Archive Page | Sakshi
Sakshi News home page

Mancherial

  • ఇందిరమ్మ ఇల్లు ఒకరికి.. బిల్లు మరొకరికి

    ఇచ్చోడ: ఇందిరమ్మ ఇల్లు ఒకరికి మంజూరైతే పంచాయతీ కార్యదర్శి బిల్లు మరొకరికి అందజేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని నర్సాపూర్‌ గ్రామానికి చెందిన ముస్లే నందబాయి భర్త సంతోష్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజురైంది. జూన్‌ 2న కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదే గ్రామంలో ముస్లే నందబాయి భర్త మారుతికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే పంచాయతీ కార్యదర్శి సునీల్‌ నాయక్‌ నిర్వాకం వల్ల బేస్‌మెట్‌ వరకు నిర్మాణం పూర్తయిన నందబాయి (భర్త మారుతి)కి వచ్చే బిల్లు ఇంకా పనులు ప్రారంభించని నందబాయి (భర్త సంతోష్‌) బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ అయ్యాయి. ఈ బిల్లు విషయంలో గ్రామంలో పక్షం రోజులుగా రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. కాగా, కార్యదర్శి తన తప్పు సరిదిద్దుకోవడానికి మరో తప్పు చేసి వివాదానికి తెరలేపాడు. డబ్బులు ఖాతాలో జమ కావాలంటే బ్యాంక్‌ వోచర్‌పై సంతకాలు పెట్టాల్సి ఉంటుందని నందబాయి, ఆమె భర్త సంతోష్‌ను ఇచ్చోడ బ్యాంక్‌కు పిలిపించాడు. ఈ నెల 3న వోచర్లపై సంతకాలు తీసుకొని ఆమె అకౌంట్‌లో జమ అయిన డబ్బులను నందబాయి భర్త మారుతి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించాడు. విషయం బయటకు పొక్కడంతో సంతోష్‌తో పాటు గ్రామస్తులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యదర్శిని నిలదీశారు. దీంతో కార్యదర్శి తన తప్పు ఒప్పుకొని వారం రోజుల్లో నందబాయి భర్త సంతోష్‌కు రూ.లక్ష ఇస్తానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో సంతోష్‌ రెండు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఎంపీడీవో అనంద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇద్దరు లబ్ధిదారుల పేర్లు ఒకేలా ఉండటంతో ఒకరికి వచ్చే బిల్లు మరొకరి అకౌంట్‌లో జమ అయినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

  • రేపు జీఎం కార్యాలయాల ముట్టడి

    శ్రీరాంపూర్‌: సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 19న కంపెనీ వ్యాప్తంగా జీఎం కార్యాలయాలు ముట్టడించనున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్‌లోని ఆర్కే 5, ఆర్కే న్యూటెక్‌, ఎస్సార్పీ ఓసీపీ గనులపై నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం మధ్య జరిగిన స్ట్రక్చరల్‌ సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు వెంటనే సర్క్యులర్లు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఒప్పందాల అమలుపై ఉత్తర్వులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ 12న స్ట్రక్చరల్‌ సమావేశం బహిష్కరించినట్లు తెలిపారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో యూనియన్‌ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్‌, జీఎం కమిటీ ప్రతినిధులు ప్రసాద్‌రెడ్డి, బద్రి బుచ్చయ్య, సంపత్‌, అద్దు శ్రీనివాస్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రీజియన్‌ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్‌, ఫిట్‌ సెక్రెటరీ మోతె లచ్చన్న పాల్గొన్నారు.

International

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటిక్‌ ఉద్యమకారుడు చార్లీ కిర్క్‌ హత్య నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటన చేశారు.

    ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ సోషల్‌ మీడియా ద్వారా ట్రంప్‌​ ప్రకటన చేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన సంస్థగా.. రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు దీనికి నిధులు సమకూర్చే వారిపై కఠిన విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారాయన.

     

    ఏంటీ ఎంటిఫా.. 
    Antifa అంటే ఫాసిస్ట్‌ వ్యతిరేక (anti-fascist) పదానికి సంక్షిప్త రూపం. ఇదేం ఒక అధికార, కేంద్రీకృత సంస్థ కాదు. ఫార్-లెఫ్ట్ కార్యకర్తల గ్రూప్‌. ఫాసిజం, రేసిజం, అన్నింటికంటే ముఖ్యంగా  కన్జర్వేటివ్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ సభ్యులు తరచూ ఫార్-రైట్ ర్యాలీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. బెల్లా సియావో(Bella Ciao) వంటి పాటలు, 1917 రష్యా విప్లవానికి సంబంధించిన గుర్తులను, నినాదాలను తమ నిరసనలకు ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో సిగ్నల్‌, ఇతర ఎన్‌క్రిప్టెడ్‌ యాప్స్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే.. 

    ట్రంప్‌ గత టర్మ్‌లోనే ఈ గ్రూప్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. ఇప్పుడు తనకు సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ హత్యతో ఆ పని చేశారు. అయితే Antifa అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం అసాధ్యమని, పైగా చట్టపరంగా ఇబ్బందులూ ఎదురుకావొచ్చని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయపడుతున్నారు. 

    కిర్క్‌ మరణం
    కన్జర్వేటివ్‌ కార్యకర్త చార్లీ కిర్క్‌ మరణం.. అమెరికాలో రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్‌ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని రైఫిల్‌తో కాల్చి చంపారు.  ఒకే భావజాలం ఉన్న ట్రంప్‌ కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిర్క్‌ ప్రచారం కూడా చేశారు. దీంతో తన ఆప్తుడి మరణంపై ట్రంప్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారాయన. 

    ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" వంటి రాతలున్న బుల్లెట్‌ కేసింగ్‌లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్‌సన్‌ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్‌బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్‌ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం.

Jagtial

  • తల్లిని పట్టించుకోని కొడుకులకు కౌన్సిలింగ్‌

    హుజూరాబాద్‌రూరల్‌: కొడుకులు పట్టించుకోవడం లేదంటూ మండలంలోని కనుకులగిద్దె గ్రామానికి చెందిన ములుగు రాజమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్డీవో రమేశ్‌బాబు గ్రామంలో విచారణ చేపట్టారు. ఒక్కొక్కరూ నెలకు రూ.మూడువేల చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు సరిగా అమలవుతున్నాయో లేదా అని తెలుసుకోవడానికి కలెక్టర్‌, జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలోని బృందం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో రాజమ్మను కుమారులు పట్టించుకోవడం లేదని తేలింది. ఆమె ముగ్గురు కొడుకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి రాజమ్మను పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణలో సోషల్‌ కౌన్సిలర్‌ పద్మావతి, డీవీసీ కౌన్సిలర్‌ ఆరె శేఖర్‌, ఎస్‌ఆర్వో రఫీ, హెడ్‌ కానిస్టేబుల్‌ మధు, మల్లయ్య, మర్రి శ్రీనివాస్‌ తదితరులున్నారు.

  • బైండోవర్‌ ఉల్లంఘించిన   ఏడుగురికి జైలు

    మంథని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి, పోతారం, మైదంబండ, అడవిశ్రీరాంపూర్‌, కేశనపల్లి, పారుపల్లి గ్రామాల్లో గుడుంబా విక్రయిస్తూ బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని బుధవారం తహసీల్దార్‌ మధుసూదన్‌రెడ్డి ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌కుమార్‌ తెలిపారు. దీంతో వారికి ఏడాది జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించారన్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్‌ నిమిత్తం కరీంనగర్‌కు తరలించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయికుమార్‌, సిబ్బంది శ్రీనివాస్‌, మహేందర్‌, నిరంజన్‌, వసంత, రవి పాల్గొన్నారు.

    మూడిళ్లలో చోరీ

    జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయ సమీపంలోని హరిహర కాలనీలో బుధవారం వేకువజామున తాళం వేసి ఉన్న మూడిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి తులంన్నర బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం పక్కింటి వారు లేచేసరికి డోర్లు తెరిచి ఉండటంతో ఇంటి యజమానులకు సమాచారం అందించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించగా పట్టణ సీఐ కరుణాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని హరిహర కాలనీలో సీసీపుటేజీలను పరిశీలించారు. ముగ్గురు దొంగలు ముసుగులు వేసుకుని వెళ్లినట్లు రికార్డు అయింది. సీఐ మాట్లాడుతూ.. ఇళ్లలో విలు వైన వస్తువులు ఉంచవద్దని, బ్యాంక్‌ ల్యాకర్లలోగానీ భద్రపర్చుకోవాలన్నారు. ప్రతి కాలనీల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

  • ప్రోత

    పట్టుకుచ్చుల పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. బంతిపూల సాగుకు అందించినట్లు మాకూ సహకారం అందించాలి.

    – పెసరు లచ్చయ్య, రైతు, పెద్దాపూర్‌

    బతుకమ్మ తయారీలో పట్టుకుచ్చులు అగ్రస్థానంలో ఉంటాయి. ఈ పూలు బతుకమ్మ పండుగకే వన్నె తెస్తాయి. మేము వీటినే ఉపయోగిస్తాం.

    – కె.రమాదేవి, కోనరావుపేట

    బంతి, చామంతి, లిల్లీ, గైలార్డియాపూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. తక్కువ పెట్టుబడి, శ్రమలేని బంతిపూలు సాగుచేయాలి.

    – మహేశ్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌

  • డిజిటల్‌ క్రాప్‌ సర్వే షురూ

    గతానికి భిన్నంగా వెసులుబాటు

    అక్టోబర్‌ 20 గడువు

    కరీంనగర్‌ అర్బన్‌: డిజిటల్‌ క్రాప్‌ సర్వేశ్రీ క్రమంగా పట్టాలెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే చేపడుతున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో కొంత ఆలస్యంగా మొదలవగా సర్వే పురోగతిని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ సమీక్షిస్తున్నారు. వచ్చే అక్టోబరు 20నాటికి పూర్తి చేయాల్సి ఉండగా గతేడాది సర్వే నిర్వహణకు ఏఈవోలు చేతులెత్తేయగా ఈ ఏడాది ఆ సమస్య తలెత్తకుండా, సజావుగా సాగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

    17 అంశాలతో వివరాల నమోదు

    మార్కెటింగ్‌, ఎరువులు, విత్తనాలు, దిగుమతులు, ఎగుమతులు, ప్రాసెసింగ్‌ వంటి అవసరాల ప్రణాళికను రూపొందించేందుకు ప్రతి రైతు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. 17 పేజీల మార్గదర్శకాలతో ప్రభుత్వం ఆదేశించింది. పచ్చిరొట్ట, అపరాలు, సీడ్‌ ప్రొడక్షన్‌ వివరాలు, అంతర పంట వివరాలు, సేంద్రియ వ్యవసాయం చేసే వారి వివరాలు, ప్రతి పంట వాటి రకాలు, నీటి వసతి, ఉద్యాన పంటలైతే వయసు, చెట్ల సంఖ్య నమోదు చేయనున్నారు. గత నెల వరకు 2,10,234 పాసుపుస్తకాలకు డిజిటల్‌ సైన్‌ కాగా ప్రతి సర్వే నంబర్‌ వారీగా పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. వివరాల నమోదు అనంతరం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అనంతరం రైతుల ఫోన్‌ నంబర్లకు ఎస్సెమ్మెస్‌ రానుంది.

    పురుషులకు 2 వేలు.. మహిళలకు 18,00 లక్ష్యం

    సీజన్లో ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ క్లస్టర్‌ పరిధిలోని రైతులను ప్రత్యక్షంగా కలిసి వాస్తవంగా సాగులో ఉన్న క్షేత్రాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. మహిళా ఏఈఓలు కనీసం 1,800 ఎకరాల్లో, పురుష ఏఈఓలు కనీసం 2వేల ఎకరాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటికి సాధారణ క్రాప్‌ బుకింగ్‌ పద్ధతిలో చేస్తారు. ప్రతి పంటను ఫొటో తీసి అప్లోడ్‌ చేయటం తప్పనిసరి. నమోదు మొత్తాన్ని ఒకే మొబైల్‌ యాప్‌ ద్వారా పూర్తి చేస్తారు. సర్వేలో వరి రకాల వివరాలు పేర్కొనటం తప్పనిసరి. ధాన్యం సేకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది.

    సర్వే ఎందుకంటే

    దేశంలో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందనే అంచనా సులువు. అలాగే దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల నిర్ణయం ఉండనుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కచ్చితత్వంతో నష్ట నిర్ధారణ ఉంటుంది. అలాగే చీడపీడల ఉనికి, తగిన విధంగా రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు సంసిద్ధతకు వినియోగించనున్నారు. వ్యవసాయ పురోగతి అంచనాకు ఈ సర్వే దోహదపడుతుంది.

    రైతుకు సంక్షిప్త సందేశం

    క్రాప్‌ బుకింగ్‌ 90శాతం పూర్తి కాగానే రైతులకు సంక్షిప్త సమాచారం ద్వారా వివరాలు పంపిస్తారు. రైతు వివరాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలి. నమోదులో తప్పులు దొర్లితే సరిచేయమంటూ రైతు దరఖాస్తు ఇవ్వాలి. ఏఈవో మూడు రోజుల్లో సరి చేసి తుది జాబితా ప్రదర్శించనున్నారు. జిల్లాలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే ముమ్మరంగా సాగుతోందని, తప్పుగా నమోదైన వివరాలు సరిచేసేందుకు అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు.

    జిల్లాలో మొత్తం రైతులు : 2,10,234

    మొత్తం క్లస్టర్లు : 77

    రెవెన్యూ గ్రామాలు : 205

    భూ విస్తీర్ణం : 3,33,450 ఎకరాలు

  • బతుకమ్మకు పట్టుకుచ్చుల అందం

    జూలపల్లి(పెద్దపల్లి): బతుకమ్మకు అందం తెచ్చే పట్టుకుచ్చులు(కాక్స్‌కాంబ్‌) పూల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ఆడపడచులు సంబురంగా ఆడుకునే బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మను పేర్చేందుకు పట్టుకుచ్చులు వినియోగిస్తారు. వీటిని పెద్దాపూర్‌, తెలుకుంట, నాగులపల్లె, జూలపల్లి, చీమలపేట తదితర గ్రామాల్లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. మూడు నెలలకే పంట కోతకు వస్తుంది. పెట్టుబడి తక్కువ, శ్రమతో కూడుకున్నది. అయినా, డిమాండ్‌ అధికంగా ఉండడంతో అన్నదాతలు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మ పండుగకు మూడు నెల ముందే నారుపోస్తారు. సస్యరక్షణ చర్యలతో నాణ్యమైన పూలు పండిస్తున్నారు. గతంలో రెండు, మూడు ఎకరాలకే పరిమితమైన పట్టుకుచ్చుల సాగు.. ఇప్పుడు సుమారు 15 ఎకరాలకు పైగా పెరిగిందని హార్టికల్చర్‌ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే సాగు విస్తీర్ణం మరింత పెంచుతామని రైతులు చెబుతున్నారు.

    పల్లెల నుంచి పట్టణాలకు..

    వివిధ పల్లెల్లో పండిస్తున్న పట్టుకుచ్చుల పూలను రైతులు పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల, గోదావరిఖని, కరీనంగర్‌, హైదరాబాద్‌, సిద్దిపేట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

    పెద్దాపూర్‌లో పెరిగిన సాగు విస్తీర్ణం

    రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని వినతి

  • అనుమా

    జమ్మికుంట: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని లెక్చరర్‌కాలనీలో నివాసం ఉండే దిడ్డి శ్రీదేవి(53) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. మనస్తాపంతో భర్త దిడ్డి సుధాకర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. టౌన్‌ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. దిడ్డి శ్రీదేవి – దిడ్డి సుధాకర్‌కు కొన్నేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఆదర్స్‌, కూతురు సింధూ ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. 

    అయితే, ‘మీ అక్క చనిపోయి ఉంద’ని సుధాకర్‌ ఫోన్‌ద్వారా ఆమె సోదరుడు పోరండ్ల శ్రావణ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం అందించాడు. ఆ వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్న శ్రావణ్‌.. సోఫాలో పడుకొని మృతి చెందిన తన అక్కను చూసి రోదించాడు. తన కూతురుకు అనారోగ్యం లేదని, బాధపడేంత ఇతర కారణాలు కూడా ఏమీలేవని, ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి తిరుపతమ్మ వాపోయింది. మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదుచేశారు.

    భర్త సుధాకర్‌ ఆత్మహత్యాయత్నం..

    శ్రీదేవి చనిపోవడంతో మనస్తాపం చెందిన సుధాకర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తన భార్య శ్రీదేవి సోపాలో పడుకుని గుండెపోటుతో మృతి చెందిందని, ఆమె మృతిని తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించానని సుధాకర్‌ వెల్లడించాడు. మరోవైపు.. తన తల్లి మృతి చెందిందనే సమాచారంతో అమెరికాలో ఉంటున్న కుమారుడు ఆదర్స్‌ వెంటనే ఇండియా బయలుదేరినట్లు బంధువులు తెలిపారు.

  • బైక్‌

    మాక్లూర్‌/నందిపేట్‌ (ఆర్మూర్‌): బైక్‌ అదుపు తప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం దుర్గానగర్‌ శివారులో బుధవారం వేకువజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటుకు ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌కు చెందిన పూజ (25)తో పది నెలల క్రితమే వివాహమైంది. బీటెక్‌ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చింది. బైక్‌పై తమను నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద వదిలేసి రావాలని చింటు తండ్రి నారాయణ (58)ను కోరాడు. ముగ్గురూ కలిసి బైక్‌పై బయల్దేరారు. చింటు డ్రైవింగ్‌ చేస్తున్నారు. దుర్గానగర్‌ శివారులో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన పూజ, చింటును ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పూజ మృతి చెందింది. మామ, కోడలు మృతితో తల్వేదలో విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

    నారాయణ (ఫైల్‌)

    పూజ (ఫైల్‌)

    స్వల్పగాయాలతో బయటపడిన మృతురాలి భర్త

    పైళ్లెన 10 నెలలకే విషాదం

    మృతురాలిది ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌

Kakinada

  • మందకొ

    1.61 లక్షల ఎకరాల్లో నమోదు

    మారిన నిబంధనలతో వీఏఏల అవస్థలు

    ఈ నెలాఖరు వరకు గడువు

    నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు

    కొత్తపేట: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు అవుతోంది. రైతులకు అన్ని విధాలా ఉపయోగకరమైన పంట నమోదు (ఈ–క్రాప్‌) మాత్రం అనుకున్నట్లు సాగడం లేదు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నాటికి 50 శాతం కూడా పంట నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వీఏఏలపై ఒత్తిడి చేస్తున్నారు. వీఏఏలకు పని ఒత్తిడి, గ్రామాలకు కొత్తవారు కావడం, ఎరువుల పంపిణీతో పాటు కొన్ని నిబంధనలు మార్చడంతో అనుకున్నట్లుగా పంట నమోదు జరగడం లేదు. రైతుల మేలు కోసం గత ప్రభుత్వం ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. పంట నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ వర్తింపజేసింది. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 3,90,708 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరితో పాటు ఉద్యానవన పంటలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నెల 30వ తేదీ లోగా నమోదు చేయాలి. ఇంకా కేవలం 14 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోగా పూర్తి చేయాలని అధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. సకాలంలో పంట నమోదు జరుగుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పంట నమోదు సక్రమంగా కాకపోతే పండిన ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు వస్తాయి. ఎరువులు సక్రమంగా ఇవ్వకపోగా ధాన్యం విక్రయానికి కూడా ఇబ్బంది కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

    మారిన నిబంధనలతో అవస్థలు

    గత ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే ఈ–క్రాప్‌ నమోదులో ఈ ఏడాది కొన్ని నిబంధనలను ప్రభుత్వం మార్చింది. గతంలో 200 మీటర్ల దూరం నుంచి ఈ–క్రాప్‌ నమోదుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దీనిని 20 మీటర్లకు కుదించారు. విధిగా వీఏఏలు ప్రతి కమతం దగ్గరకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. 25 సెంట్ల లోపు ఉన్న కమతాల్లో ఈ–క్రాప్‌ నమోదు చేసేందుకు కమతం వద్దకు వెళ్లకపోయినా ఆధార్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం ఉంటే అయిపోయేది. ఫొటో అప్‌లోడ్‌ తప్పనిసరిగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఆప్షన్‌ తొలగించారు. మరోపక్క యూరియా పంపిణీలో వీఏఏలు బిజీగా ఉండటంతో. ఈ–క్రాప్‌ అనుకున్నంత ముందుకు సాగడం లేదు. ఈ–క్రాప్‌ నమోదు బాధ్యత మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ)దే. వారు వీఏఏలను సమన్వయం చేసుకుని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

    ప్రయోజనాలు

    D&{M>‹³ ¯]lÐðl*-§ýl$¯]l$ {糆 OÆð‡™èl* ^ólƇ$$…-^èl$MøÐé-Í. C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ, C¯ŒS-ç³#sŒæ çܼÞyîl, ç³…rÌS Ñ{MýS-Ķæ*-°MìS, A¯]l²-§é™èl çÜ$T-¿ýæÐ]l ç³£ýlM>°MìS D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ™èlç³µ-°çÜ-Ç. MúË$ OÆð‡™èl$-ÌSMýS$ {糿¶æ$™èlÓ ç³£ýl-M>Ë$ A…§éÌS¯é² ç³…r ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-Mø-Ðé-Í. hÌêÏÌZ° 22 Ð]l$…yýl-ÌêÌZÏ Ððl¬™èl¢… Ð]lÅÐ]lÝëĶæ$, E§éů]l ç³…rË$ 3,90,708 GMýSÆ>ÌS ÑïÜ¢Æý‡~…ÌZ ÝëVýS$ AÐ]l#™èl$…yýlV> D ¯ðlÌS 15Ð]l ™ól© ¯ésìæMìS 1,60,578 GMýS-Æ>ÌZÏ D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$.

    త్వరితగతిన పూర్తి చేయాలి

    ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియను సెప్టెంబర్‌ 30వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆ మేరకు మండల స్థాయి అధికారుల (ఏఓ) పర్యవేక్షణలో గ్రామ స్థాయిలో వీఏఏలు పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చాం. మారిన నిబంధనలకు అనుగుణంగా వీఏఏలు తమ పరిధిలోని అన్ని పంటలనూ నమోదు చేయాలి. మండల వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పంట నమోదు ప్రక్రియపై సమీక్ష చేస్తుండాలి.

    – ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట

  • ఉమ్మడి జిల్లా డీఐజీగా జానకీదేవి బాధ్యతల స్వీకరణ

    కాకినాడ లీగల్‌: ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ విధానంలో క్రయ విక్రయదారులకు ఓటీపీ రావడం ద్వారా రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు జరగవని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌న్‌ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ)గా సీహెచ్‌ జానకీదేవి అన్నారు. డీఐజీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలు వల ఇబ్బందులు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. ప్రస్తుతం ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు క్రయ విక్రయదారుల ఆధార్‌కు ఓటీపీ వచ్చిన తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎటువంటి తప్పులు జరగవన్నారు. అలాగే రిజిస్ట్రేషన్‌ శాఖలో ఎటువంటి లోపాలు లేకుండా వేగవంతంగా క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఐజీగా జానకీదేవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ జేఎస్‌యూ జయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్‌ రెడ్డి సత్యనారాయణ, కోనసీమ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ నాగలింగేశ్వరరావు తదితరులు కలిశారు.

  • కక్షతోనే హత్యాయత్నం

    కాకినాడ రూరల్‌: రమణయ్యపేట గ్రామ పరిధిలో సర్పవరం జంక్షన్‌ వద్ద పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న గోపికృష్ణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో సీ–4 ప్లాట్‌లో డీజిల్‌ పోసి నిప్పు పెట్టిన సంఘటనలో నిందితుడు పెంట్‌ హౌస్‌లో ఉండే పొన్నగంటి రవిచంద్రకుమార్‌ (రవి)ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సర్పవరం ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌ వివరాల ప్రకారం నిందితుడు వ్యక్తిగత కక్షతోనే 14న అర్ధరాత్రి సీ–4 ప్లాట్‌లో నివాసం ఉంటున్న పిల్లి సత్తిబాబుపై హత్యాయత్నం చేసేందుకు ప్లాట్‌ హాలులో డీజిల్‌ పోసి నిప్పు పెట్టాడని ఎస్సై తెలిపారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఏ హానీ జరగలేదని, అయితే హాలులో ఫర్నిచర్‌ పూర్తిగా దగ్ధమయిందన్నారు.

  • దేవస్థానం మాజీ చైర్మన్‌ మృతి

    మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ నేత నగరం గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ (60) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన గతంలో అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం చైర్మన్‌గా, మామిడికుదురు సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పి.గన్నవరం నియోజకవర్గ ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  • రాష్ట

    కాకినాడలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు

    రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్‌, హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థులతో హెచ్‌ఎం మూర్తి తదితరులు

    నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాల విద్యార్థులు డీఎస్‌ఏలో జరుగుతున్న ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్‌, హాకీలో ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీవీఎస్‌ఎన్‌ మూర్తి బుధవారం తెలిపారు. జిమ్నాస్టిక్స్‌ అండర్‌–14 బాలికల విభాగంలో పి.సంజన, జె.జ్వాలరాజేశ్వరి, అండర్‌–14 బాలుర విభాగంలో బి.పవన్‌, సీహెచ్‌ రాజు, అండర్‌–17 బాలుర విభాగంలో గోపాల్‌సాయి, బాలికల విభాగంలో బి.కుసుమ, నాగ నందిని, అండర్‌–19 హాకీలో జి.స్వరూప్‌ రాష్ట్ర స్థాయి పోటీలు ఎంపికయ్యారన్నారు. బుధవారం పాఠశాలో జరిగిన కార్యక్రమంలో పీడీలు వర ప్రసాద్‌, బి.శ్రీను, ఎంపికై న క్రీడాకారులను ఉపాధ్యాయులు రత్నప్రసాద్‌, విద్యార్థులు అభినందించారు.

    మలికిపురం: ఈ నెల 16న కాకినాడ స్టేడియంలో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో గుడిమెళ్లంక ఉన్నత పాఠశాల విద్యార్థి కోసెట్టి తనూజ్‌ విశేష ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అక్టోబర్‌లో కాకినాడ క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున తనూజ్‌ పాల్గొంటాడని హెచ్‌ఎం కె.రామకృష్ణ తెలిపారు.

    రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా వెయిట్‌లిఫ్టర్లు

    కాకినాడ క్రైం: అండర్‌–19 రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన 19 మంది వెయిట్‌లిఫ్టర్లు ఎంపికయ్యారు. కాకినాడలోని క్రీడా ప్రాంగణంలో బుధవారం కోచ్‌ సతీష్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 60 మందిలో 19 మంది ఎంపికయ్యారు. జయసూర్య, ఎ.రాహుల్‌, ఐ.మణికంఠ, డి.కారుణ్యముఖేష్‌, బి.రిషబ్‌, కె.సాయిదుర్గాప్రసాద్‌, జి.సుబ్రహ్మణ్యం, ఎ.సహస్ర, బి.ఇందిరాప్రియాంక, హాసిని, మాధురి, సీహెచ్‌ శ్రీసాద్విక, ఎండీ రహం, నిషాతో పాటు అండర్‌–17లో ఎం.దుర్గాప్రసాద్‌, సీహెచ్‌ సంతోష్‌కుమార్‌, బి.గాయత్రి, ఎం.నవ్యశ్రీ ఉన్నారు.

  • వాడపల్లి వెంకన్నకు రూ.1.49 కోట్ల ఆదాయం

    కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వెంకటేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ అండ్‌ ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. బుధవారం ఆలయంలోని హుండీలను 27 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో తెరచి ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,15,09,966, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.34,11,312తో మొత్తం రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. అలాగే 28 గ్రాముల బంగారం, రెండు కేజీల 180 గ్రాముల వెండి, కానుకలుగా వచ్చాయన్నారు. నాలుగు దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయన్నారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవదాయశాఖ అధికారి, ఏసీ సత్యనారాయణ వ్యవహరించారు. దేవదాయ ఇన్‌స్పెక్టర్‌ టీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, వెలిచేరు గ్రూపు దేవాలయాల ఈఓ ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

    అక్టోబర్‌ 10 నుంచి బ్రహ్మోత్సవాలు

    కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వస్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 10వ తేదీ నుంచి జరగనున్నాయని డీసీ అండ్‌ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆ మేరకు బుధవారం చక్రధరరావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వాడపల్లి క్షేత్రం భక్తుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

  • ఉత్సాహంగా టీటీ ఎంపికలు

    నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటి): విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవరచుకుని క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం డీఎస్‌ఏ టీటీ(టేబుల్‌ టెన్నిస్‌) హాల్‌లో పాఠశాల క్రీడాసమాఖ్య అండర్‌–14, 17 బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల ప్రారంభ కార్యక్రమానికి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–14, 17 కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎస్‌డీఓ శ్రీనివాస్‌ కుమార్‌ మాట్లాడుతూ టీటీ చాలా వేగవంతమైన క్రీడ అన్నారు. ఎంతో ఏకాగ్రత ఉంటేనే గాని టీటీలో రాణించలేమన్నారు. టీటీలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. సమాఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టీటీ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక చేస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో 120 మంది బాలబాలికలు ఎంపికలకు హాజరయ్యారు. అనంతరం టీటీ ఆడి డీఎస్‌డీఓ శ్రీనివాస్‌కుమార్‌ ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ సంఘ నిర్వహణ కార్యదర్శి రవిరాజు, పీడీలు పాల్గొన్నారు. ఎంపికలను ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–14, 17 మహిళా కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు.

  • ముగిసిన టీఓటీల శిక్షణ

    సామర్లకోట: పేదరికం నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్‌ ప్రిన్సిపల్‌ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని టీఓటీల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నేర్చుకున్న అంశాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఆకలి బాధలను నిర్మూలించడం, ఆరోగ్య సంరక్షణ–జీవన ప్రమాణాల పెంపు, అందరికీ తాగునీటి వసతి కల్పించడం–పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఉపాధి–ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారని వైస్‌ ప్రిన్సిపాల్‌ తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై మండలంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయా గ్రామాలకు కావసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు కె.సుశీల, కేఆర్‌ నీహారిక, ఎస్‌ఎస్‌ శర్మ, శ్రీనివాసరావు, ఎం.చక్రఫణిరావు పాల్గొన్నారు.

    సర్టిఫికెట్లు అందజేసిన వైస్‌ ప్రిన్సిపాల్‌

  • రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కు 86 మంది హాజరు

    రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు డాక్టర్‌ రెడ్డీస్‌ బుధవారం నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కి 86 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష నిర్వహించిన 54 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఇంటర్‌ూయ్వలు నిర్వహించిన అనంతరం వీరిలో సంస్థకు అవసరమైన వారిని ఎంపిక చేసి, ఉద్యోగాలు ఇస్తామని వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ తెలిపారు. 2024–25లో బీఎస్సీ, ఎంఎస్సీలో కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ పూర్తి చేసి, పదో తరగతి నుంచి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కి హాజరయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై తే బీఎస్సీ వారికి రూ.2.10 లక్షలు, ఎంఎస్సీ వారికి రూ.2.60 లక్షలు వార్షిక వేతనంగా చెల్లిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.

  • శరన్నవరాత్ర ఉత్సవాలకు  రాట పూజలు

    రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రులకు వేద పండితులు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) కుమార్తె గాదె సత్యవెంకటకామేశ్వరి, భాస్కరనారాయణ దంపతులు పూజలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 9.46 గంటలకు వినాయకపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం తదితర పూజలు చేశారు. అనంతరం పందిరి రాట వేసి ఉత్సవ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వీవీ బాపిరాజు, విజయదుర్గా కళాశాల కరస్పాండెంట్‌ పెద్దపాటి సత్యకనకదుర్గ, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Komaram Bheem

  • ‘సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు’

    కాగజ్‌నగర్‌రూరల్‌: రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న స్పష్టం చేశారు. పట్టణంలోని స్టేషన్‌రోడ్‌లో గల సీపీఎం కార్యాలయంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం భూస్వాములు, జాగీర్‌దార్లు, రజాకార్లను తరిమికొట్టారని తెలిపా రు. ఈ పోరాటంలో ఎర్రజెండా పాత్రను కప్పిపెట్టడానికి నేటి పాలకులు ప్రజాపాలన, జాతీ య సమైక్యత, విమోచన, విద్రోహ దినం అంటూ ప్రజా పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోట శ్రీనివాస్‌, ప్రజా సంఘాల నాయకులు వనమాల పద్మ, ఎన్‌.పద్మ, సుదర్శన్‌, అంగల శ్రీనివాస్‌, శంకర్‌, సంజీవ్‌ పాల్గొన్నారు.

  • పోషకాహారం.. ఆరోగ్యభాగ్యం

    కెరమెరి(ఆసిఫాబాద్‌): ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో గురువారం నుంచి పోషణమాసం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణ, మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా పోషణ మాసం నిర్వహిస్తోంది. గతంలో సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగగా, ఈ ఏడాది మాత్రం సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 16 వరకు 30 రోజుల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ప్రస్తుతం అంగన్‌వాడీ ఉద్యోగులు శిక్షణలో ఉండటంతో కార్యక్రమం ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమవుతుందని అధికారులు వెల్ల డించారు. మహిళల ఆరోగ్యం, పిల్లల విద్య వంటి నినాదాలతో అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

    పోషకాహార లోపం.. రక్తహీనత

    జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు సరైన ఆహారం తీసుకోవడం లేదు. ఫలితంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత ఉండటంతో పుట్టబోయే బిడ్డలపై ప్రభావం పడుతోంది. పాలిచ్చే తల్లులు కూడా పోషకాహారం తీసుకోకపోవడంతో చిన్నారులు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల్లో మానసిక, శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండడం లేదు. ఆయా సమస్యలను రూపుమాపడం, పోషకాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏటా నెలరోజులపాటు పోషణ మాసం నిర్వహిస్తుంది. నాలుగు వారాలపాటు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టనున్నారు.

    కార్యక్రమాలు ఇవే..

    పకడ్బందీగా నిర్వహించాలి

    ఆసిఫాబాద్‌: పోషణమాసం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎనిమిదో రాష్ట్రీయ పోషణ మాసం– 2025లో భాగంగా అక్టోబర్‌ 16 వరకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌, డీఆర్‌డీవో దత్తారావు, డీఎంహెచ్‌వో సీతా రాం, డీపీవో భిక్షపతి పాల్గొన్నారు.

    భాగస్వాములు కావాలి

    జిల్లాలో గురువారం నుంచి పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతీ వారం షెడ్యూల్‌ ప్రకారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు భాగస్వామ్యులు కావాలి. ఈ కార్యక్రమం ఈ నెల 17 నుంచే ప్రారంభించాల్సి ఉంది. అయితే అంగన్‌వాడీ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతుండడంతో ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నాం.

    – భాస్కర్‌, ఐసీడీఎస్‌ పీడీ

  • బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

    ఆసిఫాబాద్‌అర్బన్‌: శాంతిభద్రతలో పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణకు అత్యంత వైభవమైన ఘన చరిత్ర, అఖండమైన వారసత్వం ఉందన్నారు. గొప్ప చారిత్రాత్మక వారసత్వం, మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్‌ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. ఆపరేషన్‌ పోలో చర్య ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. నిజాయతీగా విధులు నిర్వర్తించి జిల్లా పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదుద్దీన్‌, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, సీఐలు, ఆర్‌ఐ లు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె’

    ఆసిఫాబాద్‌రూరల్‌: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీవేజ్‌ సిబ్బందికి పెండింగ్‌ వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు. బుధవారం సమ్మె ఆరో రోజుకు చేరుకోగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కుమురం భీం చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కు మురంభీం విగ్రహానికి పూలమాల వేసి నిరసన తె లిపారు. ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఏడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతుండగా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్‌, సదాశివ్‌, వర్కర్లు గంగుబాయి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్‌, సంతోష్‌, రమేశ్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

  • గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపర్చాలి

    ఆసిఫాబాద్‌: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఎంపికై న 13 మంది వైద్యులకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నియామక పత్రాలు అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించినట్లు తెలిపారు. విధుల్లో చేరిన వైద్యులు సమయపాలన పాటిస్తూ నిబద్ధతతో పని చేయాలన్నారు. రోగులతో సహనంగా వ్యవహరించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని, అవసరమైన మందులు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త అవినాశ్‌ కుమార్‌, వైద్యులు పాల్గొన్నారు.

  • వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

    ఆసిఫాబాద్‌అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ పేరిట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం సూపరింటెండెంట్‌ ప్రవీణ్‌తో కలిసి స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ను ప్రారంభించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో 15 రోజులపాటు రోజుకు నాలుగు చొప్పున ప్రతీ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మెడికల్‌ కాలేజీల్లో పనిచేసే గైనకాలజీ, నేత్ర, డెర్మటాలజీ, డెంటల్‌, తదితర వైద్యులు మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే బీపీ, షుగర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, రక్తహీనత బారిన పడకుండా కిశోర బాలికలు, మహిళలకు అవగాహన కల్పించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • వాస్తు శిల్పులకు ఆదర్శప్రాయుడు

    ఆసిఫాబాద్‌అర్బన్‌: నేటి వాస్తు శిల్పులకు విశ్వకర్మ ఆదర్శప్రాయుడని శాసన మండలి డిప్యూ టీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా బీసీ అధికారి సజీవన్‌ అధ్యక్షతన నిర్వహించిన విశ్వకర్మ జయంతికి కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎస్పీ చిత్తరంజన్‌, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాతో కలిసి హాజరయ్యారు. మొ దట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆ ర్కిటెక్చర్‌ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఎన్నో రాజ భవనాలు నిర్మించిన గొప్ప నైపుణ్యకారుడు విశ్వకర్మ అని కొనియాడారు. ఇంజినీరింగ్‌ వృత్తిదారులకే కాకుండా చేతివృత్తి కళాకారులు కూడా ఆయనను అనుసరించారని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మ న్‌ అలీబిన్‌ అహ్మద్‌, విశ్వబ్రాహ్మణ సంఘం నా యకులు భాస్కరచారి, వేణుగోపాల్‌, రాధాకృష్ణచారి, సంతోష్‌చారి, అశోక్‌చారి, సురేశ్‌చారి, వెంకటేశ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Khammam

  • హామీల

    ఖమ్మంసహకారనగర్‌: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన ఖమ్మం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 2వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఉత్పత్తికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారికి సోలార్‌ పంపుసెట్లు అందిస్తామని తెలిపారు. జిల్లాలో కొత్తగా 24,818 కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులు జారీ చేశామని చెప్పారు.

    70వేల మందికి ఉచిత విద్య..

    జిల్లాలో 1,257 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 70,257 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారని భట్టి తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద 1,840 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 12,542 మంది గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులు 35,282 మందికి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన, రూ.130 కోట్లతో వైద్య కళాశాల భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.139 కోట్లతో పది రెండు లేన్ల రోడ్లను నాలుగు వరుసల రహదారులుగా విస్తరిస్తామని అన్నారు. మధిర, సత్తుపల్లిలో రూ.34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ 100 పడకల ఆస్పత్రులు, కల్లూరులో రూ.10.50 కోట్లతో 50 పడకల సీహెచ్‌సీ, పెనుబల్లిలో రూ.7.50 కోట్లతో 30 పడకల కమ్యూనిటీ సెంటర్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను భట్టి సందర్శించి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, డీఆర్‌ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైన, నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

    అంకితభావంతో సేవలందించాలి

    ఖమ్మంవైద్యవిభాగం: ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు ప్రజారోగ్యం పట్ల అంకిత భావంతో సేవలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బుధవారం ఆయన వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని, ఎన్ని అవాంతరాలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కావొద్దనే లక్ష్యంతో చాలా ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ పరిధిలో చేర్చుకుందని తెలిపారు. జిల్లా స్థాయిలో కో–ఆర్డినేటర్ల ద్వారా మానిటరింగ్‌ చేస్తూ రూ.కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రి పొల్యూషన్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌, బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో నాణ్యతలు పాటించాలని, పేషెంట్‌తో పాటు అతడితో వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య సేవలకు, సర్జరీలకు తీసుకునే చార్జీల వివరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం నియమ, నిబంధనలు ప్రైవేట్‌ ఆస్పత్రులు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ డా.పి.శ్రీజ, డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నరేందర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందునాయక్‌, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • మరో సర్వేకు అడుగులు

    సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్‌తోపాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కొత్తగూడెంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులో చిన్న విమానాలతోపాటు ఎయిర్‌బస్‌ వంటి భారీ విమానాలు ల్యాండింగ్‌, టేకాఫ్‌ తీసుకునేందుకు వీలుగా మూడు కిలోమీటర్ల పొడవైన రన్‌వే నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 950 ఎకరాల భూమి అవసరమని భావించారు. కొత్తగూడెం మండల పరిధిలోని రామవరం, గరీభ్‌పేట శివారులలో 707, సుజాతనగర్‌ మండల పరిధిలో 195, చుంచుపల్లి మండల పరిధిలో 50 ఎకరాల స్థలాలను కూడా గుర్తించారు. ఇక్కడున్న ఎత్తైన గుట్టలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా నిలిచాయి. మరోవైపు వరంగల్‌, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుల విషయంలో సానుకూల ఫలితాలు వచ్చి క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. దీంతో సెప్టెంబరు 16న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడికి కొత్తగూడెం ఎయిర్‌పోర్టు కోసం విజ్ఞప్తి చేయగా.. మరోసారి ఫీజుబులిటీ సర్వేకు అడుగులు పడ్డాయి.

    ఇరవై ఏళ్లుగాఽ అదే సమస్య

    కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మించాలనే అంశంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన స్థలాన్ని ఎంపిక చేయడమే సవాల్‌గా మారింది. భవిష్యత్‌లో బోయింగ్‌ విమానాలు దిగేందుకు వీలుగా వెయ్యి ఎకరాల్లో ఎయిర్‌పోర్టు కోసం సుజాతనగర్‌ ప్రాంతంలో భూములు వెతికారు. అయితే అది సాధ్యపడలేదు. చివరకు ఎయిర్‌కార్గో సేవల కోసం ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక ఆ తర్వాత పాల్వంచ మండలం గుడిపాడు – బంగారుజాలల మధ్య ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. పాల్వంచ పట్టణాన్ని అనుకుని ఉన్న ఎత్తైన గుట్టలు, కేటీపీఎస్‌ చిమ్నీలు, కూలింగ్‌ టవర్ల వల్ల సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఈ ప్రతిపాదన అక్కడే ఆగిపోయింది.

    ఎంతో ఉపయుక్తం

    జిల్లాలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశం నలుమూలల నుంచి భద్రాచలం క్షేత్రానికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి గనులు, హెవీ వాటర్‌ ప్లాంట్‌, ఐటీసీ, కేటీపీఎస్‌, బీటీపీఎస్‌ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా మెడికల్‌ కాలేజీ, డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటైంది. దేశం మొత్తం మీద ఎర్త్‌ సైన్సెస్‌ విభాగంలో ప్రత్యేక కోర్సులు అందిస్తున్న వర్సిటీగా ఇది నిలిచింది. త్వరలోనే సేంద్రియ సాగు విధానానికి సంబంధించి ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ కూడా జిల్లాకు రానుంది. మరోవైపు అడవులు విస్తారంగా ఉండటంతో ఎకో టూరిజానికి ఈ ప్రాంతం అనువుగా ఉంది. ఇప్పటికే ఎకో టూరిజంలో ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి, పాపికొండలు, సీలేరు – పొల్లూరు వాటర్‌ఫాల్స్‌ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు భద్రాచలం గేట్‌వేగా ఉంది. ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలు ఈ ప్రాంతంలో పుంజుకుంటాయి. సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఆస్కారముంది.

    ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సుజాతనగర్‌, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ఎన్నిసార్లు స్థలాలను గుర్తించినా ఎత్తైన కొండలు, అభయారణ్యం, హై టెన్షన్‌ కరెంటు లైన్లు, రైల్వే మార్గాలు, నేల స్వభావం, గాలుల తీవ్రత, నీటి ప్రవాహాలు వంటి భౌగోళిక, సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ మండలాలను మినహాయించి భద్రాచలం – కొత్తగూడెం మధ్య ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాలను పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు సైతం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు మూడు చోట్ల స్థలాలను గుర్తించగా, ఇందులో ఒక స్థలాన్ని ఎయిర్‌పోర్టు కోసం ఫైనల్‌ చేయనున్నట్టు సమాచారం.

  • పేదల సంక్షేమానికి పెద్దపీట

    తిరుమలాయపాలెం: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘స్వస్థ్‌ నారీ.. సశక్త్‌ పరివార్‌’ కార్యక్రమాన్ని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తోందని, ఈ రెండు రంగాలకు పుష్కలంగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తోందని, ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదుకుంటోందని చెప్పారు. వైద్యాధికారులు అంకితభావంతో పని చేయాలని, దూర ప్రాంతాల నుంచి రావడం, ఒక గంట సేపు ఉండివెళ్లడం వంటివి చేయొద్దని సూచించారు. వైద్యులు దేవుడితో సమానమని, రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. తిరుమలాయపాలెం ఏరియా ఆస్పత్రి 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్‌ అయిందని, కొత్త స్కానింగ్‌, ఎక్స్‌ రే మిషన్లు, ఇతర పరికరకాలను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు చేపట్టిన స్వస్థ్‌ నారీ.. సశక్త్‌ పరివార్‌ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆస్పత్రిలో అందుతున్న ఓపీ, ఐపీ సేవలను పరిశీలించారు. అనంతరం కంటి పరీక్షల యూనిట్‌, ఇతర ఓపీ సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత పోషణ మాసం –2025 పోస్టర్‌ను పొంగులేటి ఆవిష్కరించారు. 21 మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రూ.1.50 కోట్లతో చేపట్టనున్న తిరుమలాయపాలెం – ములకలపల్లి హై లెవల్‌ బ్రిడ్జి అప్రోచ్‌ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.

    ఉద్యమంలా చేపట్టాలి..

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వస్థ్‌ నారీ–సశక్త్‌ పరివార్‌ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. ప్రతీ మహిళ, పిల్లలు పరీక్షలు చేయించుకునేలా ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. స్పెషలిస్ట్‌ వైద్యులతో క్యాంపులు నిర్వహించి ఉచిత పరీక్షలు, చికిత్స అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో సీపీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాసరెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందూనాయక్‌, వైద్యాధికారులు డాక్టర్‌ కృపా ఉషశ్రీ అమర్‌సింగ్‌, బొల్లికొండ శ్రీనివాసరావు, వైదేహి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్‌ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, డీఈ వేణుగోపాల్‌ డీపీఓ రాంబాబు, తహసీల్దార్‌ విల్సన్‌, ఎంపీడీఓ సిలార్‌ సాహెబ్‌, ఆత్మ చైర్మన్‌ చావా శివరామకృష్ణ, రామసహాయం నరేష్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్‌, మంగీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

  • మతాల మధ్య చిచ్చుకు కుట్ర
    ● సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులుముతారా..? ● సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ

    ఖమ్మంగాంధీచౌక్‌: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి శక్తులు మత పరమైన రంగు పులుముతున్నాయని సీపీఎం జాతీయ ప్రధా న కార్యదర్శి ఎం.ఎ.బేబీ విమర్శించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం రాత్రి జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడా రు. ఈ పోరాటంలో శ్రామికులు, కార్మికులు, రైతులు భాగస్వాములయ్యారని, మహిళల భాగస్వామ్యం కూడా గొప్పదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరులో అనేక మంది ప్రాణత్యాగం చేశారని నివాళులర్పించారు. దున్నేవాడికే భూమి కావాలని భూ స్వాములకు ఎదురొడ్డి పోరాటం సాగిందని, దీని ఫలితంగానే లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచారని తెలిపారు. అయితే కేంద్రంలోని నేటి పాలకులు ఈ పోరాటానికి మతం రంగు పులుము తూ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దీన్ని ముస్లింలకు – హిందువులకు మధ్య జరిగిన పోరాటమని కొందరు వక్రీకరిస్తూ విమోచన, విలీనం, విద్రోహం అనే పేర్లతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హక్కులు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి, అత్యాచారాల నిరోధంతో పాటు దున్నే వాడిదే భూమి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, నాయకులు బండి రమేష్‌, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎం. సుబ్బారావు, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు.

Kamareddy

  • తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు

    వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు

    తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ చరిత్రను 1948 సె ప్టెంబర్‌ 17 మలుపుతిప్పిన రోజని, శతాబ్దాల బాని స సంకెళ్లను తుంచి స్వాతంత్య్రం పొందిన ఉద్విఘ్న సందర్భమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ ఫెసర్‌ యాదగిరిరావు అన్నారు. ప్రజాపాలన దినో త్సవం సందర్భంగా బుధవారం తెయూ పరిపాల నా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజరికం పరిసమాప్తమై తెలంగాణ సమాజం నిజాం కబందహస్తాల నుంచి విమోచన పొందిన రోజన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ్‌ మామిడాల, అ ధ్యాపకులు పాత నాగరాజు, శాంతాబాయి, పీఆ ర్వో పున్నయ్య, టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

  • తాగున

    కంబాపూర్‌ గ్రామస్తులకు

    వ్యవసాయ బోరుబావులే దిక్కు

    సమస్య గురించి పట్టించుకోని

    అధికారులు

    పిట్లం(జుక్కల్‌): కొన్ని రోజులుగా కంబాపూర్‌ గ్రామస్తులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామం మొత్తానికి రెండు సింగిల్‌ ఫేజ్‌ మోటార్లున్నాయి. కాని ఆ నీళ్లు అన్ని ఇళ్లకు సరిపోవడం లేదు. మిషన్‌ భగీరథ నీళ్లు మంచిగా రావడం లేదు. అవి కూడా 2 బిందెల కంటే ఎక్కువ రాకపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. గత నెల నుంచి గ్రామంలో నీటి సమస్య తీవ్రమైంది. పలు మార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. చేసేదేమీ లేక గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పొలం గట్ల మీద నడుచుకుంటూ తెచ్చుకుంటున్నామని, పలుమార్లు జారిపడి దెబ్బలు తగులుతున్నాయని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది దూర ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామంలో నీటి సమస్య వల్ల కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

    గ్రామంలో గత నెల నుంచి నీటి సమస్య తీవ్రమైంది. నీటిని పొలాల నుంచి తెచ్చుకుంటున్నాం. నీళ్లు లేక పనులకు కూడా వెళ్లలేకపోతున్నాం. గ్రామం నుంచి వ్యవసాయ భూమికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – కృష్ణ, కంబాపూర్‌

    గ్రామంలో నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వ్యవసాయ బోరు బావుల నుంచి పిల్లలు, మేము కలిసి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఈ సమస్య వల్ల పిల్లలను పాఠశాలలకు సమయానికి పంపలేక పోతున్నాం. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – సాయగౌడ్‌, కంబాపూర్‌

  • కామారెడ్డి రూరల్‌: విశ్వ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి సమాజంలో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం దేవునిపల్లిలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. 

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతి ప్రాధాన్యతను వివరిస్తూ ఆయన ఆశీస్సులతో కార్మికుల సంక్షేమం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు, దేవునిపల్లి అధ్యక్షుడు వడ్ల వెంకటరమణ, గౌరవ అధ్యక్షుడు రాములు చారి, ప్రధాన కార్యదర్శి లింబాద్రిచారి, కోశాధికారి మురళి చారి, ఉపాధ్యక్షుడు రమేష్‌ చారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

    వరద బాధిత విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు

    కామారెడ్డి టౌన్‌: ఏబీవీపీ ఆధ్వర్యంలో వరద బాధిత విద్యార్థుల కోసం సేకరించిన పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రి పంపిణీ వాహనాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల వర్షం బీభత్సం వల్ల కాలనీలు జలమయం కావడంతో భారీ నష్టంతో పాటు విద్యార్థులకు నష్టం కలిగిందన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘గిఫ్ట్‌ ఏ నోట్‌ బుక్‌’ పేరిట కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు సామాగ్రి పంపిణీ చేయబోవడం అభినందనీయమన్నారు. ఏబీవీపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్‌ మోహన్‌, నాయకులు పాల్గొన్నారు.

    పాఠశాలకు టీవీ వితరణ

    మాచారెడ్డి: మండల కేంద్రంలోని శ్రీరామ్‌ నగ ర్‌ ప్రాథమిక పాఠశాలకు బుధవారం అదే గ్రా మానికి చెందిన పూర్వ విద్యార్థి రాగుల నర్సింగరావు మన బడి పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రూ.50 వేల విలువైన టీవీని అందజేశారు. ఐక్య వేదిక అధ్యక్షుడు ప్రభాకర్‌ మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడానికి టీవీ తోడ్పడుతుందని అన్నారు.పాఠశాల హెచ్‌ఎం స్వ ప్న.. దాతతో పాటు పూర్వ విద్యార్థుల ఐక్య వే దిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు సుష్మ, ఐక్య వేదిక సభ్యులు కలిమెల రాజిరెడ్డి, రాగుల దేవరాజు, చల్ల కృష్ణారెడ్డి ఉన్నారు.

  • క్రైం

    కుక్కల దాడిలో మేకల మృతి

    నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందాయి. నందిపేటకు చెందిన ఎస్‌కే. అజీం తన ఇంటి ఎదుట రెండు మేకలను కట్టేసి ఉంచాడు. కాగా, ఒక్కసారి గుంపులుగా వచ్చిన కుక్కలు దాడి చేసి రెండు మేకల గొంతులను పట్టేసాయి. మేకల అరుపులు విని కుక్కలను తరిమివేసే ప్రయత్నం చేసినా కుక్కలు మేకలను విడిచి పెట్టకుండా వాటి తల, మొండెం భాగాలను వేరు చేశాయి.

    ఎల్లారెడ్డిరూరల్‌: రేసు కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 9 గొర్రెలు, ఒక మేక మృతి చెందినట్లు బాధితుడు రవి తెలిపారు. మండలంలోని తిమ్మారెడ్డి కట్టకింది తండాకు చెందిన రవి గొర్రెల మందపై రేసు కుక్కలు దాడి చేశాయి. ఘటనా స్థలాన్ని బీట్‌ ఆఫీసర్‌ మౌనిక పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరారు.

    మెండోరాలో భారీ చోరీ

    ఆరు తులాల బంగారం అపహరణ

    బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేర రామకృష్ణ దంపతులు మెండోరా మండల కేంద్రంలో కిరాణాషాపును నిర్వహిస్తారు. రోజూ ఇంటికి తాళం వేసి వచ్చి షాపులో ఉంటారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు తాళం పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం పాఠఽశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళం పగుల గొట్టి ఉండడాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసేలోపు భారీ చోరీ జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీధర్‌ రెడ్డి, ఎస్సై సుహాసిని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

  • సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజం

    బాన్సువాడ రూరల్‌: సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని బాన్సువాడ సీడీపీవో సౌభాగ్య అన్నారు. తాడ్కోల్‌ రైతువేదికలో సీ్త్రశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ బీ..పడాయి బీ మాసోత్సవంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 3 రోజులుగా వివిధ సెక్టార్‌లకు చెందిన సూపర్‌వైజర్లు కార్యక్రమం విజయవంతానికి అంగన్‌వాడీ టీచర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారన్నారు. అక్టోబర్‌ 16 వరకు జరిగే పోషణ మాసాన్ని విజయవంతం చేయాలని కోరారు. సూపర్‌వైజర్లు షహనాజ్‌బేగం, రాజేశ్వరి, పద్మ, సుమలత, మాధురి, తదితరులు పాల్గొన్నారు.

    క్యాసంపల్లిలో..

    కామారెడ్డి రూరల్‌: క్యాసంపల్లి రైతు వేదికలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లకు పోషణ్‌ బీ పడాయి బీ కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌లు, పోషన్‌ అభియాన్‌ కో–ఆర్డినేటర్‌, 100 మంది అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

  • గ్రామ

    లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు పోల్కంపేట, పోతాయిపల్లి, మోతె, బాణాపూర్‌, భవానిపేట, ముంబోజిపేట తదితర గ్రామాల్లో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాల్లో ‘స్వస్త్‌ నారీ..స్వశక్త్‌నారీ’ కార్యక్రమంలో భాగంగా 56 మందికి పరీక్షలు చేసి చికిత్స అందజేశారు. కార్యక్రమంలో జనరల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ రమాదేవి, పీహెచ్‌సీ వైద్యులు రాంబాయి, సీహెచ్‌వో రమేశ్‌, పర్యవేక్షకులు ఫరీదా, చంద్రకళ, యాదగిరి, గీత, భాగ్య, అంజలి, పాలవ్వ, కవిత, తదితరులు పాల్గొన్నారు.

    హన్మాజీపేట్‌ పీహెచ్‌సీ పరిధిలో..

    బాన్సువాడ రూరల్‌: స్వస్త్‌నారీ..స్వశక్త్‌నారీ కార్యక్ర మం బుధవారం హన్మాజీపేట్‌ పీహెచ్‌సీలో ప్రారంభించారు. కార్యక్రమం వచ్చే నెల 2 వరకు కొనసాగుతుందని పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ ఇమ్రాన్‌ తెలిపారు. తొలిరోజు మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు మహిళలకు దీర్ఘకాలిక రోగా లు, బీపీ, షుగర్‌, టీబీ, గుండెపోటు, పక్షవాతం, రక్తనాళాలు దెబ్బతినడం తదితర వ్యాధులకు పరీ క్షించి ఉచితంగా వైద్యం అందజేస్తామని డాక్టర్‌ తెలిపారు. కోనాపూర్‌లోనూ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

  • మోదీ జన్మదినం  కాదు నిరుద్యోగ దినం

    బాన్సువాడ: ప్రధాన మంత్రి మోదీ జన్మదినం కాదని సెప్టెంబర్‌ 17న జాతీయ నిరుద్యోగ దినం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. జాతీయ యువజన కాంగ్రెస్‌ పిలుపు మేరకు బుధవారం జాతీయ నిరుద్యోగ దినం నిర్వహించారు. నిరుద్యోగులతో కలిసి టీ అమ్ముతూ, బైక్‌ రిపేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి గద్దె ఎక్కిందన్నారు. అధికారంలో రాగానే నిరుద్యోగుల పొట్టగొడుతుందని మండిపడ్డారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేయాలని అన్నా రు. నాయకులు మన్సూర్‌, తిరుమల్‌రెడ్డి, సలీం, శ్రీనివాస్‌, అందే రమేష్‌, గౌస్‌ తదితరులున్నారు.

    నిజాంసాగర్‌(జుక్కల్‌): జుక్కల్‌ నియోజకవర్గం ఎస్సీ సెల్‌ చైర్మన్‌గా చలామణి అవుతున్న సౌదాగర్‌ అరవింద్‌కు కాంగ్రెస్‌ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అరవింద్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

  • సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి

    మద్నూర్‌/బిచ్కుంద(జుక్కల్‌): ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు రావాలని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులకు బుధవారం దుప్పట్లు, దుస్తులు ఇతర సరుకులను సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజన్న చేతులు మీదుగా పంపిణీ చేశారు. బిచ్కుంద, మద్నూర్‌లలో ఈ కిట్లను అందించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తదానం, హెల్త్‌ క్యాంపులు నిర్వహించడంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తహసీల్దార్‌ వేణుగోపాల్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర సభ్యుడు సంజీవ్‌, నరసింహ, వేణుగోపాల్‌, రచ్చ శివకాంత్‌, డాక్టర్‌ నర్సింలు, ఓంప్రకాష్‌ పాల్గొన్నారు.

Dr B R Ambedkar Konaseema

  • Road conditions at Jagannathapuram

    సాక్షి, అమలాపురం: గుంతలు లేని రోడ్లు.. గోతులు లేని రోడ్లు.. కొత్త కొత్త రోడ్లు.. సాఫీగా సాగిపోయే ప్రయాణం అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకూ, చోటా నాయకుడి నుంచి రాష్ట్ర మంత్రుల వరకూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడా కొన్ని రోడ్లకు మరమ్మతులు చేసి మొత్తం జిల్లాలోని రోడ్లు అన్నీ తీర్చిదిద్దామని గొప్పలకు పోతున్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.32 కోట్లతో రోడ్లను ఆధునీకరించామన్నారు. అయితే ఏడాది కూడా కాకుండానే పూడ్చిన గోతులకు తోడు, కొత్త గోతులు వచ్చి చేరాయి. రెండు రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఇంచుమించు ప్రతి నియోజకవర్గంలోనూ గోతుల్లో నీరు చేరి ప్రయాణం నరక ప్రాయంగా మారింది. ఇక పంచాయతీరాజ్‌ రోడ్లను నిధుల కొరత పట్టి పీడిస్తోంది. ఉపాధి పథకంలో వీధుల్లో వేసిన సీసీ రోడ్లకు సొమ్ములు లేవు. దీనితో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో మండలాల వారీగా రోడ్ల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు

    అమలాపురం

    అమలాపురం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రధాన ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రోడ్లు గోతులమయంగా మారాయి. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నివాసముండే హౌసింగ్‌ బోర్డుకు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. నల్ల వంతెన – ఎర్ర వంతెనల మధ్య ఉన్న ఈ రోడ్డుపై గోతులు లెక్క పెడితే గిన్నిస్‌ బుక్‌లో పేరు నమోదు చేస్తారనే స్థాయిలో ఈ రోడ్డు ఉందని సామాజిక మాధ్యమాలలో సైటెర్లు వస్తున్నారు. కానీ ఈ రోడ్డు కనీస మరమ్మతులకు మాత్రం నోచుకోలేదు.

    ఎమ్మెల్యే ఆనందరావు సొంత మండలం ఉప్పలగుప్తంలో రోడ్లు దుస్థితికి ఉప్పలగుప్తం నుంచి మునిపల్లి, చినగాడవిల్లి మీదుగా ఉప్పూడి వెళ్లే ప్రధాన రహదారి ఒక మచ్చుతునక. మునిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పొడవునా వర్షం నీటితో చెరువును తలపిస్తోంది. చినగాడవిల్లి వద్ద స్థానికులు కొంత వరకు ఉన్న పీఆర్‌ రోడ్డుకు మరమ్మతులు చేసుకున్నారు. అక్కడ మినహా మిగిలిన చోట్ల నీటితో నిండిపోయింది.

    ఆలమూరు  

    ఆలమూరు మండలం కొత్తూరు నుంచి వెదురుమూడి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానంగా మారింది. పేరుకు రోడ్డు గానీ అన్నీ గోతులే. గోతులు పూడ్చిన రహదారిపై గోతులు పడ్డాయి. వర్షం కురిసి రోడ్డు మునిగితే ఎక్కడ గొయ్యి ఉందోకూడా తెలియని పరిస్థితి నెలకొంది.

    అయినవిల్లి

    అయినవిల్లి మండలం ముక్తేశ్వరం నుంచి కె.జగన్నాథపురం మీదుగా ముమ్మిడివరం వెళ్లే రహదారి గోతులతో నిండిపోయింది. సుమారు 10 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొరగా మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మరిన్ని గోతులు పడడంతో ప్రయాణం చేసే పరిస్థితి లేదు.

  • అమలాపురం రూరల్‌: అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి హైదారాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే ఏసీ బస్సుల సమయాలను బుధవారం నుంచి స్వల్పంగా మార్పు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎస్‌టీపీ రాఘవ కుమార్‌ తెలిపారు. అమలాపురం నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరే సర్వీస్‌ ( 2456)ను 5 గంటలకు, 7.30 సర్వీస్‌ (23545)ను 7 గంటలకు, మధ్యాహ్నం 12.30 సర్వీస్‌ (23507)ను 12 గంటలకు మార్పు చేశామన్నారు.

    బార్ల లైసెన్సులకు దరఖాస్తులు నిల్‌

    అమలాపురం టౌన్‌: జిల్లాలోని బార్ల లైసెన్సులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని జిల్లా ఇన్‌చార్జి ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రేణుక తెలిపారు. రెండో విడత నోటిఫికేషన్‌ ప్రకారం జిల్లాలోని పది బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం (17వ తేదీ) ఆఖరి గడువన్నారు. కానీ రాత్రి 7.30 గంటల వరకూ ఒక్క దరఖాస్తు కూడా రాలేదని చెప్పారు. కాగా.. జిల్లాకు మొత్తం 11 బార్లు కేటాయించారు. వీటిలో రెండు గీత కులాలకు ఇచ్చారు. అయితే గత నెల 29న ఇవే బార్లకు దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా అమలాపురంలోని మూడు బార్లకు గాను ఒక బార్‌కు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీంతో మిగిలిన పదింటికి రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే వీటికి ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.

    విశ్వకర్మకు నివాళి

    అమలాపురం రూరల్‌: సమాజంలో ప్రతి పనికీ విశ్వకర్మ ప్రేరణ ఉందని, ఆయన స్ఫూర్తి ప్రదాత అని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను విశ్వకర్మ స్ఫూర్తితో చేపట్టాలన్నారు. డీఆర్వో మాధవి, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పి.జ్యోతిలక్ష్మీదేవి, ఏవో కాశీ విశ్వేశ్వరరావు జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

    స్మార్ట్‌ కార్డుల్లో జిల్లా పేరు సరిదిద్దడానికి చర్యలు

    అమలాపురం రూరల్‌: కొన్ని స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో జిల్లా పేరు తూర్పుగోదావరిగా నమోదు కావడంతో దాన్ని సరిదిద్దడానికి చర్యలు తీసుకున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ప్రకటన విడుదల చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అభిమానులు, ప్రజలు, సామాజిక సంఘాల ప్రతినిధుల మనోభావాలు, ఆవేదనను జిల్లా యంత్రాంగం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమగా మార్పు చేశామన్నారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఇది కనిపిస్తుందన్నారు. ఎడిట్‌ ఆప్షన్‌ రాగానే భౌతికంగా కార్డుల్లో జిల్లా పేరు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపిందన్నారు.

    ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలో మిగిలిన సీట్లకు నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంవీజే వర్మ బుధవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా ఏదైనా ఆన్‌లైన్‌ సెంటర్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను కాకినాడ ఐటీఐలో వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు 29వ తేదీన, ప్రైవేట్‌ ఐటీఐలో ప్రవేశాలకు 30వ తేదీన హాజరుకావాలని, ఇతర వివరాలకు 94404 08182 నంబరుకు సంప్రదించాలన్నారు.

    20న జాబ్‌మేళా

    బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. కృష్ణప్రభాస్‌ పేపర్‌ లిమిటెడ్‌ 25, టీమ్‌లీజ్‌ సంస్థ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, పదో తరగతి అపై ఐటీఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 86398 46568 నెంబరుకు సంప్రదింవచ్చన్నారు.

  • వైద్య

    రేపు కామనగరువులో ఆందోళన

    వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

    జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌

    రామచంద్రపురం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్‌ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటుకు తలపెట్టి, ఐదు కళాశాలలను పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఈ నేపథ్యంతో పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 9:30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలోని కామనగరువులో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల వద్ద యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నామన్నారు. కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులు, సమన్వయకర్తలు, కార్యకర్తలు, యువజన నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తరలిరావాలన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పోలినాటి వర ప్రసాద్‌, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మాదిరెడ్డి పృథ్వీ రాగ్‌, కె.గంగవరం మండలం యువజన విభాగం అధ్యక్షుడు మేడిశెట్టి గోవింద రాజు, రామచంద్రపురం టౌన్‌ యువజన విభాగం అధ్యక్షుడు సెలగాల మధు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు లంక నవీన్‌, ఎ.దొరబాబు పాల్గొన్నారు.

    విజయవంతం చేయాలి

    తాళ్లరేవు: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న చలో మెడికల్‌ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి వుంగరాల సంతోష్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం మెడికల్‌ కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారన్నారు.

  • రత్నగిరిపై ఏకాదశి పూజలు

    స్వామివారిని దర్శించిన 20 వేల మంది

    దేవస్థానికి రూ.20 లక్షల ఆదాయం

    అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి భాద్రపద బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు స్వర్ణపుష్పాలతో అర్చన చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన, అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రసాదాలు నివేదించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్‌, కొండవీటి రాజా తదితరులు ఈ పూజలు నిర్వహించారు.

    సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి రావడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. స్వామివారి వ్రతాలు 1,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.

  • విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

    అమలాపురం రూరల్‌: రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర, డిస్కం ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు బుధవారం అమలాపురంలోని ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ ఆఫీస్‌ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని డివిజన్ల యూనియన్లు, అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్‌ శాఖ ఉద్యోగులు హాజరై, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జేఏసీ చైర్మన్‌ ఎంవీ రమణ, జిల్లా కన్వీనర్‌ ఎ.రాజారత్నం మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగులకు, పెన్షనర్ల కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని, ప్రభుత్వంలో సీపీఎఫ్‌ కూడిన పెన్షన్‌ నిబంధనలను 1999 ఫిబ్రవరి ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు నియమించిన ఉద్యోగులకు వర్తింప చేయాలని, కాంట్రాక్ట్‌ లేబర్‌, అవుట్‌ సోర్పింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

  • నానో అభ్యుదయ రైతులకు సన్మానం

    ముమ్మిడివరం: నానో ఎరువుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు అన్నారు. తన కార్యాలయంలో బుధవారం జిల్లా నానో అభ్యుదయ రైతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోసుబాబు మాట్లాడుతూ గత రెండు సీజన్లలో నానో ఎరువులు ఉపయోగించి అభ్యుదయ రైతులు మంచి ఫలితాలు సాధించారన్నారు. ఇఫ్కొ నానో బాటిల్‌ కొనుగోలుపై రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా ఉచితంగా అందిస్తుందన్నారు. నానో అభ్యుదయ రైతులైన మండపేట వెలగతోడుకు చెందిన ఎం.రామసురేష్‌, తాపేశ్వరానికి చెందిన డి.సతీష్‌, అలమూరు మండలానికి చెందిన బి.అబ్బులు చౌదరి, ముమ్మిడివరం మండలం ఠానేల్లంకకు చెందిన పోలిశెట్టి బోస్‌ శ్రీనివాసరావులను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సహయ సంచాలకులు ఎంఏ షంశీ, వ్యవసాయాధికారులు ఏ.అచ్యుతరావు, ఎస్‌.ప్రశాంత కుమార్‌, ఇఫ్కొ జిల్లా మేనేజర్‌ శ్యామ్‌ ప్రసాద్‌బాబు, రైతులు పాల్గొన్నారు.

  • మందకొ

    1.61 లక్షల ఎకరాల్లో నమోదు

    మారిన నిబంధనలతో వీఏఏల అవస్థలు

    ఈ నెలాఖరు వరకు గడువు

    నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు

    కొత్తపేట: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు అవుతోంది. రైతులకు అన్ని విధాలా ఉపయోగకరమైన పంట నమోదు (ఈ–క్రాప్‌) మాత్రం అనుకున్నట్లు సాగడం లేదు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నాటికి 50 శాతం కూడా పంట నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వీఏఏలపై ఒత్తిడి చేస్తున్నారు. వీఏఏలకు పని ఒత్తిడి, గ్రామాలకు కొత్తవారు కావడం, ఎరువుల పంపిణీతో పాటు కొన్ని నిబంధనలు మార్చడంతో అనుకున్నట్లుగా పంట నమోదు జరగడం లేదు. రైతుల మేలు కోసం గత ప్రభుత్వం ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. పంట నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ వర్తింపజేసింది. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 3,90,708 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరితో పాటు ఉద్యానవన పంటలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నెల 30వ తేదీ లోగా నమోదు చేయాలి. ఇంకా కేవలం 14 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోగా పూర్తి చేయాలని అధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. సకాలంలో పంట నమోదు జరుగుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పంట నమోదు సక్రమంగా కాకపోతే పండిన ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు వస్తాయి. ఎరువులు సక్రమంగా ఇవ్వకపోగా ధాన్యం విక్రయానికి కూడా ఇబ్బంది కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

    మారిన నిబంధనలతో అవస్థలు

    గత ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే ఈ–క్రాప్‌ నమోదులో ఈ ఏడాది కొన్ని నిబంధనలను ప్రభుత్వం మార్చింది. గతంలో 200 మీటర్ల దూరం నుంచి ఈ–క్రాప్‌ నమోదుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దీనిని 20 మీటర్లకు కుదించారు. విధిగా వీఏఏలు ప్రతి కమతం దగ్గరకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. 25 సెంట్ల లోపు ఉన్న కమతాల్లో ఈ–క్రాప్‌ నమోదు చేసేందుకు కమతం వద్దకు వెళ్లకపోయినా ఆధార్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం ఉంటే అయిపోయేది. ఫొటో అప్‌లోడ్‌ తప్పనిసరిగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఆప్షన్‌ తొలగించారు. మరోపక్క యూరియా పంపిణీలో వీఏఏలు బిజీగా ఉండటంతో. ఈ–క్రాప్‌ అనుకున్నంత ముందుకు సాగడం లేదు. ఈ–క్రాప్‌ నమోదు బాధ్యత మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ)దే. వారు వీఏఏలను సమన్వయం చేసుకుని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

    ప్రయోజనాలు

    D&{M>‹³ ¯]lÐðl*-§ýl$¯]l$ {糆 OÆð‡™èl* ^ólƇ$$…-^èl$MøÐé-Í. C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ, C¯ŒS-ç³#sŒæ çܼÞyîl, ç³…rÌS Ñ{MýS-Ķæ*-°MìS, A¯]l²-§é™èl çÜ$T-¿ýæÐ]l ç³£ýlM>°MìS D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ™èlç³µ-°çÜ-Ç. MúË$ OÆð‡™èl$-ÌSMýS$ {糿¶æ$™èlÓ ç³£ýl-M>Ë$ A…§éÌS¯é² ç³…r ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-Mø-Ðé-Í. hÌêÏÌZ° 22 Ð]l$…yýl-ÌêÌZÏ Ððl¬™èl¢… Ð]lÅÐ]lÝëĶæ$, E§éů]l ç³…rË$ 3,90,708 GMýSÆ>ÌS ÑïÜ¢Æý‡~…ÌZ ÝëVýS$ AÐ]l#™èl$…yýlV> D ¯ðlÌS 15Ð]l ™ól© ¯ésìæMìS 1,60,578 GMýS-Æ>ÌZÏ D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$.

    త్వరితగతిన పూర్తి చేయాలి

    ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియను సెప్టెంబర్‌ 30వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆ మేరకు మండల స్థాయి అధికారుల (ఏఓ) పర్యవేక్షణలో గ్రామ స్థాయిలో వీఏఏలు పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చాం. మారిన నిబంధనలకు అనుగుణంగా వీఏఏలు తమ పరిధిలోని అన్ని పంటలనూ నమోదు చేయాలి. మండల వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పంట నమోదు ప్రక్రియపై సమీక్ష చేస్తుండాలి.

    – ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట

  • ఉమ్మడి జిల్లా డీఐజీగా జానకీదేవి బాధ్యతల స్వీకరణ

    కాకినాడ లీగల్‌: ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ విధానంలో క్రయ విక్రయదారులకు ఓటీపీ రావడం ద్వారా రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు జరగవని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌న్‌ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ)గా సీహెచ్‌ జానకీదేవి అన్నారు. డీఐజీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలు వల ఇబ్బందులు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. ప్రస్తుతం ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు క్రయ విక్రయదారుల ఆధార్‌కు ఓటీపీ వచ్చిన తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎటువంటి తప్పులు జరగవన్నారు. అలాగే రిజిస్ట్రేషన్‌ శాఖలో ఎటువంటి లోపాలు లేకుండా వేగవంతంగా క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఐజీగా జానకీదేవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ జేఎస్‌యూ జయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్‌ రెడ్డి సత్యనారాయణ, కోనసీమ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ నాగలింగేశ్వరరావు తదితరులు కలిశారు.

  • కక్షతోనే హత్యాయత్నం

    కాకినాడ రూరల్‌: రమణయ్యపేట గ్రామ పరిధిలో సర్పవరం జంక్షన్‌ వద్ద పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న గోపికృష్ణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో సీ–4 ప్లాట్‌లో డీజిల్‌ పోసి నిప్పు పెట్టిన సంఘటనలో నిందితుడు పెంట్‌ హౌస్‌లో ఉండే పొన్నగంటి రవిచంద్రకుమార్‌ (రవి)ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సర్పవరం ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌ వివరాల ప్రకారం నిందితుడు వ్యక్తిగత కక్షతోనే 14న అర్ధరాత్రి సీ–4 ప్లాట్‌లో నివాసం ఉంటున్న పిల్లి సత్తిబాబుపై హత్యాయత్నం చేసేందుకు ప్లాట్‌ హాలులో డీజిల్‌ పోసి నిప్పు పెట్టాడని ఎస్సై తెలిపారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఏ హానీ జరగలేదని, అయితే హాలులో ఫర్నిచర్‌ పూర్తిగా దగ్ధమయిందన్నారు.

  • దేవస్థానం మాజీ చైర్మన్‌ మృతి

    మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ నేత నగరం గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ (60) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన గతంలో అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం చైర్మన్‌గా, మామిడికుదురు సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పి.గన్నవరం నియోజకవర్గ ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  • రాష్ట

    రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్‌, హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థులతో హెచ్‌ఎం మూర్తి తదితరులు

    కాకినాడలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు

    నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాల విద్యార్థులు డీఎస్‌ఏలో జరుగుతున్న ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్‌, హాకీలో ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీవీఎస్‌ఎన్‌ మూర్తి బుధవారం తెలిపారు. జిమ్నాస్టిక్స్‌ అండర్‌–14 బాలికల విభాగంలో పి.సంజన, జె.జ్వాలరాజేశ్వరి, అండర్‌–14 బాలుర విభాగంలో బి.పవన్‌, సీహెచ్‌ రాజు, అండర్‌–17 బాలుర విభాగంలో గోపాల్‌సాయి, బాలికల విభాగంలో బి.కుసుమ, నాగ నందిని, అండర్‌–19 హాకీలో జి.స్వరూప్‌ రాష్ట్ర స్థాయి పోటీలు ఎంపికయ్యారన్నారు. బుధవారం పాఠశాలో జరిగిన కార్యక్రమంలో పీడీలు వర ప్రసాద్‌, బి.శ్రీను, ఎంపికై న క్రీడాకారులను ఉపాధ్యాయులు రత్నప్రసాద్‌, విద్యార్థులు అభినందించారు.

    మలికిపురం: ఈ నెల 16న కాకినాడ స్టేడియంలో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో గుడిమెళ్లంక ఉన్నత పాఠశాల విద్యార్థి కోసెట్టి తనూజ్‌ విశేష ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అక్టోబర్‌లో కాకినాడ క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున తనూజ్‌ పాల్గొంటాడని హెచ్‌ఎం కె.రామకృష్ణ తెలిపారు.

    రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా వెయిట్‌లిఫ్టర్లు

    కాకినాడ క్రైం: అండర్‌–19 రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన 19 మంది వెయిట్‌లిఫ్టర్లు ఎంపికయ్యారు. కాకినాడలోని క్రీడా ప్రాంగణంలో బుధవారం కోచ్‌ సతీష్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 60 మందిలో 19 మంది ఎంపికయ్యారు. జయసూర్య, ఎ.రాహుల్‌, ఐ.మణికంఠ, డి.కారుణ్యముఖేష్‌, బి.రిషబ్‌, కె.సాయిదుర్గాప్రసాద్‌, జి.సుబ్రహ్మణ్యం, ఎ.సహస్ర, బి.ఇందిరాప్రియాంక, హాసిని, మాధురి, సీహెచ్‌ శ్రీసాద్విక, ఎండీ రహం, నిషాతో పాటు అండర్‌–17లో ఎం.దుర్గాప్రసాద్‌, సీహెచ్‌ సంతోష్‌కుమార్‌, బి.గాయత్రి, ఎం.నవ్యశ్రీ ఉన్నారు.

  • వాడపల్లి వెంకన్నకు రూ.1.49 కోట్ల ఆదాయం

    కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వెంకటేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ అండ్‌ ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. బుధవారం ఆలయంలోని హుండీలను 27 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో తెరచి ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,15,09,966, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.34,11,312తో మొత్తం రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. అలాగే 28 గ్రాముల బంగారం, రెండు కేజీల 180 గ్రాముల వెండి, కానుకలుగా వచ్చాయన్నారు. నాలుగు దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయన్నారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవదాయశాఖ అధికారి, ఏసీ సత్యనారాయణ వ్యవహరించారు. దేవదాయ ఇన్‌స్పెక్టర్‌ టీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, వెలిచేరు గ్రూపు దేవాలయాల ఈఓ ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

    అక్టోబర్‌ 10 నుంచి బ్రహ్మోత్సవాలు

    కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వస్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 10వ తేదీ నుంచి జరగనున్నాయని డీసీ అండ్‌ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆ మేరకు బుధవారం చక్రధరరావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వాడపల్లి క్షేత్రం భక్తుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

  • ఉత్సాహంగా టీటీ ఎంపికలు

    నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటి): విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవరచుకుని క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం డీఎస్‌ఏ టీటీ(టేబుల్‌ టెన్నిస్‌) హాల్‌లో పాఠశాల క్రీడాసమాఖ్య అండర్‌–14, 17 బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల ప్రారంభ కార్యక్రమానికి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–14, 17 కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎస్‌డీఓ శ్రీనివాస్‌ కుమార్‌ మాట్లాడుతూ టీటీ చాలా వేగవంతమైన క్రీడ అన్నారు. ఎంతో ఏకాగ్రత ఉంటేనే గాని టీటీలో రాణించలేమన్నారు. టీటీలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. సమాఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టీటీ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక చేస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో 120 మంది బాలబాలికలు ఎంపికలకు హాజరయ్యారు. అనంతరం టీటీ ఆడి డీఎస్‌డీఓ శ్రీనివాస్‌కుమార్‌ ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ సంఘ నిర్వహణ కార్యదర్శి రవిరాజు, పీడీలు పాల్గొన్నారు. ఎంపికలను ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌–14, 17 మహిళా కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు.

  • ముగిసిన టీఓటీల శిక్షణ

    సర్టిఫికెట్లు అందజేసిన వైస్‌ ప్రిన్సిపాల్‌

    సామర్లకోట: పేదరికం నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్‌ ప్రిన్సిపల్‌ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని టీఓటీల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నేర్చుకున్న అంశాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఆకలి బాధలను నిర్మూలించడం, ఆరోగ్య సంరక్షణ–జీవన ప్రమాణాల పెంపు, అందరికీ తాగునీటి వసతి కల్పించడం–పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఉపాధి–ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారని వైస్‌ ప్రిన్సిపాల్‌ తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై మండలంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయా గ్రామాలకు కావసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు కె.సుశీల, కేఆర్‌ నీహారిక, ఎస్‌ఎస్‌ శర్మ, శ్రీనివాసరావు, ఎం.చక్రఫణిరావు పాల్గొన్నారు.

  • ఐస్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌
    గ్యాస్‌ సరఫరా నిలిపివేత, తప్పిన ప్రమాదం

    తాళ్లరేవు: స్థానిక గమిని ఐస్‌ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి అమ్మోనియా గ్యాస్‌ పైపులైన్‌ లీకై న ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఫ్యాక్టరీ సిబ్బంది తక్షణమే స్పందించి గ్యాస్‌ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అగ్నిమాపక శాఖ, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న భూగర్భజల శాఖ అసిస్టెంట్‌ హైడ్రో జియాలజిస్ట్‌ ప్రసన్న, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ వెంకటేశ్వరరావు, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ రామచంద్రమూర్తి, డిప్యూటీ తహసీల్దార్‌ టి.సూరిబాబు, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది ఫ్యాక్టరీని బుధవారం సందర్శించి పరిస్థితిని క్షణ్ణంగా పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఐస్‌ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారని తెలిపారు. అనుమతులు తీసుకునేవరకు ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా అనుమతులు లేకుండా నడుపుతున్న ఐస్‌ ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమి కాలేదని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కు 86 మంది హాజరు

    రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు డాక్టర్‌ రెడ్డీస్‌ బుధవారం నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కి 86 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష నిర్వహించిన 54 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఇంటర్‌ూయ్వలు నిర్వహించిన అనంతరం వీరిలో సంస్థకు అవసరమైన వారిని ఎంపిక చేసి, ఉద్యోగాలు ఇస్తామని వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ తెలిపారు. 2024–25లో బీఎస్సీ, ఎంఎస్సీలో కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ పూర్తి చేసి, పదో తరగతి నుంచి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కి హాజరయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై తే బీఎస్సీ వారికి రూ.2.10 లక్షలు, ఎంఎస్సీ వారికి రూ.2.60 లక్షలు వార్షిక వేతనంగా చెల్లిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.

  • రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రులకు వేద పండితులు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) కుమార్తె గాదె సత్యవెంకటకామేశ్వరి, భాస్కరనారాయణ దంపతులు పూజలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 9.46 గంటలకు వినాయకపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం తదితర పూజలు చేశారు. అనంతరం పందిరి రాట వేసి ఉత్సవ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వీవీ బాపిరాజు, విజయదుర్గా కళాశాల కరస్పాండెంట్‌ పెద్దపాటి సత్యకనకదుర్గ, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Karnataka

  • బ్యాం
    గత కొన్నినెలల్లో జరిగిన బడా దోపిడీలు

    హుబ్లీ: దోపిడీ దొంగలకు పట్టపగ్గాల్లేకుండా పోయింది. కన్నేశారో.. ఆ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ లూటీ కావాల్సిందే. కొన్ని నెలల విరామంతో క్రమం తప్పకుండా జరుగుతున్న బ్యాంకుల దోపిడీలు అటు ప్రభుత్వంతో పాటు ఇటు సామాన్య ప్రజలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో నేర కథల సినిమాల ప్రభావం, ఆకర్షణీయంగా మారిన బంగారం ధరలు.. దోపిడీదారులను ప్రేరేపిస్తున్నాయి.

    చంపేస్తామని బెదిరిస్తూ..

    తాజాగా విజయపుర జిల్లా చడచన పట్టణంలోని ఎస్‌బీఐ శాఖలో దోపిడీ పోలీసులను ఉలికిపాటుకు గురిచేసింది. మంగళవారం సాయంకాలం 6.20 గంటల ప్రాంతంలో ఐదారుమంది వ్యక్తులు ఆర్మీ జవాన్ల మాదిరిగా దుస్తుల్లో వచ్చారు. నల్ల మాస్కు, తెల్ల టోపీ, కళ్లద్దాలు ధరించారు, బ్యాంక్‌ మేనేజర్‌కి ఓ ఫారం ఇచ్చి ఖాతా తెరుస్తామన్నారు. ఫారం నింపలేదని, రాసుకొని రమ్మని మేనేజర్‌ చెప్పాడు, ఆ తర్వాత బ్యాంక్‌ క్యాష్‌ ఇన్‌చార్జి మహంతేష్‌తో కలిసి డబ్బు, బంగారాన్ని భద్రం చేసే స్ట్రాంగ్‌ రూం దగ్గరకు వెళ్లామని మేనేజర్‌ చెబుతున్నాడు. అదే సమయంలో మాస్క్‌ వ్యక్తి పిస్టల్‌ పట్టుకుని హిందీలో మేనేజర్‌ వద్దకొచ్చాడు,.. క్యాష్‌ నిక్కాలో, వర్ణ జాన్సే మార్దుంగా అని బెదిరించాడు. మిగతా దుండగులు సిబ్బందిని అలాగే హెచ్చరించి టాయ్‌లెట్లో బంధించారు. తుపాకులతో బెదిరిస్తూ బీరువాలు, లాకర్లను తెరిపించారని మేనేజర్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    దిగులుగా ఉంది: ఖాతాదారు

    బంగారం కుదువపెట్టిన ఖాతాదారుల్లో ముఖ్యంగా హులజంతి గ్రామస్తులు ఎక్కువమంది ఉన్నారు. రాత్రి దోపిడీ గురించి తెలియగానే బ్యాంక్‌కు వందలాదిగా వచ్చారు. 40 గ్రాముల బంగారును కుదువపెట్టి రూ.2.50 లక్షలు లోన్‌ తీసుకున్నానని, చాలా దిగులుగా ఉందని సంగమేష్‌ అనే రైతు మీడియా ఎదుట వాపోయారు. ఒక తులం నుంచి పావు కేజీ వరకు ఇక్కడ కుదువ పెట్టి రుణాలు తీసుకున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

    దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ

    రూ. కోటికి పైగా నగదు, 20 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాలలో దర్యాప్తును చేపట్టినట్లు జిల్లా ఎస్పీ లక్ష్మణ నింబర్గి మీడియాకు తెలిపారు. దుండగులు తమ కారును నిలిపిన చోటు నుంచి బ్యాంకు లోపలి వరకు వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం పోలీసులు జాగిలాలతో వెతికారు. జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలో గాలింపు చేపట్టారు.

    భారీగా బంగారం, డబ్బు లూటీ

    విజయపుర జిల్లాలో మరో బ్యాంకు ఖాళీ

    దొంగల స్వైరవిహారంతో కలవరం

  • ధర్మస్థలలో తిరిగి తవ్వకాలు

    బనశంకరి: ధర్మస్థలలో చాలారోజుల విరామం తరువాత మళ్లీ అస్థిపంజరాల కోసం వేట మొదలైంది. బంగ్ల గుడ్డ ప్రాంతంలో సిట్‌ అధికారులు, కూలీలు, ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి తవ్వకాలు జరుపుగుతున్నారు. గతంలో హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య మామ విఠల్‌గౌడ బంగ్లగుడ్డలో రాశులుగా అస్థిపంజరాలను చూశానని సిట్‌ విచారణలో చెప్పడంతో మళ్లీ తవ్వకాలకు నాంది పలికారు. సుమారు 50 నుంచి 60 మంది బృందం బంగ్ల గుడ్డలోని దట్టమైన అరణ్య ప్రదేశంలో పరిశీలన చేశారు. కొన్నిచోట్ల ఎముకలు లభించాయని తెలిసింది.

    పెద్దసంఖ్యలో బలగాలు

    సిట్‌ ప్రత్యేక అధికారి జితేంద్రకుమార్‌ దయామ, ఎస్పీ సైమన్‌, 13 మంది అటవీ అధికారులు పాల్గొన్నారు. మెటల్‌ డిటెక్టర్‌ను కూడా వినియోగించారు. డాక్టర్లు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ పౌరకా ర్మికులు, తాలూకా ప్రజాప్రతినిధులు కూడా తవ్వకాల వద్ద ఉన్నారు. అధికారులు విఠల్‌గౌడను తీసుకెళ్లలేదు. కానీ అతడు కారులో ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడు. తనకు సిట్‌ సమాచారం ఇవ్వలేదని, పిలవలేదని తెలిపాడు. అంతకు ముందు పురంధరగౌడ, తుకారాం అనే స్థానికులు సిట్‌ ముందు హాజరై, చిన్నయ్య శవాలను పూడ్చిపెట్టడం మేము చూశాము, తమకు సాక్షులుగా పరిగణించాలని కోరగా, తిరస్కరించారు. వీరిద్దరూ స్థలపరిశీలన సమయంలో వెళ్లారు కానీ దూరంగా నిలబడి కొద్దిసేపు గమనించి అక్కడనుంచి వెళ్లిపోయారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సిట్‌కు సహకరించడం లేదని సమాచారం. క్లూస్‌ టీం సిబ్బంది ఎక్కువమంది ఉండడం, పీవీసీ పైపులను తీసుకెళ్లడాన్ని బట్టి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    బంగ్ల గుడ్డలో హడావుడి

    విఠల్‌గౌడ వాంగ్మూలమే కారణం

  • బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ప్రఖ్యాత బన్నేరుఘట్ట జూ పార్క్‌లోని ఓ ఎలుగుబంటికి కృత్రిమ కాలుని అమర్చారు. ఇక్కడి ఎలుగుబంటి సంరక్షణ కేంద్రంలో వహికరన్‌ అనే పేరుతో ఓ ఎలుగుబంటి ఉంది. ఇది బళ్లారి జిల్లాలో అడవుల్లో 2019లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కింది, దాంతో ఎడమవైపు వెనుక కాలు కొంత మేర తెగిపోయింది. అక్కడి అటవీ సిబ్బంది దానిని కాపాడి బన్నేరుఘట్ట జూ కి తరలించారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటోంది. కాలు కట్‌ అయినందున నడవడానికి కష్టపడుతోంది. ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన ప్రముఖ జంతు సర్జన్‌ డెరిక్‌ కంపనా వచ్చి ఈ ఎలుగును పరిశీలించారు. దేకుతూ వెళ్లడం, చెట్లు, బండరాళ్ల ఎక్కలేకపోవడంతో ఏదైనా చేయాలని నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు శస్త్రచికిత్స చేసి కృత్రిమ కాలుని అమర్చినట్లు జూ అధికారులు తెలిపారు. ఇప్పుడు నెమ్మదిగా అడుగులు వేస్తోందని చెప్పారు.

    బన్నేరుఘట్ట జూలో ఆపరేషన్‌

  • విశ్వ

    బళ్లారి రూరల్‌ : విశ్వకర్మ సత్యాన్ని, ధర్మాన్ని ప్రజలందరూ ఆచరించాలని బళ్లారి ఎంపీ ఈ.తుకారాం తెలిపారు. బుధవారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విశ్వకర్మ గ్రంథాలను, ఆయన జీవనశైలిని, తత్వాలను అనుసరించాలన్నారు. రాజ్యాంగం మనకు విద్యను ఆర్జించే హక్కును కల్పించింది. దీన్ని ప్రతిఒక్కరూ ఉపయోగించుకొని ఉత్తమ విద్యను అభ్యసించి ప్రతిభావంతులు కావాలన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తారు. గురువులు జ్ఞానాన్ని ప్రసాదించి భవిష్యత్తును అందిస్తారన్నారు. జిల్లాసుపత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చినట్లు తెలిపారు. నగరంలో జవహర్‌ నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు కేఈ.చిదానందప్ప విశ్వకర్మ సిద్ధాంతాలను, తత్వాలను విశదపరిచారు. విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వృషభేంద్రాచార్య, మేయర్‌ ముల్లంగి నందీశ్‌, విశ్వకర్మ అభివృద్ధి నిగమ సభ్యుడు చంద్రశేఖర్‌, కన్నడ సంస్కృతి శాఖ సంచాలకుడు బి.నాగరాజు, విశ్వకర్మ వికాస వేదిక అధ్యక్షుడు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

    రోడ్డు ప్రమాద

    కారకుడికి జైలు శిక్ష

    హుబ్లీ: పాదచారిని ఢీకొని ఆ గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించకుండా అతడి చావుకు కారకుడయ్యారన్న కారణంతో సదరు ఆరోపణలు రుజువైన నేపథ్యంలో ఓ వ్యక్తికి ప్రధాన సెషన్స్‌ కోర్టు, జేఎంఎఫ్‌సీ ఫస్ట్‌ గ్రేడ్‌ న్యాయమూర్తి రూ.4 వేల జరిమానా, 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. వివరాలు.. సతీష్‌ సంబ్రాణి శిక్షకు గురైన వ్యక్తి. 2022 డిసెంబర్‌ 18న గదగ్‌ రోడ్డులో వేగంగా బైక్‌ నడుపుతూ రోడ్డు దాటుతున్న లక్ష్మినారాయణను అనే వ్యక్తి ఢీకొన్నాడు. అంతేగాక మానవత్వాన్ని మరచి బైక్‌ నిలపకుండా పరారయ్యారు. ఘటనలో లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. 2022లో డిసెంబర్‌ 23న చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసును హుబ్లీ తూర్పు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు దాఖలు చేసుకొని సీఐ శ్రీశైల గాబి చార్జిషీట్‌ సమర్పించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కరే హనుమంతప్పపై మేరకు తీర్పును వెల్లడించారని అసిస్టెంట్‌ ప్రభుత్వ న్యాయవాది గంగాధర గౌడ ప్రభుత్వం తరపున వాదించినట్లుగా తెలిపారు.

    విద్యుత్‌ షాక్‌ తగిలి బాలిక మృతి

    హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కక్కుప్పి గ్రామంలో వాటర్‌ హీటర్‌ నుంచి విద్యుత్‌ షాక్‌ తగిలి ఒక బాలిక మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. విద్యార్థిని భాగ్యశ్రీ(15) కూడ్లిగి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఉదయం స్కూల్‌కు వెళ్లే ముందు స్నానం చేసేందుకు నీటిని వేడి చేయడానికి వాటర్‌ హీటర్‌ వేసింది. ఆ సమయంలో నీటి హీటర్‌ నుంచి విద్యుదాఘాతం ఏర్పడటంతో బాలిక మరణించింది. ఘటనపై కూడ్లిగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

    ఎమ్మెల్యే సందర్శన, పరామర్శ

    కాగా ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌టి శ్రీనివాస్‌ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి, మరణించిన బాలిక కుటుంబానికి సానుభూతిని తెలిపారు. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం కూడా అందించి, కుటుంబానికి భరోసా ఇచ్చారు.

    ఆరోగ్యకర సమాజం నిర్మించాలి

    హొసపేటె: జగద్గురు కొట్టూరు స్వామి సంస్థానమఠంలో నిరంజన్‌ జగద్గురు కొట్టూరు బసవలింగ మహాస్వామి సమక్షంలో 1173వ మాస శివానుభవ సంపద కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కొట్టూరు బసవలింగ మహాస్వామి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శివానుభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమానత్వ సమాజం, కయాక్‌ సమాజం, దాసోహ సమాజం అందరి అభిప్రాయాలను గౌరవించే సమాజం, ఆరోగ్యకరమైన సమాజం, ఆనందకరమైన సమాజం, ద్వేష రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు. అనంతరం అంజుమాన్‌ ఖిద్మతే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు హెచ్‌ఎన్‌ మహమ్మద్‌ ఇమామ్‌ నియాజీ మాట్లాడుతూ భారతీయ సమాజంలో ప్రవక్త మహమ్మద్‌ ఆదర్శం, ఔచిత్యం, ప్రవక్త మహమ్మద్‌ గురించి తెలుసుకోవడం అనే పుస్తకాలను విడుదల చేశారు. రిటైర్డ్‌ లెక్చరర్‌ చంద్రశేఖర్‌ శాస్త్రి, జమాతే ఇస్లామీ–ఏ–హింద్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజీజ్‌ ముల్లా సయ్యద్‌ నజుముద్దీన్‌, అంజుమన్‌ కమిటీ సభ్యులు ఎం.ఫైరోజ్‌ ఖాన్‌, డాక్టర్‌ దుర్వేష్‌ మొయిద్దీన్‌, వీరశైవ సమాజ సీనియర్‌ నాయకులు, ముస్లిం సమాజ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.

    యువతి ఆత్మహత్య

    రాయదుర్గం టౌన్‌: మండలం మెచ్చిరి గ్రామంలో బుధవారం సాయంత్రం కర్ణాటకకు చెందిన ఆశ(17) ఆత్మహత్య చేసుకుంది. సరిహద్దు కర్ణాటకలోని మొళకాల్మూరు తాలూకా బొమ్మలింగనహళ్లి గ్రామానికి చెందిన మల్లికార్జున, నిర్మల దంపతుల కుమార్తె ఆశ మొళకాల్మూరులో మొదటి సంవత్సరం ఇంటర్‌ చదువుతోంది. నాలుగు రోజుల క్రితం మెచ్చిరి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి మేనమామ ఇంట్లో ఉంటోంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆశ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • మహిళలకు పౌష్టికాహారం తప్పనిసరి

    హొసపేటె: పట్టణంలోని 6వ వార్డు ఆజాద్‌ నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం తిమ్మలాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సీనియర్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పీబీ.గిరిజా ప్రారంభించి మాట్లాడారు. గర్భిణి సీ్త్రలు పోషకాహారం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో జన్మించే బిడ్డ, తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. శరీరానికి పోషకాహారం తీసుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పటికప్పుడు టీకాలు వేయించుకోవాలి. సమస్యల నుంచి వారిని రక్షించవచ్చని వారు చెప్పారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.గీత, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు పార్వతి, ఆశా కార్యకర్త ఏఎం.సావిత్రి, ఉమా, జ్యోతి, పద్మ, అంగన్‌వాడీ కార్మికులు అంజలి, వైశాలి, తల్లులు పాల్గొన్నారు.

  • బళ్లారి రూరల్‌ : ఎట్టకేలకు సిటీ బస్టాండు ఆవరణలో ఉన్న కార్యాలయాలకు, కేఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది వెళ్లడానికి కాలి బాట దారి ఏర్పాటు చేశారు. నగరంలోని సిటీబస్టాండు ముందు ఓపెన్‌ డ్రైనేజీ పనుల్లో భాగంగా చేపట్టడంతో బస్టాండు ఆవరణలో ఉన్న కేఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది కార్యాలయం, ఎల్‌ఐసీ, కెనరా, యూనియన్‌ బ్యాంకు, సిటీ ఆసుపత్రులకు వెళ్లే దారి మూసివేశారు. ఈ విషయంపై బుధవారం సాక్షి దినపత్రికలో వార్తాకధనం వెలువడింది. దీంతో అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌ కార్యాలయాలకు వెళ్లడానికి దారిని ఏర్పాటు చేశారు.

    పంటనష్టం పరిశీలన

    రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక భాగంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు, వంతెనలు నీటితో నిండి పొంగి ప్రవహించాయి. కలబుర్గి జిల్లాలో పెసలు నీటి పాలయ్యాయి. చిత్తాపుర తాలూకాలో భీమా నది పొంగి ప్రవహించడంతో రైతులు పలు ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లోకి నీరు చొరబడ్డాయి. బీదర్‌ జిల్లా భాల్కి తాలూకాలో ఆనందవాడి, కారంజ మధ్య వంతెన వరద నీటిలో మునిగింది. 16 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. బుధవారం యువ జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్‌ కుమార స్వామి, మాజీ మంత్రి బండెప్ప కాశంపురలు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను ఆలకించారు. సేడం తాలూకాలో వానలకు పాడైన పంటలను పరిశీలించారు. పంట నష్ట పరిహారం కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి సిద్దరామయ్య రూ.950 కోట్లు కేటాయించారన్నారు.

    పంట నష్టం పరిశీలించిన సీఎం

    రాయచూరు రూరల్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలబుర్గి జిల్లాలో పెసలు, కంది పంటలు నీటి పాలయ్యాయి. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కల్యాణ కర్ణాటక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలను ఆలకించారు. కలబుర్గి జిల్లా చించోళి, అఫ్జల్‌పుర, పర్హతాబాద్‌లో వానలకు పాడైన పంటలను పరిశీలించారు. పంట నష్ట పరిహారం త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్ట పరిహారం అందజేతకు రూ.950 కోట్లు కే టాయించామని సీఎం అన్నారు. ఈసందర్భంగా మంత్రి ప్రియాంక ఖర్గే, జిల్లాధికారిణి ఫౌజియా తరన్నుమ్‌లున్నారు.

    పౌష్టికాహారం అవసరం

    రాయచూరు రూరల్‌: ప్రతి మనిషి సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలని కలబుర్గి విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ దయానంద అగసర్‌ పిలుపునిచ్చారు. బుధవారం కలబుర్గి వీరమ్మ గంగసిరి మహిళా కళాశాలలో జాతీయ పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్యాణరావ్‌, అరుణ, సుశీల్‌ కుమార్‌, రేఖా, ప్రేమ చంద్‌, ప్రిన్సిపాల్‌ రాజేంద్ర కొండా, మహేష్‌ గంగ్వార్‌లున్నారు.

    ఫోన్‌ విక్రయిస్తున్నట్లు ఆశపెట్టి రూ.లక్షల్లో వంచన

    హుబ్లీ: ఫేస్‌బుక్‌ పేజీలో వాణిజ్య ప్రకటన చూసి పాత స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుకు ప్రయత్నించిన మోహన్‌ శివానందకు ఢిల్లీకి చెందిన వ్యక్తి రూ.19.58 లక్షలను బదలాయించుకొని వంచించారు. ఢిల్లీ జేజే కమ్యూనికేషన్‌కు చెందిన మనీష్‌ జైన్‌ మొబైల్‌ షాప్‌ పేరుతో పాత స్మార్ట్‌ ఫోన్‌ను రూ.18,500లకు విక్రయించినట్లుగా ఫేస్‌బుక్‌లో వాణిజ్య ప్రకటన ఇచ్చారు. మోహన్‌ ఫోన్‌లో దాన్ని చూసి సంప్రదించగా అడ్వాన్స్‌ రూ.11,100 బదలాయించుకొని మొబైల్‌ చేతికి అందిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వాలని ఆ వంచకుడు నమ్మబలికాడు. తన వివిధ బ్యాంక్‌ ఖాతాల నుంచి నగదు బదలాయించుకొని వంచించినట్లుగా బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • కల్యాణ కర్ణాటకకు రూ.5 వేల కోట్లు

    రాయచూరు రూరల్‌: వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. బుధవారం కలబుర్గిలోని సర్దార్‌ వల్లబ్‌బాయి పటేల్‌ క్రీడా మైదానంలో కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశానికి ఆగస్టులో స్వాతంత్య్రం వస్తే కల్యాణ కర్ణాటకకు ఏడాది అనంతరం సెప్టెంబర్‌ 17వ తేదీ రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికిన రోజు అని అభివర్ణించారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా ఈ ఏడాది రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తారన్నారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌–371(జె) ఉప కార్యాలయం కలబుర్గిలో ఏర్పాటు చేస్తామన్నారు. శాసన సభ్యులు, జిల్లాధికారి, జెడ్పీ అధికారిణి, ఎస్పీలున్నారు.

    క–కకు ప్రత్యేక అభివృద్ధి పథకం

    కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేకంగా అభివృద్ధి పథకం అమలు చేస్తామని సీఎం తెలిపారు. కలబుర్గిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కలబుర్గి స్మార్ట్‌సిటీ కోసం రూ.1685 కోట్లు కేటాయించామన్నారు. బీదర్‌ జిల్లా బసవ కళ్యాణలో అనుభవ మంటపం, రాయచూరులో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు, కలబుర్గిని ప్రాంతీయ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కలబుర్గిలో రూ.50 కోట్లతో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు, రాయచూరు, బళ్లారి జిలాల్లో మానవ తల్లి పాల కేంద్రాల ప్రారంభం, కొప్పళ జిల్లా అంజనాద్రి కొండ అభివృద్ధికి రూ.100 కోట్లు, ఏడు జిల్లాల్లో 18 నూతన తాలూకాల్లో భవనాల నిర్మాణాలకు రూ.130 కోట్లు కేటాయించామన్నారు. రాయచూరులో ప్రైవేట్‌ భాగస్వామ్యంతో స్పిన్నింగ్‌ మిల్లు ప్రారంభిస్తామన్నారు. రాయచూరులో రూ.40 కోట్లతో, యలబుర్గ, బళ్లారితో పా టు మరో ఐదు చోట్ల రూ.50 కోట్లతో కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేయిస్తాం అన్నారు. రాయచూరులో ప్రత్యేకంగా రూ.25 కోట్లతో మిరప మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

    రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికిన రోజు

    విమోచన వేడుకలో సీఎం సిద్దరామయ్య

  • సమష్ట

    హొసపేటె: బ్రిటిషుల అధికారంలో ఉన్న హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతాన్ని మనవారు దక్కించుకునేందుకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి చివరకు కళ్యాణ కర్ణాటక ప్రాంతాన్ని దక్కించుకొన్నారని, ప్రజలందరి కృషి మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని విజయనగర జిల్లాధికారిణి కవితా ఎస్‌ మన్నికేరి తెలిపారు. కళ్యాణ కర్ణాటక విమోచనోత్సవంలో భాగంగా బుధవారం పునీత్‌ జిల్లా క్రీడా మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ కర్ణాటక ఉత్సవ జెండాన్ని ఎగుర వేసిన అనంతరం మాట్లాడారు. 1948 సెప్టెంబర్‌ 17న భారత సైన్య నాయకుడు జనరల్‌ చౌదరి నేతృత్వంలో జరిగిన పోరాటంలో హైదరాబాద్‌ నిజాం లొంగిపోయి భారత యూనియన్‌లో చేరడానికి అంగీకరించారన్నారు. ఫలితంగా కన్నడ భాష ఈ రోజు పవిత్ర దినం, సాహిత్యం, సంస్కృతి, కళ, మతం మొదలైన రంగాలకు గణనీయమైన కృషి చేసిన జగజ్యోతి బసవన్న సామాజిక అభివృద్ధికి పునాది వేశారన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఈ ప్రాంతం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. నవంబర్‌ 8, 2013న ప్రభుత్వం కలబుర్గిలో కళ్యాణ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలిని స్థాపించిందని, ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సహా ఈ ప్రాంతంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలలోని అన్ని ప్రాంతాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, సామాజిక, రహదారి కనెక్టివిటి, స్వచ్ఛమైన తాగునీటి వ్యవస్థ, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం సామాజిక, రహదారి కనెక్టివిటీ, స్వచ్ఛమైన తాగునీటి వ్యవస్థ, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలను అందించడానికి నిధులను కేటాయించిందన్నారు. విజయనగరం జిల్లాకు, 2025–26 సంవత్సరంనకు మైక్రో క్రియా యాక్షన్‌ ప్లాన్‌ కింద రూ. 22.445.34 లక్షలు, మైక్రో పథకం కింద రూ.9.464.90 లక్షలు గ్రాంట్‌ కేటాయించబడిందన్నారు. కళ్యాణ కర్ణాటకలో భాగమైన విజయనగర జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మనమందరం కలిసి పని చేయాలని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన జెండా వందనంతో పాటు విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతి కార్యక్రమాలు చూపురులను ఆకట్టుకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప హుడా అధ్యక్షుడు ఇమామ్‌ నియాజీ, గ్యారెంటీల హామీ అధ్యక్షుడు కే.శివమూర్తి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ జాహ్నవి, సీఈఓ నోంగ్జాయ్‌ అక్రమ్‌ అలీ షా, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    జిల్లాధికారిణి కవితా ఎస్‌ మన్నికేరి

  • మచ్చల

    సాక్షి,బళ్లారి: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ వ్యక్తి కాదు, శక్తి అని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల్లో పాల్గొనడంతో పాటు ఆయన కూడా రక్తదానం చేసిన అనంతరం మాట్లాడారు. మోదీ భారతదేశానికే నాయకుడు కాదు, యావత్‌ ప్రపంచం మెప్పు పొందేలా ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిగా గుజరాత్‌కు విశేష సేవలు అందించారన్నారు. అనంతరం హ్యాట్రిక్‌ ప్రధానమంత్రిగా మోదీ పని చేస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నారన్నారు. దేశాభివృద్ధి, దేశ భద్రత విషయంలో రాజీ లేకుండా పని చేస్తున్నారన్నారు. మోదీ చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పనులు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మోదీ తనదైన ముద్రలో ఆయా రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధంలో ఘన విజయం సాధించారన్నారు. కోవిడ్‌ కష్టకాలంలో దేశ ప్రజల ప్రాణాలే కాకుండా ప్రపంచ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్‌ అందించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇలాంటి పుట్టిరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షిస్తున్నాడన్నారు. మోదీ పుట్టిన రోజును రక్తదాన శిబిరంలో తాను కూడా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌, మోకా విధాన పరిషత్‌ సభ్యుడు వైఎం సతీష్‌, నగర బీజేపీ అధ్యక్షుడు వెంకటరమణ, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    రక్తదానం

    రాయచూరు రూరల్‌: నగరంలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుక జరిగింది. 75వ కల్యాణ కర్ణాటక విమోచన దినోత్సవం సందర్భంగా శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌, మోదీ అభిమానులు కేక్‌ను కత్తిరించి వేడుకను ఆచరించారు. అనంతరం రక్తదానం, ఉచిత వైద్య పరీక్ష శిబిరాలను నిర్వహించారు.

    నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి

  • రాష్ట

    రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏడాది లోపు పతనం అవుతుందని విజయపుర శాసన సభ్యుడు బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ జోస్యం చెప్పారు. మంగళవారం రాత్రి 21వ రోజు హిందూ మహా గణపతి నిమజ్జనాల సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలు పోలీసులకు భయపడడం లేదన్నారు. నేపాల్‌లో జరిగినట్లు రాష్ట్రంలోనూ అలజడులు చెలరేగుతాయన్నారు. హిందువులు ఏడాదికొకసారి జరుపుకునే గణపతి ఉత్సవాలకు డీజేను నిషేధించడం సమంజసం కాదన్నారు. 2028లో హిందూ సర్కార్‌ ఏర్పాటవుతుందన్నారు. రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన వినాయకుడి ఊరేగింపు తీన్‌ కందిల్‌ నుంచి సూపర్‌ మార్కెట్‌, మహావీర్‌ చౌక్‌, మహాబళేశ్వర చౌక్‌, షరాఫ్‌ బజారు, పేట్లా బురుజు మీదుగా ఖాస్‌బావి వరకు డీజే శబ్దంతో నృత్యం చేస్తూ గణనాథుడిని నిమజ్జనం చేశారు.

    రాయచూరులో బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ జోస్యం

    21వ రోజున హిందూ మహా గణపతి నిమజ్జనం

  • సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృిషి

    రాయచూరు రూరల్‌ : జిల్లాలో అభివృద్ధి చెందని ప్రాంతాలను సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ అన్నారు. బుధవారం మహాత్మ గాంధీ క్రీడాంగణంలో 77వ కల్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. డాక్టర్‌ నంజుండప్ప నివేదిక ఆధారంగా సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించారన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టికల్‌– 371(జే) వల్ల ఒనగూరే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.20 13–2018 లో 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. 2023–28 మధ్యలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అక్షర అవిష్కార పథకంలో ఉపాధ్యాయుల నియామకాలు జరుపుతామని వెల్లడించారు. నిరుద్యోగులకు వృత్తిపర కోర్సులతో అధికంగా ఉద్యోగాలున్నాయన్నారు. ప్రభుత్వ కొలువుల్లో అందరికీ అవకాశముందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ఎస్‌ బోసురాజ్‌, శాసన సభ్యులు శివరాజ్‌ పాటిల్‌, బసన గౌడ, ఎమ్మెల్సీలు శరణే గౌడ, వసంత్‌ కుమార్‌, జిల్లాధికారి నితిష్‌, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, ఎస్పీ పుట్టమాదయ్య, ఎస్పీ పుట్టమాదయ్య, ఏసీ గజానన, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఆర్డీయే అధ్యక్షుడు రాజశేఖర్‌ రామస్వామిలున్నారు. యాదగిరిలో రాష్ట్ర చిన్న పరిశ్ర మల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్‌, బీదర్‌లో అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే జాతీయ జెండాను అవిష్క రించారు.

  • వాల్మీకుల అణచివేతకు సీఎం కుట్ర

    బళ్లారిటౌన్‌: రాష్ట్రంలోని వాల్మీకులకు రిజర్వేషన్లు దక్కకుండా వాల్మీకులను అణిచి వేసే కుతంత్రాలను సీఎం సిద్దరామయ్య చేస్తున్నారని అఖిల కర్ణాటక వాల్మీకి నాయకుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. బుధవారం గాంధీనగర్‌లోని వాల్మీకి సమావేశం, విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తమ వాల్మీకి నాయకులు ఉన్నారన్నారు. తమ ఎస్టీ రిజర్వేషన్లకు కేటాయించిన రిజర్వేషన్లతోనే పదవులు అందుకున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మంచిదేనని, సీఎం సిద్దరామయ్య తమ వర్గీయులను గ్రూప్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరగనున్న కులగణన లెక్కింపులో తమ వర్గీయులంతా హిందూ ధర్మం అని రాయించి కులం కాలంలో వాల్మీకులని రాయాలన్నారు. సోనియా గాంధీతో మార్కులు కొట్టేసేందుకు సిద్దరామయ్య అన్ని వర్గాలలోను క్రిస్టియన్లు ఉన్నట్లు ప్రకటిస్తున్నారరు. మాజీ మంత్రి నాగేంద్రపై అవినీతికి పాల్పడినట్లు సిద్దరామయ్య కులకుట్ర చేశారన్నారు. ఇందులో ఆయన పాత్ర ఉందన్నారు. మొరార్జీ దేశాయి స్కూళ్లలో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్‌ ఉన్నా చాలా చోట్ల ఇంకా కొన్ని సీట్లు భర్తీ చేయకుండా మిగిల్చారన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లాధ్యక్షుడు ముదిమల్లయ్య, నేతలు జయరామ, రుద్రప్ప, జనార్ధన నాయక్‌, మల్లన్న, రుద్రేష్‌, కృష్ణ, బసవరాజు, కేశవ, రాజు పాల్గొన్నారు.

National

  • న్యూఢిల్లీ: కేరళలో ‘మెదడును తినే అమీబా’ కేసులు కలకలం రేపుతున్నాయి. అధిక మరణాల రేటు కలిగిన మెదడు ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పామ్‌) కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. 

    ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తుంది. దీనిని సాధారణ బాషలో ‘మెదడును తినే అమీబా’ అని పిలుస్తారు. ఈ  ఏడాది కేరళలో ఈ తరహాలో 61 పామ్‌ కేసులు నమోదయ్యాయి.  19 మరణాలు సంభవించాయి. వీటిలో పలు మరణాలు గత కొన్ని వారాలలోనే నమోదయ్యాయి.

    కేరళ ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సవాలుతో పోరాడుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. గతంలో కోజికోడ్, మలప్పురం తదితర జిల్లాల్లోని క్లస్టర్‌లతో ముడిపడి ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. బాధితుల జాబితాలో మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వయస్సు వారి వరకు ఉన్నారని తెలిపారు. కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ‘పామ్‌’ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పలు సందర్భాలలో ఇది తీవ్రమైన మెదడు వాపు, మరణానికి దారి తీస్తుంది. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్లు, యువకులకు సోకుతుంది.

    మెదడును తినే అమీబా అనేది నిలిచిపోయిన నీరులో కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ అమీబాతో కలుషితమైన నీటి వనరులలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా స్నానం చేసేవారికి ఈ  అమిబీ సోకే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. పామ్‌ కేసులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని నిర్ధారించడం కష్టమని నిపుణుల చెబుతున్నారు.  

    అయితే దీని లక్షణాలు బాక్టీరియల్ మెనింజైటిస్ లాంటివి.. అంటే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు.  ‘పామ్‌’ సోకినప్పుడు ఈ లక్షణాలు ఒకటి నుండి తొమ్మిది రోజుల మధ్య కనిపించే అవకాశాలున్నాయి. కేరళలో 2016లో తొలి ‘పామ్‌’ కేసు నమోదయ్యింది.  గత  ఏడాది నుంచి ఈ కేసులలో పెరుగుదల కనిపించింది . కొత్త ఇన్ఫెక్షన్లను నివారించడానికి రాష్ట్ర ‍ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు  చెరువులు, సరస్సులు వంటి శుద్ధి చేయని లేదా నిలిచిపోయిన నీటి వనరులలో ఈత కొట్టటం లాంటి పనులు చేయవద్దని కేరళ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. 

Parvathipuram Manyam

  • చంద్రబాబు దళిత ద్రోహి

    అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అయితే, దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేసిన వ్వక్తిత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుది. దళిత ద్రోహి చంద్రబాబు. వలంటీర్‌ నుంచి హోమ్‌ మంత్రి పోస్టు వరకు ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తూ, 50 శాతం రిజర్వేషన్‌ కల్పించినది జగనన్నే. ఒక దళితుడైన మాజీ శాసనసభ్యుడు బాబురావును రాజ్యసభకు పంపిన ఘనత, 200 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిలబెట్టిన ఏకై క నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. మళ్లీ పేదల సంక్షేమం కోరే జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలంతా ఏకమవ్వాలి. – పాముల పుష్పశ్రీవాణి,

    మాజీ ఉప ముఖ్యమంత్రి

  • పాలనలో కూటమి విఫలం

    కూటమి ప్రభుత్వం పాలనలో విఫలమైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్న విషచయాన్ని ప్రజలు గుర్తించారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరాచేయలేక చేతులెత్తేసింది. విద్యార్థులు, నిరుద్యోగులను అబద్ధపు హామీలతో కూటమి నేతలు నిలువునా ముంచేశారు. ఇప్పుడు నిజం మాట్లాడితే కేసులు పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ఎస్సీ,ఎస్టీ దళిత సామాజిక వర్గాలను చైతన్యం చేయాల్సిన బాధ్యత ఎస్సీ అనుబంధ విభాగాల నాయకులపై ఉంది. – పీడిక రాజన్న దొర,

    మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు

  • ఎస్సీలు అంటే ఓటు బ్యాంకు మాత్రమే కాదు

    ఎస్సీ సామాజిక వర్గాలు అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదు... ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు గట్టిగా తలచుకుంటే కోరుకున్న వారిని ప్రభుత్వంలో నిలబెట్టగలరు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు విద్యను దూరం చేసిన చంద్రబాబు ఇప్పుడు పీపీపీ విధానంతో ప్రైవేట్‌ పరం చేసి పేదలకు వైద్యం దూరం చేయాలని చూస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆత్మగౌరవంతో బతికిన ఎస్సీ సామాజిక వర్గాలు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

    – అలజంగి జోగారావు,

    పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే

  • కందివ

    కొమరాడ: మండలంలోని కందివలస గ్రామ పరిసరాల్లో గజరాజుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంటలు ధ్వంసం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మంగళవారం రాత్రి గ్రామంలోకి చొరబడడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎవరిపై దాడి చేస్తాయో అని భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఏనుగుల మళ్లింపునకు చర్యలు తీసుకోవడంలేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.

    ఉచిత వైద్యం

    పార్వతీపురంటౌన్‌: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్వస్థ్‌ నార్తీ స్వశక్తి పరివార్‌ అభియాన్‌ కింద జిల్లాలోని మహిళలందరికీ ఉచిత వైద్యసేవలు అందజేస్తున్నట్టు కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో బుధవారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా అక్టోబర్‌ 2 వరకు నిర్వహించే వైద్యశిబిరాల్లో మహిళలకు ఉచిత వైద్యసేవలు అందజేస్తామని తెలిపారు. శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేసీ ఎస్‌.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఎస్‌.భాస్కరరావు, జి.నాగభూషణరావు, డీసీహెచ్‌ఎస్‌, రాష్ట్ర నోడల్‌ అధికారి డా.గీతాపద్మజ, మహిళా శిశు సంక్షేమ అధికారి టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

    పట్టు జారిందా..

    ప్రాణం గోవిందా..!

    చిత్రం చూశారా... ఇటీవల కురిసిన వర్షాలకు అడారుగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మక్కువ మండలంలోని గుంటభద్ర గ్రామానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అనారోగ్యానికి గురైన చొడిపల్లి శుక్రమ్మను వైద్యం కోసం గెడ్డదాటించలేకపోవడంతో ఆమె శనివారం ప్రాణాలు విడిచింది. చివరకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా గ్రామస్తులు ఆపసోపాలు పడాల్సిన దుస్థితి. గెడ్డలో కాస్త నీరు తగ్గడంతో బుధవారం ఇదిగో ఇలా గెడ్డకు ఇరువైపులా చెట్లకు అధికారులు కట్టిన తాడు సాయంతో గిరిజనులు దాటుతున్నారు. సీదరపు ప్రసాద్‌ అనే వ్యక్తి వరి పంటకు పురుగుమందులు జల్లుతుండగా పాముకాటేయడంతో డోలీలో గెడ్డ దాటించి శంబర ఆస్పత్రికి తరలించారు.

    – మక్కువ

  • హడలెత్తించిన భారీ కొండ చిలువ

    పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది

    పాలకొండ రూరల్‌: నిత్యం రద్దీగా ఉండే పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలోని చల్లా భాను ఇంట్లోకి భారీ కొండ చిలువ బుధవారం రాత్రి చొరబడింది. ఇంటి పైభాగంలో ఉన్న గదిలోకి వెళ్లేందుకు యత్నిస్తున్న సమయంలో పాము కంటపడింది. మెట్లమీద ఓ ముద్దలా ఉన్న పామును చూసి తొలుత గోనె సంచి అనుకున్నారు. పాము కదలడంతో ఉలిక్కిపడిన భాను ఇంట్లోకి దూరకుండా మెట్ల కిందకు తరిమారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తారకేశ్వరరావు వచ్చి పామును ప్లాస్టిక్‌ గొట్టంలో నుంచి ముందుకు కదిలిస్తూ గోనె సంచిలోకి వెళ్లేలా చేసి బంధించారు. అడవిలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

    ఎస్సీలకు కూటమి వెన్నుపోటు

  • జిల్లాలో డోలీ మోతలు ఉండరాదు

    వైద్యసేవలు ప్రజలకు మరింత

    చేరువ కావాలి

    కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి

    పార్వతీపురం రూరల్‌: జిల్లాలో ఎక్కడా డోలీమోతలు ఉండరాదని, వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ బుధవారం సమీక్షించారు. అంబులెన్సు సర్వీస్‌ సేవలు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేపీఐ డాష్‌ బోర్డు తరచూ మోనటరింగ్‌ చేయాలని, గర్భిణుల నమోదు తప్పనిసరి చేయాలన్నారు. మలేరియా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థల లక్ష్యాలు, ప్రగతిపై ఆరా తీశారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఎస్‌.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్‌ జి.నాగభూషణరావు, వైద్యాధికారులు నాగశివ జ్యోతి, ఎం.వినోద్‌కుమార్‌, పి.జగన్‌మోహన్‌రావు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు ఎం.సుధారా ణి, కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

  • all-terrain vehicle

    మన్యం అందాలను అందరికీ చూపించేలా సీతంపేట ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు. సీతంపేటలోని అడ్వంచర్‌ పార్కును బుధవారం సందర్శించారు. ఆల్‌టర్న్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేశారు. 

    సైక్లింగ్‌, బోటుషికారు, హ్యాంగింగ్‌ బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం మెట్టుగూడ జలపాతాన్ని సందర్శించారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ సతీష్‌ పాల్గొన్నారు. – సీతంపేట ఆల్‌టర్న్‌ వెహికల్‌పై పీఓ

     

  • సిరిమాను చెట్టుకు పూజలు

    24న సిరిమాను చెట్టు తరలింపు

    అసిస్టెంట్‌ కమిషనర్‌ శీరిష

    గంట్యాడ: మండలంలోని కొండతామరాపల్లి గ్రామానికి చెందిన చల్ల అప్పలనాయుడు, లోకవరపు సత్యం కల్లాల్లో సాక్షాత్కరించిన పైడితల్లి సిరిమాను, ఇరుసుమాను చెట్లకు ఆలయ అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పైడితల్లి ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, అర్చకులు చెట్టుకు పసుపు, కుంకుమలతో ముహూర్తం ప్రకారం బొట్టుపెట్టారు. అనంతరం గ్రామస్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఈ నెల 24న చెట్టును విజయనగరంలోని హుకుంపేటకు తరలిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 6,7 తేదీల్లో నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి ఈ నెల 12వ తేదీన పందిరాట వేశామన్నారు. 24వ తేదీ ఉదయం 8:30 గంటలకు చెట్టుతీసే కార్యక్రమం చేపడతామన్నారు. ఆ రోజున ఇక్కడకు వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ గాదె శ్రీనువాసులునాయుడు, సర్పంచ్‌ కోడెల ముత్యాలనాయుడు, తహసీల్దార్‌ నీలకంటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి

    విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ లక్ష్మణ్‌

    విజయనగరం ఫోర్ట్‌: విద్యుత్‌ ఉద్యోగులకు ఇవ్వా ల్సిన నాలుగు డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ సురగాల లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపీఎఫ్‌, జీపీఎఫ్‌ అమలుచేసి అందరికీ పెన్షన్‌ సదుపాయం కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బండారు రాజేష్‌కుమార్‌, పప్పల అప్పలస్వామినాయుడు, నిర్మలామూర్తి, అప్పలనాయుడు, సీతారామరాజు పాల్గొన్నారు.

Karimnagar

  • అస్తిత్వ పోరాటానికి ప్రతీక

    సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

    తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. నాటి ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి మిలియన్‌ మార్చ్‌ వరకు ఉవ్వెత్తున చేసిన అనేక పోరాటాలు చరిత్రలో ప్రసిద్ధిగాంచాయన్నారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన దశాబ్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిందన్నారు. 2000 సంవత్సరం నుంచి మలి దశ తెలంగాణ పోరాటం కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆచార్య జయశంకర్‌, జమలాపురం కేశవరావులు తెలంగాణ ప్రజలను చైతన్యం చేయగా, ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంతాచారి, యాదయ్య లాంటి విద్యార్థులు, కానిస్టేబుల్‌ కిష్టయ్య ఆత్మబలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, ఊరూరా నిరాహార దీక్షలతో చారిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ వేదికై ందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు జూన్‌ 2, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకాన్ని 5 కోట్ల 35 లక్షల మంది మహిళలు వినియోగించుకుని, రూ.227 కోట్ల 34లక్షల లబ్ధి పొందారన్నారు. 6 లక్షల 33 వేల 737 గ్యాస్‌ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరుగుతోందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో ఒక లక్షా 58 వేల 875 సర్వీసులకు విద్యుత్‌ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా లక్ష 90 వేల 186 మంది రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు 15 వేల 436 మందికి రూ.44 కోట్ల 23 లక్షల విలువ చేసే శస్త్ర చికిత్సలు చేయించడం జరిగిందన్నారు. జిల్లాలో 11 వేల 575 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, 39 వేల 645 కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని తెలిపారు.

  • ఇండ్లు పోతే ఆధారమే లేదు
    ● సుందరగిరిలో రోడ్డు విస్తరణపై గ్రామసభ ● బైపాస్‌ చేపట్టాలని గ్రామస్తుల వినతి

    చిగురుమామిడి: మండలంలోని సుందరగిరిలో ఫో ర్‌లైన్‌ విస్తరణపై బుధవారం గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్‌ రమేశ్‌ అధ్యక్షతన స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రహదారి కి ఇరువైపులా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గ్రామసభ నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోతే తమకు ఆధారం లేదని వంతడ్పుల దిలీప్‌కుమార్‌, మొలు గూరి శ్రావణ్‌, కక్కెర్ల వెంకటేశ్‌, తాళ్లపల్లి చిన చంద్రయ్య, కెమసారం వెంకటేశ్‌ ఆవేదన వ్యక్తం చేశా రు. ముందుగా నిర్ణయించిన ప్రకారం బైపాస్‌ నిర్మి స్తే బాగుంటుందని సూచించారు. నిర్వాసితుల ఆందోళనతో రసాభాసగా మారిన గ్రామసభ మధ్యలోనే వాయిదా పడింది. నిర్వాసితుల విన్నపాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్‌ తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

  • ‘పటేల

    కరీంనగర్‌టౌన్‌: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సా హసోపేత నిర్ణయంతోనే తెలంగాణకు రజాకర్ల నుంచి విమోచనం లభించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్‌ పార్లమెంట్‌ కా ర్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్‌ 17 చరిత్రలో మర్చిపోలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బాస సత్యనారాయణ రావు, యాదగిరి సునీల్‌రావు, డి.శంకర్‌, గుగ్గిల్లపు రమేశ్‌, మేకల ప్రభాకర్‌ యాదవ్‌, ఇ.నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

    కరీంనగర్‌: నిజాం నవాబుల పరిపాలన అంతం కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుఽ ద పోరాటాన్ని మతోన్మాదులు హిందూ, ముస్లింల పోరాటంగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరిస్తున్నారని, సాయుధ పోరాట వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ అన్నారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్‌, బావండ్లపెల్లి యుగేందర్‌, బూడిద సదాశివ, బీర్ల పద్మ పాల్గొన్నారు.

    కరీంనగర్‌ అర్బన్‌: గ్రామ పాలన అధికారులు(జీపీవో) విధుల్లో చేరారు. గత అయిదేళ్లుగా గ్రామస్థాయిలో రెవెన్యూ పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడే సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వం జీపీవోలకు నియామక పత్రాలు అందించగా ఆయాశాఖలు రిలీవింగ్‌ అర్డర్‌ ఇవ్వడంలో జాప్యం చేశాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో ఈ నెల 12న ‘రిలీవింగ్‌ అర్డర్‌ కోసం నిరీక్షణ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కలెక్టర్‌ పమేలా సత్పతి ఆయాశాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణమే రిలీవ్‌ ఆదేశించారని సమాచారం. అత్యధికంగా మున్సిపల్‌, మిషన్‌ భగీరథ విభాగాల్లో విధులు నిర్వహిస్తుండగా రిలీవై మంగళవారం నుంచి వారికి కేటాయించిన స్థానాల్లో జీపీవోలుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 318 గ్రామ పంచాయతీలుండగా రెవెన్యూ క్లస్టర్లు 255 కాగా 187 మంది జీపీవోలుగా బాధ్యతలు స్వీకరించారు.

    కరీంనగర్‌ అర్బన్‌: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో ల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివా స్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ భవన్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. పీఆర్సీ, బకాయిలు, హెల్త్‌కార్డు, పెన్షనర్ల సమస్యలను వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్‌గౌడ్‌, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

    సప్తగిరికాలనీ(కరీంనగర్‌): స్థానిక ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్‌ రెండో విడత స్పాట్‌ అడ్మిషన్లు ఈనెల 18,19 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్‌ కలువకుంట్ల రామకృష్ణ తెలిపారు. విద్యార్థులు నేరుగా స్పాట్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నా రు. అన్ని అర్హత పత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. బీఎస్సీ లైఫ్‌సైన్స్‌లో 19, బీఎస్సీ ఆనర్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో 23, బీకాం రిటైల్‌ ఆపరేషన్స్‌లో 8, బీకాం ఫైనాన్స్‌లో 3, బీకాం బిజినెస్‌ ఎనాల్టిక్స్‌లో 2, బీబీఏ, బీఏ ఇంగ్లిష్‌ మీడియంలో ఒక్కోసీటు మొత్తం 57 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇది చివరి అవకాశమని సూచించారు.

  • విద్య

    కరీంనగర్‌/కరీంనగర్‌టౌన్‌: విద్యార్థులు చదువుతోపాటు వివిధ కళలు, క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లాస్థాయి ‘కళోత్సవ్‌’ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా వివిధ కళలు, ఆటల్లోనూ రాణించాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఇలాంటి పోటీలకు ప్రోత్సహించాలని సూచించారు. అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణించేందుకు జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబించేందుకు ఇలాంటి కార్యక్రమాలు వేదికగా ఉంటాయన్నారు. డీఈవో మొండయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్‌ రెడ్డి, ఆంజనేయులు, జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌ రెడ్డి, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు.

    మహిళ ఆరోగ్యంతోనే దేశాభివృద్ధి

    మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తన కుటుంబం తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ‘స్వస్థ్‌ నారి– స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ 8వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోనూ ఈ వర్చువల్‌ ప్రారంభోత్సవం జరిగింది. హాజరైన కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళ తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం గర్బిణులకు వైద్య పరీక్షల గురించి తెలిపే ఎన్సీపీ కార్డులు అందజేశారు. క్రిటికల్‌ కేర్‌ విభాగాన్ని సందర్శించారు. అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, డీంఎహెచ్‌వో వెంకటరమణ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వీరారెడ్డి పాల్గొన్నారు.

  • ముగిస

    విశ్వకర్మ భగవాన్‌ ఉత్సవమూర్తుల శోభాయాత్ర

    మహా పూర్ణాహుతిలో పాల్గొన్న భక్తులు

    కరీంనగర్‌కల్చరల్‌: నగరంలోని కమాన్‌చౌరస్తాలో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం స్థాపిత దేవతారాధనలు, శ్రీగాయత్రీ విశ్వకర్మ సహస్ర నామార్చనలు, పూర్ణాహుతి, మహానివేదన, మంగళహారతి, మహామంత్ర పుష్పం అనంతరం తీర్థప్రసాద వితరణ గావించారు. భక్తులకు అన్నదానం చేశారు. విశ్వకర్మ భగవానుని ఉత్సవమూర్తుల శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈవో ఉడుతల వెంకన్న, చైర్మన్‌ ముత్తోజు రామ్‌కుమార్‌, ధర్మకర్తలు వెగ్గళం రామకృష్ణ, ఎదులాపురం అన్నయ్య, గోగులకొండ నరసింహాచారి, వంగల నవీన్‌, గోకులకొండ కరుణాకర్‌, రాగటి కవిత పాల్గొన్నారు.

    వైభవంగా సాగిన విశ్వకర్మ భగవానుడి శోభాయాత్ర

  • పోషకాహారంతో ఆరోగ్యమస్తు!

    కరీంనగర్‌: నేటి బాలలే రేపటి పౌరులు నినాదంతో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా పోషణ లోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. దీన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈనెల 17నుంచి అక్టోబర్‌ 16వ తేదీ వరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్‌ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు, పెద్దలు నిత్యం పోషక విలువలున్న పదార్థాలు తీసుకోవాలని తెలియజేస్తూ మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రతీ ఏడాది సెప్టెంబర్‌ను పోషణ మాసంగా నిర్వహిస్తోంది. బుధవారం నుంచి పోషణమాసం ప్రారంభమైంది. పిల్లలు, బాలింతలు, గర్భిణులు పోషకాహార లోపాలను అధిగమించడానికి మహిళా, శిశు సంక్షేమశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు విటమిన్లు, ఖనిజాలు, ప్రొటిన్లు, శక్తి పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోషణ అభియాన్‌ కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సరస్వతి తెలిపారు.

    జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 04

    అంగన్‌వాడీ కేంద్రాలు 777

    3–6 ఏళ్లలోపు పిల్లలు 21,107

    గర్భిణులు, బాలింతలు 11,764

  • గుంత.. డ్రైవర్లకు చింత

    చింతకుంట– కొత్తపల్లి బైపాస్‌ రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. రహదారిపై ఏర్పడ్డ గుంతలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు వందల సంఖ్యలో భారీ వాహనాలు ప్రయాణించే రహదారిపై పెద్దపెద్ద గుంతలేర్పడ్డాయి. వర్షాలతో పెద్దవిగా మారి వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. ఈ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ లారీ బుధవారం గుంతలో ఇరుక్కుపోయిన దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. ఆ లారీని బయటకు తీసేందుకు డ్రైవర్‌, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

    – కొత్తపల్లి

  • కూలిన నాలా.. తప్పిన ప్రమాదం

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని కశ్మీర్‌గడ్డలో నాలా కూలింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆ సమయంలో జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో నాలాపై ఉన్న పైకప్పు దెబ్బతింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఒక్కసారిగా ఆర్‌బీ స్వీట్‌హౌస్‌, అపూర్వ కళాశాల మధ్యన నాలా పై ఉన్న పైకప్పు కూలిపోయింది. నగరంలోని ప్రధాన నాలాల్లో ముఖ్యమైన ఈ నాలా, రాంనగర్‌ నుంచి మంకమ్మతోట, జ్యోతినగర్‌, ముకరాంపుర, అంబేడ్కర్‌ స్టేడియం, గణేశ్‌నగర్‌, లక్ష్మినగర్‌ల మీదుగా వాగులో కలుస్తుంది. ముకరాంపురలోని టూటౌన్‌ పోలిసుస్టేషన్‌ పక్కనుంచి వెళ్తున్న ఈ నాలా శిథిలావస్థలో ఉండి, ఈ ప్రాంతంలో వరద సమస్యకు కారణమవుతోంది. శిథిలావస్థకు చేరిన ఈ నాలాను పునర్నిర్మించాలని ముకరాంపుర,కాశ్మీర్‌గడ్డ, మంకమ్మతోట తదితర ప్రాంతవాసులు ఏళ్లకాలంగా విన్నవిస్తున్నా, ఫలితం కనిపించడం లేదు. తాజాగా ఈ నాలా కూలిపోవడంతో, మరోసారి నాలా పునర్నిర్మాణం తెరపైకి వచ్చింది. స్థానిక మాజీ కార్పొరేటర్‌ శ్రీదేవి చంద్రమౌళి ఘటనాస్థలికి వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

  • పాక్షికంగా నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

    కరీంనగర్‌టౌన్‌: ఆరోగ్య శ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు బుధవారం పాక్షికంగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు మూకుమ్మడిగా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. గతేడాదికాలంగా ఆరోగ్యశ్రీ బిల్లులు రాకపోవడంతో విధిలేని పరిస్థితిలో సేవలు నిలిపివేస్తున్నట్లు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 49 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉండగా, అందులో 32 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే సేవలు నిలిపివేశారు. కరీంనగర్‌ శివారులోని రెండు మెడికల్‌ కళాశాలలతో పాటు అపోలోరీచ్‌, మెడికవర్‌, మరో రెండు,మూడు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తున్నారు.

  • తల్లిని పట్టించుకోని కొడుకులకు కౌన్సెలింగ్‌

    హుజూరాబాద్‌రూరల్‌: కొడుకులు పట్టించుకోవడం లేదంటూ మండలంలోని కనుకులగిద్దె గ్రామానికి చెందిన ములుగు రాజమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్డీవో రమేశ్‌బాబు గ్రామంలో విచారణ చేపట్టారు. ఒక్కొక్కరూ నెలకు రూ.మూడువేల చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు సరిగా అమలవుతున్నాయో లేదా అని తెలుసుకోవడానికి కలెక్టర్‌, జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలోని బృందం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో రాజమ్మను కుమారులు పట్టించుకోవడం లేదని తేలింది. ఆమె ముగ్గురు కొడుకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి రాజమ్మను పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణలో సోషల్‌ కౌన్సిలర్‌ పద్మావతి, డీవీసీ కౌన్సిలర్‌ ఆరె శేఖర్‌, ఎస్‌ఆర్వో రఫీ, హెడ్‌ కానిస్టేబుల్‌ మధు, మల్లయ్య, మర్రి శ్రీనివాస్‌ తదితరులున్నారు.

  • బైండోవర్‌ ఉల్లంఘించిన   ఏడుగురికి జైలు

    మంథని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి, పోతారం, మైదంబండ, అడవిశ్రీరాంపూర్‌, కేశనపల్లి, పారుపల్లి గ్రామాల్లో గుడుంబా విక్రయిస్తూ బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని బుధవారం తహసీల్దార్‌ మధుసూదన్‌రెడ్డి ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌కుమార్‌ తెలిపారు. దీంతో వారికి ఏడాది జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించారన్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్‌ నిమిత్తం కరీంనగర్‌కు తరలించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయికుమార్‌, సిబ్బంది శ్రీనివాస్‌, మహేందర్‌, నిరంజన్‌, వసంత, రవి పాల్గొన్నారు.

    మూడిళ్లలో చోరీ

    జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయ సమీపంలోని హరిహర కాలనీలో బుధవారం వేకువజామున తాళం వేసి ఉన్న మూడిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి తులంన్నర బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం పక్కింటి వారు లేచేసరికి డోర్లు తెరిచి ఉండటంతో ఇంటి యజమానులకు సమాచారం అందించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించగా పట్టణ సీఐ కరుణాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని హరిహర కాలనీలో సీసీపుటేజీలను పరిశీలించారు. ముగ్గురు దొంగలు ముసుగులు వేసుకుని వెళ్లినట్లు రికార్డు అయింది. సీఐ మాట్లాడుతూ.. ఇళ్లలో విలు వైన వస్తువులు ఉంచవద్దని, బ్యాంక్‌ ల్యాకర్లలోగానీ భద్రపర్చుకోవాలన్నారు. ప్రతి కాలనీల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

  • కుందనపల్లి రైల్వే వంతెనకు గ్రీన్‌సిగ్నల్‌

    రామగుండం: పెద్దపల్లి జంక్షన్‌ – రామగుండం మధ్యగల కుందనపల్లి రైల్వేగేట్‌ (ఎల్‌సీ49) వద్ద వంతెన నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. వంతెన నిర్మాణానికి రూ.110 కోట్లు వెచ్చిస్తారని, రెండు నెలల్లో టెండర్‌ ప్రక్రియ పూర్తిచేస్తారన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బుధవారం స్థానిక రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. రామగుండంలో మరిన్ని కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ యోచనలో ఉన్నామన్నారు. పెద్దంపేట రైల్వేగేట్‌ వద్ద వంతెన నిర్మాణం ప్రతిపాదనలో ఉందన్నారు. కాగా, అంతర్గాం స్పిన్నింగ్‌, వీవింగ్‌ మిల్లు కార్మికుల సమస్య పరిష్కరించాలని బర్మా, కాందీశీకుల సంఘం ప్రతినిధి ఇండిబిల్లి రవీందర్‌, సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయాలని మసీదు కమిటీ, ఇతర సమస్యలపై రైల్వే బోర్డు సభ్యుడు అనుమాస శ్రీనివాస్‌ తదితరులు ఎంపికీ వినతిపత్రం అందజేశారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఇటీవల గోదావరిలో గల్లంతైన అక్బర్‌నగర్‌లోని నారకట్ల రాజేశ్‌ కుటుంబసభ్యులను ఎంపీ పరామర్శించారు.

  • ప్రోత

    పట్టుకుచ్చుల పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. బంతిపూల సాగుకు అందించినట్లు మాకూ సహకారం అందించాలి.

    – పెసరు లచ్చయ్య, రైతు, పెద్దాపూర్‌

    బతుకమ్మ తయారీలో పట్టుకుచ్చులు అగ్రస్థానంలో ఉంటాయి. ఈ పూలు బతుకమ్మ పండుగకే వన్నె తెస్తాయి. మేము వీటినే ఉపయోగిస్తాం.

    – కె.రమాదేవి, కోనరావుపేట

    బంతి, చామంతి, లిల్లీ, గైలార్డియాపూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. తక్కువ పెట్టుబడి, శ్రమలేని బంతిపూలు సాగుచేయాలి.

    – మహేశ్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌

  • డిజిటల్‌ క్రాప్‌ సర్వే షురూ

    గతానికి భిన్నంగా వెసులుబాటు

    అక్టోబర్‌ 20 గడువు

    కరీంనగర్‌ అర్బన్‌: డిజిటల్‌ క్రాప్‌ సర్వేశ్రీ క్రమంగా పట్టాలెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే చేపడుతున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో కొంత ఆలస్యంగా మొదలవగా సర్వే పురోగతిని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ సమీక్షిస్తున్నారు. వచ్చే అక్టోబరు 20నాటికి పూర్తి చేయాల్సి ఉండగా గతేడాది సర్వే నిర్వహణకు ఏఈవోలు చేతులెత్తేయగా ఈ ఏడాది ఆ సమస్య తలెత్తకుండా, సజావుగా సాగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

    17 అంశాలతో వివరాల నమోదు

    మార్కెటింగ్‌, ఎరువులు, విత్తనాలు, దిగుమతులు, ఎగుమతులు, ప్రాసెసింగ్‌ వంటి అవసరాల ప్రణాళికను రూపొందించేందుకు ప్రతి రైతు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. 17 పేజీల మార్గదర్శకాలతో ప్రభుత్వం ఆదేశించింది. పచ్చిరొట్ట, అపరాలు, సీడ్‌ ప్రొడక్షన్‌ వివరాలు, అంతర పంట వివరాలు, సేంద్రియ వ్యవసాయం చేసే వారి వివరాలు, ప్రతి పంట వాటి రకాలు, నీటి వసతి, ఉద్యాన పంటలైతే వయసు, చెట్ల సంఖ్య నమోదు చేయనున్నారు. గత నెల వరకు 2,10,234 పాసుపుస్తకాలకు డిజిటల్‌ సైన్‌ కాగా ప్రతి సర్వే నంబర్‌ వారీగా పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. వివరాల నమోదు అనంతరం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అనంతరం రైతుల ఫోన్‌ నంబర్లకు ఎస్సెమ్మెస్‌ రానుంది.

    పురుషులకు 2 వేలు.. మహిళలకు 1,800 లక్ష్యం

    సీజన్లో ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ క్లస్టర్‌ పరిధిలోని రైతులను ప్రత్యక్షంగా కలిసి వాస్తవంగా సాగులో ఉన్న క్షేత్రాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. మహిళా ఏఈఓలు కనీసం 1,800 ఎకరాల్లో, పురుష ఏఈఓలు కనీసం 2వేల ఎకరాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటికి సాధారణ క్రాప్‌ బుకింగ్‌ పద్ధతిలో చేస్తారు. ప్రతి పంటను ఫొటో తీసి అప్లోడ్‌ చేయటం తప్పనిసరి. నమోదు మొత్తాన్ని ఒకే మొబైల్‌ యాప్‌ ద్వారా పూర్తి చేస్తారు. సర్వేలో వరి రకాల వివరాలు పేర్కొనటం తప్పనిసరి. ధాన్యం సేకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది.

    సర్వే ఎందుకంటే

    దేశంలో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందనే అంచనా సులువు. అలాగే దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల నిర్ణయం ఉండనుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కచ్చితత్వంతో నష్ట నిర్ధారణ ఉంటుంది. అలాగే చీడపీడల ఉనికి, తగిన విధంగా రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు సంసిద్ధతకు వినియోగించనున్నారు. వ్యవసాయ పురోగతి అంచనాకు ఈ సర్వే దోహదపడుతుంది.

    రైతుకు సంక్షిప్త సందేశం

    క్రాప్‌ బుకింగ్‌ 90శాతం పూర్తి కాగానే రైతులకు సంక్షిప్త సమాచారం ద్వారా వివరాలు పంపిస్తారు. రైతు వివరాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలి. నమోదులో తప్పులు దొర్లితే సరిచేయమంటూ రైతు దరఖాస్తు ఇవ్వాలి. ఏఈవో మూడు రోజుల్లో సరి చేసి తుది జాబితా ప్రదర్శించనున్నారు. జిల్లాలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే ముమ్మరంగా సాగుతోందని, తప్పుగా నమోదైన వివరాలు సరిచేసేందుకు అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు.

    జిల్లాలో మొత్తం రైతులు : 2,10,234

    మొత్తం క్లస్టర్లు : 77

    రెవెన్యూ గ్రామాలు : 205

    భూ విస్తీర్ణం : 3,33,450 ఎకరాలు

  • పెద్దపల్లిరూరల్‌: స్థానిక రైల్వేస్టేషన్‌ రోడ్డులోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాం ఆవరణలో బుధవారం లారీ ఢీకొన్న ఘటనలో అఫ్జల్‌బేగం (58) అనే కార్మికురాలు అక్కడికక్కడే మరణించింది. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నివాసముంటున్న అఫ్జల్‌బేగం.. ఎప్పటిలాగే గోదాంలో పనికి వెళ్లింది. పనిచేస్తున్న సమయంలో కార్మికురాలిని చూడకుండా డ్రైవర్‌ లారీని అజాగ్రత్తగా వెనక్కి తీసుకురావడంతో ఢీ కొందని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. మృతురాలి కూతురు పర్‌వీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

    సెల్‌ఫోన్‌ వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య 

    జగిత్యాలక్రైం: బీటెక్‌ చదువు మధ్యలో మానేసి ఇంటి వద్ధ ఖాళీగా ఉంటూ.. సెల్‌ఫోన్‌ చూస్తుండటంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ఈగ రాహుల్‌ (25) బీటెక్‌ మధ్యలో మానేశాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ ఎక్కువగా సెల్‌ఫోన్‌ చూస్తున్నాడు. సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన రాహుల్‌ ఇంట్లో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్‌ తెలిపారు.

    కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు..

    చందుర్తి(వేములవాడ): కడుపునొప్పి భరించలేక ఓ వృద్ధురాలు బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. బండపల్లికి చెందిన న్యాత ఉరఫ్‌ సంద్రగిరి లచ్చవ్వ(52) ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది, బుధవారం మధ్యాహ్నం ఇంటికొచ్చింది. కుమారుడు నరేశ్‌ బయటకు వెళ్లాడని గమనించిన లచ్చవ్వ ఇంట్లో దూలానికి ఉరివేసుకుంది. కాగా మృతురాలు కుమారుడు నరేశ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై జిల్లెల్ల రమేశ్‌ తెలిపారు.

    యువకుడి ఆత్మహత్యాయత్నం

    ధర్మపురి: విద్యుత్‌ బిల్లు చెల్లించాలని సిబ్బంది డిమాండ్‌ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు విద్యుత్‌ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన బండారి లక్ష్మణ్‌ జీవనోపాధి కోసం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ముందు సర్వీస్‌సెంటర్‌ పెట్టుకున్నాడు. కరెంట్‌ బిల్లులో సగం నాలుగు రోజుల క్రితం చెల్లించాడు. మిగిలిన మొత్తం చెల్లించాలని విద్యుత్‌ సిబ్బంది బుధవారం ఇంటివద్దకు వెళ్లి గొడవ చేశారు. దీనికి మనస్తాపానికి గురైన లక్ష్మణ్‌ ఇంటిపక్కనున్న విద్యుత్‌ స్తంభం ఎక్కి వైర్లను పట్టుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో కరెంట్‌ పోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బంధువులు, స్నేహితుల చొరవతో కిందికి దిగి విద్యుత్‌ సిబ్బందితో మాట్లాడించారు.

     

  • బతుకమ్మకు పట్టుకుచ్చుల అందం

    జూలపల్లి(పెద్దపల్లి): బతుకమ్మకు అందం తెచ్చే పట్టుకుచ్చులు(కాక్స్‌కాంబ్‌) పూల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ఆడపడచులు సంబురంగా ఆడుకునే బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మను పేర్చేందుకు పట్టుకుచ్చులు వినియోగిస్తారు. వీటిని పెద్దాపూర్‌, తెలుకుంట, నాగులపల్లె, జూలపల్లి, చీమలపేట తదితర గ్రామాల్లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. మూడు నెలలకే పంట కోతకు వస్తుంది. పెట్టుబడి తక్కువ, శ్రమతో కూడుకున్నది. అయినా, డిమాండ్‌ అధికంగా ఉండడంతో అన్నదాతలు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మ పండుగకు మూడు నెల ముందే నారుపోస్తారు. సస్యరక్షణ చర్యలతో నాణ్యమైన పూలు పండిస్తున్నారు. గతంలో రెండు, మూడు ఎకరాలకే పరిమితమైన పట్టుకుచ్చుల సాగు.. ఇప్పుడు సుమారు 15 ఎకరాలకు పైగా పెరిగిందని హార్టికల్చర్‌ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే సాగు విస్తీర్ణం మరింత పెంచుతామని రైతులు చెబుతున్నారు.

    పల్లెల నుంచి పట్టణాలకు..

    వివిధ పల్లెల్లో పండిస్తున్న పట్టుకుచ్చుల పూలను రైతులు పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల, గోదావరిఖని, కరీనంగర్‌, హైదరాబాద్‌, సిద్దిపేట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

    పెద్దాపూర్‌లో పెరిగిన సాగు విస్తీర్ణం

    రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని వినతి

  • బైక్‌

    మాక్లూర్‌/నందిపేట్‌ (ఆర్మూర్‌): బైక్‌ అదుపు తప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం దుర్గానగర్‌ శివారులో బుధవారం వేకువజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటుకు ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌కు చెందిన పూజ (25)తో పది నెలల క్రితమే వివాహమైంది. బీటెక్‌ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చింది. బైక్‌పై తమను నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద వదిలేసి రావాలని చింటు తండ్రి నారాయణ (58)ను కోరాడు. ముగ్గురూ కలిసి బైక్‌పై బయల్దేరారు. చింటు డ్రైవింగ్‌ చేస్తున్నారు. దుర్గానగర్‌ శివారులో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన పూజ, చింటును ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పూజ మృతి చెందింది. మామ, కోడలు మృతితో తల్వేదలో విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

    స్వల్పగాయాలతో బయటపడిన మృతురాలి భర్త

    పైళ్లెన 10 నెలలకే విషాదం

    మృతురాలిది ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌

Kurnool

  • హిట్‌ అండ్‌ రన్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించండి

    కర్నూలు: ఉమ్మడి జిల్లాలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. స్థానిక న్యాయ సేవాసదన్‌లో హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై బుధవారం జిల్లాస్థాయి అధికారులతో మానిటరింగ్‌ సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 76 హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు గాను 21 కేసుల్లో నష్టపరిహారం (అవార్డు) మంజూరైందని అధికారులు తెలిపారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు గాను 11 కేసుల్లో నష్టపరిహారం మంజూరైందన్నారు. మిగతా వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని లీలా వెంకటశేషాద్రి అధికారులను ఆదేశించారు. కర్నూలు, నంద్యాల డీఆర్వోలు వెంకటనారాయణమ్మ, రాము నాయక్‌, ఆర్‌టీఓలు భరత్‌ చవాన్‌, శివారెడ్డి, డీటీఆర్‌బీ సీఐలు ఆదిలక్ష్మి, మల్లికార్జున, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ సంధ్యారెడ్డి, డీసీఆర్‌బీ ఎస్‌ఐ శ్రీనివాసరావు, డిప్యూటీ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరాం తదితరులు పాల్గొన్నారు.

  • డీపీఓలో వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి

    కర్నూలు: జిల్లా పోలీసు కార్యాలయంలో వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మను ప్రపంచంలోనే మొదటి వాస్తు శిల్పిగా భావిస్తారన్నారు. కష్టపడే తత్వం, పట్టుదల, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనే శక్తివంతమైన సందేశాన్ని విశ్వకర్మ ద్వారా మనం నేర్చుకోవాలన్నారు. వివిధ వృత్తుల్లో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి వెనుక ఉన్న ప్రేరణే విశ్వకర్మ అన్నారు. ఏఆర్‌ డీఎస్పీ భాస్కర్‌రావు, ఆర్‌ఐలు జావెద్‌, నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

  •  Doctors administering a tenectomy plaque injection to a patient who had suffered a heart attack at the casualty ward of the Kurnool Government General Hospital

    దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గుండెశస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి ఎంతో మందికి ప్రాణం పోశారు. ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుండెపోటుకు గురైన వారికి వెంటనే ఖరీదైన ఇంజెక్షన్లు ఇచ్చే వైద్యాన్ని తీసుకొచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన స్టెమీ ప్రోగ్రామ్ ఇప్పటికీ కొనసాగుతూ అనేక మంది ప్రాణాలు నిలుపుతోంది. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాటు ఏరియా ఆసుపత్రులు, సీహెచ్ సీల్లోనూ ఈ ఖరీదైన ఇంజెక్షన్లు ఇస్తున్నారు.

    కర్నూలు(హాస్పిటల్‌): ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గుండెపోటుతో ఆకస్మిక మరణాలు అధికమయ్యాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ గుండెపోటు మరణాలు ఇప్పుడు యువకుల్లోనూ అధికమయ్యాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి బాధితుల కోసం 2023 సెప్టెంబర్‌లో నేనున్నాంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త ప్రోగ్రామ్‌ను తెచ్చారు. కేవలం నగర కేంద్రాల్లోని ఆసుపత్రుల్లోనే గాకుండా ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో కూడా త్రాంబోలైసిస్‌ విధానంలో రూ.40వేల విలువ చేసే ఖరీదైన టెనిక్టమి ప్లేజ్‌ అనే ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేటట్లు చేశారు. సీహెచ్‌సీలకు వచ్చిన రోగికి ముందుగా ఈసీజీ తీసి కర్నూలులోని టెలిమెడిసిన్‌ హబ్‌కు పంపిస్తారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈ ఇంజెక్షన్‌ ఇస్తున్నారు. గుండెపోటు వచ్చిన వారిని మొదటి గంటలోపు సమయానికి తీసుకొస్తే వెంటనే ఈ ఖరీదైన ఇంజెక్షన్‌ ఇచ్చి బతికిస్తున్నారు. రోగులకు భారం గాకుండా ఆరోగ్యశ్రీ పథకంలోనే దీనిని చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వందలాది మంది ప్రాణాలు పోసింది ఈ ఇంజెక్షన్‌.

    కూటమి ప్రభుత్వం గొప్పలు

    స్టెమీ ప్రోగ్రామ్‌ను తామే ప్రవేశపెట్టామని, దానిని ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పథకంలో చేర్చి రోగులకు ఉచితంగా ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఈ ప్రోగ్రామ్‌పై ఆ పార్టీ నాయకులతో పాటు పచ్చమీడియా సైతం ప్రచారం చేసుకుంటూ వస్తోంది. వాస్తవంగా ఈ ప్రోగ్రామ్‌ 2023లో అప్పటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పట్లోనే దీనిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి గుండెరోగుల ప్రాణాలు పోకుండా కాపాడుతోంది.

    మూడేళ్లలో టెనిక్టమి ప్లేజ్‌ ఇంజెక్షన్‌ వివరాలు

    ఆసుపత్రి, 2023, 2024, 2025

    ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, 1, 9, 5

    ఆలూరు సీహెచ్‌సీ, 1, 10, 8

    పత్తికొండ సీహెచ్‌సీ, 3, 20, 26

    ఓర్వకల్‌ సీహెచ్‌సీ, 1, 7, 6

    కోడుమూరు సీహెచ్‌సీ, 3, 14, 11

    వెల్దుర్తి సీహెచ్‌సీ, 1, 4, 6

    కర్నూలు జీజీహెచ్‌, 25, 59, 55

    నంద్యాల జిల్లాలో ఈ యేడాది ఇప్పటి వరకు 123 టెనిక్టమి ప్లేజ్‌ ఇంజెక్షన్లు ఇచ్చారు.