Chandrababu Naidu
-
నన్ను అర్ధరాత్రి నడిరోడ్డుపై.. లోకేష్ పై ఒట్టేసి వెన్నుపోటు పొడిచాడు
-
కేసులకు, బెదిరింపులకు భయపడం : విడదల రజని
సాక్షి,తాడేపల్లి: కేసులకు, బెదిరింపులకు తాను బెదిరిపోనని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి’ రెండేళ్లు పేరిట పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహానాడు సాక్షిగా అబద్ధాలు,మహిళలకు చేసిన మోసంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విడదల రజిని మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు.. సూపర్ సిక్స్ హామీని గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆటకెక్కించారు. చంద్రబాబు మోసాలు,అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. బాబును భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యం’అని అన్నారు. -
స్టాన్ఫోర్డ్ వర్సిటీలో లోకేశ్ సర్టిఫికెట్ కొన్నారు: లక్ష్మీపార్వతి
తాడేపల్లి: బ్రిటిష్ కాలం నాటి విధానాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. బ్రిటిషర్లపై పోరాడినట్లే ఇప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మోసానికి రెండేళ్లు పేరుతో వైఎస్సార్సీపీ మహిళా నేతల సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడు మొదట ఇందిరా గాంధీకి వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నికలకు వెళ్లినందుకు కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోగానే చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లదగ్గర చేరాడు. చంద్రబాబును పార్టీలోకి తీసుకోవద్దని అందరూ వ్యతిరేకించారు.లోకేశ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కొన్నారు. లోకేశ్ సెవెన్త్ క్లాస్ కూడా సరిగ్గా పాసవ్వలేదు. ఇలాంటి అసమర్థుడిని చంద్రబాబు ప్రజలపై రుద్దాలని చూస్తున్నాడు. మహిళల క్యార్టెక్టర్ ను కించపరచడమేనా చంద్రబాబు మహిళలకు చేసే మేలు. బాలకృష్ణ ఈ రోజు చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడంటే వైఎస్సార్ పెట్టిన భిక్ష. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చూడాలంటే మహిళల పైనే ఎక్కువ బాధ్యత ఉంది.కానీ భార్యను అడ్డంపెట్టుకుని చంద్రబాబు ఎన్టీఆర్ ను బుట్టలో వేసుకున్నాడు. చంద్రబాబుకు ఎడారి ఒంటె కథ సరిగ్గా సరిపోతుంది. టెంటు కింద చోటిస్తే యజమానిని బయటకు తోసేసిన ఒంటె, చంద్రబాబు ఒకే రకం. చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు. ఎన్టీఆర్ తో నా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ పార్టీ నుంచి బయటికి పొమ్మంటే నన్ను బతిమిలాడుకున్నాడు. నేను పట్టుబట్టడం వల్లే చంద్రబాబును పార్టీ నుంచి బయటికి గెంటేయకుండా ఆగారు.ఆ రోజు ఎన్టీఆర్ కు ద్రోహం చేయొద్దని నేను కోరాను. ఎన్టీఆర్ ను ఎప్పటికీ మోసం చేయనని నా చేతిలో చేయి వేసి, తన కొడుకుపై చంద్రబాబు ఒట్టు వేశాడు. నా దగ్గర ఒట్టు వేసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు చేయి తాకడం కూడా పాపమే. వైస్రాయ్ హోటల్ కు వెళ్లినందుకు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారు. అవమానిస్తే ఎన్టీఆర్ చనిపోతాడని తెలిసి తీవ్రంగా అవమానించారు. ఎన్టీఆర్ పై క్షుద్రపూజలు కూడా చేయించిన నీచుడు చంద్రబాబు’’ అని చెప్పారు. -
మహానాడు అని కాదు జగన్ నాడు అని పెట్టాల్సింది
-
బాబు, పవన్.. మీ పాలనలో మోసపోయింది మహిళలే: పూజిత
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో మోసపోయింది మహిళలేనని వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారని అన్నారు. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడబిడ్డలపై చేయి వేస్తే అదే ఆఖరి రోజని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిందితులకు కాదు బాధిత మహిళలకు అదే ఆఖరి రోజు అవుతోంది. కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్ ఘటనలే ఇందుకు సాక్ష్యం. న్యాయం కోరిన బాధితురాలి పైనే దాడి చేసినా పట్టించుకోలేదు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారు.ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేశారు. దేవుడంటే కూడా కూటమి నేతలకు భయం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండుంటే ఆడపిల్లపై చెయ్యి వేయాలంటే ఒక్కొక్కరు భయపడేవారు. నా వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారంటే అది జగన్ ఇచ్చిన ధైర్యం’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు, జగన్ మధ్య తేడా ఇదే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం.. మహానాడు సాక్షిగా చెప్పిన అబద్ధాలపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చర్చ జరిగింది. సమావేశానికి వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచకపాలన. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే. వైఎస్ జగన్ ఐదేళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. చంద్రబాబు మోసం చేసి పుండుమీద కారం చల్లుతున్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడు. చంద్రబాబుకు జగన్కు ఎంతో వ్యత్యాసం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలనేది జగన్ ఆలోచన. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బాధ్యతగా జగన్ భావించారు. కానీ చంద్రబాబు ఏం చేయకుండానే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చేశానంటున్నాడు. ఇప్పుడు పిల్లలే సంపద పిల్లల్నికనండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఇంటి నుంచే ఎందుకు మొదలుపెట్టరు. నెలకు 1500 ఆడబిడ్డ నిధి హామీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ముగ్గుర్ని కంటే రూ.30 వేలు నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటున్నాడు. మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన ఒక ఉదాహరణ..రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. వైఎస్ జగన్.. చంద్రబాబుకు గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధిచేయగల శక్తి జగన్కే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం వివరించాలి. ఆడబిడ్డ నిధి ఇస్తామని చంద్రబాబు చేసిన అతిపెద్ద మోసం. చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి. మా హామీల సంగతి ఏంటని చంద్రబాబు,లోకేష్,పవన్ను ఎక్కడ కనబడినా అడగాలి’’ అని సజ్జల పిలుపునిచ్చారు.అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం: వరుదు కల్యాణివరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు పాలన అంతా మోసం దగా. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామాలు పెట్టారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు చీటింగా మాస్టర్. మొన్న జరిగింది హైబ్రీడ్ మహానాడు కాదు లోగ్రేడ్ మహానాడు. తల్లికి, చెల్లికి మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మహానాడులో వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ ఎదురుగా నిలబడే ధైర్యం ఉందా?...టీడీపీకి, వైఎస్సార్సీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. టీడీపీ, వైఎస్సార్సీపీ బోత్ ఆర్ నాట్ సేమ్. తెలుగువారి పౌరుషాన్ని జగన్ ఢిల్లీకి చూపించారు. తెలుగువారి ప్రయోజనాలను ఢిల్లీకి చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్. హామీలను ఎగ్గొట్టిన మోసగాడు చంద్రబాబు. మా బ్రాండ్ సంక్షేమం.. మీ బ్రాండ్ సంక్షోభం. హోంమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం కూడా మీలా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. జైల్లో ఖైదీలతో కుమ్మక్కైన మీకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్రాన్ని మద్యం, గంజాయికి కేరాఫ్ అడ్రస్గా మార్చేశారు. హోంమంత్రి అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి మీకు వివరిస్తాం -
జగన్నామ మహానాడు!
కవిత్వంలోనూ, జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోతే ఆత్మలోకంలో దివాలా తీసినట్టేనని విఖ్యాత రచయిత చలం రాసిన వాక్యం చాలామంది పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రజా జీవితంలో ప్రకాశిస్తున్నామనుకుంటున్నవాళ్లు కూడా ఎథిక్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ను పూర్తిగా విడిచేస్తే... పైపెచ్చు, డంబాచారపు కోతలకూ, విద్వేషపు కూత లకూ మాత్రమే అంకితమైపోతే, వారు కూడా ఆత్మలోకాల్లో పూర్తిగా దివాలా తీసినట్టే! తెలుగుదేశం పార్టీ వాళ్లు జరుపుకున్న మహానాడు తంతును చూసిన తర్వాత చలం మాట గుర్తు కొచ్చింది. మహానాడు ఆసాంతం యాంత్రికమైన అట్టహాసం తప్ప ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించలేదు. కూటమి కుహరంలో భయం బయల్దేరిందనీ, ప్రమాద ఘంటారావం మొదలైందనీ మహానాడు సన్నివేశానికి తాత్ప ర్యంగా చెప్పుకోవచ్చు. మహానాడు కంటే ముందే జరిగిన కొన్ని సభల్లో చంద్రబాబునాయుడు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మళ్లీ ఒకసారి పొరపాటున ప్రతిపక్షానికి ఓటేస్తారా తమ్ముళ్లూ, అలా చేయబోమని మాటివ్వండని ఆయన ప్రాధేయపడటం దేన్ని సూచిస్తున్నది? పైగా తానే అధికారంలోకి రావాలని ప్రజలంతా పూజలు చేయాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ప్రజలంతా పూజలు చేస్తే తప్ప గట్టెక్కే అవకాశం లేదా? తమ రెండేళ్ల అధికారాన్ని ‘మంచి’ పాలనగా ఎంత ప్రచారం చేసుకున్నా జనం గుర్తించడం లేదన్న శంక వారిలో బయల్దేరింది.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే మహానాడులో ఆయన ప్రస్తావన 98 సార్లు వస్తే, జగన్మోహన్రెడ్డి నామ స్మరణ మాత్రం 140 సార్లు వచ్చిందట! కారణమేమై ఉంటుంది? ప్రజలను మెప్పించగలిగే ఘనకార్యాలు ఈ రెండేళ్లలో ఏమీలేవా? జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తప్ప రాజకీయంగా జరుగుబాటు కావడం లేదా? డెబ్బయ్ ఆరేళ్ల వయసు, యాభయ్యేళ్ల రాజకీయ జీవితం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రాలు తిప్పిన నైపుణ్యం, ముఖ్యమంత్రిగా పదహారేళ్ల అనుభవం చంద్రబాబు సొంతం. మహానాడులో ఆయన ఉపన్యాసం ఎలా ఉందో గమనించండి.ఆ స్థాయి వ్యక్తి నుంచి ఎటువంటి ఉపన్యాసాన్ని ఆశించాలి? పైగా పార్టీ గమనాన్ని గమ్యాన్ని సమీక్షించుకునే మహా నాడు వంటి సందర్భంలో వైసీపీని గొడ్డలి పార్టీగా ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. ఎక్కడిదీ గొడ్డలి? మనకు తెలిసినంతవరకు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. మరీ గొడ్డలి కథేంటి? వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో చంపారు కనుక, అది వైసీపీ పనేనని జనంతో నమ్మించాలి కనుక గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయాలని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న వివేకానందరెడ్డిని వైసీపీవాళ్లే బుద్దిహీనత వల్ల చంపించారా? గొడ్డలితో తానే హత్య చేశానని చెప్పినవాడు ఎవరి కనుసన్నల్లో సంచరిస్తున్నాడు? ఏ పార్టీ నాయకులు అతనికి అండదండలిస్తున్నారు? అతనికి పోలీసు రక్షణను, కాన్వాయ్ను ఏర్పాటు చేసి వీఐపీ మర్యాదలు చేస్తున్నదెవరు? అతను అరెస్టు కాకుండా కాపాడిందెవరు? వీటికి సరైన సమాధానాలు దొరికితే గొడ్డలి పార్టీ ఏదో తేలుతుంది.గొడ్డలి మార్కుతో పాటు వైసీపీ మీద ప్రచారం చేయడానికి ఇంకో ఐదారు సూచనలు కూడా చంద్రబాబు చేశారు. ఆ పార్టీ గంజాయి బ్యాచ్ అని ప్రచారం చేయాలట! గంజాయి మీద ఉక్కు పాదం మోపడానికి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని (ఎస్ఇబి) ఏర్పాటు చేసిందే జగన్ సర్కార్ కావడం ఇక్కడ గమనార్హం. కానీ యధార్థాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీపై నిందాప్రచారం చేయాలని బాబు ఉద్బోధించారు. వైసీపీ కోసం ఆయన ఇంకా కొన్ని బిల్బోర్డులు సిద్ధం చేశారు. వాటికి గట్టిగా ప్రచారం చేసిపెట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో ఒకటి వైసీపీలో బ్లేడ్ బ్యాచ్ ఉన్నదని! బెజవాడ బ్లేడ్ బ్యాచ్ గురించి, కాల్మనీ – సెక్స్ రాకెట్ల వ్యవహారం వెనకున్న నాయకుల గురించి జనం ఇప్పటికే మరిచిపోయి ఉంటారని టీడీపీ అధినేత నమ్మకం కావచ్చు.సోషల్ మీడియా సైకో బ్యాచ్, ఫేక్ పబ్లిసిటీ పేటీఎం బ్యాచ్ కూడా వైసీపీ కోసం పని చేస్తున్నాయట! రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననాల కోసం కిరాయి ముఠాలను ఉసిగొలిపిన ట్రాక్ రికార్డు ఎవరికి ఉన్నదో తెలుగు ప్రజకు తెలియనిది కాదు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఈనాడు వేసిన జుగుప్సాకరమైన కార్టూన్లు ఎవరూ మరిచిపోలేరు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దిగజారుడు విమర్శలు చేయడానికి అసెంబ్లీని సైతం వేదికగా ఉపయోగించుకున్న దెవరు? మెగాస్టార్ చిరంజీవి మీద, ఆయన స్థాపించిన రాజ కీయ పార్టీ మీద విషప్రచారానికి ఒడిగట్టిన ముఠా నాయకులు ఎవరు? తన తల్లిని కూడా అవమానించారని ఎవరి మీద పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా సుదీర్ఘమైనది. ఇక జగన్మోహన్రెడ్డి మీద గత పద్నాలుగేళ్లుగా అత్యంత హేయమైన ఆల్టైమ్ వరల్డ్ రికార్డు ప్రచా రాన్ని చేసిందెవరు? ఇప్పుడు మహానాడు వేదికను కూడా ఆ ప్రచారం కొనసాగించడానికే వినియోగించుకున్నారు. హిందూ ధర్మం మీద, ఆలయాల మీద కూడా వైసీపీ వాళ్లు దాడులు చేస్తారని చెప్పాలట! టీడీపీ కార్యకర్తలకు పార్టీ నేత ఆదేశం. ఈ ముద్ర వేయడానికి చాలాకాలం నుంచి టీడీపీ అనుబంధ విభాగాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎనభై శాతానికి పైగా హిందువులు నివసించే రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునే రాజకీయ పార్టీగానీ, వచ్చిన పార్టీగానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ఆలయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? కామన్సెన్స్ విషయం కదా! అది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం పదహారేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన సేవ కంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ చేసిన సేవలే ఎక్కువ. సెక్యులర్ రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో ఇటువంటి దిక్కుమాలిన చర్చ చేయాల్సి రావడమే దౌర్భాగ్యం.తెలుగుదేశం పార్టీ జగన్నామ మహానాడు ద్వారా 3–జి నాయకత్వం ప్రారంభమైందని చెప్పవచ్చు. కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలో లోకేశ్బాబు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలబడ్డారు. నాయకత్వ మార్పు మొదలైనట్టేనని గ్రహించిన నేతలంతా పోటీలుపడి లోకేశ్పై పొగడ్తల వర్షం కురిపించారు. కొత్త తరంలోనైనా తెలుగుదేశం వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వస్తుందా అని చూసేవారికి ఆశాభంగమే ఎదురైంది. వ్యక్తిత్వ హనన వ్యూహంలో, లేని గొప్పలు చెప్పుకోవడంలో 2–జి కంటే 3–జి నాలుగాకులు ఎక్కువే చదివిందని తేలి పోయింది. జగన్నామ స్మరణే లోకేశ్ ప్రసంగం కూడా! అతడు అనే సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్ ఒకటున్నది – ‘అక్క అంబా సిడర్ అయితే నేను బెంజ్, అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా, అది లైఫ్బాయ్, నేను లక్స్’ అంటుంది.అదే తరహాలో లోకేశ్బాబు కూడా జగన్ పార్టీది గొడ్డలి, మాది గూగుల్; జగన్ టెన్త్ పేపర్లు లీక్ చేశాడు, నేను స్టాన్ ఫోర్డ్లో చదివాను’ అంటూ అథమస్థాయి భాషను ఉపయోగించి మాట్లాడాడు. జగన్ టెన్త్ పేపర్లు లీక్ చేసినట్టు తన కెప్పుడు కల వచ్చిందో మాత్రం చెప్పలేదు. లోకేశ్కు స్టాన్ ఫోర్డ్లో ఎండోమెంట్ (డొనేషన్) కోటాలో సీటొచ్చిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాటి మీద లోకేశ్స్పందించి ఉండాల్సింది. విశాఖలో అదానీ డేటా సెంటర్ కోసం అనుమతులు, భూములు ఇచ్చింది జగన్మోహన్రెడ్డి. వ్యాపార భాగస్వామిగా ఇప్పుడు గూగుల్ను తెచ్చుకున్నది అదానీ గ్రూప్. గూగుల్ రాకకు చంద్రబాబు – లోకేశ్లకు ఎటువంటి సంబంధం లేదు.సినిమాటిక్ పోలికలతో జగన్తో సమవుజ్జీగా నిలబడాలని లోకేశ్బాబు తంటాలు పడుతున్నట్టున్నారు. అదెట్లా కుదురు తుంది బాబూ... ఆత్మగౌరవం కోసం అప్పట్లో సర్వశక్తి మంతురాలైన పార్టీ అధినేత్రిని ఎదిరించి పార్టీని వదిలేసి ఒంటరిగా జనంలోకి వెళ్లి, మూడు పార్టీల కూటములను ఒక్కడిగానే ఎదురొడ్డి నిలిచిన ధీరుడు జగన్మోహన్రెడ్డి. ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంత వ్యక్తిత్వ హననం చేసినా ఇప్పటికీ పొత్తుల్లేకుండా జగన్ని ఎదిరించడమంటే గజగజ వణికి పోయే పరిస్థితి కూటమి పార్టీలది. గత పదిహేనేళ్లుగా తండ్రి చాటు బిడ్డగా పొలిటికల్ అప్రెంటిస్షిప్ చేసిన అదృష్టం లోకేశ్ది. వారసత్వంగా తండ్రి నుంచి అధికారాన్ని అందుకోవ డానికి సిద్ధపడుతున్నారాయన. జగన్ హయాంలో లక్షా ముప్పయ్ వేల సచివాలయ ఉద్యోగాల కోసం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి చిన్న కంప్లెయింట్ రాకుండా ఒకేసారి అన్ని ఉద్యోగాలను నియమించిన ఘటనను గుర్తు చేసుకోండి. లోకేశ్ విద్యామంత్రిగా నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మీద ఎన్ని వేలమంది ఉద్యోగార్థులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రకటి స్తున్నారో గమనించండి. ట్రాక్ రికార్డు ముఖ్యం... లక్స్ – లైఫ్ బాయ్ పోలికలు కావు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ ఆర్బాటంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలు, ఈ ఏడాది వాటిని ఉపసంహరించి, మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తుంటే అధికారులు ఇచ్చిన ఖండనలోనూ తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని కాకాణి ఆక్షేపించారు. అక్రమాలు జరగకపోతే డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన ఇంకేమన్నారంటే..డీఎస్సీపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాండీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఓ పక్క టీచర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని ఊరించి, ఎన్నికలకు ముందు నుంచీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, చివరికి 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేం చేసిన ఆరోపణల మీద అధికారులు ఖండన కూడా ఇచ్చారు. అయితే ఈ ఖండనలో అంతా మీరు చెప్పినవి కరెక్ట్ కాదని చెప్పారు కానీ, తప్పు జరగలేదని పాయింట్ల వారీగా చెప్పలేకపోయారు. నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన దగాపై వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే ఆందోళనలు చేశాం.జూన్ 1వ తేదీన యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయబోతున్నాం. మీరు అర్హులుగా ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లు తుది జాబితాలో ఎందుకు గల్లంతయ్యాయో చెప్పగలరా ? మెరిట్ లిస్ట్ లేదు, సెలక్టెడ్ లిస్ట్ కూడా లేకుండా ఎంపికైన వారికి మెసేజ్ లు మాత్రమే పంపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరస్కరించలేదు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పినా, ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజిస్టర్ రోస్టర్ ప్రకారం అభ్యర్ధులకు ఎన్ని మార్కులు వచ్చాయో మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేశాక దాన్ని డిలీట్ చేయాల్సి అవసరం ఎందుకొచ్చింది ? ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ? సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే సరికి మరో కొత్త విధానం అమలు చేశారు. తుది ఎంపిక జాబితాకు వచ్చేటప్పటికి వీటన్నింటినీ పక్కనబెట్టి మరో కొత్త విధానం తెచ్చి, మీ అజెండాను అమలు చేసి అర్హులైన నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేశారు.నైతిక విలువల్లేని విద్యామంత్రి లోకేష్ఎప్పుడైనా పరీక్ష రాసిన అభ్యర్ధులకు మెరిట్ లిస్ట్ పరిశీలించుకునే హక్కు ఉంది. మెరిట్ లిస్ట్ లో తాము ఎక్కడ ఉన్నాం, తమకన్నా ముందూ వెనుక ఎవరున్నారనే అంశాల్ని తెలుసుకునే అవకాశం అభ్యర్ధులకు ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ తయారు చేశాక పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు. అది చేయలేదు కాబట్టి అక్రమాలు జరిగాయని కచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పదే పదే కోరుతున్నాం.చదువూ, సంధ్యా లేని మొద్దబ్బాయి లోకేష్ ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడం ఈ సమాజానికి తీరని ద్రోహం చేయడమే. అందుకే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడతానంటున్నారు తప్ప నా వల్ల పొరబాటు జరిగిందని, కాబట్టి తాను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లేదు. నైతిక విలువలు లేవు కాబట్టే లోకేష్ ఇలా వ్యవహరిస్తున్నారు. డీఎస్సీలో 16347 పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో నింపారు. అందులో మీరు నింపిన విధానం చూస్తే ఎంత భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయో మేం వివరిస్తాం.స్పోర్ట్ కోటా జీవోల్లో మార్పులతో అక్రమాలుక్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమలు ఉంది. స్పోర్ట్స్ కోటాపై ఉమ్మడి ఏపీలోనే 2012 ఆగస్టు 9న జీవో ఎంఎస్ నంబర్ 74 విడుదల చేసారు. అప్పుడు ఉన్న జీవోలో క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిన వారికి 29 క్రీడల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం పోటీ పరీక్ష రాసిన తర్వాత క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు తన పుట్టినరోజుకు ఒక్క రోజుకు ముందు ఏప్రిల్ 19న జీవో 47, జీవో 4 కూడా తెచ్చారు. 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో 4లో 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచారు. కానీ క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచారు.గతంలో ఉన్న క్రీడల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వీల్లేదు కాబట్టి దానికి మార్పులు చేశారు. అందుకే క్యారమ్స్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, యోగాసనాలు, బీచ్ వాలీవాల్ వంటి క్రీడల్ని చేర్చారు. జీవోడీ ఇచ్చిన మరో జీవో 47లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే వారు అసలు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే క్రీడా ప్రతిభ ఉన్న వారితో పాటు ఉపాధ్యాయ అర్హత ఉన్న వారికీ ద్రోహం జరిగింది. ఈ నెల 26న తిరిగి పోటీ పరీక్ష రాసిన వారికే డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వాలని మరో జీవో ఇచ్చారు. అంటే గతంలో అర్హులుగా ఉన్న వారికి అవకాశం లేకుండా చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలాంటి జీవో ఇచ్చారు. అందుకే మళ్లీ జీవోలో మార్పులు చేశారు.జీవో మార్పులతో అర్హులకు తీవ్ర అన్యాయంజీఏడీ ద్వారా గతేడాది ఏప్రిల్ 19న ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ జీఏడీ ద్వారా రెండు జీవోలు ఇప్పించారు. ఇందులో గతంలో క్రీడాకారులు కూడా పోటీ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఈ నిబంధనల్ని మార్చారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఈ నెలలో ఆ జీవోల్ని రద్దు చేశారు. గతేడాది ఇచ్చిన జీవోల్లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆటలో పాల్గొంటున్న వారికి తర్వాత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దాన్ని మార్చి తాజాగా ఇచ్చిన జీవోలో జాతీయ స్దాయిలో ఆడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఛాంపియన్ షిప్ వస్తే తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పగలరా ? ముందుగా ఇచ్చిన జీవో కరెక్ట్ అనుకుంటే, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించారు ? ఈ రెండు పరిణామాల మధ్య నష్టపోయిన వారికి ఎవరు బాధ్య త వహిస్తారు ? డీఎస్సీలో పరీక్ష రాసిన అభ్యర్ధుల పరిస్ధితి ఏంటి ? వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతున్నాం. ఇది లోకేష్ శాఖలో జరిగిన డార్క్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్నాం. మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, దగాపడిన నిరుద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన విభాగాలు సిద్దంగా ఉన్నాయి. కానీ దయచేసి ప్రతిభ ఉన్న వారికి మాత్రం అన్యాయం చేసి వారి ఉసురుపోసుకోకండి.డీఎస్సీలో జిల్లా కమిటీల పాత్ర ఉంటే అక్రమాలు సాధ్యం కావు కాబట్టి వీటిని నిర్వీర్యం చేశారు. అందుకే రాష్ట్ర స్దాయిలోనే ఈ పరీక్ష నిర్వహించారు. టెట్, డీఎస్సీకి సంబంధించి ఒకే వ్యక్తికి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అతనే తిరిగి పరీక్ష రాసి కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతని వివరాలు డిలీట్ చేశారు. అతను కోర్టుకు వెళ్తే బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. అందుకే డబ్బులు చేతులు మారాయని మీరు ఇచ్చిన జీవోల ద్వారానే అర్థమవుతోంది. మీరు అక్రమార్కులపై చర్యలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు.ఒకే కేటగిరీలో ముందు ఉన్న వాళ్లకు, తర్వాత ఉన్న వాళ్లకూ ర్యాంకులు వచ్చాయి, కానీ ఆమ్యామ్యాలు సమర్పించకపోవడం వల్ల మధ్యలో ఉన్న వారికి ర్యాంకులు రాలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? టెస్ట్ మెసేజ్ ల పేరుతో ఉద్యోగాల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు అర్హత సాధిస్తే ఒకటే పోస్టుకు కాల్ లెటర్ ఇవ్వడం అన్యాయం కాదా ? ఈ మూడు పోస్టుల్లో హయ్యర్ గ్రేడ్ పోస్టు ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా మీద కాదు అక్రమాలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై ఈ కేసులు పెట్టండి. అలాగే ఎస్సీఈఆర్టీ నుంచే ప్రశ్నాపత్రాల లీక్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ ప్రశ్నాపత్రాలు అప్ లోడ్ చేసిన వ్యక్తి పరీక్ష ఎలా రాస్తాడు ? ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, అతన్ని మీరు ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టును వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు ? అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని చెప్పారని అధికారులు చెప్పినట్లు అభ్యర్ధులు కూడా బయటపెట్టారు. మీరు బేరసారాలు ఆడిన ఆడియోలు బయటికి వచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? దీని మీద ముఖ్యమంత్రి, విద్యామంత్రి సమాధానం చెప్పాల్సిందే. దీంతో పాటు అక్రమాలకు బాధ్యత వహించి విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. దీంతో పాటు సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందేనని కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. -
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, విజయవాడ: డీఎస్సీపై మీడియా సమావేశం నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.. డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై సమాధానాలు దాటవేశారు. కీలకమైన ఆరోపణలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎస్ఈఆర్టీలో పనిచేసే నవీవ్కి టాప్ ర్యాంక్పై మీడియా ప్రశ్నించగా.. కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామన్న శశిధర్.. మరోసారి కౌన్సిలింగ్కి రాలేదు కాబట్టి పక్కన పెట్టామంటూ చెప్పుకొచ్చారు. అతను రెండు పరీక్షలు రాశాడంటూ మరో సమాధానం చెప్పారు. 6 వేల ప్రశ్నలు గుర్తుపెట్టుకుని చేసేశాడంటే నమ్మశక్యమా? అంటూ కోన శశిధర్ వింత సమాధానం ఇచ్చారు.నవీన్ లాగిన్ని ఎందుకు బ్లాక్ చేశారని మీడియా ప్రశ్నించగా.. దానిపై కూడా కోన శశిధర్ సమాధానం చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. స్పోర్ట్స్ కోటా అంతా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్నే అడగండంటూ దాటవేశారు. రెగ్యులర్, స్పోర్ట్స్ కోటా ఒకేసారి ఎందుకు చేయలేదో స్పష్టత ఇవ్వని శశిధర్.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్పుపై తనకు సంబంధం లేదని దాటవేశారు.స్పోర్ట్స్ పాలసీ ప్రకారం మేము అనుసరించాం. ఆ రోజు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం పరీక్ష లేకపోయినా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత పాలసీని మార్చారు. స్పోర్ట్స్ పాలసీపై చర్చ వాళ్లనే అడగాలి. స్పోర్ట్స్ ది సెపరేట్గా హ్యాండిల్ చేద్దాం. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం’’ అంటూ శశిధర్ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్ నియమాకాన్ని శశిధర్ సమర్థించుకున్నారు. -
గెట్ అవుట్! చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన అమిత్ షా?
-
భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం
-
గుర్తుపెట్టుకో.. మాకూ ఒక రోజొస్తుంది, హైపర్ ఆదికి గుబాపగిలేలా వార్నింగ్
-
ఖర్జూరనాయుడు లేదా చంద్రబాబులా ఉండాలి! బాగా ప్లాన్ చేశావ్ బాబు..
-
ప్రజలు లేరని ప్రభుత్వ ఉద్యోగులను తరలిస్తావా? చంద్రబాబు అసలు బాగోతం
-
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. బయటపడ్డ లోకేష్ స్కాముల చిట్టా..
-
‘జూన్ 10లోపు విద్యుత్ సబ్సిడీ హామీ అమలు చేయాలి’
సాక్షి, తాడేపల్లి: ఆక్వా, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా జూన్ 10వ తేదీ లోపు యూనిట్ రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ హామీని అమలు చేయాలని, నాన్ ఆక్వా జోన్ రైతులు గత రెండేళ్లుగా చెల్లించిన బిల్లులు రీయింబర్స్ చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా అందరికీ రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో సీడ్, ఫీడ్ ధరలు, ఎగుమతులు, అన్నీ అప్సడా నిర్ణయం మేరకు రైతులతో చర్చించి తీసుకునేవాళ్లమని.. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా)ని నిర్వీర్యం చేసేసి దళారుల చేతికి చంద్రబాబు పెత్తనం ఇచ్చాడని మండిపడ్డారు.ఫీడ్ ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచితే ఊరుకోమని, రైతులతో చర్చించి ఏడాదికి ఒక్కసారే పెంచాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, త్వరలోనే ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహిస్తారని వడ్డి రఘురాం వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్సడా నిర్వీర్యం.. తీవ్ర సంక్షోభంలో ఆక్వా రంగంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ అన్ని విభాగాలను ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చి ఆక్వా రైతులకు మేలు చేశారు. సీడ్, ఫీడు ధరలు పెంచాలన్నా, వాటి నాణ్యత పరిశీలించాలన్న ఒక కమిటీ ఉండేది. ఈ కమిటీలో ప్రభుత్వం, రైతులు, సీడు, ఫీడు యజమానులు, ఎక్స్పోర్టర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, మెడికల్ కంపెనీలు ఉండేవి.వీరంతా ఉమ్మడిగా చర్చించి ఏ నిర్ణయమైనా తీసుకునేవారు. రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా అప్సడాలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని పూర్తిగా నిర్వీర్యం చేసి, పెత్తనాన్ని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టాడు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆక్వారైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇటీవల విచ్చలవిడిగా ఫీడు రేట్లు పెంచడానికి పూనుకున్నారు. వైయస్ జగన్ గారి హెచ్చరికలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదుఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆక్వా రైతులను మోసం చేశాడు. రెండేళ్లలో చంద్రబాబు కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ల పేరుతో రెండేళ్లుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మొత్తం 64 వేల కనెక్షన్లు ఉంటే వైఎస్సార్సీపీ హయాంలోనే 50,800 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏటా రూ.800 కోట్ల మేర విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 2104-19 మధ్య కూడా యూనిట్ విద్యుత్ రూ.2 లకే ఇస్తామని చెప్పి ఆరు నెలలకే ఆపేశాడు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డిస్కంలకు గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.340 కోట్లు వైఎస్ జగనే చెల్లించి ఆక్వా రంగాన్ని ఆదుకోవడం జరిగింది.ఐదేళ్లలో రూ. 3640 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించిన ఘనత వైయస జగన్కే దక్కుతుంది. నాన్ ఎలిజిబిలిటీ రైతులకు ఇబ్బందులు రావడంతో 24 గంటల్లో రూ. 24 కోట్లు రోల్ బ్యాక్ చేయడం జరిగింది. మెరైన్ ఎక్స్పోర్టులో రెండుసార్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే మొదటిస్థానం సాధించి అవార్డులు తీసుకుంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా సీపీఎఫ్ అనే కంపెనీ ఫీడ్ ధరలు పెంచినప్పుడు రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను థాయ్లాండ్ నుంచి 48 గంటల్లో పిలిపించి వారితో ప్రభుత్వం చర్చించి మూడేళ్లపాటు పైసా కూడా పెంచకుండా చూశాం. రెండుసార్లు పెంచితే రెండుసార్లూ రోల్ బ్యాక్ చేయడం జరిగింది.ఆక్వా రైతుల తరఫున వైఎస్సార్సీపీ డిమాండ్లుసంక్షోభంలో రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న ఆక్వా రైతుల ఆక్రందనలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆక్వా నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. నాన్ ఆక్వా జోన్ పరిధిలో సుమారుగా 12,800 కనెక్షన్లు ఉంటాయని అంచనా. వారందరూ గడిచిన రెండేళ్లుగా విద్యుత్ సబ్సిడీకి నోచుకోకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ బిల్లులన్నీ రోల్ బ్యాక్ చేస్తారో లేదో చెప్పాలి. సంక్షోభంలో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకునేలా ఇతర పంటల మాదిరిగానే ఆక్వా లోనూ పంటల సాగు వివరాలు నమోదు చేయాలి.ప్రాసెసింగ్ ప్లాంట్లకు వచ్చిన ఆర్డర్లు, పంట సాగు లెక్కలను బేరీజు వేసుకుని ధరలు నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సోయా, ఫిష్ ఆయిల్ ధరలు ఏడాదికి ఒక్కసారే పెరుగుతాయి. ఆక్వా సీడు, ఫీడ్ ధరలు ఇష్టమొచ్చినట్టు పెంచకుండా ఏడాదిపాటు ఒకే ధరతోనే విక్రయాలు జరిగేలా చూడాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ధరలు పెంచాల్సి వస్తే రైతుల అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలి.జూన్ 10వ తేదీ లోపు జోన్తో సంబంధం లేకుండా ఆక్వా రంగంలో రూపాయిన్నర సబ్సిడీకి విద్యుత్ పంపిణీ చేయాలి. రెండేళ్లుగా నాన్ ఆక్వా జోన్ రైతులు చెల్లించిన బిల్లును రీయింబర్స్ చేయాలి. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తాం. త్వరలోనే ఆక్వా రైతులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహిస్తారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడి పోరాడతుందని వడ్డి రఘురాం స్పష్టం చేశారు -
టీడీపీ మహానాడు పై వరుదు కళ్యాణి సెటైర్లు..
-
అన్ని అక్రమ కేసులు, అరెస్టులు.. చంద్రబాబుపై న్యాయవాదులు సీరియస్
-
రాత్రి 10 గంటలకు డోర్ కొట్టి చిత్రహింసలు పెడుతుంది.. కేవలం జగన్ ఇచ్చిన ఇల్లు
-
నిస్సిగ్గుగా మహానాడులో అల మాట్లాడటానికి సిగ్గులేదా
-
లోకేష్ కోసమే జూ.ఎన్టీఆర్ ని తొక్కేశాడు
-
‘కాంగ్రెస్తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారు’
తాడేపల్లి: మోసపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. బహిరంగంగా బీజేపీతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్తో ఉంటున్నారని అంబటి విమర్శించారు. కాంగ్రెస్తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. ఈరోజు(శుక్రవారం, మే 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీఎం ఆవిష్కరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్ సీఎంకి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ బీ టీమ్. తెలంగాణలో కాంగ్రెస్కు టీడీపీ బీ టీమ్. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. రాజ్యసభలో బీజేపీకి సీటు ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు సంకేతం. చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ను 75% పొగిడారు. మెగా డీఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ను వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. తర్వాత ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడుని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణలను కూడా తొక్కేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇంతకుమించిన వెన్నుపోటుదారుడు ఇంకెవరైనా ఉన్నారా?, అలాంటి వ్యక్తికి జగన్ మీద విమర్శలు చేసే అర్హత లేదు. అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. కేఎన్నార్ మీద ఎల్లోమీడియా నీచపు రాతలు రాస్తోంది. చంద్రబాబు ఆస్తి రెండు ఎకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారు?, సైకిల్ మీద తిరిగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడవి?, పచ్చళ్లు అమ్ముకునే రామోజీ, కిరణ్ లకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది?, వైఎస్ఆర్ సీపీని తొక్కేయటం ఎవరితరం కాదు. మా ఇంటి మీద దాడి, విధ్వంసం చేసిన వారిని ఇప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదు?, త్వరలోనే మళ్ళీ నా పోరాటం ప్రారంభిస్తా. మా ఇంటి నుంచి డీజీపీ ఆఫీసు వరకు ర్యాలీగా వస్తా. 29 కిలోమీటర్లు 'వినతి పాదయాత్ర' చేస్తా’ అని పేర్కొన్నారు. -
తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
-
‘మహానాడుకు ఉద్యోగుల తరలింపులేంటీ?’
తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల్ని టీడీపీ కార్యకర్తల్లా మహానాడుకు తీసుకెళ్లి పచ్చ కండువాలు వేసి కూర్చోబెట్టడం ఏంటని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి సర్కారును ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం, వాళ్లను పార్టీ కార్యక్రమాలకు ఎలా తిప్పుకుంటుందని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదన్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాలకే ఉద్యోగుల నియమావళి పేరు చెప్పి చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారశైలి ఉందని చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ కార్యకర్తలతో మహానాడు మీటింగ్ పెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లే రోగులకు ఆటంకాలు కల్పించారు. మీ పార్టీ కార్యకర్తలతో పార్టీ కార్యాలయాల్లోనో, ప్రైవేటు ఫంక్షన్ హాల్స్ లో ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాలే తప్ప, ప్రభుత్వ ఆస్పత్రులు, గుళ్లు, గోపురాల దగ్గర మీటింగులు పెట్టుకోవడం పద్ధతి కాదు. ఆస్పత్రుల ప్రాంగణాలను వాడుకుంటూ, ఉద్యోగుల్ని కూడా సభల్లో కూర్చోబెడుతున్నారు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులా, మీ పార్టీ కార్యకర్తలా అని అడుగుతున్నాను. తాజాగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఓ గ్రామంలో ఓ ఎస్సై దర్జాగా మహానాడు స్టేజ్ మీద కూర్చొన్నాడు. ఇదేమైనా అధికారిక కార్యక్రమమా ? టీడీపీ సమావేశాల్లో పాల్గొంటే ఉద్యోగులకు నిబంధనలు వర్తించవా ? ఉద్యోగుల్ని ప్రతిసారీ ఇలాగే రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటోంది. గతంలో కడపలో మహానాడు జరిగినప్పుడు కూడా వీఆర్వోల్ని కూడా తెచ్చి కూర్చొబెట్టారు. అప్పట్లో టెంట్లు గాలికి కూలిపోయి వాళ్లంతా గాయపడ్డారు. అప్పట్లోనే మేం ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించాం. గతేడాది కడప మహానాడులో డీఎం అండ్ హెచ్వోను సైతం మెడలో పసువు ట్యాగ్ లు వేసి మరీ కూర్చోబెట్టారు. అలాగే అనకాపల్లిలోని ఓ గుడిలో మీటింగ్ పెట్టుకున్నారు, నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మాలకొండయ్య స్వామి ఆలయంలో, చిత్తూరులో ఎంపీడీవో ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు టీడీపీ జెండాలు కట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీటింగ్స్ ఎలా పెట్టుకుంటారని అడుగుతున్నాం.ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు కానీ..గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మేం ప్రశ్నించినా ఇంకా ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటూనే ఉన్నారు. చిన్న తప్పు జరిగితే నిబంధనల పేరుతో ఇతర ఉద్యోగుల్ని ఇళ్లకు పంపేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగుల్ని రాజకీయ పార్టీల సమావేశాల్లో వాడుకోవడం ఆపాలి. ఏ పార్టీతోనూ ఉద్యోగులకు సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం చెప్పినట్లు నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. ఈ రెండేళ్లలో ఇచ్చిన హామీలు చెప్పడానికి పెట్టాల్సిన మహానాడుల్ని కాస్తా తమ విజనరీ లీడర్ గురించి చెప్పుకోవడానికే పెడుతున్నారు. మీరు అంత విజనరీ అయితే ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు. మీరు నెరవేర్చలేనప్పుడు ఎందుకు ఆ హామీలు ఇచ్చారు ? అంటే ఉద్యోగులు, పెన్షనర్లను మీరు మోసం చేస్తున్నట్లే కదా. ఎంతో కాలం ఇలా వారిని మోసం చేయలేరు. వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు, మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. ఉన్న పీఆర్సీ కమిషనర్ నే రాజీనామా చేయించి ఇంటికి పంపారు. ఇప్పటికీ కొత్త పీఆర్సీ ఊసేలేదు. రెండేళ్లు కాలయాపన జరిగినా ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఈ రెండేళ్లలో ఐదు డీఏలు పెండింగ్ లో ఉంటే, ఒక డీఏ మాత్రమే అరకొరగా ఇచ్చారు. డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం.40 వేల కోట్లకు చేరిన ఉద్యోగుల బకాయిలుప్రభుత్వం నుంచి జీపీఎఫ్ తో పాటు ఇతర బకాయిలు కలిపి రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. వీటిని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎంతసేపూ గతంలో ఉన్న ప్రభుత్వం తప్పుల గురించి మాట్లాడటమే కానీ మీరేం చేస్తారో చెప్పలేరా ? గత ప్రభుత్వం రాగానే రెండు నెలల్లో ఐఆర్ ఇచ్చింది. అలా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. దాదాపు 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్ధీకరించరు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీ వాళ్లే ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకున్నారు. దాదాపు 7-8 వేల మంది లెక్చరర్లు ఇప్పటికీ క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అన్నారు. అందులో మేం కట్టిన డబ్బు ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ఆస్పత్రులకు సకాలంలో ఆ డబ్బు కట్టకపోవడం వల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉండాలని ఓ పథకం తీసుకొస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. అలాగని కొత్త పథకం కూడా అమలు చేయడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కోస్ సంస్థ ఏర్పాటు చేస్తే, దాన్ని కూడా కాదని కావాల్సిన వాళ్లను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఉద్యోగుల్ని ఘోరంగా వాడుకుంటున్నారు.జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చారనే కోపంతో గార్డు, అటెండర్ చేసే పనుల్ని సైతం వెట్టిచాకిరీలా చేయిస్తున్నారు. ఏ సర్వే వచ్చినా వీళ్లకే చెప్తారు. వాళ్లకో జాబ్ చార్ట్ ఉండదు. నిన్న బక్రీద్ పండుగ వచ్చినా సెలవు ఇవ్వకుండా తిప్పారు.ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తెచ్చిన జగన్ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకుంటున్నారు. కానీ రేపు మరో ప్రభుత్వం వచ్చాక, గతంలో ఆ పార్టీ కార్యక్రమంలో కూర్చొన్నారని వీరిపై చర్యలు తీసుకుంటే, ఆ రోజు చంద్రబాబు వచ్చి కాపాడతారా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు మేలు చేస్తే.. తిరిగి దాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చంద్రబాబుకు ప్రైవేటీకరణ ముఖ్యమంత్రి అని ఓ బిరుదు ఇవ్చొచ్చు. ఏది కనిపిస్తే అది ప్రైవేటీకరణ చేసేస్తుంటారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విధానం తెచ్చింది కూడా చంద్రబాబే. ఆయన పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే దాన్ని రివర్స్ చేసే విధానం అమలు చేస్తున్నారు. ఇదేనా విజనరీ పాలన? రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ విభాగాల్ని కూడా ఇలాగే ప్రైవేటీకరణ చేస్తారా ? ఉద్యోగుల్ని చిన్నచూపు చూడటం ఆపి, వారిని నిబంధనల ప్రకారం పనిచేసేలా ప్రోత్సహించాలి. పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకోవడం ఇకనైనా ఆపాలని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. -
హైబ్రిడ్ వంకాయలు, టమాటాలు చూశా.. హైబ్రిడ్ మహానాడు ఏందిరా స్వామి
-
నువ్విచ్చేది ఏంటి బోడి... మహిళా రిజర్వేషన్లపై లోకేష్ కామెడీ కామెంట్స్
-
‘టీడీపీ మహానాడు ఓ మహానాటకం’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహా నాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారన్నారు.ముఖ్యమంత్రి దగ్గరి నుంచీ ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. మహిళా సాధికారతపై లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, వైఎస్ జగన్ హయాంలో ఏం చేశామో చర్చించేందుకు ఏ టీవీ ఛానల్ కైనా వచ్చేందుకు సిద్దమని ఆరె శ్యామల స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో ఆమె ఇంకేమన్నారంటే..మహిళా రిజర్వేషన్లపై ముందస్తు క్రెడిట్ చోరీమహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు. ఇది అడ్వాన్సెడ్ క్రెడిట్ చోరీ అన్నమాట. మహిళల గురించి మాట్లాడేముందు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలి. 18-59 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెలా రూ.1500 ఇస్తామన్నారు.రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అన్నారు. రెండేళ్లయింది. ఆరు సిలెండర్లు రావాలి. ఇచ్చింది ఒకటి లేదా రెండు. ఇక ఉచిత బస్సు కూడా ఏంతో ఊదరగొట్టి కేవలం ఐదు కేటగిరీలకే పరిమితం చేశారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. తల్లికి వందనంలోనూ 20 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. ఇక మహిళలకు చేసిందేంటి ? మహిళలకు ఆర్దిక స్వావలంబన చేకూర్చేందుకు వైఎస్ జగన్ పెట్టిన పథకాన్నీ ఎత్తేసి ఇప్పుడు వీళ్లు చెప్తున్న మాటలు నిజంగానే కామెడీగా ఉన్నాయి.మహిళా రిజర్వేషన్లను ముందుగా అంగీకరించింది జగనేఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రీ కొడుకుల మాటలు నమ్మే పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై దేశమంతా ఒక్కటిగా ఉన్న తరుణంలో దాన్ని కూడా వీళ్ల క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్నప్పుడు అందరి కంటే ముందు ఒప్పుకున్నది, ఆచరణలో చేసి చూపించింది వైఎస్ జగన్.మహిళలకు రిజర్వేషన్పై లోకేష్ చేసిన ప్రకటనను ఆమోదిస్తున్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. అమలు చేసేది వైఎస్ జగన్ మాత్రమే. ఎలాగో పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాబోతోంది, దేశమంతా రిజర్వేషన్ రాబోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మహిళల రిజర్వేషన్ తమ బ్రెయిన్ చైల్డ్ అన్నట్లుగా మాట్టాడటం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్లపైనా ఈ క్రెడిట్ చోరీ ఏంటి? మీ రాజకీయ జీవితమంతా క్రెడిట్ చోరీయే. ఎన్టీఆర్ నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమైన విమర్శల మధ్య ఆయనకు దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏదీ మర్చిపోరు. అన్నీ గుర్తుపెట్టుకుంటారు.హత్యా రాజకీయాలు టీడీపీవేగొడ్డలి పార్టీ అంటున్న వారికి హత్యా రాజకీయాలు ఎవరివో తెలియవా? వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో మీ హత్యా రాజకీయాల్ని స్పష్టంగా వివరించిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వాస్తవాలు అర్థమయ్యాయి. మీకు మనస్సాక్షి ఉంటే ఎన్టీఆర్ మరణం, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ వంటి వారి హత్యలకు కారకులు ఎవరో చెప్పండి. వివేకానందరెడ్డి హంతకులు కూడా ఇవాళ రోడ్డు మీద ధైర్యంగా ఎలా తిరగగలుగుతున్నారో చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చాక జరిగిన సచివాలయ ఉద్యోగుల మరణాలకు కారణం ఎవరు? స్వాతంత్రం తర్వాత దేశంలోనే తొలిసారి వైఎస్ జగన్ ఒకే రోజు 2019 అక్టోబర్ 2న లక్షా 20 వేల ఉద్యోగుల్ని నియమించి చరిత్ర సృష్టించారు.మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి ఎవరివి హత్యా రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీయే అర్దమవుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయి. 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ ? రాష్ట్రంలో శాంతి భద్రతలపై మీరే మాట్లాడాలి. మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్లే పరిస్ధితి ఉందా, వెళ్లినా ఫిర్యాదు తీసుకునే పరిస్ధితి ఉందా ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అమాయకులపై వేధింపులు, అక్రమ కేసులు, సోషల్ మీడియాపై దాడులే.రైల్వే కోడూరు ఎమ్మెల్యేపైలో మోసం, అత్యాచారం ఆరోపణలపై మహిళా ఉద్యోగి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యల్లేవు. మహిళా స్కూలు ప్రిన్సిపాల్ ను టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తే ఎలాంటి చర్యల్లేవు, మంత్రి సంధ్యారాణి పీఏపై లైంగిక వేధింపులపై చర్యల్లేవు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య కాల్స్ లో మాట్లాడినా చర్యల్లేవు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యేపైనా చర్యలుండవు. కాబట్టి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది?మహిళల్లో దైర్యం నింపిన జగన్ పథకాలుస్త్రీ శక్తి అంటే సభలో చప్పట్టు కొట్టుకోవడం కాదు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అసలు స్త్రీ శక్తి ఎలా ఉంటుందో చూపించారు. ప్రతీ ఇంట్లోనూ ఓ నమ్మకం కలిగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మహిళళకు సాధికారత లభించింది. మహిళలకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మున్సిపల్, జడ్పీ పదవులు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఆసరా, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు గత ప్రభుత్వంలో మహిళల స్వయం శక్తిని పెంచాయి. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్ వర్క్ లతో మహిళా సంఘాల్ని అనుసంధానం చేసిన ఘనత వైఎస్ జగన్దే. కానీ చంద్రబాబు రెండేళ్ల పాలనలో మహిళలకు చేసిందేమీ లేదు. కానీ నిత్యం వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారు.రాష్ట్రంలో మీరు కోల్పోయిన విశ్వసనీయత మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు, లోకేష్ గురించి అర్దమైపోయింది. మహానాడులో పెద్ద పెద్ద మాటలతో పబ్లిసిటీ కింగ్ లు, పరిపాలనలో పిల్లులని నిరూపించారు. హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతీ పథకం మహిళల జీవితాల్లో మార్పు తెస్తే.. మీ పాలనలో మాత్రం ప్రతీకార రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మామా, మరదలు, తమ్ముడు పార్టీ మహానాడు పేరుతో చేసిన మహానాటకం అద్భుతం.ఎందుకంటే మామ గారైన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, మరదలి బలవన్మరణానికి కారణమయ్యారు, తమ్ముడి గారిని గొలుసులు వేసి కట్టేశారు. ఇవన్నీ నిజాలే. ఆ పార్టీ మామ, మరదలు, తమ్ముడు పార్టీ. మీరు హద్దులు దాటి మాట్లాడితే మేమూ ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ మాట్లాడలేదంటూ మాకు కొన్ని విలువలు ఉన్నాయనే. మీరు దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారకపోయినా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లే అర్హత లేని వాళ్తంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టారాజ్యంగా నిందలేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా కబ్జాదారులు, బ్యాంక్ దోపిడీ దాడులు, మహిళల్ని లైంగికంగా వేధించిన వాళ్లు, డీఎస్సీ స్కాం దారులే. అదే వేదికపై మహిళా బిల్లును ఓడిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వీళ్లంతా వైఎస్ జగన్ గురించి, వైఎస్సార్సీపీ గురించి మాట్లాడుతున్నారు.లోకేష్కు వైఎస్సార్సీపీ ఓపెన్ ఛాలెంజ్లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. చర్చకు సిద్దమని మీరు సవాల్ విసిరారు కదా, దాన్ని స్వీకరిస్తున్నాం. ఏ టీవీ ఛానలో చెప్పండి, అందులో మా పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే వచ్చి చర్చలో పాల్గొంటారు. కానీ దాని కంటే ముందు పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.10 వేల కోట్లు ఎప్పుడిస్తారా చెప్పండి, అలాగే డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారా చెప్పాలి. డీఎస్సీలో పేపర్ లీక్, మెరిట్ లిస్ట్ మాయం, డేటా లీక్ జరిగాయి. మీరు ఈ డార్క్ ఆపరేషన్ గురించి ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు.రాష్ట్ర యువత లోకేష్ కు పేపర్ లీకేజ్ అని పేరు పెట్టారు. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ లు అయ్యాయి?, వాటిపై ఏ చర్యలు తీసుకున్నారు ? అడిగితే కేసులు పెడుతున్నారు. మీ పరీక్షల నిర్వహణలో తప్పులు పెట్టుకుని అడిగిన వాళ్ల మీద కేసులు పెడతామంటే ఎలాగో పేపర్ లీకేజ్ మంత్రి గారు చెప్పాలి. ఇవాళ మీ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఎన్నో పోరాటాలు చేస్తున్నా మీరు స్పందించడం లేదు. మీ వీధి భాష చూసి మీరు చదివిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ కూడా సిగ్గుపడుతుంది.ఓ పారిశ్రామిక వేత్త నుంచి లాబీయింగ్ చేసి డబ్బులు వసూలు చేసి ఫీజులు కట్టారన్నది వాస్తవమా కాదా లోకేష్ చెప్పాలి. స్టాన్ ఫర్డ్ డిగ్రీ కంటే వీధి భాష, కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ పాలనపైనే ఎక్కువగా పీహెచ్డీ చేసినట్లున్నారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని ఆరె శ్యామల అన్నారు. -
వీళ్ళ బండారం ఎలా బయట పడిందంటే క్లుప్తంగా వివరించిన అంబటి
-
జగన్ సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..?
-
మహానాడుపై TDP మహిళ సంచలన ఆడియో
-
ఎన్టీఆర్ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు)
-
డిమెరిట్ డీఎస్సీగా మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు కూటమి మొండి చేయి..
-
నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ.. మాట్లాడితే గొడ్డలి గొడ్డలి.. కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
బాబు నోటా జగన్ నామస్మరణ.. జగన్ మీటింగ్ తో కొట్టుకుపోయిన " మహానాడు "
-
హామీలు మరిచి ‘మహా’ నాటకం!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్లు.. సెవెన్లు ఇస్తామంటూ అందరినీ నమ్మించి రెండేళ్లైనా వాటి ఊసే లేకుండా పాలన సాగించిన చంద్రబాబు కనీసం ఈ మహానాడులోనైనా వాటి గురించి ప్రస్తావిస్తారని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశను మిగిలిస్తూ ‘డిజిటల్’ పేరుతో గొప్ప హైడ్రామాను రక్తి కట్టించారు! సూపర్ సిక్స్లు, సెవెన్లు సహా ప్రజలకు ఇచ్చిన 143 హామీలను ఎందుకు అమలు చేయలేదో.. పోనీ ఎప్పటి నుంచి చేస్తారో.. మహానాడులో కనీసం చర్చించిన పాపాన పోలేదు. చంద్రబాబు కొత్త పథకాలు ఇవ్వకపోగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారో.. అందుకు కారణాలేమిటో చెప్పలేదు. దాదాపు రూ.పది వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయి? వాటిని ఎప్పుడిస్తారో చెప్పలేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చి అంపశయ్యపైకి చేర్చారు. రోగులకు ‘ఆసరా’ ఊసే లేదు. అక్కచెల్లెమ్మలకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం మాటే లేదు. వైఎస్ జగన్ హయాంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం దాకా ప్రతి ఊరిలో కళకళలాడిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు – నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు భ్రష్టు పట్టించారంటే సమాధానం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు ఉచిత పంటల బీమా ఎగరగొట్టారు.. ఇన్పుట్ సబ్సిడీ ఎందుకివ్వడం లేదో చెప్పలేదు. కనీవిని ఎరుగని రీతిలో అన్నదాతలు ఎరువుల కోసం రోడ్లపైకి చేరుకుని అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురిస్తే దాని గురించి మహానాడులో కనీసం చర్చ లేదు. మళ్లీ సమస్య తలెత్తకుండా ఏం చేస్తారో చెప్పలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏకంగా 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయో సమాధానం లేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఎటుపోయిందో చెప్పలేదు. అమరావతి పేరుతో విచ్చలవిడిగా స్కామ్లు చేస్తూ... ఆచరణ సాధ్యమైన రాజధాని కారిడార్ ‘మావిగన్’ ఎందుకు వద్దో చెప్పడం లేదు. మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్..! లక్షలాది మంది యువతకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చ లేదు. ఇక మహిళలకు రిజర్వేషన్లు.. చినబాబు చొరవ అంటూ మరో హైడ్రామా! వైఎస్ జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో 33 శాతం పదవులు మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు? ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో మహానాడులో చర్చ లేదు. వైఎస్ జగన్ హయాంలో మహిళలే కేంద్రంగా పాలన సాగించి సింహభాగం పథకాలతో వారికి లబ్ధి చేకూర్చితే.. మహిళా సాధికారతకు కూటమి సర్కారు తూట్లు పొడిచింది. హామీల అమలు, పాలనను గాలికి వదిలేసి ‘రెడ్బుక్’ బెదిరింపులతో అరాచకంగా వ్యవహరిస్తోంది. మొత్తంగా మహానాడులో బోరు కొట్టించే ప్రసంగాలు.. జగన్పై వ్యక్తిగత విమర్శలు మినహా ఏ ఒక్క అంశంపైనా నిర్మాణాత్మకంగా చర్చించిన దాఖలాలు లేవు. ఎందుకంటే.. పాలన పడకేసిన చంద్రబాబు సర్కారులో మట్టి నుంచి ఇసుక, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్, మద్యం దాకా దేంట్లో చూసినా దోపిడీనే..! ప్రాంగణాలు వెలవెల.. మహానాడు పేరుతో చంద్రబాబు నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ డ్రామా అట్టర్ఫ్లాప్ అయింది. టీడీపీ కార్యర్తలు కూడా ఈ డ్రామాను పట్టించుకోకపోవడంతో అన్నిచోట్లా మహానాడు ప్రాంగణాలు వెలవెలబోయాయి. అయినా సరే రికార్డులు సృష్టించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. మహానాడుకు వర్చువల్గా 11 లక్షల మంది హాజరైనట్లు పేర్కొన్నారు. టీడీపీ యాప్ ద్వారా ఈ హాజరును తీసుకున్నట్లు సంబరపడ్డారు. నిజానికి మహానాడుకు స్పందన లేకపోవడంతో నాయకులు జనాన్ని తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. అనేక చోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు, ఇతర నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక వచ్చిన కొద్ది మంది కూడా వెనుతిరిగారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని కదిపినా ఇదేం మీటింగ్? అని విసుక్కోవడం మహానాడు ప్రత్యేకతగా నిలిచింది. పోటాపోటీగా పొగడ్తలు.. మహానాడు ఆద్యంతం అదే పనిగా వైఎస్ జగన్ను తిట్టడం, చంద్రబాబును పొగిడేందుకు నేతలు పోటీలు పడ్డారు. ఎన్టీఆర్ జయంతిని నిర్వహిస్తున్నట్టుగా చంద్రబాబు జయంతిని చిరకాలం నిర్వహించేలా ‘బాబునాడు’ చేద్దామని ఆయన వేదికపైన ఉండగానే నేతలు చెప్పడాన్ని బట్టి వారి అతి ఏ స్థాయికి వెళ్లిందో చూడవచ్చు. లోకేశ్ రాష్ట్రానికి కాదు.. దేశానికి దిక్సూచి అని, పులి కడుపున పులే పుడుతుందంటూ.. ఆయన పెద్ద పులి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి అందం ఆ కుటుంబాల్లో నారా దేవాన్‡్షకే వచ్చిందంటూ మోకా ఆనంద్సాగర్ అనే నేత పొగడ్తలు కురిపించారు. వైఎస్సార్సీపీని చంపేయాలని టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ అనుచిత వ్యాఖ్యలు చేసి లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయతి్నంచారు. వీటిని వింటూ చంద్రబాబు, లోకేశ్ చిరునవ్వులు చిందించారు. ఎన్టీఆర్ కోసం ఉత్తుత్తి తీర్మానం ఎప్పటిలానే ఈ మహానాడులో పలు ఉత్తుత్తి తీర్మానాలు చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని మరోసారి ఆమోదించారు. ఈసారి ఆ తీర్మానాన్ని చంద్రబాబు పెట్టడం గమనార్హం. భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడిన చంద్రబాబే తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల పాలనలో చేయని వాటిని చేసినట్లు, జరగని వాటిని జరిగినట్లు చూపించడానికి చంద్రబాబు తాపత్రయపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా చేశామంటూ పచ్చి అబద్ధాలు చెప్పుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే అమలు చేసేసినట్లు చెప్పారు. లోకేశ్ జెన్జీ కామెడీ! మహానాడులో నారా లోకేశ్ పబ్లిసిటీకి పరాకాష్టగా ఆయన జెన్జీ యువతతో సమావేశమై సంభాíÙంచినట్లు ఓ యూట్యూబ్ లింకు ఇచ్చారు. అందులో నలుగురంటే నలుగురే పార్టీ కార్యకర్తలు కూర్చోగా వారితో లోకేశ్ పిచ్చాపాటీగా మాట్లాడారు. దాన్నే జెన్జీ సమావేశంగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా షేర్ చేసుకోవడం గమనార్హం. -
‘అందుకే.. టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఫైర్ అయ్యారు. తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి నిర్వహించిన డీఎస్సీ–2025లో ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసిందని ఆమె ఆరోపించారు. అందుకే అది మెగా డీఎస్సీ కాదని ఒక దగా డీఎస్సీ అని అభివర్ణించారు.చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్పైనా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు. కాబట్టి నాడు ఎన్టీఆర్ హయాంలో నిర్వహించిన మహానాడుకు, ఇప్పటి ఈ మహానాడుకు మధ్య నక్కకు నాక లోకానికి ఉన్న తేడా ఉందని చెప్పారు. వర్చువల్ మహానాడు సమావేశాలకు చివరకు పార్టీ కార్యకర్తలు కూడా రావడం లేదని, అందుకే రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేయడంతో పాటు, డ్వాక్రా మహిళలను బెదిరించి, సమావేశాలకు తీసుకొచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి తెలిపారు.ప్రెస్మీట్లో నాగ మల్లీశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే..:అందుకోసమేనా మీ ‘మహానాడు’?:టీడీపీ మహానాడు సమావేశాలు పూర్తి హాస్యాస్పదంగా మారాయి. తనకు తానే విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ కామెడీ వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో, అభివృద్ధి కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్పకుండా.. రాబోయే రోజుల్లో ఏం చేస్తారన్న దానిపైనా మాట్లాడకుండా కేవలం జగన్గారిని తిట్టడానికే మహానాడు వేదికగా మార్చుకున్నారు. వైఎస్ జగన్ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులతో విమర్శలు చేయించడం పూర్తిగా దిగజారిన చంద్రబాబు నైజానికి అద్దం పడుతోంది.స్త్రీ శక్తి పేరు పెట్టుకోవడం విడ్డూరం:రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మహానాడులో 1160 సార్లు జగన్ పేరు జపించారు. మహిళల కోసం పోరాడుతున్నట్లు ‘స్త్రీ శక్తి’ అంటూ మహానాడుకు పేర్లు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. మహానాడుకు మహిళలు రావడం లేదనే పరిస్థితిలో స్త్రీశక్తి అంటూ హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు కూడా పెట్టారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? ‘కనిపిస్తే ముద్దన్న పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ అన్న డైలాగులు చెప్పింది మీ మామ బాలకృష్ణ కాదా?. చంద్రబాబు క్రెడిబులిటీని తగ్గించి లోకేష్ను హైలైట్ చేయడానికే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. నటనలో భాస్కర్ అవార్డు చంద్రబాబు, లోకేష్కే ఇవ్వాలి. అంత పెద్ద పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు.అనిత వ్యాఖ్యలు హాస్యాస్పదం: మహానాడు తొలి రోజు హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. పార్లమెంట్లో మహిళా బిల్లు ద్వారా 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా మా లోకేష్ మహిళలకు అవకాశాలు ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అనిత.. నీకు హోం మంత్రి పదవి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించుకో. జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్ గారికే తప్ప చంద్రబాబు, లోకేష్కు కాదు. దళిత మహిళలకు హోం మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర జగన్గారిది. మహిళలకు 50 శాతం పదవులు, పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 2019–2024 మధ్య చట్టబద్ధంగా అవకాశాలు కల్పించకపోయి ఉంటే ఇవాళ నీకు ఆ పదవి వచ్చేదా? చంద్రబాబుకు నిజంగా నీపై అంత ప్రేమ ఉంటే గతంలో ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇవాళ పరిస్థితులు మారడంతో మంత్రి పదవి ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడి జగన్ను తిడితే సరిపోతుంది అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.బూతులు. నిందలు. విమర్శలు.. ఇదే మహానాడు:మహానాడు అంటే నాలుగు బూతులు, నాలుగు విమర్శలు, నాలుగు తిట్లు, నాలుగు నిందలు అన్నట్టుగా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి.. 175 నియోజకవర్గాల అభ్యర్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి జగన్ గారు మీటింగ్ పెడితే మీ మహానాడు మొత్తం కొట్టుకుపోతుంది. అదే జగన్ స్టామినా. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని లోకేష్ అంటున్నారు. దేనిమీదైనా చర్చకు మేం సిద్ధం. మా ఎమ్మెల్యేలు మీతో చర్చకు వస్తారు రెడీనా? కానీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు.. మేం రాసిన రెడ్బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడవాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు చివరకు మీ పార్టీని భూస్థాపితం చేస్తాయని మర్చిపోతున్నారు.ఇప్పటికీ ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు:ఎన్నికల సమయంలో ఆడబిడ్డకు నెలకు రూ.1500, మూడు ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం అంటూ ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప 22 నెలల పాలనలో ఒక్క శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు. ఎన్టీఆర్ పథకాలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు స్వయంగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పథకం పేరైనా చెప్పగలరా? 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటికీ ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లుకు మొదటి మద్దతు తెలిపింది జగన్ గారే. ఇప్పుడు అదే విషయంపై క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు:పాలనా వైఫల్యాలు, డీఎస్సీ స్కామ్ బయట పడడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే మహానాడును వాడుకుంటున్నారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం అప్లోడ్ చేసిన వ్యక్తికే టాప్ ర్యాంక్ ఎలా వచ్చిందో లోకేష్ సమాధానం చెప్పాలి. ఇది మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ‘గొడ్డలి పార్టీ’ అంటూ మాట్లాడేవాళ్లు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలి. మీది వెన్నుపోటు పార్టీ కాదా? గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్ ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించింది. దాన్ని తీసేసి శక్తి యాప్ తెచ్చారని, మరి దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించిన నాగ మల్లీశ్వరి, చంద్రబాబు కూటమి పాలనలో మహిళలే ఎక్కువగా మోసపోతున్నారని చెప్పారు. -
ఏపీలో జరిగింది.. దగా డీఎస్సీ: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆయన శాఖను గాలికి వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి ఉద్ధరిస్తున్నానని చెబుతున్నాడు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన చేసిన తప్పుడు పనులు అన్నీ ఇన్నీ కాదు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘99 పైసలుకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా. అమరావతిలో అడుగుకు రూ. 20 వేల రూపాయలకు కాంట్రాక్టులు ఇచ్చి పోగేసుకుంటున్నారు కదా. గురువుల నియామకంలో కూడా తప్పుడు పనులు చేయడమేనా?. సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా ఉండదా మీకు?. 16 వేలపై చిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. చంద్రబాబు, లోకేష్ నీచాతి నీచాలకు పాల్పడ్డారు. మెగా డీఎస్సీ నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘మెరిట్ లిస్టు ఇవ్వరు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు. ఫోన్లకు మాత్రం మెసేజ్లు పెడతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా?. సిగ్గు లేకుండా విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చిన వాళ్లు అన్నమేనా తినేది. డీఎస్సీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. తప్పుడు పనులు చేయడం మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా?. ప్రతీ ప్రభుత్వ సంస్థలో నియామకాలు చేసినపుడు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారు..డీఎస్సీ, టెట్ పరీక్ష రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారంట. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారు. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలు పెట్టారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల కింద నేరుగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇది తప్పుకాదా... ఇంతకంటే నీచం మరొకటి ఉందా?. ఏపీలో దగా డీఎస్సీ.. అతిపెద్ద మెగా స్కామ్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనా 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే దమ్ముందా ఇదే నా ఛాలెంజ్...బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగ్లు కొట్టడం కాదు. ఖలేజా ఉంటే.. నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిపితే 421 మంది వివరాలు బయటపెట్టండి. మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టేలేనోళ్లకు మీకెందుకు సినిమా డైలాగ్లు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటాడు. లోకేష్ స్కామ్లు చేసి డబ్బులు తీసుకుంటాడు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశారనే నమ్మకం ఉంటే మెరిట్ లిస్ట్ బయటపెట్టండి. డీఎస్సీపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
చెప్పులపార్టీ... నువ్వా నీతులు చెప్పేది
-
కులాల కోసం మాట్లాడింది నువ్వు... దమ్ముంటే అరెస్ట్ చేయండి ప్రో. కే నాగేశ్వర రావు ఛాలెంజ్
-
తరిమి తరిమి కొడతాం... టీడీపీ మహానాడులో తెలంగాణపై.. జీవన్ రెడ్డి మాస్ వార్నింగ్
-
మహానాడులో చంద్రబాబుకి ‘సన్’స్ట్రోక్!
తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఫీలయ్యే ‘‘మహానాడు’’ గతకొన్నేళ్లుగా రాజకీయ సెటైర్లకు కేంద్రబిందువుగా మారుతోంది. టెక్నాలజీ వినియోగంలో తాము దేశానికి మార్గదర్శకులమని చెప్పుకునే ఆ పార్టీ పెద్దకు.. ఈసారి హైబ్రిడ్ మహానాడు చేదు అనుభవమే మిగులుస్తోంది. ఈ వర్చువల్ ప్రయోగం ఆయనో షాక్లా మారడమే కాదు.. సీనియర్ల నుంచి పెదవి విరుపులకు కారణమైందనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.ఒకవైపు టీడీపీ వర్గాలు, వాటి అనుకూల మీడియాలు రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షల మంది వర్చువల్గా పాల్గొన్నారని భారీ లెక్కలు చెబుతుండగా.. మరోవైపు అంతటా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న వీడియోలు అదే మీడియా చానెళ్ల ద్వారా బయటకు వస్తున్నాయి. కృష్ణాజిల్లాలోని మోపిదేవి సెంటర్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు కార్యక్రమం అయితే ఈ విమర్శలకు ప్రధాన ఉదాహరణగా మారింది. భారీ టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. కుర్చీలు మాత్రం ఖాళీగా కనిపించాయి. చంద్రబాబు ప్రసంగం జరుగుతున్న సమయంలో కూడా కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. “రండి బాబు రండి” అంటూ నేతలు కార్యకర్తలను బ్రతిమాలుకున్నా స్పందన ఆశించిన స్థాయిలో రాలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.నేతల తంటాలుమహానాడులో జనం ఉన్నట్లు కవరింగ్ చేసుకునేందుకు టీడీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు లేకపోవడంతో పాత రికార్డింగ్ వీడియోలు ప్లే చేశారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు, భోజనాలు ఏర్పాటు చేసి జనాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పొదుపు సంఘాల మహిళలను తప్పనిసరిగా హాజరు కావాలంటూ స్థానిక నేతల ద్వారా ఒత్తిళ్లు తెచ్చారన్న ప్రచారం కూడా వినిపించింది.అయితే టీడీపీ మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. “యాప్ రిజిస్ట్రేషన్, టైం టు టైం అటెండెన్స్, డిసిప్లిన్, వర్చువల్ కనెక్టివిటీ”తో మహానాడు ఘనవిజయమైందని చెబుతోంది. తెలంగాణ, అండమాన్ నుంచి కూడా కార్యకర్తలు పాల్గొన్నారని.. ఒక్కో క్లస్టర్లో 300 మందికిపైగా హాజరయ్యారని పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది.అంతా లోకేష్ వల్లే.. ఈ హైబ్రిడ్ మోడల్ వెనుక నారా లోకేష్ సలహా కీలకంగా ఉందన్న ప్రచారం పార్టీలోనే వినిపిస్తోంది. డిజిటల్ ఫార్మాట్తో భారీ ఇంపాక్ట్ వస్తుందని భావించినా.. చివరికి అది రివర్స్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే.. “లోకేష్బాబు మాట వినొద్దు సర్” అంటూ కొందరు టీడీపీ సీనియర్లు ముందుగానే చంద్రబాబును హెచ్చరించారట. కార్యకర్తల ఉత్సాహం, ప్రత్యక్ష హాజరు, రాజకీయ వేడి లేకుండా మహానాడు ప్రభావం తగ్గిపోతుందని చెప్పినా.. చివరకు అదే నిజమైందన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే నడుస్తోందట. ఈ ప్రయోగం విఫలమైందనే ఫీలింగ్లో చంద్రబాబు కూడా ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.ఇదిలా ఉంటే.. గతేడాది కడపలో జరిగిన మహానాడులో ఎన్టీఆర్ వారసత్వం, పార్టీ భవిష్యత్తు, లోకేష్ నాయకత్వంపై భారీ ఎమోషనల్ హైప్ క్రియేట్ చేసిన టీడీపీ.. ఈసారి మాత్రం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత ప్రయోగానికి వెళ్లి బొక్కబొర్లా పడింది. అప్పట్లో “ఎన్టీఆర్ దిగొచ్చి చంద్రబాబు, లోకేష్లను చూసి గర్వపడ్డారు” అన్నట్టుగా ఏఐతో వైరల్ చేసిన వీడియోలు, విజువల్స్తో నవ్వులపాలయ్యారు. ఇప్పుడు అదే లోకేష్ సూచించిన హైబ్రిడ్ మోడల్తో సొంత నేతల నుంచే విమర్శల పాలవుతోంది.“డిజిటల్ కనెక్టివిటీతో కొత్త రాజకీయ సంస్కృతి” తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈసారి వర్చువల్ మహానాడును భారీగా ప్లాన్ చేసినప్పటికీ.. గ్రౌండ్లో కనిపించిన ఖాళీ కుర్చీలు మాత్రం పార్టీ అంచనాలను తారుమారు చేశాయన్న చర్చ సాగుతోంది. “గతేడాది ఎమోషన్తో హైప్.. ఈసారి యాప్లతో టైప్” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ టీమ్ టెక్నాలజీ ప్రెజెంటేషన్, యాప్ అటెండెన్స్, డిజిటల్ మానిటరింగ్పైనే ఎక్కువ దృష్టి పెట్టి.. కార్యకర్తల భావోద్వేగ కనెక్ట్ను మిస్ అయ్యిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఈ ఏడాది మహానాడు ముగింపునకు ఒకరోజు ముందే టీడీపీకి గ్రౌండ్ రియాలిటీని చూపెట్టింది. వచ్చే ఏడాది ఇలాంటి “వర్చువల్ ప్రయోగాలు” వద్దని పార్టీ సీనియర్లు చంద్రబాబుకి స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. మొత్తానికి టెక్నాలజీతో రాజకీయాలను మార్చేస్తామని చెప్పిన టీడీపీకి.. ఈసారి “డిజిటల్ మహానాడు” మాత్రం సోషల్ మీడియాలో సెటైర్ల సునామీగా మారిపోయింది. -
మహానాడులో సోది వినలేక, బూతు రికార్డింగ్ డ్యాన్సులు
-
మహానాడులో రికార్డింగ్ డ్యాన్సులు ఖాళీ కుర్చీలు పరువు తీసుకున్న చంద్రబాబు
-
మహానాడులో కూడా వైఎస్ జగన్ నామస్మరణే: రోజా
సాక్షి, నగరి: మహానాడులో టీడీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ అసహ్యంగా ఉందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కాలిగోటికి సరిపోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహానాడును టీడీపీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, చంద్రబాబుది మహానాడు కాదు.. దగానాడు అని ప్రజలకు తెలిసిపోయింది. మహానాడులో టీడీపీ నేతలవి బోగస్ మాటలేనని మాటలకు అర్థమైంది. మహానాడులో వైఎస్ జగన్ నామస్మరణే ఎక్కువ చేశారు. వైఎస్ జగన్ అంటే టీడీపీ నేత వెన్నులో వణుకుపుడుతుంది. మహానాడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టి సభకు బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు డిన్నర్ చేశారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్న వారిని కలిసిన మీరు మహిళా ద్రోహులు. ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. దేశంలో ఏపీ పోలీసుల ర్యాంక్ అట్టడుగు స్థానంలోకి వెళ్లింది. ఒక్కొక్కరు ముగ్గురు, నలుగురు కనాలని చంద్రబాబు చెబుతున్నారు. మహిళలు పిల్లల్ని కనాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరు?. కాంగ్రెస్తో టీడీపీకి హాట్లైన్ బంధం ఉందని వైఎస్ జగన్ ఆనాడే చెప్పారు. దమ్ముంటే మహిళా బిల్లుకు మద్దతుగా మహానాడులో తీర్మానం చేయండి. మహానాడులో వైఎస్ జగన్ గురించి నీచంగా మాట్లాడారు. సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు?. హరికృష్ణ శవం దగ్గర పొత్తులపై కేటీఆర్తో మాట్లాడిన మీరు సైకో కాదా?. నారా లోకేష్ బిల్డప్ మాటలు ఎందుకు?. జగన్ దెబ్బకు లోకేష్ ఢిల్లీలో అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు. ఓటమి ఎరుగని ధీరుడు జగనన్న. నువ్వు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు. వైఎస్సార్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. ప్రజ సమస్యలు ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు ఆస్తుల్లో తల్లీ, చెల్లికి ఎంతిచ్చారో చెబుతారా?. మోసాలు, వెన్నుపోటుతో చంద్రబాబు సీఎం స్థాయి ఎదిగారు. తన చెల్లికి జగనన్న ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు. అసలు గొడ్డలి పార్టీ మీది. హెరిటేజ్ ఆస్తుల్లో మీ నాయకుడు తల్లి, చెల్లికి ఎంత వాటా ఇచ్చారో చెప్తారా?. తల్లితో ఉన్న ఫోటో గానీ, చెల్లితో ఉన్న ఫోటో ఒక్కటైనా బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తల్లి, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన మీరు సైకోలు కాదా?. వివేకా హత్య చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకు సునీత, షర్మిల అడగలేదు. హత్య చేసిన దస్తగిరికి కొమ్ము కాస్తున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి అనిత.. సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన మీరు ఆమెకు న్యాయం చేయాలి. మహిళా శక్తి అని పేరు పెడితే సరిపోదు, మహిళలు కు ముందు రక్షణ కల్పించాలి. రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. వెన్నుపోటు రెండేళ్లు పేరుతో విడుదల చేసిన బుక్ లెట్ ప్రతి గడప గడపకు అందిస్తాం’ అని అన్నారు. -
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దు
పంజగుట్ట (హైదరాబాద్): ఏపీలో ప్రొ.నాగేశ్వర్పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని వక్తలు డిమాండ్ చేశారు. లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దని చెప్పారు. తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో క్రాంతిదళ్ వ్యవస్థాపకుడు డాక్టర్ పృథ్విరాజ్ యాదవ్ అధ్యక్షతన ‘తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంతకాలం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో తనపై పెట్టిన కేసులు చూస్తే నవ్వొస్తుందన్నారు. ‘నేను కుల చిచ్చుపెట్టానట.. ప్రాంతం గురించి మాట్లాడానట.. అల్లర్లు సృష్టించేందుకు పనిచేశానట.. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేశానట.. ఆ కేసులు చూస్తుంటే నవ్వొస్తుంది’ అని అన్నారు. తెలంగాణ వారు ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం రైల్వేజోన్ ఇచ్చినట్లే ఇచ్చి ఆదాయం వచ్చే మరో లైన్ను ఒడిశాకు కలిపారని, మచిలీపట్నం ఆయిల్ గ్యాస్ నిక్షేపాలను దుర్మార్గమైన వేదాంత కంపెనీకి అప్పచెప్పారన్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని, తాను ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని చెప్పారు. మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయ్... ‘పవన్ కళ్యాణ్కు ప్రజాస్వామ్యం, తెలంగాణ కోసం మాట్లాడే హక్కే లేదు. అసలు ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే హక్కు కూడా లేదు. పూటకో రంగుమార్చేవాడు, చేగువేరా బొమ్మ పెట్టుకుని గద్దర్ను మోసం చేసిన వాడు పవన్. ఎన్టీఆర్ను మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు. పవన్, బాబును తెలంగాణలో అడుగు పెట్టనివ్వరాదు’ అని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ‘చంద్రబాబు, పవన్ జాగ్రత్త. రజాకార్లనే ఉరికించిన నేల ఇది. మీ ఆస్తులు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి. మీ ఆస్తులు తగలబెట్టడం కాదు, అస్తిత్వం లేకుండా చేస్తాం. చంద్రబాబు హెరిటేజ్ను నేటి నుంచి తెలంగాణలో బ్యాన్ చేద్దాం’ అని పృధ్వీరాజ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చంద్రబాబును విమర్శించామని, కానీ ప్రస్తుతం వారు చేస్తున్న బూతుపురాణాల్లా ఎప్పుడూ విమర్శించలేదని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య అన్నారు. వెంటనే నాగేశ్వర్పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. -
బాబు రాక్షస పాలనపై పోరు
‘‘స్టేట్ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్ మీద రూ.31.62. లీటరు డీజిల్ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది’’‘‘స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కార్యకర్తల మనసులు గెలుచుకోవడానికి ప్రతి నియోజకవర్గ ఇన్చార్జి ప్రయత్నం చేయాలి. ఈరోజు వారికి మీరు అండగా నిలబడితే రాబోయే ఎన్నికల్లో ఈ కార్యకర్తలు మీ గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని మాత్రం మరువొద్దు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రతి స్థానంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం దాన్ని నేను సీరియస్గా తీసుకుంటా’’‘‘కుప్పంలో టీడీపీకి 20 వేలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదు సార్లు, పది సార్లు కనిపిస్తోంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతి సారీ తండ్రి పేరు చూసినా లేదా భర్త పేరు చూసినా ఒకటే ఉంటాయి. ఇది కుప్పంలో మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ. ప్రతి ఊరిలో మనవారు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే చాలు.. నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల వరకు మన ఓట్లు పోయినట్టే!’’ -పార్టీ నేతలతో భేటీలో వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం, దగా, వంచనను వివరిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు..’ పేరుతో రూపొందించిన బుక్లెట్ను వైఎస్ జగన్ విడుదల చేశారు. అది గ్రామగ్రామానా, ఇంటింటికీ చేరేలా చూడాలని నిర్దేశించారు. ప్రతి కార్యకర్త వద్ద ఆ బుక్లెట్ ఉండాలని.. డిజిటల్ రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యాచరణ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై వైఎస్ జగన్ ప్రధానంగా చర్చించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు చేసినా దీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న వారిని ఇప్పటి నుంచే గుర్తించాలని, వారిని అభ్యర్థులుగా ప్రకటించి ప్రతి అడుగులో తోడుగా నిలవాలని నిర్దేశించారు. స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి తమకు అండగా నిల్చారన్న భావన స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఒక్కరిలో కలిగేలా చొరవ చూపాలని సూచించారు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా పని చేస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని.. ఒకవేళ అలా జరిగితే అది అక్కడి ఇన్ఛార్జ్ వైఫల్యంగా భావిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు వైఎస్ జగన్ గట్టిగా సూచించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పశి్చమ బెంగాల్, తమిళనాడులో ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ‘సర్’ ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ఓట్లు తగ్గినా.. పెరిగినా డేంజరేనని హెచ్చరించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు బాబు రాక్షస పాలన.. ‘ముసలి పులి.. బంగారు కడియం’ రెండేళ్ల చంద్రబాబు పాలన గురించి నాకన్నా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా చక్కగా చెబుతాడు. చంద్రబాబు పాలన ఈ రెండేళ్లలో ఎలా ఉంది అని చూసిన తర్వాత.. ‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’ అని రుజువైంది. వెన్నుపోటు.. విధ్వంసం.. అరాచకం.. అబద్ధాలు.. డైవర్షన్ పాలిటిక్స్.. దోపిడీ.. అవినీతి.. ఇదే ఈ రెండేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలన! ఇంతకు ముందు ఎన్నికలప్పుడు కూడా చెప్పా.. ‘ఒక ముసలి పులి. బంగారు కడియం’ కథ! చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే ఇదే అని! ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతున్న పరిస్థితులు మన కళ్ల ఎదుటే చూశాం. ఆ రోజుల్లో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి పులి, బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని పులి తిన్నట్టుగానే తినేస్తున్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తోందో చంద్రబాబునాయుడును చూసినా ఈరోజు అదే కనిపిస్తుంది. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన చంద్రబాబు చంద్రబాబు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు. సూపర్ సెవెన్ అన్నాడు. మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు మేనిఫెస్టోలో పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనమంతా చూస్తున్నాం. రెండేళ్లు అయిపోయింది. మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లలో భాగంగా ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్క చెల్లెమ్మకూ ప్రతి నెలా రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తానన్నావు కదా! రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అని అడిగితే మాట రాదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా నిరుద్యోగ భృతి అని చదువుకున్న ప్రతి పిల్లాడికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తానన్నావు. సంవత్సరానికి రూ.36 వేలు.. రెండేళ్లకు రూ.72 వేలు ఇప్పటికే బాకీ పడ్డావు. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకూ సంవత్సరానికి రూ.48 వేలు బాకీ. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మూడో సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి కేటాయింపులు లేవు కదా? అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా కనిపించదు. దీనిపై అడిగితే మాత్రం చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతోంది. టపా అని ఎక్కడన్నా పొరపాటున చంద్రబాబునాయుడును నిద్రలేపి మావిగన్ అని చెవిలో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోయినా పడిపోతాడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడులో ఇవన్నీ చూస్తున్నాం. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు పెట్రో ధరల తగ్గింపుపైనా మోసమే.. చంద్రబాబు 143 హామీల్లో మనందరికీ ప్రధానంగా పెట్రోలు, డీజిల్ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఈరోజు లీటరు పెట్రోలు రూ.117 దాటింది. లీటరు డీజిల్ చూస్తే రూ.105 దాటింది. పెట్రోలు, డీజిల్ ధరలు అధికారంలోకి రాగానే తగ్గిస్తామని చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు, డీజిల్పై విపరీతంగా బాదుడే బాదుడు కనిపిస్తోంది. స్టేట్ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్ మీద రూ.31.62. లీటరు డీజిల్ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. అందుకే బాబు డైవర్షన్ పాలిటిక్స్.. ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు తాను ఫలానా మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు మినహా ప్రజలకు ఈ రెండు సంవత్సరాల్లో నేను ఈ మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి. ప్రజలను ఈ టాపిక్ నుంచి.. ఆ టాపిక్ లోకి మభ్య పెట్టాలన్న దిక్కుమాలిన ఆలోచనతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ పిచ్చోళ్లు అని చంద్రబాబునాయుడు అనుకుంటున్నాడు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ప్రజలు చాలా చైతన్యవంతులు. గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పగలం.. రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగు పడిందన్నా.. నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా.. పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాయి అన్నా.. ఒక రైతు బాగుపడ్డాడు అన్నా.. ఒక అక్కచెల్లెమ్మ బాగు పడిందన్నా.. ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడ్డాడన్నా.. ఇవన్నీ ఒక్క నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్సార్సీపీ, మీ జగనన్న పాలనలోనే జరిగాయి అని గర్వంగా చెప్పగలుగుతా. మంచి చేశాం అని చెప్పి కాలర్ ఎగరేసుకుని.. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికీ వెళ్లగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు, ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు రెండు సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పర్చేందుకు ఒక బుక్లెట్ను రిలీజ్ చేస్తున్నాం. ప్రతి కార్యకర్త వద్ద ఉండాలి.. ప్రతి ఇంటికీ చేర్చాలి బుక్లెట్లో అన్ని అంశాలను క్షుణ్నంగా మనం చదువుకోవడమే కాకుండా మన పారీ్టలో ప్రతి కార్యకర్తకు ఈ రెండేళ్ల పాలనలో ప్రతి అంశం మీద అవగాహన ఉండేలా రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వాళ్లందరికీ అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది మనం నిర్వహించిన ర్యాలీలు కార్యక్రమం అప్పట్లో బాగా జరిగింది. రెండో ఏడాది కూడా చంద్రబాబునాయుడు పాలన మీద నిరసన తెలుపుతూ అంతకన్నా ఇంకా గొప్పగా ర్యాలీలు జరగాలి. ఈ కార్యక్రమాలు అన్నింటినీ జూన్ 4 నుంచి 12 వరకు పార్టీ తరఫున చేపడుతున్నాం. ‘సూపర్హిట్’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం..ఎన్నికల హామీల్లో ఇంకా చాలా ఉన్నాయి.. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పచ్చి మోసాలుగానే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే మరోవైపున సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు అన్నీ చేసేశాం అని ఏకంగా ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడూ ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకునిపోయే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడేమో.. ఒక్క చంద్రబాబునాయుడు తప్ప. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్ ఇందుకే..‘చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు..’ బుక్ లెట్లో సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లతో ఏరకంగా ఆయన మోసం చేశాడనే దగ్గర నుంచి.. ఏ రకంగా విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టి పిల్లలను రోడ్ల మీదకు తెచ్చాడనే పరిస్థితి నుంచి.. ఆరోగ్యశ్రీ దుస్థితి, విద్య, వైద్యం, వ్యవసాయం ఏరకంగా కుప్పకూలిపోయింది? అక్కచెల్లెమ్మల జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి? లాంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అవినీతి అన్నీ కూడా క్లుప్తంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో ఈ బుక్లెట్ రూపొందించడం జరిగింది. ఇది అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. క్యూఆర్ కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకూ చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ బుక్లెట్ వివరాలు అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చాం.చంద్రబాబుకి సెగ తగిలేలా నిరసన కార్యక్రమాలు ఇలా.. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలను ఒకవైపు ఎస్ఐఆర్, గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ నియోజకవర్గాల్లో ప్రతి మండలంలోనూ జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టండి. చంద్రబాబునాయుడుకు సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ‘ఈనాడు’లో ఎన్నికల ముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కాపీ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫొటోలతో సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్ల కాపీలు.. (ఇవి నెట్లో, బుక్లెట్లో అందుబాటులోనే ఉన్నాయి) ప్రతి మండల కేంద్రంలో 4వ తేదీన ఈ రెండూ చూపిస్తూ నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్చార్జి పాలు పంచుకోవాలి. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలు పంచుకుని కార్యక్రమం జరిగేలా ప్రణాళిక రూపొందించాం. తరువాత జూన్ 8, 9వ తేదీల్లో వీలును బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సు ఉంటుంది. యువకులు, రైతులు, మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వీరందరి సమక్షంలో వెన్నుపోటుకు రెండేళ్లు బుక్లెట్లోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది. చివరగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహిద్దాం. ఈ కార్యక్రమాన్ని స్వయంగా నేను పర్యవేక్షిస్తా. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. -
‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, ఎన్నికలకు ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని వైఎస్సార్సీపీ బీసీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేశ్, విడదల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నేత కారుమూరి సునీల్ మండిపడ్డారు.వైఎస్ జగన్ పాలనలో బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా నిలబెడితే, ఇప్పుడు కూటమి సర్కార్ మళ్లీ వారిని వెనక్కి నెట్టేస్తోందన్నారు. మహానాడులో మాత్రం బీసీల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని, బీసీలకు చేసిన సంక్షేమంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ నేతలు ఇంకేమన్నారంటే..బీసీలకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరా?: చెల్లుబోయిన వేణు2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ బీసీ ఉపముఖ్యమంత్రి ఉన్నారు, ఓసీల్లో కాపు సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రి మీరే ఇచ్చారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే యోగ్యత లేదా ? బీసీలు ఏమీ అడగరనే ధైర్యమా ? బీసీల ఆత్మగౌరవ, ఆత్మక్షోభకు కారకులు మీరు కాదా ? ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసినా రాజ్యాధికారం పొందలేని స్ధితిలో ఉన్న అనేక కులాలు నాడు జగన్మోహన్ రెడ్డి మేలు చేశారు. కానీ మీరు ఎన్నో అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు ? వెనుకబడ్డ కులాల్ని ఇంకా వెనక్కు నెట్టేశారనడానికి ఇదే నిదర్శనం కాదా ?ఆనాడు వైఎస్ జగన్ హయాంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పోరేషన్లు ఇస్తే .. మీరు ప్రతీ రోజూ ఏ కార్పోరేషన్ కూ భవనాలు లేవు, రూములు లేవని రోజూ విమర్శలు చేసారు. ఇప్పుడు మీరు 40 కార్పోరేషన్లను మాత్రమే వేసి మిగతా 16 కార్పోరేషన్లను వదిలేశారు. బీసీలు చైత్యనం కావాల్సిన అవసరం ఉంది. అబద్దాలకు వేదికగా మహానాడు పెట్టి తన మోసాల్ని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. మోసపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక బీసీలను మోసం చేసిన పార్టీ టీడీపీ. అందుకే రాష్ట్రంలో బీసీ సమాజం చంద్రబాబు మోసంపై ఆగ్రహంగా ఉంది. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు బీసీల ద్రోహి. చంద్రబాబు అబద్దాల్ని నమ్మి బీసీలు రెండు, మూడు తరాలు వెనక్కిపోయారు.బీసీ సంక్షేమంపై చర్చకు సిద్ధం: జోగి రమేష్రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మహానాడు వేదికగా చంద్రబాబు మాటమాటలు, లోకేష్ అబద్దాలు వింటుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. 2019-2024 వరకూ వైఎస్ జగన్ పాలనలో వెనుకబడిన వర్గాలంతా ఎంతో ధైర్యంగా ఉన్నారు. స్పీకర్, కేబినెట్ మంత్రి పదవుల నుంచీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల నుంచీ, రాజ్యసభ సీట్ల వరకూ ఇచ్చి ఢిల్లీకి కూడా పంపారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో చోటిచ్చిన ఆ మహనీయుడి పరిపాలన ఎక్కడా ? అని వెనుకబడిన వర్గాలు ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బలహీన వర్గాలు చెప్పిన 50 ఏళ్లు దాటితే ఇస్తానన్న పెన్షన్ ఏమైంది ? 45 ఏళ్లు దాటిన అక్కాచెల్లెళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మోసం చేసిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, చేయూత మోసాలు కనిపిస్తున్నాయి. జగనన్న పాలనలో బలహీన వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇచ్చి వాళ్ల ఆరోగ్యాల్ని కాపాడారు. అభివృద్ది, సంక్షేమంపై చర్చకు సిధ్దమంటున్న లోకేష్.. దానికి టైమ్, ప్లేస్ కూడా చెప్పాలని బీసీ మాజీ మంత్రులుగా అడుగుతున్నాం. బీసీ వర్గాలకు మా జగనన్న చేసిందేంటో, మీరు చేస్తోంది ఏంటో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాం.బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు: విడదల రజనిబీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మా జగనన్న.. ఐదేళ్ల పాలనలో బీసీల పట్ల తనకున్న ప్రేమను, బీసీల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఎలా అడుగులు వేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. దీని వల్ల బీసీలు ఎలా లబ్దిపొందారో కూడా చూసారు. కానీ అదే బీసీల్ని చంద్రబాబు ఇంకా వెనుకబాటుకు గురిచేస్తున్నారు. బీసీలకు ఏ విధమైన అభివృద్ది కానీ, సంక్షేమం కానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మహానాడులో బీసీలకు ఏదేదే చేసేశామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి బీసీల సంక్షేమం కోసం పాటుపడింది, వారికి న్యాయం చేసింది వైఎస్ జగనే.మ్యానిఫెస్టోలో సైతం రాష్ట్రంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు అంతకు మించి ఖర్చుపెట్టిన చరిత్ర జగన్ ది. వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. తన రెండో కేబినెట్ లో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు. కాంట్రాక్టుల్లో, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారు. మంగళగిరి, కుప్పం వంటి నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిన సీట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయానికి నిదర్శనం. కానీ చంద్రబాబు ఎన్నికల్లో బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మినహా వారికి సరైన న్యాయం ఎప్పుడూ చేయలేదు. దీనికి వ్యతిరేకంగా బీసీ మాజీ మంత్రులు .. ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.బీసీలపై తప్పుడు కేసులకు భయపడబోం: కారుమూరి నాగేశ్వరరావురెండేళ్ల కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్ని గాలికొదిలేసి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ అన్యాయం చేసింది. ఆ రోజు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని తప్పుడు విమర్శలు చేశారు. కానీ ఆయన చేసిన 3.30 లక్షల కోట్ల అప్పుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో మీ నోటితోనే చెప్తున్నారు. ఇప్పుడు మీరు రెండేళ్లలోనే 3.50 లక్షల కోట్ల అప్పులు చేసినా వాటిని ఏం చేశారో చెప్పుకోలేని దుస్దితిలో ఉన్నారు. ఆనాడు వైఎస్ జగన్ నాకు మంత్రి, నా కొడుక్కి ఎంపీ సీటు కూడా ఇచ్చారు. 38 ఎమ్మెల్సీల్లో 18 ఎమ్మెల్సీల్ని, 9 మంది మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఛైర్మన్లలోనూ సింహభాగం బీసీలకు ఇచ్చారు.రాష్ట్రంలో బీసీ బిడ్డలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చలవే. ఇప్పుడు ఎక్కడో యుద్దం జరుగుతుంటే పిల్లలకు డ్రెస్సు లేదు, బుక్స్ లేవంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పత్రాల్లోనే మిగిలిపోయాయి. మీరు నా మీద, నా కొడుకు, కోడలి మీద కేసులు పెట్టినా భయపడేది లేదు. మేం తప్పుచేయలేదు కాబట్టి భయపడబోం, ప్రాణత్యాగానికైనా సిద్దం. బీసీ వర్గాల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.బీసీల్ని అన్ని విధాలా మోసం చేస్తున్నారు: బుట్టా రేణుకబీసీలకు ఆర్దికంగా, సామాజికంగా అండగా నిలబడి, వారిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. బీసీ మహిళలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి,జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. ఏ పథకం కూడా ఇవ్వకుండా ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.ఈ రెండేళ్లలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. మా ప్రభుత్వంలో చేసిన దానికీ, మీరు చేసిన దానికీ తేడా ఏంటో చూపించే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ప్రతీ దాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో చంద్రబాబుకు తెలుసు. కానీ మేం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముందుకెళ్తాం. మేం ఎప్పుడూ సాధ్యమయ్యేదే చెప్తాం, దాన్నే అమలు చేసి చూపిస్తాం.బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కారుమూరి సునీల్బీసీలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నారు. మహిళలకు ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తామని, అన్నీ గాలికొదిలేశారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అమలు చేసిన ఏ ఒక్క పథకం ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. డీఎస్సీలో చేసిన మోసంతో ఎంతో మంది బీసీ అభ్యర్ధులు ఇబ్బందిపడుతున్నారు. బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. త్వరలో ఈ దిశగా కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపట్టబోతున్నాం. -
ఈ బుక్లెట్ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి
-
మెగా DSCపై చంద్రబాబు వీడియో అంబటి నెక్స్ట్ లెవెల్ ర్యాగింగ్
-
బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్
-
గొడ్డలి.. గాడిద గుడ్డు అంటూ... - బాబుపై కొడాలి నాని మాస్ ర్యాగింగ్
-
ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని.. బాబు రెండేళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ వల్ల నష్టాలు జరగకుండా చూడాలన్నారు.‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా చూడాలి. చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలు అందరూ చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్కు వంగి దండాలు పెట్టడమే తెలుసు. లోకేష్ ఉన్న ఒక్క శాఖను నడపలేక పోతున్నారు.. జగన్తో చంద్రబాబు చర్చకు రావాలి. ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు. సింగిల్ వచ్చే సింహం జగన్. గుంపులు గుంపులుగా వచ్చేది వాళ్లు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో: పేర్ని నానిమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీల పేరుతో బాండ్లు ఇచ్చి మోసం చేసింది. రెండేళ్లలో ప్రజలను ఎలా మోసం చేశారో జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలు చేపడుతున్నాం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. సర్ పై అప్రమత్తంగా ఉండాలి. ఒక్క వైఎస్సార్సీపీ ఓటు కూడా పోకుండా చూడాలి. గొడ్డలి పార్టీ అని చంద్రబాబు డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహానాడు కాదు దగానాడు: రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలి. అందుకే బాబు మోసాల మానిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తున్నాం. జూన్ 4 నుంచి మా పార్టీ కార్యాచరణ మొదలవుతుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో మీరు ప్రారంభించి పూర్తి చేసిన పనులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి కాగానే విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఇవాళ ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తుంటే పట్టించుకోరు.. మీరు మంత్రిగానే పనికి రారు.. మిమ్మల్ని పార్టీ అధ్యక్షుని ఎలా చేశారు?. ప్రశ్నిస్తా అన్న నాయకుడు ఏం చేస్తున్నారో తెలియదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు గతంలో ఎందుకు అమలు చేయలేదు?. మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇవ్వాలి కదా. ఇప్పుడే ఎందుకు అన్నీ గుర్తు వస్తున్నాయి’ అని ప్రశ్నించారు. -
నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?
-
ప్రతి టూర్లో ఓ సీన్.. ప్రతి సీన్కు ఓ ట్రోల్!
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు, చేష్టలు విచిత్రంగా ఉంటున్నాయి. పొయ్యి వెలిగించకుండానే చేపల కూర వండడం మరీ విడ్డూరం. ఇలాంటి చేష్టలతో చంద్రబాబు ప్రజల దృష్టిలో మరీ పలుచనవుతున్నారు. ప్రజలను కలుసుకోవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ.. వీటికి ఓ నాటకీయత అబ్బితేనే వస్తుంది సమస్య. ‘మత్సకారుల సేవ’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ మత్సకార కుటుంబం ఇంటికి వెళ్లారు. వెళ్లడానికి ముందు ఒక నలుగురైదుగురు మత్సకార మహిళల నుంచి చేపలు కొంటున్న ఒక సీన్ సృష్టించారు. అక్కడ నుంచి ఆయన మత్సకారుడి ఇంటికి వెళ్లి చేపల కూర చేయించారు.ఆ క్రమంలో ఆ ఇల్లంతా కలియదిరిగారు. వారితో మాట కలిపారు. ఈ క్రమంలోనే అప్పటివరకూ కూర్చుని ఉన్న బాబు అకస్మాత్తుగా లేచి కిచెన్లో పొయ్యి మీద ఉన్న చేప ముక్కలను కలియ తిప్పారు. అప్పుడే కూర వండుతున్నట్లు కనిపించాలని అనుకున్నారు. కానీ.., స్టవ్ వెలిగించడం మర్చి పోయారు. దాంతో సోషల్ మీడియా దీన్ని ఒక లాఫింగ్ పీస్ చేసేసింది. స్టవ్ వెలిగించకుండానే చేపల కూర వండుతున్న ముఖ్యమంత్రి అని, సార్..స్టవ్ మర్చిపోయారు సార్..అని ఇదంతా డ్రామా, స్క్రిప్ట ప్రకారం షూట్ చేశారని మరి కొందరు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ ఇంటివారితో కలిసి ఒక స్పూన్తో ఒకటి, రెండు ముక్కలు తీసుకున్నట్లు కనిపించింది. ఆయన ఇంటికి రావడానికి ముందు ఆ రహదారిలో ఎవరూ లేకుండా జాగ్రత్తపడ్డారు. కారు దిగినప్పటి నుంచి ప్రతి సన్నివేశంలో ఆయన నటించారన్న భావన సోషల్ మీడియాలో వ్యక్తం అయింది. ఎందుకంటే తొలి నుంచి ఆయన కెమెరా మైక్ పెట్టుకుని ఉంటే, మత్సకార కుటుంబంలో కూడా ఒకరిద్దరికి మైక్ పెట్టి ఉందట. ఈ రకంగా చేయడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? అన్న చర్చ జరగవచ్చు. ముఖ్యమంత్రి జనసామాన్యంలో కలిసి పోతున్నారు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. 2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు తనపై తనకే అంత నమ్మకం ఉన్నట్లు లేదు. చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోయారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయి ఇలాంటి జిమ్మిక్కులు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఉంది. కాని ఆ స్క్రీప్ట్లో పొరపాటు వల్ల దొరికిపోతున్నారన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. టీ షాపుకు వెళ్లడం, ఒక ఇంటికి వెళ్లి తానే టీ, కాఫీ తయారు చేస్తున్నట్లు కనిపించడం, టీ తయారీ గురించి చర్చిస్తుండడం, ఒక బడ్డీ కొట్టు వద్దకు వెళ్లడం, తాటి ముంజెలు కొనుగోలు చేసి సతీసమేతంగా తినడం, జగన్ టైమ్లో నిర్మించిన గృహానికి వెళ్లి అక్కడ నేమ్ ప్లేట్ పెట్టడం తదితర దృశ్యాలు సోషల్ మీడియాను బాగానే ఆకర్షిస్తాయి. కాని అంతిమంగా ఆయనకు అది రాజకీయ ప్రయోజనం కలిగించడం లేదు. ప్రతిసారి నటిస్తున్నారన్న వ్యంగ్యోక్తులకు గురి అవుతున్నారు. ఈ వయసులో ఇన్ని విన్యాసాలు అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఒక ఇంటికి వెళ్లినప్పుడు వారు తమకు పెన్షన్ రావడం లేదని, మరో చోట్ సొంత ఇల్లు లేదని, ఇంకోచోట తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుకున్నారు. సంబందిత జిల్లా కలెక్టర్కు వాటిని నెరవేర్చాలని ఆయన ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. కాని కొన్నిసార్లు అవి ఏ కారణం వల్లనైనా కాని అమలు కావడం లేదట.దాంతో ఈ మధ్య ఒక వ్యక్తి తనకు సీఎం వాగ్దానం చేసి ఆరు నెలలు అయినా అది నెరవేరలేదంటూ రోడ్డుపై ఆందోళనకు దిగాడు. ప్రతి నిత్యం ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ ల ద్వారా ఎక్కడో చోటకు వెళ్లినప్పుడు ఆయన ఏదో ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని జనాన్ని ఆకర్షించడానికి తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాని, కొన్నిసార్లు అవి వికటించి లాఫింగ్ స్టాక్ అవుతున్నాయని కొందరు టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. గత అనుభవాల రీత్యానేమో తెలియదు కాని, ఇటీవల ఆయన వెళ్లిన ఇంటిలో ఉన్నవారిని మీకేం కావాలని అడుగుతున్నట్లు కనిపించలేదు. ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పి వచ్చేస్తున్నారు. కాసేపు ఆ కుటుంబం వారితో పొగిడించుకుంటున్నారు.నిజానికి ఇలాంటి సందర్భాలలో తన ప్రభుత్వం గురించి వారు ఏమి అనుకుంటున్నది అడిగి అభిప్రాయ సేకరణ చేసుకుంటే బాగుండేది. తాను సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అంటున్న నేపథ్యంలో వారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా?లేదా? అన్నది తెలుసుకుని ఉండాల్సింది. ఇవన్ని మైక్ పెట్టుకుని అడగడం ఇబ్బంది కనుక, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి జనాభిప్రాయం గమనించి ఉండాల్సింది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పినా, ఇవ్వలేకపోతున్నానని, అయినా మీరు సంతృప్తిగానే ఉన్నారా అని ప్రశ్నించి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలలో తన పరపతి పెంచుకోవడం కోసం ఆకస్మిక తనిఖీల పేరుతోనో, మరో పేరుతోనో టూర్ చేస్తుండే వారు. తొలుత సీరియస్ గానే జరిగినా, రాను, రాను అవి కూడా షో పుటప్ల గానే మారిపోయాయి. కావలి వద్ద ఉన్న జువ్వలదిన్నె సందర్శించడానికి కూడా కారణం లేకపోలేదు. అంతకు కొద్దిరోజుల ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడకు వెళ్లి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. జగన్ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూమి లో కొంత భాగాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని ఇటు మత్సకారులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే తమిళనాడు నుంచి కొందరు వచ్చి దొంగచాటుగా ఆంధ్ర ప్రాంత మత్స్య సంపదను కొల్లగొడుతుంటే, వారిని పట్టుకుని బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాని తదుపరి ఏపీ ప్రభుత్వం వాటిని వదలివేయడంపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. టీడీపీ ఎంపీ, పి బీదా మస్తాన్ రావు ప్రోద్బలంతోనే బోట్లు వదలి వేశారని మత్స్య కారులు అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలో ఆ మత్సకారుల వద్దకు జగన్ వెళ్లి వారికి భరోసా ఇచ్చి వచ్చారు. లోకేశ్ జువ్వలదిన్న సందర్శిన తర్వాతే కొద్ది రోజులకు బోట్లను వదలి వేశారని జగన్ ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కొంతమేర ప్రైవేటుకు కట్టబెడితే ఊరుకోబోమని, తాను అధికారంలోకి వచ్చాక దానిని స్వాధీనం చేసుకుని మత్సకారలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా, అది బాగా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్సకార వర్గంపై పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఆ క్రమంలోనే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అంటూ పంచ్ డైలాగులు చెప్పి తృప్తి పరచడానికి యత్నించారు. ఆ రకంగా జగన్ రాక తమకు ఉపయోగపడిందని, చంద్రబాబు ఈ మాటలు అనక తప్పలేదని మత్సకారులు భావిస్తున్నారు. అది నిజమే అనిపిస్తుంది.1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తరచుగా వివిధ చిత్రమైన రీతులలో కనిపించే వారు. రోడ్డుపై స్నానం చేస్తున్న ఫోటోలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు.. సినీ నటుల పార్టీని ఎవరు పట్టించుకుంటారని విమర్శించే వారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతి కాలంలో ఆయనే టీడీపీని కైవసం చేసుకుని, తానే రాజకీయంగా రకరకాల సన్నివేశాలలో నటిస్తుండడం విశేషం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వెన్నుపోటుకు రెండేళ్లు
-
స్థానిక సంస్థల ఎన్నికలే మన టార్గెట్.. YSRCP నేతలకు జగన్ హెచ్చరిక
-
జూన్ 12.. గుర్తుపెట్టుకోండి..! చంద్రబాబు కు చెమటలు పట్టించాలి
-
సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు
-
స్థానిక సంస్థల ఎన్నికలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మన అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూశాం. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయడం చూశాం. బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇన్ని ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ దీటుగా నిలబడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలి. విజయమైనా, పరాజయమైనా.. తన ఎమ్మెల్యే కేండిడేట్ తనకు అండగా ఉన్నాడు అని ప్రతి కార్యకర్తకూ కలగాలి. చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ అండగా నిలబడ్డాడని కార్యకర్తకు అనిపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే, వాళ్లే మీకు జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. దాన్ని సీరియస్గా తీసుకుంటాను. అలా జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ఫెయిల్యూర్గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవరు ఉన్నారు? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పటికే మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది.అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి.స్థానిక ఎన్నికల సమయం వచ్చే సరికి, చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలను మన పార్టీ గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం ద్వారా, ప్రతి ఇంటికీ ఈ బుక్లెట్ మెటీరియల్ ద్వారా ప్రజలను జాగృత పరచాలి. రెండేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశాం. కమిటీ సభ్యులు అందరికీ కూడా వెన్నుపోటు రెండేళ్లు కాపీలు అందేలా చూడండి. ఈ బుక్లెట్ ప్రతీ ఇంటికీ చేరేలా చూడాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలి. చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లపై ప్రజలు తిరగబడతారు’ అని తెలిపారు. -
సర్ ప్రక్రియ.. వైఎస్ జగన్ హాట్ కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం త్వరలో సర్ ప్రక్రియను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనం ఎస్ఐఆర్పై దేశ వ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలను అనేక రాజకీయ పార్టీలు వ్యక్తంచేయడం చూశాం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలనూ విన్నాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూసే ఉంటారు. బెంగాల్లో 91 లక్షలు, అంటే ఉన్న ఓట్లలో 11.9%. అలాగే తమిళనాడులో 74 లక్షలు, అంటే మొత్తం ఓట్లలో 11.6% తొలగించారు. మమతాబెనర్జీ పోటీచేసిన భవానీపూర్లో 44,990 ఓట్లను తొలగించారు. అక్కడ ఆమె 15,105 ఓట్లతో ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ పోటీచేసిన నియోజకవర్గంలో దాదాపుగా 71,133 ఓట్లను తొలగించారు. ఆయన ఓడింది 8వేల ఓట్లతేడాతోనే. అంతేకాకుండా బెంగాల్లో తీసేసిన ఓట్లు 91లక్షలు అయితే, ఆ రాష్ట్రంలో మమత పార్టీ ఓడింది 31లక్షల తేడాతో. అదే తమిళనాడులో తీసేసింది 74లక్షల అయితే, స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతోనే. అందుకే మనమంతా ఎస్ఐఆర్పై జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం. అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఈ రెండూ డేంజరే. ఊరికి యాభై మన ఓట్లను తీసేస్తే చాలు.. నియోజకవర్గానికి 5వేలు పోయినట్టే. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్లమీద కూడా మనం దృష్టిపెట్టాలి. కుప్పంలో అది మన కళ్లెదుటే కనిపించింది. కుప్పంలో ఓట్ల జాబితా ఒక్కసారి చూస్తే 22వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదుసార్లో, పది సార్లో కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా, లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఏపీలో ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి బోగస్ ఓట్లు, తప్పుడు ఓట్లు మీద దృష్టిపెట్టాలి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా అని వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
బాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ బుక్ విడుదల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ప్రజల నిరసన సెగలు తగలాలి అని అన్నారు.నిరసనలు ఇలా..జూన్ 4న మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు.జూన్ 8 లేదా 9న నియోజకవర్గ హెడ్క్వార్టర్స్లో టౌన్హాల్ సదస్సులు నిర్వహించాలి.జూన్ 12న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. మూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్-6, సూపర్-7 లేదు. ఆడబిడ్డ నిధికి నిధుల్లేవు.18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు. వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు. రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!. తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది. ఇప్పటికీ హామీల అమలు లేదు. మేనిఫెస్టో అడ్రస్ కనిపించదు. ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు. గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు. ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు. -
ముసలి పులి బంగారు కడియం కథ.. మళ్లీ చెప్పిన జగన్
-
ఓట్లు తొలగించే కుట్ర..! పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ
-
150 హత్యలు చేసినా.. పరిటాల రవిని వెనకేసుకొస్తారా ?
-
ఎమ్మెల్యే వెలగపూడికి బాబు షాక్..
-
బయటపడ్డ పచ్చ కుట్ర కుతకుతలాడుతున్న బాబు
-
సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది: టీడీపీ నేత
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో కాపులు ముఖ్యమంత్రి కావాలన్నది తమ చిరకాల ఆకాంక్ష అని.. కాపు యువత ఇదే కోరుకుంటోందని తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనుకుందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదన్నారు.సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి తమదని, ఎంతకాలం తాము బ్రోకర్లుగా, జోకర్లుగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. రానురాను కాపు జాతికి సిగ్గు, పౌరుషం తగ్గిపోతోందన్నారు. టీడీపీ అంటే కమ్మ, జనసేన అంటే కాపు పార్టీ అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనకు కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా పవన్కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు కులం లేకపోతే పవన్ కళ్యాణ్, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేవారా?. పవన్ ఈ రోజు మాత్రం రాణించగలిగే వాడా అంటూ ప్రశ్నించారు. కాపు కులం గురించి పవన్ తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని అన్నారు. పవన్కు ఆ ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యమన్నారు.కాపులను దూరం పెట్టే పనిలో పవన్..గత ఎన్నికల్లో కాపు జాతి పవన్ కళ్యాణ్ను సొంతం చేసుకుందని... కానీ పవన్ కళ్యాణ్ కాపులను దూరం పెట్టే పనిలో ఉన్నారని ఓవీ రమణ అన్నారు. కాపు కార్పొరేషన్కు రూ.100 కోట్లు కూడా కేటాయించని ప్రభుత్వంలో కాపు నేతగా ఉన్న పవన్ కళ్యాణ్కు ప్రశ్నించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులు, ఎస్సీ, ఎస్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారని, పవన్ ఇలాగే ఉంటే రాష్ట్రంలో కొత్త నాయకుడు పుట్టుకొస్తాడన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ వారికి గుర్తింపు లేదన్నారు. తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొని విజయ్ ఎదిగారని గుర్తు చేశారు. మరి పవన్ ఎందుకు ఎదగకూడదని, ఆ దిశగా పవన్ ఆలోచించాలని సూచించారు. -
నేటి నుంచి టీడీపీ మహానాడు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం నుంచి రెండురోజులపాటు వర్చువల్గా జరగనుంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఉన్న నేతలు మహానాడు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో అక్కడి నుంచే వారు ఆన్లైన్లో మాట్లాడుతారు. కాగా పొదుపు చేయడం కోసం వర్చువల్గా మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పిన నేతలు ఇంకా భారీగా ఖర్చు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. -
నా బిడ్డ పేరు చెప్పుకుని డిప్యూటీ సీఎం అయ్యావ్
సాక్షి, అమరావతి: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ.. తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్ఏ రిపోర్టులు మారిపోయాయని మాటమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి నిందితులు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. పచ్చి స్వార్థపరుడు పవన్ ‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నారని అర్థమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబును నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావును పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు.పవన్కళ్యాణ్ను కలిసినప్పుడూ ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని పేర్కొన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా? నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్కళ్యాణ్కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పచ్చి స్వార్థపరుడు.’’ అని పార్వతి వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసును వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి ‘‘మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి లైంగికదాడి జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు యత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసును వాడుకున్నట్టు బహిరంగంగా చెప్పాలి. నిందితులను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్తో 2025లో వీల్చైర్ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్చైర్ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్ని చంద్రబాబు ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న జగన్ చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.’’ అని సుగాలి పార్వతి వివరించారు. -
సుగాలీ ప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సుగాలిప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసును ఆటకెక్కించటంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, వారి ఆవేదనను వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే..ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు, CDFD ల్యాబ్ రిపోర్టులు, డీఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారు.మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం’అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన… pic.twitter.com/0RRSDHwQav— YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2026 -
‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్కేస్’
తాడేపల్లి: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. Mega Dsc లో ‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్కేస్’ అని విమర్శించారు. పేపర్ లీక్, డేటా డిలీట్, సూట్కేస్ రాజకీయాలతో పచ్చ నేతలు పండగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రం దోపిడీకి గురవుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారు. ‘‘సూట్కేస్ మంత్రి” ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్నారు. నారా లోకేష్ను “సకల శాఖ మంత్రి”గా మార్చారు. ఐటీ శాఖను “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ” నుంచి “ఇల్లీగల్ టెక్నాలజీ”గా మార్చారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా వచ్చాయి? , స్పోర్ట్స్ కోటా ఎంపికల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?, 1999, 2014లో నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు మోసం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదు. వారే పరీక్షలు నిర్వహిస్తారు.. వారే పేపర్ లీక్ చేస్తారు.. వారే డేటా డిలీట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి రహస్యంగా మెసేజ్లు పంపించారు. మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు?, డీఎస్సీని “పచ్చ తమ్ముళ్ల కలెక్షన్ కౌంటర్”గా మార్చారు. చంద్రబాబు, లోకేష్, అధికారులు ఎవ్వరూ నిజాలు చెప్పడం లేదు. మరోసారి నిరుద్యోగులను మోసం చేశారు.లోకేష్కు, వైఎస్ జగన్కు పోలికే లేదు. వైఎస్ జగన్ విద్యాశాఖను గొప్ప వ్యవస్థగా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాల్లా తీర్చిదిద్దిందీ జగనే. లోకేష్ వచ్చాక డిజిటల్ క్లాస్రూమ్స్, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లను తొలగించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాసిరకం భోజనం, మురుగునీరు, డ్యామేజ్ షూలు, నాసిరకం బ్యాగులు ఇస్తున్నారు. నెల వచ్చిందంటే పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే. డీఎస్సీ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును దిగజారుస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
జగన్ ప్రశ్నలకు తండ్రీకొడుకుల మైండ్ బ్లాక్
-
వైఎస్ జగన్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు
సాక్షి,తాడేపల్లి: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మీద ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్ఏ రిపోర్టులు మారిపోయాయని మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి ముద్దాయిలు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుగాలి పార్వతి ఆవేదన చెందారు.ప్రెస్మీట్లో సుగాలి పార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..:పవన్కళ్యాణ్ పచ్చి స్వార్థం:వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని అర్థమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబుని నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావుని పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు. పవన్కళ్యాణ్ను కలిసినప్పుడు కూడా ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని అన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా?.నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్కళ్యాణ్కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు.పవన్కళ్యాణ్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..:మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి అత్యాచారం జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు ప్రయత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్కళ్యాణ్ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసు వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి. ముద్దాయిలను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.వీల్ ఛైర్ యాత్రకు ఎందుకు అనుమతివ్వడం లేదు?:నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్తో 2025 లో వీల్ ఛైర్ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్ ఛైర్ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న వైఎస్ జగన్గారు చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే దాకా పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ఆయన ఎంత అడిగితే… అంత ఇచ్చేయండయ్యా!
సాక్షి, విజయవాడ: ప్రముఖ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు మరోసారి భారీ ఫీజులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం రూ.44 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.33 లక్షలు, రూ.11 లక్షలు చొప్పున విడతల వారీగా విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించినందుకుగానూ ఈ చెల్లింపులు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సిద్ధార్థ లూథ్రా గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరఫున కూడా వాదనలు వినిపించడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.అంతేకాదు… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తరఫున కూడా సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. దేశంలోనే టాప్ మోస్ట్ లాయర్గా ఉన్న లూథ్రా.. తనను తాను పేదవాడిగా చెప్పుకునే దస్తగిరికి ఎంత ఫీజు చెల్లిస్తున్నాడు? ఎలా చెల్లిస్తాడు? అనేది ఆశ్చర్యం కలిగించే అంశమే. “ఒకవైపు ప్రభుత్వ కేసులు… మరోవైపు చంద్రబాబు కేసులు… ఇంకోవైపు దస్తగిరి కేసు… మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పెద్ద కేసు ఉంటే అక్కడ లూథ్రా ఉంటారన్న మాట” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ లూథ్రాకు రూ.13 కోట్లకుపైగా ఫీజులు చెల్లించినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో నెట్టింట “రాష్ట్రానికి ఫుల్టైమ్ లాయరా? లేక ప్రతి హైప్రొఫైల్ కేసుకీ కామన్ అడ్రస్నా?” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిని సమర్థించుకుంటున్నాయి. దేశంలోని ప్రముఖ సీనియర్ అడ్వొకేట్లలో సిద్ధార్థ లూథ్రా ఒకరని, సుప్రీంకోర్టు స్థాయి కేసుల్లో అనుభవం ఉన్న న్యాయవాదులను నియమించడం సహజమేనని.. కాబట్టి ఆ మాత్రం ఖర్చులు తప్పవని అధికారులు వివరిస్తున్నారు.అయితే ప్రజలు మాత్రం మరో ప్రశ్న లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, సంక్షేమ పథకాల నిధుల కొరతపై చర్చ జరుగుతున్న సమయంలో… కోట్ల రూపాయలు న్యాయవాదుల ఫీజులకే వెళ్తుండటం సమంజసమేనా? అని ప్రశ్నిస్తున్నారు. -
SIRపై YS జగన్ కీలక సమావేశం
-
అవినీతి డీల్ గా మారిన AP మెగా DSC..!
-
కార్పొరేషన్ ఎన్నికలో ఓడిపోతామని చంద్రబాబుకు భయం
-
డీఎస్సీ పేపర్ లో బాబు స్కాం.
-
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్మీడియాలో హైలైట్గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేష్ కాదు లీకేష్.. మెగా DSCలో దగా
-
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
-
రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రోద్బలంతోనే విజయవాడలో వంగవీటి మోహనరంగా దారుణ హత్య జరిగింది. రంగా హత్యకు చంద్రబాబు సూత్రధారి అయితే, నాటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావు, ఎస్పీ వ్యాస్ పాత్రధారులు. రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని గట్టిగా విశ్వసించబట్టే మంత్రి పదవితోపాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నానని హరిరామ జోగయ్య అప్పుడే చెప్పారు. విజయవాడలో ఏ ఇంటి తలుపు కొట్టి అడిగినా వంగవీటి రంగాను చంద్రబాబే చంపించాడని చెబుతారు.’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టంచేశారు.ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రంగా హత్య జరిగింది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర బయటపడుతుందనే సీబీఐ విచారణకు నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ చేయాలని కోరింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దర్యాప్తును ప్రభావితం చేసి ఆయన పేరు లేకుండా చేసుకున్నారు. రంగా హత్య జరిగినప్పుడు, కేసును కొట్టేసినప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది.రంగా హత్య కేసు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు జైలులో ఉండేవారు. అప్పట్లో దర్యాప్తును ప్రభావితం చేయడానికే వర్గ విభేదాల పేరుతో కట్టుకథలు అల్లారు. చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగానే తనను ఈ కేసులో ఇరికించాడని దేవినేని నెహ్రూ పలు సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా కాపు కులానికి చెందిన జర్నలిస్టు పింగళి దశరథరామ్ దారుణ హత్య వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందని ప్రజలందరూ నమ్ముతున్నారు.’ అని వంగవీటి నరేంద్ర చెప్పారు. చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట‘రంగా హత్యకు కడప నుంచి బాంబులు తెచ్చారని చంద్రబాబు ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లూ పోలీసులకు ఎందుకు చెప్పలేదు. సీబీఐ విచారణను ఎందుకు కోరలేదు. కాంగ్రెస్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా మధ్య ఉన్న స్నేహాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వికృతంగా చూపించడం చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట. 1985లో రంగాకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చాలా మంది అడ్డుకున్నారు. అయినా వైఎస్సార్ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి సాధించారు.అలాంటి సన్నిహితుల మధ్య కూడా వివాదాలు ఉన్నట్లు వారు చనిపోయిన తర్వాత కట్టుకథలు సృష్టించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకుని దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చేరితే వైఎస్సార్పై బురదచల్లడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ అడిగి ప్రశ్నలకు చంద్రబాబు నేరుగా సమాధానం చెప్పలేక వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.’ అని వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వ బరితెగింపు
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ/కోరుకొండ : డీఎస్సీ నియామకాల్లోను స్కామ్లకు పాల్పడిన ప్రభుత్వ బరితెగింపు అత్యంత దుర్మార్గమని మాజీమంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజానికి భావిపౌరుల్ని అందించాల్సిన విద్యా వ్యవస్థలో సైతం స్కాంలు చేసే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. వీరు సోమవారం వేర్వేరు చోట్ల డీఎస్సీ అక్రమాలపై స్పందిస్తూ ఏమన్నారంటే.. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా?.. డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది? ఈ చోద్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. మెరిట్ లిస్ట్ ప్రకటించమని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదు. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా? కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే పైలా పచ్చిస్లా సాగింది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ వాళ్లది తడిగుడ్డల పార్టీ. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం గోడ కూల్చివేత సమయంలో స్పందించిన పవన్కళ్యాణ్ కార్ టాప్పై ఎక్కి మరీ వచ్చారు.. ఇప్పుడు బందరులో కార్యకర్త ఇంటి కూల్చివేత విషయంలో ఎందుకు స్పందించడం లేదు? – పేర్ని నాని, మాజీమంత్రిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. నిరుద్యోగులను చంద్రబాబు, లోకేశ్ దగా చేశారు. అది మెగా డీఎస్సీ కాదు. మెగా స్కామ్. డీఎస్సీ ప్రక్రియను ప్రభుత్వ పెద్దల గుప్పెట్లో ఎందుకు పెట్టుకున్నారు? జిల్లా సెలక్షన్ కమిటీలను ఎందుకు నిర్వీర్యం చేశారు? టెట్ నిబంధనలను ఎందుకు మార్చేశారు? ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. – మేరుగు నాగార్జున, మాజీమంత్రిలోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు.. చంద్రబాబు సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. అది మెగా డీఎస్సీ కాదు.. పూర్తిగా మాయా డీఎస్సీ. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు. విద్యాశాఖను ఆయన పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం చెప్పడంలేదు. లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. – ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలి.. సీఎం చంద్రబాబు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అవినీతి అడ్డూ, అదుపులేకుండా సాగుతోంది. డీఎస్సీ నిర్వహించిన వ్యక్తే టాపర్గా నిలవడం, ముందుగా పేపర్ లీక్ అవడం భారీస్కామ్ జరిగిందనడానికి బలం చేకూరింది. టాపర్గా నిలిచిన వ్యక్తికి పోస్టు ఇవ్వకపోవడం.. అక్రమాల ఆనవాళ్లు లేకుండా ఆన్లైన్ డేటాను డిలీట్ చేయడం, మెరిట్లిస్టును ప్రకటించకుండా, ఎంపికైన అభ్యర్థులకు మెస్సేజ్లివ్వడం సిగ్గుచేటు. ఈ స్కామ్పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు -
మెగా ‘డీల్’ఎస్సీ..!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీని చంద్రబాబు సర్కారు.. మెగా అవినీతి డీల్గా మార్చేసింది. అభ్యర్థుల బంగారు భవితతో దొంగాట ఆడింది. మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. టెట్ పరీక్షల నిర్వహణ నుంచి డీఎస్సీ నియామక పత్రాలు ఇచ్చే దాకా అడుగడుగునా జరిగిన లోపాలు బయటపడుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన తర్వాత కూడా మరికొందరికి శిక్షణ కేంద్రంలో ఆర్డర్లు ఇచ్చారు. మరోపక్క జిల్లాల్లో సర్టీఫికెట్ల పరిశీలన తర్వాత మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారని ప్రకటించిన అభ్యర్థులను సీఎం అధ్యక్షతన అమరావతిలో జరిగే వేడుకకు రావాలని అధికారులు ఫోన్ చేసి చెప్పి, తర్వాత మీరు ఎంపిక కాలేదని ప్రకటించారు.ఇలాంటి చిత్ర విచిత్రాలెన్నో మెగా డీఎస్సీలో చోటు చేసుకున్నాయి. అలాగే, టెట్ పూర్తయ్యాక పరీక్ష రాసిన అభ్యర్థుల అందరి మార్కుల డేటా విద్యాశాఖ వద్ద ఉండాలి. కానీ ఈ డేటాను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఏపీ టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కులు ఎన్నో కూడా ప్రభుత్వం వద్ద లేవు. దీంతో మార్కుల సవరణ చేసే అవకాశం కూడా అభ్యర్థులకే అప్పగించారు. మరోవైపు క్రీడా కోటా డీఎస్సీ పోస్టు భర్తీలో పక్కా ప్రణాళిక ప్రకారమే స్కామ్లకు పాల్పడ్డారు. తొలి దశలో స్క్రీనింగ్ కమిటీ, తుది దశలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అధికారుల కమిటీ పరిశీలించిన తర్వాత కూడా అనర్హులకు పోస్టులు దక్కడం విస్తుగొలుపుతోంది. టెట్ మార్కుల సవరణ అభ్యర్థులకే.. ప్రభుత్వం 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ కంటే ముందే 2024 అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఏపీ టెట్ నిర్వహించారు. అనంతరం సీపీటీ విధానంలో జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో అభ్యర్థులు టెట్ పరీక్షలు నిర్వహించినప్పుడల్లా అభ్యర్థులు మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాస్తారు. ఇందులో ఎక్కువగా వచ్చిన మార్కులనే డీఎస్సీలో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, విద్యాశాఖ వద్ద గతంలో నిర్వహించిన టెట్ స్కోరు వివరాలు లేకపోవడంతో అభ్యర్థులనే నేరుగా ఆన్లైన్లో టెట్ స్కోరు సవరించుకోవాలని కోరారు. నెలరోజుల్లో దాదాపు నాలుగు సార్లు ఈ అవకాశం ఇవ్వడంతో అభ్యర్థులు టెట్ స్కోరు నమోదు చేశారు. అయితే, ఎవరు ఎంత వేశారో లెక్కాపత్రం సర్కారు వద్ద లేకుండా పోయింది. దీంతో చేసేది లేక విద్యాశాఖ వద్ద ఉన్న స్కోరునే పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 13న సవరించిన టెట్ స్కోరుతో డీఎస్సీ స్కోరు కార్డులు విడుదల చేశారు. దీనిపై ఎన్నో అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా ఎంపిక లిస్టును ప్రకటించారు. ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు ఉత్తమ స్కోరు సాధించినా ఉద్యోగాలు కోల్పోయారు.ఎంపికైనవారికి కాదని.. కొత్తవారికి ఆర్డర్లు డీఎస్సీలో 16,347 పోస్టులకు 15,941 పోస్టుల భర్తీ చేశారు. సీఎం తొలి సంతకం చేసిన నోటిఫికేషన్ కావడంతో గతేడాది సెపె్టంబర్ 25న అమరావతిలో నియామకపత్రాల పంపిణీ వేడుక నిర్వహించారు. ఇందుకోసం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులతో భారీస్థాయిలో సభ నిర్వహించారు. తొలుత సెపె్టంబర్ 19న వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ఒకరోజు ముందే రావాలని అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, వాతావరణం బాగాలేదని చెప్పి వేడుకలను సెప్టెంబర్ 25కి వాయిదా వేశారు.అయితే, ఆరురోజుల వ్యవధిలో ఆహ్వానం అందుకున్న పలువురు అభ్యర్థులకు తిరిగి ఫోన్ చేసి మీరు పోస్టుకు ఎంపిక కాలేదని, వేడుకలకు రావొద్దని సమాచారం ఇచ్చారు. దీంతో పలవురు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికిపైగా ఉన్నట్టు అంచనా. ఇంకోవైపు కొత్త టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 10 రోజుల పాటు జిల్లాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఆగిరిపల్లిలో జరిగిన పీజీటీ, టీజీటీ శిక్షణ కేంద్రంలో నలుగురు అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు లేకుండా ప్రణాళిక ప్రకారం అధికారులు శిక్షణకు పంపించారు.అదే కేంద్రంలో శిక్షణ ప్రారంభమైన అనంతరం విడతల వారీగా వారికి నియామక పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలే పలు జిల్లాల్లో జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మెరిట్లో ఉండి సర్టీఫికెట్ల పరిశీలన అనంతరం పోస్టుకు ఎంపికైనట్టు ప్రకటించిన అభ్యర్థులను తర్వాత ఎంపిక కాలేదని ప్రకటించడం.. ఎలాంటి ఆర్డర్ లేకుండానే కొందరిని శిక్షణకు పంపడం.. కొన్నిరోజుల తర్వాత వారికి నియామక పత్రాలు అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కా ప్రణాళికతో ‘అవినీతి క్రీడ’ క్రీడా కోటాలో పోస్టులను భర్తీ చేయడంలో శాప్ కీలకంగా వ్యవహరించింది. శాప్ పాలక వర్గంలో సీఎం బంధువు, కీలక వ్యక్తి మాస్టర్మైండ్గా వ్యవహరించి కథ మొత్తం నడిపించారు. ఇక్కడ, శాప్లోని తనకు నచ్చిన అధికారులు, కోచ్లను స్క్రీనింగ్ కమిటీలో నియమించి తాను తలచిందే జరిపించారు. వాస్తవానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ శాప్ పరిపాలన అధికారిని పెట్టారు. సదరు అధికారిని డెప్యూటేషన్పై శాప్లోకి తీసుకొచ్చిందే మాస్టర్మైండ్. ఆరుగురితో స్క్రీనింగ్ కమిటీ వేయాలని ఉత్తర్వులు జారీ చేస్తే శాప్లో 8 ప్రత్యేక కమిటీలను పెట్టి ఇష్టారీతిన దరఖాస్తులను స్రూ్కటినీ చేయడం గమనార్హం. కమిటీలో స్రూ్కటినీ సమయంలో ఉన్న ఉద్యోగులను చివరి ఫైనల్ లిస్టు తయారు చేసే సమయంలో బయటకు పంపిణీ చేయడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సర్టీఫికెట్ల పరిశీలనలో కీలకంగా వ్యవహరించిన ఓ డీఎస్డీవో ఇప్పుడు శాప్ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. స్క్రూటినీలో సీనియర్ కోచ్గా వ్యవహరించిన వ్యక్తి ఓ జిల్లాకు డీఎస్డీవో అయ్యారు. పేరుకే అసిస్టెంట్ డైరెక్టర్(టెక్నికల్) స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా పెట్టి ఓ కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో వ్యవహారం జరిపించేశారు. విచిత్రం ఏమంటే! ఆడుదాం–ఆంధ్రాపై లేనిపోని ఆరోపణలు చేసి.. శాప్లో కీలకంగా వ్యవహరించారంటూ పేర్కొన్న సదరు కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగితోనే డీఎస్సీ డీల్స్ చేపట్టడం కొసమెరుపు. అసలు, స్క్రీనింగ్ కమిటీలో ఎవరు ఉన్నారు? ఎవరు ఏం చేశారో బయటకు పొక్కకుండా తంతు ముగించేశారు. ఫేక్ సర్టిఫికెట్లు.. ఫేక్ పుట్టిన తేదీలతో పోస్టులా?ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ప్రాథమికంగా మెరిట్ జాబితా సిద్ధం చేయాలి. అది ప్రచురించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరాలి. ఈ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. కేవలం తుది మెరిట్ జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపేశారు. రాష్ట్ర స్థాయిలో కమిటీలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి(సర్వీసెస్/మానవవనరులు), శాప్ ఎండీ ఉంటారు. సదరు రాష్ట్ర స్థాయి కమిటీ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను సంపూర్ణంగా సమీక్షించాలి. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిందే తుది జాబితా అవుతుంది. ఇందులో సమగ్ర సమీక్ష, పరిశీలనే చేయకపోవడంతోనే డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఘోరమైన తప్పి దాలు దొర్లాయి. పోస్టుల భర్తీ సమయంలో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులనూ కనీసం పరిగణనలోకి తీసుకోకుండా బుట్టదాఖలు చేయడం ఇందుకు నిదర్శనం. దీనికితోడు ఫేక్ సర్టీఫికెట్లు, దొంగ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలను అత్యంత హేయంగా అమ్మేసుకోవడం గమనార్హం.ఈ తప్పులకు ఎవరు బాధ్యులు..ఫేక్ సర్టీఫికెట్లతో క్రీడాకారులను ఆడిస్తున్న క్రీడా సంఘాలపై శాప్ ఇటీవల కొరడా ఝుళిపించింది. పోలీసు కేసులు పెట్టి జైలుకు పంపించింది. మరీ, స్పోర్ట్స్ కోటాలో తప్పుల తడకగా పోస్టింగులు ఇచ్చి లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం చేసినందుకు స్క్రీనింగ్ కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీలను బాధ్యులను చేస్తుందా? అంటూ క్రీడాలోకం ప్రశి్నస్తోంది. విజయనగరం జిల్లాలో దొంగ పుట్టిన తేదీతో క్రీడల్లో పాల్గొన్న వ్యక్తికి ఉద్యోగం కట్టబెట్టిన ఘనటలో క్షేత్రస్థాయిలో ఆధారాలన్నీ స్పష్టంగా ఉంటే శాప్ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.కనీసం, విచారణ ముగిసే వరకు కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యను కోరకపోవడం గమనార్హం. నకిలీ క్రీడా సర్టీఫికెట్లు మాత్రమే కాకుండా డిగ్రీ అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు అమ్మేశారు. ప్రతిభ గల క్రీడాకారుడికి డిగ్రీ ఉండి.. మెరిట్ స్పోర్ట్స్ సర్టీఫికెట్ ఉంటే వారికి ముందుగా పీఈటీ/పీడీ పోస్టు ఇచ్చి.. పొస్టు పొందిన ఐదేళ్లలోపు బీపీఈడీ కోర్సు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మాస్టర్మైండ్ డిగ్రీ లేనివ్యక్తులకు ఫేక్ సర్టీఫికెట్లు సృష్టింపజేసి ఉద్యోగాలు అమ్మేశారు.క్రీడల్లో జాతీయ స్థాయి పతకం సాధించిన ఓ వ్యక్తికి డిగ్రీ లేదు. దీంతో అతను వేరే రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్టు ఫొటోషాప్లో పట్టా క్రియేట్ చేసి తెచ్చుకుని పీఈటీ/పీడీ పోస్టు కొట్టేశారు. ఇప్పుడు ఆ ఉద్యోగి పశి్చమగోదావరి జిల్లాలో పీడీగా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్హులైన మహిళా అభ్యర్థులతోనూ అసభ్య చాటింగులు చేసి కోరికలు తీర్చాలని మాస్టర్మైండ్ వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన కోరిక తీర్చకుంటే పోస్టులు రావని బెదిరించినట్టు విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. -
మెగా కాదు దగా డీఎస్సీ.. బాబు,లోకేష్ పై జగన్ ఫైర్
-
వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు: పేర్ని నాని
విజయవాడ: చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విజయవాడలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైద్యం కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిర్వహించింది మెగా DSC కాదని, దగా DSC అని విమర్శించారు. రాజధాని పేరు చెప్పి రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతుల ఫ్లాట్స్ ఎక్కడో ఈ రోజుకీ తెలియదని అన్నారు. పరిశ్రమలకు భూముల పేరుతో దగా చేస్తున్నారని చెప్పారు. రూపాయికి ఎకరం భూమి ఇస్తా అని లోకేశ్ అంటున్నారని, కనీసం భయం, బాధ్యత లేదని విమర్శించారు.‘‘ఓటు వేసిన, ఓటు వేయించిన టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం వల్ల మోసపోయామని బాధ పడుతున్నారు. డబ్బులు ఇవ్వందే పని జరగడం లేదని టీడీపీకి మద్దతుగా నిలిచిన NRIలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు.. దర్బార్ అన్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు అర్జీలు తీసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు. రెండేళ్లు నిండింది ఇంతకన్నా దివాలా కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?సమాజానికి మంచి పౌరులను తయారు చేసే విద్యా వ్యవస్థలోనూ అవినీతి చేశారు. DSC కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాడికి 1ST ర్యాంక్ వస్తుంది. DSC మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మెరిట్ పరీక్షలు నిర్వహించడం ఏంటి? మెగా DSC కాదు మెగా స్కాం ఇది. సంపద సృష్టిస్తాం.. సంపద మొత్తాన్ని ప్రజలకు పంచుతాం అన్నారు. టీడీపీ మానిఫెస్టో ఎక్కడ? ఏమైంది? సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. ఏది సూపర్ హిట్ ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడూ PPP అనేవాడు ఇప్పుడేమో P4 అంటున్నాడు. PPP అయిపోయింది. ఇప్పుడు P4 కూడా అయిపోయింది అంటున్నాడు. బీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేశారని తెగ గోల చేశారు.. మరి అధికారంలోకి రాగానే ఇచ్చారా? గుది బండగా అమరావతిని తయారు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రం పెంచితే మాకు ఏ సంబంధమూ లేదని అంటున్నారు కింద, పైన ప్రభుత్వాలు ఎవరివి? జనాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు’’ అని తెలిపారు.ఎక్కువ మందిని కనాలా? పిల్లలను ఎక్కువ మందిని కనాలన్న అంశంపై ఎవరిది వాదన వాళ్లదని పేర్ని నాని అన్నారు. ‘‘విజన్ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు ఎక్కువ మందిని కనాలని చెప్తున్నారు. చంద్రబాబు ఏ రోజూ నిజాలు చెప్పలేదు.. నిజం చెప్పినా అది అమలు అవ్వదు. 1993లో రామారావును గద్దె దింపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని యూ టర్న్ లే. 2004లో మోదీ దుర్మార్గుడు అన్నారు. 2014లో మోదీ అచ్చాహై అన్నాడు. 2018లో మోదీకి భార్య లేదు కుటుంబం లేదు మోదీ టెర్రరిస్ట్ అన్నాడు. 2024 కు మోదీ ప్రపంచ నాయకుడు అంటూ చంద్రబాబు కీర్తిస్తున్నాడు. ఇప్పుడేమో నేను హిందూ, జగన్ నువ్వు క్రిస్టియన్ అంటాడు. చంద్రబాబు ఎన్నికల ముందు నేను మారాను అంటాడు, నమ్మండి అంటాడు. చంద్రబాబు ప్రకటనతో వాళ్ల అబ్బాయి, వాళ్ల కోడలే కన్విన్స్ అవ్వరు.. రాష్ట్ర ప్రజలు కన్విన్స్ అవుతారా? ఇరాన్, ఇజ్రాయిల్ వార్కు పిల్లలకు ఇచ్చే పాఠ్య పుస్తకాలకు ఏంటి సంబంధం? దివాలా కోరు దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. లక్షలాది మంది పిల్లలను కంటే చికిత్స అందించడానికి ఆసుపత్రులు ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి ముక్కులో కణితి వస్తే హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్న వారు ఒక్కరైనా ఉన్నారా?’’ అని నిలదీశారు. -
అబ్బబ్బబ్బా చంద్రబాబు వండిన చేపల పులుసు ఎంత రుచికరం..
-
ఇది రిక్రూట్మెంటా?.. లేక వేలం పాటా..?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ను పదవి నుండి తొలగించాలనీ.. లీకుల విషయమై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం (మే 25) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు.చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా?. లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?. పారదర్శకత ఎక్కడ ఉంది?.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?. మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?.మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు?.టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు?.కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా?.మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా?.ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి?.టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు?దీనివెనుక మతలబు ఏంటి?.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి’అని డిమాండ్ చేశారు. .@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 25, 2026 -
ఢిల్లీలో 102.. విజయవాడలో 118
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం ఇటు రాజకీయ యుద్ధంగా మారింది. ఎన్నికల ముందు ప్రజలపై భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ధరల తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “జగన్ హయాంలో పెట్రోల్ రేట్లు పెరిగాయంటూ ప్రచారం చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు?” అనే గొంతుక సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.తాజాగా పెంచిన ఇంధన ధరలతో.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102 వద్ద ఉండగా.. విజయవాడలో అది రూ.118కి చేరడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు హైదరాబాద్లో పెట్రోల్ రూ.115.69గా ఉంది. అంటే పొరుగు రాష్ట్రంతో పోల్చినా కూడా ఏపీలోనే ఇంధన భారం ఎక్కువగా పడుతోంది. కానీ, టీడీపీ అనుకూల మీడియా మాత్రం హైదరాబాద్ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ.. ఏపీలో రేట్లను ఏ మూలన ప్రస్తావించడం లేదు.అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయన్నది తెలిసిందే. సామాన్యుల జేబుకు చిల్లుపడే విషయంలో.. ఆయిల్ కంపెనీలు, కేంద్రం చేతులెత్తాశాయి. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు మరింత ఎక్కువగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక వ్యాట్, అదనపు సెస్సులేనని విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ఏపీలో పెట్రోల్పై 31 శాతం వ్యాట్తో పాటు లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్, మరో రూ.1 రోడ్ డెవలప్మెంట్ సెస్సు వసూలు చేస్తున్నారు. ఇందులో అదనపు వ్యాట్, ఇతర భారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమలులోకి వచ్చిందని మొన్నటి ప్రెస్మీట్లో వైఎస్ జగన్ గుర్తు చేశారు.( 2015లో అప్పటి బాబు సర్కార్ ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన జీవోలో.. పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డించారు). అయితే.. కరోనా వంటి కష్టకాలంలో కూడా తమ ప్రభుత్వం కేవలం రోడ్ సెస్సు కింద ఒక్క రూపాయి మాత్రమే పెంచిందని ఆయన వివరించారు. అదే సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెరిగాయని ప్రచారం చేశారని.. అధికారంలోకి వస్తే తగ్గిస్తామని మాటిచ్చారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మౌనం వహిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్ చెప్పిన లెక్క ప్రకారం.. దేశవ్యాప్తంగా.. గత 10 రోజుల్లో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మే 15 నుంచి ఇప్పటివరకు దేశ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.8 పెరిగింది. ఈ ప్రభావంతోనే విజయవాడలో ధరలు మరింత ఎగబాకాయి. దీంతో “ఏపీలో సామాన్యుడికి భారం” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే..జగన్ తాజా వ్యాఖ్యల్లో మరో కీలక ప్రశ్న కూడా లేవనెత్తారు. “ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఓట్లు అడిగారు. జగన్ హయాంలో పెరిగిందని విమర్శించారు. అప్పుడు అంత విమర్శించారు కాబట్టి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించాలి కదా? మరి ఎందుకు పెరుగుతున్నాయ్” అని చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ప్రెస్మీట్ నాటికి పెట్రో ధరలు రూ.4 పెరిగాయి. ఈ మధ్యలోనే మరో నాలుగు రూపాయలు పెరిగింది. ఈ లెక్కన జగన్ కోరినట్లు ఆ రూ. 8 చంద్రబాబు తగ్గింపు చేసి ఉంటే.. ఏపీలో వాహనదారులపై భారం చాలా వరకు తగ్గేదే అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక.. ఇంధన ధరల వ్యవహారంలో ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన విమర్శలు, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కనిపిస్తున్న వైఖరి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందనే అభిప్రాయం ఆరోపిస్తోంది. “జగన్ హయాంలో పెట్రోల్ భారం” అంటూ ప్రచారం చేసిన నేతలు.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలు ఏపీలో ఉన్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ అడిగిన దానికి సమాధానం ఏదని నిలదీస్తున్నారు. మరోవైపు హామీల్లో తగ్గింపు మాటలు చెప్పి.. చేతల్లో మాత్రం అదనపు భారం కొనసాగిస్తుండటంతో ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు “మాటల బాబు.. చేతల్లో ఎక్కడ?” అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. -
బీటెక్ రవి.. నువ్వెంత.. నీ బతుకెంత?: అవినాష్ రెడ్డి హెచ్చరిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు బుద్దుందా?.. ఎవరిది గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?. దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా?. బీటెక్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వెంత.. నీ బతుకెంత.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.పులివెందులలో వైఎస్సార్సీపీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఎదురుదాడికి దిగుతారు. గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయడం లేదు. వీటన్నిటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే జవాబు లేదు.మీరు చేస్తున్న తప్పులను సరిచేసుకోండి అంటే వాళ్లు.. స్వర్గీయ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వైఎస్సార్ గురించి మాట్లాడతారు. గొడ్డలి పార్టీ అంటారు. అసలు చంద్రబాబుకు బుద్ధుందా?. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మీ పార్టీ కాదా?. ఏరకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. గొడ్డలి పార్టీ మీది. గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరు. మా ప్రశ్నలకి సమాధానం లేక.. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పులివెందులలో ఉన్న టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పులివెందులకు కన్నం వేసి దోచేసుకుంటున్నారు.నోరు జాగ్రత్తగా పెట్టుకో..ఇక్కడి బైరెటిస్, ఇసుక మొత్తాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు. పులివెందులలో వీళ్లు ఏ ఒక్క సమస్యనైనా పట్టించుకుంటున్నారా?. పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం. నిన్న బీటెక్ రవి.. వాడు వీడు అనే లెవల్లో మాట్లాడాడు. నీ గురించి అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు?. నువ్వెంత.. నీ బతుకెంత? ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు. అలాంటి నువ్వు వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో.బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?మేం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చావ్.. ఎందుకొచ్చావో ప్రజలకు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్ముకోడానికి 12 కోట్లు ఇప్పించండని విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడు. ఆనాడు జగన్ అలాంటి పనులు చేయనని తిరస్కరించారు. తన ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా.. మీరు ఒప్పుకుంటే వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా?. మా పార్టీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?. ఇదీ బీటెక్ రవి బతుకు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు అతనిది. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారందరికీ మనం అధికారంలోకి రాగానే మంచి సమాధానం చెబుదాం. కక్షలు, కార్పణ్యాలు కాకుండా.. మనం ప్రజలకు మంచి చేసి ఇలాంటి వారికి బుద్ధి చెబుదాం. -
ఇది పులివెందుల.. చావును వెతుక్కుంటూ రావొద్దు! ? YSRCP మాస్ వార్నింగ్
-
జగన్ మాస్టర్ ప్లాన్.. బాబు, లోకేష్ వెన్నులో టెన్షన్ షురూ..
-
వేరు శనక్కాయల మూట నుంచి సీఎం కుర్చీ వరకూ..
సాక్షి, తిరుపతి: చంద్రబాబు గత చరిత్ర చాలా హీనాతిహీమని.. దానిని ప్రసారం చేసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి. చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్ కుటుంబంపై టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన సోమవారం తిరుపతిలో మాట్లాడుతూ మండిపడ్డారు. ‘‘వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక 670 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియలకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. వైఎస్సార్ అభిమానులు ఊరూరా విగ్రహాలు కూడా పెట్టుకున్నారు. అలాంటిది వైఎస్ఆర్ కుటుంబంపై ఎల్లో మీడియా ఇష్టమొచ్చినట్లు రాతలు రాస్తోంది. అదే పని చంద్రబాబు విషయంలో చేయగలదా? అని భూమన ప్రశ్నించారు. చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు కపట నైజంతో ఉండేవారు. నాటకంలో పాత్ర కోసం వేరు శనక్కాయల మూట దొంగలించిన ఘనుడు చంద్రబాబు. మరి ఎల్లో మీడియాకు ఆ వేరు శనక్కాయల మూట గురించి మొదలు.. సీఎంగా ఎదిగే క్రమంలో ఆయన చేసిన పనులన్నీ ప్రసారం చేసే దమ్ముందా?. వైఎస్ఆర్ భిక్షతోనే చంద్రబాబు మంత్రి అయ్యాడని గుర్తిస్తే మంచిది’’ అని భూమన అన్నారు. -
ఆశల పల్లకీలో రేవంత్...
తెలంగాణకు 2034 వరకూ తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఆయన ధీమాకు నిదర్శనం కావచ్చు కానీ... వాస్తవమవడం మాత్రం చాలా పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో. బలహీనంగా ఉన్న అధిష్టానం తన జోలికి రాదని రేవంత్ అనుకోవచ్చునేమో కానీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. రేవంత్ ప్రకటనలో ఇంకో విశేషం ఉంది. 2034 తరువాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, తన అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని కూడా చెప్పుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎంపీగా రేవంత్ తరచూ తాను ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పేవారు. అందరూ తేలికగా తీసుకున్నా ఏపీ విభజనతో ఆయన దశ తిరిగిందని అనుకోవాలి.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతినిపోవడం అధినేత చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్లో చేరడం ఆయనకు కలిసివచ్చింది. కాంగ్రెస్లో కీలకమైన పదవులు, పీసీసీ అధ్యక్ష స్థానం సులువుగానే దక్కాయి. ఇదంతా ఆయన తన సొంత స్టైల్లో సాధించారు. అంతవరకు వాస్తవమే. నిజానికి ఓటుకు నోటు కేసు వల్ల కొంత ఇబ్బంది పడినా తదుపరి పరిణామలు ఆయనకు అనుకూలంగా మారాయి. చంద్రబాబు హుటాహుటిన విజయవాడ వెళ్లిపోవడం, తెలంగాణలో టీడీపీని పూర్తిగా వదలివేయక తప్పని స్థితి ఏర్పడడం, రేవంత్ను జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉండటం వంటి కారణాలు కీలకంగా కనిపిస్తాయి. దానికి తోడు దూకుడుగా రాజకీయం చేయడం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఘాటు విమర్శలు, తీవ్రమైన పరుష భాషలో విమర్శలు చేయడం, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ప్రజలలోకి వెళ్లలేకపోవడం వంటి కారణాలు కలిసి వచ్చాయి. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు మంత్రులలుగా సర్దుకోక తప్పలేదు. ఎంపీగా ఉండగా రేవంత్ కాంగ్రెస్ హై కమాండ్తోదగ్గరి సంబంధాలు పెట్టుకగలిగారు. పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని ఇవ్వగలిగారు. ఇవన్నీ రేవంత్ సీఎం అయ్యేందుకు దోహదపడ్డాయి. అంతవరకు బాగానే ఉన్నా పదేళ్లపాటు తానే సీఎం అని చెప్పడమే కొంత ఆశ్చర్యం. ఇలా చెప్పడం.. కేవలం ప్రజలలో ఒక అభిప్రాయం కలిగించడానికా?లేక కాంగ్రెస్లో తనకు పోటీ లేదని చెప్పడానికా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?అంటే ఏమైనా కావచ్చు.రేవంత్ సర్కార్ నిజంగానే ప్రజలు ఆశించిన రీతిలో పనిచేసి మంచి పేరు తెచ్చుకోగలిగితే ఆయన భావించినట్లు పదేళ్లనే ఏముంది.అంతకుమించి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండవచ్చు.అలాగే ఆయనే సీఎంగా కొనసాగవచ్చు. అలాకాకుండా పదేళ్ల తర్వాత జాతీయ రాజకీయాలలోకి వెళ్లి ఏమి చేస్తారో అంటే అప్పుడే చెప్పలేం. అంతవరకు ఈయన కాంగ్రెస్లోనే ఉంటారా?అన్నది కొందరి అనుమానం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో రేవంత్ ను ఉద్దేశించి తనతో కలిసి రావాలని నర్మగర్భంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.అది అధికారికంగా సహకారం కోరడం తప్పమరొకటి కాదని రేవంత్ వివరణ ఇచ్చినా ఎవరికి ఉండే డౌట్లు వారికి ఉంటాయి కదా! గతంలో రేవంత్ తన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏబీవీపీ స్కూల్లో చేరి, తర్వాత టీడీపీ కాలేజీలో కొనసాగి ,ప్రస్తుతం రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. ఆయన ఆ మాట చమత్కారంగా చెప్పినా అది ఆలోచించదగిందే. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం టీఆర్ఎస్లో కూడా పనిచేశారు.ఆ తర్వాత స్వతంత్రంగా జెడ్పీటీసీ పోటీచేసి గెలిచారు.తదుపరి శాసనసమండలి ఎన్నికలలో పోటీచేసి అన్ని పార్టీలవారి సహకారం తీసుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి మద్దతు పొందడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. రేవంత్ తెలివితేటలను గమనించారో,మరేమో తెలియదు కాని, ఆ తర్వాత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దాంతో టీడీపీలో ఆయనకు సన్నిహితుడిగా మారారు. ఓటు కు నోటు కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు వెల్లడించకుండా ఆయన మనసు చూరగొన్నారు. ఎలాగైతేనేం రెండున్నరేళ్ల సీఎం పదవికాలం తర్వాత ఆయన జాతీయ స్థాయిలో కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్న మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణతోపాటు, కర్ణాటక, హిమచల్ ప్రదేశ్ లలోనే అధికారంలో ఉండడం, కేరళలో పార్టీకి అవసరమైన వనరులు అందించడానికి తన వంతు సాయం చేయడం వంటి కారణాలు కూడా ఉపయోగపడ్డాయని చెప్పాలి. పార్టీలో పట్టు పెంచుకున్నంత తేలికగా ప్రజలలో పట్టు నిలబెట్టుకోవడం అంత తేలికకాదు.స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనే ఇచ్చింది.ఆయా అంశాలలో రేవంత్ విధానాలపై ఆ పార్టీ గట్టి పోరాటమే చేస్తోంది.హైడ్రా వ్యవస్థ వల్ల కొంత మంచి పేరు వచ్చినా, నష్టం కూడా గణనీయంగానే కనిపిస్తుంది. అన్నిటికి మించి ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలను అమలు చేయడానికి సతమతమవుతున్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని,వృద్దాప్య పెన్షన్ నాలుగువేలు చేస్తామని, దళితులకు పది లక్షల ఆర్థిక సాయం తదితర అనేక వాగ్దానాలు ఆకాశమే హద్దుగా ఎన్నికల సమయంలో చేశారు.వాటిని అమలు చేయడం అంత తేలిక కాదని అనుభవం చెబుతోంది. పాలనాపరంగా రేవంత్ ఇంకా బలమైన ముద్ర వేసుకోలేకపోయారు. మరో రెండున్నర ఏళ్ల వ్యవధి ఉంది కనుక ఎంతవరకు ప్రజాదరణ పెంచుకుంటారన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే రేవంత్ ప్రభుత్వానికి ఆశించిన రీతిలో మార్కులు ఇచ్చే పరిస్థితి లేదు. పాస్ మార్క్ వస్తే అది పదివేలు అన్నట్లుగా ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరధ కేసులో కాని, టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సందర్భంలో కాని రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలి కొంత విమర్శలకు గురైందని చెప్పక తప్పదు. దీనివల్లే రేవంత్కు బీజేపీ, టీడీపీ వంటి పార్టీలతో అంతర్గత సంబంధాలు ఉన్నాయేమో అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. భగీరధ అరెస్టు అయినప్పటికీ, అది జరిగిన తీరుపై విమర్శలు ఉన్నాయి.సామాన్యుడికి ఒక న్యాయం, పలుకుబడి కలిగినవారికి మరో న్యాయమా అన్న చర్చ జరిగింది. 2028లో జరిగే ఎన్నికలలో విజయం సాధిస్తామని ఆయన చెబుతున్నప్పటికీ, ప్రస్తుత వాతావరణం అంత తేలికగా లేదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేం.అంతేకాక ప్రధాని మోడీ,హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు అర్థంఅవుతుంది.బెంగాల్ వంటి రాష్ట్రంలో వారు అనుసరించిన పద్దతులు గమనించిన తర్వాత తెలంగాణలో ఏ పరిణామమైనా జరగవచ్చన్న భావన కలుగుతుంది. ఇక జాతీయ రాజకీయాలలోకి వెళ్లడం అన్న అంశం ఇప్పటికిప్పుడు పెద్ద చర్చీనీయాంశం కాదు.ఆయనకు ఏదో పెద్ద ఊహే ఉండవచ్చు.అది తప్పు కాదు.గతంలో ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో పనిచేశారు.వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ సారధిగా ఉన్న టైమ్ లో ఏపీలో అత్యధిక కాంగ్రెస్కు ఎంపీ సీట్లు వచ్చాయి. అయినా ఆయనను అధిష్టానం కొంత ఇబ్బంది పెట్టింది. ఈ సందర్భంగా ఒక అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండేవారు.ఆయన ఇంకా పూర్తిగా బలపడలేదు.ఆ టైమ్ లో నేదురుమల్లి తాను చక్రం తిప్పగలనని అనుకునేవారు. ఏఐసీసీ సదస్సు కూడా తిరుపతిలో నిర్వహించారు. అప్పట్లో తనకు ఉన్న చొరవతో పీవీని ఉద్దేశించి పంతులుకు తాను ఎంతగా సహకరిస్తున్నది అన్న అంశంపై పార్టీ వారి వద్ద వ్యాఖ్యలు చేశారు.ఆ విషయం పీవీకి తెలియడంతో, తనకు సన్నిహితమైన వ్యక్తి అయినా, అవకాశం రాగానే నేదురుమల్లిని సీఎం పదవి నుంచి దించేశారు.మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో అత్యంత కీలక భూమిక పోషించారు. సీఎంగా రెండుసార్లు ఎంపికయ్యారు.అప్పట్లో ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీలకు అత్యంత సన్నిహితుడు అన్న భావన ఉండేది.కాని ఆ రెండుసార్లు పూర్తికాలం సీఎం పదవిలో ఉండలేకపోయారు.అప్పటి రాజకీయాలకు ప్రస్తుత ఉన్న రాజకీయాలకు తేడా ఉన్నప్పటికీ జాతీయ పార్టీలలో ఏమైనా జరగవచ్చని చెప్పడానికి ఇవి ఉదాహరణలు అవుతాయి.ఏది ఏమైనా ముందుగా ప్రజాభిమానం చూరగొనే విధంగా పనిచేసి ఆ తర్వాత ఎంతకాలం ఏ పదవిలో ఉన్నా ఎవరికి అభ్యంతరం ఉండదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇద్దరి మధ్య గ్యాప్.. అందుకేనా విభేదాలు
-
వెంకీ పెళ్లి సుబ్బి చావుకు...! పిల్లలకు బూట్లు సాక్సులు ఇవ్వండరా అంటే..
-
ప్రశ్నిస్తే కేసులా..? ప్రొ. నాగేశ్వర్ కేసుపై జగన్ సీరియస్
-
ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
రైతులకు సంఘీభావంగా వెళ్తే అరెస్టులు చేయిస్తారా?
సాక్షి, అమరావతి: మొక్కజొన్న రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లెకు ఎవరు వెళ్తున్నా పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా? అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వర్పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? అని నిలదీశారు. మీరే దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరని అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలంటూ హెచ్చరించారు. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై మా పోరాటం ఆగదు చంద్రబాబూ..! ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పటికీ గళం విప్పుతూనే ఉంటుంది.. నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..⇒ చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగమోహన్కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. ⇒ జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు? ⇒ మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400– రూ.1,600 కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా దీన్ని ఎవరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా? ⇒ మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ.నాగేశ్వర్పై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పారీ్టల మీదా విమర్శలు, అన్ని వార్తాంశాల మీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్రాజ్ చేశారు చంద్రబాబూ! ⇒ చంద్రబాబు గారూ.. మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలిం.. ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది -
చంద్రబాబుకు వైఎస్ జగన్ భయం పట్టుకుంది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. వైఎస్ ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎన్నడూ పులివెందులలో ఓడిపోలేదన్నారు. గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఇప్పటివరకూ మూడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీని తిట్టడం తప్ప ఏమైనా పాలన చేస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలకు కనీసం గిట్టుబాటు ధర అందించడం లేదు. మెుక్కజొన్నకు ధరలు లేవని ప్రశ్నిస్తే గోడౌన్పై దాడులు జరుపుతున్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసర ధరలు పెంచితే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిత్యావసరాల ధరలను తగ్గించే యత్నం చేసిందా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారన్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. -
నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
-
అప్పుడో న్యాయం.. ఇప్పుడో న్యాయమా..? అరవ శ్రీధర్ పై బాబు యాక్షన్
-
ఈ 8 ఫోటోలు చూస్తే.. సినిమా అర్థమవుతుంది
-
చంద్రబాబు గుట్టు రట్టు.. తల్లి, చెల్లి, బాబాయ్ ఇదే ఆయుధం.. జగన్ క్యారెక్టర్ అసాసినేషన్
-
‘చంద్రబాబు మోసాలపై పుస్తకాలు రాయొచ్చు’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని, ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. ఆయన ఇంకేమన్నారంటే..:ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు.. తాము ప్రజలకు చేస్తున్న మంచి ఏంటో చెప్పుకోవాలి కానీ విపక్ష నేతలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వ్యవస్థల మేనేజ్మెంట్, మ్యానిపులేషన్ అన్నీ తెలుసు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి , అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోకుండా మోసం చేయడం అందరూ చూశారు.వ్యవసాయం శుద్ధ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని మహిళల్ని ఎలా మోసం చేసి మాయ చేశాడో కూడా అందరికీ తెలుసు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని ఇప్పుడు మరో మోసం చేస్తున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసే ప్రయత్నం చేస్తాననడం వేరు సూపర్ హిట్ అయిందనడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఇచ్చారా, మూడు గ్యాస్ సిలెండర్లు ఇచ్చారా చెప్పాలి. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా?కోవిడ్ సంక్షోభంలోనూ ప్రజల్ని ఆదుకున్న జగన్:కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది. ఏమైనా అంటే తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ, ప్రయాణాలకూ ఎక్కడైనా ఆటంకం ఉందా ? పేదల మనుగడకు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్కు, పేదల వైద్యానికీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకే ఆటంకాలన్నీ. కానీ చంద్రబాబు మాటలు చూస్తే కోటలు దాటి పోతున్నాయి.ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వాటిని ఎంత వరకూ నిలబెట్టుకున్నారో ఆలోచించాలి. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించారా చెప్పాలి. ఇరాన్ యుద్దం వల్ల దేశమంతా రేట్లు పెరిగాయి. కానీ రాష్ట్రంలో పెంచిన ధరల్ని మాత్రం తగ్గించలేరా? రైటు పండించిన పంటకు మాత్రం ధర లేదు. రైతు పరిస్ధితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏం చేస్తున్నాయో అర్ధం కావట్లేదు. మా ప్రాంతంలో జొన్నల గురించి రెండేళ్లుగా నేను అడుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలా మార్కెట్ అస్దితరపై ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు?పుస్తకాలు అంటూ రాస్తే చంద్రబాబు గురించి రాయాలి. ఏ రకంగా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వినియోగించుకుని, మాయ మాటలు చెప్పి, సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందులో రాయాలి. ప్రజల కష్టాల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎంతసేపూ చట్టాలు చేతుల్లో తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మెగా డీఎస్సీ అన్నారు. ఓ ఉద్యోగి ఐఏఎస్ టాపర్ వచ్చాడని తెలిసి ఆన్ లైన్ లో పెట్టిన మెరిట్ లిస్ట్ తీసేశారు. ఇదేనా మీ పాలన? విద్యాశాఖ మంత్రి తన శాఖ వదిలి మిగతా శాఖల గురించి మాట్లాడతారు. విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు ఇస్తామంటున్నారు. కానీ ఆ పీటీఎం ఎప్పుడో మాత్రం చెప్పరు. ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటూ చెప్పుకుంటూ ప్రతీదీ దాపరికమే. నీతిగా పాలన అయినా చేస్తున్నారా అంటే వైజాగ్ గీతం భూముల్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజలు చూశారు. ఆంధ్రా యూనివర్శిటీని తాకట్టు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వ పెద్దలకు కానీ, వాళ్ల తాబేదార్లకు సంబంధం ఉంటే మాత్రం ఆ అంశాన్ని ఎలా నీరుగార్చాలా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.రెండేళ్లలో పేదలకు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?:టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. పేదలు, మధ్య తరగతికి ఇది చేశాం అని పేటెంట్ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటైనా ఉందా? రైతులకు కానీ, సామాన్యులకు కానీ, విద్యార్ధులకు కానీ ఏమైనా చేస్తే చెప్పండి. లేదా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్ధితి ఉందా చెప్పాలి. మండల స్దాయి కార్యాలయాలకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు కలిసి కింది స్దాయిలో దోచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చి.రాష్ట్రంలో ధరలు కనీసం 15–20 శాతం పెరిగాయి. దానికి తగినట్లుగా రాబడి పెరిగిందా అంటే శూన్యం. ఇంకా ముగ్గుర్ని కంటే 30 వేలు, నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటూ పిచ్చిమాటలు చెప్తున్నారు. ఉన్న వాళ్లకు ఉద్యోగానికి దిక్కులేదు కానీ ముగ్గుర్ని, నలుగురిని కనాలట. అందరూ మీలా ధనవంతుల్లా ఉంటారా, లేక రెండెకరాలు నుంచి ఆస్తులు పెంచుకునే మంత్రాలు మీలా అందరి దగ్గర ఉంటాయా చంద్రబాబు చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతమందికి పీ–4 ఇచ్చారో చంద్రబాబు బయటపెట్టాలి.ఈ మాటలతో ఎంత కాలం జనాన్ని మభ్య పెడతారని అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ప్రసార మాధ్యమాలతో బుల్ డోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల ఆకలిని ఎంతకాలం ఇలా దాచిపెట్టగలరో చూద్దాం. రెండేళ్లయినా ఉద్యోగులకు పీఆర్సీ వేసే దిక్కులేదు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలో ఉండాలంటే కడుపు తరుక్కుపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేస్తోంది.ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం..:ప్రతీవారం అప్పు తీసుకుంటున్న డబ్బుల్ని అవినీతికి ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతి చూడలేక జగన్ మావిగన్ ప్రతిపాదించారు. దానికి మీకెందుకు బాధ ? ఈ అవినీతి, దోపిడీ చూసి రేపు ఆ ప్రాంతంలోని మచిలీపట్నం, గన్నవరం ప్రజలే మిమ్మల్ని అడుగుతారు.ఏ అంశం చూసినా కుంభకోణం, పక్షపాతమే. ఎక్కడా పారదర్శకత లేదు. విద్యార్ధుల కోసం డీఎస్సీ పెడితే లీకేజ్ జరిగి మెరిట్ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపూ ఏ రాజకీయ పార్టీ చూసుకుని ప్రయోజనాలు కల్పించడమేనా వీటి పని? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఎక్కడా లీకేజిలు లేకుండా పాలన జరగాలనేది మా ఉద్దేశం. ఆ దిశలో నిరంతరం ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తూనే ఉంటామని, అవసరమైతే చొక్కా విప్పి వీధుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. -
విజయ్ ను చూసి నేర్చుకో... ఇంకెంతకాలం డబ్బా మాటలు చెప్తావ్?
-
ఎవడబ్బ సొమ్మని ఇల్లు కట్టుకున్నావ్..? అది రైతుల భూమి!
-
చేతికి మట్టి అంటకుండా.. నరికి నరికి.. నారా వారి అసలు రంగు!
-
పేరుకే నో వెహికల్ డే.. భారీ కాన్వాయ్ తో మంత్రుల చక్కర్లు
-
‘వెన్నుపోటు పార్టీ.. ప్రజలపై పన్నుపోటు’
సాక్షి, తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ ప్రజలపై పన్నుపోటు వేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంధన ధరలను భారీగా పెంచి చంద్రబాబు జనం నడ్డి విరిచారని.. ప్రజాపాలనలో ఘోర వైఫల్యం చెందారంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ చేపట్టిన నిరసనలకు పెద్ద ఎత్తున స్పందన లభించిందన్న అప్పిరెడ్డి.. ఇంధన ధరల పెంపుపై తమ నాయకులు అడిగిన ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పలేక పోయారన్నారు.‘‘ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రులు దూషణలకు దిగుతున్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించటం కూడా చేతగాని వారు కూటమి నేతలు. పెట్రోలుపై రూ.31లు ట్యాక్స్ వేసింది చంద్రబాబు కాదా?. డీజిల్ మీద 22 రూపాయలు ట్యాక్స్ వేసిందీ చంద్రబాబే. చివరికి అమరావతి పేరుతో మరో రూ.4 ట్యాక్స్ వేయలేదా?. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తే జగన్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచారు. కేంద్రం గ్యాస్ మీద రూ.50 పెంచితే జగన్ ప్రభుత్వం ప్రజల మీద వేయకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేశారు..మరి చంద్రబాబు ఇప్పుడు ఆ పనులు ఎందుకు చేయటం లేదు?. అమరావతి కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఉండదా?. రూ.3,400 కోట్ల భారం ప్రజల మీద వేయటం సిగ్గుచేటు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి. ఇదేనా అనుభవజ్ఞుడి పాలన చంద్రబాబూ?. అమరావతి అద్దాలకు పెట్టే ఖర్చు ప్రజల బాగు కోసం పెట్టలేరా?. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంధన ధరలను తగ్గించాలి...టీడీపీ డీఎన్ఏనే వెన్నుపోటు. రైతుల నుండి అన్ని వర్గాలనూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వైఎస్సార్సీపీ ప్రజల పార్టీ. వివేకా హత్య జరిగింది చంద్రబాబు పాలనలోనే. చంద్రబాబుదే గొడ్డలి పార్టీ. పొరుగు రాష్ట్రాలను చూసైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
ఉన్న పిల్లలకే రక్షణ లేదు.. మళ్ళీ నలుగురు పిల్లలు కనాలని చెప్తున్నారు
-
అన్నామలైకు నో.. వాళ్లకూ హ్యాండే!
రాజ్యసభ ఎన్నికల వేడి ఇంకా అధికారికంగా మొదలుకాకముందే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. వచ్చే నెల 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 26 రాజ్యసభ(24+2) స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఏపీ నుంచి ఖాళీ కాబోతున్న నాలుగు సీట్లు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.ముఖ్యంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలైకి ఏపీ కోటాలో అవకాశం కల్పించే అంశంపై జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆసక్తితో లేరని.. పైగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ ఇప్పుడు కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.వచ్చే నెల 18న ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. మరో స్థానాలకు ఉప ఎన్నికలు( మహారాష్ట్రలో సునేత్ర పవార్, తమిళనాడులో సీవే షణ్ముగం అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో) జరగనున్నాయి. ఇందులో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఉన్నాయి.అయితే అసలు చర్చ మాత్రం అభ్యర్థుల ఎంపిక చుట్టూనే తిరుగుతోంది. తమిళనాడులో బీజేపీకి ముఖచిత్రంగా మారిన అన్నామలైకి.. అక్కడ గెలిచే పరిస్థితి లేకపోవడంతో మిత్రపక్షాల సహాయంతో రాజ్యసభకు పంపాలని ఆలోచన కమలనాథుల్లో ఉందన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అందులో భాగంగానే ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ సీటును బయటివారికి ఇవ్వడంపై సానుకూలంగా లేరని సమాచారం.అసెంబ్లీలో మెజారిటీ ఉన్నందున.. టీడీపీ, జనసేన, బీజేపీ (2+2+1) పద్ధతిలో ఆ పంపకం జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ వర్గాలు మాత్రం మరోలా చర్చించుకుంటున్నాయి. ఈసారి రాజ్యసభ సీట్ల విషయంలో చంద్రబాబు పూర్తిగా తన రాజకీయ, సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు లేదంటే ఆర్థికంగా పార్టీకి అండగా నిలిచిన కీలక వ్యక్తికి అవకాశం కల్పించే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా కాలంగా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు ఈసారి కూడా నిరాశ తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది.ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవుల కోసం ఎదురుచూస్తున్న మిత్రపక్షాల నేతలు.. కనీసం రాజ్యసభలోనైనా అవకాశం వస్తుందని భావించారట. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. బాబు మార్క్ అనే ఫార్ములా తప్పదనే చర్చ సాగుతోంది. మరోవైపు అన్నామలై విషయంలో టీడీపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీకి దూకుడు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఏపీ నుంచి రాజ్యసభ అవకాశం ఇస్తే.. భవిష్యత్తులో దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే బీజేపీ నుంచి ఒత్తిళ్ల ప్రస్తావన లేకుండా ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న తన మనుషులతో రాజకీయం నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ ఎంపీకి మళ్లీ చాన్స్ దక్కేనా?ఏపీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానీ టర్మ్ కూడా ఈ జూన్ 21తో ముగియనుంది. 2020లో వైఎస్సార్సీపీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లారు. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో నత్వానీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆయనకు మళ్లీ అవకాశం రావడం ఫిఫ్టీ-ఫిఫ్టీ చాన్స్గా కనిపిస్తోంది. కూటమి మధ్య సీట్ల పంపకం చాలా కీలకంగా మారడం ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ, చంద్రబాబు అది జరగనివ్వడం డౌటే. అయితే.. ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న పరిచయాలు, రిలయన్స్ వర్గాలతో ఉన్న అనుబంధం, వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను మేనేజ్ చేయగల సామర్థ్యం వంటి అంశాలు ఆయనకు ప్లస్గా మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం వల్ల చివరి నిమిషంలో సమీకరణాలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. నత్వానీ పేరు బీజేపీ కోటాలో పరిశీలనలో ఉందన్న టాక్ ఉన్నప్పటికీ.. కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కమలనాథుల్లో కూడా ఉందని చెబుతున్నారు. దీంతో నత్వానీకి ఎక్స్టెన్షన్ ఉంటుందా? ఉండదా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. -
నా ప్రశ్నలకు బదులేది ? చంద్రబాబుకు YS జగన్ సూటి ప్రశ్నలు
-
షాట్ ఓకేనా బాబు.. చంద్రబాబు చేపలపులుసు కథా చిత్రం
-
మాధవ్ రెడ్డి గుర్తున్నాడా? బాబు హత్య రాజకీయాల చిట్టా బయటపెట్టిన లక్ష్మీ పార్వతి
-
చంద్రబాబు వేస్ట్.. అరవ శ్రీధర్ మాట్లాడిన సంచలన వీడియో విడుదల చేసిన హర్షవీణ
-
NTR చనిపోయే ఒక్క రోజు ముందు.. చెప్పేవి పసుపు ప్రవచనాలు.. చేసేవి నీచ రాజకీయాలు
-
చెబుతాం... ఆచరించం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ నేతల మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. పబ్లిసిటీ పీక్.. ఇంప్లిమెంటేషన్ వీక్ అన్నట్టుగా ఉంటుంది. సాక్షాత్తూ ప్రకటన చేసే చంద్రబాబు, ఆయన కుమారుడే దానిని పాటించరు. వారి బాటలోనే మిగతా నాయకులు వెళ్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇంధనం పొదుపు ప్రకటన మేరకు చంద్రబాబు కూడా ఇంధనం పొదుపునకు పిలుపునిచ్చారు. శుక్రవారమైతే నో వెహికల్ డేగా ప్రకటించారు. ఆ పిలుపు, ప్రకటన గొప్పగా చెప్పుకున్నారు. సరిగ్గా ఇదే రోజున (శుక్రవారం) ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో జరిగిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతో పాటు ఎమ్మెల్యే కూన రవికుమార్ భారీ కాన్వాయ్తో ర్యాలీ నిర్వహించా రు. మదనాపురం కూడలి నుంచి అల్లెన వరకు రోడ్ షో చేశారు. అంతకుముందు జరిగిన పలు కార్యక్రమాలకు కూడా భారీగా వాహనాలతో వెళ్లి పాల్గొన్నారు. చంద్ర బాబు, లోకేష్ ఎలాగైతే హెలికాప్టర్లు, భారీ కాన్వాయ్ లతో పర్యటనలు చేసి వారి మాటను వారే తప్పుతున్నారో కేంద్రమంత్రి, ఎమ్మెల్యే తదితరులు అదే బాటలో పయనిస్తున్నారు. తాము చెబుతాం తప్ప ఆచరించం అనే ధోరణిలో వెళ్తున్నారు. టీడీపీ నాయకులు తీరు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ఒకరు ఏమో రాష్ట్ర మంత్రి ఒకరు ఏమో కేంద్ర మంత్రి ఇంధన పొదుపు అని సైకిల్ మీద షో ఒకరు ఇంధన పొదుపు లేదు బొక్క లేదు అని ర్యాలీ చేస్తూ షో మరొకరు అదిరిందయ్యా చంద్రం! pic.twitter.com/I5u4ThdIE0— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) May 22, 2026 -
అక్రమాలు దిట్ట.. పగిలిన పుట్ట
డీఎస్సీలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ ప్రక్రియ చూసిన ఎస్సీఈఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని అభ్యర్థుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజిటల్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డీఎస్సీ ప్రశ్నలు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, వీరిలో ఒకరికి డీఎస్సీలో టాప్ మార్కులు రావడంతో పాటు సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్–2 టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే నిదర్శనమని అభ్యర్థులు వాపోతున్నారు. స్కామ్ వెలుగు చూశాక వీరిద్దరినీ విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అవకతవకలు బయట పడటంతో వారి మార్కులు, ఇతర వివరాలను సైతం డేటా బేస్ నుంచి తొలగించారు.⇒ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన పి.నవీన్ మెగా డీఎస్సీృ2025లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో 89.7465 స్కోరుతో జిల్లా టాపర్గా మొదటి ర్యాంకు సాధించాడు. అలాగే, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగులో 78.73 స్కోరుతో జోన్ృ2లో ఆరో ర్యాంకు సాధించాడు. రెండు ఉద్యోగాల్లోనూ టాప్ స్కోరు సాధించిన నవీన్కు తప్పనిసరిగా ఉద్యోగం రావాలి. కానీ ప్రభుత్వం అతడికి టీచర్ పోస్టు ఇవ్వలేదు. ప్రభుత్వం మొదట విడుదల చేసిన కృష్టా జిల్లా సోషల్ స్టడీస్ మెరిట్ లిస్టులో సైతం మొదటి ర్యాంక్ వివరాలు తొలగించారు. అలాగే, టీజీటీ మెరిట్ లిస్టులో సైతం ఈ అభ్యర్థి వివరాలు లేకుండా చేశారు.⇒ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించాడు. మెరిట్ లిస్టులో 7వ ర్యాంకు సాధించాడు. ఒక పోస్టు జనరల్, మరో పోస్టు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించారు. ఈ క్రమంలో ఓపెన్ కేటగిరీలో ఇతనికి పోస్టు రావాలి. కానీ, ముస్లిం బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. జరిగిన తప్పును ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.సాక్షి, అమరావతి: సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ–2025లో కుంభకోణం చోటుచేసుకుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. సాక్షాత్తు సీఎం తనయుడు లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటమే ఇందుకు నిదర్శనమని నొక్కి వక్కాణిస్తున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులను అమ్ముకున్న వైనం ఇప్పటికే బయటపడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జనరల్ డీఎస్సీలోనూ భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ ప్రక్రియ చూసిన ఎస్సీఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.డిజిటల్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డీఎస్సీ ప్రశ్నలు బయటకు లీకైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, వీరిలో ఒకరికి డీఎస్సీలో టాప్ మార్కులు రావడంతో పాటు, సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్–2లో టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఫలితాలు వచ్చాక ఈ విషయం గుర్తించిన అధికారులు.. వీరిద్దరినీ విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుతోంది. అంతేగాక టాప్ మార్కులు సాధించిన సదరు కాంట్రాక్టు ఉద్యోగికి టీచర్ పోస్టును రద్దు చేయడంతో పాటు అతను సాధించిన మార్కులు, ఇతర వివరాలను డేటా బేస్ నుంచి తొలగించినట్టు సమాచారం. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను చంద్రబాబు సర్కార్ సంతలో సరుకు మాదిరిగా అమ్మేసింది. అభ్యర్థులను ఇళ్లకు పిలిపించుకుని మరీ బేరసారాలు సాగించింది. క్రీడా శాఖలో నామినేటెడ్ పోస్టును అడ్డం పెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న ‘మాస్టర్ మైండ్’ డైరెక్షన్లో ఈ కుంభకోణం దిగి్వజయంగా సాగింది. ర్యాంకర్ వివరాలు ఎందుకు తొలగించారు? డీఎస్సీ ఫలితాల విడుదలలో తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా డీఎస్సీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్సీఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నిలిచాడు. అయితే, తొలుత అతడి వివరాలు లేకుండా రెండో ర్యాంకు నుంచి మెరిట్ లిస్టు విడుదల చేశారు. అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని మెరిట్ లిస్టులను రద్దు చేసి, ఏకంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్లు పంపారు.కానీ, అప్పటికే జిల్లాల్లో కొందరు మెరిట్ లిస్టులను డౌన్లోడ్ చేసుకున్నారు. మరోపక్క కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో టాపర్గా వచ్చిన ఎస్సీఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి పి.నవీన్కు మాత్రం ఎంపిక జాబితాలో పోస్టు లేకపోవడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. కానీ ఇక్కడ మాత్రం ఆన్లైన్ ప్రశ్నలు అప్లోడ్ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించారు. ఫలితాల్లో అతడు టాపర్గా నిలిచినా పోస్టు ఇవ్వలేదు. స్పోర్ట్స్ పోస్టులను అమ్మేసిన మాస్టర్మైండ్ క్రీడా శాఖలో రాజకీయ నామినేటెడ్ పోస్టును అడ్డుపెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న ‘మాస్టర్ మైండ్’ డైరెక్షన్లో స్పోర్ట్స్ డీఎస్సీ పోస్టులను భారీగా అమ్మేశారు. ఒక్కో పోస్టుకు డిమాండ్ను బట్టి రూ.15 లక్షలు రేటు ఫిక్స్ చేసి అమ్మకానికి పెట్టారు. ఇక్కడ పొరుగు శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులను క్రీడా శాఖలోకి డెప్యూటేషన్పై తీసుకొచ్చి వారి ద్వారా తన దోపిడీ దందాను నడిపించడం విస్తుగొలుపుతోంది. సదరు వ్యక్తులు అభ్యర్థులకు ఫోన్లు చేసి డీఎస్సీ పోస్టుల కేటాయింపులపై బేరసారాలు సాగించిన ‘వాయిస్ రికార్డులు’ కలకలం రేపుతున్నాయి. ఇలా మొత్తం స్పోర్ట్స్ డీఎస్సీలో నాలుగింట మూడొంతులు పోస్టులు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇలా రూ.40–50 కోట్లు దండుకున్నట్టు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బేరసారాలు ఇలా...మాస్టర్ మైండ్ ఏజెంట్ : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో మేము చెప్పినట్టు పోస్టింగ్ చేయిస్తాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: అలా కాదు సార్, ఎంత అవుద్ది. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఒకసారి వస్తే మాట్లాడదాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: కలిసి మాట్లాడమంటారా? మాస్టర్ మైండ్ ఏజెంట్ : అవును. అభ్యర్థి కుటుంబ సభ్యులు: రేపు బయలుదేరి రమ్మంటారా? ఎన్నింటికి రమ్మంటారు సార్. మాస్టర్ మైండ్ ఏజెంట్ : మీ ఇష్టం. మీరు ఏ టైంకి అయినా రండి. అభ్యర్థి కుటుంబ సభ్యులు: సరేసార్. ఇప్పుడు అభ్యర్థి కూడా కావాలా? నేను, మా బావ వస్తే సరిపోతుందా? మాస్టర్ మైండ్ ఏజెంట్ : మీ ఇద్దరైనా రండి. మీ ఒక్కరైనా రండి. అభ్యర్థితో ఏం పనిలేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకోండి. అభ్యర్థి కుటుంబ సభ్యులు: రేపు పది గంటలకల్లా వస్తాం సార్. వచ్చాక కాల్ చేస్తాం ఈ నంబర్ (944..558..)కు కాల్ చేస్తాం. మాస్టర్ మైండ్ ఏజెంట్ : మాగ్జిమమ్ ఒక్కరు వస్తేనే బెటర్. ఇద్దరు వస్తే కూడా ఒక్కరితోనే మాట్లాడేది. కొంచెం ఇది సీక్రెట్గా చేసుకునే పని కదా. అభ్యర్థి కుటుంబ సభ్యులు: తప్పకుండా సార్. మాకు అర్థమయ్యింది సార్. ఇంతని అంటే.. ఫిగర్ చెబితే నేను రెడీ చేసుకుంటా. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇది డీఎస్సీలో పోస్టింగ్. మీకు ఐడియా ఉంటుంది. ఒకేనా? అభ్యర్థి కుటుంబ సభ్యులు: అవును సార్ మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇప్పుడొచ్చేసి మార్కెట్ రూ.15 లక్షలు అలా నడుస్తుంది. అభ్యర్థి కుటుంబ సభ్యులు: బాబోయ్ అంతంటే పెట్టలేము సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : ఇదేంటంటే డైరెక్టుగా పోస్టింగ్ ఇవ్వడం. సరే ఏదైనా మీరు వచ్చి మాట్లాడండి. ఏమైనా నెగోõÙషన్స్ చేద్దాం. అభ్యర్థి కుటుంబ సభ్యులు: సరే సార్ అయితే, ఓకే.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : వీలైనంత చేస్తాను. యాక్చువల్లీ టైమ్ తక్కువగా ఉందని ఇంటికే పిలిపించి మాట్లాడుతున్నా. ఇక్కడే మాట్లాడుకుందాం. పర్సనల్గా వస్తే మాట్లాడి చేద్దాం అభ్యర్థి కుటుంబ సభ్యులు: తప్పకుండా.. ఓకే సార్.. థ్యాంక్యూ సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : కొంచెం పర్సనల్గా రండి. ఎవరితో దీని గురించి డిస్కస్ చేయొద్దు. అభ్యర్థి కుటుంబ సభ్యులు: లేదండి.. నాకు చెప్పారు.. పోస్టు ఇంపార్టెంట్ కదండి.. వస్తాం.. చూసుకుంటాం సార్.. మాస్టర్ మైండ్ ఏజెంట్ : సరేండి జాగ్రత్తగా రండి. చేద్దాం.బెదిరించి కేసులు విత్డ్రా చేయించి.. అనంతపురం జిల్లాకు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి తనకు డీఎస్సీ ఎంపికల్లో అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించింది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ ప్రాధాన్యత క్రమంలో సదరు క్రీడ అగ్రస్థానంలో ఉంటుంది. ఆమెకు కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత పోస్టు కచ్చితంగా వస్తుంది. ఈ క్రమంలో సదరు క్రీడాకారిణి కేసు విత్డ్రా చేసుకునేందుకు మాస్టర్ మైండ్ తీవ్రంగా బెదిరించారు. శాప్లోని సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగితో ఫోన్ చేయించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పటికే మాస్టర్ మైండ్ ఆ పోస్టును బేరంపెట్టి అమ్మేసుకోవడంతో సదరు క్రీడాకారిణి కేసు గెలిస్తే తనకు ఇబ్బందులొస్తాయని బెదిరింపులకు ఒడిగట్టడం గమనార్హం. అనర్హులు స్పోర్ట్స్ కోటా, సర్టీఫికెట్లతో ఉద్యోగాలు పొందారంటూ వచ్చిన ఫిర్యాదులను శాప్ ఉద్దేశ పూర్వకంగానే తొక్కిపెట్టింది. కనీసం సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ఇవ్వాల్సిన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా ఆర్టీఐ యాక్టివిస్టులను సైతం ఇబ్బంది పెడుతోంది. ‘డీఎస్సీ డీల్స్’ అంటూ సాక్షి ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురిస్తే శాప్ ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. విచారణ పేరుతో వారాల పాటు కాలం గడిపేసి దొంగలకు వత్తాసు పలుకుతోందనే విమర్శలొస్తున్నాయి. కాగా, డీఎస్సీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.లీకేజీ బయటపడకుండా జాగ్రత్తలు రాష్ట్రంలో 1990 నుంచి 2019లో జరిగిన స్పెషల్ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులంతా ఆ మెరిట్ లిస్ట్ పరిశీలించే వీలు కలి్పంచారు. దాంతో మెరిట్లో తాము ఎక్కడ ఉన్నామో తెలుసుకుని తమకు పోస్టు వస్తుందా లేదా అని అంచనా వేసుకునేవారు. దీని ప్రకారం పరీక్ష జరిగిన తర్వాత అభ్యర్థుల మార్కులు విడుదల చేయాలి. మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్ట్ తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలి.కానీ తాజా డీఎస్సీలో మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్లు పంపి సర్టీఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్ పంపడం గమనార్హం. ఇందులోనూ అనేక తప్పులు జరిగాయి. అభ్యర్థుల మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించారు. ఇదంతా లీకేజీని దాచిపెట్టడం కోసమే చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆటే రాకున్నా.. పోస్టు ఇచ్చేశారు ⇒ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టీఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలే జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టీఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు దక్కింది. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది లేకున్నా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టీఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ⇒ రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్–లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశయ్రించారు. అయితే, 20 శాతం నాన్లోకల్/ఓపెన్ కేటగిరీలో.. 80 శాతం లోకల్ కోటాలో పోస్టులు భర్తీ చేయాలి. సదరు జిల్లాలో ఐదు పోస్టుల్లో టాపర్ను ఓపెన్ కేటగిరీల మొదటి పోస్టుగా భర్తీ చేశారు. ఆ తర్వాత మూడో పోస్టు నాన్లోకల్లో భర్తీ చేసి స్థానికులకు అన్యాయం చేశారు.ఒకసారి ఓపెన్ క్యాటగిరీలో పోస్టు భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్–లోకల్లో ఎలా భర్తీ చేస్తారన్నది ప్రశ్న? దీనిపై క్రీడాకారిణి కోర్టుకు వెళ్లగా శాప్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి న్యాయ వ్యవస్థను సైతం మోసం చేసే ప్రయత్నం చేసింది. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులను చూపించి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత ఆరుసార్లకుపైగా రాష్ట్రపతి ఆర్డర్లు సవరించిన విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా కోర్టుకు తెలుపక పోవడం గమనార్హం. -
ఆగని బాబు దుబారా ఖర్చులు
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి దుబారా ఖర్చులకు తెరతీశారు. తన కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను తానే అమలు చేయడం లేదు. వచ్చే నెల జూన్ 13 నుండి 16 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు లోకేష్ కూడా సింగపూర్కి వెళ్లనున్నారు.ఇటీవల పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై చంద్రబాబు స్పందించారు. కేబినెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించాలని, నేతలు వినియోగిస్తున్న వాహనాల సంఖ్యను తగ్గించాలని, ఏడాది పాటు విదేశీ పర్యటనలు వద్దని అన్నారు.కానీ చంద్రబాబు మోదీ సూచనలను పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, లోకేష్తో పాటు ఇతర నేతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలను వినియోగిస్తూ దుబారా చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్లు సింగపూర్ పర్యటనతో మేమింతే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను పాటించని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్కు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటన నిమిత్తం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓవైపు చంద్రబాబు,నారా లోకేష్ ఇలా ఉంటే.. కూటమి ఎమ్మెల్యేలు సైతం సోకుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో ‘నో వెహికల్ డే’పై విమర్శల మోతఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో చంద్రబాబు ప్రతి శుక్రవారం ‘నో వెహికల్ డే’ పాటించాలని ఆదేశించినా, ఆ నిర్ణయం అమలులోనే అభాసుపాలు అవుతున్నాయి.కర్నూలు జిల్లాకర్నూలు జిల్లాలో భూగర్భ ఘనంగా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన సందర్భంగా భారీ కాన్వాయ్తో ప్రయాణించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. పత్తికొండ నుండి జియో మైసూర్ గోల్డ్ పరిశ్రమకు ఆయన కాన్వాయ్ వెళ్ళగా, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాం బాబు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇదేనా పొదుపు?అంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లారంపచోడవరంలో టీడీపీ ఎమ్మెల్యే శిరీషా రాణి అధికారిక పర్యటన సందర్భంగా కాన్వాయిలో ఒక్క వాహనం కూడా తగ్గకుండా ప్రయాణించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. తిమ్మాపురం గ్రామంలో పలు పార్టీ కార్యక్రమాలకు ఆమె వాహనాల కాన్వాయ్తోనే హాజరయ్యారు. సీఎం ఆదేశాలను లెక్కచేయకుండా ఎమ్మెల్యే కాన్వాయ్తో రావడం చూసి ప్రజలు ఇదేనా పొదుపు?అని ప్రశ్నిస్తున్నారు.నంద్యాల జిల్లాడోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా ‘నో వెహికల్ డే’ ఆదేశాలను తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు ప్రయాణం చేస్తానంటూ పోస్టర్లు వేయించి, వాస్తవానికి కార్లలోనే తిరుగుతున్న ఆయన ప్రవర్తన ప్రజల్లో అసంతృప్తిని రేపింది. ఇంధన పొదుపు పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ, అమలులో మాత్రం విఫలమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. -
‘వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు’
తాడేపల్లి : తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానమే లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలే చేశారని, చంద్రబాబు మాదిరి ఎప్పుడూ హత్యా రాజకీయాలు జగన్ చేయలేదన్నారు జూపూడి. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పేరు వింటే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, మే 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి.. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు.. ఇప్పుడేమో పిల్లల్ని కని సంపద సృష్టించండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఈ రెండేళ్లలో జగన్ అనేక ప్రజా సమస్యలను ఎత్తిచూపారు. చంద్రబాబు మాత్రం ప్రజలను వదిలేసి పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రజలను పట్టించుకోవటం మానేశారు. జగన్ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. వాళ్ళు ఎలా గెలిచారో పరకాల ప్రభాకర్ను అడిగితే చెప్తారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం అన్నారు. ఇప్పుడు పిల్లల్ని కని సంపద సృష్టించండి అంటున్నారు..కరోనా సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో అచ్చెన్నాయుడు ఆయన సొంత పార్టీ గురించి ఎలా మాట్లాడారో అందరూ చూసారు. ప్రజలకి ఇచ్చిన మానిఫెస్టో అమలు చేయమని చెప్పటం తప్పా. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు జగన్ అబద్ధాల కోరు అవుతారా ?, జగన్ క్యారెక్టర్ను దెబ్బతీయటం కోసం అనేక కథలు అల్లటం మీకు అలవాటు. జగన్ సూచించిన మావిగన్ పేరు వింటేనే కూటమి ప్రభుత్వ పెద్దల గుండెలు జారిపోతున్నాయి’ అని పేర్కొన్నారు. -
అంతా నా ఇష్టం..! బాబు మాటలను లెక్కచేయని లోకేష్..
-
రూల్స్ పెట్టేది బాబు.. రూట్లు మార్చేది లోకేష్, పవన్!
“ఖర్చులు తగ్గించాలి.. విదేశీ పర్యటనలు తగ్గించాలి..” అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తర్వాతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ‘పొదుపు’ మంత్రం వినిపించింది. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉందని, మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ మాటలు కేబినెట్ హాల్లోనే ఆగిపోయాయా?.. బయటకు రాగానే గాల్లో కలిసిపోయాయా? అనే చర్చ మొదలైంది.మోదీ చెప్పిన పొదుపు సూత్రాలు ఇంకా ప్రజల చెవుల్లో మోగుతుండగానే.. మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనకు రెడీ అయ్యారు. జూన్ 2 నుంచి 6 వరకు ఆయన విదేశీ టూర్కు జీవో కూడా వెలువడింది. ఏపీ కేబినెట్లో ఏడాది పాటు మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నా.. కొద్ది రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని తుంచేసినట్టయ్యింది. నో కాన్వాయ్ డే అంటూ చంద్రబాబు హడావిడి చేస్తే.. అదే రోజు లోకేష్ తన కాన్వాయ్తో హల్ చల్ చేశారు. ఇక కడప పర్యటనకు కూడా లోకేష్ ప్రత్యేక విమానంలో వెళ్లడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక విమాన ప్రయాణాలపై ఇప్పటికే ఉన్న విమర్శలతో కలిసిపోవడంతో “పొదుపు” అనే మాట ప్రజలకు మాత్రమేనా?.. మంత్రులకు మినహాయింపులా? అనే ఎద్దేవా పెరిగింది.సోషల్ మీడియాలో అయితే సెటైర్లు మామూలుగా లేవు. “ప్రజలకు పొదుపు క్లాసులు.. నేతలకు స్పెషల్ ఫ్లైట్ పాసులు” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. మోదీ ఇచ్చిన పిలుపుతో చంద్రబాబు చెప్పిన మాటలు.. అంతా స్టంటేనా? అనే ప్రశ్న హాట్టాపిక్ అయ్యింది. ఇదంతా “మోదీ చెప్పినా వినం” అనే వాళ్ల తీరును ప్రతిబింబిస్తోంది.ఇదీ చదవండి: పొదుపు పేరుతో చెప్పేవన్నీ సోది కబుర్లే: వైఎస్ జగన్ -
ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసు.. చంద్రబాబులో భయం భయం..
-
చంద్రబాబు బ్లడ్ పాలిటిక్స్
-
టీడీపీకి రాం రాం.. తిరగబడుతున్న దళిత ఎమ్మెల్యేలు
-
అహో సోదరా!
కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ-జనసేన మధ్య పూర్తి సమన్వయం ఉన్నట్టే కనిపిస్తున్నా.. ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం జనసేనకు రెండో ప్రాధాన్యతే దక్కుతోందన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో బలపడుతోంది. కీలక నిర్ణయాల్లో జనసేన అభిప్రాయానికి పెద్దగా విలువ లేదన్న అసంతృప్తి, పదవుల పంపకాల్లో తమ వారిని పక్కన పెడుతున్నారన్న గుసగుసలు, అధికార వ్యవస్థలో టీడీపీ నేతలే తుది మాట చెబుతున్నారన్న విమర్శలు.. ఇవన్నీ అప్పుడప్పుడూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ నియామకం ఆ చర్చకు మరో కొత్త ఉదాహరణగా మారింది.ఎన్నికల సమయంలో భుజం భుజాన వేసుకుని తిరిగిన మిత్రపక్షాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం “ఎవరి లెక్క వాళ్లది” అనే సూత్రాన్ని మళ్లీ బయటపెడుతున్నాయి. టీడీపీ వ్యవహారశైలితో “సలహాలు మనవి.. నిర్ణయాలు వారివి” అన్న భావన జనసేన వర్గాల్లో మరింత బలపడేలా చేస్తోంది. అందుకు మరో ఊదాహరణగా మారింది ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామక వ్యవహారం. మరీముఖ్యంగా పవన్ కళ్యాణ్ సూచించిన పేరును పక్కనపెట్టి, చివరికి భరత్ భూషణ్కు పదవి ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏఎం రత్నం.. తెలుగు గడ్డపై పుట్టి తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో హిట్లు, కొన్ని ఫట్లు అందిపుచ్చుకున్న నిర్మాత. తెలుగు చిత్రపరిశ్రమకు ఎంతో సేవ చేశారని, పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన ఎఫ్డీసీ చైర్మన్ పదవికి సరైన వ్యక్తి అని.. కాబట్టి ఈ పదవి కోసం ఆయన పేరును తానే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడికి సిఫార్సు చేస్తున్నట్లు హరిహర వీరమల్లు చిత్ర ప్రెస్మీట్ టైంలో పవన్ ప్రకటించారు.సినీ పరిశ్రమకు దగ్గరగా ఉండే వ్యక్తిగా, అనుభవం ఉన్నవాడిగా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అభిప్రాయం. అలాగే తమ మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం కూడా మరో కారణం అన్నట్లు మాట్లాడారాయన. “ఖుషి” నుంచి “హరి హర వీరమల్లు” దాకా సాగింది వీళ్ల ప్రయాణం. దీంతో FDC చైర్మన్ పోస్టు ఆయనకే ఖాయమన్న భావన జనసేన శ్రేణుల్లో కనిపించింది. కానీ రాజకీయాల్లో “ఖాయం” అనే పదానికి గడువు చాలా చిన్నది. చివరకు ఆ పదవిని భరత్ భూషణ్ చేతికి అప్పజెప్పారు చంద్రబాబు. వాస్తవానికి భరత్ భూషణ్ పేరు రెండు వారాల కిందటే బయటకు వచ్చింది. ఆ సమయంలోనే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నియామకం సినీ పరిశ్రమలోని ప్రతిభ ఆధారంగా కాకుండా, రాజకీయ అనుబంధం ఆధారంగా జరిగాయని విమర్శలు వెలువత్తాయి. పవన్ చెప్పినట్లు ఏఎం రత్నం ఒకవిధంగా ఈ పదవికి అన్నివిధాల అర్హుడే. అయినా కూడా భరత్కే ఆ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. అదే సమయంలో ‘గరుడపురాణం’ శివాజీ, బుర్రా సాయిమాధవ్లాంటి వాళ్లకూ డైరెక్టర్లుగా నియమించారు.సోదరుడైన పవన్ కళ్యాణ్ సూచనను గౌరవిస్తామని చెప్పడం .. చివరికి ఫైల్పై మరోలా సంతకం చేయడం చంద్రబాబు చేస్తోంది. బయటకు “అన్నదమ్ముల బంధం”లా కనిపించినా.. లోపల మాత్రం “సామాజిక సమీకరణాలు” ముఖ్యమని చంద్రబాబు నిర్ణయాలతో స్పష్టమవుతోంది. ఈ ఘటన తర్వాత జనసేన సోషల్ మీడియా వర్గాల్లో “సిఫార్సులు మనవి.. నిర్ణయాలు వారివి” అనే సెటైర్లు కూడా కనిపిస్తున్నాయి.అయితే ఇదేం కొత్తది కాదు. కూటమిలో ఇలాంటివి గత రెండేళ్లుగా జరుగుతూనే వస్తున్నాయి. “రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి” అనే మాట నిరూపిస్తోంది చంద్రబాబు తీరు. ఇప్పుడీ ఎఫ్డీసీ వ్యవహారంలోనూ అదే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజల్లో భారీ మద్దతు తెచ్చిన నాయకుడు కావచ్చు. కానీ అధికార యంత్రాంగంలో ప్రతి నిర్ణయం కాకపోయినా.. ఒకటో రెండో కూడా ఆయన మాట ప్రకారమే జరుగుతుందనే గ్యారంటీ లేదని ఈ ఎపిసోడ్ గుర్తు చేసింది. మరోవైపు చంద్రబాబు మాత్రం కూటమిలో తుది నిర్ణయాధికారం తన చేతిలోనే ఉందని సైలెంట్గా సంకేతం ఇచ్చినట్టయింది. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్క మాటే వైరల్ అవుతోంది.. “అహో సోదరా… రాజకీయ స్నేహం అంటే సినిమా ఫ్రెండ్షిప్ కాదురా!”.. అయితేఇంత హడావిడిలోనూ.. అటు పవన్ కళ్యాణ్తో ఎంతో నమ్మకంగా తీసిన సినిమా రిలీజ్కు ఇబ్బంది పడి, ఆపై అట్టర్ ఫ్లాప్ కావడంతో నిండా మునిగిపోయి ఉండి.. ఇప్పుడు ఇటు ఎఫ్డీసీ చైర్మన్ పదవి కూడా దక్కకపోవడంతో “అయ్యో పాపం రత్నంగారూ” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by GRADUATE ADDA (@graduate_adda) -
అమరావతిలో చంద్రబాబు లూటీ... అవినీతి, దోపిడీతో ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు.
-
పొదుపు పేరుతో చెప్పేవన్నీ సోది కబుర్లే
సాక్షి, అమరావతి: పొదుపు చర్యల పేరుతో చంద్రబాబు చెప్పేవన్నీ సోది కబుర్లేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిస్తూ.. ‘చంద్రబాబు చెప్పే మాటలు ఆయన కొడుకు, దత్తపుత్రుడు వినరు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రైవేటు చాపర్.. ఒక్కో ప్రైవేటు విమానం ఉన్నాయి. గన్నవరం, హైదరాబాద్ ఎయిర్ పోర్టులకు వెళ్లి చూస్తే 3 విమానాలు, 3 చాపర్లు కన్పిస్తాయి. ఇంధన పొదుపు పేరిట వాళ్లు చెప్పేవన్నీ సోది కబుర్లే. ఇవేమీ వాళ్లకు వర్తించవు. ఆ సోది వినమని ప్రజల చెవిలో పువ్వులు పెడతారు’ అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా వ్యవహారాలు) పూడి శ్రీహరి అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ బదులిస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో ఏదైతే విత్తుతామో అవే పండుతాయి. మీరు ఈ పొద్దున ఏం చేస్తున్నారో రేప్పొద్దున ఇవన్నీ వాళ్లకు చుట్టుకుంటాయి. ఈ రాష్ట్రంలో ప్రతి పోలీస్ సోదరుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి, చంద్రబాబుపై భయంతోనో ఆయన చెప్పినట్టు చేయకండి. వీటన్నిటిపై విచారణలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేశారో ఆ తప్పులపై విచారణ జరుగుతుంది. ఆ తప్పులు చేసిన అధికారులందర్ని చట్టం ముందు నిలబెడతాం. రిటైరైనా, సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చి తీసుకొస్తాం. గవర్నెన్స్లో ఉన్నవాళ్లు కచ్చి తంగా వేసే ప్రతి అడుగు రేప్పొద్దున అదే తమకు చుట్టుకుంటే ఎలా అనేది ఆలోచన చేయాలి. అడుగులు వేయాలి. ఇప్పుడు దేవుడిచ్చి న అవకాశం ప్రజలకు మంచి చేయమని చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ఆ స్థానాన్ని ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించాలే తప్ప కక్ష తీర్చుకునేందుకు, లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేయాలని చూడటం దుర్మార్గం. అందుకే పోలీసులకు కూడా చెబుతున్నా రేప్పొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దు’ అని స్పష్టం చేశారు. ఎవరి నోటినుంచైనా అవే మాటలు వస్తాయిపవన్కళ్యాణ్ హోం మంత్రి అమిత్షా వద్దకు వెళ్లారని, జగన్ని ఇబ్బంది పెట్టాలని చూశారని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘అది ఆయన(అమిత్షా) చూసిన, తెలిసిన అనుభవంతో చెబుతున్నారు. ఆయన చంద్రబాబును చూశారు. జగన్ను చూశారు. ఇప్పుడు చంద్రబాబు పాలనను చూస్తున్నారు. జగన్ చేసిన పాలన చూశారు. ఆయనే కాదు ప్రజలంతా చూశారు. అందుకే ఎవరి నోటినుంచి అయినా ఇవే మాటలు వస్తాయి’ అని స్పష్టం చేశారు. ‘తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మీ ఫొటో పెట్టుకుని ప్రచారం చేయడంతో అధికారంలోకి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కదా’ అని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘ఆయన రాష్ట్రంలో ఆయనకు ఎక్కువ పలుకుబడి ఉంటుందిగానీ జగన్కు ఎలా ఉంటుంది’ అని అన్నారు. -
హామీలకు వెన్నుపోటు
చంద్రబాబు 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ.4 పెరిగింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. సున్నా వడ్డీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నాపట్టించుకునే నాథుడు లేడు. విద్యా దీవెన, వసతి దీవెన రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంది. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతున్నారు. యువత, మహిళలు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతున్నారు. అన్ని రంగాలు తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ఫలాన మంచి చేశానని ప్రజలకు చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. రెండేళ్ల పనితీరు (ప్రోగ్రెస్ రిపోర్టు) చూస్తే.. ఒకే ఒక్కటి కని్పస్తుంది. అదే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. ఈ రెండేళ్ల చంద్రబాబు పరిపాలనను గమనిస్తే కనిపించే నిజమిది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తోపాటు 143 హామీలను అమలు చేయకుండా ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నారని దెప్పిపొడిచారు. ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటూ చంద్రబాబు మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూస్తున్నారని.. ఇలాంటి దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జగన్ ఇంకా ఏమన్నారంటే.. అంతా అస్తవ్యస్తం.. కష్టాల్లో ప్రజలు ఓ వైపు మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దయి పోయాయి. ప్రజల చేతిలో చిల్లిగవ్వలేదు. మరోపక్క ఈయన ఇస్తానన్నవన్నీ మోసాలుగా మిగిలాయి. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అతలాకుతలం అవుతున్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రద్దు. రుణాల పరపతి మా హయాంలో మేం స్టార్ట్ చేసినప్పుడు రూ.25 వేల కోట్లు ఉంటే దాన్ని రూ.49 వేల కోట్లకు రుణాలు పెంచుకుంటూ పోయాం. సున్నా వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ, ఆసరా అనే ప్రోగ్రామ్ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ ముందుకెళ్లాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి ఎంత దారుణంగా పడిపోయిందంటే.. సున్నా వడ్డీ సైతం రాని పరిస్థితి నెలకొంది. ఆసరా, చేయూత కథ దేవుడెరుగు.. అన్ని పథకాలు రద్దయి పోయాయి. ఈయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు మోసాలుగా తేలాయి. అక్కచెల్లెమ్మల పరపతి మొన్న డిసెంబర్ నాటికి రూ.31 వేల కోట్లకు పడిపోయింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. ఈ పరిస్థితిలో ఈ పెద్దమనిషి చెంపలేసుకుని కనీసం ఇప్పుడైనా పెట్రోల్, డీజిల్ ధర కనీసం రూ.8 అయినా తగ్గించాలా? లేదా?పెట్రోల్, డీజిల్ ధరలు బాదింది బాబే ‘అయ్యా చంద్రబాబూ.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్నావు, సూపర్ సెవెన్ అన్నావు. మేనిఫెస్టోలో 143 హామీలిచ్చావు. వీటి సంగతేమిటయ్యా అని చంద్రబాబును గట్టిగా ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున మేం కూడా చంద్రబాబును గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఇప్పుడు హాట్ టాపిక్. వీటి ధర తగ్గిస్తామని వీళ్లు ఇచ్చిన హామీ ఈ రోజు వెన్నుపోటు కాదా? 2014–19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో, ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగాయో చూడండి. (పీపీటీలో పెట్రోల్, డీజిల్ రేట్లు చూపించారు) చంద్రబాబు 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. (చంద్రబాబు, లోకేశ్ ప్రసంగాల వీడియో చూపారు) మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ.4 పెరిగింది. నిజంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఏమైంది? » ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. ఇంత వరకు రూపాయి ఇవ్వలేదు. సంవత్సరానికి రూ.18 వేలు. రెండేళ్లకు రూ.36 వేలు ప్రతి మహిళకూ బాకీ. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అన్నావు. రెండేళ్లయి పోయింది. ఏటా రూ.36 వేలు చొప్పున రూ.72 వేలు బాకీ. అప్పుడు ఇంటింటికీ పోయి బాండ్లు ఇచ్చారు. ఈ బాకీ ఎప్పుడు తీరుస్తారు? 50 ఏళ్లకే పెన్షన్ లేదు » 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తానన్నావు. అదీ జూన్ 2024 నుంచి. నెలకు రూ.4 వేలు అంటే సంవత్సరానికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇంత వరకు రూపాయి ఇచ్చింది లేదు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు చంద్రబాబును.రైతుల నడ్డి విరిచారు రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఏడాదికి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్నారు. రెండేళ్లయి పోయింది. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ.14 వేలు. రూ.26 వేలు ఎగ్గొట్టాడు. అంతే కాకుండా 50 లక్షల మంది రైతులకు మా హయాంలో రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు అందులో 7 లక్షల మందికి కోత కోశాడు. కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత, నా పాదయాత్ర జరిగి చివరికి వచ్చిన తర్వాత చివర్లో మోదీ∙వాళ్లు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. ఈ–క్రాప్, ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఉచిత బస్సు.. తుస్సు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీల బస్సులకే పరిమితం చేస్తున్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానికి కూడా ఇప్పుడు మళ్లీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్లీ పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండోది మేము ప్రభుత్వంలో విలీనం చేసిన 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగస్తుల బతుకులు ప్రశ్నార్థకం చేశారు. ఏకంగా 12 డిపోలను ప్రైవేటుపరం చేశాడు.. భూములతో సహా. భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు. ఆర్టీసీ బస్సు ఉండదు. ఆర్టీసీ ఉండదు. అతీగతిలేని విద్యాదీవెన.. వసతిదీవెన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఈ రెండేళ్లలో ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు ఇవ్వాలి. 2024 జనవరి–ఏప్రిల్ త్రైమాసికానికి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా అప్పటి సొమ్ము పంపిణీ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు 9 త్రైమాసికాలు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది. ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ మార్చి నాటికే బకాయిలు రూ.5,820 కోట్లు. విద్యా దీవెన కింద 9 త్రైమాసికాలకు క్వార్టర్కు రూ.700 కోట్లు చొప్పున రూ.6,300 కోట్లు. ఇప్పటికి ఇచ్చింది ఎంత అంటే, ఒకసారి రూ.1,770 కోట్లు, ఇప్పుడు రూ.900 కోట్లు ఇచ్చాడు. అంటే రూ.2,670 కోట్లు. రూ.3,628 కోట్లు ఇప్పటికే విద్యాదీవెన కింద బకాయిలున్నాయి. వసతి దీవెన ప్రతి జనవరిలో రూ.1,100 కోట్లు క్రమం తప్పకుండా మా హయాంలో ఇచ్చే వాళ్లం. వసతి దీవెన కింద జనవరి 2025 రూ.1,100 కోట్లు, జనవరి 2026 మరో రూ.1,100 కోట్లు.. ఇప్పటికే రూ.2,200 కోట్లు బాకీ. రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. పట్టించుకునే నాథుడే లేడు. అమ్మ ఒడి మరో మోసం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లల్ని తగ్గించేశారు. రూ.15 వేల కథ దేవుడెరుగు. కొందరికి రూ.9 వేలు. కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు. కొందరికి మాత్రమే రూ.13 వేలు. ఇదీ అమ్మ ఒడి పరిస్థితి. గ్యాస్ కూడా లేదు గ్యాస్ సిలెండర్ల పరిస్థితీ అంతే. ఇప్పటికి 9 ఉచిత సిలెండర్లు ఇవ్వాలి మూడో సంవత్సరం కలుపుకుంటే. ఇంత వరకు ఇచ్చింది ఒకటి రెండు. అది కూడా అందరికీ ఇవ్వలేదు. నంబర్ డ్రాస్టిక్గా తగ్గించారు. కోటీ 50 లక్షల నుంచి 90 లక్షలకు తగ్గించారు. ఇచ్చే అర కొరలో కూడా అన్యాయం. కొత్త పెన్షన్లు లేవు.. ప్రతి నెలా 25 వేలు కట్ మా హయాంలో ఎన్నికల షెడ్యూలు వచ్చే నాటికి 66,34,372 పెన్షన్లు పంపిణీ చేశాం. ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయించాం. చంద్రబాబు హయాంలో పెన్షన్ రూ.1000, మా హయాంలో రూ.3 వేలకు పెంచుకుంటూ పోయాం. వాటిని చంద్రబాబు తగ్గించేస్తున్నారు. ఈ మే నెలలో 60,11,293 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేశారు. ప్రతి నెలా 25 వేల పెన్షన్లు కట్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకపోగా 6,23,079 మంది పెన్షన్లు కట్ చేశారు.సంక్షోభంలోనూ స్కామ్పెట్రో ధరలు తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? ఇక్కడా స్కామే చేశాడు. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారో చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. పెట్రోలు బంకుల దగ్గర జనం బారులు తీరారు. ఆ పరిస్థితుల్లో కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉంచి మేలు చేయాలన్న ఆలోచన చేయాల్సింది పోయి ప్రజలను ఇక్కట్లపాలు చేశాడు. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో తక్కువ ధరకు డీజిల్, పెట్రోల్ ఇవ్వండంటూ బీపీసీఎల్, ఐవోసీ తదితర ఆయిల్ కంపెనీలకు లెటర్ (లేఖను చూపుతూ) రాశాడు. మీ ఎన్డీయే కూటమిలో సభ్యుడు చంద్రబాబు ఇలా అడుగుతున్నాడు.. మేం ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదని ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వాళ్లు కేంద్ర మంత్రికి చెప్పారు. అక్కడి నుంచి మోదీ షంటుకున్నారు. దానిపై కేంద్రం చంద్రబాబుకు చీవాట్లు పెడుతూ తిరిగి లేఖ రాసింది. నీకు బుద్దీ జ్ఞానం ఉందా లేదా చంద్రబాబూ? దేశంలో పెట్రోలు, డీజిల్ దొరక్క ప్రజలందరూ అవస్థలు పడుతుంటే, బల్క్ డీజిల్ కొంటే రేటెక్కువ అని చెప్పి.. కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో డీజిల్ పోయమని ఎలా అడుగుతున్నావు అని కేంద్రం లేఖ రాసింది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? తద్వారా ఆ కాంట్రాక్టు పనుల్లో ఈయనకొచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రమే ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా.. ఈ ముఖ్యమంత్రి తప్ప! నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి, బల్క్ లో వాళ్లు డీజిల్ కొంటే లీటర్ రూ.155 అవుతుందని, రీటెయిల్ పెట్రోలు బంకుల్లో కొంటే రూ.101కే దొరుకుతుందని, వాళ్లకు రూ.101కే రీటెయిల్ బంకుల్లో పోయమని నువ్వు లేఖ ఎలా రాశావు? పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్న హామీనే కాదు.. సూపర్ సిక్స్ అయినా అంతే, సూపర్ సెవెన్ అయినా అంతే. ఇదే పరిస్థితే. (పీపీటీలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు చూపించారు)ఉద్యోగుల బకాయిలు రూ.35 వేల కోట్లుచంద్రబాబు ఉద్యోగులను మరీ దారుణంగా మోసం చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ప్రతి ఆరు నెలలకు డీఏ ఇవ్వాలి. మా హయాంలో ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. 11 డీఏలు ఇచ్చాం. ఒకటి ఎక్కువ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. కాలయాపన లేకుండా పీఆర్సీ వేశాం. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడపిస్తూ.. వీళ్ల గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో.. వీళ్లు సీపీఎస్తో ఇబ్బంది పడుతుంటే.. జీపీఎస్ అనే విధానం కూడా తీసుకువచ్చాం. ఈ రోజు మేము తీసుకువచ్చిన జీపీఎస్ను దేశం అంతా కాపీ కొడుతోంది. ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి చూస్తే.. ఈ జూన్ వస్తే 5వ డీఏ కూడా పెండింగ్. అధికారంలోకి రాగానే ఐఆర్ అన్నారు. ఇంత వరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా హయాంలో వేసిన పీఆర్సీ చైర్మన్ను కూడా తీసేశారు. కొత్త వారిని కావాలని వేయడం లేదు. ఎందుకంటే కొత్త వారిని వేస్తే రికమండేషన్స్ వస్తే వెంటనే జీతాలు పెంచాలి కాబట్టి. అందుకే పీఆర్సీ వేయడం లేదు. పోలీసు సోదరులకు సరెండర్ లీవ్స్ 5 పెండింగ్. మొట్టమొదటిసారిగా చంద్రబాబు సరెండర్ లీవ్ను స్ప్లిట్ చేస్తున్నాడు. వాయిదా పద్ధతి పెడుతున్నాడు. మరోవైపు ఐదు సరెండర్ లీవ్స్ పెండింగ్. 15 నెలలు టీఏలు పెండింగ్. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు... ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరైనా అడిగితే.. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు.అప్పుడు సంపద సృష్టిస్తానని.. ఇప్పుడు పిల్లలే సంపద అంటావా?» సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి చంద్రబాబు.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అంటున్నాడు. ఇంకా మోటివేట్ చేస్తూ.. ముగ్గురిని కంటే రూ.30 వేలు ఇస్తానంటున్నాడు. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తా అంటున్నాడు. వీటి కథ దేవుడెరుగు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలు ఏమైనాయి స్వామీ? ముందు వీటి గురించి ఆలోచించు. ఆ తర్వాత మూడో సంతానం.. నాలుగో సంతానం గురించి చెబితే.. అంతో ఇంతో వినడానికి అవకాశం ఉంటుందని ప్రజలు మొత్తుకుంటున్నారు.» ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదైతే చెబుతాడో.. దాన్ని ఆయన పాటించాలి కదా.. కనీసం ఆయన కొడుకైనా పాటించాలి కదా.. ఆయన కొడుక్కి ఒకడే. ఆయనకొకడే. కానీ బీదోళ్లకు మాత్రం నలుగురు సంతానం కావాలా! వారు చదువుకోకూడదు. వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. వాళ్లు ఇంగ్లిష్ మీడియం చదవకూడదు. వాళ్ల బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలనే దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరెవరూ ఉండరు.» ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంటే.. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతుంటే.. యువత, మహిళలకు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతుంటే.. అన్నీ తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు. » మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తున్న అతి దిగజారుడు రాజకీయం. నిజానికి మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. వారు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. చంద్రబాబు మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా చూడటం అంటే ఇంతకంటే దారుణమైనపరిస్థితులు రాష్ట్రంలో ఎన్నడూ లేవు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దైన్యంఅసలు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ పూర్తిగా మూలన పడిన పరిస్థితులు. ఈరోజు స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితి. మా హయాంలో మూడో తరగతి నుంచి టోఫెల్ ఒక పిరియడ్గా పెడితే, దాన్ని తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకువస్తే.. అసలు ఇంగ్లిష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకువస్తే.. అది గాలికొదిలేసిన పరిస్థితి. నాడు–నేడుతో మేము బడులను బాగు పరిస్తే.. ఇప్పుడు పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేసి ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా మేము చేస్తే.. ఈ రోజు ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో 8వ తరగతికొచ్చే సరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మేనమామలా మేము చదివిస్తే.. ఈ రోజు పిల్లలకు ట్యాబుల కథ దేవుడెరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితి ఈరోజు బడుల్లో నడుస్తోంది. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విద్యా దీవెన లేదు. వసతి దీవెన లేదు. చదువులు ఆపేస్తున్న పరిస్థితి. స్కూళ్లు, అంగన్ వాడీలు, హాస్టళ్లలో పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందక పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితి. ఆస్పత్రులు నాశనం చేశారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి.. పీహెచ్సీల దగ్గర నుంచి.. హాస్పిటల్స్ను రిఫార్మ్ ద్వారా సంస్కరించి.. జీరో వేకెన్సీ పాలసీ తీసుకువచ్చి, సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరతలేని పరిస్థితి మా హయాంలో తీసుకువచ్చాం. ఈ రోజు పూర్తిగా అన్నీ నాశనమైన పరిస్థితి. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుట్టి, వాటిలో ఐదు పూర్తి చేశాం. మిగిలినవి వివిధ రకాల స్టేజ్లలో ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే అవి కూడా పూర్తవుతాయి. పిల్లలందరికీ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తుంది. దానిని పక్కన పెట్టి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగ్లకు గ్లాసుల కోసం.. కేవలం భవనం అద్దాలకు రూ.2,500 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వస్తాడు కానీ, మెడికల్ కాలేజీలకు డబ్బులివ్వడానికి మనసు రాదు. నాడు–నేడు కింద స్కూళ్లను బాగు చేయడానికి మనసు రాదు. పూర్తిగా సున్నా వడ్డీ అనే పథకం తీసేసి, ఆసరా, చేయూత అనేపథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి.ఆరోగ్యశ్రీ నిర్వీర్యంఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.3,746 కోట్లు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి రూ.4 వేల కోట్లు కావాలి. అలాంటిది రెండేళ్లలోనే రూ.3,746 కోట్లు బకాయి. మళ్లీ ఈ సంవత్సరం మరో రూ.4 వేల కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. చంద్రబాబు చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే.. వారికి వాళ్ల పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. లోన్ కోసం 8 శాతం వడ్డీ కూడా కట్ చేస్తా అంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోగా, మాకు లోన్ ఇప్పించడమేంటి స్వామీ.. పైగా దానికి 8 శాతం వడ్డీ కట్ట్టడమేంటీ.. అని నెట్వర్క్ ఆస్పత్రులు లబోదిబోమంటూ బోర్డు తిప్పేస్తున్నాయి. -
ప్రశ్నించే వారికి సంకెళ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సోషల్ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం సెన్సార్షిప్ విధిస్తోందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఎవరైనా అమరావతిలో జరుగుతున్న స్కామ్లు చూపిస్తే, జీవోలు చూపిస్తే.. చదరపు అడుగుకు రూ.20,427లా అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలపై ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టినా, తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించినా, మహిళలపై అఘాయిత్యాల మీద, టీటీడీ చైర్మన్ వ్యవహారంపై ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. విచ్చలవిడిగా సాగుతున్న మద్యం, గంజాయి విక్రయాలు, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపై ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కంటెంట్ కన్పించకుండా సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై వారి పార్టీ కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. ‘చంద్రబాబు ఏకంగా కుప్పంలో కేసులు పెట్టిస్తాడు. ఎఫ్ఆర్ఐ నమోదు చేస్తారు. సోషల్ మీడియా పోస్టులను ఆ సీఐ ఎక్స్ (ట్విటర్)కు, ఫేస్బుక్, యూ ట్యూబ్ హెడ్క్వార్టర్కు పంపిస్తాడు. ఆ వీడియోలు డిలీట్ చేయమని చెబుతారు. ఎక్కడో శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ఎక్స్ యాజమాన్యానికి కుప్పం ఇన్స్పెక్టర్ రాసిన లేఖను చూస్తే ఎవరికైనా పోలీసులు ఎలా తయారయ్యారో అర్థమవుతుంది’ అని తెలిపారు.పోలీసులు ఎక్కడ?రాష్ట్రంలో ఎక్కడా పోలీస్ డ్యూటీ కన్పించడం లేదని, ఏ కాలేజ్లో చూసినా గంజాయి కన్పిస్తుందని.. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘దాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కన్పించరు. ప్రతి ఐదు లిక్కర్ బాటిల్స్లో ఒక బాటిల్æ కల్తీ అయినా పోలీసులు పట్టించుకోరు. ఏ బెల్టు షాపు దగ్గరా పోలీసులు కన్పించరు. పోలీసులు చేసేది ఏమిటో తెలుసా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే తప్పుడు కేసులు పెట్టడం, ఆ కేసుల కోసం తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఆ కేసుల్లో అమాయకుల్ని ఇరికించి జైలుకు పంపేందుకు తాపత్రయ పడడం. రాష్ట్రంలో పరిపాలన (గవర్నెన్స్) అనేది పూర్తిగా లేకుండా పోయింది. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. పోలీసుల ప్రాథమిక బాధ్యతలన్నీ (బేసిక్ రెస్పాన్స్బిలిటీస్) మరిచిపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో దిశ అనే యాప్ను తీసుకొచ్చి, ఏ ఆడపిల్లకైనా, ఎలాంటి వేధింపులు జరిగినా సరే.. ఫోన్ చేసిన 10 నిముషాల్లో పోలీసులు పోయేవాళ్లన్నారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలీసులు.. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే నిమిషాల్లో స్పందించే వారని గుర్తు చేశారు. ఈ రోజు ఎవరూ పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. -
ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?
రెండేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీపై, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. బాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగి పోయేంతగా బీపీ పెరుగుతోంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటన్నింటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ డైవర్ట్ చేయడం మామూలైపోయింది. ఎవరిది గన్ కల్చర్.. ఎవరివి హత్యా రాజకీయాలు’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. తప్పుడు కేసులు.. దొంగ సాక్ష్యాలు కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మా పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానందరెడ్డి, మా మామ రవీంద్రనాథ్రెడ్డిపై బురద జల్లుతున్నారు. జాతరలో గొడవ వల్ల ఈ హత్య జరిగిందని దస్తగిరి భార్య మీడియా ఎదుట చెప్పింది. తామెవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్గా పని చేస్తున్న నిత్యానందరెడ్డితో తమకు ఎలాంటి విబేధాలు లేవని కూడా చెప్పింది. ఇక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉన్నారు.చనిపోతే బాధ పడాల్సింది మా వాళ్లే. అయినా సరే చంద్రబాబు తన రాజకీయాల కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు కుట్రలతో దిగజారుతున్నారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 అందరూ కలిసి ఒక కథ తయారు చేస్తారు. దాన్నే నిజమని చెబుతారు. పెద్దపెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థలన్నీ వీళ్ల చేతుల్లో ఉన్నాయి. గతంలో వేరే రకంగా ఇచ్చి న స్టేట్మెంట్లను తీసుకుని, ఇప్పుడు చంద్రబాబు బృందం చెప్పిన కల్పిత కథల చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు. దొంగ సాక్ష్యాలను సృష్టిస్తారు. కొంత మందిని కేసులో ఇరికిస్తారు. అరెస్ట్ చేస్తారు. ఓ వైపు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతుంటే, మా వాళ్ల మీదే కేసులు బనాయించి, ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికించి జైలుకు పంపే కార్యక్రమం చేస్తున్నారు. రెండేళ్లుగా జరుగుతున్న అరాచకాలు ఇవే. తప్పుడు కేసులు వీళ్లే పెడతారు. తప్పుడు సాక్ష్యాలు వీళ్లే క్రియేట్ చేస్తారు. ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అయినా సరే, కళాశాలలు, యూనివర్సిటీల్లో యాక్టివిస్ట్లుగా ఉన్న పిల్లలైనా సరే, వైఎస్సార్సీపీకి మద్దతుదారులైనా సరే, వైఎస్సార్సీపీ నాయకులైనా సరే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. ఇదే స్క్రిప్ట్. చంద్రబాబు లాయర్.. దస్తగిరి లాయర్ సిద్ధార్థ లూథ్రాయే మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా? వైఎస్సార్సీపీ కోసం, అవినాష్ రెడ్డి కోసం జమ్మలమడుగులో ప్రచారం చేసి వచ్చిన రోజే హత్యకు గురయ్యారు. పైగా తానే వివేకానంద రెడ్డిని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో ప్రత్యక్ష ప్రసారంలోనే విచ్చలవిడిగా మాట్లాడిన దస్తగిరి అనే ఈ వ్యక్తి, మా చిన్నాన్నను చంపిన వ్యక్తి. ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా. ఎవరిదయ్యా చంద్రబాబూ క్రిమినల్ బ్రెయిన్? రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఇదే కదా.. ఈ కేసులో జరుగుతోంది. చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా? ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతున్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా? ఎన్టీఆర్ గారి అబ్బాయి హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. పరామర్శ కోసం పోయి చంద్రబాబు ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడ లేదా? ఎవరివయ్యా శవ రాజకీయాలు అని అడుగుతున్నా. సొంత కూతురిని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సొంత మామను, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొని, ఆయన చనిపోయేలా చేసింది ఎవరయ్యా? చంద్రబాబు కాదా? ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతున్నా. వంగవీటి హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే వంగవీటి మోహనరంగారావు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాల కోసం విజయవాడలో «నిరాహార దీక్ష చేస్తుంటే.. అర్ధరాత్రి అత్యంత పాశవికంగా నరికి చంపారు. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ కాదా? ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా చంద్రబాబు వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య అప్పట్లో మంత్రి, చంద్రబాబుకు సహచరుడు. ఆయన రాసిన పుస్తకంలో ఈ ఘటన ఎలా జరిగింది.. చంద్రబాబు పాత్ర ఎంత బలంగా ఉందో రాశారు. మోహన రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే. హత్యా రాజకీయాలు ఎవరివో.. కుట్ర రాజకీయాలు ఎవరివో.. శవ రాజకీయాలు ఎవరివో ప్రజలకు తేటతెల్లమవుతున్నాయి. ఎన్టీఆర్పై దాడి కేసులో మల్లెల బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆయన లాడ్జిలో శవంగా మారాడు. అతని జేబులో దొరికిన లెటర్లో తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి రూ.30 వేలు ఇచ్చారని రాసి ఉంది. ఎన్టీఆర్పై దాడి కోసమే ఈ డబ్బులు ఇచ్చారా? అదే నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్న దానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. మరొక ఉదాహరణ..పింగళి దశరథరామ్. ఈయన ఒక ప్రముఖ జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న ఈ వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. ఎవరివి హత్యా రాజకీయాలు.. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు.. ఎవరివయ్యా శవ రాజకీయాలు? అబద్ధాలు.. దొంగ కేసులు.. తప్పుడు సాక్ష్యాలుఎప్పుడు ఏ ఘటన జరిగినా, వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు డైవర్షన్ చేసేందుకు కొత్త టాపిక్ను, కొత్త అబద్ధాన్ని తెరపైకి తీసుకొస్తారు. దానికి రెక్కలు కడతారు. ఇష్టమొచ్చి నట్టుగా మాట్లాడతారు. ఇంకొక విస్తుగొలిపే విషయం.. రెండ్రోజుల క్రితం ఈనాడులో చూశాను. నకిలీ మద్యం కేసులో 89 మంది సాక్షులట.. జోగి రమేష్ పేరు చెప్పారట! ఈ కల్తీ మద్యం ఘటన జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో. కల్తీ మద్యం తయారు చేసిన వాళ్లకు, పోలీసుల మధ్య లావాదేవీల్లో తేడా వచ్చి ఈ విషయం బయటకొచ్చింది. చంద్రబాబు హయాంలో కొనసాగుతున్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు.. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నరేళ్ల తర్వాత బయట పడిన విషయాలివి. తంబళ్లపల్లిలో చంద్రబాబు పార్టీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తన సన్నిహితుల పీఏల ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తే.. పోలీసులు రైడ్ చేస్తే అడ్డంగా దొరికి పోయారు. అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. చేసింది చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే అభ్యరి్థ. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పైనే బనాయించారు. నిజంగా మనుషుల్లో మానవత్వం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. ఒక అబద్ధానికి రెక్కలు గట్టి ఇష్టమొచ్చి నట్టుగా ఇరికించేస్తున్నారు. జోగి రమేష్ను బీసీ నాయకుడు అని కూడా చూడకుండా ఓ తప్పుడు కేసులో 83 రోజులు జైలులో పెట్టారు. బెయిల్పై బయటకొస్తే ఇంటిపై యాసిడ్ బాటిల్స్తో దాడి చేయించారు. ఆ దాడి చేసిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ రోజు చార్జిషీట్ ఫైల్ చేసారట.. 89 మంది సాక్షులట. జోగిరమేష్ పేరు చెప్పారట. నిజంగా ఎంత దారుణంగా కేసులు బిల్డప్ చేస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఐదు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ బాటిల్ అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడం లేదు. ఈ కల్తీ మద్యం తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే. అమ్మేది చంద్రబాబు మాఫియా ముఠా బెల్టు షాపులు. ఇవన్నీ పోలీసులకు తెలుసు. బెల్టుషాపులు నడుపుతున్నారని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, ప్రతీ ఐదు బాటి ల్స్కు ఒక బాటిల్ కల్తీ అని అందరికీ తెలుసు. అయినా అటువైపు పోలీసులు, అధికారులు కన్నెత్తి చూడరు. అంబటి మురళీపైనే తప్పుడు కేసులు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో చాలా దారుణమైన ఘటన. భావి సమాజం ఖండించాల్సిన అంశం. మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు చిన్న రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటకు రేటు లేదని ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) చూస్తే రూ.2,400. కానీ రూ.1,400, రూ.1,600కు మించి ధర రావడం లేదు. అందుకే ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. ఆ గోదాము ఉన్నది మా పార్టీకి చెందిన అంబటి మురళి ఇంటి పక్కన. ఆయనది అదే ఊరు. ఆయన కూడా కాపు నాయకుడే. కానీ స్థానిక ఎమ్మెల్యే, చంద్రబాబు పోలీసులను పంపుతారు. గోడౌన్పై రైడ్ చేయిస్తారు. ఆ గోడౌన్కు వైఎస్సార్సీపీ జెండాలు కట్టిస్తారు. అభాండాలు వేసి, అబద్ధాలు చెప్పించి మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ను సీజ్ చేశారు. నాకు ఆశ్చర్యమనిపిస్తుంది. రేటు లేక దాచుకుంటే సీజ్ చేస్తున్నారు. నువ్వు ఎమ్మెస్పీ ఇచ్చి కొంటామంటే ఎందుకు దాచుకుంటారు? ఏం తప్పు చేశారని గోడౌన్ సీజ్ చేశారు? ఆ రైతులకు ఈ రోజు పంట లేదు. చేతిలో డబ్బుల్లేవు. వైఎస్సార్సీపీ నాయకులు, ఇతరులు ఆ గోడౌన్ను చూడడానికి వెళ్తే అడ్డగిస్తున్నారు. జంగిల్ రాజ్ కాకపోతే ఏమిటిది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాంచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివయ్యా హత్యా రాజకీయాలు? మా కుటుంబంలో మేము ముగ్గురిని కోల్పోయాం. మా తాత, మా నాన్న, మా చిన్నాన్న బలైపోయారు. మేము బాధితులం. కానీ మా పైనే చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవరు? టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా తాత రాజారెడ్డిని దారుణంగా చంపారు. కేవలం మా నాన్న రాజశేఖరరెడ్డిని పులివెందులలో కట్టడి చేయాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యాలయంలో దాచిపెట్టి జైలుకు పంపకుండా రక్షించింది వీళ్లు కాదా? అధికార దుర్వినియోగం చేసింది వీళ్లు కాదా? ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా. మా నాన్న విషయంలోనూ అంతే. నాన్న చనిపోక ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి. ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఈ మాటలన్న 2–3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికీ ఈ ఘటనలో నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా.వీటినేమంటారు?» కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మృతుడు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతున్నా, మా వాళ్ల మీదే కేసులు బనాయించారు. » మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన 1999 ఎన్న్నికల ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా? » మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా?» మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?» మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా.» చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా?» ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో కొట్టి చంపలేదా? » ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? » సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కున్నదెవరు? » వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే.» మల్లెల బాబ్జీ ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? » జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ను చంపిందెవరు? ఈ ఘటనలోనూ వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. » నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడింది మీ పార్టీ లీడర్. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పై ఎలా పెట్టారు?» రెండేళ్లుగా కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు.. ఊరూరా గంజాయి, డ్రగ్స్, బెల్ట్ షాపులుబాబు నైజాన్ని దగ్గుబాటి, హరిరామజోగయ్య ఏనాడో చెప్పారుఇదే పెద్దమనిషి చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాశాడు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని అనేక టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బస్సులు తగలపెట్టకపోతే ధర్నాలు కావట! నేను కాదు అన్నది ఈ మాటలు.. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి చెప్పిన మాటలు. తాను రాసిన పుస్తకంలో చంద్రబాబు కుట్రలు, రాక్షస రాజకీయాల గురించి వివరించారు. హరిరామజోగయ్య కూడా చంద్రబాబు ఏ రకంగా కుట్రలు చేస్తాడు.. ఎలాంటి రాక్షస రాజకీయాలు చేస్తాడో సవివరంగా తన పుస్తకంలో రాశాడు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో, కుట్రలతో రాజకీయాలు చేసింది.. చేస్తోంది చంద్రబాబు. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేము. గర్వంగా చెబుతున్నాను నేను ఈ మాటలు. జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్లు ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నారు. జగన్ చెడ్డోడు అయి ఉంటే వాళ్లు బతికి ఉండేవాళ్లా? మా తాతని దారుణంగా నరికి చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది.. జగన్ మనస్తత్వం ఎలాంటిది.. అని చెప్పేందుకు ఇదొక నిదర్శనం. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే మాకు రాజకీయాలు ఎలా చేయాలో మా నాన్న నేర్పించారు. చంద్రబాబు మాదిరి హత్యలు చేయమని కాదు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేర్పించారు. అది చంద్రబాబుకు, మాకు మ«ధ్య ఉన్న వ్యత్యాసం. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో? ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో.. ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబుకు 77 ఏళ్ల వయస్సు. బహుశా ఇవి చివరి ఎన్నికలనుకుంటున్నా. ఎన్నికలొచ్చేసరికి మీకు (చంద్రబాబు) 80 ఏళ్లు. ఈ వయసులో కూడా దౌర్భాగ్య రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని అడుగుతున్నా. ఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో గమనించండి. వినుకొండలో 2024 జూలై 24న వైఎస్సార్సీపీ నేత రషీద్ను నడిరోడ్డుపై నరికి చంపించే కార్యక్రమాన్ని ఎలా ప్రోత్సహించారో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. (రెండేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేతలు హత్య చేసిన ఉదంతాలను ఆధారాలతో సహా వివరించారు) చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏ రకంగా హత్యలు చేయిస్తున్నాడో? కుట్రలు చేస్తున్నాడో? శవ రాజకీయాలు చేస్తున్నాడో? అందరికీ తెలుసు. ఎవరిది గొడ్డలి పార్టీయో? గొడ్డలి పట్టుకొని ఎంత దారుణంగా హత్యలు చేయిస్తా ఉన్నాడో చెప్పేందుకు ఇవి నిదర్శనాలు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ సాగుతోంది. హత్యా రాజకీయాల మధ్య దారుణమైన పాలన సాగుతోంది. చంద్రబాబు హత్యా రాజకీయాలకు సాక్ష్యాలు ఇవిగో... -
గురువులపై బాబు సర్కారు కత్తి!
ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కారు కత్తికట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. చిన్నచిన్న విషయాలకు టీచర్లను బలిచేస్తోంది. ఇలా దాదాపు 22 మంది ఎస్సీ, బీసీ ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో సర్కారు తీరుపై ఉపాధ్యాయ లోకంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిర్వహణ లోపాలను సరిచేయకుండా వేధింపులకు దిగడం చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని మండిపడుతున్నారు. సాక్షి, అమరావతి: విద్యార్థులను భావి భారతపౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. లోపాలను విద్యార్థులు ప్రశ్నిస్తే దానికి టీచర్లను బాధ్యులుగా చేసి వేధింపులకు గురిచేయడంతోపాటు సస్పెన్షన్ బహుమతిగా ఇస్తోంది. మీరే రెచ్చగొడుతున్నారంటూ నోటీసులు ఇస్తోంది. బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరినా నేరమే అంటోంది. మీరే రెచ్చగొడుతున్నారంటూ నోటీలిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, బీసీ ఉపాధ్యాయులను టార్గెట్ చేసి వేధిస్తోంది. గత ప్రభుత్వంలో నాణ్యంగా మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించింది. స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులతో కూడిన ఏజెన్సీల ద్వారా వారానికి 16 రకాల పదార్థాలతో పౌష్టికాహారం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతకు తిలోదకాలిచ్చింది. దీంతో పలుచోట్ల విద్యార్థులే రోడ్డెక్కి నినాదాలు చేయడం, కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో ఇందుకు కారణం ఉపాధ్యాయులేనని ప్రభుత్వం కక్షగట్టింది. మంచి భోజనం పెట్టమంటే సస్పెన్షన్ అస్త్రం » విశాఖ జిల్లా చిన్నగదిలి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని పాఠశాల విద్యార్థులు కంచాలతో రోడ్డెక్కారు. పురుగులు పట్టిన అన్నం, నాణ్యతలేని కూరలు అందిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ గతేడాది డిసెంబర్ 8న కలెక్టర్ కార్యాలయం తలుపుతట్టారు. దీనికి ఇక్కడి ఉపాధ్యాయులే కారణమని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. » డిసెంబర్ 13న వైఎస్సార్ కడప జిల్లా తాండూరు మండలం ఎదులవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడా ఉపాధ్యాయులను నిందితులుగా చేశారు. భోజనం బాగోలేదని ఉపాధ్యాయులు హెచ్చరించినా వంట ఏజెన్సీకి స్థానిక టీడీపీ నాయకులు అండగా నిలిచి ఉపాధ్యాయులనే బెదిరించారు. తీరా నష్టం జరిగాక టీచర్లనే బాధ్యులను చేసి సస్పెండ్ చేశారు. » ఈ ఏడాది మార్చి 10న ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామానగర్ మోడల్ ప్రాథమిక పాఠశాల(ఎంపీఎస్)లో భోజనం సరిగా పెట్టడం లేదని, వంట దారుణంగా ఉందని విద్యార్థులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలకు మంచి భోజనం పెట్టాలని వంట ఏజెన్సీని అడిగిన పాపానికి హెచ్ఎంను సస్పెండ్ చేశారు. » మార్చి 17న విజయవాడ సమీపంలోని గొల్లపూడి ఎంపీపీ స్కూల్లో పెట్టే భోజనం బాగోలేదని, చిక్కీల్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లలను మీరే రెచ్చగొడుతున్నారంటూ హెచ్ఎంకు నోటీసులిచ్చారు. » నెల్లూరు జిల్లా కోడూరు ఎంపీపీఎస్కు చెందిన ఉపాధ్యాయుడు.. విద్యా సంవత్సరం ప్రారంభంలో బదిలీ చేసిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని డీఈవోకు మెమోరాండం ఇచ్చారు. ఇదే నేరమన్నట్టు ఆయన్ను సస్పెండ్ చేశారు. » గుంటూరు నగరంలోని మున్సిపల్ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. ఆ సమయంలో ఇన్చార్జి హెచ్ఎం విధుల్లో లేరన్న కారణం చూపి విధుల నుంచి తప్పించారు. వాస్తవానికి ఆమె కొన్ని రోజులుగా మెడికల్ లీవ్లో ఉన్నారు. ఇది అధికారులకు తెలిసినా ఎమ్మెల్యే మెప్పు కోసం ఆమెపై చర్యలు తీసుకోవడం కొసమెరుపు.» సీఎం చంద్రబాబు జనాభా పెంపునకు నడుం బిగించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాన్ని మార్కాపురం మండలం తాళ్లూరు ఎంపీపీఎస్కు చెందిన ఓ టీచర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. వెంటనే అధికారులకు ఆగ్రహం కట్టలు తెంచుకుని ‘సీఎంనే ప్రశ్నిస్తావా’.. అంటూ సస్పెండ్ చేశారు. ఈ ఘటనల్లో బాధిత ఉపాధ్యాయులంతా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారే. కళ్లముందు జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకు ముగిసిన విద్యా సంవత్సరంలో 22 మంది ఉపాధ్యాయులపై వేటు వేయడం గమనార్హం. -
గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..
-
మా నాన్నని అసెంబ్లీలో అన్న మాటలు మర్చిపోలేదు.. రెండు రోజులకే ఆక్సిడెంట్!
-
నువ్వు ఒకడిని కంటావ్.. నీ కొడుకు కూడా... పేదవాళ్ళు నలుగురిని కనాల
-
ప్రెస్ మీట్ మధ్యలో జగన్ కామెడీ.. పుష్ప శ్రీవాణితో బాబు మేనిఫెస్టో చదివించి..
-
అబ్బా కొడుకులిద్దరికి కలిపి చెప్తున్నా.. జగన్ స్ట్రాంగ్ రిప్లై
-
బాలయ్య అల్లుడికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. Yes Lokesh.. Both Are Not Same అని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇంత దారుణమైన పరిపాలన చంద్రబాబు ఓవైపు చేస్తూ.. మరోవైపు తన కొడుకు చేత Both are not the same అని పబ్లిక్ మీటింగ్స్లో డైలాగ్స్ చెప్పించడం ఏంటని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మిస్టర్ లోకేష్.. Yes, both can never be same. వెన్నుపోటుతో పార్టీని, పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి, ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. both can never be sameప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్. ఆరు నూరైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.పనులు చేసి చూపించడం మా స్టైల్. పబ్లిసిటీతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డం మీ స్టైల్. both can never be sameవిద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజలచెంతకే పాలన, గృహనిర్మాణం, మహిళా సాధికారిత, మహిళా రక్షణలో “దిశ’’లాంటి విప్లవాత్మక కార్యక్రమలు మాకున్న చరిత్ర. వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. both can never be sameఐదేళ్లలో పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇంటివద్దకే డీబీటీ కింద రూ.2.73 లక్ష కోట్లు ఇవ్వడం మా గవర్నెన్స్, రెండేళ్లలో 3.6లక్షలకోట్లు అప్పులు చేసి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను గాలికి వదిలేసి దోచేయడం మీ గవర్నెన్స్. both can never be sameబాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం. both can never be same అని అన్నారు. అలాగే, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని, నలుగురిని కనమంటున్నాడు. అలా కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబూ నువ్వు ఎందుకు కనలేదు? ఒక్కరితోనే ఎందుకు ఆపావ్? నీ కొడుకు లోకేష్ కూడా ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టాడు? నీకొడుకైనా నువ్వు చెప్తున్న దాన్ని పాటించాలి కదా?. నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా మూలనపడేశావు.మెడికల్ కాలేజీలకు, నాడు -నేడు స్కూళ్లకు డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదుకాని, అమరావతిలో బిల్డింగుల అద్దాలకు రూ.2,540 కోట్లు. ముగ్గురు నలుగురిని కంటే, వారికి కనీసం మంచి భోజనమైనా పెట్టే పరిస్థితి కుటుంబాలకు ఉంటుందా? వారి చదువులు ఏం కావాలి? వారి నాణ్యమైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది?. ముగ్గురు, నలుగుర్ని కనాలంటూ మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా చూడ్డం, వారిని చులకన చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇలా మాట్లాడటం తప్పు. మహిళలు బాగుంటనే కుటుంబాలు బాగుంటాయి’ అని చెప్పుకొచ్చారు. -
బాబు.. కేంద్రం గడ్డి పెట్టలేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తో పాటు ఇచ్చిన 143 హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. పెట్రోలు, డీజిలు రేట్లు తగ్గిస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కూడా చంద్రబాబుది వెన్నుపోటేనని అన్నారు. పెట్రోల్, డీజిల్పై కృత్రిమ కొరత సృష్టించింది ఎవరు?. సంక్షోభంలో కూడా స్కాములు చేశారు అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష పార్టీగా ఈ రెండేళ్లుగా మేం చంద్రబాబును అడుగుతున్నది ఏంటంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారు. వాటి సంగతి ఏమైందని మేమే కాదు, ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ఇది తప్పవుతుందా?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు ఎప్పుడు?. 2014-19 మధ్య చంద్రబాబుకు కోవిడ్ లాంటి గడ్డు పరిస్థితులు లేవు. కానీ, 2015 ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిలుపై లీటర్కు రూ.4ల చొప్పున అకారణంగా పెంచాడు. కానీ, మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల మధ్య, మేము గతంలో చంద్రబాబు పెంచిన దాని కన్నా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచాం. దానిమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నానా యాగీ చేశారు.పైగా మొన్న ఎన్నికలకు ముందు, అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీదున్న ట్యాక్స్లు తగ్గించి, వాటి రేట్లు తగ్గిస్తానంటూ చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటికే రూ.4లు లీటర్ పెట్రోల్, డీజిల్ మీద పెంచారు. చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారమే డీజిల్, పెట్రోల్పై రూ.8 తగ్గించాలి కదా?. ఇలా తగ్గించకపోగా సంక్షోభంలో కూడా స్కాములు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అందులో కూడా తనకు, తన వాళ్లకు సంపద పెంచుకునే ప్రయత్నం చేశాడు.ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరారు. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి తక్షణ చర్యలు తీసుకోలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా, వారి అవసరాలను తీర్చాల్సింది పోయి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్ లెట్ల నుంచి పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణం. ఇలాంటి మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా?. అసలు విషయాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ లేఖ రాసింది. రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని గడ్డిపెట్టింది’ అని చెప్పుకొచ్చారు. -
బాలకృష్ణ గన్ తో ఇద్దరిని టపా..టపా అంటూ కాల్చితే.. బాబు శవ రాజకీయాలుపై జగన్ కౌంటర్
-
సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్న చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు. సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా వెంటనే టాపిక్ను డైవర్ట్ చేస్తారు. అబద్ధాన్ని సృష్టించి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో అమరావతిలో అవినీతి మీద, ఇందాపూర్-హెరిటేజ్ సంబంధాలమీద, తిరుమల లడ్డూ విషయంలో, మహిళలపై వీళ్ల ఎమ్మెల్యేలు, చివరకు టీటీడీ ఛైర్మన్గా ఉన్న వ్యక్తి చేసిన వ్యవహారాల మీద, విచ్చలవిడిగా వీళ్లు చేస్తున్న మద్యం గంజాయి, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపైనా, ఇలా చంద్రబాబు ఇరుకునపడ్డ ఏ కంటెంట్ కూడా కనబడకుండా చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు.సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి, నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను అడ్డుపెట్టుకుని, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టా లాంటి హెడ్ క్వార్టర్స్కు నేరుగా ఈ పోలీసులే ఆ పోస్టులను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులను వాడుకుని అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్మిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంటున్నాయి.ప్రతి ఐదు లిక్కర్ బాటిళ్లలో ఒకటి కల్తీదే. బెల్టు షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్ను అమ్ముతున్నారు. బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయాలు రావడమే లేదు. అయినా పోలీసులు పట్టించుకోరు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదు. దిశ కార్యక్రమం ద్వారా మహిళలను రక్షణ కల్పించాం. గ్రామ సచివాలయాల్లోనే మహిళా పోలీసును పెట్టాం. కూటమి ప్రభుత్వంలో పరామర్శ కోసం మహిళలను అడ్డుకున్న తీరు అత్యంత హేయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ పేరు వింటే బాబు గుండె ఆగిపోతుంది..
-
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగ్లు చూడాలని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఏబీఎన్, టీవీ-5, చంద్రబాబు మాఫియా ముఠాగా మారారు. అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. హత్యా రాజకీయాలకు మేము బాధితులం.మా తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారు. మాపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారు. మా తాతగారు రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిగారిని చంపేశారు. వైఎస్సార్ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో ఉన్న రాజకీయ కోణం. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. ఈ కేసులో నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారు. ఎవరిది గొడ్డలి పారీ.. చంద్రబాబు చెప్పాలి. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగ్లు చూడాలి. తర్వాత నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారు. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?మా చిన్నాయన వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబుగారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే, పైగా తానే హత్య చేశానంటూ సాక్షాత్తూ టీవీ లైవ్ షోల్లో చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. పైగా చంద్రబాబుకు లాయర్ లూథ్రానే, దస్తగిరికీ లాయర్ లూథ్రానే. మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. రాజకీయ లబ్ధికోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం. వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నది ఇదే.చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు, బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్?. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్మెన్ను బండరాయితో మోది చంపేశారు?. పాపం ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణగారు యాక్సిడెంట్లో చనిపోతే, పరామర్శ కోసం అని పోయి, కేటీఆర్తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. మరి ఎవరివి శవ రాజకీయాలు?. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నది, ఆయన చనిపోయినట్టుగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఎవరివి కుట్ర రాజకీయాలు?.వేళ్లన్నీ చంద్రబాబు వైపే..వంగవీటి మోహనరంగాగారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుంటే, అర్థరాత్రి నరికి చంపేశారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్మీద దాడిచేసిన కేసులో “మల్లెల బాబ్జీ’’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్బాడీగా మారాడు. మల్లెల బాబ్జీ జేబులో ఒక లెటర్ దొరికింది. తనకు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి, చివరకు రూ.30వేలే ఇచ్చారని సారాంశం. అసలు ఎన్టీఆర్మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులోనూ వేళ్లు అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి.పింగళి దశరథ్రామ్ ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రికను పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి బస్సుదిగి, రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడిచేసి చంపేశారు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఒక పుస్తకంలో రాసినట్టు కూడా నాకు గుర్తు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం.జగన్ నైజం ఇది.. జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబూ నీకు 77 సంవత్సరాలు వచ్చాయి. బహుశా ఇది చివరి ఎన్నికలేమో. ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు. -
బాబు అమరావతి స్కాం తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే...!
-
మాయాబజార్ షూటింగ్.. స్టవ్ ఆన్ చేయకుండా చేపల పులుసు.. బాబుపై సెటైర్లు
-
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్లో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారు. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మావిగన్ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారు. భవన డిజైన్లకే రూ.401 కోట్లు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427?. వాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే ఇచ్చారు. ఫైవ్స్టార్ హోటల్స్కు కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే!. తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు?. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే’ అని తెలిపారు. జంగిల్ రాజ్గా రాష్ట్రం.. ప్రజల బాగోగులను చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు.


