breaking news
Irumudi Movie
-
ఇరుముడితో ఏం చెప్పాలనుకున్నారు?.. డైరెక్టర్కు సూటి ప్రశ్న
ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఒకటే పేరు వినిపిస్తోంది. అందరూ ఆ మూవీ గురించే చర్చించుకుంటున్నారు. యశ్ టాక్సిక్ రిలీజైనా కూడా ఇరుముడి గురించే ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఓ కూతురి తండ్రి ఎలా పెంచాలనే కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కించారని అంటున్నారు. ఈ మూవీ రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే వంద కోట్ల మార్క్ను సైతం దాటేసింది.అయితే ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఆడియన్స్ క్యూ కడతారు. అందులోని మైనస్ల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇరుముడికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అవీ పెద్దగా హైలెట్ కాలేదు. కానీ ఈ మూవీ సమాజానికి సందేశం ఇచ్చేలా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరమని అంటున్నారు ఓ ప్రముఖ వైద్యుడు ఉప్పలపాటి రామ్ వర్మ. ఇరుముడి డైరెక్టర్ తీరును ఆయన తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.డాక్టర్ తన ట్వీట్లో రాస్తూ..'ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే... సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి.. అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరో పక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి అదే శ్రీరామ రక్ష అంటాడు.. ఒకపక్క ధైర్యంగా మాట్లాడాలి అనే ఆడపిల్లను చంపేసి.. మరోపక్క భయంతో నిజాలను దాచేసి తన జీవితాన్ని ఓ ఎమ్మెల్యే చేతిలో నాశనం చేసుకొన్న మరో ఆడపిల్ల' అంటూ రాసుకొచ్చారు.అసలు ఇరుముడి మూవీతో డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ సినిమా చూసిన పిల్లలు రియల్ లైఫ్లో నిజం మాట్లాడినా.. బయటకు చెప్పినా చంపేస్తారేమోనన్న భయం, అనుమానం కలగదా..? ఇద్దరు ఆడపిల్లల జీవితాలను విచ్ఛిన్నం చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఈ డైరెక్టర్..? ధైర్యంగా ఉండే ఆడపిల్ల చనిపోకుండా ఉండింటే చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్లుగా ఉండేది కదా.. ఇదంతా సినిమా... సినిమాను సినిమాలా చూడాలని నీతులు చెప్పకండి అంటారు.. కానీ సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి కదా? అని పోస్ట్ చేశారు. మరి దీనిపై దర్శకుడు శివ నిర్వాణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే...సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరోపక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి… pic.twitter.com/Zdan8y6haL— Uppalapati Ramvarma (@DRRamvarma22) August 26, 2026 -
నిన్న రామ్చరణ్...నేడు చిరంజీవి... ‘ఇరుముడి’పై ‘మెగా’ ప్రశంసలు
ఇరుముడి.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై రష్మిక, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఎక్స్ వేదికగా తమ రివ్యూని ఇచ్చారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించానన్నారు. ఈ మేరకు ఎక్స్లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. (చదవండి: 'ఇరుముడి' సక్సెస్.. చరణ్ ప్రశంసలు)‘ఇరుముడి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నా ప్రియ సోదరుడు రవితేజకి హృదయపూర్వక అభినందనలు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించాను. రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. త్రినాథ్ పాత్రను తన భుజాలపై మోశాడు. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను భావోద్వేగంతో చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. బేబీ నక్షత్ర(ఈ చిత్రంలో రవితేజ కూతురుగా నటించింది)కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశీస్సులు. చిత్ర బృందానికి, నిర్మాతలకు, నవీన్ యెర్నేని, ఇతరులకు నా హృదయపూర్వక అభినందనలు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి’అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక చిరంజీవి ట్వీట్పై రవితేజ కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్య..థ్యాంక్యూ సో మచ్’ అని రీట్వీట్ చేశాడు. (చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!)ఇరుముడి విషయానికొస్తే.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా, బేబీ నక్షత్ర, సాయి కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఐదు రోజుల్లోనే రూ.108.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻Director @ShivaNirvana, you…— Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2026 -
ఇరుముడి హిట్తో రవితేజ దశ తిరిగిందా?
-
రవితేజ సార్ ఒక బాహుబలి.. నక్షత్ర క్యూట్ పొటాటో... Teacher అంటే స్వాసికానే..!
-
IRUMUDI పై డిస్ట్రిబ్యూటర్స్ కుట్ర..? మండిపడుతున్న Fans
-
నాకు యాక్టింగ్ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్
నటీనటుల ప్రతిభకు స్టార్డమ్తో సంబంధం ఉండదు. మంచి నటన ఎక్కడ కనిపంచినా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బాలనటి నక్షత్ర విషయంలో కూడా అదే జరిగింది. ‘ఇరుముడి’ చిత్రంలోని ఆమె నటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తుండగా.. ప్రముఖ తమిళ నటుడు ధనుష్ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోకాల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.వీడియో కాల్ చేసి ప్రశంసలు..నక్షత్ర నటనను చూసిన ధనుష్ స్వయంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారిని అభినందించడంతోపాటు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎప్పుడైనా మనం కలిసినప్పుడు నీ దగ్గర నటన నేర్చుకోవాలని ఉంది. చాలా అద్భుతంగా, అందగా నటించావు. నీ నటన నాకు చాలా నచ్చింది. ఎప్పుడైనా మనం కలుద్దాం. గ్రేట్ జాబ్ కన్నా.. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి’. అంటూ వీడియో కాల్లో మాట్లాడాడు. ఈ సమయంలో ఆ చిన్నారి ఇచ్చిన అమాయకరమైన, ఉత్సాహభరితమైన స్పందన కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. A cloud-nine moment for our little star ❤️The extraordinary @dhanushkraja Garu praised #Nakshatra for her performance and showered #Irumudi with appreciation ❤️🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/oJbwLVl3N0— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026 ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..! -
‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
ప్రస్తుతం అంతటా ‘ఇరుముడి’ ఫీవర్ నడుస్తోంది. చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ను సైతం షేక్ చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. తండ్రికూతురు సెంటిమెంట్కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఇదే సమయంలో మరో బాలనటి నటన.. ప్రేక్షకులను మత్రముగ్ధులను చేసింది. ఆమె మరేవరో కాదు బాలనటి నక్షత్ర. ఇరుముడి చిత్రం ద్వారా అందరిమనసులు దోచుకుంది ఈ బాలనటి . ఈ సినిమాలో ఆమెకి ఉన్న పాత్ర అలాంటిది మరి. మనమ్మపాత్ర సినిమాకు ప్రాణం అనే చెప్పాలి. ఇప్పటికే డైరెక్టర్ నుంచి హీరో వరకు ఆమె నటనకు ప్రశంసలు కురిపించారు. అయితే ఇరుముడిలో ఆమెకు ఎలా అవకాశం వచ్చింది, ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతని ఇప్పుడు హాట్టాపిగ్ మారింది.పారితోషికం ఎంతంటే..ఆమె ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుండగా, దర్శకుడు ఆమె తల్లిని సంప్రదించారట. హైదరాబాద్లో ఆడిషన్ ఇచ్చి, మనమ్మపాత్రకు ఎంపికయ్యారని అటు నక్షత్ర, ఇటు డైరెక్టర్ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక నక్షత్ర తీసుక్ను పారితోషికం విషయానికి వస్తే.. సుమారు రూ.10లక్షలు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర దక్కడంతో ఆ పాత్రకు తగినట్టుగానే మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: నాకు యాక్టింగ్ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్ -
'రవితేజను ఓ బూతు మాట అనాలి.. నా వల్ల కాలేదు'
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ దాటేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్తో పాటు అయ్యప్ప భక్తి తోడు కావడంతో థియేటర్ల వద్ద ఇరుముడి అదరగొడుతోంది.ఈ మూవీతో ఫేమస్ అయిన వాళ్లలో జబర్దస్త్ కమెడియన్ కొమురం ఒకరు. ఈ సినిమాలో ఏకంగా విలన్ పాత్రలో మెప్పించారు. ఒక్కసారిగా స్టార్ హీరో చిత్రంలో విలన్ రోల్ చేయడం నా కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేనని కొమురం అన్నారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కొమురం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కొమురం ఇరుముడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పెద్ద బ్యానర్లో నన్ను ఎలా తీసుకున్నారని మొదట నాకే అనుమానం వచ్చిందన్నారు. నా పాత్ర ఏదైనా చిన్న గే రోల్ ఉంటుందని భావించానని తెలిపారు. లుక్ టెస్ట్ కోసం పిలిస్తే మొదట తాను వెళ్లలేదన్నారు. షూట్కు వెళ్లే వరకు నా రోల్ ఏంటనేది కూడా తెలియదన్నారు. ఈ సినిమా పాత్రపై నాకు ఎక్కడా కూడా సంతృప్తిగా అనిపించలేదని తెలిపారు.కానీ డైరెక్టర్ శివ నన్ను పిలిచి మేకప్ వేసి మరి రెడీ చేశారు. నువ్వు సిగరెంట్, మందు తాగుతావు.. ఈ మూవీలో నువ్వు ఒక సైకోలా చేయాలని డైరెక్టర్ చెప్పారు. ఇదంతా విని నేను షాకయ్యా.. రవితేజ క్యారవాన్ దిగి రాగానే నాకు చెమటలు పట్టాయని అన్నారు. ఆయన రాగానే గళ్ల పట్టుకుని రవితేజను కొట్టాలని డైరెక్టర్ చెప్పారు.. ఇప్పటి వరకు నా లైఫ్లో ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. అదే సీన్లో రవితేజను ఒక బూతు మాట అనాలని కూడా చెప్పారు.. కానీ అప్పుడే నాలో భయం మొదలైందని కొమురం చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెద్ద హీరో కదా.. సింగిల్ టేక్లో చేయకపోతే బాగుండదని చెమటలు పట్టేశాయని కొమురం తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో నాగులు అనే విలన్ పాత్రలో కొమురం ఆకట్టుకున్నారు. -
'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అయినా సరే గత కొన్ని నెలల నుంచి జనాలు కొత్త సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. రవితేజ 'ఇరుముడి' కూడా నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతిచోట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి నోట తెగ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఆడుతున్న థియేటర్ ముందు ప్రజలు ధర్నా చేసిన విచిత్ర సంఘటన మాత్రం తెలంగాణలోని మక్తల్ అనే ఊరిలో కనిపించింది.(ఇదీ చదవండి: రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే అని)నారాయణపేట జిల్లాలోని మక్తల్లో ఉన్న వెంకటరమణ థియేటర్లో గత ఐదు రోజుల నుంచి 'ఇరుముడి' సినిమాని ప్రదర్శించారు. అయితే బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి దీనిని తీసేసి 'టాక్సిక్' వేశారు. థియేటర్కి దగ్గరకు వచ్చిన పలువురు ప్రజలు.. ఎలాగైనా 'ఇరుముడి' సినిమానే ప్రదర్శించాలని ధర్నాకు దిగారట. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గత మూడు, నాలుగు రోజులుగా చాలామంది టికెట్లు దొరక్క వెనుదిరిగామని, మంగళవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు థియేటర్కు వెళ్లినా టికెట్లు దొరకలేదని... అవసరమైతే కింద కూర్చొని అయినా సినిమా చూస్తామని సదరు ప్రేక్షకులు/ప్రజలు అంటున్నారు. ఎవరి ఒత్తిడితో లేదా ఎవరి సూచనతో మూవీని తీసివేశారో? వెంకటరమణ థియేటర్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ) -
రవితేజకి బ్యాడ్ టైం చిక్కుల్లో ఇరుముడి
-
స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ
రవితేజ 'ఇరుముడి' సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే రూ.200 కోట్ల మార్క్ అందుకుంటాదేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ చూసిన రష్మిక, విజయ్ దేవరకొండ, నాగార్జున తదితరులు చిత్రం అద్భుతంగా ఉందని చెబుతూ పోస్టులు పెట్టారు. ఇప్పుడీ ఈ లిస్టులోకి మెగాహీరో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే చరణ్.. 'ఇరుముడి' చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని, రవితేజ-మూవీ టీమ్ పడ్డ కష్టానికి ఈ ప్రశంసలు కచ్చితంగా అర్హమైనవి అని రాసుకొచ్చాడు. డైరెక్టర్ శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరిన్ని హిట్స్ కొట్టాలని చరణ్ ఆకాంక్షించాడు. చివరలో స్వామి శరణం అని బుధవారం ఉదయం ట్వీట్ చేశాడు.తండ్రికూతురు సెంటిమెంట్కి 41 రోజుల అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన సినిమా 'ఇరుముడి'. చాలామంది ఈ చిత్రం, ఇందులోని ఎమోషన్స్ చూసి కన్నీళ్లు పెటుకుంటున్నారు. జీవీ ప్రకాశ్ అందించిన పాటలు, శివ నిర్వాణ దర్శకత్వం కూడా ఈ మూవీకి మేజర్ ప్లస్ అయింది. రవితేజ కూడా గత చిత్రాల్లో కనిపించినట్లు కాకుండా సహజంగా నటించడం ప్రేక్షకులకు నచ్చింది.(ఇదీ చదవండి: రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే అని) -
రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే!
యష్ 'టాక్సిక్'.. తెలుగులోనూ రిలీజ్ కావడం సంగతేమో గానీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో థియేటర్ల గురించి తెగ చర్చ నడుస్తోంది. ఈ డబ్బింగ్ సినిమా కోసం బాగా ఆడుతున్న 'ఇరుముడి'ని అన్యాయంగా థియేటర్ల నుంచి తీసేస్తున్నారని, 'టాక్సిక్' కోసం వాటిని కేటాయిస్తున్నారని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మొత్తం డిస్కషన్ అంతా దీని గురించే జరుగుతోంది. అయితే ఇక్కడే ఓ చిత్రమైన విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' ట్విటర్ రివ్యూ)సాధారణంగా ఏ కొత్త సినిమా రిలీజైనా సరే దానికి ఎక్కువగానే థియేటర్లు లేదంటే షోలు కేటాయిస్తారు. ఇప్పుడు 'టాక్సిక్' విషయంలోనూ అదే జరిగినట్లు కనిపిస్తుంది. అంతెందుకు హైదరాబాద్లోని రవితేజ సొంత థియేటర్ అయిన 'ఏఆర్టీ సినిమాస్'లోనే ఈరోజు.. 'ఇరుముడి'(7) కంటే 'టాక్సిక్'కే ఎక్కువగా 12 షోలు కేటాయించారు. మరి రవితేజకు తెలియకుండా ఈ విషయం జరిగి ఉంటుందా? దీని బట్టి అర్థమైంది ఏంటంటే సినిమా సినిమానే.. వ్యాపారం వ్యాపారమే!ఒకటి రెండు రోజులు అయితే 'టాక్సిక్' టాక్ బట్టి ఈ సినిమాని థియేటర్లలో ఉంచాలా లేదంటే తీసేసి 'ఇరుముడి'కి ఇవ్వాలా అనేది డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకుంటారు. కానీ అంతలోనే సోషల్ మీడియాలో పెద్ద పంచాయతీ నడుస్తోంది. మరి ఈ రెండు మూవీస్లో ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఏది ముందంజలో నిలుస్తుందో చూడాలి? 'ఇరుముడి' సాధారణ టికెట్ రేట్లతో ప్రదర్శితమవుతోంది. 'టాక్సిక్'కి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.50, రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా
'ఇరుముడి' థియేటర్లలో అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మరో వారం వరకు ఈ జోరు ఉండొచ్చనిపిస్తోంది. రవితేజ సహా ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా హీరోకి కూతురిగా నటించిన నక్షత్ర అయితే అందరికీ తెగ నచ్చేస్తోంది. థియేటర్లలో ఇదలా ఉండగానే ఓటీటీలోకి ఈమె నటించిన ఓ మలయాళ థ్రిల్లర్ వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ చిత్రమేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్, పార్వతి ప్రధాన పాత్రలు చేసిన హీస్ట్ థ్రిల్లర్ 'ఐ నోబడీ'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. తాజాగా హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాంక్ దొంగతనంలో మాయమైన రూ.17 కోట్లు ఎక్కడికి పోయాయి? అనే స్టోరీతో ఈ సినిమాని తీశారు. ఇందులోనే నక్షత్ర.. హీరో కూతురిగా నటించింది. కొన్ని సన్నివేశాలే ఉన్నప్పటికీ ఆకట్టుకుంది.'ఐ నోబడీ' విషయానికొస్తే.. రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియట్లో పనిచేసే ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా(పార్వతి), ఇద్దరు కూతుర్లతో పెద్దగా హడావిడి లేకుండా బతికేస్తుంటాడు. ఓరోజు ఇదే ఊరిలో బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. అయితే అదే టైంకి బ్యాంక్లో ఉన్న రాజీవన్ని కొట్టి, దొంగలు తమతోపాటు కారులో బందీగా తీసుకొని వెళ్తారు.దారిలో రాజీవన్ని వదిలేయాలని దొంగలు అనుకుంటారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో రాజీవన్ బతికిపోయి దొంగలు స్పాట్లోనే చనిపోతారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. అంతా ఓకే గానీ దోపీడికి గురైన రూ.17 కోట్ల డబ్బు మాత్రం మాయం అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడుంది? ఎవరు తీశారు? ఇందులో రాజీవన్ హస్తం ఉందా? చివరకు పోలీసులు డబ్బు కనుగొన్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పృథ్వీరాజ్ 'ఐ, నోబడీ' సినిమా రివ్యూ) -
రవితేజ ఇరుముడి.. వంద కోట్లు వచ్చేశాయ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తాజాగా మరో క్రేజీ రికార్డ్ సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా సెంచరీ దాటేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేశారు.తండ్రీ, కూతురి కాన్సెప్ట్ ఆడియన్స్కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వందమార్క్ను కేవలం ఐదు రోజుల్లోనే చేరుకుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించారు. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. With the blessings of Lord Ayyappa and the love from the audience, #Irumudi hits a century ❤🔥❤🔥 100 CRORES GROSS WORLDWIDE 🔥🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/QSJF8T3GrC— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026 -
ఇరుముడిలో బేబీ నక్షత్ర హైలెట్.. మరి ఈ క్యూట్ అమ్మాయి ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
రవితేజ ఇరుముడి.. ఏ ఓటీటీకి రానుందంటే?
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రీ కూతుళ్ల కాన్సెప్ట్ ఆడియన్స్కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే ఇరుముడి వందకోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ న్యూస్ వైరల్గా మారింది. థియేటర్లలో అదరగొడుతున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఏదనే విషయంపై ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరుముడి ఓటీటీ పార్ట్నర్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత బుల్లితెరపై సందడి చేయనుంది. త్వరలోనే స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై ప్రకటన రానుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
ఇరుముడి సూపర్ హిట్.. బేబీ నక్షత్రకు బంపరాఫర్..!
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. హిట్ కావడంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు ఇరుముడి టీమ్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఇరుముడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మూవీ టీమ్ పంచుకుంది. ఈ ఈవెంట్లో బేబీ నక్షత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బేబీ నక్షత్రపై డైరెక్టర్ శివ నిర్వాణ సైతం ప్రశంసలు కురిపించారు.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అందరి కళ్లు బేబీ నక్షత్రపై పడ్డాయి. ఈ చిత్రంలో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర మెప్పించింది. దీంతో ఈ అమ్మాయికి ఇరుముడి మేకర్స్ బంపరాఫర్ ఇచ్చారు. భవిష్యత్తులో హీరోయిన్ అవ్వాలనే ఆసక్తి ఉంటే తమ బ్యానర్లో హీరోయిన్గా అవకాశమిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నక్షత్ర అద్భుతంగా నటించారని కొనియాడారు. తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ అవకాశం ఇచ్చారని బేబీ నక్షత్ర వెల్లడించింది.తండ్రి లేకపోయినా..ఈ మూవీలో అందరినీ ఆకట్టుకున్న బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తండ్రి లేరనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించిందని శివ నిర్వాణ వెల్లడించారు. తండ్రి లేని లోటును ఎదుర్కొంటూనే.. ఇంత చిన్న వయసులో ఆమె చూపిస్తున్న ధైర్యానికి నిజంగా అభినందనీయం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తల్లిని స్టేజ్పైకి తీసుకొచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా తన కూతురిని సపోర్ట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణకు నక్షత్ర తల్లి ధన్యవాదాలు తెలిపారు. -
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
చాలాకాలం తర్వాత రవితేజ ఖాతాలో హిట్ పడింది. శివ నిర్వాణ దర్శకత్వం ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్ని రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. రవితేజ, బేబీ నక్షత్రల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ తన కథ, కథనంతో అందరినీ ఎమోషనల్ గురి చేశాడని చెబుతున్నారు. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ రోజే ఈ చిత్రంపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని.. ఇరుముడి తన మనసుని ఎంతగానో హత్తుకుందని ట్వీట్ చేసింది.(చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)‘నిన్న నాకు ‘ఇరుముడి’ సినిమా చూసే అవకాశం లభించింది. అసలు ఎంత మంచి సినిమానో ఇది. ఊహించని విధంగా నా మనసును ఎంతగానో హత్తుకుంది. సాధారణంగా చిన్నతనంలో మనకేదైనా జరిగినా లేదా ఏదైనా మనల్ని బాధించినా, అమాయకత్వంతో మన మొదటి స్పందన పెద్దవాళ్లకు చెప్పడమే ఉంటుంది.. కానీ ఆ తర్వాతే అసలు నిజం అర్థమవుతుంది.. ఏం జరిగినా సరే నోరు మూసుకుని ఊరుకోవాలని మనకు చెబుతారు... ఈ సినిమా ఒక అద్భుతమైన సర్ప్రైజ్. కచ్చితంగా ప్రస్తావించాల్సిన, మాట్లాడాల్సిన ఒక విషయాన్ని ఈ చిత్రం ఎత్తిచూపింది. (చదవండి: ‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్లో వార్నర్)రవితేజ సర్, మీకు అభినందనలు.. ఈ విజయం సాధించినందుకు మీ తరఫున నేను ఎంతో సంతోషిస్తున్నాను.. నక్షత్రకు నా అభినందనలు.. సినిమాలో నువ్వు సూర్యకాంతిలా మెరిసావు, నీ నవ్వు నా పెదవులపై చిరునవ్వు నింపింది.. శివ నిర్వాణ గారికి శుభాకాంక్షలు.. మీరు ఈ విజయానికి అన్ని విధాలా అర్హులు.. మీ గురించి చాలా చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం మొత్తానికి అభినందనలు. ఇంతటి సుందరమైన చిత్రాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు’ అని రష్మిక ట్వీట్ చేసింది. Yesterday I had the opportunity to watch Irumudi.. ❤️What a beautiful film it is.. ❤️ it hit me in ways I didn’t see coming.. ❤️Generally when we grow up in small towns something happens to us or something bothers us our first response will be to tell our elders what happened… pic.twitter.com/lyntnD3bm3— Rashmika Mandanna (@iamRashmika) August 25, 2026 -
‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్లో వార్నర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతురు సెంటిమెంట్కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి మూవీ తీయండంతో డైరెక్టర్ శివ నిర్వాణ మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపంచాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఆ రవితేజ పాత్రలో ఊహించుకుంటున్నారు. ఇప్పుడీ ఫీవర్ అంతర్జాతీయస్థాయికి పాకింది.గతంలోనూ వైరల్..అయ్యప్ప మాల ధరించిన గెటప్లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్.. ఫ్యాన్ ఎడిట్ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది వైరల్గా మారింది. అయితే వార్నర్ అభిమానులకు ఇదే కొత్త కాదు. ఇంతకముందు తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు, పాటలకు ఎన్నో సార్లు తనదైన స్టైల్లో డైలాగ్లు చెప్పడం, స్టెప్పులు వేయడం వంటి చేశాడు. ఇలా చేయడంతో ఇంతక ముందు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. ఇప్పుడు అదే స్టైల్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో మరోసారి వైరల్గా మారాడు.ఇదీ చదవండి: 'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. ఎన్ని కోట్లు వచ్చాయ్? -
‘టాక్సిక్’ కోసం యశ్ ఎంత తీసుకున్నాడు? హీరోయిన్లకూ ఎక్కువే!
కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’తో రేపు(ఆగస్ట్ 26) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రాకింగ్ స్టార్ యశ్. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. 1940 నుంచి 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగే మాఫియా ప్రపంచాన్ని ఇందులో చూపించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.యశ్ 'రాయ' అనే పవర్ఫుల్ మాఫియా పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే అందులో యశ్ పారితోషికం కూడా భారీగానే ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 50 కోట్లను తీసుకున్నాడట. అంతేకాదు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లాభాల్లోనూ యశ్కి వాటా రాబోతుంది. ఇలా నిర్మాతగా, నటుడిగా మొత్తంగా రూ. 100-120 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందట. యశ్తో పాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్లకు కూడా భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారట. కియారా అద్వానీ రూ. 15 కోట్లు, నయనతార రూ. 15-18 కోట్లు, హ్యూమా ఖురేషి రూ. 2 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్ రుక్ష్మిణి వసంత్ కూడా రూ. 3 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
విలన్గా మెప్పించిన జబర్దస్త్ నటుడు
జబర్దస్త్ అనగానే కామెడీ, పంచులు, విభిన్నమైన గెటప్స్ గుర్తుకొస్తాయి. ఆ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన వారు ఉన్నారు. అదే షోతో వివాదాలపాలు అయినవారూ ఉన్నారు. అలా దగ్గరయిన వారే కొమురం. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు లేడీ గెటప్స్తో అలరించిన ఆయన.. యాంకరింగ్ చేస్తూ కూడా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమాలో కొమురం కాస్త నాగులుగా కనిపించి మరో సారి ప్రేక్షకులను ఆశ్చర్చపరిచాడు.మరో కోణం..కామెడీతో నవ్వించిన నటుడు.. సీరియస్ విలనిజంలో మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ ఇది కూడా సాధ్యం అవుతుందని కొమురం నిరూపించాడు. రవితేజ హీరోగా వచ్చిన ‘ఇరుముడి’ సినిమాలో నాగులుగా కనిపించాడు. సీరియస్ బాడీ లాంగ్వేజ్, హావాభావాలు, డైలాగ్ డెలివరీతో విలన్ పాత్రకు న్యాయం చేశాడు. కామెడీగా పరిచయం అయిన ప్రేక్షకులకు సినిమాలో నెగెటివ్ షేడ్లో కనిపించి తనలోని మరో కోణాన్ని చూపించాడు. దాదాపు 12 సంవత్సరాలు కొమురక్క పాత్రలో కనిపించి ఒక్కసారిగా విలన్గా మారిన తన అనుభవాన్ని, తనకు ఈ అవకాశమిచ్చిన వారికోసం మూవీ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ డైరెక్టర్తో సహ అక్కడ ఉన్న వారిని కంటితడి తెప్పించాడు.నా ఫోన్ మోగుతూనే ఉంది..‘ నన్ను చాలా మంది అవమానించారు. నాతో కలిసి రూమ్లో ఉన్న దాదాపు 15మంది డైరెక్టర్స్ అయ్యారు. నాకోసం వారికి పూర్తిగా తెలుసు. కానీ వాళ్లు నాలో నటుడిని మాత్రం గుర్తించలేకపోయారు. శివ నిర్వాణ ఎవరో తెలీదు. కానీ ఈ పాత్ర ఇచ్చారు. మూడు రోజుల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ డైరెక్టర్ వల్లే కొమురక్క నుంచి నాగులుగా మారిపోయా. 12 ఏళ్లగా నన్ను చూసిన భార్య ‘ఇరుముడి’ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయింది. నేను మరణించే వరకు శివ నిర్వాణ అన్నను మర్చిపోను. ఒక వేళ మర్చిపోతే మనిషినే కాను’ అంటూ భావోద్వేగానికి గురవుతూ మాట్లాడాడు.ప్రశంసల వెల్లువమొత్తానికి ఇప్పటి వరకు నవ్వించిన కొమరం.. నాగులుగా మెప్పించాడు. కామెడీ నటుడిగా ముద్ర పడిన ఓ ఆర్టిస్ట్.. చాలా అనుభవం ఉన్న సీరియస్ నెగిటివ్ రోల్లో నటించి తన సత్తా చాటుకోవడం విశేషమనే చెప్పాలి. అటు తన నటన చూసిన ప్రేక్షకులు సైతం అతన్ని మెచ్చుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: డూప్నకు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్..! -
ఇరుముడి సక్సెస్పై రవితేజ పవర్ఫుల్ స్పీచ్
-
అయ్యప్ప వారం మొదలైంది! ఇరుముడికి కలెక్షన్ల జోరు
-
'ఇరుముడి'లో ఆ సీన్స్ తొలగించాలి: ఏపీ టీచర్లు
ప్రభుత్వ స్కూల్క్, టీచర్లని కించపరిచేలా 'ఇరుముడి'లో ఉన్న సీన్స్ తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శకులు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్)'సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం సినిమా. ఒక పాత్రని తెరపై ఎలా చూపిస్తారో అదే ముద్ర సమాజంలో మిగిలిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు లాంటి అంశాలని సినిమాలో చూపించేటప్పుడు దర్శకులు కాస్త బాధ్యతతో వ్యవహరించాలి. 'ఇరుముడి'లో గవర్నమెంట్ స్కూల్ లేడీ టీచర్ పాత్రని నెగిటివ్గా చూపించారు. ఇది కేవలం కల్పిత పాత్ర కాదు. ఆమె వెనక ఏపీలోని ఓ పాఠశాల కనిపిస్తోంది. పిల్లలు వేసుకున్న యూనిఫామ్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేసుకునే యూనిఫామ్ ఒక్కటే. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జిల్లా పరిషత్తు పాఠశాల పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీసిన ఈ సినిమా ఉపాధ్యాయ వృత్తిని, పాఠశాల విద్యా వ్యవస్థను కించపరిచే విధంగా ఉంది' అని పేర్కొన్నారు.సినిమా అద్భుతంగా ఆడుతున్న టైంలో ఇలాంటి విషయం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. విచిత్రం ఏంటంటే సోమవారం జరిగిన సక్సెస్ మీట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించిన దర్శకుడు శివ నిర్వాణ.. తాను కూడా గతంలో టీచర్గా పనిచేశానని, ఈ వృత్తిలో ఉన్న బ్యాడ్ సైడ్ చూపించానని చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయం ఎక్కడివరకు వెళ్తుందనేది చూడాలి?(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ) -
మరో క్రేజీ ప్రాజెక్ట్తో రవితేజ, శ్రీ విష్టు మల్టీస్టారర్ మూవీ.!
మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ విజయం మంచి ఊరటనిచ్చింది. వరుస పరాజయాలతో కొంతకాలంగా సతమతమవుతున్న ఆయనకు ఈ సినిమా ఓ విజయాన్ని తెచ్చిపెట్టింది. తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి కళ్లు చెదిరే కలెక్షన్లు రాబెట్టింది. ఇప్పుడు రవితేజ తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది.త్వరలో హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణుతో కలిసి రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఫుల్ ఎంటర్టైనర్గా తీయబోయే ఈ సినిమాను దిల్రాజు నిర్మాతగా ఉండనున్నట్లు టాక్. ఈ సినిమాను తొలిత ఆగస్టు చివరిలో ప్రారంభించాలని మేకర్స్ భావించారట. కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. -
ప్రేక్షకుల స్పందనతో కళ్లు చెమర్చాయి: రవితేజ
‘‘ఇరుముడి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. 20 ఏళ్ల క్రితం థియేటర్కి వచ్చిన వాళ్లు ఇప్పుడు మళ్లీ ‘ఇరుముడి’కి థియేటర్కి రావడం భావోద్వేగంగా అనిపించింది’’ అని హీరో రవితేజ చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జోడీగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం(ఆగస్టు 21) విడుదలయింది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్బస్టర్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ–‘‘ఇరుముడి’ చూస్తున్నప్పుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్తో ఆటోమేటిక్గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిర్మాతలు రవి, నవీన్లతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాతో ఇంత మంచి సినిమా చేసినందుకు శివ నిర్వాణకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో కావేరిలాంటి పాత్ర ఇచ్చినందుకు శివ నిర్వాణగారికి ధన్యవాదాలు’’ అన్నారు ప్రియా భవాని శంకర్. ‘‘ఈ సినిమాకి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది’’ అని వై. రవిశంకర్ పేర్కొన్నారు. ‘‘ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని నవీన్ యెర్నేని తెలిపారు. నటుడు సాయికుమార్, నటి స్వసిక, బేబీ నక్షత్ర, కెమెరామేన్ విష్ణు శర్మ, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు మాట్లాడారు. -
ఇరుముడిలో బేబీ నక్షత్ర.. ఇంత కన్నీటి కథ ఉందా?
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సలబ్రేషన్స్ చేసుకుంది. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు ఇరుముడి టీమ్ అంతా హాజరైంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ మూవీలో అందరినీ ఆకట్టుకున్న బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తండ్రి లేరనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించిందని శివ నిర్వాణ వెల్లడించారు. తండ్రి లేని లోటును ఎదుర్కొంటూనే.. ఇంత చిన్న వయసులో ఆమె చూపిస్తున్న ధైర్యానికి నిజంగా అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా బేబీ నక్షత్ర తల్లిని స్టేజ్పైకి తీసుకొచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా తన కూతురిని సపోర్ట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణకు నక్షత్ర తల్లి ధన్యవాదాలు తెలిపారు. -
'12 ఏళ్ల కొమురక్క.. ఇప్పుడు నాగులు.. అంతా మీ వల్లే'
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సలబ్రేషన్స్ చేసుకుంది. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు ఇరుముడి టీమ్ అంతా హాజరైంది.ఈ మూవీలో జబర్దస్త్ కమెడియన్ కొమురం కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నాగులు అనే పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన కొమురం ఎమోషనల్ అయ్యారు. గత 12 ఏళ్లుగా కొమురక్కగా బతుకుతున్న నాగులుగా మార్చిన ఘనత శివ నిర్వాణకే దక్కుతుందన్నారు. ఈ అవకాశమిచ్చిన ఆయనకు తన జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. కొమురం మాటలు విన్న డైరెక్టర్ శివ నిర్వాణ సైతం ఎమోషనల్ అయ్యారు.ఈవెంట్లో కొమురం మాట్లాడుతూ..'నన్ను చాలా మంది అవమానపరిచారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నాతో కలిసి ఓకే రూమ్లో ఉన్న 15 మంది డైరెక్టర్స్ అయ్యారు. నేను ఎలా నటిస్తానో కూడా వాళ్లకు తెలుసు. కానీ వాళ్లు నాలో నటుడిని మాత్రం గుర్తించలేకపోయారు. శివ నిర్వాణ అన్న ఈ పాత్ర ఎందుకిచ్చారో నాకు తెలియదు. మూడు రోజుల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ రోజు మీ వల్లే కొమురక్క నుంచి నేను నాగులుని అయిపోయా. నేను చచ్చే వరకూ శివ నిర్వాణ అన్నను మర్చిపోతే నేను మనిషినే కాదు' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.ఇంకా మాట్లాడుతూ..' మొదటి రోజు షూటింగ్కు వెళ్లినప్పుడు నాది గే పాత్ర అనుకున్నా. కానీ, రవితేజగారిని కొట్టే ఫైట్ అని తెలిశాక చెమటలు పట్టాయి. ఈ మూవీలో ఆ సీన్ చూసి ఏడు ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఫోన్ చేశారు. మన ఇండస్ట్రీలో వందమంది హీరోలు ఉంటే.. 100 రకాల ఫ్యాన్స్ ఉంటారు. ఆ 100 రకాల ఫ్యాన్స్ ఇష్టపడే ఏకైక హీరో మన రవితేజనే. నా జీవితంలో బతుకు భరోసా ఇచ్చిన పాత్రే ఈ నాగులు. 12 ఏళ్లుగా కొమురక్క గెటప్లో బతుకుతున్నా. ఆ గెటప్ నిజంగా లెజెండ్.. కానీ అది నేను కాదు. అదొక గెటప్ మాత్రమే' అని అన్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రవితేజ ‘ఇరుముడి’ సక్సెస్ సెలబ్రేషన్స్.. (ఫొటోలు)
-
'ఇరుముడి'లో విలనిజం.. ఈ నటిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
రవితేజ 'ఇరుముడి'కి తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఓ మాదిరి హైప్తోనే థియేటర్లలో రిలీజైనప్పటికీ.. తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. సెకండాఫ్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి కళ్లు చెదిరే వసూళ్లు సొంతం చేసుకుంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. కలెక్షన్స్ పోస్టర్ని అధికారికంగా పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ)రిలీజైన మూడు రోజుల్లో రూ.80 కోట్లకు పైగా వసూళ్లని 'ఇరుముడి' సొంతం చేసుకుందని వెల్లడించారు. టికెట్ రేట్ల పెంపు లేదు, పండగల సీజన్ కూడా కాదు. అయినా కానీ తొలి వీకెండ్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ చిత్రంగా ఇది నిలిచిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ మేరకు రెండు పోస్టర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.గత మూడు రోజులుగా అదరగొడుతున్న 'ఇరుముడి'.. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా టికెట్ బుకింగ్స్లో మంచి జోష్ చూపిస్తోంది. ప్రస్తుత టాక్ బట్టి చూస్తే సోమవారం నాటికి రూ.100 కోట్ల మార్క్ సులభంగా దాటేయొచ్చు. రెండు రోజుల్లో 'టాక్సిక్' రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు వసూళ్లు కాస్త నెమ్మదించే అవకాశముంది. మరి లాంగ్ రన్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్)TELUGU CINEMA IS WITNESSING ITS BIGGEST BLOCKBUSTER💥🔥Fastest-ever 80 CR+ GROSS for a regional film 🔥RAVANNA’S BOX-OFFICE RAMPAGE ❤️🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/ENLLEXWHJo— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2026 -
దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్
దేవుడు అంటే నమ్మేవాళ్లు ఉన్నట్లే.. నమ్మని వాళ్లు కూడా ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. అయితే కొన్నిసార్లు డెస్టినీ చాలా చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సీన్ రిపీటైంది. అసలు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేని రవితేజకు అదే దేవుడి వల్ల దాదాపు నాలుగేళ్ల తర్వాత హిట్ దక్కింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ)రవితేజ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. తండ్రీకూతురు సెంటిమెంట్కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి తీశారు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన అందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా జనాలు తెగ చూస్తున్నారు.అయితే సినిమాలో కూతురి సెంటిమెంట్ ఎంతలా ఆకట్టుకుంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూవీలో చివరి అరగంట చాలామంది ప్రేక్షకుల్ని ఏడిపించేసింది. అదే టైంలో అయ్యప్ప స్వామి నేపథ్యం, రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపించాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఇందులో చూసుకున్నారంటే అతిశయోక్తి లేదు.అయితే 'ఇరుముడి'లో అయ్యప్ప భక్తుడిగా ఆకట్టుకున్న రవితేజ.. నిజజీవితంలో దేవుడిని పెద్దగా నమ్మడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా చెప్పాడు. మూడేళ్ల క్రితం 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ రిలీజ్ టైంలో హిందీలో ఓ యూట్యూబర్కి రవితేజ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే మాట్లాడుతూ.. 'రోజూ పూజ చేయడం, దేవుడి ప్రతిమలని ఆరాధించడం లాంటి వాటిని నేను నమ్మను. ప్రకృతే నాకు దేవుడితో సమానం' అని రవితేజ అన్నాడు. ఇప్పుడు అదే రవితేజ 'ఇరుముడి' అనే భక్తి చిత్రంతో నాలుగేళ్ల తర్వాత ఓ సక్సెస్ అందుకోవడం డెస్టినీ(విధి) అనుకోవాలేమో!(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ) -
‘ఇరుముడి’ రెండో రోజూ జోరు.. కలెక్షన్లు ఎంతంటే..!
రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. శనివారం రెండో రోజు కూడా భారీ వసూళ్ల రాబట్టింది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్లు సాధించినట్లు సాక్నిల్క్ నివేదిక అంచనా వేసింది. రెండో రోజు కూడా ఇండియాలో రూ.16.10 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.31.40కు చేరాయి. గ్రాస్ వసూళ్లు రూ.36.45 కోట్లుగా ఉన్నాయి.ఆంధ్ర, తెలంగాణలో 15.75 కోట్లు రాగా.. కర్ణాటక నుంచి రూ.2 కోట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో అతి తొందరలోనే ‘ఇరుముడి’ ప్రపంచ వ్యాపంగా రూ.50 కోట్లక్లబ్లోకి చేరే అవకాశముందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. -
రవితేజ ఇరుముడి.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది.తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం రిలీజైన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీగా నిలిచింది. విడుదలైన రెండు రోజుల్లోనే నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటివరకు ఓవర్సీస్లో రవితేజకు ఉన్న రికార్డును ఇరుముడి బ్రేక్ చేసింది. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టడంతో రాబోయే రోజుల్లో ఇరుముడి మరిన్ని రికార్డులు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది.కాగా.. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించింది. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
ఇరుముడి మీ మనసులో నిలిచిపోతుంది: రవితేజ
‘‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా మీద మాకు మొదటి నుంచి అంత నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ తమిళనాడులో కూడా ఉండాలని కోరుకున్నాను. శివ నిర్వాణ అద్భుతంగా తీశాడు. ఈ సినిమాని మీతోపాటు మీ మనసులో పెట్టుకుంటారు’’ అని రవితేజ చెప్పారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా, బేబీ నక్షత్ర కీలకపాత్రలో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 21) విడుదలైంది. శనివారం చెన్నైలో నిర్వహించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్బస్టర్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘నాకు తమిళ సినిమాతో చాలా అనుబంధం ఉంది. నటుడిగా నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది’’ అని తెలిపారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘తమిళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘ఇరుముడి’ కథ అనుకున్నప్పుడే తమిళ్లో విడుదల చేయాలనుకున్నాం’’ అన్నారు.‘‘ఇరుముడి’ చిత్రాన్ని ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియా భవానీశంకర్ చెప్పారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుందని ఆశించామో దానికి మూడు రెట్లు ఎక్కువ విజయాన్ని అయ్యప్ప స్వామి మాకు అందించారు’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్కుమార్, బేబి నక్షత్ర మాట్లాడారు. -
'ఇరుముడి'తో జాక్పాట్ కొట్టిన రవితేజ
చాన్నాళ్ల తర్వాత హీరోగా రవితేజ హిట్ కొట్టాడు. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'ఇరుముడి'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో షోలన్నీ ఫుల్ అవుతున్నాయి. దీంతో రవితేజ ఫుల్ హ్యాపీస్. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ఇతడు తక్కువే రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ అదిరిపోయే జాక్ పాట్ కొట్టినట్లు మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమాలో నటించినందుకుగానూ రవితేజ.. సాధారణంగా అందుకునే పారితోషికంలో మూడో వంతు మాత్రమే తీసుకున్నాడట. అదనంగా నైజాం థియేట్రికల్ హక్కులు దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ దక్కేసరికి రవితేజ రెగ్యులర్గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువనే రాబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.20 కోట్ల వరకు రవితేజకు దక్కనున్నట్లు సమాచారం.'ఇరుముడి' విషయానికొస్తే.. సీలేరు దగ్గర పల్లెటూరిలో ఉండే త్రినాథ్ (రవితేజ) లగేజీ ఆటో డ్రైవర్. భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్), కూతురు మణి(నక్షత్ర)తో కలిసి హ్యాపీగా బతికేస్తుంటాడు. ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటాడు. ఏం జరిగినా తనతో చెప్పాలని కూతురితో చెబుతాడు. ఆమె కూడా ప్రతిదీ నాన్నకు చెబుతూ ఉంటుంది. త్రినాథ్ అయ్యప్ప మాల వేసిన తర్వాత తాను చదువుతున్న స్కూల్లో జరుగుతున్న ఓ సంఘటన గురించి కూతురికి తెలుస్తోంది. దానిని ఎలాగైనా నాన్నకు చెప్పాలనుకుంటుంది. ఇంతకీ మణి చెప్పాలనుకుంటున్న విషయమేంటి? త్రినాథ్కి వాటి గురించి ఎప్పుడు ఎలా తెలిసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
‘ఇరుముడి’కి అదిరిపోయే ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్లు ఇవే
రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. విడుదలైన తొలిరోజుకే భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.14.80 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించినట్లు సాక్నిల్క్ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది.ఏపీ తెలంగాణ నుంచే రూ.15 కోట్లుతొలిరోజు ‘ఇరుముడి’ వసూళ్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.15కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంచనా. కర్ణాటక నంచి 1.5 కోట్లు, తమిళనాడు నుంచి రూ.34 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి 36 లక్షలు వసూళయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్ రూ.17.20 కోట్లకు చేరింది. ఓవర్సీస్లో రూ.7 కోట్ల గ్రాస్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రూ.24.20 కోట్లకు చేరాయి. -
ఇరుముడిలో మరో ఎడిట్.? జోరుగా టికెట్ బుకింగ్
-
రవితేజ ఇరుముడి.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ
రవితేజ ఇరుముడిపై యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ ప్రత్యేకమని ఆయన కొనియాడారు. ఈ సినిమా మీ అంతరాత్మను చాలా లోతుగా టచ్ చేస్తుందని తెలిపారు. ఈ కథ ఒక స్వచ్ఛమైన భావోద్వేగం, భక్తితో జరుపుకునే వేడుక అని అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు. మాస్ మహారాజా రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశారు. ఈ మూవీ తప్పకుండా చూడాలని అభిమానులను కోరారు. సూపర్ హిట్ సాధించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఓ థియేటర్లో ఏకంగా మల్లెపూల సాంగ్ వచ్చినప్పుడు హారతులు కూడా పట్టారు. కాగా..ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. It’s a pure celebration of EMOTION and DEVOTION. 🔥 MASS MAHARAJA RAVI TEJA sir, BABY NAKSHATRA & SIVA NIRVANA take us on a unforgettable emotional ride. ❤️IRUMUDI is truly one of a kind for this generation, a film that touches something deep within you and stays with you even…— Sandeep Reddy Vanga (@imvangasandeep) August 21, 2026 -
“ఇరుముడి మూవీపై జెన్యూన్ పబ్లిక్ టాక్.. IMAXలో ప్రేక్షకుల రియాక్షన్!”
-
‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఇరుముడినటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర తదితరులునిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మఎడిటింగ్: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఆగస్ట్ 21,2026వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ.. రవితేజ ఖాతాలో ఓ మంచి హిట్ పడి చాలా కాలమైంది. దీంతో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనూ గతంలో ఉన్నంత ఆసక్తి, అంచనాలు కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత రవితేజ నటించిన ఓ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయిందంటే అది ‘ఇరుముడి’ అనే చెప్పాలి. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఇంతటి హైప్ మధ్య నేడు(ఆగస్ట్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ ఎలా ఉంది? ఈ చిత్రంలో రవితేజ హిట్ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, సీలేరు ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన త్రినాథ(రవితేజ) అరటిపళ్ల వ్యాపారం చేస్తుంటాడు. భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ అలియాస్ మణెమ్మ (బేబీ నక్షత్ర) అంటే అతనికి ప్రాణం. ప్రతి ఏడాది అయ్యప్పమాల ధరించిన 41 రోజులు తప్ప.. మిగతా రోజులన్నీ తాగుతూనే ఉంటాడు. ఊర్లో ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన.. త్రినాథ్ ఊరుకోడు. దానివల్ల త్రినాథ్కు చాలా మంది శత్రువులు ఏర్పడతారు. మరోవైపు ఊర్లో ఐదో తరగతి వరకు మాత్రమే ఉండడంతో హైస్కూల్ కోసం కూతురిని సీలేరుకు పంపిస్తాడు. ఆ స్కూల్ టీచర్(స్వసికా) స్టూడెంట్స్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంటుంది. అదే సమయంలో ఆ స్కూల్లో చదువుకునే అమ్మాయిలు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని నిజాలు మణికంఠకు తెలుస్తాయి. ఆవేంటి? ప్రతి విషయాన్ని తండ్రితో చెప్పే మణికంఠ.. ఆ విషయాలను కూడా తండ్రికి చెప్పిందా? ఆ విషయం తెలిసిన తర్వాత త్రినాథ్ ఏం చేశాడు? గురుస్వామి గోపరాజు (సాయికుమార్)తో త్రినాథ్ అనుబంధం ఎలా ఉంది? త్రినాథ్ మాలలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి? తన కూతురుకు జరిగిన అన్యాయానికి త్రినాథ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..మాస్ మహారాజా రవితేజను అయ్యప్పమాల నేపథ్యంలో చూపిస్తామని ప్రకటించినప్పటి నుంచే ‘ఇరుముడి’పై ఆసక్తి మొదలైంది. రవితేజ మాస్ ఇమేజ్కు పూర్తి భిన్నమైన భక్తి నేపథ్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఎలా డీల్ చేశారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ విషయంలో దర్శకుడు తనదైన మార్క్ చూపించారు. అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని తీసుకుని ఓ కుటుంబ కథను రాసుకున్న ఆయన.. దానికి క్రైమ్ ఎలిమెంట్ను జోడించి కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచారు.ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కథకు తగ్గట్టుగా మిక్స్ చేయడం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను దర్శకుడు బలంగా రాసుకున్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేయడంతో పాటు.. పిల్లలను ఎలా పెంచాలి, వారి విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అనే విషయాలను ఇందులో చర్చించారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి.భక్తి నేపథ్యం ఉన్నప్పటికీ ‘ఇరుముడి’ పూర్తిగా భక్తి చిత్రంగా మారిపోలేదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. రొటీన్ స్టోరీనే అయినా.. స్క్రీన్ప్లేను నడిపించిన విధానం ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలను కథలో మిళితం చేసిన విధానం సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది.స్కూల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టే టీచర్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత రవితేజ ఎంట్రీ, భార్య-కూతురితో ఆయనకున్న అనుబంధం, కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలు ఫస్టాఫ్ సాగుతుంది. అయితే ఫస్టాఫ్ పూర్తిగా పాజిటివ్గా ఉందని చెప్పలేం. ముఖ్యంగా స్కూల్ ఎపిసోడ్స్లో కొన్ని సన్నివేశాలు ఒకే తరహాలో రిపీట్ కావడం, కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ లోపాలను అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలు కొంతవరకు కవర్ చేశాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కథను ముందుకు తీసుకెళ్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. సినిమాకు సంబంధించిన ప్రధాన ఎమోషన్ను క్లైమాక్స్లో బలంగా క్యారీ చేయడంలో దర్శకుడు మంచి ప్రభావాన్ని చూపించారు.అయితే ‘ఇరుముడి’లో లోపాలు కూడా లేకపోలేదు. దర్శకుడు కథను నమ్మి కొన్ని సందర్భాల్లో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలు లాజిక్కు దూరంగా అనిపించడంతో పాటు.. మరికొన్ని చోట్ల కథనం మరింత సహజంగా ఉండాల్సిందనే భావన కలుగుతుంది. మొత్తంగా ‘ఇరుముడి’ భక్తి నేపథ్యాన్ని కమర్షియల్ కథతో ముడిపెట్టిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎవరెలా చేశారంటే.. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్కు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించాడు. సాధారణ మధ్యతరగతి తండ్రి త్రినాథ్ పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా అన్ని రకాల సన్నివేశాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తండ్రిగా భావోద్వేగాలను పలికించిన సన్నివేశాల్లో రవితేజ నటన మెప్పిస్తుంది.ప్రియా భవానీ శంకర్ మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో సహజంగా నటించింది. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాలను తన నటనతో చక్కగా చూపించింది. ఇక ఈ సినిమాకు బేబీ నక్షత్ర ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఆమె పాత్ర చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది. కీలక సన్నివేశాల్లో నక్షత్ర అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.జబర్దస్త్ కొమరం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన మార్క్ చూపించాడు. సీరియస్ సన్నివేశాల్లోనూ మెప్పిస్తూ పాత్రకు న్యాయం చేశాడు. ఇక గురుస్వామి పాత్రలో సాయి కుమార్ అనుభవం కనిపిస్తుంది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే ‘ఇరుముడి’ పాట, సెకండాఫ్లో వచ్చే ‘మల్లె పూల’పాటు అయ్యప్ప భక్తులకు పూనకాలు తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
థియేటర్లలో అభిమానుల హారతులు
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. నేడు( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మల్లెపూల పల్లకి పాట వచ్చిన సమయంలో అభిమానులు తెరలకు హారతులు ఇస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరలవుతున్నాయి. Swamy sharanam 🙏 #Irumudi pic.twitter.com/0Zlo9Mkz5G— RTR (@natweetsnaistm) August 21, 2026 -
‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?
-
తెలుగు రాదు కానీ డబ్బింగ్ చెప్పాను: నక్షత్ర
రవితేజ, ప్రియా భవానీశంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బేబీ నక్షత్ర మాట్లాడుతూ– ‘‘మా స్వస్థలం కేరళ. ప్రస్తుతం ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఇప్పటివరకు నేను ఆరు సినిమాల్లో నటించాను.ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాను. ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీశంకర్గార్ల కుమార్తె మణికంఠ పాత్రలో నటించాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నన్ను చూసి, శివ నిర్వాణగారు ఈ సినిమాకు ఎంపిక చేశారు. నాకు తెలుగు రాకపోయినా సెట్స్లో ఆయన చాలా హెల్ప్ చేశారు.శివగారి సపోర్ట్తోనే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పాను. నా చిన్న వయసులోనే శివరాజ్కుమార్, పృథ్వీరాజ్, రవితేజగార్ల వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాను. ఇందుకు మా అమ్మగారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే మా టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు’’ అని చెప్పింది. -
ఇరుముడి సెన్సార్ టాక్ ఇదే!
-
'ఇరుముడి' సంగీతం ఓ సవాల్
‘‘ఇరుముడి’ సినిమాలో భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ... ఇలా అన్ని భావోద్వేగాలున్నాయి. వాటన్నింటినీ మ్యూజికల్గా బ్యాలెన్స్ చేశాను. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం సవాల్గా అనిపించింది’’ అని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ చెప్పాడు. రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు చేసిన సినిమా ఇది. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు(ఆగస్టు 21) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.‘‘శివ నిర్వాణ ‘ఇరుముడి’ కథ చెప్పినప్పుడు అందులో లీనమయ్యాను. ఈ మూవీ మ్యూజిక్ విషయంలో రవితేజ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా భావోద్వేగంగా రూపొందిన క్లైమాక్స్ పాట అంటే ఆయనకి చాలా ఇష్టం. నాకు మాత్రం ‘యాలాలో..’ పాట చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ‘ఇరుముడి’కి ఆత్మలాంటి పాట. నెలలో 15 రోజులు హీరోగా నేను చేసే సినిమాల్లో నటిస్తాను. మరో 15 రోజులు కంపోజింగ్లో ఉంటాను. ‘జనవరి 12 విడుదల’ పాటలు అద్భుతంగా వస్తున్నాయి. దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార, శ్రీ శ్రీ’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. నటుడిగా నేను చేస్తున్న ‘ఇమ్మోర్టల్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 4న రిలీజ్ కానుంది అని పేర్కొన్నాడు. -
'ఇరుముడి'లో పాత్ర నాకు చాలా ప్రత్యేకం
చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ రెడీ అయింది. ఇంతకుముందు తమిళ సినిమాల్లో వరసగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు సహా తదితర భాషల్లో నటిస్తోంది. అలా లేటెస్ట్గా 'ఇరుముడి' చేసింది. ఈ శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా నటించగా శివ నిర్వాణ దర్శకుడు.'ఇరుముడి'లో నటించిన అనుభవాన్ని పంచుకున్న ప్రియా భవానీ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తయినా సరే అందులోని పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి పాత్రని నేను ఇందులో చేశా. అమ్మగా కావేరీ అనే పాత్రలో నటించాను. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. స్టోరీ విన్నప్పుడు దర్శకుడు శివ నిర్వాణ క్రియేట్ చేసిన లోకాన్ని అర్థం చేసుకున్నాను. ఇలాంటి నిజాయితీ, బలమైన పాత్రలో నటించడం చాలా సంతోషం అనిపించింది''ఇరుముడి సినిమాలో అనుబంధాలు, ఎంతో ప్రేమ, భావోద్వేగాలతో కూడిన మూమెంట్స్ ఉన్నాయి. ఇందులోని కావేరి పాత్ర నాకు చాలా స్పెషల్. రవితేజతో కలిసి నటించడం మంచి అనుభవం. ఆయన అందరితోనూ చాలా ప్రేమగా, సహజంగా మసలుకుంటారు. సినిమా కాకుండా చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. ఇరుముడి చాలా మంచి అనుభవం' అని ప్రియా భవానీ శంకర్ చెప్పుకొచ్చింది. -
ఈ సినిమా కోసమే నేను అయ్యప్ప మాల వేసుకున్నా
నిన్ను కోరి, మజిలీ.. ఇలా నా సినిమాలన్నీ మళ్లీ మళ్లీ చెప్పుకునేలా ఉంటాయి. ఇండస్ట్రీ నుంచి నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా కథలు గుర్తుండిపోవాలన్నదే నా ఉద్దేశం. అందుకే నా ప్రతి కథ అలానే ఉంటుంది. అయితే 'ఇరుముడి'లో ఇంటెన్సిటీతో పాటు ఒక క్రైమ్ యాంగిల్తో అద్భుతమైన కథ కుదిరింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు శివ నిర్వాణ చెప్పాడు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా ‘ఇరుముడి’. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ ఆసక్తికర విశేషాలు చెప్పారు.మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమాలో అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, అలాగే ఫ్యామిలీ, క్రైమ్ యాంగిల్... ఇలా మూడు లేయర్స్ ఉంటాయి. చిన్నపాటి సందేశం కూడా ఉంది. తాగుబోతు త్రినాథ్ (సినిమాలో రవితేజ పాత్ర పేరు) అయ్యప్ప మాల ధరించక ముందు చేసిన కొన్ని ఘటనలు అతను అయ్యప్ప మాల ధరించిన తర్వాత వెంటాడతాయి. ఆ సమయంలో అతను ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ.రవితేజగారు చేసిన ఈ పాత్ర చుట్టూ ఒక మంచి హ్యూమన్ డ్రామా కుదిరింది. కథలో అయ్యప్ప స్వామి మాల బ్యాక్డ్రాప్ ఉంటుంది. కానీ పూర్తిగా అయ్యప్ప స్వామి మాల బ్యాక్డ్రాప్తో సాగే అయ్యప్ప స్వామి కథ కాదు. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు హీరో ఎలా ఉంటాడు? మాలలో లేనప్పుడు ఎలా ఉంటాడు? అనేది అద్భుతమైన స్క్రీన్ప్లేతో కథ ముందుకు వెళ్తుంది. ఈ సినిమా కోసమే నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. అసలు అయ్యప్ప స్వామి మాలలోనే అద్భుతమైన హ్యూమన్ డ్రామా ఉందనిపిస్తోంది. ఆ మాల వేసుకున్న తర్వాత ఎవరైనా సరే చాలా నిష్టగా, భయభక్తులతో ఉంటారు. ఈ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి..’ పాట అద్భుతంగా ఉంటుంది. ఒరిజినల్ పాటలో ఉన్న వైబ్ మా సినిమాలోని వాయిస్లో లేదనే మాటలు వినిపిస్తున్నాయి. డప్పు శ్రీనుగారు 15 ఏళ్ల క్రితం ఈ పాట పాడారు. ఇప్పుడు ఆయన వయసు 60. అప్పటికి, ఇప్పటికీ ఎనర్జీలో కొంత మార్పు రావడం సహజం. ఈ పాటను థియేటర్లో ఒక పూనకంతో చూస్తారు. ఈ పాటలో రామ్ చరణ్ కనిపిస్తారన్న వార్తల్లో నిజం లేదు. ‘మాలికాపురం’ చిత్రంతో కూడా మా సినిమాకు పోలికలు ఉండవు. -
‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే..
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ను పొందింది. ఈ చిత్ర నిడివిని 2 గంటల 25 నిమిషాలుగా ఖరారు చేశారు.కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటించగా, వారిద్దరి మధ్య ఉండే అనుబంధమే కథకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్ర బృందం చెబుతోంది.మద్యానికి బానిసైన వ్యక్తిగా..ఈ చిత్రంలో రవితేజ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు. మద్యానికి బానిసైన అతడి జీవితంలో అయ్యప్ప మాల ధరించిన తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది కథలో కీలకాంశంగా ఉండనుందట. గ్రామంలోని మహిళలను తన కుమార్తెల్లా చూసుకునే అతడి స్వభావం కూడా కథను మలుపు తిప్పనుందని సమాచారం.సహజమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపడంతో కథకు మరింత సహజత్వం వచ్చిందని చిత్ర యూనిట్ పేర్కొంది. రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. -
‘ఇరుముడి’లో రామ్ చరణ్.. టీమ్ క్లారిటీ!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాలోని ఓ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తాజాగా రామ్ చరణ్ టీమ్ స్పందించింది.‘ఇరుముడి’ సినిమాలో ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ అంటూ సాగే పాటలో రామ్ చరణ్ అయ్యప్ప మాలధారణలో కనిపించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. ఈ పాటలో ఆయన ప్రత్యేకంగా కనిపించనున్నారని, ఇది సినిమాకు సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఉండబోతోందంటూ అభిమానులు, నెటిజన్లు చర్చించుకున్నారు.ఈ ప్రచారానికి ‘ఇరుముడి’ ప్రీరిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. సినిమాలోని ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ పాటలో అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందని ఆయన చెప్పడంతో.. ఆ సర్ప్రైజ్ రామ్ చరణ్నే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో మెగా అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది.అయితే తాజాగా ఈ వార్తలకు చెక్ పడింది. రామ్ చరణ్ ‘ఇరుముడి’ సినిమాలో నటించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. సినిమాలో రామ్ చరణ్ కనిపించనున్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయొద్దని కూడా రామ్ చరణ్ టీమ్ విజ్ఞప్తి చేసింది.దీంతో ‘ఇరుముడి’లో రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారనే ప్రచారానికి తెరపడినట్లైంది. ప్రీరిలీజ్ ఈవెంట్లో జీవీ ప్రకాశ్ చెప్పిన సర్ప్రైజ్ ఏంటనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో కొనసాగుతోంది. ఆ సర్ప్రైజ్ ఏమిటన్నది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టత రానుంది. -
‘ఇరుముడి’ వేడుకలో బూతు పదాలు.. రవితేజపై నెటిజన్స్ ఫైర్!
ఈ మధ్య సినిమా ఈవెంట్స్లో నటీనటులు బూతు పదాలు మాట్లాడటం కామన్గా మారిపోయింది. స్టేజ్పై మాట్లాడుతున్నామనే విషయం మర్చిపోయి.. ఫ్లోలో నోటికి వచ్చిన మాటలు అనేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఓ సినిమా వేడుకలో చేసిన పదప్రయోగం చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో రవితేజ, సీనియర్ నటుడు అజయ్ ఘోష్ కూడా సినిమా వేదికపై చేసిన కొన్ని పదప్రయోగాలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమవుతున్నాయి.హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదికైంది. కార్యక్రమం మొత్తం సందడిగా సాగినప్పటికీ.. రవితేజ, అజయ్ ఘోష్ మాట్లాడిన సమయంలో వినిపించిన ఒకట్రెండు అసభ్య పదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ తన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రవితేజను పొగిడే క్రమంలో అనుకోకుండా బూతు పదాలను వాడేశాడు. (చదవండి: రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!)మరో సందర్భంలో రవితేజ కూడా అభ్యంతరకరంగా భావించే ఓ పదాన్ని ఉపయోగించడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. వేదిక ముందు కూర్చొని ఉన్న రవితేజను ఈ సినిమాలో ఆయనకు కూతురిగా నటించిన నక్షత్ర కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి ‘నాకు నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారు'.. అని అడగగా 'ముదురు ము...' అని రవితేజ అంటాడు. ఒక స్టార్ హీరో..చిన్న పిల్లను అలా అనడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. ప్రేమతో అన్నా సరే.. వేదికపై అలాంటి బూతు పదాన్ని వాడడం కరెక్ట్ కాదంటూ రవితేజను ట్రోల్ చేస్తున్నారు.(చదవండి:‘మీకు బీఫ్ నచ్చిందా?’ హీరోయిన్కి షాకింగ్ ప్రశ్న.. రియాక్షన్ ఇదే!)సాధారణ కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి పదాలు వినిపిస్తే.. వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ‘ఇరుముడి’ సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అయ్యప్ప స్వామి భక్తులకు ‘ఇరుముడి’ అనే పదానికి ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమంలోనే బూతు పదాలు వినిపించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. -
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నోరు జారిన అజయ్ ఘోష్...
-
రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!
టాలీవుడ్లో పలువురు హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బంతా భూములు, ఇతర స్థిరాస్తులపై పెట్టుబడిగా పెడుతుంటారు. ఈ జాబితాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆయన శంకర్పల్లి సమీపంలో 26 ఎకరాల తోటను కేవలం రూ.12 లక్షలకు కొనుగోలు చేసినట్లు నటుడు అజయ్ ఘోష్ తెలిపారు. ప్రస్తుతం ఆ భూమి విలువ వందల కోట్లకు చేరిందని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది.రవితేజ, అజయ్ ఘోష్ కలిసి నటించిన ‘మాస్ జాతర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కోసం శంకర్పల్లి సమీపంలోని 26 ఎకరాల తోటలో రైల్వే స్టేషన్, ఇల్లు తదితర సెట్లు ఏర్పాటు చేసినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. ఆ తోట రవితేజకు చెందినదేనని చెప్పారు.(చదవండి: నిజంలో బతకడం రవితేజకే చెల్లింది.. అజయ్ ఘోష్)‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. “నేను, రవితేజ కలిసి ‘మాస్ జాతర’ సినిమా చేశాం. ఆ సినిమాకు రైల్వే స్టేషన్ సెట్, ఇల్లు సెట్ను ఒక తోటలో వేశారు. శంకర్పల్లి దగ్గర ఉన్న 26 ఎకరాల తోట అది. ఆ తోట రవితేజ గారిదే. ఎప్పుడో దాన్ని రూ.12 లక్షలకు కొన్నారు. ఇప్పుడు దాని విలువ వందల కోట్లు ఉంది” అని తెలిపారు.అదే సమయంలో సెట్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను కూడా అజయ్ ఘోష్ గుర్తుచేసుకున్నారు. ఆ తోట విలువ గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి.. ‘ఈ తోట అన్ని కోట్ల విలువ చేస్తుందని అంట కదా?” అని రవితేజను అడిగారట. అందుకు రవితేజ స్పందిస్తూ.. ‘ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనం పోతాం. ఇవన్నీ ఉన్నాయని సంతోషించాలి. కానీ మనం పని చేసుకోవాలి’ అని చెప్పినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. రవితేజ ఆస్తులపై అజయ్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. -
రవితేజపై అజయ్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసినా..బయట మాత్రం చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. తాజాగా ఈ నటుడు మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరిగిన ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో కలిసి పనిచేశాను. కానీ ఆ పిల్లోడు (రవితేజ)తో ఉన్న అనుబంధం చాలా స్పెషల్. ఏ జన్మ బంధమో కానీ.. ఆయనతో పనిచేసినందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని అన్నారు.రవితేజలో తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూశానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ‘నీలాంటి తాత్వికుడితో పనిచేశాను. వీళ్లందరికీ నువ్వొక హీరోలా కనిపిస్తావు. కానీ నేను నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తిని చూశా. నిజంగా ఉన్నది ఉన్నట్లు.. మొహమాటం లేకుండా మాట్లాడటం.. నిజంలో బతకడం.. నిజంగా ఉండడం మీకే చెల్లింది’అని రవితేజను ప్రశంసించారు.నేను అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలతో పని చేశా.. కానీ రవితేజతో నా అనుబంధం..రవితేజలో ఒక జిడ్డు కృష్ణమూర్తి వున్నాడు.- Ajay Ghosh#Irumudi Grand Pre-Release Event pic.twitter.com/e063kqVf17— idlebrain.com (@idlebraindotcom) August 16, 2026 -
ఇరుముడి డిఫరెంట్ మూవీ.. ఆ సీన్లు మనసుల్నీ తాకుతాయి: రవితేజ
‘‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్లా ఉంటుంది. కొన్ని పాత్రలు ఆడియన్స్కు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో స్వాసికను చూస్తే భయం వేస్తుంది. నేను, నక్షత్ర కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని తాకుతాయి. కావేరి పాత్రలో ప్రియ చక్కగా నటించింది. మైత్రీ బేనర్లో నాకు ఇది మూడో సినిమా. భవిష్యత్లో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘మల్లెపూల పల్లకి..’ పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఓ డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులు, నా అభిమానులు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. డిఫరెంట్ రవన్నను (రవితేజ) చూడబోతున్నారు (ఫ్యాన్స్ను ఉద్దేశించి). జీవీ ప్రకాశ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శివ గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను’’ అని అన్నారు. ‘‘మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. సాధారణ తండ్రి, కూతుళ్ల కథ ఇది. మన అమ్మాయిలను ఇలా చూసుకోవాలని మనకు అనిపిస్తుంది’’ అని శివ నిర్వాణ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘అయ్యప్ప స్వామి దీక్షతో ఉన్న ఓ భక్తుడి బ్యాక్డ్రాప్లో ఉండే థ్రిల్లింగ్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ ఆర్ఆర్ చేయడం సవాల్గా అనిపించింది’’ అన్నారు జీవీ ప్రకాష్ కుమార్. ‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి..’ పాట పాడిన ఒరిజినల్ సింగర్ డప్పు రాంబాబు, ఒరిజినల్ కంపోజర్ సుంకర ఆంజనేయులు, లిరిసిస్ట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ చిత్రసంగీతదర్శకుడు జీవీ ప్రకాష్ ఈ పాటను రీ క్రియేట్ చేశారు. -
'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. అయ్యప్పస్వామి నేపథ్యం కూడా ఇందులో కొంతమేర ఉంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ రిలీజయ్యాయి. ఈ శుక్రవారమే (ఆగస్టు 21) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే 'మల్లెపూల పల్లకి' అంటూ సాగే అయ్యప్ప పాటని విడుదల చేశారు.శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఓ మధ్య తరగతి తండ్రిగా నటించాడు. ప్రియా భవానీ శంకర్ ఇతడికి జంటగా కనిపించనుంది. నక్షత్ర అనే బాలనటి, రవితేజ కూతురిగా చేసింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేని రవితేజకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఇదెంత వరకు నెరవేరుస్తుందో చూడాలి? -
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
నవ్వించాలని ఉంది
రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కావేరి అనే గృహిణి పాత్ర చేశాను. భర్త, కుమార్తె... ఈ ఇద్దరే కావేరి ప్రపంచం. పల్లెటూరి యాసలో ఈ సినిమా డైలాగ్స్ చెప్పడం సవాల్గా అనిపించింది. ఈ చిత్రంలో ఫాదర్–డాటర్ ఎమోషన్ యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది.ఈ సినిమా ట్రైలర్లో ఓ తండ్రి తన కుమార్తెను ఎంత బాధ్యతగా పెంచుతాడో కనిపిస్తుంది. అలాగే కూతురు కూడా ఏం జరిగినా పేరెంట్స్తో చెబుతుంటుంది. అలాంటి వాతావరణాన్ని తల్లిదండ్రులు వారి పిల్లలకు కల్పించాలి. ఈ సినిమా చూస్తున్నప్పుడు పిల్లలకు ఏం జరిగినా తమతో షేర్ చేసుకునే కంఫర్ట్ను పేరెంట్స్ ఇవ్వాలనే అంశం ఆలోచింపజేసేలా ఉంటుంది. లైఫ్లో నేను హ్యాపీ పర్సన్ని. అయితే ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ రోల్స్ చేశాను. నాకు మాత్రం మంచి ఫన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ప్రేక్షకులను నవ్వించే సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం నాగచైతన్యగారి ‘ధూత 2’లో నటిస్తున్నాను. తమిళంలో చేసిన ‘డిమోంటి కాలనీ 3’ రిలీజ్కు రెడీ అవుతోంది’ అని తెలిపారు. -
'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఇరుముడిలో ఇన్ని చిక్కు ముడిలా.? అసలు కథ ఇదే..!
-
రవితేజ ‘ఇరుముడి’ మూవీ HD స్టిల్స్
-
రవితేజ ఇరుముడి.. ట్రైలర్ వచ్చేసింది
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
'ఇరుముడి'కి శబరిమలతో సంబంధం లేదు
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. పోస్టర్స్ దగ్గర నుంచి పాటల వరకు చూస్తుంటే ఇది అయ్యప్ప దీక్ష, స్వామి మాల నేపథ్య కథతో తీశారని చాలామంది అనుకున్నారు. అయితే శబరిమలకు ఈ మూవీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశాడు. వచ్చే శుక్రవారమే చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)'ఈ సినిమా స్టోరీకి శబరిమలతో ఎలాంటి సంబంధం లేదు. హీరో జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఓ భాగం మాత్రమే. దీక్ష టైంలో అయ్యప్ప భక్తులు తమ అలవాట్లు, నియమావళి విషయంలో నిష్టగా ఉంటారు. వ్యసనాలు ఉన్న ఓ మనిషి ఈ దీక్ష స్వీకరించాల్సి వస్తే అతడు మద్యానికి దురంగా ఉండాల్సి వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. కఠినమైన నియమాలు ఉంటాయి కాబట్టి నేను అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని తీసుకున్నాను. అంతే తప్ప శబరిమలతో సినిమా స్టోరీ కాదు. 41 రోజుల దీక్ష కథే మూవీని మరింత ప్లస్. దీక్షకు ముందు ఏం జరిగింది? దీక్షలో ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి' అని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్) -
భావోద్వేగాల ఇరుముడి
ఒకవైపు నోటిలో కత్తితో, మరోవైపు అయ్యప్ప మాల ధరించి... ఇలా రెండు రకాల లుక్స్లో రవితేజ కనిపించనున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ నెల 21న ‘ఇరుముడి’ చిత్రం విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈ 12న భీమవరంలో ఓ భారీ ఈవెంట్ని నిర్వహించి, ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ‘‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనంత ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ముఖ్యంగా తన కుమార్తెతో ఆయనకు ఉండే అనుబంధం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. -
రెండేళ్ల తర్వాత 'ఇరుముడి'తో మళ్లీ తెలుగులోకి (ఫొటోలు)
-
మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ.. 'ఇరుముడి' మరో సాంగ్ రిలీజ్
రవితేజ తన స్టైల్ మార్చి చేస్తున్న సినిమా 'ఇరుముడి'. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లేదంటే ప్రయోగాలు చేశాడు. ఇందులో మాత్రం కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ వ్యక్తిగా, ఓ పాపకు తండ్రిగా కనిపించనున్నాడు. ఈ నెల 21న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇదివరకే ఇరుముడి కట్టు అంటూ అయ్యప్ప గీతం రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు కుటుంబ బంధాన్ని ఆవిష్కరించేలా 'యాలాలో యాలాలో' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. ఓ గిరిజన ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన రవితేజ, సాయం చేసే భార్య, మంచి కూతురు.. వీళ్ల మధ్య బాండింగ్ ఇందులో చూపించారు. శివ నిర్వాణ దర్శకుడు కాగా జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు) -
రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్
గత కొన్నాళ్లుగా వరస సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ అందుకోలేకపోతున్న హీరో రవితేజ.. ప్రస్తుతం 'ఇరుముడి' అనే మూవీ చేస్తున్నాడు. అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్లో తండ్రి-కూతురు సెంటిమెంటే దీని స్టోరీ. ఆగస్టు 21న థియేటర్లలో రిలీజ్ కానుందని కొన్నిరోజలు క్రితమే ప్రకటించారు. ఇప్పుడు 'ఇరుముడి కట్టు' అంటూ సాగే తొలి పాటని విడుదల చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు)'ఇరుముడి కట్టు' పాట గురించి అయ్యప్ప భక్తులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సదరు గీతం నుంచి లిరిక్స్ తీసుకున్నప్పటికీ ట్యూన్ మాత్రం చాలావరకు మార్చేశారు. 'స్వామియే అయ్యప్పో.. అయ్యప్పో స్వామియే' అనే లిరిక్స్, ట్యూన్ మాత్రం అలానే ఉంచేశారు. అయినా సరే ఈ గీతం వినడానికి బాగుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ కాగా శివ నిర్వాణ దర్శకుడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' ఓటీటీ.. కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్) -
గ్రీన్ సిగ్నల్?
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న విడుదల కానుంది. దీంతో తన తర్వాతి సినిమా కోసం వరుసగా కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ.ఇప్పటికే దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదట. కాగా తమిళ దర్శకుడు హరి ఓ యాక్షన్ కథను సిద్ధం చేశారని, ఈ స్క్రిప్ట్కి హీరోగా రవితేజ అయితే బాగుంటుందని ఆయన భావించారట. ప్రస్తుతం రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఫిల్మ్నగర్ భోగట్టా.తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘సింగం’ సినిమాలతో దర్శకుడు హరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. మరి.. హరి దర్శకత్వంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
వరలక్ష్మి వ్రతానికి ఇరుముడి
అయ్యప్ప స్వామి భక్తుడిగా హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘ఇరుముడి’ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆదివారం నిర్మాతలు తెలిపారు.‘‘భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. భక్తి, మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో కమర్షియల్ అంశాలను కూడా జోడించి శివ నిర్మాణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
'ఇరుముడి' గ్లింప్స్.. కొత్తగా కనిపించిన రవితేజ
రవితేజ మంచి నటుడే కానీ గత కొన్నాళ్ల నుంచి ఒకే తరహా సినిమాలు తీసి తీసి బోర్ కొట్టించేస్తున్నాడు. ప్రస్తుతం 'ఇరుముడి' అనే మూవీ చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ని పెద్దగా హడావుడి లేకుండానే రిలీజ్ చేశారు. పల్లెటూరి బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ కొత్తగా.. సాధారణ షర్ట్, లుంగీతో కనిపించాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)గ్లింప్స్ బట్టి చూస్తే గ్రామంలో ఉండే హీరో, అతడికో కూతురు. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ హీరోకి మందు అలవాటు. వ్యసనాన్ని మానేయమని కూతురు అడుగుతుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? అయ్యప్ప స్వామి మాల ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనేది కాన్సెప్ట్లా అనిపిస్తుంది. జీవీ ప్రకాశ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా బాగుంది. ఆగస్టులో మూవీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా) -
జాతరలో డిష్యుం... డిష్యుం
జాతరలో రెచ్చిపోయి ఫైట్ చేస్తున్నారట రవితేజ. ఎందుకంటే ‘ఇరుముడి’ సినిమా కోసం అన్నమాట. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర, భార్య పాత్రలో ప్రియా భవానీశంకర్ నటిస్తున్నారు.నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. రవితేజ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ జాతర బ్యాక్డ్రాప్లో ఉంటుందట. తండ్రీకూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. -
వెండితెరపై ఆధ్యాత్మిక శోభ
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, యాక్షన్, థ్రిల్, పొలిటికల్, హారర్... ఇలా అన్నమాట. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. భక్తి, హిందుత్వం, మైథలాజీ, ధర్మం ఆధారంగా రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ కూడా బాగా ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రేక్షకులకు ఆధ్యాత్మిక శోభ చూపించేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’, రవితేజ ‘ఇరుముడి’, మహేశ్బాబు ‘వారణాసి’, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రణ్బీర్ కపూర్ ‘రామాయణ’, నిఖిల్ ‘స్వయంభు’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ సినిమాలతో పాటు ‘మహావతార్ నరసింహా, వాయుపుత్ర’ వంటి యానిమేషన్ మూవీస్ కూడా రూపొందుతున్నాయి. ఆయా సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.హనుమంతుడు తోడుగా... ఆంజనేయస్వామికి హీరో చిరంజీవి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా హనుమంతుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారాయన. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’లోనూ మరోసారి హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉండనున్నాయి. తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందిన ‘విశ్వంభర’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు మేకర్స్. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఓ హైలెట్గా నిలుస్తాయని టాక్. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి వెనక నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ మూవీని విజువల్ వండర్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. గత ఏడాది తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా చిరంజీవి స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘‘చందమామ కథలా ‘విశ్వంభర’ ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్ని అందించేందుకు సమయం పడుతోంది. 2026 వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే గ్రాఫిక్స్కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట. ఈ కారణంగా ఈ మూవీ గురించి ఎలాంటి కొత్త అప్డేట్ ఇవ్వడం లేదట చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్లు ‘విశ్వంభర’ ఈ వేసవి ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే మరోసారి వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.అయ్యప్ప మాలధారిగా... వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకెళుతుంటారు రవితేజ. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ.‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ అద్భుతంగా రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా కోసం రవితేజ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ఇరుముడి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్బస్టర్ మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృతా అయ్యర్ జోడీగా నటించారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించి, అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్’కి కొనసాగింపుగా ‘జై హనుమా న్ ’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (‘కాంతారా’ మూవీ ఫేమ్) నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాముడి విగ్రహాన్ని హత్తుకుని ఉన్న హనుమంతుడిగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్బస్టర్గా నిలవడంతో ఆ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. పైగా ‘కాంతారా, కాంతారా చాప్టర్ 2’ మూవీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో టైటిల్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై ట్రేడ్ వర్గాల్లోనూ మరింత క్రేజ్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ‘హనుమాన్’ మూవీలో తనదైన నటనతో మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్నగర్ టాక్. శ్రీరాముడు–రుద్ర ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మహేశ్బాబు. వారణాసి నేపథ్యంలో భక్తి బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్బాబు మునుపెన్నడూ చూడని విధంగా శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణని జార్జియాతో పాటు పలు అంతర్జాతీయ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు... ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో వారణాసిని సృష్టించారు. అచ్చం వారణాసిలా తీర్చిదిద్దిన సెట్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఒక గొప్ప అనుభూతినిచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ విజువల్ వండర్ను చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. ఈ చిత్రం అందర్నీ గర్వపడేలా చేస్తుంది’ అని మహేశ్బాబు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.ఈ మూవీ భారతదేశంలోనే కాకుండా ‘గ్లోబ్ట్రోటర్, టైమ్ట్రోటర్’ అనే ట్యాగ్లై న్ లతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. మహేశ్బాబు, ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ విడుదల కానుంది. మహేశ్బాబు– రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల కానుంది. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రం ‘స్వయంభు’. ఇది పూర్తిగా పురాణ, భారతీయ యోధుల చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని స్టైలిష్, హిస్టారికల్ యాక్షన్ మైథలాజికల్గా రూపొందిస్తున్నారు. నిఖిల్ వేషధారణ, యాక్షన్ లుక్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపాయి.తన పాత్ర కోసం నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటె న్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందట. ఇండియాలోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయని తెలిసింది. ఈ విజువల్ వండర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ ఔట్పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్మెంట్తో పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘స్వయంభు’ రూపొందుతోంది.‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలతో చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో నిఖిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దశావతార ఆలయం నేపథ్యంలో... హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్షైన్ పిక్చర్స్పై మహేశ్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భక్తి నేపథ్యంలో రూపొందుతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అతను ఒంటరివాడు కాదు... అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఈ పోస్టర్లో ఇచ్చిన క్యాప్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.అలాగే టైటిల్ టీజర్కి కూడా మంచి స్పందన వచ్చింది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ కథాంశం యాక్షన్, ఆధ్యాత్మికతలను మేళవిస్తుంది. సర్పదేవత పచ్చబొట్టుతో పాటు పవిత్రమైన విష్ణు నామాలు వంటి చిహ్నాలు కూడా టీజర్లో కనిపిస్తాయి. దుండగుల బారి నుంచి దశావతార ఆలయాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న సాలిడ్ థ్రిల్లర్గా, భారతీయ ధర్మం, ఆచారాలపై ఆధారపడిన పౌరాణిక యాక్షన్ డ్రామాగా ‘హైందవ’ చిత్ర కథాంశం ఉండనుందట. ఈ మూవీలో ఓ ధార్మిక యోధుడి పాత్రలో కనిపించనున్నారట సాయి శ్రీనివాస్.నాగబంధం ‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ అభిషేక్ నామా తెరకెక్కించారు.మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్బాబు ‘నాగబంధం’ టీజర్ని విడుదల చేసి, ‘‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తి నేపథ్యంలో అల్లుకున్న సస్పె న్స్ బ్యాక్డ్రాప్లో ‘నాగబంధం’ని రూపొందించారని సమాచారం. ఇందులో విరాట్ కర్ణ శక్తిమంతమైన యోధుడిగా నటించారు. ఈ చిత్రంలో నాగబంధం, శివ తంత్ర విద్య, నాగబంధం ఆలయం వెనక ఉన్న గుప్తనిధులు వంటి అంశాలు కథలో హైలెట్ కానున్నాయట. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. గదాధారి హనుమాన్... రవి కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ‘‘మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘గదాధారి హనుమాన్’.ఈ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోష న్స్ను అద్భుతంగా పండించాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ఫుల్ అన్న దానిపై ఓ సీక్వె న్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని రవికిరణ్ తెలిపారు.యానిమేషన్ కూడా... ఇదిలా ఉంటే... రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్తో పాటు ‘మహావతార్ నరసింహా’, ‘వాయుపుత్ర’ వంటి యానిమేటెడ్ సినిమాలు కూడా రానున్నాయి. అశ్విన్కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేటెడ్ చిత్రం సూపర్ హిట్గా నిలవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. 2037 వరకు ఏడు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న యానిమేటెడ్ ఫిల్మ్ ‘వాయుపుత్ర’ పైనా మంచి అంచనాలున్నాయి.రామాయణం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్షణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్మైండ్ క్రియేష న్న్స్ సహకారంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, పరశురాముడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
విభిన్నమైన పాత్రలో రవితేజ.. హైదరాబాద్లో యాక్షన్
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేసింది యూనిట్. ‘‘ఇరుముడి’లో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ పోరాట సన్నివేశాలను ఫైట్ మాస్టర్స్ అనల్ అరసు, రియల్ సతీష్ తెరకెక్కిస్తున్నారు’’ అని యూనిట్ తెలిపింది. -
శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి టీమ్ ప్రత్యేక పోస్టర్
రవితేజ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇరుముడి. ఈ చిత్రంలో మాస్ మహారాజా అయ్యప్పదీక్షలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే డెవోషనల్ టచ్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఇరుముడి టీమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రేమ, ఆప్యాయత గల తండ్రి.. ముచ్చటైన కూతురి కథ.. అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్తోనే కథేంటో మేకర్స్ రివీల్ చేశారు. ఈ ఏడాది రవితేజ బర్త్ డే సందర్భందా మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కానుంది. Tale of a Doting father & Lovely daughter knotted with love - #IRUMUDI 🫶శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹✨Starring MASS MAHARAJA @RaviTeja_offlA @gvprakash musical 🎺🎼@priya_Bshankar @ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/CNZuTYRLKB— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2026 -
ఇరుముడిలో అయ్యప్ప భక్తులకు ఇష్టమైన పాట రీమిక్స్
భక్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో మెప్పించిన మాస్ మహారాజా రవితేజ తర్వాతి సినిమా సెట్స్లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడారు.జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ విడుదల కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే ఇరుముడి సినిమా గురించి ప్రశ్నించగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన “ఎక్కినాడు పల్లకి” (అయ్యప్ప స్వామిని కీర్తించే గీతం) పాటను రీమిక్స్ చేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. ఈ పాటను రీమిక్స్ చేయమని ఇప్పటికే చాలామంది తనను అడిగినట్లు జీవీ ప్రకాశ్ తెలిపారు. దీంతో తాను కూడా పలుమార్లు ఆ సాంగ్ విన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే, తుది నిర్ణయం దర్శకుడు, నిర్మాతలదేనని జీవీ ప్రకాష్ తెలిపారు.ఈ చిత్రంలో రవి తేజ అయ్యప్ప స్వామి భక్తునిగా కనిపించనున్నారు. ఇది భక్తి చిత్రం కాదు, బేబీ నక్షత్ర పోషించిన తన కుమార్తెతో అతనికున్న సంబంధం చుట్టూ అల్లుకున్న ఒక ఎమోషనల్ డ్రామా. ఫస్ట్లుక్ పోస్టర్లో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించడంతో భారీ బజ్ క్రియేట్ అయింది. -
ఇరుముడి సినిమాలో..?
‘ఇరుముడి’ సినిమాలో తమన్నా భాగమయ్యారనే టాక్ వినిపిస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు.కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ తమన్నాను సంప్రదించారని, కథ, పాత్ర నచ్చడంతో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా 2015లో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో తమన్నా ఓ హీరోయిన్గా నటించారు.మళ్లీ పదేళ్ల తర్వాత రవితేజతో తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంటారా? మరి... ‘ఇరుముడి’ చిత్రంలో తమన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్డేట్
మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irumudi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో అయ్యప్పమాల ధరించిన రవితేజ.. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని చాలా కొత్తగా కనిపించారు.ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ కనిపించనుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ భార్యగా అభిమానులను మెప్పించనుంది. తాజాగా రిలీజైన ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్ కొట్టారు. రవితేజతో తీస్తోన్న పాన్ ఇండియా రేంజ్ మూవీ 2026లోనే ఈ విడుదల కానుంది. Presenting the talented @priya_Bshankar as 'Kaveri' from #IRUMUDI / #ఇరుముడి - a caring wife and a doting mother ❤️Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026


