు ఆయనతోనే ఖండన ఇప్పించారు. బరితెగించి దోపిడీఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. మద్యం బాట్లింగ్ ప్లాంట్ల లైసెన్సుల వ్యవహారంలో చంద్రబాబు అవినీతి విస్మయపరిచింది. తమిళనాడుకు చెందిన పురుషోత్తం అనే కాంట్రాక్టరు ఉన్న తాజ్ బంజారా హోటల్కు తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లారు. ఆయన నుంచి రూ.3కోట్లను గోతం సంచులలో వేసుకుని తెచ్చుకున్నారు. ఆ విధంగా కాంట్రాక్టులు ఇప్పిస్తామని భారీగా కమీషన్లు తీసుకునే సంస్కృతి టీడీపీలోకి తెచి్చంది చంద్రబాబే. ఇక 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారు. కమీషన్లు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి కొమ్ముకాశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ శాసనసభలో నిలదీసింది. దాంతో ఆ ప్రాజెక్టు ఫైళ్లను ప్రతిపక్ష నేతలు స్పీకర్ కార్యాలయంలో పరిశీలించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రతిపక్ష టీడీపీ తరపున చంద్రబాబు స్పీకర్ కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని పత్రికలకు తెలిపారు. విషయం ఏమిటంటే... శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు పెద్ద మొత్తం చంద్రబాబుకు కమీషన్గా సమర్పించారు. ఆ విషయం తెలిసీ ఎన్టీ రామారావు చంద్రబాబుకు చెప్పరాని విధంగా చివాట్లు పెట్టారు. పార్టీని తాకట్టు పెడుతున్నారని ... అమ్మేస్తున్నారని కడిగిపారేశారు. వైస్రాయ్ కుట్ర.. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు మనుషులు1994లో టీడీపీ అఖండ మెజారీ్టతో అధికారంలోకి వచి్చనప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ కుట్రకు తెరతీశారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్కు వచ్చిన ఎన్టీ రామారావుపై చంద్రబాబు మనుషులు చెప్పులు విసిరారు. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని తలచుకుంటూ మనోవేదనతో ఎన్టీ రామారావు మరణించారు. అనంతరం టీడీపీ సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీ రామారావు బొమ్మలు తీయించి వేశారు. ‘ఇంకా ఎన్నాళ్లు ఎన్టీఆర్ బొమ్మ పట్టుకుని పాకులాడతాం... ఎనీ్టఆర్ బొమ్మ పోవాలి.. మన బొమ్మ రావాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు అవినీతి మరింత పెచ్చుమీరింది. ఏలేరు భూముల నష్టపరిహారం కుంభకోణం, లిక్కర్ అమ్మకాల్లో ముడుపులు, బిల్లీరావు ప్రమేయం ఐఎంజీ అనే బోగస్ సంస్థకు హైదరాబాద్లో వందల కోట్ల రూపాయలు విలువ చేసే వేయిఎకరాలను ఎకరా రూ.25 వేల చొప్పున కట్టబెట్టడం, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు ఇలా బరితెగించి అవినీతికి పాల్పడ్డారు. ఎన్టీ రామారావు‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డు కన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. ఎమ్మెల్యేలు అందరికీ డబ్బులు ఇచ్చారు. ఆయన పేరు చెప్పడం లేదు. పేరు చెప్పడానికి కూడా అర్హుడు కాదు. దేవుడు కూడా క్షమించనంత ఘాతుకం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది జాతి, చరిత్ర ఎప్పటికీ విస్మరించదు. మీరే న్యాయ నిర్ణేతలు. -
జగన్ వల్లే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుడు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటనకు సంబంధించిన అప్డేట్స్.. -
చంద్రబాబు దేశముదురు.. NTR నుండి KCR వరకు అంతా చెప్పింది ఒక్కటే..
-
ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి
-
రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?: మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్.. అలాంటి వ్యక్తి రెడ్బుక్ పేరుతో ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దంటూ మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమే. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.‘‘అది అసాధ్యం కాబట్టే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మంత్రులకు సింగపూర్లో శిక్షణా తరగతులు అంట. అవినీతి చేసి జైలు పాలయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో శిక్షణ ఇప్పిస్తారా?. గతంలో అమరావతి రైతులను కూడా ఇలాగే సింగపూర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారు. రాధాకృష్ణ ఉన్మాదాన్ని సమర్థించిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీళ్లు మరింత ఉన్మాదంతో వ్యవహరిస్తూ వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేస్తున్నారు’’ అంటూ మార్గాని భరత్ దుయ్యబట్టారు.‘‘కొన్ని ఫేక్ ఛానల్స్తో ఉన్మాదపు ట్రోల్స్ చేస్తున్నారు. నారా లోకేష్.. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైం మీకే ఇబ్బంది పెడుతుందని గుర్తించాలి. డైవర్షన్ రాజకీయాల కోసం ఏం చేసినా సహిస్తామనుకోవద్దు. మావిగన్ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేకంటే మావిగన్ బెటర్ అన్న చర్చ జరుగుతోంది...అమరావతిలో రాజధాని కడితే నయా రాయపూర్, గాంధీనగర్ లాగ అవుతుంది. సాయంత్రం అయితే అధికారులు విజయవాడ, గుంటూరు వెళ్తారేగానీ అమరావతిలో ఎవరూ ఉండరు. జనంలేని అమరావతిలో రాజధాని కడతారా?. జనం ఉన్న మావిగన్లో రాజధాని నిర్మిస్తారా?. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటితరం అమరావతిని చూడలేదు’’ అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. -
మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్: సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హర్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జువ్వలదిన్నె(కావలి) హార్బర్ను ప్రైవేట్పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి మత్స్యకారులకు తోడుగా, అండగా నిలిచింది వైఎస్ జగన్ మోహన్రెడ్డినే. వైఎస్సార్సీపీ హయాంలో పది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయన మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ, కూటమి ప్రభుత్వం మళ్లీ మత్స్యకారులను జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. కూటమి పని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఆలోచన చేయాలి.. ఆంధ్రా మత్స్యకారులు పాక్, బంగ్లా జైళ్లలో మగ్గిపోవడం చూశాం. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర చేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్పరం చేయాలనుకోవడం దుర్మార్గం. అసలు ఫిషింగ్ హర్బర్లలోకి మత్స్యకారులు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మత్స్యకారుల జీవితాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీదిరి ప్రశ్నించారు. మత్స్యకారులు ఉద్యమించి.. గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని సీదిరి పిలుపు ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ అంశంపై కూటమిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నోరు తెరవకపోతే మరింత అన్యాయం జరుగుతుంది. మిగతా ఫిషింగ్ హార్బర్లనూ ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్న మత్స్యకారులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రైవేటీకరణ వద్దు.. హర్బర్లు ముద్దు అని నినాదాలు చేయాలి. మత్స్యకారులకు వైఎస్జగన్ అండగా ఉన్నారు. కాబట్టి రేపటి ఆయన జువ్వలదిన్నె పర్యటన విజయవంతం చేయాలి’’ అని సీదిరి అప్పరాజు కోరారు. -
YS జగన్ మావిగన్ ప్రతిపాదన బాగుందని ప్రజలు చెబుతున్నారు
-
విజయవాడలో వృద్ధురాలు భూమి లాగేసుకుని.. ఇది చంద్రబాబు నీ పాలన..
-
ఇస్తారా.. లాక్కోవాలా..? అమరావతి రైతులకు బెదిరింపు
-
ఇదిగో ప్రూఫ్.... బాబుని పచ్చి బూతులు తిట్టిన టీడీపీ జనసేన బిజేపీ నేతలు
-
RBKలు ఇక ఉండవా? కూటమి మరో కుట్ర
-
అమరావతి అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు
సాక్షి, కర్నూలు: అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కేవలం అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతోందని అంటున్నారాయన. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవా?. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలకు డబ్బులు లేవని మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) అంటారు. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు ఎక్కువ. కేవలం డిజైన్ల పేరుతోనే రూ.400 కోట్ల అవినీతి జరుగుతోంది. అమరావతి గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా?. కనీసం ఆలోచన అయినా చేశారా?. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. రైతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు’’ అని బుగ్గన అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన కార్యాలయాలు ఉండేది నేషనల్ హైవే పక్కనే కదా!. శ్రీబాగ్ ఒడంబడికి అంటే టీడీపీ నేతలకు తెలుసా?. పెద్ద మనుషుల ఒప్పందం అంటే చంద్రబాబుకి తెలుసా?. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. కనీసం చంద్రబాబుకి వాటి గురించైనా తెలుసా?. మావిగన్, వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకి ఎందుకు కోపం?. కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పింది కదా’’ అని బుగ్గన గుర్తు చేశారు. -
6 నెలలుగా జీతాలు లేవు అమరావతి ఆస్పత్రి వద్ద ధర్నా
-
అమరావతి VS మావిగన్.. జగన్ విజన్ వర్సెస్ బాబు శకుని బుద్ది
-
‘మా బాబును రాష్ట్రపతి తెగ పొగిడేశారు తెలుసా!’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గాలికొదిలేసి.. ప్రచార ఆర్భాటాల కోసం టీడీపీ బృందం హస్తిన బాట పట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోమవారం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, టీడీపీ కూటమి ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు వారంతా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. బాబును పొగిడారంటూ ప్రచారం భేటీ అనంతరం టీడీపీ వర్గాలు తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం చంద్రబాబును రాష్ట్రపతి ‘ఇంటెలిజెంట్, విజనరీ’ అని ప్రశంసించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం గొప్ప విషయమని రాష్ట్రపతి అన్నట్టుగా లోకేశ్ బృందం ప్రచారం చేస్తోంది. రాష్ట్రపతితో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే వైఎస్సార్సీపీపైన, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన విమర్శలు గుప్పించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఐదు కోట్ల ఆంధ్రులను అవమానిస్తోందంటూ అక్కసు వెళ్లబోశారు. -
నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం
మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దానిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధపడడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా గంగపుత్రుల కోసం నిరి్మంచిన హార్బర్లో ప్రైవేటు పెత్తనానికి అనుమతించడం ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనా వెంటాడినా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జువ్వలదిన్నెతోపాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఇందులో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ 76.89 ఎకరాల్లో రూ.289 కోట్లతో పూర్తయింది, మిగతావి అనేక దశల్లో ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. మత్స్యకార కుటుంబాలు సుసంపన్నం అయ్యేవి. అయితే చంద్రబాబు కూటమి సర్కారు మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసేలా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్వీర్యం చేస్తూ.. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ పేరుతో ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధపడింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను 76.89 ఎకరాల్లో రూ.289 కోట్లతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా, ఏకకాలంలో 1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా సిద్ధం చేశారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందనే అంచనాతో హార్బర్లోనే కోల్డ్ చైన్, ఐస్ ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు.వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనా వెంటాడినా.. మిగిలిన మూడేళ్ల అవకాశాన్ని అందిపుచ్చుకుని శరవేగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేయాలని భావించారు. 2024 మార్చి 12న వర్చువల్గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ను నేరుగా మత్స్యకారుల సమక్షంలోనే ప్రారంభించాలని భావించి ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే అదే ఏడాది ఆగస్టు 31న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ట్ర నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వర్చువల్గా ప్రారంభించారు. మత్స్యకారుల భవితవ్యం.. వైఎస్ జగన్ సంకల్పం మత్స్యకారుల జీవనోపాధి మెరుగుకూ వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాలకు వలసలను నిరోధించేందుకు 1250 బోట్లను 50 శాతం సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపట్టారు. తొలి దశలో జిల్లాలోని వైఎస్సార్ మత్స్యకార భరోసా అందుకుంటున్న లబ్ధిదారులకు.. ఆ తర్వాత మిగతా వారికి బోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. ప్రతి బోటుకు 12 నుంచి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. బోటు విలువలో 10 శాతం లబ్ధిదారుల వాటాగా చెల్లిస్తే.. మిగతా 90 శాతం బ్యాంకు రుణం అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ పోను మిగతా 40 శాతం అప్పును మత్స్యకారులే చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు. వైఎస్ జగనే ఇప్పటికీ సీఎంగా ఉండి ఉంటే.. ఇప్పటికే ప్రతి మత్స్యకారుడూ మెకనైజ్డ్ బోటుకు యజమానై ఉండేవాడు. ఫిషింగ్ హార్బర్కు అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టుల ద్వారా సమృద్ధిగా ఉపాధి లభించేది. అభివృద్ధిని బుగ్గి చేసేందుకు బాబు సిద్ధం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల అభివృద్ధిని బుగ్గిచేసే కార్యక్రమాలు చేపట్టింది. ఫిషింగ్ హార్బర్లను నిర్వీర్యం చేసి అక్కడి భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి వారి భవిష్యత్ను నాశనం చేసేందుకు ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నెతోనే సాగర్ డిఫెన్స్ పేరిట కుట్రలకు తెరతీశారు. మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుంటే.. దశల వారీగా రాష్ట్రంలోని తీరం వెంబడి నిర్మాణంలో ఉన్న మిగతా ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేయడానికి బరితెగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్ పాలనలో మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 2014–19 మధ్య టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో రూ.4వేల అరకొర పరిహారం అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 19 వేల మందికి ఏకంగా రూ.10 వేలు చొప్పున అందించారు. ఇక డీజిల్పై సబ్సిడీని రూ.9కు పెంచి అందరికీ ఇచ్చారు. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా వర్తింపజేసి వెన్నుదన్నుగా నిలిచారు. దశాబ్దాల కలను నెరవేర్చిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించి మా దశాబ్దాల కలను నెరవేర్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ సంస్థకు హార్బర్ భూమిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. మా కడుపులు కొడుతోంది. ప్రైవేటుకిస్తే మత్స్యకారులకు హార్బర్లోకి ప్రవేశం ఉండదు. ప్రైవేట్ కంపెనీకి భూమి మరో ప్రాంతంలో ఇవ్వాలి. – కొండూరు శ్రీనివాసులు, మత్స్యకార నాయకుడు, ఇస్కపల్లి హార్బర్ భూమిని ప్రైవేట్పరం కానివ్వం జువ్వలదిన్నె హార్బర్ భూమిని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోం. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పనంగా భూమి అప్పజెప్పేందుకు యత్నించడం దారుణం. – రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్ పాలనలో మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 2014–19 మధ్య టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో రూ.4వేల అరకొర పరిహారం అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 19 వేల మందికి ఏకంగా రూ.10 వేలు చొప్పున అందించారు. ఇక డీజిల్పై సబ్సిడీని రూ.9కు పెంచి అందరికీ ఇచ్చారు. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా వర్తింపజేసి వెన్నుదన్నుగా నిలిచారు. దశాబ్దాల కలను నెరవేర్చిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించి మా దశాబ్దాల కలను నెరవేర్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ సంస్థకు హార్బర్ భూమిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. మా కడుపులు కొడుతోంది. ప్రైవేటుకిస్తే మత్స్యకారులకు హార్బర్లోకి ప్రవేశం ఉండదు. ప్రైవేట్ కంపెనీకి భూమి మరో ప్రాంతంలో ఇవ్వాలి. – కొండూరు శ్రీనివాసులు, మత్స్యకార నాయకుడు, ఇస్కపల్లి హార్బర్ భూమిని ప్రైవేట్పరం కానివ్వం జువ్వలదిన్నె హార్బర్ భూమిని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోం. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పనంగా భూమి అప్పజెప్పేందుకు యత్నించడం దారుణం. – రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
‘మావిగన్’తో కలవరం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్గా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం మావిగన్ ప్రకటనతో టీడీపీ, చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటం వల్లే తనకెప్పుడూ అలవాటైన రీతిలో చంద్రబాబు తన మంత్రుల ద్వారా తిట్ల దండకం చదివిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. జగన్ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడని నిప్పులు చెరిగారు.మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైఎస్ జగన్ మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా మావిగన్పై చర్చ జరగకుండా జగన్ను ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోనే వారి ఆశలు ఆవిరైపోయాయన్నారు. ఈ అంశం ప్రజల్లోకి శరవేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..వీళ్లంతా చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో..కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదు.. అని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నాడని చెప్పాడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు. ఇలా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాకు చూపించాలి. చంద్రబాబు ఊసరవెల్లి. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పార్టనర్గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేశ్ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకు పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? ఈ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు చేశారా? చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? వైఎస్ జగన్ మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారుపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు.రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు? మాస్టర్ ప్లాన్ ఇంత వరకు ఎందుకు రూపొందించలేదు? మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి. 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి. ఏ లెక్కన ఎకరం రూ.10 కోట్లు అంటున్నారు?జమ్మూ కశ్మీర్లో కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తెలిశాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా కూడా ప్రభుత్వం వద్ద లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్కు ఇంకెంత ఖర్చు చేయాలి? అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు (5 ఎకరాలు) గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్లో. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది.అలాంటిది ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైఎస్ జగన్ను తూలనాడుతున్నారు. 4,800 గజాల్లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబు ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? బాబు చెబుతున్న లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడైనా మావిగన్ గురించి ఆలోచించండి. రూ.10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పినట్లే విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టొచ్చు. కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్భుతమైన సదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి, చదరపు అడుగు రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా చదరపు అడుగు ఎంతో తెలుసుకోండి. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం చదరపు అడుగు రూ.16 వేలతో కట్టారా? చంద్రబాబు ఇంటికి ఇంతే పెడుతున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అగ్రిమెంట్ రాస్తాను.మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. కేంద్రమంత్రి పెమ్మసాని అమరావతిలో లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్, సోలార్–విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్, అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీ–నీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కటైనా చేశారా చంద్రబాబూ?ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే⇒ ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న పరిష్కారం డైవర్షన్ రాజకీయం. జగన్ను వ్యక్తిత్వ హననం చేస్తూ తిట్టించడం. చంద్రబాబు దోపిడీ, విలాసాలకు ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. రాష్ట్రాని సర్వనాశనం చేస్తున్నారు. రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ.3.57 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం కరువైంది. అభివృద్ధి అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా? ⇒ ప్రాక్టికల్ కాని అమరావతి మీద లక్షల కోట్లు పెడితే, ప్రజల పట్ల, రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏమిటి? ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి. 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేశ్ బీఆర్ కాపీలు చూపుతూ రూ.1,200 కోట్లు ఇస్తున్నామని చెప్పాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ⇒ ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. చివరకు పేద రోగుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా దోచుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దయ్యాయి. మీరిస్తామన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్న దానికీ అతీగతీ లేదు. 40 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్కు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి లేదు. ⇒ స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు–నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. మత్స్యకారుల కోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లు వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ ఆపేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నిత్యం అమరావతి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఆ పేరిట స్కామ్లు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలే కారణం. ఆయన స్కాముల కోసం ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నారు.ఇప్పటికైనా ఆలోచించండి⇒ ఏ రోజైనా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆలోచన చేశారా? జగన్ ఈస్ట్ బైపాస్ అనుమతులు తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంటి వద్దే ఎకరం రూ.3.63 కోట్లు ఉంటే అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? అలాంటప్పుడు వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి? ⇒ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్కు ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేశ్.. ఫీజు రీయింబర్స్మెంట్ నయా పైసలతో కట్టి మాట్లాడండి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాల్లో మునిగారు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే చెబుతున్నాడు. పంట నష్ట పరిహారం ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు. ⇒ అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్–1 తప్ప ఎక్కడ లిఫ్ట్లు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగు చేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరేది కాదు. మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అమరావతిని పోల్చండి. ⇒ ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మావిగన్ గురించి ఆలోచించండి. ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని లోకేశ్ పిలుపు ఇస్తే 29 గ్రామాల్లో ఎక్కడా ప్రజలు దీపాలు పెట్టలేదు. దీన్ని బట్టే ప్రజల మనోగతం అర్థమవుతోంది. -
అత్తసొమ్ము అల్లుడుదానమా.. ఎవరి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నావ్
-
లెక్క సెట్ చేస్తాం.. 2029లో చూపిస్తా..
-
అమ్మకానికి అమరావతి!
-
17 సంవత్సరాలలో బాబు కట్టిన హాస్పిటల్.. కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
అమరావతి భూములపై బాబు కాకి లెక్కలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో ఉన్న ఐదు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ విలువ ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.50 వేల కోట్లు పైమాటేనంటూ కాకి లెక్కలతో నమ్మించటానికి యత్నించి సీఎం చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతిపై ద్వేషంతోనే వైఎస్సార్సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలాడుతున్నారని ధ్వజమెత్తారు.అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే చంద్రబాబు మార్క్ ‘ఎండమావి’ కావాలా? లేక అందులో పదో వంతు ఖర్చుతో (అది కూడా దశలవారీగా) రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్ మార్క్ గ్రోత్ ఇంజన్ ‘మావిగన్’ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.అమరావతిలో చంద్రబాబు ఇంటి కోసం కొనుగోలు చేసిన 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500 మాత్రమే. దస్తావేజుల ప్రకారం ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లు. నిజానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ రికార్డుల (ఎస్ఆర్ఓ) ప్రకారం గజం ధర రూ.6 వేలు మాత్రమే. ఆ ప్రకారం అక్కడ ఎకరం భూమి విలువ రూ.2.91 కోట్లు. చంద్రబాబు కొనుగోలు చేసిన ధర ప్రకారం ఐదు వేల ఎకరాలు అమ్మితే వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లు మాత్రమే. అంతకు మించి పైసా రాదు. రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి? అమరావతిలో చంద్రబాబు సర్కారు ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్ల విలువ రూ.50 వేల కోట్లకు పైనే. అక్కడ రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కోసం ఆయన చెబుతున్న ప్రకారమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అంతా అప్పులు చేసే. ఇంకా తెచ్చేది కూడా అప్పే. దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది. ఎకరం రూ.20 కోట్లు పలికేలా అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు చెబుతుండగా 15 ఏళ్లు పడుతుందని ఆయన కుమారుడు అంటున్నారు. అప్పటికి వడ్డీ రూ.3 లక్షల కోట్లో రూ.4 లక్షల కోట్లో అవుతుంది. ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్లీ అప్పు చేయాల్సిందే కదా? చంద్రబాబు ఆయన కోసం సంపద సృష్టించుకుంటే, రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి? దీనిపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. -
‘సూటిగా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చంద్రబాబూ..’
తాడేపల్లి : అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందంటూ చెప్పటంపై సజ్జల ధ్వజమెత్తారు. మీ మాయ మాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టొద్దంటూ హితవు పలికారు. అమరావతి ల్యాండ్ బ్యాంక్ ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైఎస్సార్సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు నిన్న మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పి దొరికిపోయారని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబూ.. మీరు చెబుతున్న లెక్కలు కరెక్టే అయితే, ఈ కింది ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు?మీ మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమే.ఇప్పుడు అక్కడ ఎకరం భూమి విలువ రూ.10 కోట్లు అని మీరంటున్నారు.కానీ, అక్కడ మీరు మీ ఇంటి కోసం కొన్న 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500. మీ దస్తావేజుల ప్రకారమే లెక్క కడితే ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లు.నిజానికి రాజధానిలోని ఆ ప్రాంతంలో ప్రభుత్వ రికార్డుల (ఎస్ఆర్ఓ) ప్రకారం గజం భూమి ధర రూ.6 వేలు మాత్రమే.ఆ లెక్క ప్రకారం అక్కడ ఎకరం భూమి విలువ రూ.2.91 కోట్లు.అయినా కూడా మీ లెక్క ప్రకారమే, మీరు కొన్నట్లు గజం రూ.7500 చొప్పున లెక్క వేసుకున్నా, ఆ ధర ప్రకారం మీరు 5 వేల ఎకరాలు అమ్మినా, ఎవరైనా కొంటానన్నా వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లు మాత్రమే.అంతకు మించి ఒక్క పైసా రాదు.మరోవైపు మీరు ఇప్పటికే ఆ మేరకు ఖర్చు పెట్టేశారు.మేము ఇంకా దానికి వడ్డీ లెక్కేయడం లేదు.అమరావతిలో మీరు ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్ల విలువ రూ.50 వేలకు కోట్లకు పైగానే.ఇంకా అక్కడ కనీస మౌలిక సదుపాయాల కోసమే మీరు చెబుతున్న ఖర్చు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున.. ఇప్పుడు సేకరించే దాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.2 లక్షల కోట్లు.కాగా, ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది అప్పు.ఇంకా తెచ్చేది కూడా అప్పు.దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది.పోనీ మీరు అనుకున్నట్లు అభివృద్ధి చెందాక ఎకరం విలువ రూ.20 కోట్లు అవుతుందనుకుంటే, ఆ అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని మీరు, 15 ఏళ్లు పడుతుందని మీ కొడుకు అంటున్నారు.మరి అప్పటికి వడ్డీనే రూ.3 లక్షల కోట్లు అవుతుందా?లేక రూ.4 లక్షల కోట్లు అవుతుందా?నిజం చెప్పాలంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మీరు అప్పు చేయాల్సిందే కదా.మరి అలాంటప్పుడు ఆ అప్పు మీద వడ్డీ మాటేమిటి?మీకు సంపద సృష్టి కోసం అవి పనికి రావొచ్చు.కానీ, మన రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి?ఇప్పుడు ఈ విషయం మీకుచెప్పి కూడా లాభం లేదు.ఎందుకంటే ఈ లెక్కలు మీకు కూడా తెలుసు.ఇప్పుడు ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రజలు.అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే, చంద్రబాబుగారి మార్క్ ‘ఎండ మావి’జన్ కావాలా?అందులో పదో వంతు ఖర్చుతో అదీ దశలవారీగా రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్ గారి మార్క్ గ్రోత్ ఇంజన్ ‘మావిగన్’ కావాలా?అని ప్రశ్నించారు. -
బాబు మరో గ్రాఫిక్స్ మాయ.. వందల కోట్లు వృథా
-
కాకాణిపై ఆగని కక్షసాధింపు
సాక్షి ప్రతినిధి నెల్లూరు: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు ఆగడంలేదు. టీడీపీ కూటమి వైఫల్యాలను నిలదీసినా, వారి అనుకూల మీడియాను విమర్శించినా సహించేదిలేదన్నట్లుగా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి మురికిరాతలపై నిరసన వ్యక్తంచేసిన కాకాణిపై వేదాయపాళెం పోలీస్స్టేషన్లో రెండ్రోజుల వ్యవధిలో రెండు అక్రమ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ పెద్దల అసహనం.. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానాలను కాకాణి నిత్యం ప్రశ్నిస్తుండడాన్ని ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే అనేక అక్రమ కేసులు నమోదుచేసి 86 రోజుల పాటు జైల్లో నిర్బంధించి పైశాచికానందాన్ని పొందారు. అయితే కాకాణి జైలు నుంచి బయటకొచి్చనప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండడంతో జీర్ణించుకోలేని కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులతో వేధింపులు కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దు్రష్పచారంలో నిజమే గెలిచిందని.. అసత్య ప్రచారాలు, అర్థరహిత ఆరోపణలన్నీ అబద్ధాలని సీబీఐ నివేదిక ద్వారా తేటతెల్లమైందంటూ వైఎస్సార్సీపీ నేతలతో కలిసి మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కాకాణి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో.. ⇒ కులమతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా కాకాణి వ్యాఖ్యలు చేశారంటూ దర్గామిట్ట పోలీసులకు టీడీపీ నేత ఒకరు తప్పుడు ఫిర్యాదు చేశారు. ⇒ అలాగే.. కోవూరు మండలంలో బాలిక మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. ఫలితంగా ఆయనపై కోవూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ⇒ హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలిపినందుకు అక్కడి పోలీసులూ కేసు నమోదుచేశారు. ⇒ తాజాగా.. వేదాయపాళెం పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. మరోవైపు.. కాకాణి కుటుంబ సభ్యులపైనా ప్రభుత్వ పెద్దలు కక్షసాధింపు చర్యలకు ఒడిగట్టారు. కోవూరు మండలంలో బాలిక మృతి విషయమై ఎక్స్ వేదికగా కాకాణి పూజిత స్పందించారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో తట్టుకోలేకపోయారు. అంతే.. కోవూరు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నోటీసులు పంపారు. ఇప్పుడు ఏబీఎన్ దుర్మార్గ రాతలను నిరసిస్తూ చేపట్టిన నిరసనలో పాల్గొన్న ఆమెపైనా వేదాయపాళెం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఈనెల 8న నెల్లూరు ఆంధ్రజ్యోతి ఎడిషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో నిరసన వ్యక్తంచేసిన కాకాణి గోవర్ధన్రెడ్డిపై మర్నాడే ఆ పత్రికా సిబ్బంది ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితో ఓ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదుచేయడం గమనార్హం. అయితే, నిరసనలో వైఎస్సార్సీపీ నేతలు తమను తాకరాని చోట తాకారంటూ ఫిర్యాదు ఇవ్వాలని మహిళా పోలీసులపై ఒత్తిడి చేసినా.. అందుకు తాము సిద్ధంగాలేమని వారు ఖరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. మిగతా పోలీసు సిబ్బంది సైతం ఇందుకు వెనక్కి తగ్గినా.. వేదాయపాళెం సర్కిల్ ఇన్స్పెక్టర్తో బలవంతంగా ఫిర్యాదు చేయించి కేసు నమోదుచేసినట్లు సమాచారం. -
ఇది పుచ్చుకో.. అది ఇచ్చుకో!.. రాజధాని పనుల్లో క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కాంట్రాక్టు పనుల్లో మరో కోణం వెలుగుచూసింది. శాశ్వత సచివాలయంలో భాగంగా నిర్మిస్తున్న జీఏడీ టవర్ పనులను టెండర్లలో ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. కానీ.. ఆ టవర్ను డయాగ్రిడ్ స్ట్రక్చరల్ స్టీల్ విధానంలో తామే నిర్మిస్తున్నట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. టెండర్ నిబంధనల ప్రకారం 50 శాతం పనులను సీఆర్డీఏ అనుమతి తీసుకుని అధికారికంగా సబ్ కాంట్రాక్టర్కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణంలో డిజైన్, స్ట్రక్చరల్ కనెక్షన్ ఇంజినీరింగ్, ప్రిసిసిన్ స్టీల్ ఫ్యాబ్రికేషన్, డయాగ్రిడ్ స్ట్రక్చరల్ పద్ధతిలో నిర్మించే పనులను తాము చేస్తున్నట్లు భీమా సంస్థ పేర్కొంది.అయితే.. ఇదే సంస్థ హైదరాబాద్కు సమీపంలో శామీర్పేట వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్కు 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) విధానంలో ఐస్క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు తన వెబ్సైట్లో పేర్కొంది. ‘నీకిది.. నాకిది’లో భాగంగానే హెరిటేజ్ పుడ్స్కు ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ ప్లాంట్ను సీహెచ్ సీతారాం మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న భీమా సంస్థ నిర్మించిందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.హెరిటేజ్కు ఐస్క్రీమ్ ప్లాంట్ను నిర్మించిన భీమాటెండర్లలో అధికారికంగా పనులు దక్కించుకున్న ఎన్సీసీ సంస్థకు వాటిని అప్పగించడానికి గతేడాది జూన్ 26న ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలకు సమాచారం ఇచ్చి.. వారినుంచి అధికారిక అనుమతి తీసుకున్నాక 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణ పనుల్లో భీమా సంస్థకు ఎంత పరిమాణంలో సబ్ కాంట్రాక్టు కింద అప్పగించామన్నది ఎన్సీసీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలు కూడా వెల్లడించలేదు.కానీ.. భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ మాత్రం తన అధికారిక వెబ్సైట్లో ఆ పనులు చేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇదే సంస్థ సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్కు హైదరాబాద్కు సమీపంలోని శామీర్పేట్ వద్ద 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పు, 18.2 మీటర్ల ఎత్తుతో పీఈబీ విధానంలో ఐస్క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. ఆ ప్లాంట్ను ఇటీవల సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రారంభించారు.నాడూ నేడూ ఒకే సంస్థ.. అంచనా వ్యయం భారీగా పెంపుముఖ్యమంత్రి, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో 1,04,815 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో చేపట్టే పనులకు 2018లో నిర్వహించిన టెండర్లలో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. 2019 నాటికే రూ.32.90 కోట్ల విలువైన పనిని ఆ సంస్థ పూర్తి చేసిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) 2023లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే.. జీఏడీ టవర్లో మిగిలిన పనుల విలువ రూ.521.16 కోట్లు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ పనుల కాంట్రాక్ట్ విలువ రూ.884.22 కోట్లుగా నిర్ణయించి.. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో 163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంటూ గతేడాది టెండర్లు పిలిచింది.ఈ పనులను 4.53 శాతం అధిక ధర అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచి ఎన్సీసీ సంస్థే తిరిగి దక్కించుకుంది. దానికి పన్నులు కలిపితే.. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లకు చేరుతుంది. అంటే.. నాటికీ నేటీకీ అంచనా వ్యయం రూ.524.91 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. అప్పుడూ ఇప్పుడూ ఒకే సంస్థ టెండర్లో పనులు దక్కించుకోవడాన్ని బట్టి చూస్తే గూడుపుఠాణీ కాకపోతే మరేమిటని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిద్వారా కాంట్రాక్టర్కు భారీఎత్తున ప్రయోజనం చేకూర్చారని ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇవే అంశాలను వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. -
జైలుకెళ్లడానికైనా సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం తాను చేసిన ప్రజా పోరాటంలో 6 నెలల జైలు శిక్ష పడటం ఉత్తరాంధ్ర ప్రజల పట్ల తనకున్న నిబద్ధతకు నిదర్శనమని.. దీనిని తాను గర్వకారణంగా భావిస్తున్నానని చెప్పారు. తాను చేసిన ఆమరణ నిరాహార దీక్షపై కోర్టు తీర్పును గౌరవిస్తూనే.. ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు.ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తానని.. కానీ విశాఖ హక్కుల కోసం పోరాటం మాత్రం ఆపేది లేదన్నారు. వాల్తేరు డివిజన్లో అత్యధిక ఆదాయాన్నిచ్చే కేకే లైన్ను ఒడిశాలోని రాయగడ డివిజన్లో కలుపుతుంటే.. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి మంత్రులు, ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మీద, భోగాపురం ఎయిర్పోర్టు కనెక్టివిటీ రోడ్డు మీద ఎందుకు లేదని నిలదీశారు. ఓర్వలేకే డైవర్షన్ పాలిటిక్స్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ.. మిగిలిన ప్రాంతాలపై కక్ష ఉన్నాయన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మావిగన్ను ప్రజలు స్వాగతిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారు. షర్మిల తీరు చూస్తుంటే కాంగ్రెస్ భావజాలం కంటే.. బాబు సారూప్యత భావజాలంతోనే పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆమె మాట్లాడుతున్నారన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య ఉన్నారు. -
చేయించేది.. నిందలు వేసేది నారా బాబే!
సాక్షి, అమరావతి: హత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు తెరతీసిందే చంద్రబాబు అని, ఇది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం అని వక్కాణిస్తున్నారు. గతంలో రౌడీలు, అసాంఘిక శక్తుల పరస్పర ఘర్షణల్లో అప్పుడప్పుడు హత్యలు జరుగుతుండేవి. కానీ రాజకీయ ఆధిపత్యం కోసం, ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడం కోసం హత్యలకు తెగబడే ఒరవడిని తీసుకువచ్చింది మాత్రం కచ్చితంగా చంద్రబాబేనని రాజకీయ విశ్లేషకులు గతంలోనే కుండబద్దలు కొట్టారు.అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడే విధానాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసిందీ చంద్రబాబే అంటున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. ఇక తన ప్రభుత్వ హయాంలో ఇంకెతంగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం అని పలు ఘటనలను ప్రస్తావిస్తున్నారు. నాడు విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండ వరకు అన్ని దారుణాల్లో అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చర్చకొచ్చిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్పై హత్యాయత్నం కుట్ర కప్పిపుచ్చి.. 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరని చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మామగారిపైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు 1983లో టీడీపీ అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ప్లేటు ఫిరాయించి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు.కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వా«దీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా, ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఏకంగా ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం చేసిన నిందితుడు అనుమానాస్పద మృతి.. అతను రాసిన లేఖపై పోలీసుల మౌనం.. అంతా పక్కా పన్నాగంతోనే సాగాయన్నది స్పష్టమైంది. ఎన్టీ రామారావు హత్యకు గురైతే రాజకీయ అధికారం ఎవరికి దక్కుతుందన్నది కీలకంగా మారింది. దాంతో సహజంగానే చంద్రబాబుపైనే అందరికీ సందేహం కలిగింది. ఆ వాస్తవాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చే కుట్ర నేపథ్యంలోనే మల్లెల బాబ్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై చంద్రబాబే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు, పరిశీలకులు ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ఆయన మౌనంగా ఉండిపోవడం సందేహాలను మరింత బలపరుస్తోంది. పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్య టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతున్న సమయంలోనే దశరథ రామ్పై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరగడం గమనార్హం. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులోనే హత్య చేసేందుకు యత్నించారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే మారణాయుధాలతో వెంటబడ్డారు. 1985 అక్టోబర్ 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథ రామ్ను దారి కాచి మరీ దారుణంగా హత్య చేశారు.కొన ప్రాణాలతో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినా సరే పోలీసులు ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేశారు. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథ రామ్ను హత్య చేశారన్నది స్పష్టమైంది. దశరథ రామ్ హత్య ఉదంతంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. ఆ హత్య వెనుక సూత్రధారులు ఎవరన్నది బయటకు రాకుండా ప్రభుత్వం మేనేజ్ చేసింది. రంగా హత్య కుట్రదారు చంద్రబాబే చంద్రబాబు హత్యా రాజకీయాలకు పరాకాష్ట వంగవీటి మోహన రంగా దారుణ హత్యే అని పలువురు నేతలు నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో చెలరేగిపోయిన చంద్రబాబుకు విజయవాడలో ప్రజా నాయకుడు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంగవీటి రంగా అడ్డుగా నిలిచారు. దాంతో రంగా హత్యకు టీడీపీ కుట్ర పన్నింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన అప్పటి హామ్ మంత్రి కోడెల శివప్రసాదరావు ఈ కుతంత్రానికి తెర తీశారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 25 అర్ధరాత్రి తర్వాత టీడీపీ రౌడీ మూకలు నరికి చంపాయి.ఆ రోజు రంగా హత్యలో స్వయంగా పాల్గొన్నారని నిందితుల జాబితాలో ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009లో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గమనార్హం. తద్వారా వంగవీటి రంగా హంతకులకు చంద్రబాబు అండదండలు ఉన్నాయనే విషయం మరోసారి నిరూపితమైంది. వెలగపూడి రామకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో కీలక నేతగా ఉన్నారు. చంద్రబాబు అండతో టీడీపీ మద్యం సిండికేట్కు రింగ్ మాస్టర్గా దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్య రాజకీయ ప్రత్యర్థులను అడ్డం తొలగించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగబడతారనడానికి వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. అందువల్లే హంతకులకు 30 రోజులపాటు చంద్రబాబే హైదరాబాద్లో ఆశ్రయం ఇప్పించారని అప్పట్లోనే వెల్లడైంది.ఈ హత్యపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఆధారాలు లేవని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై కోర్టులో కౌంటర్ కూడా వేయలేదు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు న్యాయస్థానం 2006లో యావజ్జీవ ఖైదు విధించింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్ రెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉంటే బాబు అరాచక శక్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ఆందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించేవారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం.బాబు ఘాతుకాలకు ఆయన తోడల్లుడే సాక్షిపిల్లనిచ్చిన సొంత మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోవడంతో పాటు చంద్రబాబు సీఎం కావడం వెనుక సత్యాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా చెప్పారు. ఒక చరిత్ర కొన్ని నిజాలు – సత్యానికి మరో కోణం పుస్తకాల్లో బాబు ఘాతుకాలను సవివరంగా పేర్కొన్నారు. ఆగస్టు తిరుగుబాటులో చంద్రబాబు పోషించిన పాత్రను దగ్గుబాటి బట్టబయలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సైతం చంద్రబాబు దారుణాలను తాను రాసిన ‘60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో వివరించారు. -
ఏపీలో అంతా ఊడ్చేశాం..! ప్యూచర్ తెలంగానే బాబు మాస్టర్ స్కెచ్..
-
బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ
-
చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం, జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఏపీపై బట్టబయలైన చంద్రబాబు కపట ప్రేమ
సాక్షి,అమరావతి: ఏపీపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తూనే, పెట్టుబడులను మాత్రం తెలంగాణలో పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో హెరిటేజ్ సంస్థ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసింది. శామీర్పేటలో 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పుతో హెరిటేజ్ ఐస్క్రీమ్ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్లాంట్లో చంద్రబాబు కుటుంబం రూ.204 కోట్ల పెట్టుబడి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించింది.అయితే, కొత్త ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కుటుంబం ఆసక్తి చూపలేదని విమర్శలు వస్తున్నాయి. సొంత రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని చూసే ఏపీకి పెట్టుబడులు వస్తాయంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. తన కుటుంబ వ్యాపారాన్ని మాత్రం తెలంగాణలో విస్తరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. -
భోగాపురం ఎయిర్ పోర్టుకు దారేది..? కూటమికి ఇచ్చిపడేసిన గుడివాడ అమర్నాథ్
-
జగన్ విజన్ భేష్ ..మంత్రివర్గంలో మావిగన్.. చంద్రబాబు అసంతృప్తి
-
లోకేష్ కి చిప్ దొబ్బింది అంటే... జోగి రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు గూటిలో చిలక షర్మిల.. గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కామెంట్స్
-
జగన్ ను ప్రశ్నించే హక్కు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు..
-
అలా చేస్తే.. అమరావతి ఘోస్ట్ క్యాపిటల్ అవుతుంది: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విభజన హామీలను గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని.. ఆ విభజన హామీలపై మా పార్టీ పోరాటం చేసిందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 50 ఏళ్ల కల.. వైఎస్. జగన్ నాయకత్వంలో రైల్వే జోన్ కోసం పోరాటం చేశాం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.‘‘నిరాహార దీక్ష చేస్తున్న నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టింది. ప్రజల పక్షాన చేసిన పోరాటంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తా.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రాణ త్యాగనికైనా సిద్ధమని ఆరోజే చెప్పాను. విశాఖ రైల్వే ఏర్పాటు వైఎస్సార్సీపీ పోరాట ఫలితమే. రైల్వే జోన్ కోసం భూ కేటాయింపు కూడా మా హయాంలోనే చేశాం’’ అని అమర్నాథ్ వివరించారు.‘‘రైల్వే జోన్కు అనుమతులు భూ కేటాయింపులు మా హయాంలోనే జరిగినా శంకుస్థాపన కావాలని చేశారు. జోన్ సాకారం అయినప్పటికీ కీలకమైన కేకే లైన్ను రాయగడ డివిజన్కు కేటాయించారు. ఉత్తరాంధ్రలో ఉన్న కూటమి ప్రజా ప్రతినిధులు చేతకాని దద్దమ్మలు. ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. అమరావతి కోసం మాట్లాడుతున్న కూటమి ఎంపీలు, నేతలు రైల్వే జోన్లో ఆదాయం వచ్చే లైన్ కోసం ఎందుకు మాట్లాడటం లేదు. అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదు. స్టీల్ ప్లాంట్ కోసం అవకాశం ఉన్నా కూటమి నేతలు మాట్లాడటం లేదు...రాజధానిపై మావిగన్ ప్రత్తిపాధనపై ప్రజల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు ఇప్పుడు కారిడార్ పేరుతో కొత్త బాష్యం చెప్తున్నారు. అమరావతికి రూ.50 వేల కోట్లు పనులకు టెండర్లు పిలిచారు. 28 గ్రామాల మినహా ఇంకెక్కడైనా డబ్బులు ఖర్చు చేశారా..? విశాఖ-భోగాపురం కోస్టల్ కారిడార్కు అనుమతి తీసుకొచ్చాం.. భోగాపురానికి దారేది అనే ప్రశ్న ఎక్కడ చూసినా వినిపిస్తుంది. పోలవరం ఎత్తు తగ్గించినా.. కూటమి నేతలు దద్దమ్మల్లా ఉన్నారు...డబ్బులన్నీ అక్కడే పెడితే అమరావతి ఘోస్ట్ క్యాపిటల్గా మిగిలిపోతుంది.. అవకాశాలు ఉన్న నగరాలను వదిలేసి అమరావతిని పట్టుకొని వేలాడుతుంది. న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తాను. న్యాయ స్థానంపై గౌరవంతో ఉన్నాం.. ప్రజల తరఫున పోరాటం ఆపేది లేదు. స్టీల్ ప్లాంట్పై మా హయాంలో ఎన్ని పోరాటాలు చేసినా ఒక్క కేసు కూడా పెట్టలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగిన పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చి భాగస్వాములు అయ్యాం...నేను చేసిన పోరాటం ప్రజల కోసమే.. రైల్వే జోన్ కోసం నేను చేసిన పోరాటానికి నాకు వచ్చిన ఫలితం ఆరు నెలల జైలు శిక్ష. రైలు పట్టాలపై నా తల పెట్టి అయినా రైల్వే జోన్ సాధిస్తానని ఆరోజే చెప్పా.. సీఎం అంటే 28 గ్రామాలకు మాత్రమే కాదు.. చంద్రబాబు మోసం చేస్తాడని తెలిసి ప్రజలు టీడీపీకి ఓటేశారు. కేకే లైన్ వాల్తేరు డివిజన్ పరిధిలోకి తీసుకోవాలి.. ఇది మా డిమాండ్. కేకే లైన్ సాధించే వరకూ వైసీపీ పోరాటం ఆగదు’’ అని గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు. -
జగన్ కు పేరొస్తుందని భయపడి..! భోగాపురం రోడ్డుకు బాబు బ్రేక్ ?
-
ఏపీలో మావిగన్ ట్రెండ్.. రగిలిపోతున్న ఎల్లో మీడియా..
-
360 లక్షల కోట్లు..! వాటే విజన్
-
అస్మదీయ ఆస్పత్రులకే నిధులు!
సాక్షి, అమరావతి: ఒకవైపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా తొక్కిపెడుతున్న చంద్రబాబు సర్కారు.. కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులకు చెందిన ఆస్పత్రులకు మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) రూపంలో నిధుల వరద పారిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. అయితే వీటికి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాకుండా ఎల్ఓసీల రూపంలో రెండు మూడు రెట్లు అధికంగా ఖజానా నుంచి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.ఆరోగ్యశ్రీలో నిరాకరణక్యాన్సర్ రోగులకు జబ్బు తీవ్రతను బట్టి రేడియేషన్ థెరపీకి ఆరోగ్యశ్రీలో రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల మేరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా ఇస్తుంది. అయితే కూటమి నేతలకు చెందిన ఆస్పత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ సేవలను నిరాకరిస్తూ ఎల్ఓసీలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఎన్నికల అనంతరం పక్క రాష్ట్రంలో ‘ముఖ్య’నేత బంధువుకు చెందిన క్యాన్సర్ ఆస్పత్రిలో బోన్మ్యారో సహా ఇతర ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులకు చెందిన ఆస్పత్రులు ఎల్ఓసీలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.‘స్వాహా’పై దాటవేత..!‘సాక్షి’ గురువారం సంచికలో ప్రచురించిన ‘సీఎంఆర్ఎఫ్ స్వాహా!’ కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారమే సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరు, ఎల్ఓసీ జారీ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా చేపడుతున్నామని తెలిపింది. అయితే వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన తుంటి ఎల్లయ్యకు సీఎంఆర్ఎఫ్ సాయం ముసుగులో టీడీపీ నాయకుడు వేణుగోపాల్ రూ.8 లక్షలు కాజేసిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకుండా దాటవేయడం గమనార్హం. -
‘సీమ’కు ఎప్పుడూ బాబు ద్రోహమే
సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేయడంపై వైఎస్సార్సీపీ నేతలు ఉద్యమబాట పట్టారు. పోతిరెడ్డిపాడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆపై తిరుపతి, కడపలో సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే శుక్రవారం అనంతపురంలో ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచన’ పేరుతో పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీమంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ‘సీమ’ లిఫ్ట్పై విస్తృత చర్చ జరగాలి.. రైతులు విత్తనాలు, ఎరువులతో పాటు ఏదైనా కొనుగోలు చేయగలరు. కానీ, సాగునీరు కొనలేరు. దీన్ని ప్రభుత్వాలు అందించాలి. అది వాటి బాధ్యత. చంద్రబాబు ఎప్పుడూ రైతుల గురించి ఆలోచించలేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్ పెంచారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ లిఫ్ట్ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతలతో 800 అడుగుల నుంచే నీటిని తోడేలా ప్రాజెక్టులు నిర్మించింది. దీంతో మనమూ లిఫ్ట్ నిర్మించాల్సి వచ్చింది. కానీ, చంద్రబాబు వచ్చాక పనులు ఆపేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు ఆపించానని రేవంత్రెడ్డి చెప్పేదాకా దీని వెనకున్న కుట్రను ఎవరూ గ్రహించలేదు. రాయలసీమ లిఫ్ట్పై విస్తృత చర్చ జరగాలి. చంద్రబాబు వైఖరిని ఎండగట్టాలి. దీనిపై కార్యాచరణ రూపొందించి పోరాడాలి. వ్యవసాయం, సాగునీటి విషయాల్లో చంద్రబాబు ‘సీమ’కు ఎప్పుడూ ద్రోహమే చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ సాధన ఉద్యమాన్ని జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ, మండల స్థాయికి తీసుకెళ్లాలి. మా ప్రాంతం గొంతు కోయడమే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు ఆపడమంటే మా ప్రాంతం గొంతు కోయడమే. ఎవరు అడ్డొచ్చినా లిఫ్ట్ను ఆపలేరు. దాన్ని కచ్చితంగా సాధిస్తాం. రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు ఆపేస్తే సీమ వాసి అయి ఉండి మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించడంలేదు. ఆయనకు సిగ్గుందా? చంద్రబాబు సీమకు చేసిన ఒక్క మంచి పని చెప్పాలి. సీమ లిఫ్ట్ పూర్తయితే హంద్రీ–నీవా నీటిని మొత్తం అనంతపురం, కర్నూలు జిల్లాలు వినియోగించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు. కానీ, సీమకు సాగునీరిస్తే అమరావతి కంటే ఎక్కువగా రైతులు సెల్ఫ్ ఫైనాన్స్ చేసి ప్రభుత్వానికి ఆదాయం ఇస్తారు. రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో చెప్పే వరకూ రాయలసీమ లిఫ్ట్ రూ.3,850 కోట్లతో నిర్మిస్తున్నామని ఎవ్వరికీ తెలీదు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, రంగయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, అనంత, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుడు నరేశ్కుమార్రెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో చేసిన తీర్మానాలు» హంద్రీ–నీవా ప్రధాన కాలువను 6,300 క్యూసెక్కులకు విస్తరించాలి. » హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలను పూర్తిచేసి ఆయకట్టుకు నీరివ్వాలి. » బీజేపీ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ అమలుచేయాలి. » కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో పాటు లా యూనివర్సిటీ నిర్మించాలి. » పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 80 వేల క్యూసెక్కులకు పెంచాలి. » రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తిచేయాలి. -
బాబు సర్కార్ దగాపై అంగన్వాడీల ఉద్యమబాట
సాక్షి, అమరావతి: వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీలు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టి.. చంద్రబాబు సర్కార్ మోసాన్ని ఎండగడతామని వెల్లడించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూలకు చెందిన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాయకులు శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఉపాధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ.. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సార్లు మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపారని, సీఎంతో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. అందుకే మరోసారి ఉద్యమ బాట పడుతున్నామని చెప్పారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) అధ్యక్షురాలు జె.లలితమ్మ మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో అంగన్వాడీల వేతనాలు పెంచినా.. ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) నాయకురాలు పి.పద్మ మాట్లాడుతూ.. నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ప్రధాన హామీలు నెరవేర్చడం లేదని, ఇచ్చిన జీవోలు కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. సమావేశంలో నాయకులు టి.గజలక్ష్మి, ఎం.శారమ్మ, కె.పద్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, తమ సమస్యలపై మంత్రి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారికి అంగన్వాడీ నాయకులు శుక్రవారం సచివాలయంలో వినతిపత్రం అందించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రధాన డిమాండ్లు.. 2024 జూన్ నుంచి వేతనాలు పెంచుతామన్న హామీ అమలు చేయాలి. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు, మినీ వర్కర్లను మెయిన్గా మార్చుతూ ఇచ్చిన మూడు జీవోలు అమలు చేయాలి. హెల్పర్ల పదోన్నతికి మార్గదర్శకాలు రూపొందించాలి. అంగన్వాడీ పనులు మాత్రమే అప్పగించాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్, సంక్షేమ పథకాలు అందించాలి. పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో 1,810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలి. -
మంత్రివర్గంలో మావిగన్!
సాక్షి, అమరావతి : మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్గా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మావిగన్పై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. దీనివల్ల అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసిన అంశానికి పెద్దగా ప్రచారం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయంలో మంత్రులు వెనుకబడ్డారని, మావిగన్ను తిప్పికొట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేసి.. వ్యతిరేకంగా పని చేయించినా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మాత్రం దీటైన స్పందన రాలేదని అన్నట్లు తెలిసింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని, అందుకు అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారని సమాచారం. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే పని చేయాలని.. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపు అన్నిచోట్లా పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. కనీసం ఆయా పనులు మొదలయ్యేలా అయినా చర్యలు తీసుకుంటేనే అర్బన్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఏబీఎన్ రాధాకృష్ణ ఏం మాట్లాడారనే విషయంతో సంబంధం లేకుండా పార్టీ ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందేనని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అజెండా, అందులో చర్చించే అంశాలు ముందుగానే లీక్ అవుతున్నాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలుసుకోవడం పెద్ద పని కాదని, కానీ అలా జరక్కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. లీకులు మంత్రుల నుంచి జరుగుతోందా, అధికారుల నుంచా అని ఆరా తీసినట్లు తెలిసింది. అదే సమయంలో తమకు కేబినెట్ అజెండా ఇప్పటి వరకు అందలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్లో జరుగుతున్న అవినీతిపై సాక్షిలో ప్రచురితమైన కథనంపైనా చంద్రబాబు స్పందించినట్లు తెలిసింది. ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయో గుర్తించి, తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
కొత్త డిస్కం.. జగన్ విజన్కు తార్కాణం
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పాతికేళ్లపాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ను ఉచితంగా అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టకేలకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగించక తప్పలేదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విష ప్రచారం చేసినా.. తుదకు జగన్ తీసుకొచ్చిన సంస్కరణలే మంచివనే నిర్ణయానికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ప్రతిపాదనను తిరిగి తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం మూడు డిస్కంల ఆధ్వర్యంలో ఉన్న 11 కేవీ వ్యవసాయ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి (క్యాబినెట్) శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో విజన్ ఉన్న నాయకుడు జగన్ అని మరోసారి రుజువైంది. ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలవడంతో పాటు అధికారంలోకి వచ్చాక వారికి మంచి చేయాలనే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్కు అప్పట్లో పంట చేలల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతన్నలు అడుగడుగునా తమ గోడును చెప్పుకున్నారు. రాత్రనకా, పగలనకా సాగు నీటి కోసం బోర్ల వద్ద పడిగాపులు కాస్తూ, విద్యుత్ కోసం పడుతున్న బాధలను కన్నీళ్లతో వివరించారు. వారి కష్టాలను కళ్లారా చూసిన జగన్.. అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు ఢోకా లేకుండా చేయాలనుకున్నారు. అది కూడా పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా అందించాలనుకున్నారు. అది సౌర విద్యుత్ వల్లనే సాధ్యమవుతుందని భావించారు. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా సామర్థ్యం కలిగిన వ్యవసాయ ఫీడర్లను అప్గ్రేడ్ చేయడం కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశారు.కొత్త డిస్కంకు అప్పుడే అంకురార్పణ అన్నదాతలకు ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలనే సంకల్పంతో 2020 ఫిబ్రవరి 15న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ను ఏర్పాటు చేసి, సౌర విద్యుత్ సమీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయాన్ని మెచ్చి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) 2021 సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. రైతుల శ్రేయస్సు కోసం ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి ముందు చూపుతో ఆలోచించి సౌర విద్యుత్ సేకరణకు ప్రయత్నించడం అభినందనీయమని ఆ లేఖలో పేర్కొంది. యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తామే సరఫరా చేస్తామంటూ ప్రతిపాదన చేసింది. సెకీతో ఒప్పందం కోసం ఏపీజీఈసీఎల్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్ఏపీఎస్సీఎల్)గా మార్పు చేస్తూ 2021 నవంబర్ 3న జగన్ ప్రభుత్వం జీఓ నంబర్ 152ను విడుదల చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు పొందడంలో భాగంగానే వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇది వ్యవసాయానికి అత్యంత అవశ్యకం కావడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీఆర్ఏపీఎస్సీఎల్కు ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ (ఏపీఆర్ఏపీఎల్) అనే పేరును ఖరారు చేసింది.నాడు అంతా విష ప్రచారమని తేటతెల్లంరాష్ట్రంలో తూర్పు (ఏపీఈపీడీసీఎల్), మధ్య (ఏపీసీపీడీసీఎల్), దక్షిణ (ఏపీఎస్పీడీసీఎల్) ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లున్నాయి. వీటి పరిధిలో 22 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటన్నిటినీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏపీఆర్ఏపీఎల్కు బదిలీ చేస్తున్నారు. సర్వీసులు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, స్తంభాలు ఇలా వ్యవసాయ విద్యుత్ సరఫరాకు వినియోగిస్తున్నవన్నీ కొత్త డిస్కంలో విలీనం చేస్తారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపడంతో ఇంధన శాఖ ఏపీఈఆర్సీకి ఫైలును పంపనుంది. మండలి ఆమోదం అనంతరం ఏపీఆర్ఏపీఎల్కు ప్రత్యేక కార్యాలయం, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందని ఇంధన శాఖ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ సెకీ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల భారం పడుతుందని చంద్రబాబు అండ్ కో చేసిందంతా కూడా తప్పుడు, విష ప్రచారం అని తేలిపోయింది. -
బాబు సర్కారుకు బలుసు ఇం‘ధనం’!
సాక్షి, అమరావతి: ఫేక్ సబ్ కాంట్రాక్టులు సృష్టించి.. చేయని పనులకు డబ్బులు వసూలు చేసుకుని.. దాన్ని టీడీపీ పెద్దలకు ఎన్నికల ఇం‘ధనం’ కింద సమకూర్చినందుకు ప్రతిఫలంగా అస్మదీయ కాంట్రాక్టర్లకు రాజధానిలో పనులు కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకుంటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్పష్టంచేస్తున్నారు. ఆ ఫేక్ కాంట్రాక్టులు ఎవరివి? ఎంత విత్డ్రా చేశారు? అనే సమగ్ర సమాచారం వివరాలు తీగ లాగితే డొంక కదలడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అమరావతిని అవినీతి గనిగా మార్చేశారని, దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో దోచేయడానికి అక్షయపాత్రగా చేసుకున్నారని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ సంస్థకు ఇప్పటికే రూ.7,440.08 కోట్ల విలువైన 19 ప్యాకేజీల పనులు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం దీనికి నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. కర్ణాటకలో బెంగళూరు, మైసూర్ లాంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు 2014, 2024 ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున ఇం‘ధనం’ చేకూర్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో కింద అమరావతిలో అధిక ధరలకు పెద్ద ఎత్తున పనులు అప్పగించి, మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.744 కోట్లు ఇచ్చేసి.. అందులో 8 శాతం కమీషన్లు వసూలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. నిబంధనలు తుంగలో తొక్కేసి రాజధానిలో రూ.1,082.44 కోట్ల విలువైన 220 కేవీ విద్యుత్తు లైన్ పనులను 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ సంస్థకు అప్పగించడం ఈ దోపిడీకి మరో నిదర్శనమని ఉదహరిస్తున్నారు.నాడు రూ.211.53 కోట్లే... నేడు రూ.470.41 కోట్లు బంగ్లాల నిర్మాణం పేరుతో బరి తెగింపు..రాజధాని అమరావతి ప్రాంతంలో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒకొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనులను 2017–18లో రూ.211.54 కోట్లకు టెండర్లలో బీఎస్సార్కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. 2019 నాటికి రూ.35.18 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు 2023లో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇచ్చిన నివేదికలో తేల్చింది. అంటే మిగిలిన పని విలువ రూ.176.36 కోట్లు మాత్రమే. కానీ.. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ పని అంచనా వ్యయాన్ని రూ.401.37 కోట్లకు పెంచేసి గతేడాది టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.419.07 కోట్లకు కోట్ చేసి మళ్లీ బీఎస్సార్ సంస్థే ఆ పనులను దక్కించుకోవడం గమనార్హం. స్టీలు, సిమెంటు సహా నిర్మాణ సామగ్రి ధరల్లో నాటికీ నేటికీ పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే రూ.176.36 కోట్ల విలువైన పనిని ఏకంగా రూ.419.07 కోట్లకు బీఎస్సార్ సంస్థకు కట్టబెట్టడం గమనార్హం. ఇది గూడుపుఠాణి కాక మరేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక సీనరేజీ, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో రూ.76.59 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.495.66 కోట్లు. 2019కి ముందు ఇదే పనులకు రూ.35.18 కోట్లు వ్యయం చేశారు. అంటే.. ఈ బంగ్లాల నిర్మాణ విలువ రూ.530.84 కోట్లు.చదరపు అడుగుకు రూ.11,203.41.. మెట్రో నగరాలకు మించి వ్యయం..మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న 71 బంగ్లాలలో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే టెండర్లలో నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. మౌలిక సదుపాయాలతో కలిపి సగటున చదరపు అడుగుకు రూ.11,203.41 చొప్పున వ్యయం చేస్తుండటం గమనార్హం. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.7.47 కోట్లు. ఇదే తరహా బంగ్లా ధర బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో భూమితో కలిపి రూ.5 కోట్ల లోపే ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు.ఒకే ప్యాకేజీని రెండుగా విభజించి.. అంచనా వ్యయం రూ.123.28 కోట్లు పెంపుఅనంతవరం, నెక్కళ్లు, తుళ్లూరు, నేలపాడు, శాఖమూరు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ పనులను జోన్–2 కింద 2017 ఆగస్టు 7న టెండర్లలో రూ.725.71 కోట్లకు బీఎస్సార్ సంస్థకు నాటి చంద్రబాబు సర్కార్ అప్పగించింది. అనంతరం 2024లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లను రద్దు చేసింది. అప్పట్లో ఒకే ప్యాకేజీ కింద జోన్–2 లేఅవుట్ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ.. గతేడాది వాటిని రెండుగా విభజించి జోన్–2ఏ (అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు ల్యాండ్ పూలింగ్ లేఅవుట్), జోన్–2బీ (అనంతవరం, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు ల్యాండ్ పూలింగ్ లే అవుట్) టెండర్లు పిలిచింది. జోన్–2ఏ పనులను రూ.416.62 కోట్లు, జోన్–2బీ పనులను రూ.432.37 కోట్లకు కోట్ చేసిన బీఎస్సార్ సంస్థకే మళ్లీ అప్పగించడం గమనార్హం. అంటే.. అప్పటికీ ఇప్పటికీ అంచనా వ్యయం రూ.123.28 కోట్లు పెంచేసి బీఎస్సార్కే కట్టబెట్టడం వెనుక మర్మమేటన్నది బహిరంగ రహస్యమే.నిబంధనలు తుంగలో తొక్కి.. ఇష్టారాజ్యంగా విద్యుత్తు పనులు..టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. దాని ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధికంగా కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ నిబంధనలను తుంగలో తొక్కింది. రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకు 220 కేవీ ఎక్స్ట్రా హైవోల్టేజీ(ఈహెచ్వీ) అండర్ గ్రౌండ్ లైన్ ఏర్పాటుకు సంబంధించి మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి ఒక ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్కు రూ.1,082.44 కోట్లకు పనులు కట్టబెట్టింది. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఖజానాకు దాదాపు రూ.90 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మేరకు బీఎస్సార్కు లబ్ధి చేకూరింది. -
చంద్రబాబు చెప్పే రాజధాని 30 నుంచి 40 ఏళ్ళైనా పూర్తికాదు
-
ఓటు వేసినందుకు చేతిలో చిప్ప పెట్టారు
-
ఒళ్లు దగ్గర పెట్టుకో బ్రోకర్ రాధాకృష్ణ ఖబడ్డార్
-
రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందంపై.. దిమ్మతిరిగే కౌంటర్
-
సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాల్సిందే బాబు బండారం మొత్తం బయటపెట్టి
-
జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం
-
చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉంది
సాక్షి, అనంతపురం: చంద్రబాబుకి రైతుల కష్టాలు పట్టవని.. రాయలసీమ అంటే మొదటి నుంచి ఆయనకు చులకనేనని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన కోఏసం వైఎస్సార్సీపీ పోరును ఉదృతం చేసింది. ఈ క్రమంలో శుక్రవారం అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం వెనుక పెద్ద కుట్ర ఉంది. తాను చెబితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్ అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు. రాయలసీమ అంటే చంద్రబాబు కు ఎందుకు చులకన?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ వంటిదిమాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయితేనే తెలంగాణ మాదిరి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లో నీరు తీసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 854 అడుగుల్లో నీరు తరలించటం అసాధ్యం. నీటి వాటాలు ఖచ్చితంగా తీసుకొచ్చేందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రాయలసీమ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు తో వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?. సీఎం రేవంత్ కోరితే... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపేస్తారా??. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దొంగ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటున్నారు. దొంగ ప్రాజెక్టు అయితే మీరెందుకు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేశారో పయ్యావుల కేశవ్ చెప్పాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయితేనే సీమ ప్రాజెక్టు లకు నీరు అందుతుంది. చంద్రబాబు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సాగు తాగు నీటి కష్టాలు తీర్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అదే స్ఫూర్తి ని కొనసాగించేందుకే వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన ఘనుడు చంద్రబాబు. హైకోర్టు, ఎయిమ్స్, ఇతర ప్రాజెక్టులను ఇతర ప్రాంతానికి తరలించారు. రాయలసీమ అభివృద్ధి పై చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు చిత్తశుద్ధి ఏది?. సీమ వాసులు టీడీపీ కూటమికే పట్టం కడితే... మీరు చేస్తున్నది ఏమిటి?. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదాకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని చాలా మందికి తెలియదు. టీడీపీ కూటమి కి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందిఈ సమావేశంలో.. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సీఆర్డీఏనే మావిగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మావిగన్ అంటున్నారని, తాము చేస్తున్నది కూడా అదేనని, అదే సీఆర్డీఏ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సైకో ప్రవర్తనలతో రౌడీయిజం బ్యాచ్ వితండవాదాలు చేస్తోందని.. ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడిచేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి వెనుక రాజకీయ పార్టీ లేకపోతే ఇంటినుంచి బయటకు రాగలడా అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వీరు సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. మనమంతా కలిసి కాపాడుకోవాలన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో గురువారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఇప్పటికే విభజనవల్ల, గత పాలకులవల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం. అడవుల్లో ఉండే ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్లిపోతారు. ఇతను కూడా అంతే. ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వచ్చి దుష్ప్రచారం చేసి పారిపోతాడు. సద్విమర్శలు చేస్తే సమాధానం ఇస్తాం. అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్టు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటున్నారు. అది సీఆర్డీఏ రీజియన్. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతిని కదపలేరు. ఇలాంటి తరహా వ్యక్తులను అరెస్టు చేయడానికినాకు నిమిషం పట్టదు. కానీ, చట్టం తన పని తాను చేసుకుంటుంది. నంద్యాలలో పర్యటిస్తుంటే ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్టుచేసి జైల్లో పెట్టారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం మేం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తిచేసి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేస్తాం. ‘22ఏ’ నుంచి 1.37 లక్షల ఎకరాలకు విముక్తి ఇక గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములను 22ఏ జాబితా నుంచి 1.37 లక్షల ఎకరాలను తొలగిస్తున్నాం. మరో లక్ష ఎకరాల సర్వీసు ఇనామ్ భూములకు కూడా 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే, రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ కింద అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు. -
‘మావిగన్’కు మద్దతు పెరుగుతుండడంతో డైవర్షన్ కుట్రలు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) రాజధాని ప్రతిపాదనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ, అన్ని వర్గాలలోనూ మద్దతు పెరుగుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండానే ఒక మహానగరాన్ని అభివృద్ధి చేసుకునే మార్గమున్నప్పుడు ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల ఉపయోగమేమిటన్న చర్చ జరుగుతుండడంతో అధికారపార్టీలో అలజడి మొదలైంది. మూడు నగరాలను కలుపుతూ హైవేలు ఉండడం, పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఉండడం.. తక్కువ ఖర్చుతోనే, తక్కువ కాలంలోనే మావిగన్ను ఓ మహానగరంగా అభివృద్ధి చేసుకునేందుకు కలసివచ్చే అంశాలుగా ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అమరావతి ప్రతికూలాంశాలను, మావిగన్ సానుకూలాంశాలను జనం బేరీజువేసుకుంటున్నారు. ఇది మింగుడుపడని చంద్రబాబు వెంటనే డైవర్షన్ అస్రా్తన్ని బయటకు తీశారు. అచ్చెన్నాయుడుతో ఓ విలేకరుల సమావేశం పెట్టించి అవాకులు, చెవాకులు పలికించారు.. అచ్చెన్నాయుడి అసందర్భ ప్రేలాపనలు బాబుగారి డైవర్షన్ రాజకీయంలో భాగమేనన్న విషయం అందరికీ అర్థమైపోయింది.. రూ. 2 లక్షల కోట్లతో రోడ్లు, డ్రైనేజీలా.. ఇక రాజధాని ఎప్పుడు?అమరావతి కోసం మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి సౌకర్యాల కల్పనకు కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. అంటే లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, తాగునీరు కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి.ఇంకా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? రాష్ట్రానికేమన్నా అంత ఆదాయముందా..? ఇది అదనంగా చేయాల్సిన అప్పే కదా.. అసలు ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అంత సుదీర్ఘ కాలంలో రూ.2 లక్షల కోట్లు వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. అసలు ఇదంతా సాధ్యమయ్యేదేనా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే దేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు భవనాలు కట్టగానే రాజధాని తయారైపోవడం మనం చూడలేదు.ఆర్థిక కార్యకలాపాలకు ఎక్కువ అవకాశం ఉన్న నగరాలే రాజధానులుగా అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు అమరావతిలో సదుపాయాలు లేవు.. ప్రభుత్వం కడతానంటున్న బిల్డింగులూ లేవు.. ఇక ఆర్థిక కార్యకలాపాలెక్కడ? మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే అన్ని సదుపాయాలున్నాయి. పోర్టు, ఎయిర్పోర్టు, హైవేలున్నాయి. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ బిల్డింగులు కట్టుకుంటే సరిపోతుంది.. ఇలాంటి విషయాలన్నీ జనం బేరీజు వేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో ‘మావిగన్’ హోరు..అమరావతి కంటే మావిగన్ బెస్ట్ అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మావిగన్లో ఇప్పటికే పోర్టు ఉంది, సముద్ర తీరం, విమానాశ్రయం ఉన్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, రహదారులు ఇలా అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతిలో ఏముంది? అని వారు నిలదీస్తున్నారు. అమరావతిలో కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, ఇందులో 10 శాతం అంటే కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేస్తే మావిగన్ అత్యుత్తమ రాజధాని అవుతుందని లెక్కిస్తున్నారు. అంతేకాదు అమరావతిలో నిర్మాణాలకు, ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలకు ఖర్చు విషయంలో భారీ వ్యత్యాసం ఉండటం వెనుక అవినీతి దాగుందని ఉదాహరణలతో సహా బయటపెడుతున్నారు.అమరావతిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం భ్రమరావతి చేస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాలలోనే కాదు.. సామాన్య జనంలోనూ వైఎస్ జగన్ ప్రతిపాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అమరావతి కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు అవసరమవుతాయని గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అబ్బే.. అవన్నీ ఫేక్ వీడియోలని మంత్రి లోకేశ్ ట్వీట్ చేయడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో మావిగన్ రేపిన కల్లోలం అర్థమవుతూనే ఉందని విశ్లేషకులంటున్నారు. లోకేశ్ ట్వీట్ను ఖండిస్తూ నాడు చంద్రబాబు ప్రసంగించిన వీడియోలతో పాటు ఎకనమిక్ టైమ్స్ సహా పలు జాతీయ పత్రికలలో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సమాధానాలు లేకే డైవర్షన్ కుట్రలు..తక్కువ ఖర్చుతోనే మావిగన్ను మహానగరంగా అభివృద్ధి చేసుకునే అవకాశమున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి.. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే రాజధానిని అభివృద్ధి చేసుకునే ప్రతిపాదనను పక్కనపెట్టేసి లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతివైపు చంద్రబాబు ఎందుకు పరుగులు తీస్తున్నారని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అమరావతి ప్రాజెక్టు పనుల కోసం అయినవారికి అధిక ధరలకు టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు వంటివన్నీ రోజుకొకటి బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ, టీవీ చర్చలలోనూ ఇది ప్రధానాంశంగా మారడం చంద్రబాబు అండ్కో కు తలనొప్పిగా తయారయ్యింది. దాంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. అచ్చెన్నాయుడును రంగంలోకి దింపి అసందర్భంగా మాట్లాడించడం.. మావిగన్పై ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా బాబూ..?⇒ పోర్టు, ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు ఉన్న మావిగన్ ప్రాంతంలో తక్కువ ఖర్చుతోనే, తక్కువ సమయంలోనే మహానగరాన్ని అభివృద్ధి చేసుకోగలమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్న మాట నిజం కాదా?⇒ అమరావతిలో లక్ష ఎకరాలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కరెంటు సదుపాయాలకు రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తేబోతున్నారు? ఇవి కాకుండా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? ఇవన్నీ ఎంత సమయంలో పూర్తి చేస్తారు? మొత్తం ఎన్ని దశాబ్దాలు పడుతుంది?⇒ ఆ రూ.2 లక్షల కోట్లలో పది శాతం అంటే రూ.20 వేల కోట్లతోనే మావిగన్ ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయవచ్చన్న ప్రతిపాదనపై ఎందుకు మాట్లాడడం లేదు?⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన, బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు?⇒ దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది?⇒ అమరావతి ప్రాంతంలో పనుల కోసం అధిక ధరలకు టెండర్లు పిలవడం, అయినవారికే అప్పగించడం.. ఎలాంటి పనులు చేయకుండానే ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చేయడం, అందులో కమీషన్లు కాజేయడంపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు మాట్లాడడం లేదు?⇒ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఏమేమి కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? -
పిల్ పెండింగ్లో ఉండగానే బాబు కేసును మూసేసిన ఏసీబీ కోర్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) హైకోర్టులో పెండింగ్లో ఉండగానే, ఏసీబీ కోర్టు తొందరపాటు నిర్ణయం తీసుకుందని న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పిల్ పెండింగ్లో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసిందని ఆయన వివరించారు. పైపెచ్చు ఈ కేసు డాక్యుమెంట్లను కోరితే అందుకుసైతం ‘థర్డ్ పార్టీ పేరుతో’ ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్నారు. ఇదే తరహా వ్యాజ్యాలు ఇప్పటికే ఇదే హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. పిటిషనర్ తిలక్కు చంద్రబాబుపై నమోదైన కేసులతో సంబంధం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇదే తరహా అంశాలపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశి్నస్తూ తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్ సరి్టఫైడ్ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని హైకోర్టును ఆయన అభ్యర్థించారు. -
మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!
-
నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్
-
‘తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి?’
తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పట్టాదారు పాస్బుక్లో క్యూ ఆర్ కోడ్ పెట్టింది వైఎస్ జగన్ అని, ల్యాండ్ రీ సర్వేలు మొదలుపెట్టింది కూడా జగనేనని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ ఎన్నికలు ముందు ఈ సర్వేలు వద్దన్నారు. నేనొస్తే రద్దు చేస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే మళ్లీ రీ సర్వే మొదలుపెట్టి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మావిగన్ పేరుతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టింది. అసలు తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం. మావిగన్ అంటే వాటికన్ అంటున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. రెండు లక్షల కోట్ల అప్పులభారం ప్రజలపై వద్దనే జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. మూడు ప్రాంతాలు కలిపితే తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుంది. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అచ్చెన్నాయుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో సంతకాల సేకరణ చేశారు అంటున్నారు. సంతకాల సేకరణతో సంబంధం లేదని అనేక సందర్భాల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, రఘువీరారెడ్డి అనేక సార్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎప్పుడైనా సింగిల్గా పోటీ చేశారా? అంటూ నిలదీశారు. -
నీది ఒక బతుకేనా... ABN రాధాకృష్ణకు కాకాణి మాస్ వార్నింగ్
-
నువ్వెంత నీ బతుకెంత..కేశినేని చిన్నికి దేవినేని అవినాష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
మమ్మల్ని ఎదుర్కొనే దమ్ములేక, మహిళలను అడ్డుపెట్టుకుని తిట్టే చేతకాని....
-
అన్ని రోజులు మనవి కాదు గుర్తుపెట్టుకో.. ABN రాధాకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్
-
అమరావతిలో అసైన్డ్ భూ దోపిడీ.. బాబు అండ్ కో బిగ్ స్కామ్!
-
వర్మకు జాక్పాట్!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ భూ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ బుజ్జగింపుల కోసం ప్రభుత్వ భూమి ఎడాపెడా దోచి పెట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా పర్యాటక హోటళ్ల ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా భూ దోపిడీ సాగిస్తుండటం విస్తుగొలుపుతోంది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి, అంతర్గత కలహాలతో నిత్యం రచ్చ రేపుతున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు తాజాగా ప్రభుత్వ భూమినే కట్టబెట్టేసింది. ఆతిథ్య రంగంలో ఎటువంటి అనుభవం లేని వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్కు కాకినాడలో రూ 240– 340 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేసింది. వాస్తవానికి ఇక్కడ ప్రాజెక్టు విలువ కేవలం రూ.104 కోట్లు మాత్రమే. కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం రాజకీయ ప్రైవేటు సంస్థకు ప్రాజెక్టు ప్రతిపాదిత విలువ కంటే మూడు రెట్ల మేర లబ్ధి కలిగిస్తూ భారీ ఎత్తున భూ పందేరం చేస్తోంది. పెట్టుబడి గోరంత.. లబ్ధి కొండంత వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షిక టర్నోవర్ రూ.85.66 కోట్లు. అయితే ఈ సంస్థ రూ.104 కోట్లతో 2 వేల మంది కూర్చునేందుకు కన్వెన్షన్ హాలుతో కూడిన 5 స్టార్ హోటల్ నిర్మాణానికి దరఖాస్తు చేయడమే తడవుగా కాకినాడలో అత్యంత విలువైన భూమిని చంద్రబాబు సర్కార్ కట్టబెట్టేసింది. కాకినాడ పారిశ్రామిక వాడతో పాటు పోర్టు ఏరియా, బీచ్ ఫ్రంట్, నగర శివార్లలోనూ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వర్మ సంస్థకు కాకినాడ నడి»ొడ్డున ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ (జీపీటీ) కళాశాలకు సమీపంలో హాట్ కేక్ వంటి 3.4 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఎకరం రూ. 70 నుంచి రూ.100 కోట్లు వరకు ఉంటుందని అంచనా. వాస్తవానికి కాకినాడ సిటీలో ఎక్కడా ప్రభుత్వ భూములు ఖాళీగా లేవు. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి. అంతటి డిమాండ్ కలిగిన ప్రాంతంలో ఎప్పుడో పిఠాపురం మహారాజు ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ నేత వర్మకు ధారాదత్తం చేయడం విస్మయపరుస్తోంది. ఆ ప్రాంతంలో మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమి విలువ రూ.240–340 కోట్లు. ఇది ఇప్పటి విలువ. భవిష్యత్తులో మరింత భారీగా పెరగడం ఖాయం. అలాంటిది రూ.104 కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా రూ.240– 340 కోట్లు విలువైన భూమి ఇవ్వడమే కాకుండా, పెట్టుబడిలో 10 శాతం అంటే రూ.10 కోట్లు ప్రభుత్వమే తిరిగి వర్మ సంస్థకు చెల్లించనుంది. అంతేకాదు ఇతరత్రా రాయితీలు కూడా భారీగా ప్రకటించింది. పదేళ్ల పాటు స్టేట్ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మినహాయింపునిచ్చింది. విద్యుత్ చార్జీల్లో సబ్సిడీ, ఐదేళ్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్మెంట్, ఆస్తి పన్ను, నీటిపన్ను, సీవేజ్ పన్నుల్లో రాయితీలతో కలిపి చూస్తే ఈ సంస్థకు ప్రోత్సాహకాల కిందే రూ.40 కోట్ల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. అంటే వర్మ సంస్థకు భూమితో పాటు ప్రోత్సాహకాల పేరిట ప్రభుత్వం రూ.280– 380 కోట్లు లబ్ధి చేకూరుస్తోంది. పైగా వర్మ ప్రాజెక్టుకు లబ్ధి కలిగించేందుకే చీడిలపొర కాలువ మీదుగా రహదారిని సైతం నిర్మిస్తోంది. అంటే వర్మ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. కాగితాలపైనే బ్రాండింగ్ఆతిథ్య రంగంలో వర్మ రియల్ ఎస్టేట్ సంస్థకు ఎటువంటి అనుభవం లేదు. అందుకనే చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. బ్రాండింగ్ పేరుతో మసిపూసి మారేడు కాయ చేస్తోంది. వర్మ సంస్థ ‘తాజ్ బ్రాండింగ్’ పేరిట హోటల్ నిర్మిస్తున్నట్టు నమ్మబలికింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడినప్పుడు ప్రాజెక్టులో ఒకరి వాటా కనీసం 26 శాతంగా ఉండాలి.కానీ, ఇక్కడ పెట్టుబడి అంతా వర్మ సంస్థ చూపిస్తోంది. పైగా వాస్తవ ‘తాజ్’ నుంచి బ్రాండింగ్ వస్తే అది కచ్చితంగా ‘ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సీఎల్)’గా పరిగణిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా అగ్రిమెంట్లు, ఎంఓయూలు ఉంటాయి. ముఖ్యంగా తాజ్ గ్రూప్కు వాటా ఉంటుంది. కానీ, వర్మ ప్రాజెక్టులో కేవలం కాగితంపై మాత్రమే తాజ్ బ్రాండింగ్కు సహకారం అందిస్తున్నట్టు చూపించి, రూ.కోట్లు విలువైన భూమి 99 ఏళ్ల పాటు లీజు పేరుతో కాజేస్తుండడం గమనార్హం. ఇక్కడ ప్రభుత్వం పర్యాటక ల్యాండ్ బ్యాంక్ను అంగట్లో సరుకు మాదిరిగా ఆన్లైన్లో పెట్టి అప్పనంగా దోచిపెడుతోంది. వందల ఎకరాల పర్యాటక భూములను ఎటువంటి టెండర్లు లేకుండా డీపీఆర్ ఆధారంగా కట్టబెడుతోంది. వర్మ సంస్థకు కేటాయించిన భూమికి ఎనిమిది నెలల తర్వాత ఒక్కటే ప్రపోజల్ రావడంతో నెల రోజులు ఎదురు చూసిన తర్వాత ఖరారు చేసినట్టు చెప్పడం ప్రభుత్వ కుట్రను స్పష్టం చేస్తోంది. -
9.25 లక్షల ఎకరాలుఫ్రీహోల్డ్ సక్రమమే
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న పేద రైతులకు భారీ ఊరటనిస్తూ ‘ఫ్రీహోల్డ్’తో సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం ముమ్మాటికీ సక్రమమేనని మరోసారి తేలిపోయింది. వైఎస్ జగన్ హయాంలో ఫ్రీహోల్డ్ అయిన భూముల్లో 9.25 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించాలని తాజాగా టీడీపీ కూటమి సర్కారు నిర్ణయించింది. ఈమేరకు ఫ్రీహోల్డ్ భూములపై చంద్రబాబు సర్కారు యూటర్న్ తీసుకుంది. 21 నెలల తర్వాత తాను చేసింది తప్పని గుర్తించడంతో ఎట్టకేలకు ఇప్పుడు ఆ భూములపై మళ్లీ యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలు విధించి అవే భూములు మళ్లీ ఫ్రీహోల్డ్.. ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ భూములన్నింటినీ గత ప్రభుత్వంలో అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారని సీఎం చంద్రబాబు పదేపదే ఆరోపణలు చేశారు. ఆ సాకుతో ఫ్రీహోల్డ్ అయిన (యాజమాన్య హక్కులు వచ్చిన) భూములపై ఆంక్షలు విధించారు. దీంతో గత ప్రభుత్వంలో చరిత్రాత్మక రీతిలో యాజమాన్య హక్కులు పొందిన 13.59 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల రైతులు తమ భూములపై హక్కులు కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆ భూములన్నీ అక్రమం అని తేల్చడం కోసం చంద్రబాబు సర్కారు అధికారులతో పలుమార్లు వెరిఫికేషన్లు చేయించింది. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి అనేక దఫాలుగా నివేదికలు, వెరిఫికేషన్లపై చర్చలు జరిపారు. చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోనే ఫ్రీహోల్డ్ చేసిన 9.25 లక్షల ఎకరాలను ఇప్పుడు మళ్లీ ఫ్రీహోల్డ్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసిన భూములనే ఇప్పుడు తాను ఫ్రీహోల్డ్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకోవడం విస్మయం కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో చరిత్రాత్మక చట్టం.. పేదలకు కేటాయించి 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం కోసం 2022లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక రీతిలో అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఆ తర్వాత వెంటనే తొలిదశలో 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసి పేద రైతులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించింది. అయితే వైఎస్సార్సీపీ నేతలు భూములు కొట్టేశారని దు్రష్పచారం చేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందారు. అనంతరం 2024లో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారంటూ వాటిని మళ్లీ 22 ఏ జాబితాలో పెట్టారు. ఇప్పుడు తాపీగా అందులో 9.25 లక్షల ఎకరాలను సక్రమమేనంటూ తేల్చి 22 ఏ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించడం గమనార్హం. ఈనాం భూములపైనా అదే తీరు వైఎస్ జగన్ హయాంలో 22 ఏ జాబితా నుంచి తొలగించిన సర్వీస్ ఈనాం భూములనే ఇప్పుడు మళ్లీ 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 2022లో 1.59 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వాటిపై ఆంక్షలు పెట్టి ఇప్పుడు తాను కొత్తగా 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. వీటితోపాటు సర్వీస్ ఈనాం లోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కొత్తగా చట్టం తేవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. » 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులను సమీక్షలో చంద్రబాబు ఆదేశించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీ చేయాలని సూచించారు. నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి కాకపోవడం గమనార్హం. ఇక 2016కు మందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ పథకం కింద పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. తద్వారా 2016 ముందు పట్టా ఉన్న యజమాని నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్ డీడ్గా ఇచ్చేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీసీఎల్ఏ జయలక్షి్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అమరావతిలో ‘అసైన్డ్’ దురాక్రమణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించడం వెనుక పక్కా కుట్ర దాగి ఉంది. అమరావతి ముసుగులో చంద్రబాబు ముఠా బరి తెగించి భూ దోపిడీ సాగించింది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను ‘పచ్చ ముఠా’ పెద్ద ఎత్తున కొల్లగొట్టింది. అందుకోసం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చంద్రబాబు – నారాయణ సూత్రధారులు, పాత్రధారులుగా దేశ చరిత్రలో అతిపెద్ద అసైన్డ్ భూ దోపిడీకి బరి తెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములను గుంజుకున్నారు. ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూదోపిడీకి పాల్పడి పేదల భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించిన టీడీపీ పెద్దలు వారి భూములను 1,336 మంది బినామీల ముసుగులో కొల్లగొట్టారు. అనంతరం తాపీగా అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించడం ద్వారా కుతంత్రానికి పాల్పడినట్లు సీఐడీ గతంలోనే నిర్ధారించింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్ïÙట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. అయితే 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అనంతరం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో ఈ కేసును క్లోజ్ చేసింది. చంద్రబాబు ముఠా అసైన్డ్ భూదోపిడీకి అమరావతి మూగసాక్షిగా నిలుస్తోంది. ఆ భూ బాగోతం ఇదిగో ఇలా ఉంది...! సిట్ విచారణలో ఆధారాలతో సహా బయటపడ్డ వాస్తవాలు.. 1954 తర్వాత అసైన్డ్ భూములు పంపిణీ జరిగినట్లు రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదిక జీవో 1తో భయపెట్టి.. జీవో 41తో భూదోపిడీ విభజన తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు పన్నాగం పన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి వారి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని పేరుతో భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015 జనవరి 1న జీవో నంబరు 1 జారీ చేశారు. ఆ జీవోలో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ప్రచారం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులు ముట్టచెబుతామని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆర్కే హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయించారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్ డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. ఇలా చంద్రబాబు, నారాయణ, లోకేశ్ ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలు చేసి అసైన్డ్ భూములన్నీ తమ బినామీల పరం చేశారు. అనంతరం చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్ భూములకు భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నంబరు 41 జారీ చేశారు. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ జీవో జారీ చేశారు. ఆ చట్టం ప్రకారం సీఆర్డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం–1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీవో 41ను తెచ్చింది. అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్లో చర్చించకుండానే ఏకపక్షంగా జీవో 41ను అడ్డదారిలో జారీ చేసింది. తద్వారా కేబినెట్ ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించింది. 1954 తర్వాత అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు పంపిణీ చేయలేదని టీడీపీ ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక న్యాయస్థానం కళ్లుగప్పి... కేంద్ర ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టాన్ని కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. ఆ చట్టం ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం. అప్పటి కలెక్టర్, సీఆర్డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖల ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు తమ బినామీల ద్వారా కొల్లగొట్టిన భూములకు ప్యాకేజీ ప్రకటించారు. ఆ అసైన్డ్ భూములన్నీ 1954కు ముందు పంపిణీ చేసినవేనని... ఆ తరువాత 2015లోపు అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేశారు. అయితే అమరావతిలోని అసైన్డ్ భూములలో 1954 తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి రావడంతో చంద్రబాబు ముఠా దోపిడీ బయటపడింది. రూ.5,500 కోట్ల అసైన్డ్ భూదోపిడీ అమరావతి పరిధిలో ఏకంగా 1,100 ఎకరాలను మొత్తం 1,336 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రకటించిన లెక్కల ప్రకారం ఆ భూముల విలువ ఏకంగా రూ.5,500కోట్లు. అంటే చంద్రబాబు ముఠా ఎంతటి భారీ భూదోపిడీకి పాల్పడిందన్నది స్పష్టమవుతోంది. ఏ1 చంద్రబాబు, ఏ 2 నారాయణ నిబంధనలకు విరుద్ధంగా జీవో 41ను అప్పటి పురపాలక–సీఆర్డీఏ శాఖ మంత్రి పి.నారాయణ 2016 ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016 మార్చి 22న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పోస్ట్–ఫాక్టో–ర్యాటిఫికేషన్ చేసి మరీ ఆమోదించారు. అంటే అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు జీవో 41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. సీఐడీ సిట్ దర్యాప్తులో ఈ కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఆమేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్డీయే, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అసైన్డ్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీవో 41 జారీ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆ విధంగా జారీ చేసిన జీవో 41తో అమరావతి పరిధిలోని 1,100 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్ట కొట్టింది. చంద్రబాబు ముఠా అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. కాగా 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసు దర్యాప్తును నిలిపివేసింది. సిట్ను రద్దు చేసింది.ప్రధాన నిందితుడైన చంద్రబాబే ఆ కేసులను ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించారు. తద్వారా సీఐడీ అధికారులకు ‘కర్తవ్యబోధ’ చేశారు. అనంతరం సీఐడీ అధికారులు అసైన్డ్ భూముల కేసులో రివైజ్డ్ చార్జ్షీట్ను న్యాయస్థానంలో దాఖలు చేయలేదు. అంతేకాదు ఈ కేసులో సాక్షులుగా ఉన్న అప్పటి సీఆర్డీయే అధికారులు, రెవెన్యూ అధికారులను బెదిరించారు. వారు గతంలో న్యాయస్థానంలో ఇచ్చిన 164 సీఆర్పీసీ వాంగ్మూలాలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. అనంతరం ఆ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’అని ముద్ర వేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ కేసును మూసివేసేందుకు అనుమతించాలని కోరారు. అధికార దుర్వినియోగంతో అసైన్డ్ భూముల దోపిడీ కేసును అడ్డగోలుగా మూసివేసినా సరే ప్రజాన్యాయస్థానంలో చంద్రబాబు దోషిగానే నిలబడ్డారన్నది ముమ్మాటికీ నిజం. అమరావతి సాక్షిగా చంద్రబాబు ముఠా భూదోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా అసైన్డ్భూముల దోపిడీ కేసును అడ్డగోలుగా మూసివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
చంద్రబాబు మద్యం కుంభకోణం కేసు డాక్యుమెంట్లు ఇప్పించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన వేల కోట్ల రూపాయల భారీ నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశ్నిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ హైకోర్టును ఆశ్రయించారు. తనను థర్డ్ పార్టీగా పేర్కొంటూ తాను కోరిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందని తాజా పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్ తాలూకు సర్టిఫైడ్ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరారు. పిటిషన్లో ముఖ్యాంశాలు.. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులు వారికి అనుకూలమైన కొన్ని డిస్టిలరీలకు, అధికారంలో ఉన్న వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా మద్యం విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, మద్యం నాణ్యత కూడా క్షీణించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో కొంతమంది ప్రజా సేవకులు (పబ్లిక్ సర్వెంట్లు) ఉన్నారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి అనేది కేవలం వ్యక్తిగతమైనది కాదు.. అది మొత్తం రాష్ట్రానికి, సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. కాబట్టి, చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను ప్రశ్నించే హక్కు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఉంటుంది. ఆ ప్రకారమే, నాకు కూడా ఈ కేసును ప్రశ్నించే చట్టపరమైన హక్కు ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాను. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఈ పిల్ పెండింగ్లో ఉండగానే, మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్లో తదుపరి విచారణ నిమిత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్లు చాలా అవసరం. పిల్ దాఖలు చేసింది నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరాను. అయితే ఏసీబీ కోర్టు దీనికి నిరాకరించింది. -
‘చంద్రబాబు కుట్రలో భాగమే రాధాకృష్ణ చెత్త పలుకులు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సమర్థించడం చూస్తుంటే ఇది యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్యలు కావని, వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా జరిగిన పన్నాగంగానే చూడాలని చెప్పారు.రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని, ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ సూచించిన మావిగన్పై ప్రజల్లో చర్చ మొదలైంది. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే రాధాకృష్ణతో కుట్రలు చేయించారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పేవరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసే కుట్రవీకెండ్ కామెంట్స్, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ తన ఛానెల్లో వైఎస్సార్సీపీ నాయకుల భార్యల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ తప్పుడు వ్యాఖ్యలను రాధాకృష్ణ తక్షణమే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలియజేసింది. రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిపోయి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఆయన్ను సమర్థిస్తున్నారు.ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ని మావిగన్ పేరుతో డెవలప్ చేసుకోవచ్చని వైఎస్ జగన్ సూచించిన క్షణం నుంచి ప్రజల్లో ఆలోచన మొదలైంది. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ప్రజలు చర్చిస్తున్నారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని కూటమి నాయకులకు అర్థమైపోయింది. దాన్నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే ప్లాన్ ప్రకారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయించారు. రాధాకృష్ణ వ్యాఖ్యలతో ఎవరైనా వైఎస్సార్సీపీ నాయకులు రియాక్ట్ అయితే వారిపై అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసి మావిగన్ అనే పేరెత్తకుండా చేయాలనే పథకం ప్రకారం కుట్ర చేశారు.అవే మాటలను మీకు అన్వయించుకోండిప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నిరసనను దాడిగా చిత్రీకరించడం దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు లేదా? వైఎస్ జగన్ చెబితే వైఎస్సార్సీపీ నాయకులు వారి భార్యలను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తారని చెప్పడం సంపాదకీయంలో భాగమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాడి అని ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం లేని వ్యక్తి డిబేట్లో మాట్లాడితే సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేశారు. మీ నాయకుల ఇళ్లలో ఉన్న తల్లి చెల్లెళ్ల గురించి మాట్లాడితే ఇలాగే సమర్థిస్తారా? మీ హెరిటేజ్ షేర్లలో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్కచెల్లెమ్మలకు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్కసారైనా చెప్పారా?ఏరోజైనా మీ తోబుట్టువులను పండక్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా? ఏ హక్కుతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు? పత్రికా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిత్వ హననం చేస్తున్న చంద్రబాబుని ఏరకంగా సమర్థిస్తారు? జగనన్న కళ్లలో ఆనందం కోసం వైయస్సార్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేశారని చెబుతున్న నారా లోకేష్, ఎవరి ఆనందం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడాడు? విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు స్థలం కేటాయించినందుకా? విజయవాడలో రాధాకృష్ణ పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చినందుకా?ఇదేనా భువనేశ్వరి.. లోకేష్కి నేర్పించిన సంస్కారం? మంత్రి స్థానంలో ఉండి బాధ్యత మరిచి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూరమో, సాక్షి నుంచి ఆంధ్రజ్యోతికి అంతే దూరం అని మాట్లాడుతున్నాడు. మీ పార్టీలో మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలాగే అంటే ఊరుకుంటారా? ఏబీఎన్ రాధాకృష్ణ మాటలు విశ్లేషణలు అని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవుల కోసం మనసు చంపుకుని మాట్లాడటం అవసరమా అని ఆలోచించాలి. ఇదే ఏబీఎన్ పేపర్, టీవీలో తన తల్లిని దూషించినందుకు వాటిని బహిష్కరించిన విషయం అప్పుడే మరిచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు.హోంమంత్రి అనిత మహిళ అయ్యుండి రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించకపోవడం సిగ్గుచేటు. ఆమెకు పదవి ఇచ్చింది జగన్ని తిట్టడం కోసమా? టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుంటున్నారు. మోదీని తిట్టినప్పుడు సై అన్నారు. మోదీని పొగిడినప్పుడూ జై అన్నారు. రాధాకృష్ణ మాట్లాడిన ఇవే మాటలు మీకు అన్వయించుకుంటారా చెప్పండి? ఆయన యూటర్న్లకు వంతపాడిన టీడీపీ నాయకులను కూడా ఇలాగే అనొచ్చా? అనిత హోంమంత్రిగా ఉండటం మహిళల దౌర్భాగ్యం. రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా మహిళా లోకానికే కళంకం తెచ్చారు.పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ, రాధాకృష్ణ పీడఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీఎన్ రాధాకృష్ణ మీద మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఇంతదారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు వైఎస్సార్సీపీ నిరసన తెలుపుతూనే ఉంటుంది. ఇవి యాధృచ్చికంగా వచ్చి న వ్యాఖ్యలు కావు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల సమర్థింపుతో కావాలని చేసిన కుట్రేనని తేలిపోయింది.వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలో భాగంగానే పథకం ప్రకారం ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల దోపిడీని వైఎస్ జగన్ ఆధారాలతో సహా వెలికితీయడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ ప్రస్తావించిన మావిగన్ మోడల్తో చంద్రబాబు వేల కోట్ల అవినీతి ఆశలు కుప్పకూలిపోయాయి. వాటి నుంచి ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేయడం కోసం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలు చేస్తున్నారు. పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ లాంటిది. జర్నలిస్టుల సమాజంలో రాధాకృష్ణ పీడలాంటి వాడు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు -
‘లులు’కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: విజయవాడలో లూలు మాల్కు భూముల కేటాయింపుపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలో లూలు మాల్కు భూమి కేటాయింపు సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. లులు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.కాగా, విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకునేందుకు 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.అయితే, లులుకి భూములు కట్టబెట్టడంపై ఆర్టీసి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. గతంలో లులు అద్బుతం అంటూ చంద్రబాబు పొగడ్తలు గుప్పించారు. హైకోర్టులో నేడు లులు మాల్కి కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
చేసిందంతా వైఎస్సారే.. హంద్రీ-నీవాపై 'చంద్ర' నాటకం
-
‘చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ చొరవతోనే రాయలసీమకు సాగునీరు అందిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటూ దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లు వచ్చాయంటే దానికి కారణం వైఎస్సారేనని శ్రీకాంత్రెడ్డి అన్నారు.‘‘హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా?. రాయలసీమకు మేలు చేయకపోగా.. నష్టం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నింట్లోను రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాంను 100 టీఎంసీలకు పెంచి రాయలసీమ గొంతు కొస్తున్నారు. అయినా చంద్రబాబు ఆల్మట్టి ఎత్తుపై స్పందించడం లేదు’’ అంటూ శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్ కుటుంబం వలనే అనంతపురం జిల్లా హార్టికల్చర్ అభివృద్ధి జరిగింది. హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టును తెచ్చింది వైఎస్సారే. చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు. కరువు ప్రాంతంలో చెరువులలో నీళ్లు ఉన్నాయంటే వైఎస్సారే కారణం. వైఎస్సార్, జగన్ల వలనే రాయలసీమకు మేలు జరిగింది. కానీ అన్నీ తానే చేశానంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారు. చంద్రబాబు వలన చివరికి వెంకటేశ్వరస్వామికి కూడా నష్టం జరిగింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అయినా ఆయన నోరెత్తటం లేదు..రాయలసీమ లిఫ్టును సైతం నిలిపేసి చంద్రబాబు తన విద్వేషాన్ని బయట పెట్టారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు. తన బినామీలకు దోచి పెడుతున్నారు. అమరావతిని అవినీతికి రాజధానిని చేశారు. కొత్త సిటీల నిర్మాణం సాధ్యమయ్యే పనేనా?. జనం లేని చోట రాజధాని కట్టి ఏం సాధిస్తారు?. నయా రాయపూర్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఎన్ని వేల కోట్ల ఖర్చు చేసినా అభివృద్ధి లేదు. అలాంటిది ఇక అమరావతిలో ఎన్ని లక్షల కోట్లు పోస్తారు?. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు జాకీలు ఎత్తు తున్నారు..లక్షల కోట్లు అమరావతిలో పెడితే మా రాయలసీమ పరిస్థితి ఏంటి?. నడుస్తున్న ప్రాజెక్టులను కూడా ఆపేశారు. మా దగ్గర వసూలు చేసే పన్ను అమరావతిలో ఖర్చు చేస్తే మరి మా పరిస్థితి ఏంటి?. భూమి, ఇసుక ఫ్రీగా ఇస్తున్నా కూడా రూ.16 వేల వరకు అడుగుకు ఖర్చు పెడుతుంటే అడగవద్దా?. నీళ్లు తోడటానికి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన పనిలేదు. ఒక ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులోకి దూరి హల్చల్ చేస్తే కనీసం కేసు కూడా పెట్టలేదు. ఇదేనా పరిపాలన?’’ అంటూ శ్రీకాంత్రెడ్డి నిలదీశారు. -
నా పాదయాత్రలో బాబుకి రోజుకో సినిమా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే కాన్సెప్ట్తోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన భేటీలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్ జగన్ అన్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. మన పాలనలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో డీబీటీ(సంక్షేమం పేరిట నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ) ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్లు చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
మావిగన్పై మరోసారి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ భేటీలో మావిగన్ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్ ఆప్షన్గా ప్లాన్ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్ను మావిగన్(MAVIGUN)ను సూచించాం. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పైవ్స్టార్ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్ జగన్ అన్నారు. -
బూతు కిట్టూ నీతిలేని రాతలు.. చంద్రబాబు చెబితే దేనికైనా
-
చంద్రబాబు పంతం.. 5 కోట్ల ఆంధ్రులకు శాపం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, కానీ చంద్రబాబు ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వ ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ కూడా అభివృద్ధి కేంద్రీకృతం చేయవద్దని స్పష్టంగా చెప్పిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకృతం కావడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోడానికి కారణమైందని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలం కాదని స్పష్టంగా చెప్పిందన్నారు. ఆనాడు చంద్రబాబు ఆ కమిటీకి కనీస వసతులు కూడా కల్పించకుండా హింసించి పంపారని చెప్పారు. నేడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన రాజకీయ అవసరాల కోసం అమరావతి తీర్మానం చేసి, పార్లమెంటులో ఆమోదింపజేసుకుని కేంద్రంతో నోటిఫై చేయించారని, ఇది భవిష్యత్లో అనేక సమస్యలకు దారితీస్తుందన్నారు. అమరావతిలో కనీస మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తికావడానికి 50 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. అంతవరకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూలీలుగా మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికేంద్రీకరణను వైఎస్ జగన్ ప్రతిపాదించారని చెప్పారు. 80 ఏళ్లయినా ఇంకా వలసలేనా? ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొందని గుర్తుచేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. 80 ఏళ్లయినా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారన్నారు. ఇక్కడ 60 ఏళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కూడా కేటాయించరా?అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేసింది నాటి సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. ఒడిశా సీఎంను కూడా కలిసి చర్చించారని చెప్పారు. చంద్రబాబు ఏనాడైనా ఒడిశా వెళ్లి సమస్యలను ప్రస్తావించారా.. అని ప్రశ్నించారు. -
ధర లేని 'ఉల్లి'.. రైతు 'తల్లడిల్లి'!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఉల్లి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మార్కెట్లో ధర లేక, కొనే నాథుడు లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రబీ పంట చేతికొచ్చే సమయంలో దిగజారిన ధరలతో గగ్గోలు పెడుతున్నారు. వందలాది క్వింటాళ్ల ఉల్లిని రోడ్ల పక్కనే కుప్పలుగా పోసి కొనే వారి కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి దాపురించింది. క్వింటా కనీసం రూ.500 కూడా పలకకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.నాణ్యత బాగున్నా కొనే వారేరీ?రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు.అత్యధికంగా కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగవుతుండగా, కర్నూలు జిల్లా ఉల్లికి జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. కర్నూలు తర్వాత మైదుకూరు ప్రాంతంలో సాగయ్యే కేపీ ఉల్లికీ డిమాండ్ ఎక్కువే. 3 నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. ఖరీఫ్లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకునే సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరిలో వేసిన పంట గత నెల నుంచి కోతలు మొదలయ్యాయి. నాణ్యతకు ఢోకా లేకున్నప్పటికీ మార్కెట్లో ధర లేక, కొనేవారూ లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.క్వింటా ధర రూ.300 నుంచి రూ.500లోపే..ప్రస్తుతం కర్నూలు మార్కెట్కు రోజుకు 2వేల క్వింటాళ్ల చొప్పున వస్తోంది. కేవలం 5 శాతానికి మాత్రమే క్వింటా రూ.800 పలుకుతుండగా, 95 శాతానికి పైగా పంటకు క్వింటా రూ.300 నుంచి రూ.500కు మించి ధర లభించలేదు. సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, పంట పూర్తిగా మార్కెట్కు వచ్చే సమయానికి మరింత దయనీయంగా మారుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తాము తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉల్లి రైతుకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వంఉల్లి రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లూ అండగా నిలిచింది. 2019–24 మధ్య క్వింటా రూ.3,500 నుంచి రూ.4వేల మధ్య ధర లభించింది. ధర తగ్గిన సందర్భాల్లోనూ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా జగన్ ప్రభుత్వం కృషి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశారు. మరో వైపు ధరలు పెరిగిన సందర్భాల్లోనూ షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లి కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా చేశారు. గతేడాది క్వింటా రూ.1,200 తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరికి రూ.800కి కొనుగోలు చేస్తామని చెప్పి మూడు రోజులు తిరక్కుండానే ‘అబ్బే అలాంటి ఆలోచనే ప్రభుత్వం దగ్గర లేదు’ అంటూ మాట మార్చి ఉల్లి రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది.ఈయన పేరు గంగరాజు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తికి చెందిన ఈ రైతు ఎకరాలో ఉల్లి సాగు చేశారు. రూ.80వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట అమ్ముకుందామని కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. వ్యాపారులు లేక ఇలా రోడ్ల పక్కన ఉల్లిని రాసులుగా పోసి ఎదురు చూస్తున్నాడు. కొనండి బాబూ అని కాళ్లావేళ్లా పడుతుంటే క్వింటా రూ.400కైతే తీసుకుంటామంటున్నారు. ఈ ధరకు అమ్ముకుంటే కనీసం కూలీ ఖర్చులు కూడా రావని, ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ రైతు కన్నీరుమున్నీరవుతున్నారు.కోత ఖర్చులు కూడా రావుఐదెకరాల్లో ఉల్లిసాగు చేశా. ఎకరాకు రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టాను ఎకరాకు 10 టన్నుల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చే సమయానికి ధర లేకుండా పోయింది. ఎంతోకొంతకు తెగనమ్ముకుందామన్నా కొనే నాథుడు కనిపించడం లేదు. బ్రతిమిలాడుతుంటే క్వింటా రూ.500 ఇస్తామంటున్నారు. కనీసం కోత ఖర్చులు కూడా రావు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. – ఎం.షఫీ, కర్నూలు జిల్లాచంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు1.50 ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. దాదాపు రూ.1.20లక్షల వరకు ఖర్చయ్యింది. ఎకరాకు 15 టన్నుల దిగుబడి ఉంది. క్వింటా రూ.400కి మించి ధర ఇవ్వడం లేదు. పెట్టుబడి ఖర్చులు దక్కని పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం ఉల్లి రైతులను పట్టించుకోవడం లేదు. – జీ మిన్నల్ల, పాలకుర్తి, కర్నూలు జిల్లా -
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె తాత్కాలిక విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు బకాయిలు చెల్లించాలని ఏడు రోజులుగా చేస్తున్న సమ్మెను మంగళవారం తాత్కాలికంగా విరమించాయి. ప్రభుత్వం పది రోజుల్లో రూ.1,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమ్మెను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం రూ.3,000 కోట్ల బకాయిలు పెట్టడంతో ఈ నెల 1 నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపివేసి సమ్మె చేస్తున్నాయి. సోమవారం రెండో దఫా ప్రభుత్వం ఆశా ప్రతినిధులతో చర్చలు జరిపింది. మొత్తం బకాయిల్లో రూ.1,000 కోట్లను పది రోజుల్లో, జూలై అనంతరం మరో రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ చెప్పారు. ప్రతి నెలా రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల మేర బిల్లులు చెల్లించడంతోపాటు నూతన బీమా విధానం రూపకల్పనలో నెట్వర్క్ ఆస్పత్రులను భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. అందువల్ల 10 రోజులు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. నమ్మకం లేక...ప్రభుత్వం పది రోజుల్లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు మాత్రం పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు గద్దెనెక్కాక గతంలో రెండుసార్లు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం సమ్మె చేశాయి. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సమ్మె చేసిన సమయంలో డిసెంబర్కి బకాయిలన్నీ చెల్లించేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ సమ్మెను తాత్కాలికంగానే నిలుపుదల చేస్తున్నామని ఆశా స్పష్టం చేసింది. పది రోజుల్లోగా నిధులు విడుదల చేయకపోతే తిరిగి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. -
అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?
-
చెప్పుతీసి కొడతా... ABN రాధా కృష్ణపై రెచ్చిపోయిన తిరుపతి YSRCP మహిళా నేత
-
నిధులు అన్ని అమరావతిలో పెడితే మా ప్రాంతాల పరిస్థితేంటి..
-
కూటమి ప్రభుత్వం వేస్ట్.. రాజీనామాకు రెడీ
-
సిగ్గుపడు రాథాకృష్ణ.. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి..
-
నీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు... గుర్తుపెట్టుకో.. YSRCP మహిళలు వార్నింగ్
-
ABN బ్రోకర్ కృష్ణ... నీ ఆఫీసుని తగలేస్తాం జాగ్రత్త రెచ్చిపోయిన రోజా
-
చంద్రబాబు ఇప్పుడే మొదలైంది.. బాబుకు రోజా ఊర మాస్ వార్నింగ్
-
రాధాకృష్ణ.. పిచ్చి కూతలు, రాతలు రాస్తే తగలబెట్టేస్తాం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట గౌడ, సునీల్ కుమార్ నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టారు. దీంతో, అక్కడున్న పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతో బ్రతుకు రాధాకృష్ణకు రాష్ట్రంలో మహిళలు అంతా ఎదురుతిరుగుతున్నారు. రాధాకృష్ణకు కూతురు లేదా?. మా నాయకులు, మహిళలు గురించి తప్పుడు కూతలు కాస్తున్నారు నీకు అర్హత ఉందా? డొక్కు సైకిల్పై వచ్చి వేల కోట్లకు ఎదిగినావు అంటే ఏవిధంగా ఎదిగావో అందరికీ తెలుసు. చంద్రబాబుకు బ్రోకర్గా పనులు చేశావు. కొత్త పలుకు అంటూ కొవ్వెక్కి పనులు చేస్తున్నాడు, కొవ్వు కరిగిస్తాం కొవ్వు తగ్గిస్తాం.వైఎస్సార్సీపీ నాయకుల కుటుంబసభ్యుల్ని అంటే చూస్తూ ఊరుకుంటామా?. నీ అవినీతి పత్రికలు తగలబెడతాం. చంద్రబాబు, పవన్, మంత్రులను హెచ్చరిస్తున్నాం. మీరు తిట్టిస్తే.. మాకు తిట్టడం చేత కాక కాదు.. మాకు సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిడితే రోడ్లపై తిరగలేక సిగ్గుతో తల దించుకుంటారు. మహిళల గురించి తప్పుగా రాస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగలబెట్టేస్తాం’ అని హెచ్చరించారు. ఇక, అంతకుముందు.. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మాట్లాడుతూ..‘రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2వేల కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబు 2లక్షల కోట్లు అమరావతి ఎలా ఖర్చు చేస్తారు?. ఈ రెండేళ్లలో 8వేల కోట్లు అమరావతికి ఖర్చు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు చంద్రబాబు. రాయలసీమ ద్రోహి ఈ ప్రాంతంలో పుట్టడం ఇక్కడి ప్రజలు దురదృష్టం.రాయలసీమ పథకం నిలిపి వేయడం అంటేఈ ప్రాంత ప్రజలు గొంతు కోయడమే అవుతుంది. రాయలసీమ పథకం ఎంత ముఖ్యమన్నది ప్రజలకు తెలియజేయాలి. 87 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పాదయాత్ర ద్వారా, మహా ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి’ అని కామెంట్స్ చేశారు. -
రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి: ఏపీ మద్యం అక్రమ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం అక్రమ కేసులో రాజ్కేసిరెడ్డితో పాటుగా రోనక్ కుమార్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు ఇచ్చింది. -
రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది.జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇతర శాఖల్లోనూ పనులు నడవడం లేదు. ప్రజలకు మేలు చేయలేనప్పుడు ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో నాకేం పదవులు అవసరం లేదు.. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కూటమి పాలనలో కమ్మని ప్రభుత్వం అన్నందుకు ఆదినారాయణరెడ్డిపై కూటమి నేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరో మారు బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నీకు సిగ్గుందా... రాధాకృష్ణపై మహిళా నాయకురాలు విరుచుకుపడ్డారు
-
ఆంధ్రా బ్రోకర్.. నీ ABN ముందు ఉన్నాం మగాడివైతే బయటకు రా
-
క్షమాపణ చెప్తావా.. గంగలో దూకుతావా. ABN రాధాకృష్ణపై రెచ్చిపోయిన అంబటి
-
బాబులో మావిగన్ టెన్షన్..
-
రేయ్ రాధాకృష్ణ...! నాకు స్వీట్ గా చెప్పడం రాదు... కడప యాసలో చెప్తున్నా....
-
LIVE : ABN ఆఫీస్ వద్ద టెన్షన్.. టెన్షన్..
-
శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
-
మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?
-
RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం
-
ఖజానాపై ‘ప్రత్యేక విమానం’ మోత!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని, ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని, సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఒకవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుతున్న విలాసవంతమైన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. చంద్రబాబు ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు, ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల టూర్లకు, చివరికి ప్రతి శనివారం హైదరాబాద్లోని సొంత ఇంటికి వెళ్లొచ్చేందుకు కూడా ప్రత్యేక హెలికాప్టర్, విమానాలనే వినియోగిస్తున్నారు.దీంతో రెండేళ్లలోనే సీఎం చంద్రబాబు (వీవీఐపీ) ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.109.04 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.54.41 కోట్లు, 2025–26 ఆరి్థక సంవత్సరంలో రూ.54.63 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసింది. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరంలోనూ చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు అద్దె చెల్లింపు కోసం బడ్జెట్లో రూ.54.63 కోట్లను కేటాయించారు. సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లాలన్నా తాడేపల్లిలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక వారాంతంలో చంద్రబాబు పక్క రాష్ట్ర హైదరాబాద్లో ఉన్న తన సొంత ఇంటికి సైతం ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. దీంతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల భారం ప్రభుత్వ ఖజానాపై భారీగా పడుతోంది.పవన్, లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినా పవన్కళ్యాణ్, లోకేశ్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల ఖర్చు గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
సర్కారు నమ్మక ద్రోహం!
సాక్షి, అమరావతి: ఐదో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. వారిని మూడో గ్రేడ్ కిందకు మార్చి, బేసిక్ వేతనాన్ని పెంచుతామని జీవో ఇచ్చి, రూపాయి కూడా పెంచకుండా మోసం చేసింది. గ్రామ పంచాయతీల్లో రీ కేటగిరైజేషన్ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శుల్లో అట్టడుగు ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280కి పెంచుతామని గతేడాది నవంబర్ 4న జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. తీరా దానిని రూ.25,220కి కుదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు నెలల క్రితం ఇచ్చిన జీవో అమలు జరిగితే రాష్ట్రంలో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శుల వేతనాలు పెరిగేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలను వమ్ము చేస్తూ వేతనాలకు కోత పెట్టేసింది. 2019–2020 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకాల సమయంలో గ్రేడ్–5 సచివాలయ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందిన వారు ఈ ప్రక్రియలో నష్టపోతున్నారు. సంస్కరణల పేరిట జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా కసరత్తు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4, గ్రేడ్–5 కేటగిరీలుగా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 పంచాయతీలుగా వర్గీకరించాలని గత ఏడాది అక్టోబర్లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేవలం ఐదు శాతం గ్రామ పంచాయతీలను అర్బన్ పంచాయతీలుగా పేర్కొంటూ, వాటి నిర్వహణ బాధ్యతలను డిప్యూటీ ఎంపీడీవోలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐదు కేటగిరీల్లో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులను కేవలం మూడు గ్రేడ్లలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చివరి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ణయించి, గతంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆ బేసిక్ వేతనాన్ని రూ.25,220కు తగ్గించేసింది. అభినందన సభ సాక్షిగా మోసం గ్రామ పంచాయతీలను రీ కేటగిరైజేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులందరికీ పదోన్నతులు వస్తాయని ఆ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 4న ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పదోన్నతుల అభినందన సభ కూడా నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–5 నుంచి గ్రేడ్–3కి మారినప్పటికీ, వారి జీతాల్లో రూపాయి కూడా పెరగదని స్పష్టమైంది. ప్రభుత్వం తమను మోసం చేసిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.మొదట ప్రకటించిన పేస్కేల్ ఇవ్వాల్సిందే ప్రభుత్వమిచ్చిన జీవో 91లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల అట్టడుగు కేటగిరి ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ధారించి, ఇప్పుడు దానిని రూ.25,220కు తగ్గించడం అత్యంత అన్యాయమని నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు బగ్గా జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్పు వల్ల గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా, మరింత భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. పే స్కేల్ తగ్గింపు ఉద్యోగుల మనోబలాన్ని దెబ్బతీసే నిర్ణయం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ సవరణను ఉపసంహరించుకొని, మొదట ప్రకటించిన విధంగా రూ.28,280 పే స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
రాష్ట్రానికి చీడలా రాధాకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: ఏబీఎన్ రాధాకృష్ణ, ఆయన పత్రిక, టీవీ చానల్ రాష్ట్రానికి పట్టిన చీడలా తయారయ్యాయని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన ‘మావిగన్’ అభివృద్ధి మోడల్పై ప్రజల్లో మంచి స్పందన రావడంతో తట్టుకోలేక తమ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను దూషిస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మావిగన్’తో తమ అవినీతి ఆశలు కూలిపోతాయనే భయంతో వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వెంకటరామయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. అవినీతిపై ఎక్కుపెట్టిన గన్: కన్నబాబు ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధాని కారిడార్గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా మారుతుందని వైఎస్ జగన్ ప్లాన్–బీ సూచించగానే అధికార పార్టీ ఉలిక్కిపడింది. వారం రోజులుగా పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టి ట్రోల్ చేయడంలో నిమగ్నమైంది. ‘మావిగన్’ అనేది అమరావతిలో రూ.వేల కోట్ల అవినీతిపై ఎక్కుపెట్టిన గన్లా కనిపించింది. రూ.20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని సూచిస్తుంటే కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? అమరావతిని పూర్తి చేయడానికి తరాలు పడుతుందని మీరే చెబుతున్నప్పుడు త్వరితగతిన పూర్తయ్యే ‘మావిగన్’ ఆలోచన మంచిదే కదా! ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు కడుపుమంటకి పరాకాష్ట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందంటూనే అమరావతిలో రోడ్లు, మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? రాజ్యసభలో రేణుకా చౌదరి వ్యాఖ్యలను కూటమి నాయకులు ఎందుకు ఖండించలేదు? అమరావతి గేటెడ్ కమ్యూనిటీలా మారిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. టెండర్లు, డిజైన్లు, అడ్వాన్సుల పేరుతో రూ.వేల కోట్లు దోపిడీ జరుగుతోంది. ఈ కారణాల వల్లే సంబంధిత బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. అవినీతికే చట్టబద్ధత తెచ్చారు: గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబు ‘మావిగన్’ పేరుకు వ్యతిరేకమా? లేక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకమా? సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ సూచించిన మావిగన్ మోడల్లో పోర్టు, ఎయిర్పోర్టు, నేషనల్ హైవేలు.. అన్నీ ఉన్నాయి. అమరావతిలో ఇవన్నీ రూ.వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తెచి్చన చట్టబద్ధత రాజధానికి కాదు.. అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతికి. -
‘మావిగన్’ను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు వ్యూహం
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై సర్వత్రా ఆమోదం వ్యక్తమవుతోందని, ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లతో ఆమోదయోగ్యం కాని, ఆచరణకు నోచుకోని అమరావతిని నిర్మించాలనుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కేవలం రూ.20 వేల కోట్లతో గ్రోత్ ఇంజిన్గా దూసుకెళుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కారిడార్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. మావిగన్ ప్రతిపాదనను ప్రకటించిన రోజే చంద్రబాబులో వణుకు పుట్టిందని చెప్పారు. మావిగన్ ప్రతిపాదనను ప్రజలు ఆమోదిస్తుండటంతో సోషల్ మీడియాలో రూ.కోట్లు ఖర్చు చేసి విపరీతమైన పోస్టులు పెట్టారని, అపహాస్యం చేయడంతోపాటు బూతులు కూడా మాట్లాడారన్నారు.నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ఎక్కువ రోజులు నిలువలేకపోయిందన్నారు. తర్వాత చంద్రబాబు ఇదే అంశంపై మంత్రులతో ప్రెస్మీట్ పెట్టించారన్నారు. అయినా సంతృప్తి చెందని చంద్రబాబు పచ్చ మీడియాను రంగంలో దింపాడన్నారు. ప్రభుత్వాన్ని జాకీలతో పైకిలేపేందుకు జర్నలిజం ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నాడన్నారు. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలవి ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్పాకరంగా, బాధాకరంగా ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. ఇంతకంటే నీచం మరొకటి ఉండదన్నారు. కండకావరంతో కొవ్వెక్కి రాధాకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడినా.. తమ నాయకుడు వైఎస్ జగన్ మాత్రం శాంతియుతమైన పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయాలని తమకు చెప్పారన్నారు. రాధాకృష్ణ నాలుక కోసి.. ఉప్పూకారంతో ఊరగాయ పెడతారు స్త్రీలను దూషిస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణను ఏ మహిళ అయినా మెట్టుతో కొట్టదా అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ఆడబిడ్డలైతే రాధాకృష్ణ ఇంటికెళ్లి నాలుక కోసి ఉప్పుకారం వేసి ఊరగాయ పెడతారన్నారు. చంద్రబాబు ఎంతటి నీతిబాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో ప్రజలు గమనించాలని కోరారు. కేవలం వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా అన్నారు. ‘రాధాకృష్ణా.. నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా. నీలా మేం మాట్లాడితే సరిపోతుందా. ఇవే మాటలు నీ భార్య దగ్గర మాట్లాడితే నీ భార్య కూడా నిన్ను చెప్పుతో కొడుతుంది. మేం నీలా మాట్లాడలేం. జర్నలిజం ముసుగులో ఇలాంటి అక్షర వ్యభిచారం చేయొద్దు అని రాధాకృష్ణకు అతడి ఇంట్లోని మహిళలు గడ్డిపెట్టాలి’ అని రాచమల్లు కోరారు. -
జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్
-
రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు
-
ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాక్
సాక్షి,విజయవాడ: ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాకిచ్చింది. జీవో నెం 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. గతంలో పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్ రూ.28280 ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25220కి తగ్గించింది. పేస్కేల్ తగ్గిస్తూ జీవో నెంబర్.91ను సవరణ చేసింది. అయితే కూటమి సర్కార్ తీరుపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోరాటం తప్పదని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. -
మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకు వణుకు: కన్నబాబు
సాక్షి,విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకి వెన్నులో వణుకుపుడుతోందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ఈ రోజు( సోమవారం) వైజాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేయెుచ్చనే ఆలోచనతో చంద్రబాబు భయపడుతున్నారన్నారు. జగన్ మాట ఎంత పవర్ ఫుల్ అనేది ఇప్పుడు వారికి అర్ధమవుతుంది. మావిగన్ ప్రతిపాదన అమరావతి అవినీతిపై ఎక్కు పెట్టిన గన్లా వారికి కనిపించింది. రూ.20 వేల కోట్ల ఖర్చు చేస్తే మచిలీపట్నం విజయవాడ గుంటూరు అభివృద్ధి చెందుతుంది. ఇదివరకే అమరావతి కోసం చంద్రబాబు రూ. ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశారు. అమరావతి కోసం చంద్రబాబు రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారని ఏబీఎన్ రాధాకృష్ణ రాస్తున్నారు.ఓ వైపు జీతాలకు డబ్బులు లేవని ఆర్ధిక మంత్రి అంటూనే మరోవైపు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అమరావతిని, కమ్మరావతి పిలుస్తున్నారు. అమరావతి అందరి రాజధాని అయితే కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి మాటలను కూటమి నేతలు ఎందుకు ఖండించడం లేదు. ఏబీఎన్ రాధా కృష్ణ చెత్త పలుకు రాసారని దిగజారి రాతలు రాస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కడుపు మంటతోనే తప్పుడు రాతలు రాస్తున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తాడనే పదమే కూటమి ప్రభుత్వానికి ఉరుకులు పెట్టిస్తోందని వ్యాఖ్యానించారు. -
పిచ్చి మొక్కలు.. వర్ష్పాలు వస్తే నీళ్లు తోడటం... ఇదే రాజధాని అభివృద్ది...
-
‘లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చా?’
తాడేపల్లి : అమరావతి నిర్మాణం వెనుక ఉన్నది భారీ దోపిడేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అంటే ఏంటని ప్రశ్నించారు. ఇది విజన్ ఉన్న వారు చేసే పనేనా అంటూ నిలదీశారు. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి ప్రాజెక్టు అని ధ్వజమెత్తారు. ‘అడ్డూ అదుపులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ అమరావతి. రాష్ట్రంలో ఎక్కడైనా అడుగు నిర్మాణానికి రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ అమరావతిలో రూ.12 వేల నుండి రూ. 14 వేలకు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాల పేరున అడుగడుగునా అవినీతే. అందుకే ఏ టెండర్లు, జీవోలు బయటకు రాకుండా దాచి పెడుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోవడానికి కారణం స్కాంలే. అసలు నిర్మాణాలకు అదనంగా లైటింగ్, పంబ్లింగ్, కరెంటు పేరుతో మళ్ళీ దోపిడీనా?, భారీగా జరుగుతున్న దోపిడీని ప్రశ్నించిన వారిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి చెట్లు తొలగించటానికి కూడా వందల కోట్లు ఖర్చు చేస్తారా?, జనసంచారం లేని చోట రాజధాని కడతారా?, జనాభా ఉన్న చోట రాజధాని కట్టమని జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. కానీ వేల కోట్లు దోచుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారు. మావిగన్ పేరు నచ్చకపోతే పేరు మార్చుకోమని కూడా జగన్ చెప్పారు. కానీ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ లెక్కన చంద్రబాబు నాయుడిని చంబునాయుడు అనవచ్చా?, పేదవాడు రాజధానిలో ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసు వేసిన ఘనత చంబునాయుడిది. రాజధానిలోకి ఎంటర్ కావాలంటే టిక్కెట్ కొనేలా చంబునాయుడు వ్యవహార శైలి ఉంది. అమరావతిలో దోచుకున్నది విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతోంది’ అని విమర్శించారు. -
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టలేని నువ్వు అమరావతి ఎలా కడతావ్..
-
ఈవీఎం ట్యాంపరింగ్.. 50 లక్షల ఓట్లు..
-
‘అందుకే వైఎస్ జగన్ మావిగన్ పేరు సూచించారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు.. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఏడేళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో విజయవాడలో అభివృద్ది పరుగులు పెట్టింది. కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. వెస్ట్ బైపాస్లో 10 శాతం పనులను ఎందుకు ఆపుతున్నారు. పోర్టు, రైల్వేస్టేషన్ కలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ సూచించిన మావిగన్ ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. విజయవాడ అంటే చంద్రబాబుకు కక్ష. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారు. అంతకుముందు 2028 కల్లా అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు మొదట చెప్పారు. బిల్లు పెట్టాక అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు.రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని గుదిబండగా మార్చారు. విజయవాడకు చంద్రబాబు ఏ ఒక్క మేలైనా చేశారా?. మచిలీపట్నం, గుంటూరులను కూడా పట్టించుకోవటం లేదు. ఎంతసేపూ అమరావతి పేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారా?. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులు మావిగన్ కు వ్యతిరేమా? అనుకూలమా?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది షో రాజకీయాలే. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సూచించిన మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు విజయవాడను చంపేశారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని చంద్రబాబు అమరావతి కట్టగలరా?. రిటైనింగ్ వాల్ కట్టలేని చంద్రబాబు అమరావతి కడతారా?.’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘విజయవాడలో అభివృద్ధి జగన్ మాత్రమే చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం కూడా కేవలం వైఎస్ జగనే చేశారు. విజయవాడలోని రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారికి జగన్ ఎంతో మేలు చేశారు. వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఐదేళ్లు మా పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి జగన్పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. మావిగన్కు టీడీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. అమరావతి బిల్లు సందర్భంగా కేకులు కట్ చేయమని చంద్రబాబు పిలుపిస్తే టీడీపీ క్యాడరే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు అందరి మద్దతూ లభించింది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?: మల్లాది విష్ణుఅమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?. గ్రోత్ ఇంజన్ లాంటి మావిగన్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు?. రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా?. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారు?. గుంటూరు, విజయవాడలను చంద్రబాబు అన్యాయం చేశారు. మావిగన్ ప్రతిపాదనను జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారు. మచిలీపట్నం పోర్టు బేస్డుగా జరిగే మావిగన్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. తెలంగాణానే మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేసుకోబోతోంది. మరి చంద్రబాబు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారు?. మందడంలో రైతు రామారావు గుండె పగిలి చనిపోయాడు. దీన్ని కూడా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. భావితరాలకు చంద్రబాబు లక్షల కోట్ల అప్పును గిఫ్టుగా ఇస్తున్నారు. బుడమేరు వరదలకు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. విజయవాడ వాసులపై చంద్రబాబుకు ఎంత కోపమో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చుకృష్ణా, బుడమేరులకు వరదలు వస్తే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జపాన్కు చెందిన మాకీ అనే సంస్థ చంద్రబాబు అవినీతిని బయటపెట్టింది. చంద్రబాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్ను కూడా జైల్లో పెట్టారు. అంటే వీరంతా కలిసి ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావిగన్పై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ కనుమరుగు ఖాయం. -
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులా?: మేరుగ నాగార్జున
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కూటమి నాయకుల వేధింపులు భరించలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దళితులు అంటే వ్యతిరేకత అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులు చేస్తున్నారు. ఒక దళితుడిని అయ్యన్నపాత్రుడు చెంప మీద కొట్టారు. దళితుడిని కొట్టిన ఆయన మీద ఎందుకు కేసు నమోదు లేదు?. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తప్పుడు కేసులు పెట్టి దళితులను జైలుకు పంపిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తారా?.ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దళితులకు చెందిన 200 కోట్లు విలువైన భూములను ఆక్రమించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను వెలివేశారు. రాజమండ్రిలో దళితులను బట్టలు విప్పి పోలీస్ స్టేషన్లో కూర్చొబెట్టరు. కూటమి నాయకుల వేధింపులు భరించకలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
పోలింగ్.. రిగ్గింగ్.. ట్యాంపరింగ్.. AP ఎన్నికల్లో ఏం జరిగింది ?
-
AP: ఐదో రోజుకు నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. నేటికీ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రేపు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీతో నెట్వర్క్ ఆసుప్రతుల ప్రతినిధులు భేటీ కానున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో పేదల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ పథకం వెంటిలేటర్పైకి చేరింది. బకాయిల విడుదలపై ప్రభుత్వం పదేపదే హామీలిచ్చి, ఆచరణలో పైసా కూడా విదిలించకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. సిబ్బందికి జీతాలు, మందుల సరఫరాదారులకు బకాయిలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి.తమ పరిస్థితిని ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆస్పత్రుల దగ్గర యాజమాన్యాలు బోర్డులు పెట్టి నిరసన చేపడుతున్నాయి. దీంతో పేద రోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. క్యాన్సర్, గుండె, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కొత్తగా ఎటువంటి ఆరోగ్యశ్రీ కేసులను చేర్చుకోవడం లేదు. అత్యవసరమైన కేసుల్లో చికిత్సలకు రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు మాత్రం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. -
శనగకు ‘ధరా’ఘాతం.. రైతును ఆదు‘కొనే’వారేరి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు నిర్వాకం శనగ రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం అనుమతులతో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది నిల్వలతో పాటు ఈ ఏడాది పంట దిగుబడిలో కనీసం 15 శాతం కూడా కొనకుండానే కూటమి సర్కారు కొనుగోలు కేంద్రాలను మూసివేసింది. మార్కెట్లో ధర లేక.. కొనేవారు కానరాక రైతులు గగ్గోలు పెడుతున్న తరుణంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అదనపు అనుమతుల పేరిట కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలాడుతోంది.దక్కే ధర రూ.4,900లోపే..ఈ ఏడాది రబీలో 10.30 లక్షల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేశారు. 4.57 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా. క్వింటాల్కు కనీస మద్దతు ధర రూ.5,650 కాగా.. మార్కెట్లో రూ.4,600 నుంచి రూ.4,900 మధ్య మాత్రమే చెల్లిస్తున్నారు. గతేడాది ధర లేకపోవడంతో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా శనగలు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతుండగా, ఈ ఏడాది పంట మార్కెట్కు రావడం మొదలైంది. కనీసం ఈ ఏడాదైనా ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని మద్దతు ధరకు శనగ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ.. కేంద్రంపై భారం నెట్టేసి.. చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకునే పనిలో నిమగ్నమైంది. అర్థంతరంగా కొనుగోలు కేంద్రాలు మూసివేత ఫిబ్రవరి నెలాఖరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే మూసివేశారు. కేంద్రం 94,500 టన్నుల సేకరణకు అనుమతివ్వగా, కేవలం 84 వేల టన్నులు మాత్రమే సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అర్ధంతరంగా మూసివేసింది. మరోవైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు టీడీపీ సానుభూతిపరుల నుంచి మాత్రమే సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 30–40 శాతం పంట మాత్రమే మార్కెట్కు వచ్చింది. గతేడాది నిల్వలతో కలిపితే దాదాపు 4.50 లక్షల టన్నులకు పైగా నిల్వలు రైతుల వద్ద పేరుకుపోయాయి. ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు అడుగుతుంటే.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావడం లేదు. పైగా ఈ బాధ్యత తనది కాదన్నట్టుగా అదనపు సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపేసుకుంటోంది. అదనపు కొనుగోళ్లకు అనుమతి కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్టు వ్యవసాయ శాఖమంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇలా లేఖలతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందే తప్ప రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.కొనుగోలు కేంద్రాల్ని మూసేశారుఐదెకరాల్లో శనగ వేశాను. ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టాను. ఈ సీజన్లో మొక్కుబడి తంతుగా కేంద్రాలు తెరిచి.. సీజన్ ముగియకుండానే మూసేశారు. మద్దతు ధర దక్కక,.. బహిరంగ మార్కెట్లో కొనేవారు లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఏం చేయాలో పాలుపోక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. పెట్టుబడులు, ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. – బి.దస్తగిరి, మాలేపాడు, ఎర్రగుంట్ల మండలం, వైఎస్సార్ కడప జిల్లారెండేళ్లుగా ఇదే పరిస్థితిమద్దతు ధర దక్కక.. పంటను కొనుగోలు చేసేవారు లేక శనగ రైతులు రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే కొనుగోలు కేంద్రాలను మూసేశారు. ఈ ఏడాది దిగుబడిలో కనీసం 15 శాతానికి మించి కొనుగోలు చేయలేదు. కోతకొచ్చిన పంటను ఏం చేయాలో పాలుపోక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గతేడాది పంట అమ్ముడుకాక కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసుకున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించి రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
కుప్పంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంజునాథ్ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
మావిగన్.. ప్రజలు అంగీకరిస్తున్న రాజధాని
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మావిగన్ కాన్సెప్ట్ మంచి ప్రతిపాదన అని, సీఎం చంద్రబాబు చెప్పే అమరావతి దోచుకోనే ప్రతిపాదన అని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి కట్టే బదులు, మావిగన్ పేరుతో ప్లాన్–బీ గురించి జగన్ చెబితే, నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాము మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని చెబితే, దాన్ని మూడు ముక్కలాట అంటూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్ని అవమానిస్తున్నారని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని జగన్ చెప్పారురాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉండకూడదన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని చెప్పారు. జగన్ ఇప్పుడు చెప్పిన ప్లాన్ బీ కూడా కొత్తదేమీ కాదు. కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. అయితే పెద్దగా చర్చలోకి రాలేదు. ఆ ఉద్దేశంతోనే ఈ కారిడార్కు మావిగన్ అని పేరు పెట్టారనుకుంటున్నా. ఇలాంటి పేర్లు దేశంలో అనేక గ్రోత్ కారిడార్లకు ఉన్నాయి. నోయిడా అసలు పేరు.. ‘న్యూ ఒఖలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ’. పేర్లు ముఖ్యం కాదు. వాటి వెనక ఉద్దేశాలు చూడాలి. జగన్ రాయలసీమలో రాజధాని పెట్టమన్నాడా? మచిలీపట్నం – విజయవాడ – గుంటూరులో పెట్టమంటే చంద్రబాబుకు మంట ఎందుకు? మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజిన్గా అభివృద్ధి చేసేందుకు జగన్ పోర్టు నిర్మాణం చేపట్టారు.మావిగన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపే. ఒక మంచి గ్రోత్ కారిడర్ను చంద్రబాబు తన అవినీతి కోసం విస్మరిస్తున్నారు. ఈ మూడు నగరాలు కలవడం బాబుకు ఇష్టం లేదు. గతంలో పశ్చిమ బైపాస్ను అడ్డుకున్నాడు. తూర్పు బైపాస్ రాకుండా అడ్డుకుంటున్నాడు. మా ప్రభుత్వం వచ్చాక ఈ మూడు సిటీలు బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ రాజధాని పెడితే చాలా తక్కువ ఖర్చుతో మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుల భారం ఉండదు. జగన్ చేసిన ఈ ఆచరణాత్మక ప్రతిపాదనపై ఈ మూడు నగరాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, మేధావులు చర్చిస్తున్నారు.మంచి ప్రతిపాదన అని అంగీకరిస్తున్నారు. మా పార్టీ నాయకులంతా మద్దతు పలుకుతున్నారు. మా పార్టీ నాయకులు వ్యతిరేకించారన్నది దుష్ప్రచారమే. అమరావతికి కులం రంగు పులిమిందీ చంద్రబాబే. రేణుకాచౌదరి పార్లమెంటులో కమ్మరావతి అంటే టీడీపీ నుంచి ఎవరైనా ఖండించారా? పైగా ఆ మాట అన్నందుకు రాజ్యసభలో గ్యాలరీ నుంచి లోకేశ్ ఆమెకు ధన్యవాదాలు చెప్పారు.అమరావతి ఇప్పట్లో కాదని బాబే చెబుతున్నారుబాబు ప్రణాళికతో అమరావతి సజీవ నగరంగా నిలుస్తుందా? ఉద్యోగాలొస్తాయా? అప్పుల భారం లేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎప్పుడు మారుతుంది? అమరావతి ఇప్పట్లో పూర్తి కాదని చంద్రబాబే చెబుతున్నారు. 2047 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకూ అమరావతిని లాగి ఖజానాను పిండాలన్నది వారి ప్లాన్. పన్నుల ద్వారా రాజధానికి ఆదాయం వస్తుందన్న వాదనా అసంబద్ధమైనది. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు రాయితీలు. రూపాయి ఖర్చు చేసి, 10 పైసలు పొందడాన్ని ఆదాయం అంటారా? ఆ పది పైసలు కూడా కాంట్రాక్టర్ల రాయితీకే సరిపోతుంది. అమరావతిలో ప్రభుత్వ భూములు ఎప్పుడు అమ్ముతాడు? హైదరాబాద్లో ఉన్న రేటు రావడానికి ఎంత కాలం పడుతుంది? చంద్రబాబువన్నీ మభ్యపెట్టే మాటలే.ఇదీ నయా రాయ్పూర్ వాస్తవ పరిస్థితిచత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్లో ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ రాయ్పూర్ నుంచే రాకపోకలు చేస్తున్నారు. రాయ్పూర్ కోసం ఆ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1500 కోట్లు మాత్రమే. అదీ తీర్చేశారు. అక్కడ చేసిన ఖర్చు రూ.7 వేల కోట్లు కాగా, ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు బలంగా ఉన్న చోట రాజధాని వస్తే ఇలా అన్ని రకాల ఉపయోగం. అదే ఇక్కడ అమరావతిలో విచ్చలవిడిగా వేల కోట్ల అప్పు చేస్తున్నారు. చత్తీస్గఢ్లో కూడా వికేంద్రీకరణ దిశలో ఆ రాష్ట్ర హైకోర్టును బిలాస్పూర్లో పెట్టారు. ఇక్కడ వికేంద్రీకరణ పెద్ద తప్పుగా దుష్ప్రచారం చేశారు.అమరావతి రైతులకూ అన్యాయం చేశారుచంద్రబాబు అమరావతి రైతులకూ అన్యాయం చేశారు. ఇప్పటికీ రైతుల సమస్యలు కొలిక్కి రాలేదు. దీనికి చంద్రబాబు బోనులో నిలబడి సంజాయిషీ ఇవ్వాలి. అమరావతి ద్వారా ఆయన రాష్ట్రానికి గుదిబండ తయారు చేశాడు.అమరావతి సంబరాలను ప్రజలు, అధికారులు పట్టించుకోలేదుఅమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయాలని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా వారు కూడా పట్టించుకోలేదు. -
అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ మోసం..
సాక్షి, విశాఖపట్నం: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అంతులేని దోపిడీకి పాల్పడుతోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన స్కామ్ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. శనివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు.చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలకు రూ.2 లక్షల కోట్లవుతుందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. రోడ్లకే ఎన్నో దశాబ్దాలు పడుతుంది.. ఇక మిగిలిన సదుపాయాలెప్పుడు? రాజధాని నిర్మాణాలెప్పుడు? రాష్ట్రానికి భారం కాని విధంగా అత్యంత వాస్తవిక దృక్పథంతోనే తాము విశాఖను రాజధానిగా ఎంపిక చేశామని, తక్కువ ఖర్చుతోనే గ్రోత్ ఇంజన్గా మారే అవకాశమున్న విశాఖను కాదన్నారు సరే.. అలాంటి అవకాశాలున్న, రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టు ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవడానికి మీకు ఉన్న అభ్యంతరమేమిటని బొత్స ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మౌనమెందుకు?అమరావతిపై చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని బొత్స ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా వస్తే ఇలాంటి అమరావతిలు పది వస్తాయి. విశాఖ వంటి నగరాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పడం బాధ్యతారాహిత్యం. ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతితో పాటు ప్రత్యేక హోదా బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ‘అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు ఖర్చయ్యే చోట రూ.14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు 5 శాతం పనులే చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల నివాసాలు, చివరకు కరకట్ట రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ఆ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండలిలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ చీప్ ట్రిక్స్కు పాల్పడింది. రాజధాని పేరుతో ఎంత ఖర్చు చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? ఎంత పని జరిగింది? అన్న లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ‘మావిగన్’ ప్రతిపాదనలో తప్పేంటి?‘మా నాయకుడు వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు. ఇప్పటికే రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టు ఉన్న మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని ఎక్కువ ఖర్చు లేకుండానే రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్కరోజు కూడా ఆపలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన అదనపు మేలేంటో సమాధానం చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఉన్నారు. -
వెంకన్న స్వామిపై భక్తి కంటే BR నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కువ
-
ఇంకెప్పుడు రాజీనామా! BR నాయుడుపై కట్టలు తెగిన ఆగ్రహం
-
BR నాయుడు అంటే ఎందుకు అంత భయం చంద్రబాబు
-
20 ఏళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ రాజధాని అమరావతికీ ఇదే పరిస్థితి..
-
YSR అన్నట్లు బాబు ప్రతి అబద్దపు మాట ఆణిముత్యమే
-
చిత్తూరు జిల్లాలో టీడీపీ బరితెగింపు కానిస్టేబుల్ యుగంధర్ పై దాడి
-
‘రాజీనామా చేయ్.. బీఆర్ నాయుడు’
సాక్షి, తిరుపతి: టీటీడీ ఛైర్మన్ నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిను తొలగించాలంటూ నిరసన చేపట్టారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంంలో కరుణాకర్రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు.బీఆర్ నాయుడు వచ్చాక అనేక వివాదాలు, అపశ్రుతులు జరిగాయని.. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా బీఆర్ నాయుడు వ్యవహరించారన్న భూమన.. బీఆర్ నాయుడిని తొలగించకపోతే మరింత ఉధృతంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు.ఆర్కే రోజా మాట్లాడుతూ.. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్గా కొనసాగించడం చంద్రబాబు చేతగానితనం అంటూ మండిపడ్డారు. లడ్డూ గురించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. మహిళను 30 ఏళ్లుగా బీఆర్ నాయుడు చిత్రహింసలకు గురిచేశాడు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ వ్యక్తిగత విషయాలు బీఅర్ నాయుడు బయటపెడతారని భయపడుతున్నారా?...డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు. బీఅర్ నాయుడిపై ఎందుకు స్పందించలేదు. నెయ్యి విషయంలో ఏమి లేకపోయినా మెట్లు కడిగావ్. మరి ఇప్పుడు బీఅర్ నాయుడు విషయంలో ఎలాంటి ప్రోక్షణ చేస్తావ్. లడ్డూ గురించి సీఎం చంద్రబాబు పచ్చి అబద్దపు మాటలు చెప్పారు. చివరికి సిట్ ఇచ్చిన నివేదికలో ఏంలేదని తేలింది. ఇప్పటికైన చంద్రబాబు అలిపిరిలో సాష్టాంగ నమస్కారం చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలి’’ అని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
BR నాయుడును చూసి అబ్బా, కొడుకులు వణికిపోతున్నారు.. RK రోజా స్ట్రాంగ్ వార్నింగ్
-
లక్షల కోట్లు అప్పు.. డెవలప్ చేస్తున్నావా.. ముంచుతున్నావా?
-
దేవతల రాజధాని అమరావతిని చూడాలంటే 200 సంవత్సరాలు పడుతుంది
-
BR నాయుడుపై చర్యలు ఎక్కడ? ఏపీ వ్యాప్తంగా YSRCP నిరసనలు
-
సిలబస్ ‘ప్రశ్నా’ర్థకం?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యాప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి. దీనికితోడు పరీక్షల వ్యవస్థను సర్కారు అపహాస్యం చేస్తోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్ఎస్సీ–2026) నిర్వహణలో తప్పటడుగులు వేసింది. ప్రశ్నలను బ్లూప్రింట్ ప్రకారం కాకుండా తప్పుల తడకగా, బయట సిలబస్ నుంచి ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ముగిసిన చివరి పరీక్ష ఇంగ్లిష్ పేపర్లో ప్రశ్నలు అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు ఏకంగా 15 మార్కులు కోల్పోయే ప్రమాదమేర్పడింది. అలాగే మార్చి 25న జరిగిన ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ తప్పు ప్రశ్నలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆరు మార్కులు కోల్పోతున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి, బోధనేతర పనులను అప్పగించిన విద్యాశాఖ.. గతేడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షల కోసం ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ అమలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నావళి, జవాబులను రూపొందించి వాటినే బట్టీ పట్టించింది. కానీ యాక్షన్ ప్లాన్ కంటెంట్కు భిన్నంగా ప్రశ్నపత్రం ఇచ్చి విద్యార్థులను బలి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేపర్ సెట్టింగ్లో 100 మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నల సరళి.. 35 శాతం మార్కులకు సులభంగా ప్రతి విద్యార్థీ రాసేలా, మరో 15 శాతం కష్టతరంగా, మిగిలిన 50 శాతం మధ్యస్తంగా ఉండేలా నిపుణులు చర్యలు తీసుకుంటారు. కానీ, ఈ ఏడాది ఎవరికీ అర్థంగాని రీతిలో కనీస ప్రమాణాలు పాటించకుండా పరీక్ష పేపర్లు నిర్లక్ష్యంగా రూపొందించారని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. ఇంగ్లిష్లో పేపర్లో ఇచ్చిన తప్పు ప్రశ్నలివీ.. టెన్త్ పబ్లిక్ పరీక్షలప్రశ్నపత్రాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ పేపర్లు బ్లూప్రింట్కు భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇంగ్లిష్ పేపర్ను పరిశీలిస్తే.. » జంబుల్డ్ సెంటెన్స్ (ప్రశ్న నం.17)లో సాధారణంగా ఒక స్టోరీ లేదా ఒక ఘటనను ఇచ్చి, అందులోని కొన్ని పదాలను అటు ఇటుగా మార్చి (జంబుల్), ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. కానీ ఈసారి పేపర్లో ఒక స్టోరీని పూర్తిగా ‘రివర్స్’లో వెనుక నుంచి ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఐదు మార్కులు కోల్పోయారు. » ఎడిటింగ్ (ప్రశ్న నం.22): ఇది బ్లూ ప్రింట్ ప్రకారం ఇచ్చిన పాసేజ్లో ఎడిట్ చేయాల్సిన సెంటెన్స్ను ‘అండర్ లైన్’ చేయాలి. గతంలో జరిగిన పరీక్షల్లో ఇచ్చిన పాసేజ్లో నాలుగు వర్డ్స్ను అండర్లైన్ చేసి ఇచ్చారు. కానీ పబ్లిక్ పరీక్షలో మాత్రం ఒకే పాసేజ్ ఇచ్చి ఎక్కడ ఎడిట్ చేయాలో అండర్లైన్ చేయలేదు. 4 మార్కులు కోల్పోయారు. » అడ్వైస్ (ప్రశ్న నం.26): సెంటెన్స్లో ఇచ్చిన ‘నౌన్’ను ఉద్దేశించి అడ్వైస్ ఇస్తారు. కానీ, ఈసారి పరీక్షలో నౌన్కు కాకుండా నౌన్ తండ్రికి అడ్వైస్ ఇవ్వమని అడిగారు. అంటే విద్యార్థులకు బోధించని, సిలబస్లో లేని ప్రశ్నను ఇవ్వడంతో 2 మార్కులు కోల్పోయారు. » ఆపోజిట్ వర్డ్స్ (ప్రశ్న నం.28): ఇది పూర్తిగా సిలబస్లో లేనిది, బ్లూప్రింట్కు సంబంధం లేనిది ఇచ్చారు. ఇది కూడా 4 మార్కుల ప్రశ్న కావడం గమనార్హం. ఫిజికల్ సైన్స్లోనూ అదే తీరు ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ సిలబస్లో లేని ప్రశ్నలే ఇచ్చారు. వారి ఐక్యూ స్థాయిని అంచనా వేసేవిగా మార్చేశారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో విద్యార్థులు కచ్చితంగా ఏరోజు ఏ ప్రశ్నలు చదవాలో సిలబస్ ఇచ్చా రు. కానీ ఆ జాబితాలోని మోడల్స్కు, వెయిటేజీకి విరుద్ధంగా ప్రశ్నలు సైతం సందిగ్ధంగా, అసాధారణ రీతిలో ఇవ్వడంతో విద్యార్థులు సరిగా రాయలేకపోయారు. ముఖ్యంగా 8, 11, 14(1), 14(4), 3వ ప్రశ్నలు అసాధారణ రీతిలో ఇవ్వడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. వీటికి ఆరు మార్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. -
రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, స్పోర్ట్ సిటీ వంటి వేర్వేరు ప్రాజెక్టులు నిర్మితమవుతూనే ఉంటాయన్నారు. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్, మోనిటైజేషన్ ప్రాజెక్టు అని పదే పదే చెబుతున్నామని తెలిపారు. రాజధానిలో భూమి విలువలు పెరుగుతాయని, దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని అన్నారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల అత్యంత సారవంతమైన, ఖరీదైన భూములను ఇచ్చారని చెప్పారు. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతేనని చెప్పారు. అమరావతిని భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. పార్లమెంటు శాశ్వత రాజధాని అని చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్లాన్ ఏ, ప్లాన్ బీ చేస్తామని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని అవుతుందన్నారు. ప్రస్తుతం రాజధానిలో రూ.56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2028 నాటికల్లా రాజధానిలో ప్రధానమైన పనులన్నీ కొలిక్కి వస్తాయన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ధరలు పెరుగుతాయని తెలిపారు. -
మహానగరాలతో పోటీపడేలా 'మావిగన్'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అండ్ కో విష ప్రచారం చేయడంతో అది అమలు కాలేదు. దీంతో ప్లాన్ బీ కింద మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) 110 కిమీల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ వైఎస్ జగన్ చేసిన అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రెండు రైల్వే జంక్షన్లతో అన్ని మౌలికవసతులూ ఉన్న ఈ ప్రాంతానికి రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందే సత్తా ఉందని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటువంటి మౌలిక వసతులూ లేని 29 గ్రామాల పరిధిలో అమరావతి పేరిట ఎకరానికి రూ.రెండు కోట్లు చొప్పున రూ.రెండు లక్షల కోట్లు కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ కోసం వ్యయం చేయడం కంటే అందులో పది శాతం వ్యయంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడేలా ఈ ట్రైసిటీ అభివృద్ధి చెందుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రాంతాలు నగరాలుగా వేగంగా ఏవిధంగా ఎదిగాయో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.ప్లాన్–ఏపై విష ప్రచారంతో ప్లాన్–బీవైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతం ఎలా ఉండాలన్న దానిపై సమగ్ర అధ్యయనం చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచపటంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని తలంచారు. మౌలికసదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతి కంటే వేగంగా తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి రాజధానిని రూపుదిద్దాలని భావించారు. అదే సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మూడు రాజధానుల ప్రణాళిక రూపొందించారు. ఈ నిర్ణయంపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుతంత్రంతో తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎన్నికల్లో కుటిలత్వంతో గెలిచి మళ్లీ తన స్వలాభం, కేవలం 29 గ్రామాల పరిధిలో కొందరి ప్రయోజనాల కోసం అమరావతి రాగం అందుకుని మళ్లీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను మోసం చేసే మహాపాతకానికి పూనుకున్నారు. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్–బీగా అన్ని వసతులతో ఇప్పటికే అభివృద్ధి చెందిన మూడు నగరాల సమాహారంతో అత్యంత వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ ‘మావిగన్’ ప్రతిపాదన చేశారు. ఇది సరైన సమయోచిత నిర్ణయమని ఆర్థికవేత్తలు స్వాగతిస్తున్నారు. వేగంగా పోర్టు సిటీలు అభివృద్ధిదేశంతో పాటు అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో పోర్టులే కీలకపాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో చెన్నై, కోల్కతా, ముంబై నగరాలు పోర్టుల ద్వారా వేగంగా అభివృద్ధి చెందిన విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. చైనాలో పోర్టు వలన షెన్జెన్ నగరం వేగంగా కీలక గ్రోత్ ఇంజిన్గా ఏ విధంగా ఎదిగిందో ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా పోర్టు ఉన్న విశాఖ నగరం కీలక ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఇప్పుడు మావిగన్ను రాజధాని కారిడార్గా ప్రకటిస్తే అంతకంటే వేగంగా వృద్ధి చెందే సత్తా ఈ ప్రాంతానికి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి మచిలీపట్నం వద్ద రూ.5,155.77 కోట్లతో పోర్టు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికనగరానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేస్తున్నారు.ఇతర మౌలిక వసతులకు కొదవలేదుఇటు గలగల పారే కృష్ణా నదితోపాటు అటు పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఈ ప్రాంతం జలసిరులతో తులతూగుతోంది. విజయవాడలోని ఎన్టీటీపీఎస్, పోలవరంలోని 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా రాజధానికి కావాల్సినంత విద్యుత్ లభ్యత రానుంది. అదే ఎటువంటి మౌలిక వసతులూ లేని అమరావతిలో మౌలిక వసతుల కల్పనకే ఏకంగా రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. మావిగన్ కారిడార్కు అందులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు.. పదేళ్లలోనే అంతర్జాతీయ మహారాజధానిగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. నాలుగు కార్పొరేషన్లు– 60 లక్షల జనాభామావిగన్ నమూనాలో ఏకంగా నాలుగు కార్పొరేషన్లు , రెండు మున్సిపాల్టీలు ఉండటమే కాకుండా 60 లక్షలకుపైగా జనాభా ఉండటం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో 110 కిలోమీటర్ల మేర రెండు ఆరులైన్ల జాతీయ రహదారులు, విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్, గుంటూరులోనూ రైల్వే జంక్షన్, అలాగే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం బాగా కలిసొచ్చే అంశమని, అన్ని ప్రాంతాలకు రైల్వే, రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల అదనంగా ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. మావిగన్తో అందరికీ మేలురాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అద్భుతంగా ఉంటుంది. ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు మంచి జరుగుతుంది. రాజధానిలో కొందరే భూములు కొనటం, అమ్మడం ద్వారా పేదలకు మేలు కానీ, ఉపాధి కానీ ఉండదు. – మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్, గన్నవరం అత్యంత వాస్తవిక ఆలోచనమావిగన్ అనేది అత్యంత వాస్తవిక ఆలోచన. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ఆచరణాత్మక పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మచిలీపట్నం – విజయవాడ– గుంటూరు మధ్య రాజధాని ఆలోచన అత్యద్భుతం. ఈ మూడు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే.. కేవలం సీఎం చంద్రబాబు చెబుతున్న దాంట్లో కేవలం పది శాతం పెట్టుబడితో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, అనంతపురం -
‘అప్పు’డే తెల్లారింది!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల అమలు క్యాలెండర్ను పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏటా అప్పుల క్యాలెండర్ల విడుదలలో మాత్రం దూసుకుపోతోంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఆర్థిక ఏడాది (2026–27)లో తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) చేయనున్న బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో చంద్రబాబు సర్కారు రూ.27,000 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించుకుంది. అంటే నెలకు రూ.9000 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూటమి సర్కారు చేసే బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది. సూపర్ సిక్స్, ఇతర హామీల ఊసేదీ? ఆర్బీఐ చేత అప్పుల క్యాలెండర్ను ప్రకటింపజేస్తున్న చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలు, పథకాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్ను మాత్రం ప్రకటించడం లేదు. ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పటికీ.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదు. కొత్త ఆర్థిక ఏడాదిలో వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. 12 ఏళ్ల కాల వ్యవధిలో రూ.2,200 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో తీర్చేలా మరో రూ.2,200 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. 2026–27 తొలి త్రైమాసికంలో అప్పుల క్యాలెండర్ ఇలా తేదీ అప్పు మొత్తం (రూ.కోట్లలో) ఏప్రిల్ 7 4,400 ఏప్రిల్ 21 4,600 మే 5 4,400 మే 19 4,600 జూన్ 2 4,400 జూన్ 16 4,600 మూడు నెలల్లో అప్పు రూ.27,000 కోట్లు బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు యూనియన్ బ్యాంక్ నుంచి టర్మ్ రుణం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ విజయానంద్ దీంతో ఏపీపీఎఫ్సీఎల్ అప్పు రూ.13,610 కోట్లు సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) రూ.2,000 కోట్ల టర్మ్ రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. రుణ వాయిదాలను సకాలంలో తీర్చేందుకు వీలుగా లెటర్ ఆఫ్ కంఫర్ట్ను కూడా జారీ చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రుణ సంస్థకు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే యూబీఐతో పాటు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఏపీపీఎఫ్సీఎల్ రూ.11,610 కోట్లు అప్పులు చేసింది. ఇప్పుడు చేసే రూ.2,000 కోట్లతో ఏపీపీఎఫ్సీఎల్ మొత్తం అప్పు రూ.13,610 కోట్లకు చేరనుంది. -
‘మావిగన్’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే... జగన్ చెప్పిన మావిగన్పై రాష్ట్రంలో చర్చరెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.2028-29కి ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.మావిగన్ ట్రోలింగ్స్కు వైఎస్సార్సీపీ భయపడదుఅమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.చంద్రబాబే ఊసరవెల్లి2014లో రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్మోహన్ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు.


