breaking news
Chandrababu Naidu
-
ట్రెండింగ్లో బిల్గేట్స్ క్విట్ ఇండియా హ్యాష్టాగ్
ఓవైపేమో తమ దేశాన్ని ఒక ప్రయోగశాలగా తమ ప్రజలని బలిపశువులుగా అభివర్ణించారని బిల్గేట్స్పై సామాజిక మాద్యమాలలో "బిల్గేట్స్ క్విట్ ఇండియా" అని నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. మరోవైపేమో కూటమి ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జాతిని తమ ప్రజలను అవమానించిన వారికి ఇంత రాచ మర్యాదలు చేయాల్సిన అవసరం ఏంటని సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.కొంతమందికి ప్రజల ప్రాణాలన్నా..వారి మనోభావాలన్నా లెక్కే ఉండదు. వారికి కావాల్సింది సంపన్నులకు కొమ్ముకాయడం.. వారిని బుట్టలో వేసే యత్నం చేయడం అంతే.. తాజాగా కూటమి ప్రభుత్వం చేసే పని దానికే నిదర్శనంగా నిలుస్తోంది. ఓవైపేమో తమ దేశాన్ని పేద ప్రజలని అవమానించిన వ్యక్తిని.. బిల్గేట్స్ క్విట్ ఇండియా అని దేశంలోకి రావద్దంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.నిరసన ఎందుకు..?గతంలో ఓ సందర్భంలో భారత్పై బిల్గేట్స్ తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఇండియాని ఓ ప్రయోగశాలగా వాడవచ్చని అన్నారు. ఆ దేశంలో ఎటువంటి ప్రయోగాలయినా చేసుకోవచ్చని తెలిపారు. అంటే ఇక్కడి మట్టికి గానీ ప్రజలకు గానీ ఆయన విలువనివ్వలేదు. ఏటువంటి ప్రయోగాలకైనా వీరిని వాడుకోవచ్చనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. దీంతో ఈ అంశం నెట్టింట్లో తీవ్రంగా ట్రోలయింది. బిల్గేట్స్ క్విట్ ఇండియా అంటూ హ్యాష్ట్యాగ్ ట్రెండయ్యింది.ఐదుగురు పిల్లల మృతిఇదిలా ఉంచితే 2009లో మెలిండా ఫౌండేషన్ సహాకారంతో రూపొందించిన HPV వ్యాక్సిన్ వికటించి ఖమ్మంలో ఐదుగురు చిన్నారులు మృతిచెందారు. మరెంతో మంది ఇతర సమస్యలతో బాధపడ్డారు. ఇది అప్పట్లో చాలా వివాదమైంది. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు తిరిగి ఆ వ్యాక్సిన్ ప్రయోగానికి బిల్గేట్స్కు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల ప్రాణాలకు ఏమవుతుందా అనే ఆందోళన నెలకొంది.ఎప్స్టీన్ ఫైల్స్అయితే ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలోనూ బిల్గేట్స్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన రష్యన్ అమ్మాయిలతో నిద్రపోతున్నాడని లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడ్డారని దీంతో తన భార్య మెలిండా గేట్స్కు రహస్యంగా ఇవ్వగల యాంటీ బయాటక్స్ కోసం అడుగుతున్నారని ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం హాట్టాఫిక్గా మారింది.ప్రపంచవ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఉండి, మాతృదేశాన్ని అవమానకరంగా మాట్లాడి, ప్రజల చేతిలో నిరసనకు గురువుతున్న వ్యక్తికి.. చంద్రబాబు ఇంత హైప్ ఇవ్వడం ప్రజలను ఆవేదనకు గురిచేస్తుంది.In 2009, five children died in Khammam district in Telangana after the administration of the HPV vaccine. Many others suffered short and long term side effects. Now @ncbn invites the same Bill Gates to continue his experiments on Indian children #BillGates_QuitIndia pic.twitter.com/CUKxXBv02i— Dee (@DeeEternalOpt) February 15, 2026 Even after knowing about the Bill Gates - Epstein files- Pandemic Connection, how can our people allow @BillGates to dictate tech, health, agriculture and digitisation policies in India? #BillGates_QuitIndia https://t.co/xiGeciMFhr pic.twitter.com/aXlhBLeFYr— Awaken India Movement (@awakenindiamvmt) February 14, 2026 -
కోతలు- వాతలు - కూతలు బాబు బడ్జెట్ పై రాచమల్లు సెటైర్లు
-
చంద్రబాబు వెన్నులో వణుకు..
-
Venkatarami: ఇలాంటి చెత్త బడ్జెట్ ఎప్పుడూ చూడలేదు ప్రజలకు ఎందుకూ పనికిరాదు
-
Surya Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలి..
-
ఆంధ్రప్రదేశ్లో శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను గాలికొదిలేసిన బాబు సర్కారు
-
సూపర్ సిక్స్ హామీలకు మంగళం.. మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా
సాక్షి, అమరావతి: ⇒ నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3 వేలు..⇒ 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా ఏడాదికి రూ.18 వేలు..⇒ 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్..⇒ సున్నా వడ్డీతో మహిళా పొదుపు సంఘానికి రూ.10 లక్షలు, ఒక్కో రైతుకు రూ.3 లక్షలు చొప్పున రుణాలు..⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్.. మెరుగైన పీఆర్సీ..!!⇒ టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీలివీ! చంద్రబాబు ఎన్నికల మోసాలు.. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి మరీ వంచించడం.. మూడు బడ్జెట్లలోనూ సూపర్ సిక్స్ల ఊసే లేకపోవడం.. ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలకే దిక్కులేకుండా పోవడంపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల హామీలను అమలు చేస్తామని ప్రతి ఇంటికీ గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. ఇదో క్లాసిక్ కేస్ స్టడీ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్తోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రధాన పాత్ర పోషించాయని కూటమి నేతలు కూడా పలు సందర్భాల్లో అంగీకరించారు. అలాంటిది.. కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి దారితీసిన ఆ హామీలను అమలు చేయకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, రాజకీయాల్లో నైతికతకు తిలోదకాలు ఇవ్వడమేనని స్పష్టం చేస్తున్నారు.మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం.. వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారనేందుకు చంద్రబాబు సర్కార్ అత్యుత్తమ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేనిఫెస్టోను ‘మోసఫెస్టో’గా మార్చేసి ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు అపహాస్యం చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చంద్రబాబు నేతృత్వంలో 2024–25, 2025–26, తాజాగా ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లోనూ సూపర్ సిక్స్ హామీల అమలుకు కేటాయింపులు చేయలేదు. దీన్ని బట్టి ఆ హామీలకు ఇక మంగళం పాడేశామని మూడో బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు సర్కార్ తేల్చి చెప్పినట్లైందని పేర్కొంటున్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు సామూహికంగా వెన్నుపోటు పొడిచారన్నది స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా అడ్డగోలుగా హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంపై ఇటీవల దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు ఎన్నికల కమిషన్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాలని కోరుతున్నారు. హామీలకు గ్యారంటీ ఇస్తూ ఇంటింటికీ బాబు బాండ్లు..సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్.. సెవెన్.. అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి.. వాటి ద్వారా ఆ కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం కూడా చేశారు. మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్లో నమోదు చేశారు. కుటుంబ యజమాని ఫోన్ నెంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నెంబరును వెబ్సైట్లో నమోదు చేసుకుని సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనంపై ప్రచారం చేశారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు వెబ్సైట్కు మిస్డ్ కాల్ ఇప్పించారు. వారి ఫోన్ నెంబర్కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. వాటిని కుటుంబ సభ్యుల ముందే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఆ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో తేల్చి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో నమ్మబలికారు. బాండ్లు ఇచ్చి మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి...టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి 20 నెలలు పూర్తయింది. మూడు బడ్జెట్లను ఇప్పటికే ప్రవేశపెట్టారు. వాటిలో సూపర్ సిక్స్ ప్రధాన హామీల అమలు ప్రస్తావనే లేదు. అంటే.. ఆ హామీలను అమలు చేయబోమని చంద్రబాబు సర్కార్ తెగేసి చెప్పిందన్నమాట! హామీల అమలుకు ఇంటింటా గ్యారంటీ బాండ్లు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా మోసం చేయడం దేశంలో ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో రెండో మూడో అమలు చేయకపోవడం సాధారణం. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సింహభాగం తుంగలో తొక్కడం ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంటున్నారు.సామూహికంగా వెన్నుపోటు..సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ప్రతి ఇంటికీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో సర్వత్రా మండిపడుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లను పరిశీలించి సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ఆ బాండు ప్రకారం తమ ఇంటికి ఏడాదిలో రావాల్సిన మొత్తాన్ని లెక్కించి.. వడ్డీతో సహా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టింది రూ.21,600 కోట్లుసూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగ భృతి మాటే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా హామీ ప్రకారం ఏడాదికి మొత్తం రూ.7,200 కోట్లు చెల్లించాలి. మూడు బడ్జెట్లలోనూ పైసా ఇవ్వకుండా నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు మొత్తం రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు.ఆడబిడ్డలకు రూ.97,200 కోట్ల ఎగనామం!సూపర్ సిక్స్ హామీల్లో మరో ప్రధాన హామీ ఆడబిడ్డ నిధి పథకం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది ఉంటారు. వీరికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకానికి ఏటా రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. మూడు బడ్జెట్లలోనూ ఒక్క పైసా కేటాయించలేదు. 2026–27 బడ్జెట్లోనూ కనీసం ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు చంద్రబాబు ఇప్పటికే రూ.97,200 కోట్లు ఎగ్గొట్టారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు బురిడీ!50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఈ పథకానికి ఒక్క పైసా ఇవ్వకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చంద్రబాబు రూ.28,800 కోట్ల మేర ఎగ్గొట్టారు.సున్నా వడ్డీకి సున్నా.. సున్నా వడ్డీ పథకం కింద స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఒక్కో సంఘానికి రూ.పది లక్షలు.. ఒక్కో రైతుకైతే రూ.3 లక్షలు చొప్పున రుణాలు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు గతంలో ఏటా సున్నా వడ్డీ కింద లబ్ధి పొందారు. పొదుపు మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింప చేయాలంటే ఏడాదికి రూ.5 వేల కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించాలి. మూడు బడ్జెట్లలో నిధులు కేటాయించకుండా మహిళలకు చంద్రబాబు రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు! ఇక సున్నా వడ్డీ కింద ఒక్కో రైతుకు రూ.3 లక్షల రుణాన్ని ఇవ్వాలంటే ఏడాదికి కనీసం రూ.వెయ్యి కోట్లు అవసరం. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిధులు కేటాయించకుండా రైతులకు రూ.3 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు. మొత్తంగా సున్నా వడ్డీ పథకానికి సున్నా చుట్టి మహిళలు, రైతులకు రూ.18 వేల కోట్ల మేర చంద్రబాబు ఎగనామం పెట్టారు!ఉద్యోగుల బకాయిలు రూ.40 వేల కోట్లు!తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్, మెరుగైన పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంతవరకూ ఐఆర్ ప్రకటించకపోగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ను రద్దు చేశారు. కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరుకున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.తల్లులకు బాబు వంచన..తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. ఇక ఇప్పుడు బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్లను ఎగ్గొట్టారు!రైతులకు వెన్నుపోటు..పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు రెండేళ్లలో రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు. తాజా బడ్జెట్లోనూ (2026–27) అరకొరగా కేటాయింపులు చేసి రైతులకు మొత్తంగా మూడేళ్లలో దాదాపు రూ.21 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు.బడ్జెట్ సాక్షిగా సూపర్ సిక్స్లు ఔట్..!ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, పొదుపు మహిళలు, రైతులకు సున్నా వడ్డీ పథకాలకు పైసా కూడా కేటాయింపులు చేయకుండా బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టారు. ఎన్నికల హామీ మేరకు ఈ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు రూ.1.62 లక్షల కోట్లకుపైగా మహిళలు, నిరుద్యోగులు, రైతులకు ఎగ్గొట్టారు. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, ఉచిత బస్సు పథకాలకు అరకొరగా విదిలించి, తగినన్ని నిధులు ఇవ్వకుండా దాదాపు మరో రూ.60 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు. ఇలా ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా మూడేళ్లలో సుమారు రూ.2.22 లక్షల కోట్ల మేర అన్ని వర్గాలకు చంద్రబాబు ఎగ్గొట్టారు. -
బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు
-
అంబటి రాంబాబు కుమార్తె మౌనికతో స్ట్రయిట్ టాక్
-
కూటమి ప్రభుత్వానికి మోసపూరిత బడ్జెట్: మల్లాది విష్ణు
-
చంద్రబాబు సర్కార్ బడ్జెట్ ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది: సీపీఎం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలిపిస్తోందంటూ సీపీఎం ఎద్దేవా చేసింది. కూటమి బడ్జెట్ను నిరసిస్తూ.. విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది. నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు , పరిశ్రమలు వచ్చినట్లు, యువతకు ఉపాధి కల్పించేసినట్లు చెబుతున్నారు. దేశం మొత్తంలో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చేశాయని చెబుతున్నారు ..కానీ బడ్జెట్ అందుకు విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు.‘‘కోతల మీద వాతలు పెట్టినట్లే ఉంది ఈ బడ్జెట్. రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. గత రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని తేలిపోయింది. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు. కౌలు రైతుల గురించి కనీసం ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ..ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు.. అదీ లేదు...సూపర్ సిక్స్లో భాగమైనవి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామంటున్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. బెజవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల మయం. విజయవాడే ఇలా ఉంటి మిగిలిన పట్టణాల సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి ప్రజల తిరోగమనానికి కారణమైన బడ్జెట్ ఇది’’ అంటూ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్ చంద్రబాబు మోసాలకు...
-
ఇది మోసపూరిత బడ్జెట్: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే ప్రజలకు నిరాశ, నిస్పృహ కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బడ్జెట్ మోసపూరిత బడ్జెట్.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు లేవు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు...నాడు-నేడు స్కీమ్ను సమాధి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైఎస్సార్, జగన్కు పేరొస్తుందని భయం. ఆరోగ్యశ్రీని రద్దు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే రోజుల్లో లక్ష కోట్లు అప్పులు చేస్తామని చెబుతున్నారు...బడ్జెట్లో మహిళా సాధికారత వెతికినా కనిపించదు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి హామీలిచ్చారు. ఆడబిడ్డ నిధి అన్నారు ఏమైంది?. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు ఏమైంది?. జాబ్ క్యాలండర్ ఇస్తామన్నారు ఏమైపోయింది?. ప్రజలను మభ్యపెట్టి బడ్జెట్ రూపొందించారు. గత బడ్జెట్లో కేటాయింపులెంత?. ఎంత ఖర్చుచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వివిధ రంగాలకు చేయూతనివ్వాల్సింది పోయి దుబారా ఖర్చులు చేస్తున్నారు. హెలీకాప్టర్లకు, లూద్రా వంటి లాయర్లకు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. -
పర్ఫామెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్ ... ఏందయ్యా ఈ లెక్కలు..
-
చంద్రబాబు మోసాలకు అద్దంపట్టే బడ్జెట్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్లు ప్రజా ఆమోదయోగ్యమైనవని.. కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం సంక్షేమం ఎక్కడా ఆగలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణంగా ఉందని.. ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కేటాయింపు లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు సైతం అంతంతమాత్రమే కేటాయింపులు జరిపారన్నారు.‘‘అన్నదాత సుఖీభవ పథకానికి 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో వున్నాయి. రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్. ఉద్యోగులను, కార్మికులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేశాడు. అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన బడ్జెట్గా చూడాలి. చంద్రబాబు మోసాలకు అద్దం పట్టే బడ్జెట్’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
హెరిటేజ్ కోసమే లడ్డూపై కుట్ర చివరికి పాపం పండింది
-
బడ్జెట్ ప్రసంగంలో అసత్యాలు చెప్పారు: బుగ్గన
-
జండర్ బడ్జెట్ తుస్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం జండర్ (లింగ ఆధారిత) బడ్జెట్ కేటాయింపుల్లోనూ దగా చేసింది. మహిళల సాధికారతకు దోహదం చేసే పటిష్టమైన పథకాలు, కార్యక్రమాల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. ప్రధానంగా ఎన్నికల హామీల అమలులో చిత్తశుద్ధి కొరవడిందని జండర్ బడ్జెట్తో తేలిపోయింది. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టకుండానే అంకెల్లో గారడీ చేసి మభ్యపెట్టారు. నూరు శాతం మహిళలు, బాలికలు లబ్ధి పొందే పథకాలకు (పార్ట్ – ఏ) రూ.19,496.47 కోట్లు కేటాయించగా, 30 నుంచి 99 శాతం వరకు మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.71,363.07 కోట్లు కేటాయించారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ల పంపిణీని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అమలును మాత్రం పట్టించుకోలేదు. బాలికల విద్య, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, పోషణ పథకాలు, గర్భిణులకు ఆర్థిక సహాయం వంటి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడి కేటాయింపులు జరపడం గమనార్హం. డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ, గ్రామీణ మహిళల స్వయం ఉపాధి ప్రోత్సాహం, మహిళా రైతులకు ప్రత్యేక పథకాలు, స్వయం సహాయక సంఘాలకు కేటాయింపులు సైతం నామమాత్రమే. మహిళల సాధికారత, లింగ సమానత్వం, భద్రత, ఆరోగ్యం, ఉపాధి లక్ష్యాలుగా జండర్ బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్టు గొప్పలు చెప్పుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు అనుగుణంగా లేదన్నది స్పష్టమవుతోంది. నామమాత్రంగానే పిల్లల బడ్జెట్.. రాష్ట్రంలో బాలల కేంద్రీకృత విధానాలు, వారి భరోసా కోసం ఉద్దేశించిన పథకాలకు (ఛైల్డ్) బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. నూరు శాతం పిల్లలే లబ్దిదారులుగా అమలు చేసే కార్యక్రమాలకు రూ.16,168.33 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్తో పోల్చితే కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే అధికం. మరోవైపు 30 నుంచి 99 శాతం వరకు పిల్లలే లబ్ధి పొందే కార్యక్రమాలకు ఈ ఏడాది రూ.8,517.34 కోట్లు కేటాయించారు. వీటిలోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులపైనే ఆధారపడడం గమనార్హం. బాలల్లో పోషకాహార లోపం, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, స్కూల్ డ్రాపౌట్స్, బాల్య వివాహాలు, లింగ వివక్ష నిర్మూలనకు చైల్డ్ బడ్జెట్లో దృష్టి సారించలేదు. జండర్ బడ్జెట్కు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ జగన్దే వాస్తవానికి జండర్ బడ్జెట్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2021 – 22 నుంచి ప్రారంభించింది. ప్రత్యేకంగా మహిళల కోసం జండర్ బడ్జెట్ పెట్టి వారిని ఆర్థిక, రాజకీయ, సామాజికంగా సాధికారతవైపు నడిపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. రాష్ట్రంలో కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకుని మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా బడ్జెట్కు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపుల తరహాలో మహిళలు, బాలికల (జండర్ బేస్డ్) బడ్జెట్కు ప్రత్యేకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం. మహిళలు, బాలికల ఆరోగ్యం, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, రక్షణ, సామాజిక భద్రత వంటి కీలక రంగాల్లో ప్రాధాన్యమిచ్చేలా జండర్ బడ్జెట్ రూపొందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ దార్శనికతతో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 90 శాతం మహిళలకు సంక్షేమ ఫలాలు అందాయి. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), పరోక్ష లబ్ధి (నాన్ డీబీటీ) పద్ధతిలో రాష్ట్రంలోని దాదాపు 31 పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన వైఎస్ జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమని వారు గుర్తు చేసుకుంటున్నారు. -
విద్యుత్ వెలుగుల్లేవు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగానికి మరోసారి మొండిచేయి చూపించింది. అధికారంలోకి వచి్చన తరువాత 18 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై రూ.20,135.50 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపి వసూలు చేస్తున్న చంద్రబాబు ఇంధన రంగానికి బడ్జెట్లో కేవలం రూ.13,934 కోట్లు మాత్రమే కేటాయించారు. అదికూడా వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్, వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీల కోసం. కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా బడ్జెట్లో ఇవ్వలేకపోయారు. ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారమని, ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రతని, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, విద్య, ఆరోగ్యం ఇలా ప్రతి రంగం అభివృద్ధి విద్యుత్పై ఆధారపడి ఉందని చెప్పిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విద్యుత్ రంగం అప్పులు తీర్చడానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో విదల్చలేదు. గత ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) అస్తవ్యస్తంగా రద్దుచేయడం వల్ల అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని కేశవ్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ట్రూ–అప్ చార్జీల రూపంలో ప్రజలపై భారం పడిందని మంత్రి అంగీకరించారు. నిజానికి గత టీడీపీ పాలనతో జరిగిన అనవసర, అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల కారణంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రూ.2,600 కోట్లు తక్కువే.. ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా రూ.11 వేలకోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చామని, అలాగే ఆక్వాటారిఫ్ సబ్సిడీగా రూ.890 కోట్లు విడుదల చేసి 48,500 మంది ఆక్వా వినియోగదారులకు మద్దతు ఇచ్చామని, బీపీఎల్ వృత్తిదారులకు సబ్సిడీ టారిఫ్లు కొనసాగిస్తున్నామని ఆర్థికమంత్రి చెప్పారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,600 కోట్లు కేటాయించారు. కానీ మంత్రి చెప్పినదాని ప్రకారం చూస్తే రూ.2,600 కోట్లు తక్కువే వెచ్చించారు. అంటే ఆ మేరకు అర్హులకు ఉచిత, రాయితీ విద్యుత్ను దూరం చేశారు. ఇక సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం కింద 2024 జూన్ నుంచి రూ.2.88 లక్షలకోట్ల విలువైన 55 ప్రాజెక్టులను మంజూరు చేశామని మంత్రి చెప్పారు. ఇందులో 15.56 గిగావాట్ల సౌరశక్తి, 4.86 గిగావాట్ల వాయుశక్తి, 17.7 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, 1 ఎంఎంఏటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులున్నాయని తెలిపారు. అడిగింది ఎంత.. ఇచ్చింది ఎంత? వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలకు, ఆర్థికమంత్రి చెప్పిన లెక్కలకు పొంతన లేదు. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ 31 నాటికి ఈ పథకానికి రూ.13,241.17 కోట్ల సబ్సిడీ వ్యయం జరిగిందని చెప్పారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 వేలకోట్లు ఖర్చుచేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ ఇద్దరు మంత్రులు చెప్పినదాని ప్రకారం చూస్తే ఆ మేరకు నిధులు ఖర్చు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే 2026–27లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అవసరాలకే రూ.13,722 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి వెల్లడించారు. కానీ ప్రభుత్వం మొత్తం ఇంధన రంగానికి బడ్జెట్లో రూ.13,934 కోట్లు కేటాయించింది. -
నీటిపై రాతలు.. నీటి మూటలు!
సాక్షి, అమరావతి : సాగు నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సర్కార్ చెబుతున్న మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతనే ఉండదన్నది మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాదే వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల తొలి దశ, వంశధార స్టేజ్–2 ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని.. హంద్రీ–నీవా ఆయకట్టులో ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ముందే అంటే 2027 జూన్ నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించడాన్ని మాత్రం విస్మరించారు. దీన్ని బట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చంద్రబాబు సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖకు 2024–25 బడ్జెట్లో 16,705.32 కోట్లు కేటాయించి.. రూ.11,197.17 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. తొలి ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే రూ.5,508.15 కోట్లను తక్కువగా ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్లో రూ.18,019.66 కోట్లు కేటాయించి, తర్వాత రూ.14,751.67 కోట్లకు సవరించారు. అంటే.. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో రూ.3,267.99 కోట్లను కోత వేసినట్లు స్పష్టమవుతోంది. సవరించిన కేటాయింపుల్లో ఏమాత్రం ఖర్చు చేశారన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత (2026–27) బడ్జెట్లో జల వనరుల శాఖకు రూ.18,223.67 కోట్లు కేటాయించారు.ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.17,352.91 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.870.76 కోట్లు కేటాయించారు. 2024–25, 2025–26 బడ్జెట్లలో కేటాయింపులు, చేసిన వ్యయాన్ని బట్టి చూస్తే.. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన మేరకు సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అంతా అంకెల గారడీయే.. చిత్తశుద్ధి ఏదీ? » పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ.. 2024–25లో కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5,052.71 కోట్లను సది్వనియోగం చేసుకుని పోలవరం పనులను పరుగులెత్తించడంలో సర్కార్ విఫలమైంది. ఆ నిధులకు సంబంధించిన యూసీలను పంపక పోవడంతో 2025–26 బడ్జెట్లో పోలవరానికి కేటాయించిన రూ.5,936 కోట్లలో కేంద్రం కోత వేసి రూ.3,017.20 కోట్లను మాత్రమే కేటాయిస్తూ సవరించింది. » ఆ నిధులను ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 45 రోజుల సమయం మాత్రమే మిగిలింది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.3,745.95 కోట్లను ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. » 2026–27 బడ్జెట్లో పోలవరానికి కేంద్రం రూ.3,320.39 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వాటిని రూ.5,139.35 కోట్లుగా చూపడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పోలవరానికి నిధుల కేటాయింపులో అంకెల గారడీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఆ ప్రాజెక్టులో గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల (194.6 టీఎంసీల నిల్వ)తో కాకుండా 41.15 మీటర్ల (119.4 టీఎంసీలు) ఎత్తుతోనే నిల్వ చేసేలా పూర్తి చేస్తామని కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే.. దాన్ని చంద్రబాబు సర్కార్ ఆమోదించడం గమనార్హం. » తద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేయడమే కాదు.. ఆ ప్రాజెక్టును కేంద్రం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించక పోవడంపై సాగు నీటి రంగ నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రపై శీత కన్ను » వెనుకబడిన ఉత్తరాంధ్రపై చంద్రబాబు సర్కార్ యధా ప్రకారం శీత కన్ను వేసింది. వంశధార స్టేజ్–2 ప్రాజెక్టే కాదు.. మహేంద్ర తనయ, తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టులను పూర్తి చేసేలా నిధులను కేటాయించలేదు. తోటపల్లి ప్రాజెక్టు, మడ్డువలస, జంఝావతి ప్రాజెక్టుల కింద మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించడానికి అవసరమైన పనులు చేపట్టేందుకు సరిపడా నిధులు కేటాయించలేదు. వాటికి కేటాయించిన అరకొర నిధులు కూడా కాడ్వామ్, స్పర్శ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తాయని చెప్పి చేతులు దులిపేసుకుంది. » ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.605.75 కోట్లు కేటాయించి, వాటిని రూ.99.66 కోట్లకు సవరించింది. కానీ.. ఆ కాస్త నిధులను కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఈ బడ్జెట్లోనూ గత బడ్జెట్లో కేటాయించినట్లే రూ.605.75 కోట్లే ఆ ప్రాజెక్టుకు కేటాయించడం గమనార్హం. దీన్ని బట్టి ఆ ప్రాజెక్టుకు ఈ ఏడాదీ నిధులను ఖర్చు చేసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. కాగితాల్లోనే ప్రాధాన్యత» ప్రాధాన్యత క్రమంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని.. ఈ ఏడాది వెలిగొండ, చింతలపూడి తొలి దశ, వంశధార స్టేజ్–2, హంద్రీ–నీవాను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. » వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.992 కోట్లు, ఫీడర్ ఛానల్ లైనింగ్ పనులకు రూ.456 కోట్లు (మొత్తం రూ.1,448) అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు కేవలం రూ.492.90 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. » తద్వారా ఈ ఏడాది జూన్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు నీటి విడుదల జరగదని స్పష్టమవుతోంది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయాలనే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన టన్నెళ్ల పనులను 2023 నాటికే వైఎస్ జగన్ సర్కార్ పూర్తి చేసింది. 2024 జూన్లోగా నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2024 ఆగస్టులో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టు ద్వారా దుర్భిక్ష ప్రాంతాలకు అందించడానికి ప్రణాళిక రూపొందించింది. కానీ.. వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితో ఆ ప్రణాళికను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కి, వెలిగొండ ఆయకట్టు రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని సాగు నీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. » ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జలయజ్ఞంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. కానీ.. 2016లో ఎలాంటి పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోకుండానే ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచి.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా చంద్రబాబు సర్కార్ పనులు చేపట్టింది. పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన చింతలపూడి పనులను ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. రూ.73.63 కోట్లు జరిమానా విధించింది. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో పర్యావరణ అనుమతి తీసుకుని చింతలపూడి పనులు ప్రారంభించవచ్చు. కానీ.. ఇప్పటిదాకా పర్యావరణ అనుమతిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించకపోవడం గమనార్హం. ఈ ఎత్తిపోతలకు కేటాయించిన రూ.430 కోట్లు తొలి దశ పనులు పూర్తి చేయడానికి ఏమూలకు సరిపోవు. పర్యావరణ అనుమతి వచ్చేదెన్నడు.. ఎత్తిపోతల పూర్తయ్యేదెన్నడు?.. తొలి దశ కింద రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేదెన్నడు? అని రైతాంగం ప్రశ్నిస్తోంది. » వంశధార స్టేజ్–2 పనులను జలయజ్ఞంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. వెనుకబడి ఉత్తరాంధ్రలో 2.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులు పూర్తయ్యాయి. కాట్రగడ్డ సైడ్ వియర్తో ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందవు. వంశధార ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ ససేమిరా అంటోంది. ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉండటంతో వంశధార ట్రిబ్యునల్ అవార్డును కేంద్రం ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి హీరమండలం రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేలా హీర మండలం ఎత్తిపోతలను 2023లో వైఎస్ జగన్ చేపట్టారు. అప్పట్లోనే సింహభాగం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ 20 నెలలుగా విఫలమైంది. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182.52 కోట్లు కేటాయించి.. ఆ తర్వాత రూ.వంద కోట్లకు సవరించింది. వాటిని కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుత బడ్జెట్లో 182.14 కోట్లు కేటాయించింది. వాటిని ఏమాత్రం ఖర్చు చేస్తుందన్నది వేచి చూడాల్సిందే. » హంద్రీ–నీవాకు ప్రస్తుత బడ్జెట్లో రూ.2,621.70 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు విద్యుత్ చార్జీలకు కేటాయించారు. అంటే.. పనులు, భూ సేకరణకు కేటాయించింది రూ.1,721.7 కోట్లే. హంద్రీ–నీవాలో అంతర్భాగంగా జీడిపల్లి–భైరవానితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాంకు నీటిని తరలించేలా ఎత్తిపోతలకు ఎన్ని నిధులు ఇస్తారు.. 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువలు) పనులకు ఏమాత్రం నిధులు కేటాయిస్తారు.. అన్నది స్పష్టంగా లేదు. దీన్ని బట్టి, ఆయకట్టుకు నీళ్లందించడంపై ఈ సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోంది. రాయలసీమను హార్టి కల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు రూ.300 కోట్ల విదేశీ రుణంతో ప్రాజెక్టులను చేపడతామని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. అయితే ఆ రుణం ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి తెస్తుందన్నది స్పష్టత లేదు. -
గుట్టుగా గ్యారెంటీ అప్పులు!
సాక్షి, అమరావతి: అప్పులపై వాస్తవాలను చంద్రబాబు సర్కారు మరోసారి కప్పిపుచ్చింది. కూటమి సర్కారు గ్యారెంటీతో చేసిన అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో చూపకుండా దాచేసింది. ఇలా అసంపూర్తి లెక్కలతో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఇవ్వడం చంద్రబాబు సర్కారుకు ఇది రెండోసారి కావడం గమనార్హం. గత బడ్జెట్లోనూ ఐదేళ్ల అప్పుల వివరాలు ఇవ్వకుండా ఎగరగొట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో కేవలం బడ్జెట్ అప్పులను మాత్రమే చంద్రబాబు సర్కారు పేర్కొంది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. ఓపెన్ మార్కెట్, కేంద్రం ఇచ్చినవి, చిన్న మొత్తాలతో పాటు ప్రభుత్వ గ్యారెంటీ అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో వెల్లడించడం సర్వ సాధారణం. అయితే చంద్రబాబు సర్కారు గ్యారెంటీ అప్పులు, చిన్న మొత్తాలు తదితరాల అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో చూపకుండా దాచి పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం.. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడమే. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో రంగాల వారీగా ఆదాయ వివరాలు, వ్యయాలను చూపిస్తారు. ఈసారి వాటిని కూడా కూటమి సర్కారు ఎగరగొట్టింది. దాని స్థానంలో ప్రజా రుణం జీఎస్డీపీలో శాతం పేరుతో గ్రాఫిక్స్తో సరిపుచ్చింది. అప్పుల లెక్కలపై వాస్తవాలు బయట పడతాయనే భయంతోనే ఇలా చేసినట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అప్పులపై కూడా తప్పుడు గణాంకాలతో చంద్రబాబు సర్కారు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3వతేదీ నాటికే బడ్జెట్ అప్పులు రూ.97,456 కోట్లు కాగా.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2025–26 అప్పులు రూ.79,456 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. మరో పక్క బడ్జెట్ను పూర్తిగా అమలు చేయలేక చంద్రబాబు సర్కారు చతికిల పడింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్ సవరించిన అంచనాల్లో భారీగా కోత పెట్టారు. 2025–26 బడ్జెట్ను రూ.3,22,359 కోట్లుగా ప్రతిపాదించగా ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ.3,00,534 కోట్లకు కుదించారు. అంటే ఏకంగా రూ.21,825 కోట్లు కోత విధించారు. » ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.14,182 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.13,081 కోట్లకు తగ్గించారు. గ్రామీణాభివృద్ధి రంగానికి రూ.18,890 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.15,244 కోట్లకు కుదించారు. సాధారణ విద్యకు రూ.34,825 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.32,694 కోట్లకు తగ్గించారు. ఆరోగ్య రంగానికి రూ.19,264 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.17,637 కోట్లకు తగ్గించారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్లో రూ.13,862 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.11,252 కోట్లకు తగ్గించారు. ఇలా తగ్గించిన గణాంకాలతో, 2026–27లో అధికంగా కేటాయింపులు చేశామంటూ బాబు సర్కారు జబ్బలు చరుచుకోవడం గమనార్హం. » మూలధన వ్యయంపై కూడా తప్పుడు గణాంకాలతో సవరణ అంచనాలను ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2025–26లో మూలధన వ్యయం రూ.40,635 కోట్లు ఉండగా సవరించిన అంచనాల్లో రూ.33,134 కోట్లుగా పేర్కొన్నారు. అయితే కాగ్ గణాంకాల మేరకు వాస్తవ మూలధన వ్యయం డిసెంబర్ నాటికి కేవలం రూ.19,224 కోట్లే. మూడు నెలల్లో ఏకంగా మరో రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేస్తామనడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. » కూటమి సర్కారు పాలనలో జీఎస్డీపీలో బడ్జెట్ అప్పులు 35 నుంచి 36 శాతానికి పెరిగాయి. జీఎస్డీపీలో అప్పులు 2023–24లో 35 శాతం ఉండగా చంద్రబాబు ప్రభుత్వం వచి్చన నాటి నుంచి మూడు బడ్జెట్లలో జీఎస్డీపీలో అప్పులు 36 శాతానికి ఎగబాకాయి. » 2023–24 నాటికి బడ్జెట్ అప్పులు రూ.4.91 లక్షల కోట్లు ఉండగా 2026–27 మార్చి నాటికి ఏకంగా రూ.7.11 లక్షల కోట్లకు పెరగనున్నాయి. అంటే వచ్చే మార్చి నాటికి కూటమి సర్కారు బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.2.20 లక్షల కోట్లు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. » ఇక బడ్జెట్ బయట అప్పులకు కూటమి సర్కారు భారీగా గ్యారెంటీలు ఇచ్చింది. బడ్జెట్ డాక్యుమెంట్ వాల్యూమ్ 5 ప్రకారం వివిధ సంస్థల ద్వారా 2025 డిసెంబర్ నాటికి రూ.3.11 లక్షల కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో పౌరసరఫరాల సంస్థ, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జెన్కో తదితర సంస్థలున్నాయి. బడ్జెట్ బయట అప్పులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆధారపడుతోందని దీన్నిబట్టి స్పష్టం అవుతోంది. -
ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిల ఊసేది?
సాక్షి, అమరావతి: మాయమాటలతో ఊరడించడం తప్ప ఉద్యోగులకు వాస్తవంలో చేసేదేమీ లేదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల సమస్యల ప్రస్తావనే లేకపోవడాన్ని బట్టి వారి ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ఎన్నికల్లో తమకు ఇచ్చి న హామీల్లో ఒక్కదానినైనా నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు నిత్యం చేస్తున్న విజ్ఞాపనలను సైతం ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరిపోయినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో అందిన 11 డీఏలు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 11 డీఏలు ఇవ్వగా, చంద్రబాబు 2014–19 మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులను చిన్నచూపు చూస్తారనడానికి ఇదే ఉదాహరణని చెబుతున్నారు. మరోవైపు ‘జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ’ అనే కారణంతో గ్రామ స్థాయిలో తలలో నాలుకలా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు హీనాతిహీనంగా చూస్తూ బానిసలుగా మార్చివేయడం వారిని కలచివేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా అసలు ఉద్యోగులను భయపెట్టి, బెదిరించేలా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గారడీ ప్రకటనలు.. » గత సంక్రాంతికి ఒక డీఏ ఇచ్చినట్లు ప్రకటించినా, అందులోనూ ప్రభుత్వం గారడీ చేసింది. వేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ.1,100 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా అందరు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. » ఏడాది క్రితం పోలీసులకు ఇస్తానన్న రెండు సరెండర్ లీవులను విడతల వారీగా ఇస్తామన్నా, అది కూడా సరిగా ఇవ్వలేదు. » ఎన్నికల్లో చెప్పిన మేరకు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వడానికి కూటమి ముందుకు రావడం లేదు. » డీఏ ఇచ్చేందుకు నిరాకరించడం, 12వ పీఆర్సీ నియమించేందుకే ముందుకు రాకపోవడాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి తమను పట్టించుకునే ఆలోచన లేదని వారు వాపోతున్నారు. » తాజా బడ్జెట్ను చూస్తే ఉద్యోగులకు ఈ ఏడాది కూడా ఇచ్చేది ఏమీ ఉండదని తేలింది. -
తల్లికి 'వంచన'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల తల్లులను చంద్రబాబు సర్కారు మరోసారి మోసం చేసింది. బడ్జెట్లో ‘తల్లికి వందనం’ అంటూనే వారిని వంచన చేస్తూ అంకెల గారడీని ప్రదర్శించింది. ఎన్నికల్లో అధికారం కోసం అడ్డగోలుగా అబద్ధపు హామీలిచ్చిన చంద్రబాబు ఇలా ఏటా బడ్జెట్లో మోసాన్ని పునరావృతం చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతుంటే కేవలం 67.27 లక్షల మందికి మాత్రమే ‘తల్లికి వందనం’ అమలుచేసి నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారు. మరోవైపు శనివారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలోనూ ‘తల్లికి వంచన’ ప్రస్ఫుటంగా బయటపడింది. 2026–27 బడ్జెట్లోనూ ఎంతమంది పిల్లలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారో చెప్పకుండా రూ.9,668 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే.. మంత్రి ప్రకటనకు, బడ్జెట్లో కేటాయింపులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి రూ.9,668 కోట్లు పలికితే.. బడ్జెట్ ప్రతుల్లో రూ.8,457.07 కోట్లని పేర్కొన్నారు. మళ్లీ కొందరికే ‘వందనం’.. తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కారు కాకిలెక్కలు చెబుతోంది. ఎన్నికలప్పుడు అధికారమే పరమావధిగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచి్చన తొలి ఏడాది ముఖం చాటేశారు. 2024–25లో రూ.5,387 కోట్లు కేటాయిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ఇచ్చింది మాత్రం కేవలం రూ.6,377 కోట్లే. అంటే.. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు చొప్పున మాత్రమే ఇష్టానుసారం ఖాతాల్లో వేసి మమ అనిపించింది. ఈ అరకొర సొమ్మును కూడా దాదాపు 21 లక్షల మందికి ఎగ్గొట్టింది. ఇప్పుడు కూడా మళ్లీ పాత సీన్నే పునరావృతం చేస్తూ తాజా బడ్జెట్లో రూ.9,668 కోట్లను కేటాయించింది. వాస్తవ వ్యయానికి దూరంగా.. నిజానికి.. 87.41 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలంటే రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు సర్కారు ఎప్పటిలాగే అరకొరగా కేటాయించడం చూస్తుంటే ఈసారి కూడా తల్లులకు వంచన తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ను ఉన్నది ఉన్నట్లు అమలుచేస్తే 65 లక్షల మంది పిల్లలకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన విద్యార్థులకు కోత ఖాయం. ఇప్పటికే చంద్రబాబు తొలి ఏడాది తల్లికి వందనం పథకం ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. రెండో ఏడాది అరకొరగా పంపిణీ చేశారు. ఇక ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన మేరకు పూర్తిస్థాయిలో ఇచ్చినా రూ.3,444.82 కోట్లు ఎగ్గొట్టినట్లు అవుతుంది. మొత్తం మీద మూడేళ్లకు కలిపి రూ.24,504.39 కోట్లు తల్లికి వందనం రూపంలో తల్లులకు ఎగ్గొట్టారు. పాఠశాల విద్యకు వ్యయంలోనూ వెనకడుగే.. 2026–27 బడ్జెట్లో పాఠశాల విద్యా రంగానికి కూటమి ప్రభుత్వం రూ.32,308.31 కోట్లు కేటాయించింది. ఇవన్నీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతాయి. అయితే, 2025–26 బడ్జెట్లో రూ.31,805.65 కోట్లు ప్రతిపాదించగా... సవరించిన అంచనా తర్వాత ఖర్చు దగ్గరకు వచ్చేసరికి ఆ మొత్తం రూ.30,175.13 కోట్లకు తగ్గిపోయింది. అంటే.. పాఠశాల విద్యకు కేటాయింపులే తక్కువ అనుకుంటే ఈ ప్రభుత్వం అందులో చేస్తున్న ఖర్చు ఇంకా తక్కువగా ఉండటం విస్తుగొలుపుతోంది.‘మనబడి–మన భవిష్యత్తు’ గాలికి.. ‘నాడు–నేడు’ వంటి బృహత్తర కార్యక్రమంతో గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. రెండు విడతల్లో దాదాపు రూ.8 వేల కోట్ల బడ్జెట్తో 23 వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీలను అత్యాధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. గత ప్రభుత్వంలోనే రూ.4 వేల కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తవ్వాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అక్కసుతో ఆ పథకం పేరును ‘మనబడి–మన భవిష్యత్తు’గా మార్చింది తప్ప పైసా ఖర్చు చేయలేదు. 2024–25 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది గానీ ఆ డబ్బులతో ఒక్క ఇటుక కూడా వేయలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లో రూ.1,500 కోట్లు చూపించినా ఆ తర్వాత దానిని రూ.772 కోట్లకు కుదించింది. ఇప్పుడు మళ్లీ రూ.1,500 కోట్లు కేటాయించినా దానితో పాఠశాలల రూపరేఖలు పెద్దగా మారే పరిస్థితిలేదు. మరోవైపు.. గతంలో పూర్తయిన పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులే సుమారు రూ.1,200 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక ప్రభుత్వ బడులకు ‘స్టార్ రేటింగ్’ పేరుతో చంద్రబాబు హడావుడి చేయడం తప్ప అక్కడ మౌలిక వసతులు క్షీణిస్తున్నాయి. చంద్రబాబు తీసుకొచి్చన స్టార్ నిబంధనల ప్రకారం పాఠశాలలు ఉండాలంటే సుమారు రూ.12 వేల కోట్ల బడ్జెట్ అవసరమని తెలుస్తోంది. బడ్జెట్ తగ్గిపోతోంది.. ఇదిలా ఉంటే.. గత మూడు బడ్జెట్లు చూస్తే చంద్రబాబు పాలనలో పాఠశాల విద్య కేటాయింపులు కుచించికుపోతున్నాయి. 2024–25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లతో ఉంటే.. ఇందులో పాఠశాల విద్యకు రూ.29,909.31 (10.15 శాతం) నిధులు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం రూ.28,560.64 కోట్లే. అలాగే, 2025–26లో రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రకటించినా పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు (9.86 శాతం) కేటాయించారు. ఇక 2026–27కి వచ్చేసరికి 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో పాఠశాల విద్య వాటా రూ.32,308.31 (9.75 శాతం) కోట్లకు పరిమితమైంది. -
బడ్జెట్కు సుస్తీ ఆరోగ్యానికి అంతంతే
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించింది. 2025–26 బడ్జెట్లో రూ.19,264 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్టు చూపిన టీడీపీ కూటమి సర్కారు.. ఖర్చుల్లో రూ.1,626 కోట్ల మేర కోత పెట్టింది. ఈ విషయాన్ని సవరించిన గత ఏడాది బడ్జెట్ స్పష్టం చేసింది. 2026–27 బడ్జెట్లో రూ.20 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు అవసరమని వైద్య శాఖ ప్రతిపాదించగా.. ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.19,306 కోట్లు కేటాయిస్తున్నట్టు చూపింది. గత ఏడాది కేటాయించిన మొత్తంలో రూ.1,626 కోట్లు కోత పెట్టిన దృష్ట్యా.. ఈ ఏడాది బడ్జెట్లో మరింత ఎక్కువ మొత్తం కోత పెడతారనే భయాందోళన వ్యక్తమవుతోంది. మందుల కొనుగోళ్లకు రూ.820 కోట్లకు పైగా అవసరమని.. సర్జికల్స్కు రూ.320 కోట్లు కావాలని ప్రతిపాదించగా.. మందుల బడ్జెట్లో రూ.220 కోట్లు, సర్జికల్స్కు రూ.100 కోట్ల పైగానే కోత విధించి అరకొర నిధులనే విదిల్చింది. ఆసరా సాయానికి ‘సున్నా’ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆసరా సాయానికి ఈ బడ్జెట్లో కేటాయింపులే లేకుండా చేశారు. అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు కోలుకునే సమయంలో ఆరి్థకంగా చేదోడుగా నిలిచేలా ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే ఆరోగ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెడతామని ప్రకటించారు. అప్పుడే ఆరోగ్య ఆసరాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2024 నుంచే ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు ఆసరా చెల్లింపులను నిలిపివేశారు. ఈ పథకానికి 2025–26 బడ్జెట్లో కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో ఏకంగా కేటాయింపులే లేకుండా ఇకపై ఆసరా అమలు చేసే ఉద్దేశమే లేదని, తాను పేదల వ్యతిరేకినని మరోమారు చంద్రబాబు రుజువు చేసుకున్నారు. వాస్తవానికి ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పథకానికి ఉద్వాసన పలికి పేదలకు రెండేళ్లలో రూ.900 కోట్లకు పైగా సాయాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల చొప్పున ఆసరా సాయం అందించాల్సి ఉంది. ఇప్పుడు ఆసరాతో పాటు ఆరోగ్యశ్రీకి కూడా చంద్ర గ్రహణం పట్టుకుంది. గతంలో రోగి/బంధువు ఖాతాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో ఆసరా సాయాన్ని జమ చేసేవారు. ఇలా 2019–24 మధ్య వైఎస్ జగన్ పాలన ఐదేళ్లలో 24,59,090 మందికి రూ.1,465.67 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు. కానీ బీమా రాగం అందుకున్న బాబు నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. ఆరోగ్యశ్రీ చికిత్స అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పడింది. బకాయిలను చెల్లించేలా బడ్జెట్లో అదనపు నిధులను కేటాయించకపోవడం గమనార్హం. కొత్త వైద్య కళాశాలల ఊసేదీ..? 2026–27 బడ్జెట్లో కొత్త వైద్య కళాశాలల ఊసే లేకుండా చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన 10 వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 4 కళాశాలలకు టెండర్లు పిలవగా సరైన స్పందన రాలేదు. కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టాలన్న ప్రభుత్వ కుట్రలతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1,450 చొప్పున రెండేళ్లలో 2450 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో 10 వైద్య కళాశాలల ప్రారంభంపై ఈ బడ్జెట్లోనైనా స్పష్టత వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. అయితే.. బడ్జెట్లో కొత్త వైద్య కళాశాలల ప్రస్తావనే లేకుండాపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.8,480 కోట్ల అంచనాలతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2024 ఎన్నికల నాటికి వైద్య కళాశాలల్లో రూ.3 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అప్పటికే కొన్ని కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈవెంట్లు, మంత్రులు, సీఎం విలాసాలు, ఇతర కార్యక్రమాలకు రూ.కోట్ల ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తున్న ప్రభుత్వం వైద్య కళాశాలలకు మాత్రం నిధులు లేవంటూ ప్రైవేట్కు కట్టబెడుతోంది. పేదలను వంచించడమే.. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి నిధులు 10 శాతానికి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం నిధులు తగ్గిస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో కేవలం 5.8 శాతం నిధులు మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయించారు. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందనడానికి ఈ కేటాయింపులే నిదర్శనం. వైద్య రంగానికి నిధులు తగ్గించడం పేద ప్రజలను వంచించడమే. – డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడఆరోగ్యశ్రీ బకాయిల మాటేమిటి?ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలే రూ.3 వేల కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయించడంపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఏపీ ఆశా) ఆందోళన వ్యక్తం చేసింది. తమ బకాయిలు చెల్లించడానికి ఎటువంటి నిర్దిష్ట, దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని శనివారం ఒక ప్రకటనలో మండిపడింది. దీనివల్ల రాష్ట్రంలోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని తెలిపింది. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఇటీవలే హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ప్రజలకు సేవలు అందించడం అసాధ్యమని పేర్కొంది. బకాయిలను దశల వారీగా, నిర్ణీత సమయంలో విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
'భృతి' లేదు.. గతి లేదు
దేశానికి ఆయువుపట్టు యువశక్తి. ఏపీలో ఉండే యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తా. పరిశ్రమలు తెస్తా. ఉద్యోగాలు ఇస్తా. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏదీ? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదీ?.. – మే 28, 2023న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడులో చంద్రబాబు దగాకోరు మాటలుటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తోంది. ముచ్చటగా మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పరిశ్రమలూ తేలేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ అడ్రస్సే లేదు. నోటిఫికేషన్లకు అసలే దిక్కులేదు. ‘‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను.’’ – 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేశ్ బీరాలుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు మరోసారి నిరుద్యోగ యువతను నిండా ముంచేసింది. ముచ్చటగా మూడో బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. ఎన్నికల సమయంలో అధికార పీఠం కోసం నిరుద్యోగ యువతను నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు నయ వంచనకు గురి చేశారు. ఆయువుపట్టుపై దెబ్బకొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్లోనూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ‘సూపర్ సిక్స్లో.. బాబుమార్క్’ దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడు వార్షిక బడ్జెట్లలోనూ నిరుద్యోగుల ఊసే లేకుండా చేశారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని అటకెక్కించేశారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు ఒక్కో నిరుద్యోగికి ఏడాదికి రూ.36 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా 20 లక్షల మందికి చూస్తే దాదాపు రెండేళ్లలో రూ.14,400 కోట్లు బకాయిపడింది. ఈ ఏడాది బడ్జెట్లో అసలు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో మరో రూ.7,200 కోట్ల చెల్లింపులకు ఎగనామం పెట్టింది. అంటే, చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది.ఇంకెంతకాలం ఈ మోసం బాబూ!2014 ఎన్నికల ముందు నిరుద్యోగులను బుట్టలో వేసుకుని రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకుపైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా.. పైసా కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను తొలుత 12 లక్షలు అని చెప్పి, చివరికి 2.10 లక్షల మందే అర్హులన్నారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, ఈ–కెవైసీ లింక్ పెట్టారు. చివరకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి బరితెగించి ఇవ్వను పొమ్మని నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. బాబు పాలనలో ఉద్యోగాల భర్తీ ఊసే లేదుబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై వివాదాలు సృష్టించడం, వాటిని అడ్డంపెట్టుకుని భర్తీ నిలిపివేయడం పరిపాటి. ఈసారీ అదే సూత్రాన్ని సర్కారు పాటిస్తోంది. గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. దాదాపు 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2024 డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇచ్చిన నోటఫికేషన్లలో 19 నోటిఫికేషన్ల ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇప్పటికే ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్లో పోస్టులు భర్తీ చేయకుండా, ఆయా శాఖల్లో కేడర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోకుండా 150 పోస్టులు, మరో 4,300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాల విప్లవం » వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల విప్లవం సృష్టించారు. » గ్రామ/వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు కొత్తగా కల్పించారు. 2.66 లక్షల వలంటీర్లను గత ప్రభుత్వంలో నియమించారు. » ఆప్కాస్ ద్వారా 96వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. » ఆర్టీసీ విలీనం ద్వారా 58వేల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశారు. » మొత్తం ఐదేళ్లలో 6,31,310 ఉద్యోగాలిచ్చారు. » చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారమే.. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1.02 లక్షల మందికి , ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. » గవర్నమెంట్, లార్డ్ అండ్ మెగా, ఎంఎంఎస్ఈ సెక్టార్లో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. -
పెట్టుబడి సాయం.. 'మాయాజాలం'!
ఇదీ హామీవైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 మాత్రమే ఇస్తోంది. ఇందులో రూ.6 వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తాం. – ఎన్నికల మేనిఫెస్టోలో, ఊరూరా చంద్రబాబు అండ్ కో ప్రచారంఆచరణలో వాస్తవంఅధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా రూ.20 వేలు ఎగ్గొట్టారు. రెండో ఏడాది కేంద్రం ఇచ్చే సాయంతో కలుపుకుని రూ.10 వేలు మాత్రమే అందించారు. అదీ కొంత మంది రైతులకే. కౌలు రైతులకైతే పైసా ఇవ్వలేదు. కానీ రైతులకు రూ.20 వేలు సాయం అందించామని బడ్జెట్ సాక్షిగా నిస్సిగ్గుగా ప్రచారం. మొత్తంగా రూ.30 వేలు బకాయి. సాక్షి, అమరావతి : తమకు అధికారం ఇస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి ఏడాది నుంచే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామంటూ ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు.. తీరా అందలం ఎక్కాక అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. తొలి ఏడాది నిస్సిగ్గుగా పెట్టుబడి సాయానికి పూర్తిగా ఎగనామం పెట్టిందేకాక, రెండో ఏడాది అరకొరగా విదిల్చారు. కనీసం 2026–27లో అయినా పూర్తిగా ఇస్తారనుకుంటే అదీ లేదు. ఈ బడ్జెట్లో కూడా ఈ పథకానికి అరకొర కేటాయింపులతోనే సరిపెట్టి అన్నదాత నోట్లో మట్టికొట్టారు. కౌలు రైతుల ఊసే ఎత్తలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన 53,58,366 మంది రైతుల వరకు లెక్కలోకి తీసుకున్నా.. ఏటా రూ.20 వేల చొప్పున తొలి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఈ లెక్కన రైతుల ఖాతాలకు రూ.21,433.46 కోట్లు జమ చేయాలి. తొలి ఏడాది (2024–25) బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించి, పైసా ఖర్చు చేయలేదు. నిస్సిగ్గుగా 53.58 లక్షల మందికి రూ.10,717 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది (2025–26) బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించి, రెండు విడతల్లో కలిపి రూ.10 వేల చొప్పున మాత్రమే 46,85,838 మంది రైతులకు రూ.4,685.54 కోట్లు జమ చేసి చేతులు దులుపుకున్నారు. అంటే దాదాపు 7 లక్షల మందికి ఎగనామం పెట్టారు. రూ.16,746 కోట్లు ఎగవేతపీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న సాయాన్ని తన ఖాతాలో వేసుకొని, రెండు విడతల్లో రూ.14 వేలు జమ చేశామని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అంటే రెండేళ్లలో రైతులకు ఎగ్గొట్టిన మొత్తం రూ.16,746 కోట్లు. పైగా అర్హుల్లోనే లక్షలాది మంది రైతులు ఇంకా తమకు జమ కాలేదంటూ అర్జీలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309.44 కోట్లు జమ చేసేశామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం విస్మయ పరుస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలోనైనా బకాయిలతో సహా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరుపుతారనుకుంటే ఈసారీ అరకొరగానే విదిల్చారు. సూపర్ సిక్స్ హామీ మేరకు చూస్తేæ వాస్తవానికి ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున 53.58 లక్షల మందికి ఏటా రూ.10,717 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.32,151 కోట్లు కేటాయింపులు జరపాలి. కానీ తొలి ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్లు, రెండో ఏడాది బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించగా.. రెండో ఏడాది జమ చేసిన రూ.4,685.84 కోట్లు మినహాయిస్తే అన్నదాతలకు చెల్లించాల్సిన పెట్టుబడి సాయం ఇంకా రూ.27,465 కోట్లకు పైమాటే. కానీ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే.కౌలు రైతుల ఊసెత్తని ప్రభుత్వంరాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా భూ యజమానులతో పాటు ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చింది. అయితే 2024–25లో భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది 2025–26లో రెండు విడతల్లో రూ.10 వేలు అదీ భూ యజమానులకు మాత్రమే జమ చేశారు. రెండో విడత సాయం ఇచ్చేటప్పుడు కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం అందిస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ పూర్తికాగానే నవంబర్లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా, ఒక్క విడత సాయం కూడా కౌలు రైతులకు జమ చేసిన పాపాన పోలేదు. జారీ చేసిన సీసీఆర్సీ కార్డుల ప్రకారం చూసుకున్నా 2024–25లో 9.13 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున.. మొత్తంగా రూ.40 వేలు పెట్టుబడి సాయం అందించాలి. అంటే రెండేళ్లలో కలిపి కౌలు రైతులకు రూ.3,474 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో చెల్లించాల్సింది కూడా కలుపుకుంటే రూ.6 వేల కోట్లకు పైమాటే. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా మంత్రి అచ్చెన్నాయుడు కౌలు రైతుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. -
బాబువన్నీ 'గ్యాస్' కబుర్లే
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల వేళ ఊదరగొట్టిన చంద్రబాబు ఆ హామీనీ మెల్లగా అటకెక్కించేస్తున్నారు. మహిళలకు కుచ్చుటోపీ పెట్టేందుకు టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తూ బడ్జెట్లో తూతూమంత్రంగా నిధులు కేటాయించారు. ఎన్నికలప్పుడు అక్కచెల్లె్లమ్మల ఓట్ల కోసం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి... అధికారంలోకి వచ్చాక వాటికి అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. లబ్దిదారులను ఏరిపారేస్తున్నారు. వాస్తవానికి ఏపీలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే సుమారు రూ.4,083 కోట్లు అవసరం. కానీ, చంద్రబాబు 2026–27 బడ్జెట్లో మాత్రం దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్కు కేటాయించింది కేవలం రూ.2601 కోట్లు మాత్రమే!. ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి 98 లక్షల సిలిండర్లు మాత్రమే ఉచితంగా అందించడానికి వీలుంటుంది. మిగిలిన 60 లక్షల కనెక్షన్లకు ఉచిత గ్యాస్ సిలిండర్లు లేనట్టే. గడిచిన ఏడాదిన్నర కాలంలో దీపం 2.0 పథకం కొందరి ఇళ్లకే పరిమితమై ‘గుడ్డి దీపం’గా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.6,183 కోట్లకు చంద్రబాబు ఎగనామం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్లో దీపం 2.0ను చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తొలి ఏడాది ఒక్కో సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చారు. ఇందుకు రూ.865 కోట్లు విడుదల చేశారు. మిగిలిన రెండు సిలిండర్లకు రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఆ తర్వాత ఏడాది (2025–26) మూడు సిలిండర్లకు రూ.2601 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక్కడ కూడా 1,482.48 కోట్లు ఎగ్గొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్లోనూ రూ.2601 కోట్లు కేటాయించడంతో వచ్చే ఆర్థి క సంవత్సరానికి కూడా 1,482.48 కోట్లు ఎగ్గొట్టారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రూ.6183 కోట్లు ఎగ్గొట్టి మహిళలకు టోకరా పెట్టారు. ప్రభుత్వ కేటాయింపులు సుమారు 90 లక్షల లబ్ధిదారులకే సరిపోగా... 60 లక్షలకుపైగా లబ్దిదారులకు మొండి చేయి చూపుతున్నారు. ఫలితంగా లక్షలాది మంది లబ్దిదారులు సబ్సిడీ కోసం గ్యాస్ ఏజెన్సీలు, గ్రామ–వార్డు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. -
శాంతిభద్రతలపై శీతకన్ను
సాక్షి, అమరావతి: రెడ్బుక్ అమలుకు పోలీసువ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి–భద్రతలపై శీతకన్ను వేసింది. మహిళల భద్రత, పోలీసుశాఖ ఆధునికీకరణ, డ్రగ్స్ మాఫియా కట్టడి వంటి అంశాలను గాలికివదిలేసింది. 2026–27 వార్షిక బడ్జెట్లోహోంశాఖకు కేవలం రూ.9,165 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో సింహభాగం పోలీసుశాఖ జీతభత్యాలు, సాధారణ నిర్వహణ ఖర్చులకే సరిపోనుంది. కేటాయింపుల్లో ప్రధానమైనవి ఇలా.. మహిళాభద్రత కోసం గత బడ్జెట్లో రూ.10.01 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.3.20 కోట్లే వెచ్చించింది. ఈ ఏడాది కేటాయింపు కేవలం రూ.3.20కోట్లు కావడం గమనార్హం. n రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ దందాను కట్టడి చేయడంపై ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. నార్కోటిక్స్ ఆపరేషన్లకు అవసరమైన వ్యవస్థ బలోపేతం కోసం గత బడ్జెట్లో రూ.61 కోట్లు కేటాయించి కేవలం రూ.22కోట్లే ఖర్చు చేసింది. » ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులే రూ.30 కోట్లకు పరిమితం చేసింది. » కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్రం కేటాయించాల్సిన నిధులపై ముఖం చాటేసింది. ఫోరెన్సిక్ విభాగానికి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు కేటాయించలేదు. బడ్జెట్ ప్రసంగంలో క్రెడిట్ చోరీ మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం విస్మయపరిచింది. రాష్ట్రంలో 5,757మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించింది. అప్పట్లో టీడీపీ ఆ నియామక ప్రక్రియకు వ్యతిరేకంగా తమ సానుభూతిపరులతో కోర్టుల్లో కేసులు వేయించింది. టీడీపీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను ఉపసంహరించారు. దాంతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. అవి కూడా తామే భర్తీ చేసినట్టు పయ్యావుల కేశవ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. » శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొత్తగా 4 ఏపీఎస్పీ బెటాలియన్ల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ ఘనత కూడా చంద్రబాబు ప్రభుత్వానిదేనని పయ్యావుల కేశవ్ క్రెడిట్ చోరీకి యతి్నంచారు. -
‘సూపర్ సిక్స్’లు ఔట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.80 లక్షల మంది మహిళలకు చంద్రబాబు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికీ ఏటా రూ.18 వేలు చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు ఇవ్వాలి. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇచ్చింది మాత్రం సున్నా. 20 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. నెలకు రూ.3 వేలు చొప్పున మూడేళ్లలో నిరుద్యోగ యువతకు రూ.21,600 కోట్లు ఇవ్వాలి. కానీ.. ఇచ్చింది గుండు సున్నా. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మందికి పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో రూ.28,800 కోట్లు ఎగనామం పెట్టారు.సున్నా వడ్డీ పథకానికి తూట్లు పొడిచి దాదాపు కోటి మంది పొదుపు మహిళలతోపాటు రైతులనూ దగా చేశారు. సూపర్ సిక్స్, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మూడు కోట్ల మందికిపైగా మహిళలు, రైతులు, యువతకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మూడో బడ్జెట్లోనూ వాటి ప్రస్తావనే లేకుండా చేసి ఇక ఆ పథకాలను అమలు చేయబోమని విస్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్లైంది. తల్లికి వందనం పథకానికి రూ.13,112 కోట్లు కావాల్సి ఉంటే ఈ బడ్జెట్లో ఇచ్చింది రూ.8,457 కోట్లే! మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది కోతలతో సరిపుచ్చారు. అన్నదాతా సుఖీభవ కింద పాత బకాయిలతో కలిపి రూ.27,455 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో చేసిన కేటాయింపులు రూ.6,600 కోట్లు మాత్రమే. దీపం పథకం అమలుకు ఏటా రూ.4,200 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో ప్రతిపాదించింది కేవలం రూ.2,601 కోట్లే! ‘దీపం’ పథకం కింద బకాయిలతో కలిపి రూ.6,183 కోట్లు ఎగనామం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు హామీని తొలి ఏడాది నెరవేర్చకుండా రూ.3,200 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అనేక ఆంక్షలతో అరకొరగా అమలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు ఉండగా పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఎప్పుడు అందుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని వర్గాలను మోసం చేస్తూ రూ.3.32 లక్షల కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్ను టీడీపీ కూటమి సర్కారు బడ్జెట్ను శనివారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్లో ఎక్కడా లేకపోగా ప్రభుత్వ గ్యారెంటీ రుణాలను దాచి పెట్టింది. భారీ అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. పది సూత్రాల సూక్తులు మినహా కార్యాచరణ బడ్జెట్లో కానరాలేదు. పేదల ఇళ్లపై కక్ష..పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు సర్కారు కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. కాగితాలపై కేటాయింపులు మినహా ఖర్చు చేయడం లేదు. గత రెండు బడ్జెట్లలో కేటాయింపులు, వాస్తవ వ్యయం తీరే దీనికి నిదర్శనం. 2024–25లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.4,012 కోట్లు కేటాయించగా రూ.1,611 కోట్లు మాత్రమే వెచ్చించారు. 2025–26లో రూ.6,317 కోట్లను కేటాయించగా సవరించిన అంచనాల్లో వ్యయం కేవలం రూ.2,017 కోట్లుగా పేర్కొన్నారు. ఈసారి రూ.6,357 కోట్లు కేటాయించినట్లు చూపిస్తున్నా ఈ ప్రభుత్వానికి వ్యయం చేసే ఉద్దేశం లేదని గత రెండు బడ్జెట్ల ద్వారా స్పష్టమవుతోంది.అదనంగా రూ.27,820 కోట్ల పన్నుల భారం ఒకవైపు ప్రైవేట్కు సంపద సృష్టిస్తూ వేగంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కారు మరోవైపు పన్నేతర, పన్ను ఆదాయాల ద్వారా రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపింది. పన్నుల ఆదాయం అదనంగా రూ.27,820 కోట్లు వస్తుందని అంచనా వేయడం గమనార్హం. అంటే పన్నుల రూపంలో ప్రజలపై భారీగా వడ్డించనున్నట్లు స్పష్టమవుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ద్వారా ప్రజలపై భారం మోపనున్నారు. పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలని ప్రతిపాదించినా సూపర్ సిక్స్ హామీలకు మాత్రం పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. 2025–26లో సవరించిన రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.98,025 కోట్లు కాగా, 2026–27లో సొంత పన్ను ఆదాయం రూ.1,25,845 కోట్లుగా అంచనా వేశారు. ఇక పన్నేతర ఆదాయంపై బాబు సర్కారు తిమ్మిని బమ్మిని చేసింది. 2025–26 బడ్జెట్ అంచనాల్లో పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లు కాగా సవరించిన అంచనాల్లో రూ.14,324 కోట్లకు తగ్గించారు. అయితే వాస్తవంగా కాగ్ డిసెంబర్ వరకు విడుదల చేసిన గణాంకాల మేరకు పన్నేతర ఆదాయం కేవలం రూ.4,142 కోట్లు వచ్చింది. ఇక 2026–27 బడ్జెట్లో పన్నేతర ఆదాయం రూ.11,473 కోట్లుగా అంచనా వేశారు. అంటే పన్నేతర రూపంలో కూడా ప్రజలపై బాదనున్నారు. సంపద సృష్టి శూన్యం.. ప్రైవేట్కు ఫండింగ్సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు. పీపీపీలో విధానంలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు బడా సంస్ధలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద బడ్జెట్లో ఏకంగా రూ.1,500 కోట్లు కేటాయింపులు చేశారు. మరో రూ.లక్ష కోట్ల అప్పులు..వచ్చే ఏడాది మరో రూ.లక్ష కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో చంద్రబాబు సర్కారు వెల్లడించింది. ప్రజా రుణం పేరుతో రూ.98,065 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.78,182 కోట్లు, కేంద్రం నుంచి రూ.19,133.41 కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. జనంపై బాదుడు.. భారీ అప్పులే లక్ష్యం..పన్నుల రూపంలో ప్రజలపై భారీగా బాదుడు, భారీ అప్పులే లక్ష్యంగా రూ.3.32 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2.56 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.48,697 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 1.11 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.75,868 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 3.84 శాతంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తగ్గుతున్నట్లు అంకెల గారడీతో మోసపుచ్చేందుకు బడ్జెట్లో బాబు సర్కారు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.తల్లులకు బాబు వంచన..తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. ఇలా రెండేళ్లలో ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. ఇక ఇప్పుడు బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్లను ఎగ్గొట్టారు!రైతులకు వెన్నుపోటు..పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండేళ్లలో రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు. తాజా బడ్జెట్లోనూ అరకొరగా కేటాయింపులు చేసి రైతులకు దాదాపు రూ.21 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు.తుస్సుమన్న గ్యాస్..దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. గత బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. దీపం పథకం కింద రెండేళ్లలో మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు. బకాయిలతో కలిపి తాజాగా రూ.6,183 కోట్లు ఎగనామం పెట్టారు.మహిళలకు మరో మోసం..రాష్ట్రమంతటా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26 ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. -
ఎనిమిది లక్షల పింఛన్లకు కోత?
సాక్షి, అమరావతి: బాబు సర్కార్ బడ్జెట్ ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది లక్షల పింఛన్లకు కోత పడే పరిస్థితి నెలకొంది. గత 20 నెలలుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పింఛన్ల పథకానికీ ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం దీనికి కారణం. 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు రూ.2,632.04 కోట్లు (రూ. 2,724.09 కోట్లు పంపిణీ చేస్తామని ముందు ప్రకటించింది) పంపిణీ చేసింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 31,584 కోట్లు నిధుల అవసరం ఉంటుంది. తాజా బడ్జెట్లో కేవలం 27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరానికన్నా 4 వేల కోట్లు తక్కువ. దీంతో ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఇకపై 8 లక్షలు తగ్గితేనే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 50 ఏళ్లకే పింఛన్.. ‘హామీకే సరి’ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన ‘50 ఏళ్లకే పింఛన్’ హామీ.. కేవలం ప్రకటనలకే పరిమితమని బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు వృద్ధాప్య పింఛన్లకు అర్హులు. అయితే చంద్రబాబు ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు అన్న హమీని ప్రకటించారు. తాజా కేటాయింపులు చూస్తే ఈ హామీ అమలు లేనట్లేనని తేలిపోయింది. కొత్త పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ నిలిపివేత» చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 20 నెలల్లో 60 ఏళ్లు నిండిన నిరుపేదలకు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు కాకపోగా, కనీసం పింఛన్కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ లేకుండా పోయింది.» కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నిలిచిపోయింది. » గత జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. » ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆ సేవలు నిలిచిపోయాయి. సచివాలయాల్లో గానీ, మండల కార్యాలయాల్లో గానీ నేరుగా దరఖాస్తు అందజేయాలన్నా వీలుకాని పరిస్థితి. » 2024 జనవరి ఆరంభంలోనూ అప్పటి ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. » ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వరకు సైతం ఆన్లైన్ వెబ్పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల మంజూరు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. » అప్పట్లో ప్రభుత్వానికి అందిన రెండున్నర లక్షల మంది పింఛన్ దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికే ఐదున్నర లక్షల పింఛన్లు కోతవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిలో ఇప్పటికే ఐదున్నర లక్షలకు పైగా కోతవేసింది. జగన్ ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛన్ పొందారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఈ సంఖ్య ప్రతి నెలా తగ్గుతూనే ఉంది. ఈ ఫిబ్రవరిలో పంపిణీ జరిగిన 60.19 లక్షలు చూస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏకంగా ఐదున్నర లక్షల దాకా పింఛన్ల సంఖ్య తగ్గిపోయినట్టు అర్థమవుతోంది. లక్ష వరకు దివ్యాంగుల పింఛన్లు కోత పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘రీ వెరిఫికేషన్’ నిర్వహిస్తోందన్న విమర్శలున్నాయి. -
‘బాబుకు రైతులంటే చిన్నచూపు.. మరోసారి తేలిపోయింది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది రైతులను విస్మరించిన బడ్జెట్.. రైతు, రైతు కూలీల ప్రస్తావనే లేని వ్యవసాయ బడ్జెట్ని చూస్తున్నాం.. చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపని మరోసారి తేలిపోయిందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందన్నారు.‘‘ఈ బడ్జెట్ చూశాక ప్రభుత్వం దృష్టిలో అసలు రైతులు లేరని తేలిపోయింది. బస్తా యూరియా కూడా అందించలేని ప్రభుత్వం ఇది. కిలో మంచి విత్తనాలు కూడా అందించలేని దగా ప్రభుత్వం ఇది. కానీ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎలా చెప్పుకుంటున్నారు?. అన్నదాత సుఖీభవ కింద రూ.10,200 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ రూ.6,600 కోట్లు మాత్రమే పెట్టటం ద్వారా రైతులను ఏం చేయదలచుకున్నారు?. ప్రభుత్వం దెబ్బకు రైతులంతా కూలీలుగా మారి పోతున్నారు...బడ్జెట్లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. రైతుల సంక్షేమం మీద ఈ ప్రభుత్వానికి ఒక వ్యూహం లేదు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.3 వేల కోట్లు బెట్టేవారు. గిట్టుబాటు ధరల్లేకపోతే ప్రభుత్వమే ఆదుకునేది. మరి కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో ఎందుకు కేటాయించలేదు?. జగన్ తెచ్చిన ఉచిత బీమా సౌకర్యాన్ని ఎత్తేసి రైతుల కడుపు కొట్టారు. చంద్రబాబు ఆక్వా రైతులనూ మోసం చేశారు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు నిలువునా ముంచారు..వైఎస్సార్ హయాంలో హార్టికల్చర్ వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా తన ఘనత అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్రైవేటీకరణ మీద ప్రేమ.. చివరకు రైతు బజార్లను కూడా నిర్వహించలేక, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. చంద్రబాబు, లోకేష్కు భజన చేయటంలో కూటమి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ప్రతిరోజూ సగటున ఒకరు, రైతు కూలీలు నలుగురు చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను అందుకునేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?...టీడీపీ ఎమ్మెల్యేనే పల్లె కన్నీరు పెడుతోందని వాపోయాడు. వీటన్నిటి డైవర్షన్ కోసం లడ్డూలో కల్తీ అంటూ కథలు అల్లుతారు. ఏ వర్గానికీ మేలు చేయలేక నిత్యం వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మూడో బడ్జెట్ పెట్టినా ఇంకా మోసాలే చేస్తారా?. ఈ బడ్జెట్ కేవలం అంకెల ఆర్భాటమే. అప్పులతోనే బండి నడుపుతామనే సంకేతం ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు. -
కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ పచ్చి అబద్ధాలు, కాకిలెక్కలు, ఊహాజనిత సిద్ధాంతాలతో నిండి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల ఆదాయ, వ్యయాల విశ్లేషణ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి బడ్జెట్ రూపొందించలేదంటూ తూర్పారబట్టారు. అధికారంలోకి రాకముందు రూ.10 లక్షల కోట్ల అప్పు అని మట్కా నంబర్లు చెప్పిన వారు, ఇప్పుడు వాస్తవాలు రాస్తే తమ బండారం బయటపడుతుందని అసలు అప్పు ఎంతో బడ్జెట్లో పేర్కొనలేదంటూ దెప్పిపొడిచారు. ప్రభుత్వ ఆదాయ లెక్కలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అవార్డులు ఇవ్వాలని బుగ్గన ఎద్దేవా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో కేవలం రూ.67,459 కోట్ల ఆదాయం వస్తే, మిగిలిన మూడు నెలల్లో ఏకంగా రూ.44,407 కోట్లు వస్తుందని చూపడం నమ్మశక్యమా? అంటూ నిలదీశారు. వాస్తవానికి ఆదాయ వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే ఉన్నా.. వచ్చే ఏడాదికి 45 శాతం పెరుగుదల చూపడం ప్రజలను మోసం చేయడమే అని తేల్చిచెప్పారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించామని గుర్తు చేశారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని బుగ్గన మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలివ్వడం, 10 వేల విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు, 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించడం విధ్వంసమా? అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా ద్వారా పేదలకు నేరుగా నగదు అందించడం మీకు గాయాలు కలిగించిందా?‘ అని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన గణాంకాలతో సహా నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ఇసుక, భూములే కాకుండా చివరకు కోడి వ్యర్థాల నుంచి కూడా అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని బుగ్గన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్ తప్ప.. పెర్ఫార్మెన్స్ మాత్రం పూర్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అబద్ధపు లెక్కలు మానేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీది ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. మీ ఇంటెలిజెన్సే ఆరి్టఫిషియల్ అంటూ చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. బాధ్యత లేని బడ్జెట్ కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు, రెండూ కలిపి రూ.3,32,205 కోట్లుగా ఉంది. ఖర్చూ అంతే ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉన్న అత్యంత బాధ్యత బడ్జెట్ రూపకల్పన. కానీ ఏపీ బడ్జెట్ చూస్తే గతేడాది ఏం ఉందో ఇప్పుడూ అదే ఉంది. అన్నీ బొమ్మలు, సూత్రాలు, ఆలోచనలు, దీనికి ఇంత ఖర్చు పెట్టబోతున్నామన్న ఊహాజనిత థియరీ తప్ప.. విశ్లేషణాత్మక వాస్తవాలెక్కడా ఈ బడ్జెట్లో కనిపించలేదు. చివరకు అప్పు ఎంత ఉందన్నదీ ఎక్కడా చెప్పలేదు. కారణం అధికారంలోకి రాకముందు నుంచే రూ.12 లక్షలు, రూ.11 లక్షలు, రూ.10 లక్షల కోట్లు అప్పు అని మట్కా నంబర్లు మాదిరిగా పదే, పదే చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాస్తవాలు రాస్తే తాము చెప్పింది తప్పు అవుతుంది కాబట్టి అప్పు ఎంత ఉందన్నది కూడా చెప్పలేదు. మూలధన వ్యయంపైనా అసత్యాలే 2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పులు తీసుకుంటే రూ.81,597 కోట్లు. ఇంకా మూడు నెలలు మిగిలి ఉంది. కానీ మీరు మాత్రం రూ.80,500 కోట్లు అప్పులు చూపిస్తున్నారు. రెండేళ్లలో మీరు చేసిన మొత్తం అప్పు రూ.3.20 లక్షల కోట్లు. చేసిన ఆ అప్పు కూడా చూపించడం లేదు. 2025–26లో మూలధన వ్యయం కింద బడ్జెట్లో పెట్టిన అమౌంట్ రూ. 40,635 కోట్లు కాగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.33,134 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఇంతవరకు తొమ్మిది నెలలుగా మీరు పెట్టిన ఖర్చు మాత్రం కేవలం రూ.19,224 కోట్లు మాత్రమే. అంటే బ్యాలెన్స్ దాదాపు రూ.14 వేల కోట్లు. ఇప్పుడు కేవలం మూడు నెలల్లో ఖర్చుపెట్టడం సాధ్యమవుతుందా? పైగా రూ.48,075 కోట్లు రానున్న ఏడాది ఖర్చుపెట్టబోతున్నామని చెబుతున్నారు. ఎక్కడ రూ.19వేల కోట్లు, ఎక్కడ రూ.48 వేల కోట్లు ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? 2024 జూన్ నుంచి నేటి వరకూ విధ్వంసం నుంచి వికాసం దిశగా.. అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన అప్పులు రూ.3,20,450 కోట్లు. 2024–25లో రూ.81,622 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఆర్బీఐ ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి వరకు రూ.12,300 కోట్లు అప్పు చేశారు. పౌరసరఫరాల కింద రూ.7,000 కోట్లు, మార్క్ఫెడ్ కింద రూ.19,900 కోట్లు అప్పు చేసి.. రైతుల వద్ద నుంచి ఏ పంటలూ కొనలేదు. ఏపీఎండీసీ రూ.9వేల కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.9,600 కోట్లు, డిస్కమ్స్ రూ.12,110 కోట్లు, ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ సంస్థ ద్వారా రూ.1,000 కోట్లు తెచ్చారు, జలజీవన్ మిషన్ కింద రూ.10 వేల కోట్లు అప్పు చేసి.. అవి దేనికి వాడారో తెలియదు. కేంద్ర బడ్జెట్లో గతేడాది దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రూ.10 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? ఎక్కడ ఈ డబ్బులు వాడారు? ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది. దీనిపై మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏపీఐఐసీ రూ.8,500 కోట్లు, టిడ్కో రూ.4451 కోట్లు, అమరావతి కోసం రూ.47,900 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా జీఎస్డీపీ లెక్కలు చూస్తే.. మీరు 11.7 శాతం పెరిగిందని చెబుతుంటే కేంద్రం మాత్రం 10 శాతం లోపే అని చెబుతారు. అలాంటప్పుడు కేంద్రానికి తొమ్మిది శాతం ఆదాయం వస్తుంటే మీకు మాత్రం రెండు శాతం కూడా రావడం లేదు. ఇదెక్కడి లెక్క? అవినీతి, కక్ష, మోసం, రెడ్బుక్ సహా మీది పది సూత్రాల ప్రణాళిక తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పుడూ కూర్చోలేనని తెలిసినా మొక్కలు నాటారంటూ ఆర్థికమంత్రి సీఎం గురించి చెబుతున్నది నిజమే. చంద్రబాబు ఎప్పుడూ వేరొకరు నాటిన చెట్ల నీడనే కూర్చొంటారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు నియంత పాలన సాగించారు. అవినీతి, పక్షపాతం, కక్ష, అబద్ధాలు, మోసం, పారదర్శకత లేకపోవడం, శాంతిభద్రతలు విఫలం, రెడ్ బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్, క్రెడిట్ చోరీ అనే ఈ పది సూత్రాల ప్రాతిపదికన దుర్మార్గ పాలన సాగిస్తున్నారు. కూటమి పాలనలో ఉద్యోగులకూ టోకరా ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. 2024 జూలై నుంచి నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్ ఊసే ఎత్తలేదు. 2024 జూన్ నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు. ఈఎల్ ఎన్క్యాష్మెంట్ 2024 నుంచి లేదు. పోలీసులకు 2024 నుంచి 5 ఏఎస్ఎల్, ఎస్ఎల్ పెండింగ్లో ఉన్నాయి. 16 నెలల నుంచి టీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అటకెక్కింది. ఒకటో తారీఖున జీతాలు లేవు. ఇష్టమొచ్చినట్లు బకాయిలు పెట్టారు. 30–07–2024న ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అని చెప్పారు. ఏ ఒక్క ఇంటికీ ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన 3 లక్షల ఇళ్లు తప్ప ఒక్కటీ లేదు. ఇవన్నీ అడిగితే మీకు కోపం వస్తుంది. ప్రజల తరఫున మేం ప్రశి్నస్తాం. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న పెద్ద మనిషి కనిపించడు, పార్టీ పెట్టి ఆయనకు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తీ కనిపించడు.20 నెలల్లో 60 విజయాలంటూ తప్పుడు ప్రచారం 20 నెలల్లో 60 విజయాలు సాధించామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లాంటి ఓ ఆరేడు కూడా సాధించలేదు. 20 లక్షల మంది నిరుద్యోగులకు 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలిపి రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద అక్కచెల్లెమ్మలకు రూ.97,200 కోట్లు బాకీ ఉన్నారు. 20 లక్షల మంది 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు పింఛన్ బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20.865 కోట్లు ఎగ్గొట్టారు. సుమారు 6 లక్షలపైచిలుకు ఉన్న కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ ఎగ్గొట్టారు. దీపం పథకం కింద రూ.6,183 కోట్లు ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం కింద 24,504.39 కోట్లు ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.8వేల కోట్లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.అప్పులపై మీరిచ్చిన వాస్తవాలివిగో.. మా ప్రభుత్వ హయాం పూర్తయ్యేసరికి రూ.9.74 లక్షల కోట్లు అప్పు మిగిల్చామని అబద్ధాలు చెబుతున్నారు. సీఏజీ రిపోర్టు, ఆర్బీఐ లెక్కలు, లెజిస్లేచర్ లెక్కలు అన్నీ తప్పు చెబుతాయి, మీరు చెప్పింది మాత్రమే నిజమని నమ్మించే యత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రశ్నకు బదులిచ్చినదాని ప్రకారం మీరు 02–06–2014 నాడు పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు రూ.1,07,852 కోట్లు, మీ ప్రభుత్వం దిగిపోయి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చేటప్పటికి అప్పు రూ.3,06,952 కోట్లకు చేరింది. మరలా 2024లో మా ప్రభుత్వం దిగిపోయినప్పటికీ మీరిచ్చిన లెక్కల ప్రకారమే రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే మా హయాంలో కేవలం రూ.3.39 లక్షల కోట్లు అప్పు మాత్రమే జరిగింది. మీ హయాంలో 2014–19 వరకు 22 శాతం అప్పు పెంచితే మా హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు పెరిగింది. -
‘దుప్పటి.. చెట్టు.. ఆవు..’ లోకేష్, పవన్పై బైరెడ్డి చెప్పిన కథ
సాక్షి, గుంటూరు: ఒక మనిషిని ఇబ్బంది పెడితే ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వం అని వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబుపై దాడి చేస్తే.. దాడికి గురైన బాధితుడే జైలులో ఉన్నారన్నారు. అంబటిపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలు స్టేషన్ బెయిల్ తీసుకుని బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని బైరెడ్డి మండిపడ్డారు.అంబటి రాంబాబు సాధారణమైన వ్యక్తి కాదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల కోసం పని చేశారు. హోం మంత్రి అర్ధ రహితంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబును ఏమి పీకలేరు. మన తప్పులు మనకి చిన్నవిగా ఎదుట వారికి పెద్దవిగా కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి నామరూపాలు లేకుండా పోతుంది. అంబటి రాంబాబును జైలులో పెడితే ఆయన కుమార్తె బయటకు వచ్చారు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్లు.. కుక్కలు కొట్టినట్టు కొట్టినాకూడా పవన్ కళ్యాణ్ స్పందించడు. పవన్కు ప్రతి నెలా ముట్టాల్సింది ముడుతుంది. కూలీ చేసేది జన సైనికులు.. లాభం అనుభవించేది టీడీపీ అంటూ.. జనసేన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. బైరెడ్డి ఓ కథ చెప్పారు.పవన్ కల్యాణ్, లోకేష్ ఇద్దరూ కూర్చొని ఉంటే.. చంద్రబాబు వచ్చి.. మూడు వస్తువులను పంచుకోమని చెప్పి.. దుప్పటి, చెట్టు, ఆవు వారికి ఇచ్చారు. లోకేష్ పవన్తో ఇలా అన్నాడంట.. నీకు పంపకాలు సరిగా రావు.. ఇద్దరికి న్యాయంగా పంచుతానన్నాడు. దుప్పటిని పగలు అంతా నువ్వు వాడుకో.. రాత్రి అయితే తానూ వాడుకుంటానంటూ చెప్పాడు. న్యాయంగా పంచావు తమ్ముడు అన్న పవన్ కల్యాణ్.. దుప్పటి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పగటి పూట ఎండ వేడికి ఆ దుప్పటిని కప్పుకోలేకపోయాడు. రాత్రికి లోకేష్కు ఇచ్చాడు.. చలికి ఆ దుప్పటిని బాగా కప్పుకుని పడుకున్నాడంట. దుప్పటి.. లోకేష్కు ఉపయోగపడింది. పవన్కు ఉపయోగపడలేదు.తర్వాత ఇద్దరూ చెట్టు దగ్గరకు వెళ్లారు. ఇదీ కూడా న్యాయంగా పంచుతానన్న లోకేష్.. పై భాగం అంతా నేను తీసుకుంటా.. కింద భాగం అంతా నువ్వు తీసుకో అన్నాడంట.. అంటే చెట్టుకు నీళ్లు పోసేందంతా పవన్ కల్యాణ్.. కాసిన పండు తినేదంతా లోకేష్.. తర్వాత ఆవు దగ్గరకు వెళ్లారట. అన్నా.. ఇది కూడా న్యాయంగా పంచుతా.. ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో.. వెనుక భాగం అంతా నేను తీసుకుంటా.. ఆవుకు రోజూ.. మేత, నీళ్లు పోసేదంతా పవన్ కల్యాణ్.. వచ్చే పాలు పిండుకునేది లోకేష్.. ఇది జన సైనికులు పరిస్థితి ఎలా ఉందంటే.. కూలి చేసేది వీళ్లు.. వచ్చేదంతా తినేది తెలుగు తమ్ముళ్లు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివరించారు. -
ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..
-
కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్
-
పవన్పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్
సాక్షి,గుంటూరు: తన తండ్రిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అంబటి మౌనిక తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దాడి చేసి, తిరిగి అంబటి రాంబాబుపై కేసులు పెట్టారు. అక్రమ కేసులకు, దాడులకు భయపడేది లేదు.కూటమి నేతలు కావాలని రెచ్చగొట్టి, దాడులకు పాల్పడ్డారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించడంలో హోంశాఖ విఫలమైందని మండిపడ్డారు. -
‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు’
విజయవాడ: ఏపీలో వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ విమర్శించారు. 100 పడకల ఆసుపత్రులను ప్రైవేట్పరం చేసే ఆలోచన లేదని మంత్రి చెబుతుంటే, చంద్రబాబేమో 100 పడకల ఆసుపత్రులను పీపీపీ కింద ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నారన్నారుఉ. పీపీపీ విధానానికి ప్రపోజల్స్ కూడా సిద్ధం చేసేశామంటున్నారని, పేషెంట్ల వద్ద రుసుము వసూలు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ‘వంద పడకల ఆసుపత్రుల నిర్వహణను పిపిపికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆసుపత్రులను కూడా ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. ఆసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేసే నీచ సంస్కృతికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు.ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి అరుణ్కుమార్ మాట్లాడుతూ.. ‘ ఈ బడ్జెట్ను చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి ఏమైందోనన్న ఆందోళన కనిపిస్తుంది. గత ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 3.42 లక్షల కోట్లు అని లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ప్రసంగంలో 9.70 లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధరలు ఇవ్వటం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రంలో ఒక్క గంజాయికి తప్ప మరో పంటకు మద్దతు ధర లేదు. ఉద్యోగుల ప్రస్తావనే లేకుండా మొండిచేయి చూపించారు. ఆడబిడ్డ నిధి అన్నారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అమరావతి సెల్ఫ్ సస్టైన్ రాజధాని అని చెబుతున్నారు. అమరావతి పేరు మీద తెచ్చిన అప్పులు ఎన్ని.. తెచ్చిన బకాయిలు ఎలా తీరుస్తారనేది చెప్పలేదు. అన్నీ వర్గాలను విస్మరించి మీరు తెచ్చిన బడ్జెట్ మీ డొల్లతనాన్ని బయటపెట్టింది. బడ్జెట్ పై ప్రభుత్వాన్ని మండలిలో కడిగేస్తాం’ అని స్పష్టం చేశారు.శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీ బడ్జెట్పై విమర్శలు గుప్పించారు. ఇది నారా వారి నకిలీ బడ్జెట్ అంటూ ధ్వజమెత్తారు.‘నారా వారి నకిలీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కూటమి నేతల కమిషన్ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉంది. అప్పుల్లో ఏపీని నెంబర్వన్కు తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. సూపర్ సిక్స్ హామీల్లో ఉన్న నిరుద్యోగ భృతి గురించి ఊసే లేదు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో మొండిచేయి చూపించారు. ఏ వర్గాన్ని ఈ బడ్జెట్ సంతృప్తి పరచలేదు. పేదల కోసం ఏమి చేస్తారో కూడా చెప్పలేకపోయారు’ అని విమర్శించారు. -
ఏపీ బడ్జెట్ అభూత కల్పన: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ అంతా అంకెల గారడీ.. అప్పుల కుప్పలా ఉందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బడ్జెట్ ఇది అంటూ దుయ్యబట్టారు. నిరుద్యోగులను, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన బడ్జెట్. ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ చీటింగ్ సర్కార్.. ఇచ్చిన ఒక్క హామికి కూడా సరైన నిధులు కేటాయించకుండా.. వచ్చే ఏడాదికి మరో లక్ష కోట్ల అప్పుకు రెడీ అయిపోతున్నారు. కేవలం 20 నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టి అసలే లేదు అంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్లోనూ అదే తీరు: వరుదు కల్యాణిఎన్నికల టైంలో ఊరూరా బాండ్లు పంచారు. వాటికీ ఈ బడ్జెట్కు సంబంధం ఉందా?. మోదీ, పవన్ను పక్కన పెట్టుకొని 164 సీట్లు తెచ్చుకొని ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదు. తల్లికి వందనంలో కోతలు పెట్టారు. ఈ బడ్జెట్లో కూడా అదే తీరు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని నమ్మించి.. దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు బడ్జెట్లో ఆ ఊసే లేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తామన్నారు.. దాని ఊసు లేదు. రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు..దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు.. ఈ మూడు బడ్జెట్లలో కేటాయింపులు లేవు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. వీటన్నిమీద కౌన్సిల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము..మాయాబజార్ను తలపించింది: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిఈ బడ్జెట్ అంతా ఊహాగానాలే.. నాలుగో తరగతి పిల్లాడు హిస్టరీ రాసినట్లు బడ్జెట్ రాసుకొచ్చారు. బడ్జెట్ ప్రసంగమంతా మాయాబజార్ను తలపించింది. ఎన్నికల ముందు 10 లక్షల కోట్లకు పైబడి అప్పులున్నాయని బురదజల్లారు. కూటమి వచ్చిన 20 నెలల్లో చేసిన అప్పు 3.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరో లక్ష కోట్లు అప్పు చేస్తామని ముందే చెబుతున్నారు. నిరుద్యోగ భృతికి గత రెండు బడ్జెట్లలో కేటాయింపులు సున్నా. మూడో సంవత్సరం కూడా నిరుద్యోగ భృతి కేటాయింపులు సున్నా. ఆడబిడ్డ నిధికి మూడు బడ్జెట్లలో కేటాయింపులు సున్నా. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే.. కేవలం 3500 కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ కు కేటాయించారు.30 లక్షల మంది విద్యార్థులను రోడ్డున పడేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. నాడు-నేడు ద్వారా వైఎస్ జగన్ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ ప్రభుత్వం నాడు-నేడుకి రెండేళ్లలో చేసిన కేటాయింపులు సున్నా. ఇప్పుడు కేవలం 1500 కోట్లను నాడు నేడుకి ఇస్తామంటున్నారు...అది కూడా ఇస్తారో లేదో అనుమానమే. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ను కూడా నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అసలు కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందిఈ బడ్జెట్ పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్: కల్పలతా రెడ్డిబడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రజల ఆశలను వమ్ము చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. మహిళలను నిలువునా ముంచేసి.. బడ్జెట్లో మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. బడ్జెట్ను తయారు చేసిన ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పీఆర్సీ, ఐఆర్ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు. హోంమంత్రి బడ్జెట్ పెట్టడంతో పోలీసులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. పోలీసులకు వెహికల్స్ పెట్టాం.. డ్రోన్లు పెట్టామని హోం మంత్రి చెప్పారు. హోంమంత్రి తమ బకాయిల గురించి మాట్లాడతారని పోలీసులు భావించి భంగపడ్డారు.ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్: కుంభా రవిబాబుబడ్జెట్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్. ప్రభుత్వం సంపద సృష్టికి బదులు అప్పులు సృష్టిస్తోంది. అభూత కల్పనగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఎన్నికల సమయంలో ఏపీ అప్పులపై ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ అప్పు 9.47 లక్షల కోట్లని బడ్జెట్లో చెబుతున్నారు. చంద్రబాబు ఎందుకు అప్పులపై తప్పుడు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలి -
చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..
-
నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు
-
AP Budget 2026-27: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్
సాక్షి,అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్లో టోకరా పెట్టింది. పీఆర్సీ, ఐఆర్పై ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో సీపీఎస్ రద్దుపైనా ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించ లేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది. మూడు బడ్జెట్ లవుతున్నా ఐఆర్ ఇవ్వకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు. -
AP Budget 2026-27: ప్రజలను నయవంచన చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం మరోసారి నిరుద్యోగుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని నయవంచనకు గురి చేసింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతికి పైసా కేటాయించ లేదు. ఆడబిడ్డ నిధి పథకానికి ఈసారి సున్నా పెట్టింది. ప్రతీ మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఇచ్చిన హామీకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండా మోసం చేసింది.కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవకు కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించింది. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అరకొర కేటాయింపులతో అన్నదాతల్ని వంచనకు గురి చేసింది. ధరల స్థిరీకరణకు కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించింది. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపుఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు, అందులోని విద్యార్థుల్ని చిన్నచూపు చూసే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై బడ్జెట్లో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాడు నేడు ద్వారా రూ. 7800కోట్ల పనులు చేపట్టింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చి దిద్దింది. తాజా, బడ్జెట్లో కూటమి ప్రభుత్వం నాడు నేడు పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కేవలం తూతూ మంత్రంగా రూ.1500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్ నిలిపివేస్తున్నట్టు మంత్రి పయ్యావుల ప్రకటించారు.గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెచ్చిన సంస్కరణలపై కక్ష సాధింపు చర్యగా.. పేద విద్యార్థులకు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్లను దూరం చేసిందంటూ ఏపీ ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బడ్జెట్ పై భారీ ఆశలు.. తేలుస్తారా.. ముంచేస్తారా..?
-
ఏపీ బడ్జెట్ 3,32,205 కోట్లు.. నిరుద్యోగులకు టోకరా
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా శనివారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఏడాదికి ఏపీ బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా వెల్లడించారు. కాగా, పయ్యావుల కేశవ్ మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. బడ్జెట్ను ప్రవేశపెట్టారు.అయితే, భారీగా ద్రవ్యలోటుతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసింది. రూ.75,868 కోట్ల ద్రవ్యలోటును ప్రబుత్వం చూపించింది. అలాగే, రూ.22,000 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది కూడా భారీ అప్పులు చేయాలని నిర్ణయించింది. ఓపెన్ మార్కెట్ అప్పులు 76,182 కోట్లు చేయాలని, కేంద్రం నుండి 19,033 కోట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 97వేల కోట్లు అప్పులు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఏపీని ఇప్పటికే అప్పుల్లో దేశంలో నెంబర్ వన్గా నిలిపారు.ఇక, ఈసారి కూడా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు బడ్జెట్లో టోకరా వేసింది. నిరుద్యోగ భృతికి పైసా కూడా కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ఈసారి కేటాయింపులు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీకి బడ్జెట్ కేటాయించని ప్రభుత్వం. ప్రతీ మహిళకు 1500 నెలకు ఇస్తామని మోసం చేసిన కూటమి ప్రభుత్వం. కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. అన్నదాత సుఖీభవకు కేవలం 6600 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. 54 లక్షల రైతు కుటుంబాలకు 20వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అరకొర కేటాయింపులతో అన్నదాతను మోసం చేస్తున్నారు. ధరల స్థిరీకరణకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. కేటాయింపులు ఇలా..వైద్యశాఖ-19,306 కోట్లుపంచాయతీరాజ్ శాఖ-22,941 కోట్లునీటి వనరుల శాఖ- 18,223 కోట్లు.మున్సిపల్ శాఖ-14,523 కోట్లు. పోలవరం-6,105వ్యవసాయ శాఖ-11,745పాఠశాల విద్య-32,308 కోట్లు. -
దొరికిపోయా.. అసెంబ్లీలో ఒంటరైన బాబు.. ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా
-
శ్రీవారి మొట్టికాయ.. అసెంబ్లీలో సప్ప పడ్డ చంద్రబాబు
-
హెరిటేజ్ కోసమే లడ్డూపై కుట్ర.. BR నాయుడు కీలక పాత్ర
-
దొరికిపోయారు..! నెయ్యి తీగ లాగితే కదిలిన హెరిటేజ్ డొంక
-
తేలుస్తారా.. ముంచేస్తారా!
సాక్షి, అమరావతి : సూపర్ సిక్స్ లోని ప్రధాన హామీలను గత రెండు బడ్జెట్లలో అమలు చేయకుండా మోసానికి గురిచేసిన కూటమి సర్కారు.. ఈ బడ్జెట్లోనైనా తమకిచ్చిన హామీలను అమలు చేస్తుందనే గంపెడాశలతో యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. సూపర్ సిక్స్లో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పన ఏడాదికి రూ. 18 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే ఉద్యోగం కల్పించే వరకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. అయితే 2024–25 వార్షిక బడ్జెట్లో ఈ రెండు పథకాలకు పైసా కేటాయింపులు చేయలేదు. అలాగే 2025–26 వార్షిక బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కేటాయించ లేదు. ఈ నేపథ్యంలో 2026–27 వార్షిక బడ్జెట్ను చంద్రబాబు ప్రభుత్వం శనివారం అసెంబ్లీకి సమర్పించనుంది. కూటమి ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్. ఉదయం 11.15 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై రాష్ట్ర వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది. మండలిలో హోం మంత్రి అనిత వార్షిక బడ్జెట్ను, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ను చదువుతారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చదువుతారు. ఈ బడ్జెట్లో ఏం చేస్తారో! » ఆడబిడ్డ నిధిని పీ–4తో, నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేసి అమలు చేసేశామని, ఎవరైనా వీటి గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగ యువత, ఆడబిడ్డ నిధి కోసం మహిళలు రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. » ఈ బడ్జెట్లోనైనా ఆడబిడ్డ నిధికి, నిరుద్యోగ భృతికి కేటాయింపులు చేసి అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, గత రెండు బడ్జెట్లలో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి చంద్రబాబు సర్కారు రూ.1,43,000 కోట్లు ఎగనామం పెట్టింది. ఈ బడ్జెట్లోనైనా ఆ మేరకు నిధులను అదనంగా కేటాయిస్తారని హామీలు పొందిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. » చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ హామీల అమలు బాధ్యత తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, హామీల అమలు గురించి పవన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. » సూపర్ సిక్స్తో పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. కానీ సూపర్ సిక్స్కే తొలి రెండు బడ్జెట్లలో దిక్కు లేకుండా చేశారు. ఇప్పుడు మూడో బడ్జెట్లో ఏమేరకు చేస్తారో నేడు తేలిపోనుంది. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను రూ.3.22 లక్షల కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2026–27 వార్షిక బడ్జెట్ను దాదాపు పది శాతం మేర పెంచి రూ.3.46 లక్షల కోట్లకు పైగా ప్రవేశ పెడతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘భోలే’తోనూ హెరిటేజ్ బంధం
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ప్రచార కుట్ర వెనుక అసలు లోగుట్టు క్రమంగా బయటపడుతోంది. లడ్డూ ప్రసాదం వివాదంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్ర బిందువుగా చేసుకున్న భోలేబాబా డెయిరీతో చంద్రబాబు కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్న వాస్తవం బట్టబయలైంది. ‘హెరిటేజ్ ఫుడ్స్తో తమకు అనుబంధం ఉంది’అని భోలే బాబా డెయిరీ అధికారికంగా పేర్కొనడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భోలేబాబా డెయిరీ టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులోకి తొలిసారి ప్రవేశించింది. అంతే కాదు చంద్రబాబు గగ్గోలు పెడుతున్న కల్తీ నెయ్యి సరఫరా చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనేనన్నది కూడా గమనార్హం. భోలేబాబా డెయిరీ, హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపార బంధం బాగోతం ఇదీ....హెరిటేజ్ ఫుడ్స్తో భోలేబాబా బంధంతిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న భోలే బాబా డెయిరీతో చంద్రబాబు కుటుంబ బంధం బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్తో భోలేబాబా డెయిరీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్తో తమకు వ్యాపార బంధం ఉందని భోలేబాబా డెయిరీ తమ అధికారిక వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ‘హెరిటేజ్ ఫుడ్స్తో మేము అసోసియేట్ అయ్యి ఉన్నాం’అని ఆ వెబ్సైట్లో భోలేబాబా డెయిరీ స్పష్టంగా వెల్లడించింది. అంటే ఆ రెండు డెయిరీల మధ్య వ్యాపార బంధం దీర్ఘకాలంగా కొనసాగుతోందని స్పష్టమైంది. కల్తీ నెయ్యని తెలిసినా ‘కూటమి’ పచ్చ జెండా2019–24 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి ఏనాడూ కల్తీ నెయ్యి సరఫరా చేయలేదు. కానీ 2024 జూన్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కల్తీ నెయ్యి సరఫరాకు బరితెగించారు. టీటీడీ రికార్డులే ఆ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. భోలే బాబా డెయిరీ, ఏ ఆర్ డెయిరీ ద్వారా 2024, జులై 6, 12 తేదీల్లో సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేదని టీటీడీ ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. అప్పటికి నెల రోజుల క్రితమే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉందనే ధీమాతోనే భోలే బాబా డెయిరీ కల్తీ నెయ్యిని సరఫరా చేసింది. జులై 23న ల్యాబ్ పరీక్షల నివేదికలు వచ్చాయి. దాంతో ఆ నాలుగు ట్యాంకర్లను జులై 25న వెనక్కి పంపారు. » కల్తీ నెయ్యని నిర్ధారణ అయితే ఏం చేయాలి... ఆ నెయ్యిని ఆ డెయిరీకి తిప్పి పంపాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదు. భోలేబాబా డెయిరీకి అనుకూలంగా వ్యవహరించింది. ఆ నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని జులై 27న శ్రీకాళహస్తిలోని వైష్ణవి డెయిరీకి సమీపానికి తరలించింది. ఆ తరువాతే అదే నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని 2024, ఆగస్టు, సెప్టెంబరులలో మరో డెయిరీ పేరుతో టీటీడీకి సరఫరా చేసింది. అంటే కల్తీ అని నిర్ధారణ అయిన నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగానే లడ్డూ ప్రసాదం తయారీకి టీటీడీకి సరఫరా చేశారు. లడ్డూ ప్రసాదం కల్తీకి చంద్రబాబు ప్రభుత్వమే పచ్చ జెండా ఊపింది. మళ్లీ అదే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉంది. భోలే బాబాను తెచ్చింది టీడీపీ ప్రభుత్వమే...చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే భోలే బాబా డెయిరీ దర్జాగా రాష్ట్రంలో అడుగుపెట్టింది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వహయాంలోనే భోలేబాబా డెయిరీ తొలిసారి టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొంది. 2018 జూన్ 26న నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశ మినిట్స్ రికార్డులు ఆ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. హర్ష్ ఫ్రెష్ డెయిరీనే భోలేబాబా డెయిరీగా మారింది. టీటీడీ టెండర్లలో పాల్గొనేందుకు భోలేబాబా డెయిరీని అర్హమైన సంస్థగా ప్రకటించింది టీడీపీ ప్రభుత్వమే. -
బాబు సర్కారు మరో రూ.500 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చే మంగళవారం రూ.500 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. కాగా, ఈనెల 3నే చంద్రబాబు సర్కారు రూ.3,300 కోట్లు అప్పు చేసింది. -
మండలిలో 'ఫీజు' మంటలు!
సాక్షి, అమరావతి: ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడేసింది. బాబుగారి అబద్దాల స్కూలులో మాస్టర్ డిగ్రీలు చేసిన మంత్రులిద్దరు ఫీజు బకాయిలపై శాసనమండలిలో నోటికొచ్చిన లెక్కలు చెప్పి అభాసుపాలయ్యారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రూ.4వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని మంత్రులు నారా లోకేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించడంతో శాసనమండలిలో కలకలం రేగింది. ఆ ఆరోపణలను వైఎస్సార్సీపీ సభ్యులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఒక్క క్వార్టర్ (జనవరి–మార్చి) ఫీజు బకాయిలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, ప్రతిపక్షం అడ్డుపడకపోతే అవి కూడా చెల్లించేసేవారమని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేనెలలో ఇవ్వాల్సింది ఎన్నికల ప్రక్రియ వల్ల ఆ క్వార్టర్ ఒక్కటి ఇవ్వలేక పోయామని బొత్స వివరించారు. అధికారులను పిలవండి, దీనిపై సమాధానం చెప్పండి అని ఆయన మంత్రులను నిలదీశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటుందా అని బొత్స ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ క్వార్టర్ పీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఆ క్వార్టర్లోనే చెల్లించే విధానం ఉందని, ఈ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించని కారణంగా కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఎప్పటి లోగా ఆ బకాయిలు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మంత్రులు వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు బకాయి పెట్టిందంటున్నారని తప్పుపట్టారు. ‘మేం అధికారంలో ఉండగా ఏ క్వార్టర్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆ క్వార్టర్లోనే చెల్లిస్తూ వచ్చాం. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి కేవలం ఒక్క క్వార్టర్ బకాయిలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఈసీకి లేఖ రాయడం వల్ల చెల్లించలేకపోయాం. ఆ తర్వాత ఏడు క్వార్టర్లతో కలిపి మొత్తం 8 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. 20 నెలలుగా విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చదువు దినదినగండంగా మారిపోయింది. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడం వల్ల విద్యార్థులను కళాశాలలు పరీక్షలు రాయనివ్వడంలేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయడం లేదు. అన్ని కాలేజీల్లో ఇదే తంతు నడుస్తోంది. రూ.6,300 కోట్ల ఫీజురీయింబర్స్మెంట్ బకాయిల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చింది రూ.700 కోట్లే. ఇంకా రూ.5,600 కోట్ల బకాయిలున్నాయి. ఇపుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి రూ.1,200 కోట్లు ఇస్తున్నట్లు హడావిడిగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్ఓ) మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమని బొత్స వ్యాఖ్యానించారు. ఇవి మూడు క్వార్టర్ల బకాయిలకు సరిపోతాయి అనుకున్నా ఇంకా ఐదు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అవి ఎప్పట్లోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక రూ. 6,300 కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని, రూ. 700 కోట్లు ఇవ్వగా ఇంకా 5,600 కోట్ల బకాయిలున్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు రూ. 3,300 కోట్ల వసతి దీవెన బకాయిలు (ఈ విద్యా సంవత్సరంతో కలిపి) ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం రూ. 8,900 కోట్లు బకాయిలు పెండింగ్ అని వివరించారు. కానీ ఈ ప్రభుత్వం రూ. 1,200 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ మాత్రమే ఇవ్వడం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు.రూ. 1,859 కోట్లు జమ చేశాం, ఇప్పుడు రూ. 1,200 కోట్లు: మంత్రులుఅయితే, బొత్స తర్వాత మాట్లాడిన మంత్రులు లోకేశ్, డోలా బాలవీరాంజనేయస్వామిలు గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల బకాయిలు పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక 2024 జూన్ నుంచి రూ. 1,859.01 కోట్లు విడుదల చేసి విద్యార్థులు లేదా కాలేజీల ఖాతాలో జమ చేశామని.. 2024–25 సంవత్సరానికి సంబందించి ఈ నెల 10న రూ. 12 వేల కోట్లు విడుదలకు ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి డోలా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే మంత్రి డోలా అన్నా క్యాంటీన్లపై మాట్లాడే ప్రయత్నం చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిలువరించారు.ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని విశ్వాసం లేదు: బొత్సమంత్రులు లోకేశ్, డోలా చెబుతున్న లెక్కలు తప్పని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నాడు–నేడు స్కూళ్లను బాగుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా’ అని నిలదీశారు. ‘‘ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ విద్య మనుగడ సాగిస్తుందని ప్రజలు ఎవరికీ నమ్మకం లేదు. అన్నీ దారుణమైన తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆగిన ఒక క్వార్టర్ తప్ప మా ప్రభుత్వంలో బకాయిలు లేవు. అధికారులను పిలవండి.. సమాధానం చెప్పండి’ అని పట్టుబట్టారు. సభ నుంచి వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదు కానీ, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు చెప్పడానికి అదే మార్గమని అన్నారు. ‘ఇలాగైనా న్యాయం చేస్తారని, మీకు జ్ఞానం కలుగుతుందని, భగవంతుడు మంచి జ్ఞానం ఇస్తాడని తప్ప వాకౌట్ చేయడం మా ఫ్యాషన్ కాదు. మీరు చేస్తున్నది విద్యా ద్రోహం. ప్రైవేటు విద్యా విధానంతో పోటీ పడుతున్నామని చెబుతున్నారు, ఈ రెండేళ్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు వచ్చాయి.. ఎన్ని ప్రభుత్వ కాలేజీలు మూసివేశారో తెలియదా? కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎందుకు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వ కాలేజీలను మూసివేసి ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహిస్తున్నార’ంటూ ప్రభుత్వ తీరుకు నిరసనగా తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.మిగిలిన నాడు–నేడు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారు? వైఎస్సార్సీపీరాష్ట్రంలో ప్రభుత్వ విద్యను చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నాశనం చేస్తోందని, 80 శాతం పైగా నాడు–నేడు పనులు పూర్తయిన నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ బడులకు అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్రెడ్డి మనబడి నాడు–నేడు పనులపై మాట్లాడారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉండేవి కావని, 2020లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా నాడు–నేడు పథకం కింద రాష్ట్రంలోని 45,975 ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం నాడు–నేడు ఫేజ్–1లో 15,713 స్కూళ్లలో 14,133 స్కూళ్లను రూ.2,748 కోట్లతోపూర్తి చేశారని, ఫేజ్–2లో 22,311 స్కూళ్లను తీసుకున్నారన్నారు. ఈ స్కూళ్లల్లో 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయని, ఫేజ్–3లో 14,845 స్కూళ్లలో మైనర్ పనులు చేపట్టారన్నారు. గత ప్రభుత్వంలో రూ.8,524 కోట్లు ఖర్చు పెట్టి అద్భుత సంస్కరణలతో విద్యార్థులకు అవసరమైన 11 సదుపాయాలు కల్పించారన్నారు. ప్రభుత్వం మారడంతో 80 నుంచి 90 శాతం పూర్తయిన పనులను కూడా పూర్తి చేయలేదని, ఇవి ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా స్కూళ్లకు విద్యుత్ సదుపాయం, కొన్ని స్కూళ్లకు పెయింటింగ్ వేయలేదని, కోట్లు ఖర్చుపెట్టి కట్టిన స్కూళ్లకు మిగిలిన పనులు పూర్తి చేయకపోతే ఎలా? అని నిలదీశారు. ఈ రెండేళ్లల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, దీంతో విద్యార్థులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రతి పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ నాడు–నేడుతో విద్యా సంస్కరణలు తీసుకొచ్చారని, ఇది దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. చేపట్టిన పనుల్లో దాదాపు 90% పూర్తయ్యాయని మిగిలిన 10 శాతంలో కిటికీలు, విద్యుత్ పనులకు డబ్బులు కూడా ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రెండేళ్లల్లో 70 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారన్నారు. ఈ ప్రశ్నకు మంత్రి లోకేశ్ జవాబిస్తూ, తమ ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు లెర్నింగ్ అవుట్ కమ్పై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
20 నెలల్లో కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దగా అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. కొత్తవి ఇవ్వక పోగా, ఉన్న పింఛన్లలో కూడా కోత విధిస్తున్న తీరును తప్పు పట్టిన ప్రతిపక్షంపై దారుణంగా విరుచుకు పడిన చంద్రబాబు కూటమి.. చివరకు దిగొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో కొత్తవారికి ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదని అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే శుక్రవారం శాసన సభలో వెల్లడించారు. అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ కొత్తగా పింఛన్లు ఇవ్వడంలేదని, దీనివల్ల క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుండబద్దలు కొట్టారు. త్వరగా కొత్త పింఛన్లు ఇవ్వాలని కోరారు. మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, సంప్రదాయ చర్మకారుల్లో పింఛన్ పొందుతూ మరణించిన వారి భార్యలకు వెంటనే పింఛన్ ఇవ్వాలని నవంబర్ 2024న స్పౌజ్ ఆప్షన్ ఇచ్చామని మంత్రి చెప్పగా.. ఎక్కడా ఇది అమలు కావడంలేదని సభ్యులు స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వడానికి వెళ్లినప్పుడు పింఛన్ రాని వారి నుంచి దాడి ఎక్కువగా ఉంటోందని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 2024 సెప్టెంబర్కు ముందు భర్తలను కోల్పోయిన మహిళలు పింఛన్ రావట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజాదర్బార్ వినతుల్లో ఎక్కువగా ఇవే వస్తున్నాయన్నారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేస్తే 3 లక్షల మంది గతంలో పింఛన్ తీసుకున్న వ్యక్తులు చనిపోతే వారి భార్యలకు పింఛన్ రావట్లేదని తేలిందని అన్నారు. వీరిలో 1.10 లక్షల మంది అర్హులుగా గుర్తించామని, త్వరలోనే వారికి పింఛన్లు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు.భూ సమస్యల అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పొద్దుఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ సంబంధిత అర్జీలు లక్షల్లో పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పడం సరికాదని ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కారం కాక చెప్పులరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. భూ వివాదాలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రెవెన్యూ సిబ్బంది కుమ్మకై భూములు కబ్జా చేసి వేరే వాళ్లకు మ్యూటేషన్లు చేస్తున్నారని, సర్వేల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. అర్జీల పరిష్కారానికి ఓ విధానమంటూ లేదని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 14.42 లక్షల ఫిర్యాదులొస్తే వాటిలో 8.90 లక్షలు రెవెన్యూకు సంబంధించినవేనని మంత్రి అనగాని బదులిచ్చారు. రికార్డులు ట్యాంపరింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నందున సీఎం సమక్షంలో రాష్ట్రస్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, దీనికి చెక్ పెట్టేందుకు తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రశ్నోత్తరాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రతి 10–15 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్, జెట్టీ, ఫిష్ల్యాండింగ్ సెంటర్, పోర్టులలో ఏదో ఒకటి ఉంటుందని, మన రాష్ట్రంలో సువిశాల సముద్ర తీరం ఉన్నప్పటికీ ఈ తరహా సౌకర్యాలు లేవన్నారు. సామాన్యుడికి దొరికేదంతా కల్తీ ఆహారమే..ఆహారంలో కల్తీ ఎక్కువగా ఉందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. దీనిపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆహార కల్తీని అడ్డుకునేందుకు తమ వద్ద తగినంత సిబ్బంది లేరని చెప్పారు. 723 మంది సిబ్బందికిగాను 144 మంది మాత్రమే ఉన్నారని, 577 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.పింఛన్లను 39 లక్షల నుంచి 66.34 లక్షలకు పెంచిన వైఎస్ జగన్2019 ఎన్నికలకు నెలల ముందు కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నెలనెలా పింఛన్లు ఇచ్చింది 39 లక్షల మందికే. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెంచారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందించారు. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో లేదా వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక పోర్టల్ నిరంతరం పనిచేసేది. అర్హులకు ఎప్పటికప్పుడు పింఛన్లు మంజూరు చేశారు. దీంతో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు పెరిగింది. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ నెల (ఫిబ్రవరి) 1న జరిగిన పింఛన్ల పంపిణీలో 60,96,108 మందికే ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ 20 నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను ఇవ్వకపోగా, 5 లక్షలకు పైగా పింఛన్లు తగ్గిపోవడం గమనార్హం. కొత్త పింఛన్ల మంజూరు పూర్తిగా నిలిచిపోయింది. కనీసం అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆన్లైన్ పోర్టల్ నిలిచిపోయింది. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలోనూ కోత విధించి, రకరకాల వైద్య పరీక్షల పేరుతో వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దానినీ అమలు చేయకుండా ఆ వర్గాలను కూడా వంచించారు. పైపెచ్చు పింఛన్లు తగ్గింపు, కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంపై ప్రశ్నించిన విపక్ష నేతలపై చంద్రబాబు, ఆయన కూటమి నేతలు విరుచుకు పడుతుండటం గమనార్హం. -
నీకు చేతకాదు అని పవన్ కల్యాణే అన్నారుగా.. ఏకిపారేసిన వరుదు కళ్యాణి
-
అన్నీ సమస్యేలే... చంద్రబాబుకు మరో షాక్.. రెచ్చిపోయిన కొలికపూడి
-
Maqbool : కూటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం
-
Audimulapu : ఆల్రెడీ ప్రాణ భిక్ష పెట్టాడు.. అయిన చంద్రబాబుకు సిగ్గు రాలేదు
-
సెంటిమెంట్తో ఆటలా చంద్రబాబు.. కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకున్నావు
-
ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నా.. ఆ స్థలం YSRCP దే..
-
ఇందా డెయిరీ కల్తీ నెయ్యి బాగోతం.. ఆధారాలతో బయటపెట్టిన కేఎస్ ప్రసాద్
-
హెరిటేజ్ కోసమే కుట్ర! టీటీడీ నెయ్యి పై తీగ లాగితే..!
-
సూది కోసం సోదికెళ్తే.. పాత కథలన్నీ బయట పడుతున్నాయ్..
-
వేంకటేశ్వర.. నువ్వు ఉన్నావయ్యా.. చంద్రబాబు నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తున్నాడు..!
-
ముందు నెయ్యి.. వెనుక గొయ్యి..‘హెరిటేజ్’ కోసమే కుట్ర!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి.. అందులోనూ పరమపవిత్రంగా ప్రపంచమంతా భావించే తిరుమల శ్రీవారి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవేవీ ఆలోచించలేదు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై అంతులేని విషం అలవోకగా చిమ్మేశారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిశాయని అభాండాలు వేసేశారు. సీబీఐ సిట్ దర్యాప్తు జరిపి చార్జిషీట్ సమర్పిస్తూ క్లీన్చిట్ ఇచ్చినా ఆయన వెనక్కు తగ్గలేదు. లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో బాత్రూంల క్లీనింగ్కు వాడే రసాయనాలు కలిశాయని కూడా ఆరోపించారు. తన వాదనలను బలపరిచేందుకు సొంతంగా వన్మ్యాన్ కమిషన్ కూడా వేశారు. ఇక మానవమాత్రులెవరూ ఈ దుర్మార్గాన్ని అడ్డుకోలేరనుకున్నాడో ఏమో.. ఆ దేవదేవుడే దీనిపై దృష్టి సారించాడనుకుంటా.. చంద్రబాబు దు్రష్పచార కుట్ర వెనుక లోగుట్టు అనూహ్యంగా బద్దలయ్యింది. తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ డెయిరీకి అడ్డగోలుగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే బాబు ఇంతటి రాద్ధాంతం చేస్తున్నారన్న విషయం సాక్ష్యాలతో సహా బయటపడింది. ప్రసాదంపై దుష్ప్రచారంతో ఇతర డెయిరీలను భయభ్రాంతులకు గురి చేసి టెండర్లలో పాల్గొనకుండా చేయడం... ఏకపక్షంగా హెరిటేజ్ ఫుడ్స్ సిండికేట్కే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడం.. అసలు కుట్రన్న విషయం బయటపడింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో భాగమే ఇందాపూర్ డెయిరీ అని స్పష్టం చేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ వెబ్సైట్ ఇందాపూర్ డెయిరీ నుంచి 5,77,500 కిలోల నెయ్యిని 2015లో కొనుగోలు చేసినట్లు వెల్లడిస్తున్న టీటీడీ రికార్డులు తయారైన లడ్డూ ప్రసాదం సువాసనకు పైపూత కోసం 2018లో నెయ్యి సరఫరా టెండర్లను పిలిచిన టీటీడీ టీటీడీ నెయ్యి టెండర్ల తీగ లాగుతుంటే... హెరిటేజ్ ఫుడ్స్ డొంక కదులుతోంది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ ఫుడ్స్కు అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేరుగా కాకుండా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందిన మహారాష్ట్రలోని ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టి కథ నడిపించారు. అది కూడా కేవలం కిలో రూ.278 చొప్పున అతి తక్కువ ధరకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వడం గమనార్హం. ఇక ఆ ఐదేళ్లలో పూర్తిగా హెరిటేజ్ డెయిరీ ఆధ్వర్యంలోని పచ్చ సిండికేటే ఏకంగా రూ.189.19 కోట్ల విలువైన టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లను హైజాక్ చేసింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఇందాపూర్ డెయిరీ తెరపైకి వచ్చింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కొల్లగొట్టడం మొదలుపెట్టింది. 2014–19లో ఏకపక్షంగా కొనసాగించిన దోపిడీ విధానాన్ని పునరావృతం చేసేందుకే చంద్రబాబు పవిత్రమైన లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే కుతంత్రానికి బరితెగించారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై సృష్టించిన వివాదం మాటున చంద్రబాబు అవినీతి బాగోతం ఇదిగో ఇలా ఉంది... ‘ఇందాపూర్’ ముసుగే... దోపిడీ ‘హెరిటేజ్’దే 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులను హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు అడ్డగోలుగా కట్టబెట్టారు. అది కూడా ఇందాపూర్ డెయిరీ అనే సంస్థ ముసుగులో కట్టబెట్టడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. ఇందాపూర్ డెయిరీ ఎవరిదో కాదు హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థే అన్నది అసలు విషయం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చైర్పర్సన్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కు దేశంలో పాలు, పాల ఉత్పత్తులు(డెయిరీ ప్రొడక్ట్స్) తయారు చేసే 22 సంస్థలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ‘ఇందాపూర్ డెయిరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్’ కూడా వాటిలో ఒకటి. ఆ ఇందాపూర్ డెయిరీకే 2014–19లో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఇందాపూర్ డెయిరీతోపాటు గోవింద్ డెయిరీ, సుభీ డెయిరీ, ప్రీమియర్ డెయిరీ, సేలం నమక్కల్ డెయిరీ, హ ర్యానాలోని కమల్ మిల్క్ తదితర డెయిరీలతో సిండికేట్గా ఏర్పడి వ్యవహారం నడిపారు. ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టా రు. అంతే కాదు ఇందాపూర్ డెయిరీ సరఫరా చేసిన నె య్యి శాంపుల్స్ 2016లో ల్యాబ్ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆ డెయిరీపై అనర్హత వేటు వేశారు. కానీ నెలలోపే అనర్హతను తొలగించడం గమనార్హం. హెరిటేజ్ సిండికేట్కే అడ్డగోలుగా నెయ్యి కాంట్రాక్టులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందిన ఇందాపూర్ డెయిరీతోపాటు ఆ సిండికేట్లోని డెయిరీలకే చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది. 2014–19లో మొత్తం రూ.189.19 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని టీటీడీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. » 2015 జనవరిలో 16.50లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ టెండర్లు పిలిచింది. కాగా ఇందాపూర్ డెయిరీ వేసిన బిడ్ ఎల్ 1గా రాలేదు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్)కు చెందిన మదర్ డెయిరీ యూనిట్ ఎల్ 1గా నిలిచింది. దాంతో ఆ డెయిరీపై అప్పటి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఒత్తిడి తీసుకువచ్చి ఇందా పూర్ డెయిరీకి 35శాతం కాంట్రాక్టు దక్కేలా చే సింది. అంతేకాదు ఇందాపూర్కు అనుగుణంగా టెండరు నిబంధనలను కూడా సవరించారు. త ద్వారా ఇందాపూర్ డెయిరీకి 5,77,500 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. అదీ కిలో రూ.306కే. అంటే మొత్తం రూ.17.61 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. » 2015, మేలో ఇందాపూర్ డెయిరీకి 2.25లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. కిలో రూ.278 చొప్పున సరఫరాకే ఆ కాంట్రాక్టు ఇవ్వడం గమనార్హం. అంటే మొత్తం రూ.6.25కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టారు. » 2016 జనవరిలో 18లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కూడా ఇదే పచ్చ సిండికేట్కే కట్టబెట్టారు. కిలో నెయ్యి కేవలం రూ.285 చొప్పునే గోవింద్ డెయిరీ, సుభి డెయిరీలకు ఇచ్చారు. అంటే రూ.51.30 కోట్ల కాంట్రాక్టును దోచిపెట్టారు. » 2016 మార్చిలో మరోసారి అదే సిండికేట్కు నె య్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది. ఈసారి 2.25 లక్షల కిలోల నెయ్యిని కిలో రూ.306 చొప్పున సిండికేట్లోని గోవింద్ డెయిరీకి కట్టబెట్టారు. అంటే రూ.6.88 కోట్ల కాంట్రాక్టు ఇచ్చా రు. (విస్మయం కలిగించే అంశం ఏమిటంటే.. ఈ టెండర్లలో ఇందాపూర్ డెయిరీ పాల్గొంది. కానీ ఆ డెయిరీ నెయ్యి శాంపిల్స్ ల్యాబ్ పరీక్షల్లో విఫలమయ్యాయి. దాంతో అనర్హమైనదిగా ప్రకటించారు. ఆర్నెళ్లకే నిషేధం తొలగించి టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.) » 2016 ఏప్రిల్లో ప్రీమియర్ డెయిరీకి 20లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. అ ది కిలో రూ.332కే చొప్పునే. అంటే రూ.66.40 కోట్ల విలువైన కాంట్రాక్టు కట్టబెట్టారు. » 2016, సెప్టెంబరులో 2.25లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు హర్యానాలోని కమల్ మిల్క్ కంపెనీకి ఖరారు చేశారు. ఆ డెయిరీ తొలిసారి టీటీడీ టెండర్లలో పాల్గొంది. పచ్చ సిండికేట్లో చేరడంతోనే ఈసారి ఆ సంస్థ పేరిట కాంట్రాక్టు ఇచ్చారు. కిలో రూ.376 చొప్పున రూ.8.46 కోట్ల కాంట్రాక్టు దక్కింది. » 2018, నవంబరులో మరోసారి ఇందాపూర్ డెయీరీకి 6.17లక్షల కిలలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. ఇక అదే సిండికేట్లోని ప్రీమియర్ డెయిరీకి 3.33లక్షల కిలోల నెయ్యి, సేలం నమక్కల్ డెయిరీకి 85వేల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఇచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ సిండికేట్లోని ఆ మూడు డెయిరీలకు కిలో రూ.312 చొప్పున మొత్తం రూ.32.29కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. మీది కూడా కల్తీ నెయ్యేనా చంద్రబాబూ...!వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నెయ్యి రూ.340 నుంచి రూ.410 వరకు పలు సార్లు వివిధ రేట్లకు కొనుగోలు చేస్తే తక్కువ రేటు కాబట్టి కల్తీ నెయ్యి అని చంద్రబాబు నానా రాద్ధాంతం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే... 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కిలో నెయ్యి కేవలం రూ.278, కిలో రూ.306 చొప్పున కొనుగోలు చేయడం గమనార్హం. అది కూడా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కు చెందిన ఇందాపూర్ డెయిరీ నుంచే. అంటే తక్కువరేట్లే కాబట్టి ఇందాపూర్ డెయిరీతోపాటు హెరిటేజ్ సిండికేట్ ఐదేళ్లపాటు సరఫరా చేసింది కల్తీ నెయ్యేనని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా. మరి అందుకు చంద్రబాబు తిరుమల శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెబుతారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై పైపూతా...!?ఇక 2014–19లో హెరిటేజ్ సిండికేట్ సరఫరా చేసింది కల్తీ నెయ్యేననే వాదనను అప్పటి ప్రభుత్వమే బలపరిచే విధంగా వ్యవహరించడం గమనార్హం. లడ్డూ ప్రసాదాలు సువాసన వచ్చేందుకు పైపూతగా నెయ్యి సరఫరాకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలవడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యితోనే సువాసన రావాలి. కానీ సువాసన కోసం పైపూతగా నెయ్యి కొనుగోలు కోసం మళ్లీ టెండర్లు పిలవడం ఏమిటి...! అంటే హెరిటేజ్ సిండికేట్లోని డెయిరీలు సరఫరా చేసింది కల్తీ నెయ్యేనని ఒప్పుకున్నట్టే కదా. అందుకే పైపూతగా నెయ్యి సరఫరా కోసం 2018, ఆగస్టులో టెండర్లు పిలిచి పరాగ్ మిల్్క, దొడ్ల డెయిరీల నుంచి 87,750 కిలోల నెయ్యి కొనుగోలు చేసింది. దీనిని బట్టి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనేనని స్పష్టమవుతోంది. కూటమి రాగానే మళ్లీ తెరపైకి ఇందాపూర్ డెయిరీ2019లో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోగానే హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన ఇందాపూర్ డెయిరీ టీటీడీ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకుంది. అయిదేళ్లపాటు కనీసం బిడ్లు కూడా దాఖలు చేయలేదు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ తెరపైకి వచ్చింది. 2025 నవంబరులో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనడం గమనార్హం. కిలో రూ.658 చొప్పున నెయి సరఫరాకు బిడ్ దాఖలు చేసింది. మొత్తం 10లక్షల కిలోల నెయ్యిలో 35శాతం అంటే 3.50లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టారు. ఇక హెరిటేజ్ సిండికేట్లోని ఇతర డెయిరీలు మిగిలిన 6.50లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. అంటే మొత్తం రూ.65.80కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టేశారు. -
రూ.5 వేల కోట్ల భూమి ‘గీతం’కు ఎలా ఇస్తారు?
సాక్షి, అమరావతి: విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుడు, ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ ఆక్రమణలోని రూ.5 వేల కోట్లు విలువచేసే 55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా క్రమబద్ధీకరిస్తారని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ సంస్థలకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని నిలదీశారు. లులు, సత్వా, ఉర్సా తదితర కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రాసిచ్చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏ ప్రశ్న అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందన్నారు. విశాఖపట్నంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం 99 పైసలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దీనిపై దాదాపు గంటపాటు చర్చ సాగింది. ఈ అంశంపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గత 20 నెలల కాలంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే కేటాయించిన భూముల వివరాలపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ.. ఐదు సంస్థలకు 99 పైసలకే భూములు కేటాయించినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం తీసుకొచ్చేందుకే ఈ కేటాయింపులు చేశామన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణతో కలిసి వైఎస్సార్సీపీ తరఫున ప్రశ్న లేవనెత్తిన మాధవరావు, వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ఐటీ కంపెనీల పేరుతో విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అతి తక్కువ ధరలకు ఇచ్చేస్తున్నారు. రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకు 27 ఎకరాలు ఎలా కట్టబెట్టారు? ఆ సంస్థకు రూ.1,500 కోట్ల విలువైన భూమిని ఇచ్చేశారు. వాస్తవానికి భూములను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించి.. పరిశ్రమలకు ఇచ్చేందుకు ప్రభుత్వ రంగంలో ఏపీఐఐసీ ఉంది. కానీ వారు చేసే పనిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకిస్తున్నారు? ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ సంస్థలు మెరుగైన అభివృద్ధి చేస్తాయా? 99 పైసలకే భూములు ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చా? ఈ విధానం ఎక్కడైనా ఉందా? ఐటీ పార్కుల అభివృద్ధి నుంచి ఏపీఐఐసీని తప్పిస్తున్నారా? ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిని కూడా ప్రైవేటు కంపెనీలకు ఎందుకిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.లోపాయికారీ లావాదేవీలే..విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం, డేటా సెంటర్ అని చెబుతూ లోపాయికారీగా వాళ్లకున్న లావాదేవీలతో, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం అతి కారుచౌకగా భూ కేటాయింపులు చేస్తుందని బొత్స మండిపడ్డారు. ‘రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా 99 పైసలకు భూములు ఇచ్చుకోవచ్చని మంత్రి చెబుతున్నారు. విశాఖలోని విలీన భూములను 99 పైసలకే ఇస్తున్నారు. ఇందులో పారదర్శకత లేదు. వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి. పక్క రాష్ట్రాల్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. అక్కడ మార్కెట్ ధరలకు భూములు కొంటుంటే ఇక్కడ మాత్రం 99 పైసలకే ఇచ్చేస్తున్నారెందుకు? విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఇప్పుడిది కాదు. 2004లోనే ప్రారంభించాం. అప్పుడు ఆ శాఖ మంత్రిని నేనే. 2014–19 మధ్య మీరేం చేశారో మీ తండ్రి (చంద్రబాబు)ని చెప్పమనండి. ఇప్పుడు మీరు ఏదైతే ఎకో సిస్టం, డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారో వాటిని 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక (విశాఖలో అదాని డేటా సెంటర్) తెచ్చింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఈ భూ దోపిడీకి, లాలూచీలకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల వైఎస్సార్సీపీ నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖలో ఐదు సంస్థలకు 99 పైసల చొప్పున భూములు కేటాయించడం వాస్తవం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు 21.16 ఎకరాలు, కాగ్నిజెంట్కు 22.19 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు 13.29 ఎకరాలు, రహేజా రియల్ ఎస్టేట్కు 27.1 ఎకరాలు, సంవర్ధన మదర్శన్ ఇంటర్నేషనల్ సంస్థకు 3.55 ఎకరాలను 99 పైసలకే ఇచ్చాం. ఎకరం 99 పైసలకు కాదు. ఆయా సంస్థల్లో ఒక్కో సంస్థకు ఇచ్చిన మొత్తం భూమి 99 పైసలే. – శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానంఏడాది క్రితం రిజిస్టరైన సంస్థలకు రూ.వేల కోట్ల భూములా?గత 20 నెలల కాలంలో 99 పైసలకు ఐదు కంపెనీలకు భూములు ఇచ్చినట్టు చెబుతున్నారని, అయితే గత సంవత్సరంలో రిజిస్టర్ అయిన కంపెనీకి కూడా వేల కోట్ల విలువైన భూములు ఎలా కేటాయించారంటూ ఎమ్మెల్సీ మాధవరావు నిలదీశారు. ‘విశాఖ నడిబొడ్డున లులూ సంస్థకు 13.74 ఎకరాలు 99 ఏళ్లకు లీజుకిచ్చారు. విజయవాడలో రూ.156 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్ల భూమిని లీజుకిచ్చారు. ఇంత తక్కువ పెట్టుబడికి ఎంతో విలువైన భూమి ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం రూ.లక్ష కోట్లు పెట్టి టెండర్లు పిలిచి రాజధాని కడుతోంది. అదే 4.15 ఎకరాలకు టెండర్లు పిలిచి భవనం ఎందుకు కట్టడం లేదు?’ అని ప్రశ్నించారు. ‘ఇంకా పునాది దశలో ఉన్న అమరావతిలో భూముల ధరల కంటే విశాఖలో ఇంకా తక్కువకు ఇస్తున్నారు. వాస్తవానికి మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని తక్కువ ధరకు భూములిస్తారు. కానీ విశాఖలో ఎంతో విలువైన భూమిని ఇంత తక్కువకు ఎందుకిస్తున్నారో చెప్పాలి’ అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడులు జవాబిస్తూ 1994 నుంచి 2004 మధ్య నాటి సీఎం చంద్రబాబు తక్కువ ధరకు హైదరాబాద్లో భూములు కేటాయించబట్టే అనేక కంపెనీలు వచ్చాయన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. -
వైఎస్ జగన్పై ఈర్ష్య.. ‘సచివాలయం’ పదం తొలగింపు
సాక్షి, అమరావతి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. సచివాలయం అనే పదాన్ని తొలగిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాన్ని ‘స్వర్ణ గ్రామ’గా, వార్డు సచివాలయాన్ని ‘స్వర్ణ వార్డు’గా మార్పు చేశారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను సైతం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖగా మార్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్లో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నింటినీ వారి ఇంటి వద్దనే అందించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును కొనసాగిస్తే వైఎస్ జగన్ గుర్తుకు వస్తారనే ఈర్ష్య తోనే చంద్రబాబు సర్కారు పేర్లను మార్చిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చినప్పటికీ ప్రజలందరూ గ్రామ, వార్డు సచివాలయాలనే పిలుస్తారని, పేరు మార్చినంత సులభంగా ప్రజల మనసుల నుంచి ఆ ముద్రను తొలగించలేరని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారనేది రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను రద్దు చేయడం లేదా మార్పు చేయడం తప్ప ఆ పథకాలను అమలు చేయడం లేదనే విషయం ప్రజలు గుర్తించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
వైఫల్యాలపై నిలదీస్తాం.. అన్యాయాన్ని ప్రశ్నిస్తాం: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే కారణంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని.. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గొంతును వినిపిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. రాష్ట్రంలో క్యాష్, లోకేష్, సూట్ కేసు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మండలిలో గట్టిగా నిలదీస్తాం. అన్యాయపు పోకడలను గట్టిగా ప్రశ్నిస్తామని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.‘‘అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్టు చేయటం నుండి మా నేతలపై అక్రమ కేసుల వరకు చర్చిస్తాం. తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మా హయాంలో నాణ్యత లేని నెయ్యి టాంకర్లను వెనక్కు పంపాం. అవన్నీ పక్కాగా రికార్డులు కూడా ఉన్నాయి. చంద్రబాబు హయాంలోనే నాణ్యత లేని నెయ్యి వచ్చినట్టు సీబిఐ కూడా చెప్పింది. వీటన్నిటి పై మండలిలో గట్టిగా ప్రశ్నిస్తాం..సగటు హిందువు వినటానికి కూడా భయపడేలాంటి మాటలు చంద్రబాబు మాట్లాడారు. దీనిపై చంద్రబాబు హిందూ భక్తులకు క్షమాపణ చెప్పాలి. వేల కోట్ల విలువైన భూములను తమవారికి దోచి పెడుతున్నారు. గీతం యూనివర్శిటీకి ఐదు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టారు. వీటన్నిటిపై మండలిలో చర్చిస్తాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
Donthireddy: తాడేపల్లి హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదే.. ! చంద్రబాబు పచ్చి అబద్ధాలు
-
రూ.306లకే నెయ్యిని చంద్రబాబు హయాంలో సరఫరా చేశారు
-
బాబూ.. రెవెన్యూ రికార్డులు చూడు.. వాస్తవం ఇదే: దొంతిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదేనని.. చంద్రబాబు ఒకసారి రెవెన్యూ రికార్డులు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 223 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా ఉందని.. ఆ స్థలం రైల్వేది.. వ్యవసాయ భూమి కానేకాదన్నారు.‘‘గతంలో ఆ భూమిని రైల్వే వాళ్లు ప్యారీ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆ సంస్థ మూత పడటంతో తిరిగి ఆ భూమి రైల్వే పరిధిలోకి వెళ్లిపోయింది. మధ్యలో ప్రయివేటు వ్యక్తికి భూమి ఎలా వెళ్తుంది?. ఆ స్థలం తనది అంటున్న వ్యక్తి అసలు రైతు కానే కాదు. అబద్ధాన్ని పదేపదే చెప్తే నిజం అని నమ్మే రోజులు పోయాయి. వాస్తవాలు ఏంటో జనానికి తెలిసిపోతోంది’’ అని దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు.‘‘తాడేపల్లిలోని వివాదాస్పద భూమి ఇప్పటికీ రైల్వే రికార్డుల్లోనే ఉంది. సర్వే నంబర్లు 223, 226 సీ2లో 10.4 ఎకరాలు రెవెన్యూ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉన్నాయి. ఆ భూమిని 22ఏలో తమ ప్రభుత్వం పెట్టలేదు.. అది 2015 లోనే నమోదు అయ్యింది. 26-05-2016న ఆ భూమి గుంటూరు కలెక్టర్ రికార్డుల్లో నోటిఫై అయ్యింది. ఆ భూమిలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. గతంలో ఈఐడీ ప్యారీ ఫర్టిలైజర్ కంపెనీ నడిచింది. వాస్తవాలు తెలుసుకోకుండా తమ పార్టీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై దృష్టి పెట్టాలి. రైతులకు పరిహారం, సబ్సిడీలు అందడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వం తీసుకున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. రైల్వే భూమిని ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని వేమారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారు
-
తిరుమల నెయ్యిలో కొత్త కోణం.. ఇందాపూర్ సంగతేంటి?: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 300 రూపాయలకే స్వచ్చమైన నెయ్యి ఎవరు అందిస్తారు.. అది కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. గతంలో హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ నెయ్యి సంగతేంటి?. ఇందాపూర్లో కల్తీ జరిగిందా? అని ప్రశ్నించారు. అసలు నిజాలు బయటకు వస్తున్నాయి అని కామెంట్స్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ గురించి వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ ఫ్రాంచైజీ సంస్థ. 2015లో రూ.278కే నెయ్యి సరఫరా చేసింది. 2016లో ఇందాపూర్ సంస్థ డిస్ క్వాలిఫై అయ్యింది. కానీ, 2025 డిసెంబర్ 16న కేజీ నెయ్యి రూ.658కి ఇందాపూర్ సంస్థ దక్కించుకుంది. గతంలో 2013-19వరకు ప్రీమియర్ అగ్రి డైరీ నుంచి 40 లక్షలు కేజీల నెయ్యి సరఫరా చేశారు. ఈ నెయ్యి ఖరీదు దాదాపు 300లుగానే ఉంది. ఈ రెండు సంస్థలు 50 కోట్ల 40 లక్షలు నెయ్యి సరఫరా చేశాయి.ఇందాపూర్లో సరఫరా చేసిన నెయ్యి కల్తీదా? అనే అనుమానాలు ఉన్నాయి. మీ హయంలో తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసింది కల్తీనా?. రూ.300లకు సరఫరా చేసే నెయ్యి.. 658కి ఒకేసారి రెట్టింపు ధరకు ఎలా సాధ్యమైంది?. దీనిపై చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ స్పందించాలి. స్వచ్చమైన నెయ్యి రెండు వేల అయితే కానీ రాదు అని చంద్రబాబు పదేపదే చెప్పారు కదా?. తక్కువ రేటుకు సరఫరా చేసిన నెయ్యి కల్తీదా అనిపిస్తోంది. హెరిటేజ్ సంస్థ అనే పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాచేసినా దాగని సత్యం.. ఇప్పుడు బయట పడింది అని వ్యాఖ్యలు చేశారు. -
Chirla Jaggi: గుర్తుపెట్టుకోండి.. ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు ఉండవు..
-
Jakkampudi : చంద్రబాబుకు ఆ దేవుడే సరైన శిక్ష వేస్తాడు
-
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది. హిందూ మతోద్ధారకుడిగా తరచూ ప్రచారం చేసుకుంటున్న ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాయి ఈ పోస్టులు.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దిక్కుమాలిన వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై రుద్దేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పైగా.. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తొమ్మిది మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది బాబుగారికి. అక్కడ కూడా మరోసారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు కల్తీ అంటూ ఏదో మాట్లాడబోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని డబ్బుకోసం ఈ కల్తీ జరిగిందని తనకు తోచిన సలహాను చంద్రబాబు చెవిలో చెప్పేయత్నం చేశారు. దానిని అంగీకరించని చంద్రబాబు అవినీతి కాదు.. హిందూమతంపై దాడి చేయడానికి జరిగిన కుట్ర అని ప్రకటించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చెప్పారని, అప్పుడు తాను దానికి వ్యతిరేకంగా మెట్ల ద్వారా తిరుమల వెళ్లి దానిపై వారి పక్షాన క్షమాపణ కోరానని అన్నారు. నిజంగా ఆయన అలా చేశారా? అన్నది గుర్తు లేదు కాని కొంతమంది సోషల్ మీడియా ప్రముఖులు చూపిన ఆధారాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మొదలు టీడీపీ మీడియా, ఇతరత్రా వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు ఆరంభించాయి. హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్లాన్ చేశారు. పంచాయితీ ఎన్నికలు సందర్భంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పవిత్రమైన తిరుమల ప్రాంతంలో ఎన్నికలు జరపడం సరికాదన్న భావనతో వందేళ్లుగా తిరుమల కొండలుగా భావిస్తున్న ప్రాంతంలో ఎన్నికలు జరపవద్దని ఒక జీవో ఇచ్చారు. పచ్చ తమ్ముళ్లు దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సహచర ఎల్లో మీడియా సాయంతో వివాదాన్ని సృష్టించారు. ఆ జీవోను వైఎస్కు అంటకట్టి అందులోని వివరాల ప్రకారం రెండు కొండలే పరిధిలోకి వస్తాయని, ఏడు కొండలు రావని అంటూ గొడవ మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న రాజశేఖరరెడ్డి తిరుమల విస్తీర్ణంపై ఉన్న అస్పష్టతను వెంటనే తొలగిస్తూ మొత్తం ఏడు కొండలూ వచ్చేలా కచ్చితమైన జీవో ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో 18 ప్రముఖ హిందూ దేవాలయాలున్న ప్రాంతాలను టెంపుల్ సిటీలుగా ప్రకటించి ఆయాచోట్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అన్యమత ప్రచారంపై నిషేధం విధిస్తూ మరో జీవో జారీ చేశారు.అంతేకాదు... వైఎస్ తన హయాంలో తిరుమల విశిష్టతను కాపాడేలా, హిందు మత విశ్వాసాలను పరిరక్షించేలా అనేక చర్యల తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలో ఎస్వీబీసీ ఛానెల్ పెట్టి స్వామివారి ప్రచారం చేయాలని సంకల్పిస్తే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలోనే వ్యతిరేకించారు. ఆ ఛానెల్కు రూ.40 కోట్లు వృథా అని అని వాదించారు. 2009 ఎన్నికలకు ముందు గుంటూరు వద్ద జరిగిన బైబిల్ మిషన్ ఉత్సవాల్లో చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏడు కొండలూ తిరుమలేశుడివే అని, అన్యమత ప్రచారం నిషేధిస్తూ వైఎస్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తామని ఆ సభలో ప్రకటించారు. ఈ జీవోల వల్ల క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు అన్నారట. ఇప్పుడేమో తాను రెండు కొండలు, ఏడు కొండలు పోరాటం చేశానని చెబుతున్నారు. అప్పుడేమో హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించే జీవోను రద్దు చేస్తామన్నారు. 2019-24 మధ్యలో అన్యమత ప్రచారం జరిగిపోతుందన్నట్లు వదంతులు సృష్టించి టీడీపీ మీడియా ప్రచారం చేసేది. ఎంత ఆత్మవంచన.2009లో ప్రముఖ హిందూవాది టి.హనుమాన్ చౌదరి ఒక లేఖ రాస్తూ చంద్రబాబు తీరును తప్పు పట్టారు. అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చే విధంగా జీవో ఇస్తానని చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ, ఎస్టీ హిందువులకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మరో హామీని కూడా ఆయన విమర్శించారు. క్రిస్టియన్ ఓట్ల కోసం, మత మార్పిడులను ప్రోత్సహించేలా చంద్రబాబు ఇలాంటి హామీలు ఇచ్చారని విమర్శిస్తూ 2009 ఫిబ్రవరి మూడున రాసిన లేఖ సోషల్ మీడియా యాక్టివిస్టులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇది రాకపోతే చంద్రబాబు చెప్పే మాటలు నిజమేనేమో, ఈయన హిందుత్వ కోసం కట్టుబడి ఉండే వ్యక్తేమో అన్న భావన ఉండేది కదా!.1996 ఎన్నికల సమయంలో చంద్రబాబు కమ్యూనిస్టులతో పొత్తులో ఉండేవారు. ప్రచార సభలో బీజేపీని మతతత్వ పార్టీగా, మసీదులు కూల్చే పార్టీగా ధ్వజమెత్తేవారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని మహానాడులో ప్రకటించారు. కానీ, ఆ తర్వాత జరిగిన సంగతులు తెలిసినవే. గుజరాత్లో జరిగిన మత కలహాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి దించాలని డిమాండ్ చేసి, తదుపరి లోక్సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఓటింగ్ వరకు ఉండకుండా జారుకున్నారు. 2019లో ప్రధాని మోదీపై వ్యక్తిగత పరుష వ్యాఖ్యలు చేసింది ఇటీవలి చరిత్రే. 2024 వచ్చేసరికి మోదీ ప్రపంచానికి మార్గదర్శి అని, దేశానికి ఆయన గొప్ప సేవలు చేస్తున్నారని ప్రకటించారు. ఇప్పటికీ కూడా ప్రధానిని అదే తరహాలో పొగుడుతున్నారు.ఇక లడ్డూ వివాదంలో తను చేసిన ఆరోపణ నిజమని జనాన్ని నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈయన మాటలను సీరియస్గా తీసుకుంటున్నట్లు లేదు. అందువల్లే ఢిల్లీ టూర్లో మీడియా లడ్డూ గురించి అడిగినా స్పందించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో హెరిటేజ్ పెరుగు నాణ్యతపై వచ్చిన ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ సంస్థ రూ.లక్ష జరిమానా విధించిన సమాచారం రాగానే చంద్రబాబుకు చెందిన ఆ కంపెనీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా ఉంది. ల్యాబ్ పరీక్షల తీరుపై హెరిటేజ్ సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది. సీల్డ్ ప్యాకెట్ల నుంచి పెరుగు సాంపుల్ తీశారా? లేక లుజ్గా తీసుకున్నారా? అన్న సందేహం వ్యక్తం చేసింది.డెయిరీ ఉత్సత్తులలో వివిధ కారణాల వల్ల స్వల్పంగా విశ్లేషణలలో తేడా రావచ్చని, ఇందులో ప్రమాదకరమైనవి కాని, ప్రజారోగ్యానికి భంగం కలిగించేవి ఏవీ లేవని పేర్కొంది. ఒక ప్రైవేటు సంస్థ అయిన హెరిటేజ్ ఇంత కంగారుపడి ఈ ప్రకటన చేసిందే. మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తదితరులు పదే పదే జంతు కొవ్వు, పంది మాంసం వంటివి లడ్డూలో కలిశాయని చెబుతున్నారే. అధి ధర్మమేనా ? అంటే తన సంస్థ కైతే ఒక రూల్స్.. అదే ప్రజలందరూ కొలిచే దైవం విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తారా? తన దాకా వస్తేకాని తత్వం బోధపడదని అంటారు! ఇదే అన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సర్కార్ శాడిజం.. కాపు నేతపై కన్నింగ్ ప్లాన్
-
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టులో రాంబాబు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు తాజాగా అంబటిపై మరో కేసుకు సంబంధించిన పిటీ వారెట్పై విచారణకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా, గతేదాడి నవంబర్ 12న పట్టాభిపురం వైఎస్సార్సీపీ ర్యాలీ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో, అంబటి జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. ఆయన బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మరో కేసులో అరెస్ట్కు రంగం సిద్దం చేసింది. 2023లో(ప్రైవేట్ కేసు నమోదు) సత్తెనపల్లి పరిధిలో నమోదైంది. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పిటీ వారెంట్ జారీచేశారు. కేసుకు సంబంధించి పిటీ వారెంట్పై విచారణకు అంబటి రాంబాబును గుంటూరు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీ వారెంట్పై అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరు పరిచారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబంధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. -
ఇందాపూర్ పేరుతో టీటీడీకి హెరిటేజ్ కంపెనీ నెయ్యి సరఫరా...
-
ఏపీలో సూపర్ సిక్స్ మోసాల ఖరీదు లక్షన్నర కోట్ల రూపాయలు.. రాష్ట్ర గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు
-
ఎవరి పాపం.. ఎవరికి శాపం ?
-
‘దొడ్డి’దారిన సర్కారు కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అమానవీయ రీతిలో నిత్యం అవమానాలు, మానసిక క్షోభ, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో వారు నలిగిపోతున్నారు. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులైతే సర్కారు వేధింపులకు తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయినా సర్కారులో వీసమెత్తు అపరాధభావం కనిపించడం లేదు. పైగా మరింత పాశవిక చర్యలకు పూనుకుంటోంది. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల వద్ద విధులు కేటాయించడం, పిండ ప్రదానాల వద్ద డ్యూటీలు వేయడం సర్కారు నీచరాజకీయానికి ప్రబల నిదర్శనం. రోజుకు మూడు షిఫ్టుల్లో.. డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న ఎందరో యువత గత ప్రభుత్వ హయాంలో తమ సొంత గ్రామాల్లోనే పేదలకు సేవలందించే అవకాశం దక్కడంతో గ్రామ/వార్డు సచివాలయాల కొలువుల్లో చేరారు. లక్షలాది మందితో పోటీ పడి పరీక్ష రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. సమాజంలో హోదా, గౌరవాన్ని పెంచుకున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక రాజకీయ కారణాలతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను పదేపదే వేధిస్తోంది. పనిభారం విపరీతంగా పెంచి కక్ష సాధింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా 14 నుంచి 16వ తేదీ వరకు జగ్గయ్యపేట మండల పరిధిలోని ముక్తేశ్వరం గ్రామంలో వాహనాల పార్కింగ్తో పాటు, మెయిన్ రోడ్లు, ఘాట్లు, మహిళా స్నానాల గదులు, టాయిలెట్ల దగ్గర సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రోజుకు మూడు షిఫ్టుల్లో ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విధులు కేటాయించింది. పురుషులు, మహిళల టాయిలెట్ల దగ్గర ప్రత్యేకంగా ఇద్దరేసి సిబ్బందిని విధులు చేయాలని ఆదేశించింది. పిండ ప్రదానాలు జరిగేచోట ఒక్కొక్కరు చొప్పున విధుల్లో ఉండాలని హుకుం జారీ చేసింది. ఎవరైనా ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. ఈ మేరకు బుధవారం జగ్గయ్యపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి పేరిట ఆదేశాలు వెలువడ్డాయి.మా రక్తం ‘మరుగు’తోంది సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన డ్యూటీ ఆర్డర్లు చూస్తే రక్తం మరుగుతోంది. టాయిలెట్ల దగ్గర కాపలా ఉండమని సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారా? సచివాలయ ఉద్యోగులు మనుషులు అనుకుంటున్నారా? లేక ప్రభుత్వానికి వెట్టి చాకిరీ చేసే బానిసలు అనుకుంటున్నారా? ఒక పక్క సర్వేల టార్చర్, మరోపక్క రెగ్యులర్గా చేయాల్సిన పనుల ఒత్తిడి తట్టుకోలేక గుండెపగిలి చనిపోతున్నారు. ఇంకొందరు జీవితం మీద విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో ఏకంగా ఐదుగురు సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. సచివాలయం ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం కనికరం చూపకుండా ఇంకా అడ్డమైన పనులు చెబుతోంది. ఏటా ఉత్సవాలు జరిగే చోట ఎప్పుడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి దారుణమైన పనులు అప్పగించడం ఏమిటి? శని, ఆదివారాలు సెలవు రోజులు. పైగా పండుగ రోజు పనులు చెప్పడం ఒక తప్పయితే అందులో షిఫ్టుల పద్ధతిలో రేయింబవళ్లూ మరుగుదొడ్ల దగ్గర నిలబెడతారా? డిగ్రీలు, బీటెక్ చేసి ఉద్యోగాల్లోకి వచ్చింది ఇందుకేనా? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించాలి. ఈ ఉత్తర్వులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – కాకర్ల వెంకటరామి రెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎంప్లాయీస్ ఫెడరేషన్సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల దగ్గర డ్యూటీలు వేసిన ఆర్డర్ కాపీ -
ఆర్టీసీపై చావుదెబ్బ!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని చావుదెబ్బ కొట్టింది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులు ఉన్న అతి పెద్ద రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి దొంగదెబ్బ తీసింది. దాదాపు రూ.6 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు బరితెగించింది. ఇప్పటికే విజయవాడ ఆర్టీసీ డిపో–1కు చెందిన రూ.600 కోట్ల విలువైన 4.15 ఎకరాలను చంద్రబాబు తన అస్మదీయ సంస్థ లూలూ గ్రూప్నకు కట్టబెట్టింది. తాజాగా ఆర్టీసీ వెన్నెముకను విరిచేస్తూ విభ్రాంతికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ–బస్సుల నిర్వహణ సంస్థల ముసుగులో ఏకంగా రూ.6 వేల కోట్ల విలువైన భూములను అస్మదీయ సంస్థలకు ధారాదత్తం చేయడానికి రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో పావులు కదుపుతోంది. ‘ప్రధాన మంత్రి ఈ–బస్ సేవా’ పథకం కింద ప్రవేశ పెట్టే విద్యుత్ బస్సు (ఈ–బస్సు)లను ఈ ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ను అందుకే తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశ పెడతామని తేల్చి చెప్పింది. ఇక్కడే తిర‘కాసు’ ఈ–బస్సులను ప్రవేశపెట్టే ప్రైవేటు సంస్థలే తమకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలి. అంటే బస్సుల చార్జింగ్ కేంద్రాలు, గ్యారేజీలు, బస్సులు నిలుపుదల చేసే ప్రదేశాలను ఆ సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా ఒప్పందంలో విస్మరించింది. ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఈ–బస్సులకు చార్జింగ్ కేంద్రాలు, గ్యారేజీలు, ఇతర వసతులను ఆర్టీసీ డిపోల్లోనే ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పోనీ ఆ డిపోలను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే కొనసాగిస్తూ ప్రైవేటు సంస్థలకు యూజర్ చార్జీలు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కూడా పట్టించుకోలేదు. ఆర్టీసీ డిపోలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 29న నిర్వహించిన సమావేశంలోనే ఆమోద ముద్ర వేసింది. మొదటి దశలో రాష్ట్రంలోని 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 4న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు వీలుగా ఆ 12 డిపోలను ఈ నెల 25లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆ డిపోల ద్వారా నిర్వహిస్తున్న బస్సులను ఇతర డిపోలలో సర్దుబాటు చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ డిపోల్లో ఆర్టీసీ చేపట్టిన సివిల్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని కూడా స్పష్టం చేసింది. అంటే ఆ డిపోలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసినట్టేనని తేల్చి చెప్పింది. రూ.6 వేల కోట్ల భూములు అన్యాక్రాంతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నెముక. ఆ వెన్నుముకకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలలో అత్యంత విలువైన ప్రదేశాల్లో ఉన్న డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు లెక్క వేసుకున్నా.. ఆ 12 డిపోల మార్కెట్ విలువ ఏకంగా రూ.6వేల కోట్లు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కలం పోటుతో ఆర్టీసికి చెందిన రూ.6 వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యుత్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఆలోచనను వెంటనే వెనక్కు తీసుకోవాలి. అత్యంత విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాలి. 12 ఆర్టీసీ డిపోలను ఖాళీ చేయాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలను ఉధృతం చేస్తాం. ఐక్య కార్యాచరణ కమిటీ పోరుబాట పడుతుంది. ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. – సీహెచ్.సుబ్బారావు, కట్టా సుబ్రమణ్యం, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు12 డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కోసం ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు అన్యాక్రాంతం కానున్న 12 డిపోలు 1. సింహాచలం – విశాఖపట్నం 2. గాజువాక – విశాఖపట్నం 3. రాజమహేంద్రవరం 4. కాకినాడ 5. విద్యాధరపురం – విజయవాడ 6. మంగళగిరి – అమరావతి 7. గుంటూరు –2 8. నెల్లూరు 9. మంగళం – తిరుపతి 10. కడప 11. అనంతపురం 12. కర్నూలు -
ఉన్నత విద్యకు ఉరి!
భారతదేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలుపుకుని, హామీలు నెరవేర్చామని చెప్పుకునే వారు కొందరు.. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే అన్నీ చేసేశామని చెప్పుకునే వారు ఇంకొందరు.. ఇందులో మొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే, రెండో వ్యక్తి చంద్రబాబునాయుడు.. అయితే తండ్రిని మించిన తనయుడిగా మంత్రి లోకేశ్ మరో నాలుగడుగులు ముందుకేసి ఉత్తుత్తి ఆదేశాలతో ప్రజలను మభ్యపెడుతుండటం విస్తుగొలుపుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చి.. అంటే బిల్లు పెట్టుకోవచ్చని ఇచ్చే అత్యంత సాధారణ ఉత్తర్వు. దీనిపై పండుగ చేసుకోండంటూ ప్రచారం చేసుకోవడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులందరినీ తామే ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం లోకేశ్కే చెల్లింది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో ఫీజు డబ్బులు చెల్లించడం తమ బాధ్యత అంటూ ‘ఎక్స్’ వేదికగా చాటుకోవడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యకు ఉరితాడు బిగిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో నక్కజిత్తులు ప్రదర్శిస్తూ విద్యార్థులను నిలువునా మోసం చేస్తోంది. కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తీర్చలేక కాగితాలపై కుయుక్తులు పన్నుతోంది. ఏ ప్రభుత్వంలోనైనా సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చాకే ప్రచారం చేసుకుంటారు. కానీ, దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చి, పండగ చేసుకోమని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు విద్యా శాఖ మంత్రి లోకేశ్ మాత్రమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. స్వేచ్ఛగా కళాశాలలకు వెళ్లలేని దుస్థితిలో చదువు దినదిన గండంగా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించట్లేదు. మరోవైపు ఫీజులు కట్టకుంటే కళాశాలలు పరీక్షలు రాయనివ్వట్లేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసినా, సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. గత రెండేళ్లుగా ఉన్నత విద్యా రంగంలో ఇదే తంతు నడుస్తోంది. తమ బిడ్డల చదువుల కోసం ఎందరో పేదింటి తల్లులు పుస్తెలు తాకట్టుపెట్టి, ఫీజులు కట్టిన ఉదంతాలు కోకొల్లలు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై విద్యార్థులను, కళాశాలలను మభ్య పెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా ముగుస్తుండగా.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.6,300 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఇచ్చింది కేవలం రూ.700 కోట్లే. ఇంకా రూ.5,600 కోట్లు బకాయిలున్నాయి. పైగా పేదింటి విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద చెల్లించాల్సిన రూ.2,200 కోట్ల ఊసే ఎత్తట్లేదు. మొత్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యలో రూ.7,800 కోట్లు బకాయిలు ఉంటే.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం రాత్రి రూ.1,200 కోట్లు విడుదల చేయొచ్చంటూ బీఆర్వో ఇచ్చి విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పిందొకటి.. చేస్తున్నది మరొకటి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం మొదలు పెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కరోనా విలయ తాండవం చేసినప్పటికీ, సమర్థవంతంగా ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగిస్తే.. చంద్రబాబు మాత్రం పాతరేసేశారు. అంత్యంత పారదర్శకంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి, కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికారు. తీరా చూస్తే 20 నెలల పాలనలో ఉన్నత విద్యా కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద అరకొర నిధులు విదిల్చి మమ అనిపించారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన నిధులను ఆపేసి, ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ఫలితంగా రూ.7,800 కోట్ల బకాయిల కొండ దర్శనమిస్తోంది. వసతి దీవెన ఎగ్గొట్టి తీరని అన్యాయం చంద్రబాబు కర్కశ పాలన పేదింటి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి చదువుల కోసం వచ్చే విద్యార్థులు హాస్టళ్లలో జీవనం సాగిస్తుంటారు. అలాంటి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా గత వైఎస్ జగన్ ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. ఇప్పటిదాకా మూడు విడతలకు గాను రూ.2,200 కోట్లు బకాయిపెట్టి, విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది. కాగా, అధికారమే పరమావధిగా ఎన్నికలప్పుడు చంద్రబాబు.. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వరుసగా రెండు దఫాల్లోనూ ముఖం చాటేశారు. ఇప్పుడు మూడోసారి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చినా, ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మాత్రం నోరు మెదపట్లేదు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సుస్థిరత దిశగా పాలన సాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అప్పులు, వడ్డీల లెక్కలతో కాలం గడిపేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్సిటీలనే కాదు ప్రైవేటు విద్యా సంస్థలను సైతం నట్టేట ముంచేసే కార్యక్రమాలకు ఒడిగట్టింది. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. అతికష్టంపై నెట్టుకొస్తున్న దుస్థితి. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రైవేటు యాజమాన్యాలకు ఈ విద్యా సంవత్సరం చివరి వరకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని, అయితే అందుకయ్యే వడ్డీని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు భరించాలని ప్రతిపాదించింది. తీరా, బ్యాంకుల దగ్గరకు వెళ్లేసరికి అప్పు పుట్టక పోవడంతో ప్రభుత్వం ముఖం చాటేసింది.విశ్వవిద్యాలయాల నిధులు దారి మళ్లింపు» ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తీవ్రంగా దెబ్బ తీసింది. ప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా, వర్సిటీ నిధులను దారిమళ్లించి వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు విశ్వవిద్యాలయాల నుంచి ఏకంగా రూ.1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. వాటిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు బదిలీ చేయించి, తద్వారా ఇతర అవసరాలకు వినియోగిస్తోంది. » ఉన్నత విద్యా మండలి ఖజానా నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చినబాబు ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోవిడ్ను అధిగమించి వర్సిటీలకు నూతన జవసత్వాలు అందించే ప్రయత్నం విస్తృతంగా జరిగింది. మళ్లీ చంద్రబాబు సర్కార్ రాకతో ప్రభుత్వ వర్సిటీలకు గడ్డుకాలం దాపురించింది. నేడు అరకొర.. నాడు ఫుల్ బడ్జెట్» చంద్రబాబు ఉన్నత విద్యకు అరకొర బడ్జెట్ కేటాయించడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2025–26 బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చూపించింది. ఆ మేరకు నిధులు విడుదల చేసిందా అంటే అదీ లేదు. ఈ ఏడాది భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచడంతో పాటు ఆ మేరకు విడుదల చేయాల్సి ఉంది. » వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేసింది. పైగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని రూ.1,778 కోట్ల బకాయిలు సైతం చెల్లించింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ఇచ్చింది. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేసింది. ఇలా మొత్తం ఐదేళ్లలో గత ప్రభుత్వం ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో పరిగణనలోకి తీసుకుని మే నెలలో నిధులు విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రెడ్బుక్పై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదా? మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపాటు సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్లు రెడ్ బుక్ రాజ్యాంగంపై పెడుతున్న శ్రద్ధ విద్యార్థులపై చూపించట్లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.7,800 కోట్లున్నా నిమ్మకు నీరెత్తి¯] ట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇతర శాఖల్లో వేలు పెట్టే లోకేశ్.. తన శాఖలో విద్యార్థుల కష్టాలను తీర్చలేని అసమర్థ మంత్రిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి, తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేవారన్నారు. ఫలితంగా విద్యార్థులు హాయిగా చదువుకునే వారని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ ఫీజులు చెల్లించక పోవడంతో కళాశాలలు విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించట్లేదని దుయ్యబట్టారు. విజయవాడ సమీపంలోని ఎనికేపాడులోని విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థినులను ఫీజు పెండింగ్ ఉందనే కారణంతో రీసెర్చ్ రివ్యూ మీటింగ్కు అనుమతించక పోవడం దారుణం అన్నారు.బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఏదిపడితే అది మాట్లాడొద్దు..
సాక్షి, అమరావతి: గత శాసనసభ సమావేశాల్లో మాదిరిగా ఏదిపడితే అది మాట్లాడితే సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్లు తెలిసింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం జరిగిన ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఏ పనులు జరగడంలేదని విరుచుకుపడడంతో చంద్రబాబు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఎలా మాట్లాడాలి, ఏ అంశాలు మాట్లాడాలి అనే అంశాలపై వారికి సూచనలు చేశారు. గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన కొందరు ఎమ్మెల్యేలను ఆయన ఈ సమావేశంలో పరోక్షంగా హెచ్చరించారు. జనం అన్ని విషయాలు చూస్తారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. కచ్చితంగా తొమ్మిది గంటలకు సభకు హాజరుకావాలని ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని.. వారితో ఈ సమావేశాల్లోనే తాను వ్యక్తిగతంగా మాట్లాడతానన్నారు. అలాగే, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తిస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని, వాటిని తమ దృష్టికి తీసుకురావాలని సభ్యులకు చంద్రబాబు చెప్పారు. 20 నెలల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మాట్లాడుతూ.. మరో 15 ఏళ్లు కూటమి కలిసే ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో పనిచేసినట్లుగానే భవిష్యత్తులోనూ పనిచేయాలన్నారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని.. కూటమి ధర్మానికి ప్రతిఒక్కరూ కట్టుబడి పనిచేయాలని సూచించారు. -
శాంతిభద్రతలను కాపాడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎదుట నినదించింది. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరని నిప్పులు చెరిగింది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. ప్రజల గొంతు వినిపించనివ్వరు.. ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. రైతు సమస్యలు వినిపించనివ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే నినాదంతో కూడిన బ్యానర్లతో పాటు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ నాలుగో నంబర్ గేటు ద్వారా సభ్యులు సభలోకి వచ్చారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే ప్లకార్డును వైఎస్ జగన్ స్వయంగా పట్టుకుని లోపలకు ప్రవేశించారు. వైఎస్ జగన్ తన స్థానంలో ఆశీనులవ్వగానే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి.. హామీలిచ్చారు.. అమలు మరిచారు.. అర్హులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినదిస్తూ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ, గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ నేపథ్యంలో మార్షల్స్ పోడియం వద్దకు చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులు ముందుకు వెళ్లకుండా వలయంగా నిలబడ్డారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. -
అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
‘ఎల్లో మీడియా కథనాల కూర్పుగా గవర్నర్ ప్రసంగం’
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా కథనాలు కూర్పుగా గవర్నర్ ప్రసంగం ఉందని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లలో వచ్చే కథనాలనే పుస్తకంగా అచ్చేసి ఆయనతో చదివించారేమోనన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ప్రసంగమంతా చూస్తుంటే భ్రమలు, అబద్ధాలు, కాకి లెక్కలు, నిరాధార ఆరోపణలే కనిపిస్తాయని వివరించారు.ఒక్క మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్మీట్ పెట్టి కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. విజనరీనని చెప్పుకునే చంద్రబాబు పాలనలో అడుగడుగునా వింత పోకడలే తప్ప విషయం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ నిలదీస్తుందని ప్రభుత్వం భయపడుతోందని, సభలో ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకూడదనే భయంతోనే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చెప్పారు.ప్రతిపక్ష హోదా విషయంలో గవర్నర్ చొరవచూపాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 164 మంది సభ్యులున్న కూటమికి 11 మంది వైఎస్సార్సీపీ సభ్యులకు సమాధానం చెప్పే దమ్ము లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు రావడానికి వైయస్సార్సీపీ సిద్ధంగా ఉందని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అట్టర్ ఫ్లాప్ సినిమాకి కలెక్షన్ల వర్షం అన్నట్టుందికూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోనైనా వాస్తవాలు ఉంటాయనుకుంటే ఆయనతో కూడా పచ్చి అబద్దాలు చెప్పించారు. ఆయన ప్రసంగం చూస్తే నిత్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5, ఏబీయన్లలో వస్తున్న కథనాలను వింటున్నట్టు, చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలనే పుస్తకంగా అచ్చేసి గవర్నర్తో చదివించారేమోనని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఊసే లేదు. అవే అబద్ధాలు, కాకి లెక్కలు, నిరాధార ఆరోపణలు, ఏదో జరిగిపోతుందన్న భ్రమలు.. ఇవి మాత్రమే కాకుండా నిత్యం ఎల్లో మీడియాలో కనిపించే వైఎస్సార్సీపీ మీద ఏడుపులు, పెడబొబ్బలు.. స్థూలంగా గవర్నర్ ప్రసంగం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాకి కలెక్షన్ల వర్షం కురిసిందని ప్రెస్మీట్ పెట్టి చెప్పుకున్నట్టుగా ఉంది.20 నెలల్లో రూ. 3.27 లక్షల కోట్ల అప్పులు చేసి పతనం వైపున రాష్ట్రాన్ని నడిపిస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్టు గవర్నర్ తో చెప్పించడం హాస్యాస్పదంగా ఉంది. నిన్నటి వరకు చేసేందేమీ లేదు. ఈరోజు ఏం చేస్తాడో తెలియదు.. కానీ ఏరో స్పేస్ సిటీ, ఎలక్ర్టానిక్ సిటీ, క్వాంటం సిటీల పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. ఎవరో చేసిన హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ డెవలప్మెంట్ను ఇప్పటికీ తన గొప్పగానే చెప్పుకుంటున్నాడు.ఇళ్లు లేవు, పింఛన్లు లేవు, మహిళలకు రక్షణ లేదుపునర్నిర్మాణం, అభ్యుదయం, అభివృద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ప్రభుత్వం.. రెండేళ్లవుతున్నా విధ్వంస పాలన అంటూ వైయస్సార్సీపీ మీద నెపం నెట్టడం దౌర్భాగ్యం. గత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో రూ. 100 కోట్లు పెట్టి దిగిపోతే ఐదేళ్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా నడిపించారు. రూపాయి అవినీతి లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. సంపద సృష్టిస్తానని ప్రజలకు నమ్మబలికి 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం.. సంపద సృష్టించడం పక్కనపెడితే రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి శ్రీలంక హీనంగా మార్చేశాడు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ. 3.36 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 20 నెలలకే రూ. 3.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీల ఏర్పాటు పేరుతో విశాఖలో భూముల పంపకం తప్పించి చంద్రబాబు చేసింది శూన్యం.చేసిన తప్పులు, హామీలు అమలు చేయలేని చేతకానితనాన్ని, జరుగుతున్న అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఆఖరుకి కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని వివాదాల్లోకి పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటు. కూటమి నాయకుల దారుణాలను ప్రశ్నిస్తే మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులు చేశారు. శాంతిభద్రతల పతనం జరుగుతుంటే గవర్నర్ ప్రసంగంలో దాని ఊసే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశంలోని అత్యున్నత స్థానం నుంచి అట్టడుగు స్థాయికి పడిపోతే గవర్నర్ ప్రస్తావించలేదు. ఒక్క పింఛన్ కొత్తగా ఇవ్వకపోగా 5 లక్షల పింఛన్లు తొలగించారు. ఒక్క ఇంటి స్థలం మంజూరు చేయకపోయినా ఇంటి నిర్మాణాలు ఆపేశారు.ఫీజు రీయింబర్స్ బకాయిలు క్లియర్ చేయకపోయినా, ఆరోగ్యశ్రీతో వైద్యం అందకపోయినా, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోయినా.. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న బడాయి మాటలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి.. ట్రూఅప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు రెండింతలు పెంచేసి దోచుకుంటున్నారు. శ్రీశైలం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భక్తుల మీద లాఠీ చార్జీ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగారు. ఆస్తుల కోసం ఆలయాల నేలమట్టం జరుగుతోంది.సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన నాయకుల పాలనలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా గవర్నర్ ప్రస్తావన ఎక్కడా లేదు. వక్ఫ్ భూములు, ఆలయాలకు చెందిన ఎండోమెంట్ భూములు కాజేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేస్తుంటే గవర్నర్ ప్రసంగంలో దాని ప్రస్తావనే కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్న ప్రతిపక్షం మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు.ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సభలో సమయం ఇవ్వాలి కదాఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీ, అత్యాచారాలు రాజ్యమేలుతున్నాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సభలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ.. ఆరు కోట్ల ప్రజలందరి తరఫున 175 నియోజకవర్గాల సమస్యలను సభలో బలంగా వినిపించాలంటే అసెంబ్లీలో సమయం కావాలి కదా. సమయాన్ని కేటాయించకుండా అసెంబ్లీకి రమ్మంటే ఎలా? దీనిపై గవర్నర్కి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా గొంతు వినిపించకపోతే అమాయకులకు న్యాయం జరిగేది ఎలా?వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే నిబంధన ఎక్కడైనా ఉందా? గవర్నర్ దీనిపై స్పందిస్తారని ఆశించినా ఫలితం కనిపించలేదు. పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు రావాల్సిన నీటి వాటాను వినియోగించుకుంటుంటే చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడు. రాయలసీమ ప్రాంతానికి సంజీవని లాంటి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టేశాడు. వీటన్నింటిపై అసెంబ్లీలో చర్చకు రాకూడదని, చర్చకు వస్తే ప్రజలకు సమాధానం చెప్పే దమ్ములేక వైయస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి వెనకడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ హెచ్చరించినట్టుగానే దోచుకో పంచుకో తినుకో లాంటి పాలన నడుస్తోంది.జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలుఅసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని బలంగా నిలదీయాలని ఉంది. కానీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడిపోతోంది. దీనిపై గవర్నర్ గారు కూడా చొరవ చూపించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై ఇప్పటికే గవర్నర్కి వినతిపత్రం ఇచ్చినా చర్యలు కనిపించలేదు. అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప, నిర్మాణం జరగడం లేదు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు విలువైన భూములు బినామీలకు రాసిచ్చేస్తున్నాడు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేశారని తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. -
విడుదల కాకుండా ... అంబటిపై మరో కేసులో ఇరికించాలని చూస్తోన్న పోలీసులు
-
అంతా డొల్ల బాబు ఒప్పందాల అసలు కథ
-
రాష్ట్రంలో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు
-
దేవుడితో పెట్టుకున్నోడెవడూ బతకడు చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త
-
శ్రీశైలంలో శివ భక్తులపై లాఠీచార్జ్ ఘటనపై బీజేపీ ధార్మిక సెల్ ఆగ్రహం
-
తప్పు చేశాం.. నేతల కళ్ళల్లో పశ్చాత్తాపం
-
వైఎస్సార్సీపీ నిరసనలతో దద్దరిల్లిన సభ
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలు, అసత్యాలు ఉన్నాయని.. కూటమి ప్రభుత్వం కావాలనే గవర్నర్తో తప్పుడు ప్రసంగం చేయిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తూ.. ప్రతిపక్ష నేతలు, వారి ఇళ్లపై జరుగుతున్న దాడులను సభ వేదికగా ఖండించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద నిరసనలు తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నిస్తామనే కారణంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజల తరఫున గళం విప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని.. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై కచ్చితంగా గళం వినిపిస్తామన్నారు. అనంతరం, సభలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు.. అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం, సభ్యుల హక్కులను కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదువుతున్నారు. తన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదు. 3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోందని.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది లేదన్నారు. మహిళా సాధికారత కొరవడింది.. రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఉద్యోగులపై ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వం తెచ్చే ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది. వాలంటీర్లకు హామీలిచ్చి ఈరోజు రోడ్డున పడేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాటతప్పారు. ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి యువతను మోసం చేశారు. దేశంలోనే గవర్నెన్స్లో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇవన్నీ గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. అనంతరం, సభను వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. -
ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని YSRCP డిమాండ్
-
హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదట..!
ప్రపంచంలో తానే అత్యంత నీతిమంతుడినని.. తాను పుట్టిన తర్వాతే లోకంలో పద్ధతి నీతి నిజాయితీ ధర్మం అని ఉద్భవించాయని చెప్పే చంద్రబాబు తాను నిర్వహించే హెరిటేజ్ పెరుగులో పెరుగు లేకుండానే కేవలం కల్తి ఉత్పత్తులను మార్కెట్లోకి పంపించి కోట్లు కొల్లగొడుతున్నారు. శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడినట్లు ప్రపంచంలో అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు ఆయన సారధ్యంలోని హెరిటేజ్ కల్తీ ఉత్పత్తులని అమ్ముతూ దొరికిపోయింది. పెరుగు అంటూ విక్రయిస్తున్న ఆ ప్యాకెట్లలో అసలు పెరిగే లేదని గురుగాంలో ఏకంగా కేసు నమోదయింది. వివిధ స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో అది మొత్తం కల్తీ అని తేలడంతో ఏకంగా లక్ష రూపాయలు పెనాల్టీ సైతం విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీంతో దెబ్బకు దెయ్యం జడుస్తుంది అన్నట్లుగా హెరిటేజ్ సంస్థ దారికి వచ్చింది. ఈ క్రమంలో సంస్థ ఒక ప్రకటన చేసింది. హెరిటేజ్ సంస్థపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. . తమ ఉత్పత్తుల తయారీలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తామన్నారు. తమకు వెన్న శాతం తగ్గించే ఉద్దేశమే లేదన్నారు. ఇదే తరుణంలో అసలు హెరిటేజ్ పెరుగుకు సంబంధించి శాంపిల్స్ సేకరించే ప్రక్రియ సరిగా లేదంటూ ఎదురుదాడి చేసింది.అయితే హెరిటేజ్ ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలను సేకరింంచే సమయంలో సరైన పద్ధతి పాటించలేదన్నారు.. ఆ మొత్తం ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. 'నిర్దేశిత ప్రమాణాల కంటే ఎస్ఎన్ఎఫ్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్ నివేదికలో తేలింది. దీంతో అసలు ఆ నమూనాల సేకరణ ప్రక్రియ సరిగా లేదని బుకాయిస్తోంది.మరి తిరుపతి లడ్డూకు ఈ నిబంధనలు వర్తించవాహెరిటేజ్ ఉత్పత్తులకు సంబంధించి నమూనాలు సేకరించే క్రమంలో నిబంధనలు పాటించలేదని, థర్డ్ పార్టీ సమక్షంలో నమూనాలు తీయలేదని అంటూ ప్రభుత్వ సంస్థలను వాటి పనితీరును తప్పుపట్టిన హెరిటేజ్ దాని యజమాని చంద్రబాబు తిరుపతి లడ్డు విషయంలో మాత్రం తమకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తిరుపతి లడ్డు కోసం వినియోగించే నెయ్యిని కల్తీ చేశారంటూ అవాస్తవాలు ప్రచారం చేసిన చంద్రబాబు నా నమూనాలు సేకరించే విషయంలో ప్రమాణాలు పాటించారా లేదా చెప్పడం లేదు. బోలె బాబా డైరీ నుంచి వచ్చే నెయ్యి నమూనాలను థర్డ్ పార్టీ సమక్షంలో సేకరించారా లేదా. .. నెయ్యి నమూనాలను ని ట్యాంకర్ల నుంచి నేరుగా సేకరించారా ? లూజ్ నెయ్యిని వేరే పాత్రలోకి తీసుకుని దాన్ని ల్యాబ్ పరీక్షలకు పంపారా అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. తాము బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి తమకు ఇబ్బంది వచ్చినపుడు నీతులు చెప్పడం పద్ధతి కాదని ప్రజలు అంటున్నారు. ఎదుటివారిపై అభాండాలు వేసేటపుడు వెనకా ముందూ చూడని చంద్రబాబు తనవరకు వచ్చేసరికి అందరూ నిబంధనలు పాటించాలని రోదిస్తున్నారు.తిరుమల లడ్డుకోసం వాడే నేతి కి సంబంధించి నామూనాలు థర్డ్ పార్టీ సమక్షంలో తీసారా లేదా.. నేతి నాణ్యతను నిర్ధారించే పరీక్షలు సరిగానే చేశారా లేదా అనేది తేల్చకుండానే బురద చెల్లుతున్న చంద్రబాబు తన హెరిటేజ్ పెరుగు విషయానికి వచ్చేసరికి రూల్స్..నిబంధనలు అంటూ ఆక్రందనలు చేస్తున్నారు. నీవరకు వచ్చేసరికి ఒక రూల్.. మిగతావారికి ఇంకో రూల్ ఎలా బాబూ -
కల్తీపై ఢిల్లీ రిపోర్టర్ ప్రశ్న.. తప్పించుకున్న చంద్రబాబు
-
ఒంటెత్తు పోకడలతో ఒంటరిగా మిగిలిన గల్లా మాధవి
-
చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక అసలు కుట్ర ఇదే
-
దొరికిపోయా.. కాపాడండి ప్లీజ్.. లడ్డూపై దుష్ప్రచారం.. సాయం కోసం ఢిల్లీకి..
-
ఇక రోడ్లూ.. ప్రైవేటుకే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ‘పీపీపీ’ పిచ్చి ముదురుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకున్న బాబు సర్కారు.. ఇపుడు విశాఖ రహదారులను సైతం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ‘నగర రోడ్ల అభివృద్ధి కార్యక్రమం’ పేరుతో కావాల్సిన వారికి జీవీఎంసీ ఖజానాను దోచి పెట్టాలని నిర్ణయించింది. విశాఖ వాసులపై ‘హైబ్రిడ్’ భారం మోపుతూ.. నగరంలోని 88.35 కిలోమీటర్ల మేర 53 రహదారులను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్íÙప్(పీపీపీ) కింద ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న దీని అంచనా వ్యయం అక్షరాలా రూ.306.95 కోట్లు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ గతేడాది డిసెంబర్ 31న బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బిడ్ దాఖలు గడువు ఈనెల 12వ తేదీతో ముగుస్తుంది. జీవీఎంసీ ఖజానా లూటీ ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూరేలా ప్రాజెక్టు విధి విధానాలను రూపొందించడం గమనార్హం. జీవీఎంసీయే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని భరిస్తూ.. ప్రైవేటుకు మాత్రం లాభాలు కట్టబెట్టేలా టెండర్కు రూపకల్పన చేయడం విశేషం. మూడు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టును 40:60 వాటా ప్రకారం చేపట్టనున్నారు. రోడ్ల నిర్మాణ సమయంలో అయ్యే ఖర్చులో 40 శాతం మొత్తాన్ని జీవీఎంసీ ఐదు విడతలుగా ప్రైవేటు సంస్థకు చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతం పెట్టుబడిని ప్రైవేటు సంస్థ తన సొంత నిధులు లేదా బ్యాంక్ రుణాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థ పెట్టిన 60శాతం పెట్టుబడిని.. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత జీవీఎంసీ 10 ఏళ్ల కాలపరిమితిలో 20 సమాన వాయిదాలలో తిరిగి (బ్యాంక్ రుణాలపై విధించే కనీస వడ్డీ రేటు(ఎంసీఎల్ఆర్)తో పాటు 1.25 శాతంతో) చెల్లించేలా ప్రతిపాదించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పెట్టుబడి లేని ప్రైవేటు వ్యాపారం ఇలా ఇవ్వడమంటే కాంట్రాక్టు సంస్థకు పైసా పెట్టుబడి లేని వ్యాపారమే అవుతుంది. ఈ ప్రాజెక్టులో నిర్మాణ వ్యయం కంటే నిర్వహణ, ఇతర రుసుముల పేరిట కేటాయించిన నిధులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొత్తం రూ.306.95 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో.. రోడ్ల నిర్మాణానికి కేవలం రూ. 168.03 కోట్లు మాత్రమే కేటాయించారు. మిగిలిన మొత్తంలో 10 ఏళ్ల నిర్వహణ కోసం రూ.86.20 కోట్లు, ఇతర పన్నులు, ప్రాజెక్టు నిబంధనల కోసం ఏకంగా రూ.52.71 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంతేకాకుండా, ఎంపికైన కాంట్రాక్ట్ సంస్థకు ప్రాజెక్టు వ్యయంలో 1.25 శాతం (ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫీజు) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారీ వ్యయం చూస్తుంటే.. సాధారణ రోడ్ల మరమ్మతు పనులను కూడా అత్యంత ఖరీదైన ప్రాజెక్టులుగా మార్చి నగరపాలక సంస్థ ఖజానాను ఖాళీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వచ్చే 10 ఏళ్ల పాటు భారీ మొత్తంలో వడ్డీతో కూడిన వాయిదాలు చెల్లించాల్సి రావడం భవిష్యత్తులో నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ సంస్థకు కాసుల వర్షమే ఈ ప్రాజెక్టు దక్కించుకునే కాంట్రాక్ట్ సంస్థకు కాసుల వర్షం కురుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాంట్రాక్టర్ పెట్టే 60 శాతం పెట్టుబడి ఖర్చును కూడా బ్యాంక్ వడ్డీతో పాటు అదనంగా మరో 1.25 శాతం కలిపి జీవీఎంసీ తిరిగి చెల్లిస్తుంది. రోడ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు ప్రైవేటు సంస్థ వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును కూడా జీవీఎంసీ విడిగా వాయిదాలతో సంబంధం లేకుండా చెల్లిస్తుంది. ఈ ప్రాజెక్టుకు పెట్టిన పెట్టుబడితోపాటు ఆ రోడ్ల వెంట వాణిజ్య ప్రకటనల లబ్ధిని కాంట్రాక్టర్కు కట్టబెడుతున్నారు. రోడ్డు మధ్యలో ఉండే మీడియన్లు, వీధి దీపాలు, బస్టాపులు, స్ట్రీట్ ఫర్నిచర్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయాన్ని సదరు కాంట్రాక్టు సంస్థే దక్కించుకుంటుంది. అంతేకాకుండా, రోడ్డు కటింగ్ పర్మి షన్ల ద్వారా వచ్చే ఫీజులు కూడా ఆ సంస్థకే చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. అంటే.. ఒకవైపు ప్రజల పన్నుల రూపంలో రూ.కోట్లు ఆన్యుటీ చెల్లిస్తూనే.. మరోవైపు నగరంలోని విలువైన ప్రకటనల ఆదాయాన్ని కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం గమనార్హం. ఇప్పటికే 2025 డిసెంబర్ 31న టెండర్ నోటిఫికేషన్ జారీచేసిన జీవీఎంసీ అధికారులు జనవరి 20వ తేదీన ప్రీ బిడ్ సమావేశం కూడా నిర్వహించారు. బిడ్లను సమర్పించేందుకు ఫిబ్రవరి 12వ తేదీ వరకూ గడువు విధించడంతో పాటు ఫిబ్రవరి 27న ప్రైస్ బిడ్ను తెరవనున్నట్టు కూడా ప్రకటించారు. అనంతరం ఒప్పందం చేసుకున్న తర్వాత 12 నెలల్లోగా రోడ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ రోడ్లను సదరు కాంట్రాక్టు సంస్థలే 10 ఏళ్లపాటు నిర్వహించనున్నారు. తద్వారా ఈ రోడ్లపై జీవీఎంసీ నుంచి పూర్తిస్థాయిలో ప్రైవేటు చేతుల్లోకి పోనున్నాయన్నమాట. అంతేకాకుండా పీపీపీ కింద గుర్తించిన రోడ్లన్నీ నగరంలో కీలకమైన ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. ఈ రోడ్లపై వచ్చే ప్రకటనల ద్వారా ప్రస్తుతం జీవీఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం మొత్తం తాజా నిర్ణయంతో ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లడం వల్ల జీవీఎంసీ గుల్ల అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పీపీపీ కింద గుర్తించిన రోడ్లు (జోన్ల వారీగా) -
‘విజనరీ’ పాలనలో కల్పిత గణాంకాలు
‘‘11.09 శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న మన రాష్ట్రం... పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించకమానదు. ‘విజనరీ’ నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి’’ - ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ట్వీట్సాక్షి, అమరావతి: ‘పన్నుల ఆదాయం వృద్ధిలో మన రాష్ట్రం.. దేశంలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇదీ చంద్రబాబు 22వ ర్యాంక్ విజన్..!’ అంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ.. సీఎం చంద్రబాబు కల్పిత గణాంకాలతో చెబుతున్న అవాస్తవాలను ఎండగడుతూ.. కూటమి సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. చంద్రబాబు నాయకత్వంలో అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారం చేయడం లాంటి అంశాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం సాధించగలిగిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..ప్రచారం ఎక్కువ.. పని తక్కువ..అబద్ధాలు, మోసాలు.. ఇదీ బాబు 22వ ర్యాంక్ విజన్» రాష్ట్రం తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందనేందుకు ప్రభుత్వ ఆదాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) గణాంకాలతో ప్రజలను మభ్యపెట్టి, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే తప్పుడు భావన కలిగిస్తోంది.» 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతం (నామినల్ జీఎస్డీపీ)గా ఉందని, జాతీయ వృద్ధిరేటు 9.8 శాతం మాత్రమేనని.. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75 శాతంగా ఉంటుందని, జాతీయ వృద్ధిరేటు 8.0 శాతం మాత్రమేనని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 11.09 శాతంగా చూపిస్తోంది. అంతేకాదు.. వాస్తవ (రియల్) జీఎస్డీపీ వృద్ధి పరంగా ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారు చేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. » ఆ గణాంకాలే నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలకు కాగ్ గణాంకాలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఆశ్చర్యకరంగా రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి (సీఏజీఆర్) కేవలం 1.97 శాతం మాత్రమే ఉంది. 11.09 శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించక మానదు. ‘విజనరీ’ నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి. » ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 9 నెలల పాటు 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను కాగ్ విడుదల చేసింది. పన్ను ఆదాయాల వృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. » అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64 శాతం పెరిగితే, ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97 శాతం మాత్రమే పెరిగాయి. అయినా కూడా చంద్రబాబు ప్రకారం ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట! చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా విషయంలో మొదటి స్థానం సాధించగలదంటే... అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, విషప్రచారం లాంటి విషయాల్లో మాత్రమే!! -
శివ భక్తులపై లాఠీచార్జి దుర్మార్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలనలో శ్రీశైలంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం, బాధాకరమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రూపంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం బయటపడిందన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయాల ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయని ఎత్తిచూపారు. తిరుమల లడ్డూనూ పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందని వివరించారు.శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..‘‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది.కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇస్తున్న సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2025లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..: ⇒ తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.⇒ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.⇒ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.⇒ జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. ⇒ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు గారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.⇒ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ -
శివభక్తులపై లాఠీచార్జ్ బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివ స్వాములపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను తెలుపుతూ ట్వీట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది.జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు.దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది2025లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారిశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారుశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయిజాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందిభక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
దేశంలోనే ఏపీ రైతులపై అతి ఎక్కువ అప్పుల భారం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంత అప్పుల భారంలో ఉన్నారో పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) లోక్సభలో ఏపీలో రైతుల అప్పుల భారంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ,. శివరాజ్సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో ఏపీలోని రైతుల అప్పుల పరిస్థితి ఎలా ఉందనేది తేటతెల్లమైంది. ఇది దేశంలోనే ఏపీ రైతుల అతి ఎక్కువగా అప్పుల భారంగా శివరాజ్సింగ్ చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. జూలై 2018- జూన్ 2019 మధ్య ఏపీ రైతు కుటుంబం సగటు అప్పు రూ.2,35,554 రూపాయలుగా ఉన్నట్లు శివరాజ్ సింగ్ వెల్లడించారు. ఇది తెలంగాణ రైతుల సగటు అప్పుల భారం కంటే ఎక్కువగా నమోదైంది. తెలంగాణ రైతుల సగటు అప్పుల భారం రూ.1,52,113 ఉండగా, ఏపీ రైతుల సగటు అప్పుల భారం రూ.2,35,554 గా ఉంది. దేశవ్యాప్తంగా రైతు కుటుంబం సగటు అప్పుల భారం 74,121 రూపాయలు కాగా, ఏపీలో మాత్రం అత్యధికంగా ఉండటం గమనార్హం. -
22 వ స్థానానికి పడిపోయిన ఏపీ.. పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ
-
Sachivalayam: 550 మందికి పైగా మరణించారు.. మేము మనుషులమే మాకు కుటుంబాలు ఉన్నాయి..
-
జగన్ దమ్మున్న మొనగాడు.. మీలా చేతకాని రాజకీయాలు YSRCP చేయదు
-
తప్పు చేసి దొరికిపోయి కవర్ చేసేందుకు హార్పిక్ డ్రామా
-
హిందువుల దోహులు ఎవరంటే..? చంద్రబాబు, పవన్
-
‘లడ్డూ కల్తీ పేరుతో చంద్రబాబు వికృత రాజకీయాలు’
సాక్షి, విశాఖపట్నం: తిరుమల లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ వ్యవహారంతో చంద్రబాబు వికృత రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తన అసమర్థత బయట పడకుండా ఏడాదిన్నరగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నాడని, శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూడటం సిగ్గచేటన్నారు. తిరుమలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.చంద్రబాబు సీఎంగా ఉండగా టీటీడీ రిజెక్టు చేసిన ట్యాంకర్లు దొడ్డి దారిన ఎలా ప్రవేశించాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. బోలేబాబా డెయిరీకి కూడా గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతి లభించిందని, అంతేకాకుండా ఎన్నికల సమయంలో 2019 ఏప్రిల్ లో 82 వేల కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ ఎలా ఇచ్చారని నిలదీశారు. దీనిపై సీబీఐ సిట్ చార్జిషీట్ లో అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆలయ ప్రతిష్టను దిగజార్చారుస్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఏడాది క్రితం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన సీబీఐ సిట్ చార్జిషీట్ తప్పని తేల్చడంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తప్పును చేశామని అంగీకరించి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. అబద్ధాన్ని నిజం చేయడమే లక్ష్యంగా మరిన్ని తప్పులు చేస్తున్నారు.ఏకంగా కేబినెట్ మొత్తాన్ని మీడియా ముందుకు పంపించి శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా మంత్రులతో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు. దేవుడితో ముడిపడిన సున్నితమైన అంశాన్ని పట్టుకుని వికృత రాజకీయాలకు తెరదీయడం సిగ్గుచేటు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రోజుకో కట్టు కథలు ప్రచారం చేస్తూ ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారు. లడ్డూకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలిసిందని మొన్నటిదాకా ప్రచారం చేసిన కూటమి నాయకులు.. కొత్తగా పామాయిల్, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయంటూ తిమ్మిని బమ్మిని చేసే కుట్రకు తెరదీశారు.బాబూ.. వీటికి సమాధానం చెప్పువాస్తవానికి తాను చేసిన ఆరోపణలన్నింటికీ తానే సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు.. ఆ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టేసి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు. చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీకి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిల్స్ తోనే ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ పరీక్షలు జరిపింది. ఆ నెయ్యి లోనే పామాయిల్, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అండ్ కో పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజుకో కల్పిత కథనాలు రాసి ప్రజలను అయోమయానికి గురిచేసి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా కల్తీ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీ రిజెక్టు చేసి వెనక్కి తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లనే దొడ్డి దారిన తెప్పించి లడ్డూ తయారీకి వాడారు. దీనికి సీఎంగా ఉన్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందిపోయి దొంగే దొంగ అన్నట్టుగా ఆయనే తిరుమలపై తప్పుడు ప్రచారం ఊపందించాడు. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశంపై రాజకీయాలు చేస్తూ లబ్ది పొందాలనుకోవడం సిగ్గుచేటు. సీబీఐ చార్జిషీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు 2014-19 వరకు రూ. 273.90 లకు తిరుమలకు నెయ్యిని సరఫరా చేసింది. వాస్తవం ఇలా ఉంటే నువ్వుల నూనె కన్నా తక్కువ ధరకు నెయ్యి ఎలా సప్లై చేస్తున్నారని వారే ప్రశ్నిస్తారు.నేరం చేసినట్టు సీబీఐ చార్జిషీట్లో పొందుపరిచిన బోలేబాబా డెయిరీకి కూడా చంద్రబాబు సీఎంగా ఉండగానే టీటీడీకి అనుమతి లభించింది. మార్చి 6, ఏప్రిల్ 19, 2019న 82 వేల కేజీలు ఒకసారి, 12 వేల కేజీలు ఇంకోసారి నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేసే బల్క్ ఆర్డర్ ఇవ్వడంపైన సీబీఐ సిట్ అనుమానం వ్యక్తం చేసింది. పైగా ఆ ఆర్డర్ కేజీ విలువ రూ.291 మాత్రమే కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకి లేదా? బోలేబాబా డెయిరీకి 82 వేల కేజీల నెయ్యిని రూ.291లకు ఆర్డర్ ఇవ్వలేదని, టీటీడీ రిజెక్టు చేసి పంపిన నెయ్యిని అడ్డదారిలో తెచ్చి వాడలేదని చంద్రబాబు సహా కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయగలరా? 2015లో టీటీడీకి నెయ్యిని సప్లై చేస్తున్న నందిని డెయిరీ పేరుతో విజయవాడలో డూప్లికేట్ నెయ్యి తయారు చేసి 12 ట్యాంకర్లు సప్లై చేస్తే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ చేసిన విషయం నిజమా కాదా? ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలకు ఏం సమాధానం చెబుతారు?హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్అధికారంలో ఉన్న చంద్రబాబు తన వద్ద ఉన్న వ్యవస్థలతో విచారణ జరిపించి ఎవరైనా తప్పు చేసి ఉంటే న్యాయ స్థానాల్లో శిక్షలు పడేలా చేయకుండా రోడ్డెక్కి తప్పు ప్రచారం చేయడం, తనకు అనుకూల పత్రికలు, టీవీలలో ఊదరగొట్టడం, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, కరపత్రికల ద్వారా తిరుమల ప్రతిష్టకు నష్టం వాటిల్లేలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు చంద్రబాబుకి ఎవరిచ్చారు?చంద్రబాబు చేసిన మహాపచారం తెలుగుదేశం పార్టీకి అంటుకుని ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేకుండా పోతుందనే భయంతో పాపాన్ని జనసేన, బీజేపీకి అంటించడానికే ప్రెస్మీట్ పెట్టించాడు. కానీ అక్కడ కూర్చున్న వారందరిలోనూ తప్పు చేశామన్న భావన కనిపిస్తోంది. దేవుడితో ఆటలాడుకుంటున్నామన్న అపరాధం కనిపిస్తోంది. స్వామీజీలు, పీఠాధిపతులు, భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించే చంద్రబాబు మోసాలను ఇకనైనా గుర్తించి ఆయన్ను ప్రశ్నించాలి. తన అసమర్థ పాలన నుంచి ఎన్నికల హామీలు అమలు చేయలేని చేతకాని తనం నుంచి ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేయడానికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడితో ఆటలాడుకుంటున్న చంద్రబాబుని నిలదీయాలి. చేసిన తప్పుకి పశ్చాత్తాపం ప్రకటించకుండా అబద్దాలు, మోసాలతో మభ్య పెట్టాలని చూస్తున్న కూటమి నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి. -
చంద్రబాబు పాలన సక్కగ లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే
-
మీ కక్ష రాజకీయాలతో.. సొంత కంపెనీలోనే ఇంత కల్తీ చేశాడు ..
-
జగన్పై కుట్ర.. కేంద్ర హోంశాఖకు YSRCP లేఖ
-
విశాఖ ఉక్కు కర్మాగారంపై కమ్ముకుంటున్న నీలినీడలు
-
KSR Show: రాజకీయ నిరసనలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలట..!
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాబు సర్కార్ కీలక నిర్ణయం
-
చంద్రబాబు మూక నిర్వాకం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
-
కలియుగ దైవంపై 'నారా'రూపరాక్షసుల కుట్ర
-
టీడీపీ ర్యాంకింగ్లో చిట్టచివరి స్థానంలో గల్లా మాధవి
-
తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్ కో!
తమిళనటుడు కమల్హాసన్ తెలుగువారి కీర్తి దశదిశలా మారుమోగేలా చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో తెలుగువారు గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవిత ‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్’’ను చదివి వినిపించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ కవితకు ఆర్థం తెలుగువారికి బాగా తెలుసంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అది వేరే సంగతి.ఒక పక్క ఓ తమిళ నటుడు తెలుగువారి సాహితీ వైభవాన్ని చాటిచెబితే ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అందరి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం మాత్రం తెలుగువారికి ఏమంత గర్వకారణం కాదు. అంతేకాదు.. ఈ రాజకీయ బురదలోకి బాబు అండ్ కో బీజేపీ నేత మాధవ్ను కూడా దింపేశారు. కల్తీ మకిలిని మాజీ సీఎం జగన్పైకి నెట్టేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలం కావడం.. జగన్ జనాల్లో తిరుగుతూ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోవడంలేదుఅందుకేనేమో.. పవన్కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మరికొందరు మంత్రులతో మూకుమ్మడిగా ప్రెస్మీట్ పెట్టి జగన్, వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. మత కోణాన్ని తెచ్చి జగన్ను దెబ్బతీయాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. ఈ క్రమంలోనే పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ చంద్రబాబు హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని వింత వ్యాఖ్యలు చేస్తూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. సహజంగానే ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర అసహనం కలిగింది.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారని ధైర్యంగా చెప్పగలిగి ఆయన గౌరవం పెరిగేది జనసైనికులలో ఆయనపై నమ్మకం కలిగేది. కాని ఆయన మౌనంగా కూర్చోవడం వారి గుండె మంటకు కారణమైంది. ఎందుకంటే హిందూ ధర్మం అయినా, మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కాని దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాటేమిటి? ఏ కారణం వల్లనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, మహిళలు హింసను కూడా భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? సంసారాలు విడాకుల వరకు వెళ్లగూడదని చెప్పడం వేరు. అసలు విడాకులు తీసుకోవమే నేరం అన్నట్లు మాట్లాడడం వేరు.ఇది ఒక కోణమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని చంద్రబాబు ఇంకో దిక్కుమాలిన వాదన తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక, ప్రజలలో వచ్చిన అప్రతిష్టను డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థి జగన్పై బురద రాయాలన్న తాపత్రయంలో, ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికి తెలుసు.విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే, తాను స్వామివారి భక్తుడిని అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీపై తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నా, గోబెల్స్ మాదిరి అదే తప్పుడు ప్రచారం పదే, పదే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటూ ఉంది.పవన్ కళ్యాణ్ తాను గతంలో చేసిన కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత పాతపాటే పాడారు. చంద్రబాబు బతిమలాడారా? బెదిరించారా? ఈ వివాదంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటీ అంటనట్లే ఉంటున్నారు. కాని చంద్రబాబు ఆయన్నూ పనికట్టుకుని ప్రెస్మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఈయనకు కూడా అంటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి ఏ రకంగా పనిచేసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్రమ పద్ధతిలో వివరించారు. అదంతా వింటే జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై దర్యాప్తునకు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో ఈ విచారణ చాలావరకు చంద్రబాబు చేతి నుంచి జారి పోయింది. రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు సిట్లో ఉన్నా ప్రధాన పాత్ర సీబీఐది కావడం వల్లనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక ఇవ్వగలిగారు.ఈ పరిణామంతో తాము జనంలో బాగా పలుచనయ్యామన్న సంగతిని అర్థం చేసుకున్న చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని ఏకంగా ఫ్లెక్సీలు కట్టి జగన్, సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలపై దుష్ప్రచారం చేయించారు. జంతు కొవ్వు ఆరోపణ చేయడం, అరాచకపు ఫ్లెక్సీలు కట్టించడం, లడ్డూకు ఏదో అయిందన్నట్లు అదే పనిగా ప్రచారం చేయించడం.. వీటిని కదా వెంకన్నకు మకిలి అంటించే కుట్ర అనేది? జగన్ గుంటూరు పర్యటనకు జనం విశేషంగా రావడం, అక్కడ లడ్డూ అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టడంతో చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి మరింత గందరగోళంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి శాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా? కాదా? వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్లు కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో ఉంచడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించారని సిట్ తెలిపిందా? లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనా? కాదా? చంద్రబాబు హయాంలోనే కిలో నెయ్యి రూ.291లకే టీటీడీ ఎలా కొనుగోలు చేసింది?ఈ ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్లు ఎక్కడా జవాబు ఇవ్వలేదు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికి జవాబు చెబుతోంది. ప్రెస్మీట్ లో పాల్గొన్నవారిలో ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క కనిపించడం లేదని, తప్పు చేశామన్న గిల్టితో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న వారి తాపత్రయం కనబడుతోందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానికి పేర్నినాని జవాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని, బాప్టిజం తీసుకున్నానని చెబుతారు. మరోసారి ముస్లిం అని అంటారు. ఇంకోసారి తన తండ్రి దీపారాధన వత్తుల మంటలో సిగరెట్ వెలిగించుకుంటారని అంటారు..ఇక ఆయన సోదరుడు తాను నాస్తికుడనని చెబుతారు.. మళ్లీ హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు..అని మండిపడ్డారు.వీరంతా రాజకీయ అవసరాల కోసం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది.నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు హిందూ ధర్మం పట్ల నిబద్దత ఉంటే నిత్యం అబద్దాలు చెబుతారా? మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్య పెడతారా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తమ అసమర్ధతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే పాలకులు మతాన్ని తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. నిజమే కావచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హిందూ మఠాలపై చంద్రబాబు రెడ్బుక్
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ వ్యవహారంలో తనకు అనుకూలంగా ప్రకటనలు చేయించుకునే పనిలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిశాయంటూ బాధ్యతారహితమైన ప్రకటనలు చేసిన చంద్రబాబు.. అవి అసత్యాలని సీబీఐ–సిట్ దర్యాప్తులో తేలడంతో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, తన అబద్ధాలను నిజం చేయించుకోవాలని, అవమానకర పరిస్థితుల నుంచి బయటపడాలని రోజుకో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హిందూ ఆధ్యాత్మిక మఠాలపైనే తన రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తూ దేశవ్యాప్తంగా తిరుమల క్షేత్రం పరువు, ప్రతిష్టను దెబ్బతీసే అపవిత్ర కార్యక్రమాలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంవోలో ఓ అధికారికి ఈ ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా, టీటీడీలో కొందరు అధికారులు వీరికి సహాయపడుతున్నారు. దక్షిణాది సహా దేశంలోని హిందూ ఆధ్యాత్మిక మఠాలకు వెళ్లి వారిని ఒత్తిళ్లకు గురిచేసి, అసత్యాలు చెప్పి తనకు అనుకూలంగా మఠాధిపతుల చేత లేఖలు విడుదల చేయించడం, వాటిని తమ ఎల్లో మీడియాలో ప్రధాన శీర్షికల్లో ప్రచురించి, దుర్బుద్ధితో కూడిన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్ద జీయంగార్పై కొద్దిరోజులుగా ఒత్తిడి తిరుపతిలోని పెద్ద జీయంగార్ మఠంపై ఇలాగే ఒత్తిడి తెచ్చి లేఖ విడుదల చేయించారు. కొన్నిరోజులుగా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నా నిరాకరించిన నేపథ్యంలో నేరుగా సీఎంవో కార్యాలయమే రంగంలోకి దిగింది. చంద్రబాబు తన ప్రత్యేక కార్యదర్శి, టీటీడీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్రను పెద్ద జీయర్ వద్దకు పంపి తనకు అనుకూలంగా లేఖ రాయించుకున్నారు. వేయి సంవత్సరాల రామానుజాచార్యుల పరంపరనే భ్రష్టుపట్టించడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదు. ఈ కార్యక్రమాల కోసమే ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా నియమించారు.హిందూ ధర్మానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు. వేల సంవత్సరాల ప్రతిష్ట ఉన్న తిరుమల ఆలయాన్ని రాజకీయాలకోసం దెబ్బతీయడం అత్యంత శోచనీయం. శ్రీవారి భక్తులు, మఠాలపై చంద్రబాబు తన రాజకీయ స్వార్థంతో చేస్తున్న దాడిగానే దీన్ని చూడాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలను గమనించి ప్రతి ఒక్కరు వాటిని తిప్పికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
బాబు సర్కారుపై ‘శివ’మెత్తిన స్వాములు
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించి మల్లికార్జున స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు కూటమి సర్కారు విఫలమైంది. ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో అలక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా సోమవారం బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. భక్తులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు పడిన వృద్ధులు, మహిళలు, చంటిపిల్లలు అల్లాడిపోయారు.శివస్వాములూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతకూ అధికారులు రద్దీని నియంత్రించలేకపోవడంతో శివస్వాముల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు క్యూలైన్ల తాళాలు పగులగొట్టి, ఆలయంలో బైఠాయించి సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోవడంతో చాలా మంది శివస్వాములు, భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకోకుండానే ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లారు. ఘాట్ రోడ్లలో స్తంభించిన ట్రాఫిక్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని తెలిసినా ముందస్తు అంచనా వేయడంలో బాబు సర్కారు, దేవస్థానం అధికారులు విఫలమయ్యారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజైన ఆదివారం మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న రద్దీ సాయంత్రం నుంచి పెరిగిపోయింది. భారీ సంఖ్యలో వాహనాల్లో, పాదయాత్రగా భక్తులు పోటెత్తారు. అలాగే ఆదివారం రాత్రి భారీగా తరలివస్తున్న వాహనాలతో ఇరు వైపులా ఘాట్రోడ్లలో, శ్రీశైలంలో ట్రాఫిక్ స్తంభించింది. చేతులెత్తేసిన దేవస్థానంఈ నెల 8 నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివమాల స్వీకరించి, జ్యోతిర్ముడిని కలిగిన శివస్వాములకు ఈ నెల 8 నుంచి 12 వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు మల్లన్న అలంకార దర్శనం కల్పిస్తున్నారు. మల్లన్న స్పర్శదర్శనం కోసం భారీ సంఖ్యలో శివస్వాములు శ్రీగిరి చేరుకున్నారు. సాధారణ భక్తులు సైతం అదే స్థాయిలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. అయితే అధిక సంఖ్యలో తరలివచ్చిన శివస్వాములకు స్పర్శదర్శనం కల్పించడంలో దేవస్థాన అధికారులు విఫలమయ్యారు. సాధారణ భక్తులను, శివస్వాములను నియంత్రించలేక దేవస్థాన అధికారులు చేతులెత్తేశారు. ఎండలో కాళ్లు కాలుతున్నా.. భక్తుల పడిగాపులుభక్తుల రద్దీని నియంత్రించడంలో విఫలమవడంతో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ అలసత్వం ప్రదర్శించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, టాయిలెట్ల సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు నానా అవస్థలు పడ్డారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండలో రోడ్డుపై భక్తులు బారులు తీరారు. ఎండవేడిమికి మహిళలు, చంటిపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500అతిశీఘ్ర దర్శనం క్యూలైన్ల వద్ద వేచిఉన్న భక్తులకు రోడ్డుపై మ్యాట్ కూడా వేయలేదు. ఎండలో కాళ్లు మాడుతున్నా.. భక్తులు అలాగే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న శివస్వాములు తీవ్ర అసహనానికి గురయ్యారు.ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చి క్యూలైన్లతాళాలను పగులగొట్టి, తాత్కాలిక క్యూలైన్ల ఇనుప మెష్లను తొలగించి, ఇత్తడి క్యూలైన్లను తొలగించే యత్నం చేశారు. ఆలయంలోని మనోహర గుండం వద్ద పెద్ద ఎత్తున శివస్వాములు బైఠాయించారు. సీఎం, డిప్యూటీ సీఎం, దేవస్థాన ఈఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సనాతన ధర్మం అంటూ బీరాలు పలికే సీఎం, డిప్యూటీ సీఎం పాలనలో ఇంత అధ్వానంగా దేవస్థానం వ్యవస్థ ఉండడం మా ఖర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివస్వాములపై లాఠీ ఎత్తిన ఏఎస్పీశివస్వాములను నియంత్రించేందుకు వచ్చిన నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. శివస్వాముల పై లాఠీ ఎత్తారు. దీంతో భక్తులు ఆగ్రహంచి ఏఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని ఆలయ రాజగోపురం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. చివరికి ఏఎస్పీ అక్కడి నుంచి నిష్క్రమించడంతో శివస్వాములు శాంతించారు. -
ఐఏఎస్లం.. అన్నీ తెలుసనుకోవద్దు
సాక్షి, అమరావతి: ఐఏఎస్లు అయిపోయాం.. అన్నీ తెలుసనే ధోరణి వీడి నేర్చుకోవడం, తెలుసుకోవడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించారు. 2025–26 జీఎస్డీపీ వృద్ధి 12.16 శాతం లక్ష్యం అనుకుంటే ఇప్పుడు 9.88 శాతమే వృద్ధి నమోదైందని, అందరూ సరిగా పనిచేస్తే 13 శాతం వృద్ధి రావాలని సీఎం పేర్కొన్నారు. ఎవరు సరిగా పనిచేయడం లేదో తమ వద్ద వివరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అంచనాలను ఇచ్చామని, ఆ మేరకు వృద్ధి వస్తోందా..? లేదా..? అనేది కలెక్టర్లు దృష్టి సారించడంతోపాటు తెలియకపోతే తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో సీఎం సమావేశం నిర్వహించారు.జీఎస్డీపీ వృద్ధి, విద్య, వైద్య, ఆదాయ ఆర్జన తదితర రంగాలపై సమీక్షించారు. జీఎస్డీపీ వృద్ధి, తలసరి ఆదాయం లక్ష్యాల సాధన బాధ్యత కలెక్టర్లతోపాటు మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. లక్ష్యాలు సాధించకపోవడానికి నిర్లక్ష్యం లేదా తెలియకపోవడమే కారణమన్నారు. ఈ ఏడాది లక్ష్యాల్లో వెనుకబడితే వచ్చే ఏడాది కవర్ చేయాలని, లేదంటే ఆ శాఖలు డిఫాల్టర్లు అవుతాయని వివరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాలం చెల్లిన, అవసరం లేని చట్టాలు రద్దు చేస్తామన్నారు. కేంద్రం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు.రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఆడిట్ చేయాలని చెప్పారు. రాత్రింబవళ్లూ పనిచేయడం కాదని, మనసు పెట్టి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. ‘నాకు సలహాలు ఇవ్వద్దు.. ఏమి చేస్తే ఫలితాలు వస్తాయో అది చేసి చూపించండి’ అని సీఎం సూచించారు. తనతోపాటు కింది స్థాయి వరకు ఉద్యోగులంతా సమష్టిగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు. యూరప్ దేశాల్లో వృద్ధులు పెరిగిపోతున్నారని, రాష్ట్రంలో జనాభా తగ్గిపోతోందని, ఈ నేపథ్యంలో సంతానం పెంచేందుకు ప్రోత్సహకాలతో జనాభా నిర్వహణ విధానాన్ని మార్చిలో అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విధానం అమల్లోకి వస్తుందన్నారు. కుప్పంలోనే 14.9 శాతం మందికి బాల్య దశలోనే గర్భధారణ రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీలను తగ్గించి సాధారణ డెలివరీలు పెరిగేలా అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. బాల్య వివాహాలపైనా సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా కుప్పంలోనే 14.9 శాతం మంది బాల్య దశలోనే గర్భం దాల్చుతున్నారని, ఇవి కూడా జనాభాపై ప్రభావం చూపుతున్నాయని ఓ అధికారి వివరించారు. 71 లక్షల మంది పిల్లల ఆరోగ్య డేటాను ఆన్లైన్లోకి తీసుకురావాల్సిందిగా సీఎం సూచించారు. హాస్టల్ విద్యార్థులకు తరుచూ అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదని వెల్లడించారు. పన్నులను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని సీఎం పేర్కొన్నారు. అటవీ శాఖ దగ్గర ఉన్న ఎర్ర చందనం అమ్మకం ద్వారా అధిక ఆదాయం వస్తుందని అంచనా వేశామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మురిగిపోతే అధికారులే బాధ్యత వహించాలన్నారు. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో జిల్లా కలెక్టర్లు తక్షణం కేవైసీ చేపట్టాలన్నారు. 1,04,727 పీడీ ఖాతాల్లో ఉన్న అన్ క్లైమ్డ్ డిపాజిట్ల విలువ రూ.148 కోట్లుగా ఉన్నాయని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.26,021 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు -
చంద్రబాబుకు బిగ్ షాక్ అంబటికి బెయిల్
-
TJR : చంద్రబాబు పాలనపై సొంత ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి
-
‘పబ్లిసిటీ చేసుకోవటమే తప్పితే విద్యార్థులకు ఏం న్యాయం చేశారు?’
తాడేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి దళిత, గిరిజన విద్యార్థులు బలవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నా అవి చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు మానవత్వం ఉంటే హాస్టల్లోని పిల్లలకు మేలు చేయాలని టీజేఆర్ సూచించారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. వైఎస్ జగన్ హయాంలో హాస్టల్స్ ఎలా ఉన్నాయో చంద్రబాబు చూసి తెలుసుకోవాలన్నారు. జగన్ హయాంలో హాస్టల్స్ కు రూ.7,245 కోట్లు ఖర్చు చేశారు. 2014-19 మధ్యలో చంద్రబాబు కేవలం రూ.455 కోట్లే ఖర్చు చేశారు. దాన్నిబట్టే సంక్షేమ హాస్టల్లో ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. జగన్ ప్రతిరోజూ మంచి భోజనం పెట్టారు.చంద్రబాబు ఎంతసేపూ పబ్లిసిటీ చేసుకోవటమే తప్ప విద్యార్థులకు ఏం న్యాయం చేశారు?, హోంమంత్రి అనిత హాస్టల్లో తిన్న భోజనంలోనే బొద్దింక వచ్చినా పద్దతి మార్చు కోలేదు. ఇప్పటికి 18 సంఘటనల్లో వేలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థుల అవస్థలను పట్టించుకోరా?, పోలవరం జిల్లాలో 89 మంది ఆస్పత్రి పాలయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?, విద్యార్థుల అవస్థలు మీ హైటెక్ ప్రభుత్వానికి తెలియటం లేదా?, గిరిజనులు, దళితులంటే ఎందుకంత కక్ష?, అన్ని రకాల వస్తువులకూ ధరలు విపరీతంగా పెరిగి జనం అవస్థలు పడుతున్నారు. కానీ అభివృద్ధి, సంక్షేమం అద్భుతమని చంద్రబాబు తనకు తానే చెప్పుకుంటున్నారు. మీ పాలన ఎలా ఉందో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డే తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను చంద్రబాబు అమ్మేయపోతే జగన్ అడ్డుకున్నారు. ఇప్పటికీ అక్కడి ఉద్యోగులు భయంగానే బతుకుతున్నారు. అమరావతిలో రైతులను నిలువునా మోసం చేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాజధానిలో ఏం జరుగుతోంది?, చంద్రబాబు చీకటి ఎత్తుగడలకు రైతులు అన్యాయం అవుతున్నారు. రూ.76 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపుతున్నా నిర్మాణాలు మాత్రం కనపడటం లేదు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?, ఏఐ టెక్నాలజీ అని చెప్తూ మరి ఆ మేరకు పాఠ్యపుస్తకాలను ఎందుకు రూపొందించ లేదు?, టెక్నాలజీ ఉండాలిగానీ మితి మీరిన టెక్నాలజీ అవసరం లేదు. ముందు ఆకలితో ఉన్న వాడికి తిండి పెట్టండి. 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు అవుట్డేటెడ్ సీఎం. ఆయన ఆలోచనలు మారాలి. హెరిటేజ్ పెరుగు నాసిరకం అని ల్యాబులు నిర్ధారించాయి. సబ్ స్టాండర్డ్ అని తేల్చి చెప్పాయి. నాసిరకం పెరుగు విక్రయించినందుకు హెరిటేజ్ సంస్థ పెనాల్టీ కట్టింది. ఇలాంటి పనులు చేసినందుకు చంద్రబాబు సిగ్గు పడాలి’ అని మండిపడ్డారు. -
కూటమి పాలనలో.. పల్లె కన్నీరు పెడుతుంది.. కొలికపూడి సంచలన పోస్ట్
-
NDDB రిపోర్టులో ఏముందో.. చదివి వినిపించిన మల్లాది
-
తిరుమలను అపవిత్రం చేస్తున్నావ్... చంద్రబాబూ..ఇది మహా పాపం..
-
భయం జగన్ బ్లడ్ లోనే లేదు.. భయం అంటే ఏంటో 2029లో చూపిస్తాం
-
మీ ముగ్గురు నోర్లు పడిపోతాయి.. బాబు, పవన్, లోకేష్ పై రాచమల్లు సెటైర్లు
-
తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్
-
Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు
-
హెరిటేజ్ పెరుగు నాసిరకం.. నెయ్యిపై నారా ఆరోపణలు?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేవుడిని అడ్డుపెట్టుకుని కుట్రలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బరితెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారని అన్నారు. బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వచ్చింది చంద్రబాబు పాలనలోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మేము అబద్ధాల కోరు చంద్రబాబుతో కొట్లాడుతున్నాం. ప్రతిరోజూ ఆయనతో కొట్లాడకపోతే ఆయన చెప్పే అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుంది. అందుకే మేము తిరుమల పవిత్రతపై రోజూ మాట్లాడాల్సి వస్తోంది. కేవలం హిందువుల్లో జగన్ పట్ల వ్యతిరేకత రావాలనే చంద్రబాబు దుష్ప్రచారానికి దిగాడు. దేవుడిని కూడా అడ్డు పెట్టుకుని కుట్రలకు తెర లేపారు. జంతువుల కొవ్వు కలిసింది అని మొట్టమొదటి అబద్దం చెప్పాడు. స్వామి వారి పవిత్రతకు భంగం కలగకుండా ఉండాలి అనుకుంటే ఈ విషయం మాట్లాడరు.గోప్యంగా విచారణ చేసి నిజాలు తేలిన తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు ప్రకటన చేయాలి. సుప్రీంకోర్టులో సిదార్థ్ లూథ్రా వాదిస్తుంటే జడ్జీలు మాట్లాడిన మాటలు వింటే అన్నీ తెలుస్తాయి. ఆనాడు సుప్రీంకోర్టు మందలించినా మీకు బుద్ధి రాలేదు. సీబీఐ విచారణ వేసినా దర్యాప్తు చేసింది మీ అధికారులే కదా. వారిచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పారు. అప్పుడన్నా నన్ను క్షమించి స్వామీ అని దేవదేవుడిని కోరాల్సింది. అప్పుడు జంతు కొవ్వు అన్నావు.. ఇప్పుడు బాత్రూం కడిగేవి వాడారు అంటున్నావు. భోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా?.82వేల కేజీల నెయ్యి కొనుగోలుకు ఒకే రోజు అనుమతించారు. సీబీఐ రిపోర్టు కాదని ఏకసభ్య కమిషన్ ఎలా వేస్తారు?. సీబీఐ దర్యాప్తు తర్వాత ఏకసభ్య కమిషన్ వేయడమేంటి?. భోలే బాబా ఫ్రాడ్ అయినప్పుడు 82వేల కేజీల నెయ్యి ఎలా ఆర్ఢర్ ఇచ్చారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులే సరికాదని ఎలా చేప్తావు చంద్రబాబు?. బాబూ నీకు ఆత్మే లేనప్పుడు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఏంటి?. వైఎస్ జగన్ హయాంలో నెయ్యి నాణ్యతలో ఎక్కడా పొరపాటు చేయలేదు. బరితెగించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నావు.ఇది కూడా చదవండి: చంద్రబాబు హెరిటేజ్ గురించి తెలుసా.. నాసిరకం పెరుగు.. సీబీఐ సిట్ చెప్పినా, ల్యాబ్స్ చెప్పినా నారా వారి మాటే కరెక్ట్ అనాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంటున్నారు.. సీబీఐ విచారణ చేసినా వీళ్లు ఒప్పుకోవడం లేదు. పాలే లేకుండా పెరుగు తయారు చేసినందుకు నీ హెరిటేజ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా కట్టావు. దీనికి పుల్ స్టాప్ పడాలంటే ఒక్కటే మార్గం.. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఇక నిరూపించుకోవాలి. దీనికి మేము జంతు కొవ్వు కలిపితే మా చేతులు పడిపోవాలి. జంతు కొవ్వు కలవకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నోరు పడిపోవాలి. మీ ముగ్గురికి ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష తప్పకుండా విధిస్తాడు. స్వామి వారికి నువ్వు చేసిన అపచారానికి కచ్చితంగా శిక్ష పడుతుంది. నీ జీవితంలో 2029 తర్వాత నువ్వు, నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఆ తర్వాత నీ జీవితంలో మంచి రోజులే ఉండవు. నీకు స్వామి వారి పట్ల భక్తి లేదు.. ప్రజల మనోభావాలపై గౌరవం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
హెరిటేజ్ పెరుగులో ఏంకలుపుతున్నారు..? బాబు, లోకేష్ను నిలదీసిన కారుమూరి
-
రాజకీయాలకోసం ఇంత దిగజారాలా.. దేవుడు నిన్ను విడిచిపెట్టడు జాగ్రత్త..
-
ప్రజలు అసహ్యించుకుంటున్నా బుద్ధి రాట్లే.. చంద్రబాబుపై ధర్మాన సీరియస్
-
Advocate: PT వారెంట్ పెట్టి హింసిస్తున్నారు..? అంబటి ఆరోగ్యం ఎలా ఉందంటే..
-
దేవుడితో పెట్టుకున్నావు.. హెరిటేజ్ కు లక్ష రూపాయలు ఫైన్
-
అంబటిపై కక్ష సాధింపు.. 52 కేసులు, పిటీ వారెంట్లు..
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంబటిపై నమోదు చేసిన మరో అక్రమ కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు.. ఆయనను నేడు గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకుని అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగారు. దీంతో, తమ విధులకు అంబటి ఆటంకం కలిగించారని రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన కేసులో పిటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి జైలు నుంచి అంబటిని తీసుకొని గుంటూరు బయలుదేరారు.ఇక, ఇప్పటికే రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్లతో సహ రాష్ట్రంలో పలుచోట్ల అంబటిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. మరో మూడు పిటీ వారంట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటికి ప్రత్యేక సదుపాయాలు సైతం ప్రభుత్వం కల్పించకపోవడం గమనార్హం. అంబటితో పాటు అదే బ్యారక్లో మరో ముగ్గురు ఖైదీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి భద్రతపై అడ్వకేట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, అంబటి రాంబాబు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై నమోదైన మరికొన్ని కేసుల్లో పిటీ వారెంట్లు వేయటానికి పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కావాలనే అంబటిని మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. ప్లాన్ ప్రకారమే కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు. -
ఇక్కడితో ఆపేయ్.. తప్పు అయ్యిందని లెంపలేసుకోని..
-
లోకేశ్దే పెత్తనం.. టీడీపీలో సీనియర్లు ఔట్!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో లాబీయిస్టులకు ప్రాధాన్యం అంతకంతకూ పెరిగిపోతుండడంతో సీనియర్లు అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు, పార్టీ కోసం పని చేసిన వారిని పూర్తిగా పక్కనపెట్టి కేవలం తమకు అనుకూలంగా పని చేసే లాబీయిస్టులకే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పెద్దపీట వేస్తున్నారని వారు మండిపడుతున్నారు. తాజాగా రాజ్యసభ అభ్యర్థుల విషయంలోనూ తండ్రీ కొడుకులు అదే పంథా అనుసరిస్తున్నారనే ఆవేదన పార్టీలో వ్యక్తమవుతోంది. త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి లేక రెండు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. అందులో ఒక స్థానాన్ని లోకేశ్ తన ప్రధాన అనుచరుడు కిలారు రాజేశ్కి ఇస్తున్నట్లు టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చినబాబు పలువురు పార్టీ ముఖ్యుల వద్ద చెప్పినట్లు సమాచారం. రాజేశ్ కూడా ఈ విషయాన్ని తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారికి చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో చినబాబు తరఫున అన్ని వ్యవహారాలూ రాజేశే నడిపిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. పదవులు, కాంట్రాక్టులు, బిల్లులు, పోస్టింగ్లు, బదిలీలు సహా ఏ పని జరగాలన్నా టీడీపీ నేతలు ఆయన్నే కలుస్తున్నారు. లోకేశ్తో మాట్లాడిన తర్వాత ఆ పని జరిగేలా చూసేది రాజేశే. 2014–19 మధ్య కూడా ఆయన హవా ఇలాగే నడిచింది. తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తి కావడంతో లోకేశ్ ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా తన పట్టును మరింత బిగించేందుకు చినబాబు యత్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్డీఏ ముఖ్య నేతలకు ఈ విషయాన్ని ఆయన చెప్పినట్లు సమాచారం. కోటరీ వ్యక్తులకిస్తే మా గతి ఏమిటీ? అయితే తెలుగుదేశం సీనియర్ నేతలు, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా కేవలం లోకేశ్ వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తిని రాజ్యసభకు పంపితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని అంతర్గతంగా రగిలిపోతున్నారు. అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయడం దాదాపు ఖాయమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కూడా లాబీయిస్టే. లోకేశ్కు సన్నిహితుడే. గత ఏడాది రెండు రాజ్యసభ స్థానాలు తమకు దక్కగా అందులో బీజేపీ, టీడీపీ చెరొకటి పంచుకున్నాయి. టీడీపీ కోటాలో సానాకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. లోకేశ్ కోటరీలో సానా కీలకంగా మారారు. దీంతో ఎంతోమంది సీనియర్లు ఉన్నా పక్కనపెట్టి సానా సతీ‹Ùను రాజ్యసభ ఎంపీగా చేశారు. ఆయన పదవీకాలం మే నెలలో ముగుస్తుండడంతో మళ్లీ రెన్యూవల్ చేసి రాజ్యసభ ఎంపీగా కొనసాగించడం లాంఛనమేనని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.సీనియర్లకు అవమానమే ! నిజానికి రాజ్యసభ ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సూపర్ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చాలాకాలం నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రాజకీయ జీవితంలో గౌరవప్రదమైన ముగింపును కోరుకుంటున్న ఆయన రాజ్యసభ ఎంపీ అందుకు తగినదని భావించి ఆ దిశగా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన కూడా పట్టించుకోవడం లేదు. లోకేశ్ అయితే యనమలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని టీడీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు తనకు చివరి అవకాశంగా ఎంపీ పదవి ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.గత ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం చేసిన గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజ్యసభ స్థానం కోసం గట్టిగా యతి్నస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా యతి్నస్తున్నారు. పదవులు దక్కని నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, చింతకాయల విజయ్, వర్ల రామయ్య వంటి నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా చంద్రబాబు, లోకేశ్ నుంచి కనీస స్పందన కూడా లేదని సమాచారం. కేవలం లోకేశ్ కోటరీలోని లాబీయిస్టులు, లేకపోతే భారీగా నిధులు సమకూర్చే వారికే అవకాశం ఉంటుందని తేల్చి చెబుతుండడంతో సీనియర్లు అవమాన భారంతో రగిలిపోతున్నారు. -
జగన్పై బురద చల్లాలని చంద్రబాబు నీచ రాజకీయాలు
కాకినాడ రూరల్: ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తప్పుపట్టాలని, ఆయనపై బురద చల్లాలనే తప్పుడు ప్రయత్నాలతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్టినేటర్, మాజీమంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అందులో భాగంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కీర్తికి, పవిత్రతకు అపఖ్యాతి కలిగించాలని నిరంతరం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఆధారాలతో మాట్లాడాలని, భక్తులు, ప్రజల మనోభావాలతో ఆటలాడటం మంచిదికాదని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి సిట్ వేసిందన్నారు.సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ఈ సిట్ పెద్ద ఎత్తున పరిశోధన చేసి, చంద్రబాబు నియమించిన టీటీడీ అధికారులు, ఈవోల వాంగ్మూలాలను రికార్డు చేసి, లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వులు కలవలేదని నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారన్నారు. మొన్నటివరకు జంతుకొవ్వు అన్నారని, ఇప్పుడు ఏకంగా బాత్రూములు కడిగే హారి్పక్, కెమికల్స్ కలిపేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్పై ఉక్రోషంతో చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని, హిందూధర్మాన్ని బలిపెట్టే స్థితికి తీసుకొచ్చారని చెప్పారు. హెరిటేజ్ ఉత్పత్తుల్లో కల్తీ హరియాణలో విక్రయిస్తున్న హెరిటేజ్ పెరుగులో నాణ్యతలేదంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదిక ఇచ్చి, రూ.లక్ష పెనాల్టీ విధించి, సెబీకి నివేదించిందని చెప్పారు. అంతకుముందు మరో రాష్ట్రంలో ఈ ఉత్పత్తులను బ్యాన్ చేశారన్నారు. చంద్రబాబు సొంతసంస్థ హెరిటేజ్ ఉత్పత్తుల్లోనే కల్తీ జరుగుతోందని, అసలు జరగనివాటిలో జంతుకొవ్వు కల్తీ అంటూ రాజకీయాలు, కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ రాజకీయాలు తప్ప చంద్రబాబు సాధించిందేమీ లేదన్నారు. కనీసం కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు రాబట్టలేకపోయారని విమర్శించారు. ఎన్ని అబద్ధాలు ఆడినా వాస్తవాలను కప్పిపుచ్చలేరని కన్నబాబు పేర్కొన్నారు. -
తిరుమల ప్రసాదంపై బాబు, పవన్వి నీచ రాజకీయాలు
తిరుపతి మంగళం: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్లు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్ మండిపడ్డారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను నిరసిస్తూ ఆదివారం తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద రోడ్లను వైఎస్సార్సీపీ శ్రేణులు పసుపునీళ్లతో కడిగి శుభ్రం చేశాయి. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాలు చేస్తోన్న కూటమి నేతలను నీవే శిక్షించు వేంకటేశ్వరా అంటూ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. అజయ్కుమార్ మాట్లాడుతూ..సీబీఐ తన విచారణలో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని, అయినా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు శ్రీవారి లడ్డూపై చేసిన తప్పుడు ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి జంతువుల కొవ్వు కాదు బాత్రూం శుభ్రపరచడానికి వాడే కెమికల్స్ ఉపయోగించారని మరో పచ్చి అబద్ధాన్ని చెప్పి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎన్డీడీబీ, సీబీఐ సిట్ నివేదికల్లో ఎక్కడా నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని చెప్పారని అజయ్కుమార్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే నోట శ్రీవేంకటేశ్వరస్వామే నిజాలను పలికించారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కడుపుకు అన్నం తింటున్నారా లేక.. మీకు చేతనైతే..
-
తిరుపతి లడ్డూల్లో.. బాత్ రూమ్ కెమికల్స్.. అడ్డంగా దొరికినా అదే మాట
-
‘శ్రీవారి భక్తులకు చంద్రబాబు,పవన్ క్షమాపణలు చెప్పాలి’
భీమవరం: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముక్కు నేలకు రాసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భీమవరంలో వైయస్సార్సీపీ నాయకులు చినిమిల్లి వెంకట రాయుడు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ సిట్ చార్జిషీట్తో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనే కలవలేదనే వాస్తవాలు బయటకొచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాడైతే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జంతు వధపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కారణమవుతున్న కబేళాపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 12 వేల గోవులను చంపి విశాఖలో 1.86 లక్షల టన్నుల మాంసాన్ని అక్రమంగా నిల్వ చేస్తే ఆరోజు పట్టించుకోని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ.. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నిజం చెబుతుంటే మాపై దాడులులడ్డూ కల్తీ పేరుతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని అల్లరి చేయడం మానుకుని తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కూటమి నాయకులంతా ముక్కు నేలకు రాసి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి. సీబీఐ సిట్ చార్జిషీట్ తర్వాత కూడా దుష్ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సిగ్గుచేటు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలేశుడిని వివాదాల్లోకి లాగడం సరికాదు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల ఆలోచనలను దృష్టి మళ్లించడం కోసం పదే పదే తిరుమల లడ్డూ అంశాన్ని తీసుకొచ్చి వైకుంఠవాసుడిని వివాదాల్లోకి లాగుతున్నారు. సిట్ చార్జిషీట్ బయటపెట్టి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ప్రజలకు వాస్తవాలు చెబుతున్నందుకు మా నాయకుల మీద వరుస పెట్టి దాడులకు దిగుతున్నారు.జంతువుల కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేసిందికల్తీ జరిగిందని మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించారంటూ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి మరో దుష్ప్రచారం మొదలుపెట్టారు. కల్తీ జరిగిందని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్న నెయ్యి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే టీటీడీలోకి ప్రవేశించిన విషయాన్ని స్పష్టం చేశారు. సీబీఐ సిట్ చార్జిషీట్లో కూడా ఈ విషయం స్పష్టంగా రాసి ఉన్నా కూడా వైయస్సార్సీపీ మీద బురదజల్లి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సమంజసం కాదు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో నార్కో ఎనాలిసిస్ టెస్టు సహా ఎలాంటి విచారణకైనా సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు మాంసం, చేపల నూనె కలిసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా చెప్పిన తర్వాతైనా దుష్ప్రచారం ఆపడం లేదు. బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిపారంటూ చంద్రబాబు కొత్త ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి. చంద్రబాబు ప్రచారం చేస్తున్న బోలేబాబా డెయిరీకి కూడా టీడీపీ హయాంలోనే అనుమతులు లభించాయి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసే కుట్రపాలన చేతకాక ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కనిపించకుండా చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ. కనీసం స్కూళ్లలో చదివే పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందించలేకపోతున్నారు. రెండేళ్లు కూడా గడవకుండానే ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇన్నాళ్లూ తిరుమల లడ్డూ విషయంలో చేసిన తప్పుడు ప్రచారానికి గాను ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆలయ మెట్లు ఇప్పుడైనా సవ్యంగా పైనుంచి కిందకు కడగాలి. దేవుడి మీద నమ్మకం లేదని, దేవుడిని ఉరి తీయాలని చెప్పిన నాగబాబు సైతం సనాతన ధర్మం గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అవకాశవాద రాజకీయాలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరుస్తూ తప్పుడు ప్రచారం చేయడం తగదు. సీబీఐ సిట్ చార్జిషీట్లో మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ సీఎం వైయస్ జగన్ల పేర్లు లేకపోయినా వారి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మాటలతో హిందువుల మనోభావాలను గాయపరచడం సరికాదు.గోవధపై మీరెందుకు మాట్లాడటం లేదు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సనాతన ధర్మాన్ని పరిరక్షించే వారే అయితే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కబేళా (శ్లాటర్ హౌస్)ను తక్షణం మూసేయించాలి. ఇళ్ల మధ్య ఇష్టారాజ్యంగా జరుగుతున్న జంతు వధ కారణంగా వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా జరుగుతున్న జంతు వధను ఆపేలా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కూడా దృష్టిసారించాలి. శ్లాటర్ హౌస్పై పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి దీనిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. విశాఖలో 1.85 లక్షల టన్నుల గోమాంసాన్ని అధికారులు సీజ్ చేస్తే, అది టీడీపీ నాయకుడి అనుచరిదని తెలిసినా ఈ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఎందుకు స్పందించలేదు? 12 వేల గోవులను చంపి ఆ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే పట్టించుకోని ఈ కేంద్ర మంత్రి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసినా ఇప్పటికీ పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. దేవుడి మీద భయం, భక్తి ఉన్నవాళ్లు చేసే పనేనా ఇది? కేంద్ర తనిఖీల్లో హెరిటేజ్ పెరుగు మంచిది కాదని తేలింది. దీనిపై చంద్రబాబు, లోకేష్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అని కారుమూరి నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. -
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. అరెస్ట్కు భయపడం: కాకాణి
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. నాటి బ్రిటిష్ పాలనను మించిపోయింది.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. అంబటి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆయన కుటుంబాలకు ధైర్యం చెప్పటానికి వచ్చాం. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై అంబటి ప్రశ్నించారు. దీంతో దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేశారు.సీఎం చంద్రబాబు లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడారు. కూటమి పాలన అధ్వాన్నంగా ఉంది. సమాధానం చెప్పలేక చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అన్న విషయం కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. పైశాచిక ఆనందం పొందటం తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు. చంద్రబాబు తనని అరెస్టు చేసినందుకు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు. రాంబాబు తుపాకి తూటాలకు కూడా భయపడరు’ అని అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాకాణి పూజిత మాట్లాడుతూ..‘మౌనిక.. తండ్రి బాధ్యతను తీసుకొంది. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. అంబటి కుటుంబ సభ్యులను ఈ పరిస్థితుల్లో కలుస్తామనుకోలేదు. రాజకీయాలు దిగజారిపోయాయి. వైఎస్ జగన్కు సైన్యంలా నిలబడే భావన కూటమి నేతలే కల్పిస్తున్నారు. ప్రాణాలర్పించైనా జగన్ను గెలిపించుకుంటాం. కూటమి పాలనను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహిళలంటే గౌరవం లేదు. ప్రభుత్వం చేసే తాటాకు బెదిరింపులకు భయపడం’ అని హెచ్చరించారు. -
బీఆర్ నాయుడు అసమర్థుడు.. స్వామి భక్తుడే కాదు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. సీబీఐ ఇచ్చిన రిపోర్టులో లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు చూపించగలరా? అని ప్రశ్నించారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘లడ్డూ విషయమై చంద్రబాబులో ప్రాయశ్చిత్తం కనపడటం లేదు. చంద్రబాబులో తప్పు చేశామన్న బాధ అసలే లేదు. సిగ్గూ, శరం, భయం భక్తి లేకుండా మాట్లాడుతున్నారు. సీబీఐ స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. రోజా, జోగి రమేష్ మాట్లాడిన మాటల వీడియోని ఎల్లో మీడియా తప్పుగా ఎడిట్ చేసింది. కట్, పేస్ట్ వీడియోని ప్రసారం చేసి శునకానందం పొందారు. లడ్డూ ఇష్యూ మీద సంవత్సరం పైగా విచారణ జరిగింది. ఆ సిట్లో ఉన్నది చంద్రబాబు మనుషులే.చివరికి లడ్డూలో టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ వాడారని కూడా విష ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాసిడ్స్ని స్వీటులో కలుపుకుని బీఆర్ నాయుడు తినగలరా?. టీటీడీ చైర్మన్ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చేసి తిరుమల క్షేత్రానికి మచ్చ తెచ్చారు. బీఆర్ నాయుడు తన టీవీ ద్వారా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు. బీఆర్ నాయుడు వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు, అపచారాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులే ఆలయాలపై దాడులు చేయిస్తున్నారు. చెప్పులు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు హిందువని చెప్పుకోవటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ సనాతని అని ఎంత చెప్పుకున్నా జనం నమ్మటం ఎప్పుడో మానేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


