టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసినా..బయట మాత్రం చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. తాజాగా ఈ నటుడు మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆదివారం జరిగిన ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో కలిసి పనిచేశాను. కానీ ఆ పిల్లోడు (రవితేజ)తో ఉన్న అనుబంధం చాలా స్పెషల్. ఏ జన్మ బంధమో కానీ.. ఆయనతో పనిచేసినందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని అన్నారు.
రవితేజలో తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూశానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ‘నీలాంటి తాత్వికుడితో పనిచేశాను. వీళ్లందరికీ నువ్వొక హీరోలా కనిపిస్తావు. కానీ నేను నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తిని చూశా. నిజంగా ఉన్నది ఉన్నట్లు.. మొహమాటం లేకుండా మాట్లాడటం.. నిజంలో బతకడం.. నిజంగా ఉండడం మీకే చెల్లింది’అని రవితేజను ప్రశంసించారు.
నేను అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలతో పని చేశా.. కానీ రవితేజతో నా అనుబంధం..
రవితేజలో ఒక జిడ్డు కృష్ణమూర్తి వున్నాడు.
- Ajay Ghosh#Irumudi Grand Pre-Release Event pic.twitter.com/e063kqVf17— idlebrain.com (@idlebraindotcom) August 16, 2026


