Archive Page | Sakshi
Sakshi News home page

Chittoor

  • నమోదు చేసుకుంటేనే  ఆర్థిక తోడ్పాటు

    చిత్తూరు కలెక్టరేట్‌: గతంలో ప్రధానమంత్రి మాతృ త్వ వందన యోజన పథకం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలు జరిగేది. ప్రస్తుతం ఆ పథకం బాధ్యతలను సీ్త్ర శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) అ ధికారులకు అప్పగించారు. ఐసీడీఎస్‌ అధికారులు ఆ పథకంలో జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణుల పేర్లు నమోదు చేస్తున్నారు. కార్యకర్త లాగిన్‌ నుంచి పర్యవేక్షకురాలికి పంపేలా చర్యలు చేపడుతున్నారు. అనంతరం పర్యవేక్షకురాలి నుంచి జిల్లా ఐసీడీఎస్‌ పీడీ లాగిన్‌కు వివరాలను చేర వేస్తున్నారు. జిల్లాలో ఈ పథకానికి అర్హత కలిగిన మహిళలు పేర్లను నమోదు చేసుకుంటే ఆర్థిక తో డ్పాటు అందనుంది. మొదటి ప్రసవంలో రూ.5 వేలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ పుడితే రూ.6 వేలు అందిస్తారు. దీంతో పాటు పోషకాహారం సైతం అందించనున్నారు. మహిళ గర్భం దాల్చిన వెంటనే సంబంధిత అంగన్‌వాడీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుంటే రూ.3 వేలు, ప్రసవం అనంతరం మూడు టీకాలు వేసుకున్నాక రూ.2 వేలు అందజేస్తారు. రెండవ కాన్పులో ఆడబిడ్డ పుడితే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6 వేలు జమచేస్తారు.

    వివాహిత అదృశ్యం

    బంగారుపాళెం: మండలంలోని ఊటువంక గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యంపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గ్రామానికి చెందిన హరికృష్ణ భార్య భార్గవి (30) గత నెల 31వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదన్నారు. ఆచూకీ కోసం విచారణ చేసి నా ఫలితంలేదు. దాంతో భర్త హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

  • గంజాయి విక్రేత అరెస్టు

    నగరి : మండలంలోని ఓజీ కుప్పంలో గంజాయి విక్రయిస్తున్న లింగేశ్వరి అలియాస్‌ జ్యోతి (45) అనే మహిళను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ విక్రమ్‌ తెలిపిన సమాచారం మేరకు డీఎస్పీ సయ్యద్‌ మహమ్మద్‌ అజీజ్‌ నేతృత్వంలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం అందిన సమాచారం మేరకు ఓజీకుప్పం గ్రామంలో గంజాయి విక్రయిస్తుండగా లింగేశ్వరి అలియాస్‌ జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద విక్రయానికి సిద్ధంగా ఉంచిన 1.25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ మహిళపై గతంలో నగరి, పుత్తూరు పోలీస్‌ స్టేషన్‌లో 5 గంజాయి విక్రయ కేసులు నమోదయ్యాయి.

East Godavari

  • బదిలీలలు!
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

    సాక్షి, రాజమహేంద్రవరం: ఎకై ్సజ్‌ శాఖలో బది‘లీలలు’ వెలుగు చూస్తున్నాయి. ఐదు నెలల వ్యవధిలోనే ఒక ఉద్యోగిని మూడుసార్లు బదిలీ చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకూ ఏ శాఖలోనూ ఇలాంటి బదిలీలు జరగలేదని ఉద్యోగులు విస్మయానికి గురవుతున్నారు. సిబ్బంది అభీష్టం మేరకు ఈ బదిలీలు చేశారనుకుంటే పొరపాటే. తమకు ఇష్టమొచ్చిన విధంగా పోస్టింగులు ఇచ్చేశారని, కావాల్సిన వారికి అనుకూలమైన స్థానాలు కేటాయించారని, దీని వెనుక మతలబు దాగుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ కేంద్రంగా ఈ తతంగం మొత్తం జరిగినట్లు విమర్శలున్నాయి.

    ఏం జరిగిందంటే..

    ఫ ఎకై ్సజ్‌ శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఆటాచ్‌మెంట్‌ను రద్దు చేస్తూ గత జూలై నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా ఉద్యోగులు ఎవరి స్థానాలకు వారు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే ఏమైందో కానీ.. అదే నెల 23న కొంత మందిని వేరే స్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

    ఫ రెండుసార్లు బదిలీ అయిన ఉద్యోగులకు పని చేయాల్సిన స్థానం చూపించడంతో ఇప్పటికై నా కొద్ది రోజుల పాటు ఉద్యోగం చేసుకోవచ్చునని భావించారు. అంతలోనే తిరిగి అక్టోబర్‌ 8న కొందరిని మళ్లీ బదిలీ చేశారు.

    ఫ అది చాలదన్నట్లు నెల రోజులు గడవక ముందే మళ్లీ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా అక్టోబర్‌ 8న బదిలీ చేసిన కొందరు ఉద్యోగులకు మళ్లీ ఈ నెల 7న స్థానచలనం కలిగించారు.

    ఫ మరీ విచిత్రంగా గత శుక్రవారం ఉదయం ఒక బదిలీ ఉత్తర్వు ఇచ్చారు. సాయంత్రానికల్లా ఆ జాబితా మారుస్తూ మరో ఉత్తర్వు వెలువరించారు.

    ఫ ఒక్క రోజులోనే రెండుసార్లు బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సినంత అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది.

    ఫ ఎకై ్సజ్‌ శాఖలో జరుగుతున్న ఈ బది‘లీలలు’ చూసి ఇతర శాఖల్లోని ఉద్యోగులు నివ్వెరపోతున్నారు.

    ఫ ఏడాది వ్యవధిలోనే ఒక ఉద్యోగి నాలుగుసార్లు బదిలీ అయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ఫ ఒక ఉద్యోగికి స్థానచలనం కలిగితే.. వారి కుటుంబం మొత్తం అక్కడి నుంచి బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లల చదువుల దృష్ట్యా పాఠశాల మార్చాలి. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధ పడేవారికి వైద్యం చేయించడంలోనూ ఇబ్బందులు తప్పవు.

    ఫ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం కావాల్సిన వారికి కోరుకున్న స్థానాలు కట్టబెట్టేందుకే ఇతర ఉద్యోగులను బలి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

    నవోదయం 2.0 పూర్తయినట్లు కలరింగ్‌!

    సారా నియంత్రణ, బెల్టు షాపులను కట్టడి చేసేందుకు నవోదయం 2.0 పేరుతో ఎకై ్సజ్‌ శాఖ ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది. దీనిలో భాగంగా సారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి. ఆయా గ్రామాలను సారా రహితంగా మార్చాలి. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలోని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా బెల్టు షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఎకై ్సజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఏదో ఒక సారా కేంద్రంపై దాడి చేయడం.. పూర్తిగా అరికట్టామంటూ ప్రకటించడం పరిపాటిగా మారింది. నవోదయం 2.0 పూర్తవకపోయినా.. పూర్తయిందని, సారాను నియంత్రించేశామని నమ్మబలుకుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సైతం చెప్పినట్లు సమాచారం. నవోదయం 2.0 పూర్తయిన కారణంగా సిబ్బంది బదిలీలు చేపడుతున్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. అయితే, తాజాగా సైతం మూడు సారా కేసులు పట్టుకుని వదిలేసినట్లు తెలిసింది.

    ఫ ప్రతిసారీ స్టేషన్‌ సిబ్బందిని బదిలీ చేస్తున్నారే తప్ప.. ఈఎస్‌టీఎస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందికి మాత్రం స్థానచలనం కలగడం లేదన్న విమర్శలున్నాయి. పైగా తమకు అనుకూలమైన వారిని ప్రత్యేకంగా జీఓలు ఇచ్చి మరీ ఈ రెండు విభాగాల్లోకీ బదిలీ చేసుకుంటున్నట్లు సమాచారం.

    ఫ ఎకై ్సజ్‌ శాఖలో ఓ సీఐ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఎస్‌ఈబీలో మొదలైన ఈ సీఐ ప్రస్థానం ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నట్లు తెలిసింది. సదరు సీఐ రాజమహేంద్రవరంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

    ఫ ఐదు నెలల వ్యవధిలో మూడుసార్లు స్థానచలనం

    ఫ నవోదయం 2.0 పేరుతో అడ్డగోలు వ్యవహారం

    ఫ నిర్ఘాంతపోతున్న ఎకై ్సజ్‌ ఉద్యోగులు

  • భక్తప

    అన్నవరం: కార్తిక మాసం మూడో ఆదివారం రత్నగిరి భక్తజనప్రభంజనమే అయ్యింది. వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలని విధంగా మారిపోయింది. రికార్డు స్థాయిలో సుమారు 90 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. వ్రత మండపాలు ఖాళీ లేకపోవడంతో భక్తులను కంపార్ట్‌మెంట్లలోనే గంటల తరబడి నిలిపివేశారు. వ్రత మండపాలు ఖాళీ అయ్యాక వారిని లోపలకు అనుమతించారు.

    దండిగా ఆదాయం

    భక్తుల ద్వారా దేవస్థానానికి ఈ ఒక్క రోజే రూ.కోటి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దీనిలో వ్రతాల ద్వారానే సుమారు రూ.55 లక్షలు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.30 లక్షలు, ఇతర విభాగాల ద్వారా రూ.15 లక్షల చొప్పున వచ్చింది. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు ఆలయంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 15 వేల మంది భక్తులకు ఉచితంగా పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. కార్తిక సోమవారం పర్వదినం కావడంతో రత్నగిరిపై నేడు కూడా తీవ్ర రద్దీ నెలకొనే అవకాశముంది. సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    రికార్డు స్థాయిలో వ్రతాలు

    రికార్డు స్థాయిలో సత్యదేవుని వ్రతాలు 9 వేలు జరిగాయి. వ్రత, నిత్య కల్యాణ, పాత కల్యాణ మండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం 6 గంటల వరకు స్వామివారి వ్రతాలు జరిగాయి. కార్తిక పౌర్ణమి నాడు 10 వేల వ్రతాలు జరగగా ఆ తరువాత అత్యధిక వ్రతాలు జరిగింది ఇప్పుడేనని అధికారులు చెప్పారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకే తెరచి వ్రతాలు ప్రారంభించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసారు. తూర్పు రాజగోపురం ఎదురుగా రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. రామాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, జమ్మి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఆలయ ప్రాంగణమంతా దీపాలతో నిండిపోయింది.

    ఫ కిటకిటలాడిన రత్నగిరి

    ఫ సత్యదేవుని దర్శించిన 90 వేల మంది

    ఫ 9 వేల వ్రతాల నిర్వహణ

    ఫ రూ.కోటి ఆదాయం

  • ఫ లక్ష దీప కాంతులు

    కార్తిక మాసాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరులోని గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో ఆలయ ప్రాంగణం, పుష్కరిణి కొత్త శోభను సంతరించుకున్నాయి.

    స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. స్వామివారికి అర్చకులు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

    – రాజమహేంద్రవరం రూరల్‌

  • హరహర మహాదేవ

    పెరవలి: అన్నవరప్పాడు శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పటిక లింగాన్ని నాలుగో రోజైన ఆదివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. కార్తిక మాసంలో పరమేశ్వరుడి నక్షత్రమైన ఆరుద్ర కావడంతో తండోపతండాలుగా భక్తులు వచ్చారు. ఓవైపు ఎండ దంచేస్తున్నా.. ఆలయం నుంచి జాతీయ రహదారిపై సైతం సుమారు అర కిలోమీటరు మేర బారులు తీరి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో, హైవేపై వన్‌వే అమలు చేశారు. స్ఫటిక లింగ దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్థానిక సిబ్బందితో పాటు రాజమహేంద్రవరం నుంచి సైతం సిబ్బంది వచ్చి, భక్తులకు సేవలు అందించారు. భక్తులకు బొలిశెట్టి రామకృష్ణ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. స్వామి వారి ప్రసాదాన్ని 10 వేల మంది స్వీకరించారని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం స్వామివారికి కల్యాణం నిర్వహించిన అనంతరం, పరిణయ ప్రసూనార్చిత వసంతోత్సవం జరుగుతుందని తెలిపారు. దేశంలో అరుణాచలంలో మాత్రమే నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని ఇక్కడ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అరుణాచలం ఆలయ అర్చకుడు అరసు ఆచారి బాలాజీ వచ్చారని ఆలయ పురోహితుడు ఫణిశర్మ తెలిపారు.

  • నేడు పీజీఆర్‌ఎస్‌

    సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు లోను కాకుండా తమ డివిజన్‌, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి, తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని సూచించారు. అలాగే, 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. గతంలో సమర్పించిన అర్జీల పరిష్కార స్థితిని 1100 నంబర్‌కు ఫోను చేయడం ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ స్థాయిల్లో అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. వీటితో పాటు 95523 00009 వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవను కూడా వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు.

Eluru

  • పేకాటకు అడ్డాగా నూజివీడు

    నూజివీడు: మామిడికి ప్రసిద్ధిగాంచిన నూజివీడు నియోజకవర్గం ప్రస్తుతం పేకాటకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి జూదాలను విచ్చలవిడిగా ప్రోత్సహించడం పరిపాటిగా మారిందనే విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో మామిడి తోటలు, అటవీ ప్రాంతం పేకాటకు అడ్డాగా మారాయి. అధికార పార్టీ నాయకులు పేకాట శిబిరాలను నిర్వహిస్తూ పేకాటనే సంపాదన మార్గంగా మలుచుకొంటున్నారు. పేకాటకు తోడు కోడిపందేలు సైతం అక్కడక్కడా ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు. పేకాటకు సంబంధించి ఇటీవల నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడి అనుచరుడికి, పేకాట నిర్వాహకుడికి మధ్య జరిగిన సంబాషణ ఆడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ అనుచరుడు పోలీసులు దాడి చేయడానికి వచ్చే సమాచారం తనకు ముందుగానే అందుతుందని, నాకు రెండు ఫోన్‌ నెంబర్లు ఇస్తే వాటికి ఫోన్‌చేసి చెప్తానని, పేకాట శిబిరం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో లొకేషన్‌ షేర్‌ చేయాలని ఆ సంభాషణలో పేర్కొన్నాడు.

    దేవరగుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో నూజివీడు, ముసునూరు మండలాల సరిహద్దులో ఏర్పాటు చేసుకోండంటూ సలహా కూడా ఇచ్చాడు. పట్టణానికి చెందిన ఒక వ్యక్తి మామిడి తోటల్లో పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి ఎంట్రీ ఫీజు రూ.5 వేలు పెట్టగా ప్రతిరోజూ ఈ శిబిరానికి 25 నుంచి 30 మంది వస్తున్నారు. రెండు రోజులకోసారి ప్లేస్‌లు మారుస్తూ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. నూజివీడు మండలంలోని సుంకొల్లుకు చెందిన అధికార పార్టీ నాయకులు కొందరు యనమదల నుంచి మైలవరం మండలం పోరాటనగర్‌కు వెళ్లే మార్గంలో అడవిలోని కొండల ప్రాంతంలో కొన్ని నెలలుగా యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక్కడకు నూజివీడు, మైలవరం, జీ కొండూరు, ఏ కొండూరు ప్రాంతాల నుంచి జూదగాళ్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడి పోలీసులు కాకుండా మైలవరం పోలీసులు ఈనెల 6న పేకాట శిబిరంపై మెరుపు దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.లక్షకు పైగా నగదును, 49 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి చేసిన సమయంలో శిబిరాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి తాను మంత్రి మనిషినని, మంత్రి దృష్టికి తీసుకెళ్తానని మైలవరం పోలీసులను బెదిరించినా పోలీసులు ఏమాత్రం తలొగ్గకుండా స్టేషన్‌కు తరలించి కేసు కట్టారు.

    నూజివీడు మండలంలోని మిట్టగూడెం, నూజివీడు పట్టణం, తుక్కులూరు, ముక్కొల్లుపాడు, ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో, ఆగిరిపల్లి మండలంలో ఈదర, కొత్త ఈదర, కనసానపల్లి, ఆగిరిపల్లి, గన్నవరం మండలాల సరిహద్దుల్లో పేకాట శిబిరాలు సాగుతున్నాయి. చాట్రాయి మండలం పోలవరంలో ఇటీవల వరకు పేకాట శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే పోలీసులకు తెలియడంతో ఈ శిబిరాన్ని నిలిపివేశారు.

  • ఎస్పీ

    జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు, కళాభిమాని కుందా శాస్త్రి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడుతూ తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పలువురు వక్తలు బాలు సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు. చరణ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలు అభిమానులు, కళాకారులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి, జెట్టి గురునాథరావు, కరాటం రాంబాబు, జెడ్పీటీసీ పోలనాటి బాబ్జి, కొండ్రెడ్డి కిషోర్‌, రావూరి కృష్ణ, దాసరి శేషు తదితరులు పాల్గొన్నారు.

  • గండేపల్లి: బతుకు దెరువు కోసం జిల్లా దాటి వచ్చిన వారు విగత జీవులయ్యారు. యజమానిని రక్షించే యత్నంలో సహాయకుడితో సహా విద్యుదాఘాతానికి గురై సెకన్ల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసుల కధనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగరవం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెట్టి సింహాద్రి(57) తన దగ్గర ఉన్న వరికోత యంత్రంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వరి కోత కోస్తుంటాడు. ఆదివారం మండలంలోని గండేపల్లి, రామయ్యపాలెం మీదుగా ఐషర్‌ వ్యాన్‌లో వరికోతకు యంత్రాన్ని తీసుకువెళ్తున్నాడు. రామయ్యపాలెం గ్రామ శివారుకు వచ్చే సరికి యంత్రం పైపునకు 11 కేవీ విద్యుత్‌ తీగలు అడ్డం వచ్చాయి. వాటిని తొలగించేందుకు డ్రైవింగ్‌ సీటు నుంచి కిందకు దిగిన సింహాద్రి వ్యాన్‌కు అడుగు భాగంలో కర్రను తీసే యత్నంలో తలుపుపై చేయి వేయడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకే మోటారు సైకిల్‌పై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన సహాయకుడు గెడ్డం సందీప్‌ (17) సింహాద్రిని రక్షించబోయాడు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

    ఆ కుటుంబాల్లో తీరని విషాదం

    ఇరగవరం: కుటుంబ పోషణ కోసం కోత మిషన్‌ తీసుకుని కాకినాడ జిల్లా వెళ్లిన ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన డ్రైవర్‌ కె సింహద్రి అప్పన్న (58), రాపాక గ్రామానికి చెందిన హెల్పర్‌ గెడ్డం సందీప్‌లు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద విద్యుత్‌ షాక్‌తో మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో ఆదివారం విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు విదేశాల్లో ఉండగా, మరొకరు జాబ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. రాపాక గ్రామానికి చెందిన గెడ్డం సందీప్‌ తండ్రి లాజర్‌ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తల్లి సుమలత గల్ఫ్‌లో ఉంటుంది. ఒక అక్కకు వివాహం కాగా మరొకరి వివాహం కావాల్సి ఉంది.

  • ఉత్తమ

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక శనివారపుపేట ఉర్దూ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచరుగా పనిచేస్తున్న ఎస్‌కే అన్వర్‌ జహాన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉర్దూ అకాడమీ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 11న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. అన్వర్‌ జహాన్‌కు యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నంబూరి రాంబాబు, ఏలూరు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌కేవీఎస్‌ మణి, ఎల్‌. కనకదుర్గ తదితరులు అభినందనలు తెలిపారు.

    ఏలూరు రూరల్‌: జిల్లా స్థాయి చెస్‌ పోటీల్లో చిన్నారులు ప్రతిభ చాటారని గ్యారీ కాస్పరోవ్‌ చెస్‌ అకాడమీ డైరక్టర్‌ జి.యోహనాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కశాళాలలో నిర్వహించిన చెస్‌ పోటీలు వివరాలు వెల్లడించారు. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాలబాలికలు హాజరయ్యారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ నతానియోలు తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు.

    ద్వారకాతిరుమల: మండలంలోని వ్యవసాయ భూముల్లో జరుగుతున్న వరుస కాపర్‌వైరు చోరీలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా రామన్నగూడెంలో ఇద్దరు రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి, కాపర్‌ వైర్లను తస్కరించారు. గ్రామానికి చెందిన రైతులు సయ్యద్‌ బడే సాహెబ్‌, కొడవగంటి ఆనందరావులు ఆదివారం ఉదయం పొలంలోకి వెళ్లి చూసేసరికి ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమై కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై టి.సుధీర్‌ దొంగలు ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. చోరీల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు.

  • చిట్టీల పేరుతో మోసంపై ఆందోళన

    కొయ్యలగూడెం: చిట్టీల పేరుతో తూర్పుపేటలోని ఒక వ్యక్తి తమను బురిడీ కొట్టించాడని ఆ ప్రాంతవాసులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. తూర్పుపేట పరిసర ప్రాంతాలలో వందలాది మంది నుంచి ఒక వ్యక్తి సుమారు రూ.10 కోట్ల మేర చిట్టీల పేరుతో సొమ్ము వసూలు చేశాడని తీరా ఇప్పుడు మొహం చాటేసుకొని తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో చిట్టీల నిర్వాహకుడికి సంబంధించిన చేపల పేటలో ఉండే అతని పొలం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. నిర్వాహకుడు తన పొలాన్ని కొందరు వ్యక్తులకు విక్రయిస్తున్నాడనే సమాచారంతో వారు వెళ్లి ఆందోళన చేశారు.

Palnadu

  • రియల్
    పల్నాడు
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
    గొప్పల డప్పు..
    కొత్త ప్రాజెక్టులు రాకుండానే వచ్చేసినట్లు ప్రభుత్వ హడావుడి

    7

    అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 33,110 క్యూసెక్కులొచ్చి చేరుతోంది. దిగువకు 17వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 45.7183 టీఎంసీలు.

    నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి యలవర్తి శశిధర్‌ రూ.1,01,116 విరాళం అందజేశారు.

    చేబ్రోలు: నాగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ఆరుద్ర నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకారం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు.

  • ‘సూర్

    తరలివచ్చిన భక్తులు, పర్యాటకులు

    పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు

    భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు

    బాపట్ల టౌన్‌: పర్యాటకులతో సూర్యలంక సముద్ర తీరం ఆదివారం కళకళలాడింది. కార్తిక మాసం ప్రారంభం నుంచి పౌర్ణమి వరకు బీచ్‌ మూసివేసి ఉండటం, పౌర్ణమి తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తీరానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బాపట్ల–సూర్యలంక రహదారి రద్దీగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరంలో సందడి నెలకొంది. సూర్యోదయంతో కూడిన పుణ్యస్నానాలాచరించేందుకు భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే వచ్చారు. యువత సరదాగా గడిపారు. కొందరు తీరం వెంబడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇసుకతో గౌరీదేవి ప్రతిమ, శివలింగాలను తయారుచేసి వాటి ముందు ముగ్గులేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. స్వామి వారి శివలింగాన్ని పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజలనంతరం గౌరీదేవి ప్రతిమలతోపాటు గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లను సముద్రంలో కలిపిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

    పోలీసుల సూచనలు పాటించాలి

    సూర్యలంక తీర ప్రాంతం మొత్తం నిఘా నేత్రంలో ఉందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. ఆదివారం తీరాన్ని ఆయన సందర్శించారు. భద్రతా చర్యలు, సిబ్బంది విధులు, పర్యాటకుల సౌకర్యార్థం తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. తీరం వెంబడి 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మద్యం తాగి సముద్రంలోకి దిగడం, ఈత కొట్టడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పర్యాటకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తుపాను కారణంగా తీర ప్రాంతాల్లో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయని, పోలీస్‌ వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గస్తీ కోసం 10 పడవలను సిద్ధం చేశామని చెప్పారు. ఎరుపు జెండాలు దాటి ఎవరూ కూడా లోపలికి వెళ్లవద్దన్నారు. బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, చీరాల డీఎస్పీ ఎం.డి. మొయిన్‌, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, బాపట్ల రూరల్‌ సీఐ ఎం.శ్రీనివాసులు, చీరాల రూరల్‌ సీఐ పి.శేషగిరి, మైరెన్‌ పోలీస్‌ అధికారులు, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • విద్య

    ఘనంగా ముగిసిన వీవీఐటీయూ

    బాలోత్సవ్‌– 2025

    విజేతలకు ప్రశంసాపత్రాలు,

    బహుమతులు అందజేసిన అతిథులు

    పెదకాకాని: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించేందుకే బాలోత్సవ్‌ వేడుకలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో మూడు రోజులపాటు వైభవంగా జరిగిన బాలోత్సవ్‌ 2025 వేడుకలు చిన్నారుల తీపి గుర్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధురానుభూతుల మధ్య ఘనంగా ముగిశాయి. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా వందల పాఠశాలల నుంచి వేల మంది తరలి వచ్చారు. 25 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 20 అంశాలు, 61 విభాగాలుగా జరిగిన పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమానాలతోపాటుగా రెండు ప్రత్యేక బహుమతులను విజేతలకు అందించారు. బాలల వికాసంతోపాటు వారికి సంస్కృతి, సంప్రదాయాలను కూడా పరిచయం చేశారు. విద్యార్థుల ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. ఆదివారం విచిత్ర వేషధారణ, శాసీ్త్రయ, జానపద బృంద నృత్యాల నడుమ ప్రాంగణం కోలాహలంగా మారింది. 52 జానపద బృందాలు మూడు వేదికల వద్ద జాతర వాతావరణాన్ని సృష్టించాయి. 36 శాసీ్త్రయ నృత్య బృందాలు 2 వేదికలపై ఉత్సాహంగా ప్రదర్శన చేశాయి. మట్టితో ప్రతిమలు తయారు చేసి ఆకట్టుకున్నారు. వర్సిటీ శాక్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విద్యార్థుల కృషి అభినందనీయమని ప్రో చాన్సలర్‌ వాసిరెడ్డి మహదేవ్‌ అన్నారు. విజేతలకు చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, వైస్‌ చాన్సలర్‌ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వై. మల్లికార్జునరెడ్డి, బాలోత్సవ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె. గిరిబాబు బహుమతులు ప్రదానం చేశారు.

    జీవితంలో కళలు భాగం కావాలి

    జీవితంలో కళలు భాగం కావాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్‌ అన్నారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు సృజనాత్మక విషయాలు అలవాటు చేసుకొని ఏదో ఒక రంగంలో రాణించాలన్నారు.

  • అమరేశ్వరుని సన్నిధిలో భక్తుల సందడి

    అమరావతి: అమరావతి క్షేత్రం ఆదివారం భక్తులతో కళకళలాడింది. కార్తిక మాసం, ఆదివారం సెలవు కావటంతో వేకువజాము నుంచే భక్తులు రాక ఆరంభమైంది. తొలుత పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలోని ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేసి శివకేశవులకు పూజలు నిర్వహించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచా ముండేశ్వరీదేవికి కుంకుమార్చనలు చేశారు. విద్యార్థులు వేలాదిగా స్కూలు బస్సుల్లో తరలివచ్చారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పాత, కొత్త మ్యూజియంలను, అమరేశ్వరాలయంలో సందడి చేశారు. ధ్యానబుద్ధ విగ్రహం వద్ద గార్డెన్‌లో వనభోజనాలు చేశారు.

    సెలవు దినం కావడంతో

    పెరిగిన తాకిడి

    తెల్లవారుజాము నుంచే రాక

    కృష్ణా నదిలో పుణ్యస్నానాలు

    భక్తిశ్రద్ధలతో పూజలు

    తరలివచ్చిన విద్యార్థులు

  • రచయిత నసీర్‌ అహమ్మద్‌కు  జీవిత సాఫల్య పురస్కారం

    లక్ష్మీపురం: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని జరిగే విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉర్దూ అకాడమీ జీవిత సాఫల్య పురస్కారానికి ప్రముఖ చరిత్రకారుడు, రచయిత సయ్యద్‌ నసీర్‌ అహమ్మద్‌ ఎంపికయ్యారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్‌ గౌస్‌ పీర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన పాత్రను వివరిస్తూ మూడు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న నసీర్‌ 25 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వెలువరించారు. ఈ గ్రంథాలు ఉర్దూతోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, గుజరాతీ భాషలలో వెలువడ్డాయి. నసీర్‌ అహమ్మద్‌ కేవలం చరిత్ర గ్రంథ రచన, ప్రచురణతో కాకుండా సమరయోధుల త్యాగమయ, సాహసోపేత పోరాటాలను యువత, విద్యార్థులకు తెలియజేస్తూ పలు ప్రచార కార్యక్రమాలను దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు. చరిత్ర గ్రంథాల రచన, ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నసీర్‌ అహమ్మద్‌ తన కుటుంబం, సన్నిహితుల ఆర్థిక సహకారంతో ప్రచురించిన గ్రంథాలను ఎంపిక చేసిన వందల గ్రంథాలయాలకు, చరిత్రకారులకు, జర్నలిస్టులకు అందిస్తున్నారు. ఈ గ్రంథాల పీడీఎఫ్‌ ఫైళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి కోరిన వారికి అందజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠకుల సౌకర్యార్థం తన గ్రంథాలన్నింటినీ అందుబాటులో ఉంచారు. మూడు దశాబ్దాలుగా సయ్యద్‌ నసీర్‌ అహమ్మద్‌ అవిశ్రాంతంగా సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉర్దూ అకాడమీ ఈ ఏడాదికిగాను ప్రతిష్టాత్మక ‘జీవిత సాఫల్య‘ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపికతో నసీర్‌ అహమ్మద్‌ను విజయవాడలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తదితర ప్రముఖులు సత్కరించనున్నారు.

  • వేటపాలెం: నాయినపల్లిలోని గంగా భవానీ సమేత భోగలింగేశ్వరస్వామి దేవస్థానంలో పరమ శివుడ్ని ఆదివారం భానుడి కిరణాలు అభిషేకించాయి. శివుడికి ప్రీతి పాత్రమైన కార్తిక మాసంలో శివలింగాన్ని తాకడాన్ని భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు. అర్చకులు స్వామికి పలు పూజలు చేశారు.

    పోలేరమ్మ ఆలయంలో..

    చీరాల: పట్టణంలోని పాపరాజుతోటలో గల శ్రీ పోలేరమ్మ అమ్మవారి అర్ధ ముఖాన్ని ఆదివారం సూర్య కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం అమ్మవారి దివ్య చైతన్యానికి సంకేతమంటు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది కార్తిక మాసంలో సూర్య కిరణాలు అమ్మవారిని తాకుతుంటాయి.

  • ‘పది’లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

    సత్తెనపల్లి: పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.ఎం.ఎ.హుస్సేన్‌ అన్నారు. రాష్ట్ర పాఠశాల కమిషనర్‌ వి.విజయరామరాజు ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్‌.చంద్రకళ నేతృత్వంలో ఆదివారం నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్‌లలోని పలు మండల కేంద్రాల్లో ఉప విద్యా శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. హుస్సేన్‌ మాట్లాడుతూ రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు దూర విద్యలో పదో తరగతి, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు కూడా పరీక్షల కోసం పదో తరగతి పరీక్ష కేంద్రాలను వినియోగించనున్నామన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై ఈఏడాది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో బోధన కొనసాగించాలన్నారు. టెన్త్‌ పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఆ మేరకు ఎంఈఓలతోపాటు, ప్రతి పరీక్ష కేంద్రాన్ని స్వయంగా సందర్శిస్తామన్నారు. పరీక్ష కేంద్రానికి పూర్తి సదుపాయాలు ఉంటేనే అనుమతి ఇస్తున్నామన్నారు. జంబ్లింగ్‌ విధానంలో కేంద్రాల కేటాయింపు ఉంటుందన్నారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం ఉండదన్నారు. ఎక్కడైనా కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే ఆ ఉపాధ్యాయులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన టెన్త్‌ పరీక్షల్లో 49 పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 40 శాతం కంటే తగ్గిందన్నారు. ప్రతి మండలంలో ఉత్తీర్ణత శాతం వంద శాతానికి పెంచాలన్నారు. దీనికి ఎఫ్‌ఏ1, ఎఫ్‌ఏ2 మార్కుల ఆధారంగా ఏ, బీ గ్రేడ్‌వారు, సీ,బీ గ్రేడ్‌లవారీగా విభజించి డీసీఈబీవారు ఇచ్చిన మెటీరియల్‌ను నవంబరు 30లోపు సిలబస్‌ పూర్తి చేసి వంద రోజుల వంద రోజుల ప్రణాళిక ద్వారా ఉపాధ్యాయులు మెరుగైన బోధన చేపట్టి విద్యార్థులు ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. గతంలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఈఏడాది ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 ద్వారా అన్ని పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేయడం జరిగిందన్నారు. వివిధ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులందరూ ప్రత్యేక తరగతులు తప్పకుండా నిర్వహించాలన్నారు. ఆయతోపాటు ఉప విద్యా శాఖ అధికారులు ఎస్‌ఎం సుభాని (నరసరావుపేట), వి.ఏసుబాబు (సత్తెనపల్లి), మండల విద్యా శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.

    ప్రభుత్వ పరీక్షల విభాగం

    అసిస్టెంట్‌ కమిషనర్‌ కేఎంఏ హుస్సేన్‌

Guntur

  • కార్త

    తెనాలి: కార్తిక వనసమారాధనలు సందడిగా నిర్వహించారు. మూడో ఆదివారం పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో వన సమారాధనలు ఘనంగా నిర్వహించారు. వివిధ కుల సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, రాజకీయ ప్రముఖులు పాలుపంచుకున్నారు. శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘీయుల విజ్ఞాపనలకు సహకరిస్తామని హామీనిచ్చారు.

    ఐకమత్యంతోనే అభివృద్ధి..

    యాదవులు ఐకమత్యంగా పయనించాలని ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆదివారం చంద్ర వంశీయ క్షత్రియ యాదవ రాజుల 14వ కార్తిక వన సమారాధన వైభవంగా నిర్వహించారు. మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవిని యాదవ వర్గీయుడైన తోట దుర్గాప్రసాద్‌కు కేటాయించినట్లు గుర్తు చేశారు. యాదవ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి సహకరిస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ బీసీల ఎదుగుదలకు నాడు ఎన్టీఆర్‌, ఇటీవల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే తోడ్పాటునిచ్చినట్లు పేర్కొన్నారు. బీసీ వర్గాల్లో యాదవులు పెద్దన్న పాత్రను పోషిస్తున్నారని, ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్‌ మాట్లాడుతూ అంతా ఐకమత్యంగా, ధర్మం కోసం పనిచేయాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ తాడిపోయిన రాధిక, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ తోట దుర్గాప్రసాద్‌, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, మాగంటి సుధాకర్‌ యాదవ్‌, తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌ సహా పలువురు యాదవ సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వన సమారాధనకు దాదాపు పదివేల మంది హాజరయ్యారు. దానబోయిన ప్రసాద్‌, మేడిపోయిన గంగ యాదవ్‌, తట్టుకూళ్ల అశోక్‌ యాదవ్‌, కోటి యాదవ్‌, ఆరాధ్యుల శివాయాదవ్‌ తదితరులు రామచంద్ర యాదవ్‌ను భారీ గజమాలతో సత్కరించి, శ్రీకృష్ణుని ప్రతిమను అందజేశారు. కార్యక్రమంలో తాడిబోయిన శ్రీనివాసరావు, తాడిబోయిన రమేష్‌, బచ్చనబోయిన శ్రీనివాసరావు, కుక్కల వాసు, తుపాకుల రామకృష్ణ, దానబోయిన నరసయ్య, బొంత సాంబయ్య, కరేటి లక్ష్మీనారాయణ, జీవీ నారాయణ, గంపల శివ నాగేశ్వరరావు, మల్లెబోయిన రాము, హరికృష్ణ, కుక్కల రాజా, సమాధి మహేష్‌, మునగా శివ పాల్గొన్నారు.

    అగ్నికుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో..

    సమాజంలో అందరినీ ముందుకు తీసుకెళ్లాలనేది తమ ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. అగ్నికుల క్షత్రియులంతా కలసికట్టుగా వ్యవహరించాలని, తన వంతు సాయం చేస్తానని చెప్పారు.తెనాలి అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ 6వ కార్తిక వనసమారాధన ఆదివారం స్థానిక బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళా సదనంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అగ్నికుల క్షత్రియ సంఘీయులను అభినందించారు. వనసమారాధనలు నేడు కుల సమారాధనలుగా మారాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ నేటి తరానికి బంధుమిత్రులు ఎవరో తెలుసుకునేందుకు, అనుబంధాలను పెంచుకునేందుకు ఇవి తోడ్పడతాయని చెప్పారు. కార్యక్రమంలో సైకం లక్ష్మణరావు, కొక్కిలిగడ్డ అజయ్‌, సైకం పార్థసారథి, మైలా చెన్నకేశవరావు, రేవు రమణ పాల్గొన్నారు.

    జై గౌడ, గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో..

    గౌడ సంఘీయుల కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లటం అభినందనీయమని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఐటీఐ ప్రాంగణంలో ఆదివారం జరిగిన జై గౌడ్‌ ఉద్యమ జాతీయ కమిటీ, గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి కాటమయ్య 10వ కార్తిక వనసమారాధన, కౌండిన్య జయంతి ఉత్సవాల్లో మనోహర్‌ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ వైకుంఠపురం దేవస్థానం నిర్మాత గౌడ అయినప్పటికీ ఆ వర్గీయులకు ఇంతకాలమైనా ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పదవి దక్కకపోవడం తనను ఆలోచింపజేసిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక వైకుంఠపురం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పదవిని వారికే ఇచ్చినట్టు గుర్తుచేశారు. వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ తనను వెన్నంటి ఉంటున్న గౌడలంటే తనకెంతో అభిమానమని చెప్పారు. జైగౌడ్‌ ఉద్యమ కమిటీ నేతలు చిట్టిబొమ్మ కిషోర్‌ గౌడ్‌, కాటం రవికుమార్‌ గౌడ్‌, వాకా అర్జున్‌ గౌడ్‌, వీరమల్లు కార్తిక్‌ గౌడ్‌, వట్టికూటి రామారావు గౌడ్‌ పర్యవేక్షించారు.

    పద్మశాలీయ బహూత్తమ ఆధ్వర్యంలో..

    స్థానిక తెనాలి వైకుంఠపురం దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం శ్రీపద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన వైభవంగా నిర్వహించారు. మార్కండేయ మహా యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పద్మశాలీయ సంఘాల సభ్యులు, సంఘీయులు పాల్గొన్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు సంఘ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, పంచుమర్తి భాస్కర్‌, గట్టు బాల శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్‌, దివి హేమంత్‌, కొడాలి క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు.

  • పరమ శివుడు, పోలేరమ్మకు సూర్యాభిషేకం

    వేటపాలెం: నాయినపల్లిలోని గంగా భవానీ సమేత భోగలింగేశ్వరస్వామి దేవస్థానంలో పరమ శివుడ్ని ఆదివారం భానుడి కిరణాలు అభిషేకించాయి. శివుడికి ప్రీతి పాత్రమైన కార్తిక మాసంలో శివలింగాన్ని తాకడాన్ని భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు. అర్చకులు స్వామికి పలు పూజలు చేశారు.

    పోలేరమ్మ ఆలయంలో..

    చీరాల: పట్టణంలోని పాపరాజుతోటలో గల శ్రీ పోలేరమ్మ అమ్మవారి అర్ధ ముఖాన్ని ఆదివారం సూర్య కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం అమ్మవారి దివ్య చైతన్యానికి సంకేతమంటు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది కార్తిక మాసంలో సూర్య కిరణాలు అమ్మవారిని తాకుతుంటాయి.

  • రక్తనాళాలపై అవగాహన పెంచుకోవాలి

    గుంటూరు వెస్ట్‌: రక్తనాళాలపై అవగాహన కలిగి ఉంటే ఎన్నో అనర్థాలను ముందుగానే గుర్తించి సరిచేసే అవకాశముంటుందని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ నందకిషోర్‌ పేర్కొన్నారు. వాస్కులర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి వాస్కులర్‌ వాక్‌థాన్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తనాళాలు మనిషికి ఎంతో కీలకమన్నారు. నిత్యం వ్యాయామం, చక్కని ఆహార అలవాట్లతోపాటు క్రమం తప్పని మెడికల్‌ టెస్ట్‌లు చేయించుకుంటే ముందుగానే అరికట్టవచ్చని తెలిపారు. నేటి ఆధునిక యువత, అవగాహన లేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని నిర్మూలించడానికి ఎన్నో పద్ధతులు సమాజంలో ఉన్నాయని తెలిపారు. వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ వి.విజయకుమార్‌ మాట్లాడుతూ వాస్కులర్‌ వాక్‌థాన్‌ను దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో నిర్వహించారన్నారు. ఊబకాయం, మధుమేహ రోగుల్లో రక్తనాళాల సమస్యల కారణంగా కాళ్లు, చేతులు శాశ్వతంగా తొలగిస్తున్నారన్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు కొద్దిపాటి జాగ్రత్తలతోపాటు అవగాహన కలిగి ఉంటే చాలా ఇబ్బందులను తొలగించే అవకాశముంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తనాళాళ సమస్యలకు ఎన్నో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనంతరం వాక్‌ స్టేడియం నుంచి మదర్‌థెరిస్సా విగ్రహం వద్దకు కొనసాగింది. కార్యక్రమంలో వాస్కులర్‌ సర్జన్స్‌ సురేష్‌రెడ్డి, సురేంద్ర, రత్నశ్రీ , ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ బి.సాయికృష్ణ, ఉపాధ్యక్షులు ఎం.శివప్రసాద్‌ పాల్గొన్నారు.

    ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ నందకిషోర్‌

  • మాజీ

    నగరంపాలెం: మాజీ ఎంపీ డాక్టర్‌ యలమంచిలి శివాజీని ఆదివారం బృందావన్‌గార్డెన్స్‌లోని ఆయన నివాసంలో స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న తనయుడు, మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం ఇరువురిని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ సత్కరించారు. శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల పాలకవర్గం కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్‌, పలువురు పాల్గొన్నారు.

    నేడు పెదకాకాని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

    పెదకాకాని: పెదకాకాని మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పరిషత్‌ అధ్యక్ష పదవిపై అవిశ్వాస తీర్మాన సమావేశం సోమవారం జరగనుంది. నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఎంపీపీ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అక్కసుతో రెండు నెలలుగా కూటమి నాయకులు రాయబేరాలు చేశారు. 2021లో జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో పెదకాకాని మండలానికి సంబంధించి 12 గ్రామాల నుంచి 21 మంది ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేశారు. వారిలో 15 మంది ఎంపీటీసీ వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొందారు. ఆరుగురు టీడీపీ నుంచి విజయం సాధించారు. నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే పలువురు ఎంపీటీసీ సభ్యులను శనివారం అర్ధరాత్రి రాజమండ్రి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం.

    రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు

    నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాలలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 550 మంది ఉపాధ్యాయులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాసీ్త్రయ నృత్యం, నాటికలు, దేశభక్తి గేయాలు, బుర్రకథలు, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, పద్యాలు, కోలాటం తదితర అంశాలలో పోటీలను నిర్వహించారు. ప్రస్తుత విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రదర్శించారు.

  • ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసిన కూటమి ప్రభుత్వం

    లక్ష్మీపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల పాలనలోనే రూ.2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసిందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం కార్పొరేట్‌ వర్గాల కోసమే పనిచేస్తోందని అ న్నారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టా యని అన్నారు. సీపీఐ శతవార్షికోత్సవాల సందర్భంగా డిసెంబరు 26న ఖమ్మంలో జరిగే మహాసభలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు విస్త్తృతంగా పాల్గొని విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు. నవంబరు 18న సామాజిక న్యాయంపై అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబరు 20 నుంచి డిసెంబరు 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా శతవార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి ందన్నారు. సమావేశంలో వేదికపై సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    సీపీఐ జాతీయ సమితి సభ్యులు

    ముప్పాళ్ల నాగేశ్వరరావు

    ‘చలో ఖమ్మం’ విజయవంతం

    చేయాలని పిలుపు

  • ప్రజా ఉద్యమంపై విస్తృత ప్రచారం చేయండి

    పట్నంబజారు: ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన జరగనున్న ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేసే దిశగా, విస్తృతమైన ప్రచారం చేయాల్సిన బాధ్యత సోషల్‌ మీడియా సభ్యులపై ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా జిల్లా అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లాలోని సోషల్‌ మీడియా నియోజకవర్గాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముఖ్యంగా మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరణ అయితే జరిగే నష్టం ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ కుట్రలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రతి సోషల్‌ మీడియా సభ్యులు కచ్చితంగా 12న జరిగే ర్యాలీలో పాల్గొనాలని కోరారు. అనంతరం పోస్టర్‌లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి మేకా వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జావీద్‌, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల అధ్యక్షులు, రమేష్‌, సాగర్‌, ఉపాధ్యక్షుడు కర్రి భాస్కర్‌, కార్యదర్శి నంద కిషోర్‌, జిల్లా కమిటీ సభ్యులు, మండల విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

    వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా

    జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌

  • నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదు

    నెహ్రూనగర్‌: శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి వద్ద ఉన్న షాపుల నిర్వాహకులు అడుగుతున్న నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఆదివారం మిర్చి యార్డు, శంకర్‌ విలాస్‌ వంతెన నిర్మాణ పనులను నగర మేయర్‌ కోవెలమూడి రవీంద్రబాబు, నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులతో కలసి పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ మిర్చి యార్డు వద్దపై వంతెన పనులు చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో యార్డు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం అడ్డంకి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి జీజీహెచ్‌ వైపు డిసెంబర్‌ 15 తేదీలోగా 7 పిల్లర్లు పూర్తయ్యేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శంకర్‌ విలాస్‌ వైపు ఉన్న షాపులు తొలగించడంలో కొంత జాప్యం చోటు చేసుకుందని, వ్యాపారులు, ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. రోడ్డు విస్తరణలో కోల్పోయే షాపులకు యాజమానులు అడుగుతున్న నష్టపరిహారం సాధ్యం కాదని...సదరు సమస్య పరిష్కారానికి నగరపాలక సంస్థ మేయర్‌, కమిషనర్‌ చర్చలు జరుపుతున్నారని వీలైనంత త్వరలో పరిష్కారమవుతుందన్నారు.

    కేంద్ర సహాయ మంత్రి

    పెమ్మసాని చంద్రశేఖర్‌

    మిర్చియార్డు, శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి

    పనుల పరిశీలన

  • 12న ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయండి

    పట్నంబజారు: మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జరగనున్న ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బూత్‌ కమిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఉడుముల పిచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. మల్లికార్జునరావుపేటలోని కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేసే దిశగా దిక్కుమాలిన నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. దీనిపై కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. భావితరాల భవిష్యత్తుకు దిక్చూచీగా మారనున్న వైద్య కళాశాలలు ప్రైవేటు పరం కాకుండా జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో మన సంతకం మన బాధ్యత అనే విషయాన్ని గుర్తించాలన్నారు. సమావేశంలో బూత్‌ కమిటీ జిల్లా నేతలు, ఆయా నియోజకవర్గాలు, మండల నేతలు పాల్గొన్నారు.

    పర్చూరు(చినగంజాం): మృతి చెంది ఆస్పత్రిలో దిక్కులేకుండా పడి ఉన్న వ్యక్తి శవాన్ని వారి బంధువులకు అప్పగించి దహన సంస్కారాలకు పర్చూరు ఎస్‌ఐ జీవీ చౌదరి సాయమందించారు. నూతలపాడుకు చెందిన చీరాల శ్రీనివాసరావు జ్వరంతో బాధపడుతుంటే అతని కుమారుడు సురేష్‌బాబు చికిత్స కోసమై పర్చూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి కనిపించకుండా వెళ్లిపోయాడు. అటు తరువాత ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు చనిపోయాడు. దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారని తెలుసుకున్న ఎస్‌ఐ అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

Jangaon

  • రంగుల
    రెక్కలు విప్పిన

    ఇండియన్‌

    జెజెబెల్‌

    కెమెరాలో సీతాకోక చిలుకను బంధిస్తున్న అధ్యయన బృందం

    బారోనెట్‌

    టానీ రాజు రకం

    80 రకాల జాతులు గుర్తించాం..

    ములుగు జిల్లా అడవుల్లో జరిగిన సర్వేలో 80 రకాల సీతాకోక చిలుకల జాతులను గుర్తించాం. అత్యాధునిక కెమెరాల సాయంతో వాటి సంఖ్య, అరుదైన జాతులను గుర్తించాం. వీటితోపాటు రాత్రి పూట సంచరించే చిమ్మటలు (మాత్‌) గుర్తించడం, వాటికి కావాల్సిన నివాసం, రక్షణ చర్యలపై అటవీశాఖ అధికారులకు వివరించాం.

    ములుగు జిల్లాలో 80 నూతన జాతుల గుర్తింపు

    లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో మూడు రోజులు సర్వే

    సెలయేర్ల చాటున దాగి ఉన్న సీతాకోక చిలుకలు

    తెలంగాణలో మొట్టమొదటి అధ్యయనం

    భవిష్యత్‌ తరాల కోసమే..

    భవిష్యత్‌ తరాలకు జీవరాశులు, కీటకాల గురించి తెలియజేసేందుకే తెలంగాణలో మొదటిసారి అధ్యయనం చేశాం. ప్రకృతితో మమేకమై మా పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది.

    – చిత్రశంకర్‌,

    సైంటిస్ట్‌,ఎంటమాలజిస్ట్‌

    ఏటూరునాగారం: పూల గనిపై మధుబనిని పీల్చుకునే సప్తవర్ణాల సొగసులు. పట్టుకునేలోపే జారిపోయే పగడాల జీవులు.. ఇంద్రధనస్సు ఇలపై విహరిస్తోందా అన్నట్లుండే సీతాకోక చిలుకలు. పచ్చని వనాల నడుమ మకరందాలు ఆరగిస్తుండగా.. ప్రకృతితో మమేకమైన పరిశోధకులు కెమెరాల్లో క్లిక్‌మనిపించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ములుగు జిల్లా లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో చేసిన అధ్యయనం ఆదివారంతో ముగిసింది. ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, వరల్డ్‌ వైల్డ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌తోపాటు మరికొంత మంది అధ్యయన బృందం సభ్యులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సర్వే చేశారు. 80 రకాల నూతన జాతుల సీతాకోక చిలుకలు ఉన్నట్లు ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌కు నివేదిక అందజేశారు. సీతాకోక చిలుకలు మనుగడ కొనసాగించేందుకు పూల మొక్కలు సైతం పెంచాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.

    – ఇందారం నాగేశ్వర్‌రావు,

    ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

  • జనగామ: వాతావరణం తారుమారైపోయింది. ఇటీవలే తుపాను విరుచుకుపడి తీవ్ర నష్టం చేకూర్చిన విషయం తెలిసిందే. తెల్లవారుజాము మబ్బులు, చల్లని గాలులతో చలి కాలం మొదలైందనిపిస్తే, మధ్యాహ్నం వరకు వేసవి కాలం తలపించే ఎండ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. కాళ్ల కింద ఎండ వేడెక్కి పోతుండగా, తలపై సూరీడు మంటలు చిమ్ముతున్నాడు. వారం రోజుల క్రితం కురిసిన వర్షం ఆవిరైపోగా, గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఉదయం సమయంలో వేడి పెరుగుతోంది. పగలంతా చెమటలు కక్కిస్తుంటే, రాత్రి సమయంలో గజగజ వణికించేస్తోంది.

    జిల్లాలో వాతావరణం ఓ వింతగా మారిపోయింది. భారీ వర్షాలకు ప్రజలు వణికిపోగా, ఆ వర్షం ఆగిన కొద్ది గంటల్లోనే ఎండ తాకిడి మళ్లీ దంచికొడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేసవికాలాన్ని తలపించే విధంగా మండుతున్న ఎండ, సాయంత్రం మొదలై రాత్రి వేళల్లో చలిగా మారిపోవడం ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పగటిపూట బయటకు వెళ్లాలంటే సూర్యరశ్మి నుంచి రక్షణకు గొడుగులు, చేతి రుమాలు, తప్పనిసరిగా మారగా, రాత్రి వేళల్లో ఉన్నిదుస్తులు లేకుండా బయటికి రావడం కష్టమైపో తోంది. ఒక్క రోజులోనే ఎండా, చలి అనిపించే ఈ వాతావరణం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం సముద్రంలో ఏర్పడిన గాలి వానల ప్రభావం తగ్గడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగగా, ఉత్తర దిశల నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు.

    వాతావరణంలో ఈ మార్పులు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం కేసులు ఆసుపత్రుల్లో పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట ఎక్కువ సేపు ఎండలో తిరగకుండా ఉండటం, నీరు ఎక్కువగా తాగడం, రాత్రివేళల్లో చలినుంచి రక్షణ చర్యలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

    చలికాలంలో శీతల పానీయాలు, ఐస్‌క్రీం, లస్సీకి గిరాకీ తగ్గడం లేదు. జనగామ పట్టణంలోని హన్మకొండ, సిద్దిపేట, సూర్యాపేట రోడ్డు వైపు కూల్‌ కూల్‌ దుకాణాల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ పనుల్లో బిజీబిజీగా ఉంటూ, ఎండ వేడిమికి అలసిపోతున్న జనం, శీతల పానీయాలతో సేద తీరుతున్నారు. అంతే కాకుండా మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పెద్దగా ట్రాఫిక్‌ లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండాకాలా న్నీ తలపించే మినీ కాలం, వింతగా ఉన్నా.. మరో వైపు ప్రజలను భయపెడుతోంది.

    స్వెట్టర్‌, మంకీ క్యాప్‌ ధరించిన ప్రజలు

    ఎండకు జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాక్టర్‌పై ప్రయాణం

    రాత్రి 7 గంటలు దాటకముందే చలి పెరిగిపోతుండడంతో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, జర్కిన్లు ధరించడం ప్రజలకు తప్పనిసరి అయింది. మరోవైపు మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండడంతో రోడ్లపై నడుస్తున్నవారు ముఖం, చేతులు కప్పుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం, ఎండ, చలి మూడు ఒక్కసారిగా వింత వింతగా ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాతావరణ మార్పులు ఎన్ని రోజులు కొనసాగుతాయో చెప్పడం కష్టమే. అయితే, చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

    వాతావరణంలో వింత మార్పులు

    పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం

    మండలం కనిష్టం గరిష్టం

    బచ్చన్నపేట 16.9 31.8

    పాలకుర్తి 17.4 31.9

    చిల్పూరు 18.4 31.8

    దేవరుప్పుల 18.4 31.2

    స్టే.ఘన్‌పూర్‌ 18.5 31.3

    రఘునాథపల్లి 18.7 31.2

    తరిగొప్పుల 18.8 31.1

    నర్మెట 18.9 30.5

    జనగామ 19.3 30.4

    లింగాలఘణపురం 19.9 30.7

    కొడకండ్ల 20.0 31.8

    జఫర్‌గఢ్‌ 20.4 32.7

  • రాబట్టరు.. రాబందులు!

    సాక్షిప్రతినిధి, వరంగల్‌: కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతులను నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్‌ సప్లయీస్‌ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.

    ఏళ్లు గడుస్తున్నా ఉదాసీనతే..

    ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్‌ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్‌ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇదే క్రమంలో సీఎంఆర్‌ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు 1,83,985 మెట్రిక్‌ టన్నులు రాబట్టారు. ఇదే సమయంలో ఇంకా రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యం 31 మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.

    ఏసీకేల వారీగా వసూళ్లు..

    31 మంది రైస్‌మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్‌లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్‌ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, ఆయా జిల్లాల కలెక్టర్లకు వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్‌ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్‌ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్‌, ములుగు, జేఎస్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్‌ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్‌ఓలపై ఏసీబీ అడిషనల్‌ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది.

    పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎస్‌ఓల తీరు

    సీఎంఆర్‌ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనకేసుకొస్తూ భారీగా నజరానాలు

    రంగంలోకి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. అక్రమార్కులపై ఏసీబీ ఆరా

  • నేడు

    లింగాలఘణపురం: మండలంలోని జీడికల్‌ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో 10న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో దేవతల ఆహ్వానం (ధ్వజారోహణం, గరుడముద్ద), ఎదురుకోళ్ల తంతు ఆదివారం రాత్రి పూర్తయింది. వేదపండితులు విజయసారథి, శ్రీనివాసాచార్యులు, భార్గవాచార్యులు, రాఘవాచార్యులు, మురళీధరాచార్యులు రామచంద్రుడు, సీతమ్మవారి పక్షాన పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వేదమంత్రోచ్ఛరణలు, డోలు వాయిద్యాలతో ఎదురుకోళ్ల తంతును పూర్తి చేసి 10న జరిగే కల్యాణోత్సవానికి సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్‌ వెలుగులతో జిలేల్‌మంటోంది. భక్తుల కోసం తగిన సౌకర్యాలను పూర్తి చేశారు. కల్యాణోత్సవం తిలకించేందుకు ఆదివారం నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్‌ మూర్తి, ఈఓ వంశీ, దేవస్థాన కమిటీ డైరెక్టర్లు, రిటైర్డ్‌ ఈఓ కేకే రాములు, సిబ్బంది భరత్‌, మల్లేశం, రమేశ్‌ తదితరులు తమ సేవలు అందిస్తున్నారు.

    పూర్తయిన ఎదురుకోళ్ల తంతు

    భక్తులతో కిటకిటలాడుతున్న జీడికల్‌

  • సండే సందడి.. పర్యాటకుల కోలాహలం

    వెంకటాపురం(ఎం)/ఎస్‌ఎస్‌తాడ్వాయి/వాజేడు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం వచ్చిందంటే కోలాహలంగా మారిపోతున్నాయి. ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతో పాటు వ్యాపారులు పిల్లాపాపలతో తరలివచ్చి ఆనందంగా గడుపుతున్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప, మేడారంలోని వనదేవతల దర్శనం, మంగపేటలోని మల్లూరులో గల హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. అలాగే వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో గల బొగత జలపాతానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కొలనులో స్నానాలు చేస్తూ సందడిగా గడుపుతున్నారు.

    అమ్మవార్లకు మొక్కులు

    తాడ్వాయి మండలంలోని మేడారంలో గల సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, పూలు, పండ్లు, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు.

    బొగతలో ఆనందంగా..

    వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో గల బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో పర్యాటకులు జలపాతానికి తరలివచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించి సందడి చేశారు. జిప్‌లైన్‌పై ఆటలాడుకుని సరదాగా గడిపారు. సమీప కొలనులో స్నానాలు చేసి కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు.

National

  • సాక్షి, బనశంకరి: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో ఖైదీలు యథేచ్ఛగా సౌకర్యాలు పొందుతున్నారని తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరడుగట్టిన నేరగాళ్లు కటకటాల నుంచి ఫోన్లలో బయట వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు విమర్శలున్నాయి. తాజాగా ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకుంటున్న మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ నేపథ్యంలో ఆదివారం  తెల్లవారుజామున పోలీసులు జైలులో  సోదాలను జరిపారు. అయితే మొబైల్స్‌తో పాటు ఎలాంటి వస్తువులు లభించలేదు. అత్యాచారం కేసులో దోషి ఉమేశ్‌రెడ్డి మొబైల్‌ఫోన్‌లో మాట్లాడుతూ టీవీ చూడటం, లష్కరే ఉగ్రవాది మొబైల్‌ వాడడం, బంగారం కేసు నిందితుడు అక్రమంగా సౌకర్యాలు పొందడం తదితరాలపై శనివారం ఫోటోలు, వీడియోలు గుప్పుమన్నాయి, దీంతో జైలు అధికారులు ముందే జాగ్రత్త పడినట్లు సమాచారం.  

    రౌడీ.. కేక్‌ కటింగ్‌  
    జైళ్ల శాఖ చీఫ్‌ దయానంద్‌ పరప్పన అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఆ వీడియోల గురించి అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. కొన్నిరోజుల కిందట జైలులో రౌడీషీటర్‌ గుబ్బచ్చి శీనా పుట్టినరోజు కేక్‌ కట్‌చేయడం తీవ్రవిమర్శలకు దారితీసింది.  విచారణ ఖైదీలకు ఎల్‌ఇడీ టీవీ సౌలభ్యంతో పాటు వంట చేసుకోవడానికి పాత్రలు, వంట పదార్థాలు, లభిస్తాయి. కానీ కోడిగుడ్లు, చికెన్, మొబైల్‌ చార్జర్‌ , పార్టీ చేసుకోవడానికి సౌండ్‌బాక్స్‌ తదితరాలు పొందడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు ఖైదీలకు రాజమర్యాదలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానిత ఐసిస్‌ ఉగ్రవాది జుహద్‌ షమీద్‌ షకీల్‌ మున్నా జైలులో మొబైల్‌ వాడుతున్నట్లు లీకైంది.  

    చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి  
    జైలులో అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర్‌ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మంగళూరు, బెళగావితో పాటు చాలా చోట్ల అదికారులను సస్పెండ్‌ చేశామన్నారు. గతంలో పరప్పనలోనూ కొందరిపై వేటు వేశామన్నారు. ఏడీజీపీ దయానంద్‌ తో మాట్లాడానని, కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్షణం నివేదిక అందించాలని సూచించానని, జైలులో మొబైల్‌ ఇతర సౌలభ్యాలు ఎవరికీ లేవని చెప్పారు. సౌలభ్యాలను కలి్పస్తే అది జైలు ఎలా అవుతుందని , ఉగ్రవాదులతో పాటు ఎవరికీ రాజమర్యాదలు కల్పించరాదని చెప్పారు. బెడ్, దిండు కోసం నటుడు దర్శన్‌ కోర్టుకు వెళ్లారని, ఇతర ఖైదీలకు సులభంగా ఎలా లభిస్తున్నాయనేది తనిఖీ చేస్తున్నామని చెప్పారు.  

    నేడు సీఎం సమీక్ష.. 
    బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రలు జైలులో ఖైదీలకు రాచమర్యాదలు కల్పిస్తున్నారనే ఆరోపణపై అధికారులతో నేడు (సోమవారం) ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాను, అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఆయన ఆదివారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకాలో మాజీ మంత్రి పరమేశ్వర నాయక్‌ కుమారుడు భరత్‌ వివాహ వేడుకలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. జైలులో అక్రమాల గురించి ప్రస్తావించగా,  అవకతవకలకు కొమ్ముకాస్తున్న జైలు అధికారులపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. 

    ఒక్క ఆర్‌ఎస్‌ఎస్‌నే కాదు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను నిషేధించాలని కోరుతున్నామని చెప్పారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల మీద హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. మొక్కజొన్నకు కేంద్రం మద్దతు ధరను కలి్పంచాలని కోరారు. అతివృష్టి వల్ల రాష్ట్రంలో 11 లక్షల హెక్టార్లలో పంటనష్టం ఏర్పడిందని, పరిహారం ఇవ్వడానికి సర్కారుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. చెరకు రైతులకు మద్దతు ధర ఇవ్వని చక్కెర ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Jagtial

  • ‘పది’

    జగిత్యాల: పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు నంబర్‌వన్‌ ర్యాంక్‌ రావాలన్న ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్ట్‌లో పూర్తి చదవడం, రాయడం, పరీక్షలకు సంబంధించి భయం తొలగించేలా కృషి చేస్తున్నారు. జగిత్యాల జిల్లాగా ఏర్పడిన అనంతరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో వరుసగా హ్యాట్రిక్‌ సాధించింది. అనంతరం అట్టడుగు స్థానానికి పడిపోయింది. దీంతో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రత్యేక చొరవ తీసుకుని పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు పలు కార్యక్రమాలు అమలు చేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పరీక్షలంటే భయం వద్దని, ప్రశాంతంగా రాయాలని సూచించారు. ఫలితంగా గతేడాది రాష్ట్రంలో నాల్గో స్థానం సాధించింది. ఈసారి సైతం మొదటి స్థానం సాధించేలా ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

    ప్రత్యేక క్లాసుల నిర్వహణ

    పదో తరగతి విద్యార్థులకు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. డిసెంబర్‌ చివరి వరకు మరిన్ని క్లాసులు పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతానికి కంటే మెరుగ్గా ఫలితాలు సాధించాలని పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. డిసెంబర్‌ 31 వరకు ఈ క్లాసులు నిర్వహించి జనవరి ఒకటి నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మాత్రమే రెండుసార్లు ప్రత్యేక తరగతులు కొనసాగించనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు తీసుకోనున్నారు.

    పాఠశాలలపై వారానికోసారి సమీక్ష

    ప్రతి పాఠశాలలో వారానికి ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల కాంప్లెక్స్‌ అధికారులు, విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. అలాగే ప్రత్యేక క్లాసులకుగానీ, బడికి రాకపోవడం వంటి విద్యార్థులను గమనించి వారి ఇంటికి వెళ్లి వారిని మళ్లీ క్లాసులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. గత ఏడాది రాష్ట్రంలో 98.20 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 11,849 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. ఈసారి 12,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

    ఉపాధ్యాయుల సిలబస్‌ను జనవరి 10లోపు పూర్తి చేయాలి.

    తర్వాత రివిజన్‌ తరగతులు ప్రారంభించి ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఏ–1 పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను ఏబీసీ గ్రూపులుగా విభజించాలి.

    సీ గ్రూపు విద్యార్థులకు పునరుచ్చరణ తరగతులు, స్లిప్‌ టెస్ట్‌లు నిర్వహించాలి.

    ప్రతి ఉపాధ్యాయుడు కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారికి సూచనలు ఇవ్వాలి.

    వందశాతం హాజరయ్యేలా చూడాలి.

  • కన్యకాపరమేశ్వరికి పూజలు

    సారంగాపూర్‌: మండలంలోని పెంబట్ల శ్రీవాసకన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆదివారం భక్తులు పూజలు చేశారు. జిల్లాకేంద్రం నుంచి ఆర్యవైశ్యులు చేపట్టిన ఆధ్యాత్మిక పాదయాత్ర ఎనిమిది కిలోమీటర్లు సాగింది. యాత్రంలో దేవతల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాభిషేకం, కోటిదిపోత్సవం చేపట్టారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉసిరి చెట్టు కింద భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు మర్యాల రాజన్న, వావిలాల శేఖర్‌, యాసల మల్లికార్జున్‌, గుండ సురేష్‌, గంప శ్రీనివాస్‌, యాంసాని సంతోష్‌, రాజేశుల శ్రీనివాస్‌, మర్యాల లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.

  • ర్యాగ

    కరీంనగర్‌టౌన్‌/కొడిమ్యాల: కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలతో డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలో అడుగు పెట్టిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు పరిచయం అవుతారు. తొలి పరిచయానికి పర్యాయపదంగా నిలవాల్సిన ర్యాగ్‌ అన్న పదం వికృత క్రీడకు చిహ్నమవుతోంది. ఆ పేరు చెబితేనే జూని యర్ల వెన్నులో వణుకుపుడుతోంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం పతాకస్థాయికి చేరుకుంటోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్‌టీయూలో శనివారం రాత్రి సీనియర్లు జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలు చర్చనీయాంశమయ్యాయి.

    స్నేహమా.. జాగ్రత్త సుమా

    మంచి స్నేహం ప్రాణంతో సమానం. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరికీ స్నేహం అవసరం. కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు స్నేహితుల ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. కళాశాల క్యాంటీన్లు, హాస్టళ్లకు పాకిన ఈ భూతానికి ఏటా ఎంతో మంది విద్యార్థులు బలవుతుండగా విద్యాశాఖ, పోలీసు విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    ‘సుప్రీం’ మార్గదర్శకాలు

    సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తోంది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆర్‌కే రాఘవన్‌ కమిటీ వేసిన సిఫార్సులను 2007లో ఆమోదించింది. దీని ప్రకారం ర్యాగింగ్‌ జరిగినట్లు ఫిర్యాదు అందితే వెంటనే విద్యా సంస్థలు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణుడిని నియమించాలి. విద్యార్థులు మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా కళాశాల యజమాన్యాలే చర్యలు తీసుకోవాలి. ర్యాగింగ్‌ నిరోధించడంలో యజమాన్యాలు విఫలమైతే వారినే బాధ్యులను చేయాలి.

    ‘యూజీసీ’ మార్గదర్శకాలు

    ర్యాగింగ్‌ సంఘటనల్లో దోషులుగా తేలిన వారికి రూ.2.5 లక్షల జరిమానాల విధించాలి. తీవ్రతను బట్టి వారిని కళాశాల ప్రవేశంపై జీవితకాల నిషేధం విధించాలి. కళాశాలలో చేరే సమయంలో వేధింపులకు పాల్పడబోమని విద్యార్థి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి. వేధింపులను అరికట్టడంలో విఫలమైన కళాశాల గుర్తింపును రద్దు చేయాలి. ర్యాగింగ్‌ నిబంధనలను తెలుపుతూ ప్రతి కళాశాల పరిసరాల్లో పోస్టర్లు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి.

    సర్కారు ఏం చెబుతోందంటే..

    ర్యాగింగ్‌ నిరోధకానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్యశాఖ 1800– 5522 ట్రోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ హెల్ప్‌లైన్‌ పని చేస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదులను 1090 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపవచ్చు. ర్యాగింగ్‌ జరిగే కళాశాలల వద్ద నిఘా పెంచాలి.

    వైద్య నిపుణుల సూచనలు

    ర్యాగింగ్‌ తప్పనే విషయాన్ని సీనియర్లకు తెలిపేందుకు కాలేజీల్లో నైతిక విలువల కమిటీ లేదా మానవ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్‌ చేసే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జూనియర్లకు అవగాహన కల్పించాలి. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చేస్తే మిగతా వారికి కనువిప్పు కలుగుతుంది. కళాశాల యజమాన్యాలు నిజాలను దాచకుండా వెలుగులోకి తేవాలి. జూనియర్లు స్వేచ్ఛగా మసలేలా చర్యలు తీసుకోవాలి.

    ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలలు

    డిగ్రీ

    66

    పీజీ

    35

    ఇంజినీరింగ్‌

    16

    ఎంబీఏ

    8

    ఎంసీఏ

    1

    ఫార్మసీ

    2

    పాలిటెక్నిక్‌

    5

  • ఆధ్యా

    జెండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

    జగిత్యాలటౌన్‌: ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. పెంబట్ల వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయం వరకు పట్టణ వాసవీమాత భక్తులు చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా సరైన మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని 25వ వార్డులో రూ.10.లక్షలతో చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నాణ్యతతో చేయాలని సూచించారు.

    దేశాయి బీడీ కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళన

    మెట్‌పల్లి: పట్టణంలోని దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం తీరును నిరసిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క మాట్లాడుతూ కొంతకాలంగా యాజమాన్యం వెయ్యి బీడీలకు ఇవ్వాల్సిన మొత్తంలో రూ.10 కోత పెడుతోందన్నారు. కార్మికులకు నాసిరకం తినుబండారాలు విక్రయిస్తూ ఇబ్బంది పెడుతోందన్నారు. నాణ్య మైన ఆకు, తంబాకు, దారం సరఫరా చేయడం లేదన్నారు. కంపెనీ దోపిడీపై ప్రభుత్వం దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధక్క, శ్యామల, వినీత, బాలయ్య, సునీత తదితరులున్నారు.

    రంగారావుపేటలో ‘సీసీఎంబీ’ టీం

    మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం రంగా రావుపేట గ్రామాన్ని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ(సీసీఎంబీ) టీం సభ్యులు ఆదివారం సందర్శించారు. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది పాముకాటుకు గురై మృతి చెందడంతోపాటు శాశ్వత వైకల్యంతో బాధపడుతుండడంపై సభ్యులు బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా రంగారావుపేటలో పాము కాటు బాధితులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా..? అని జాగ్రత్తలు వివరించారు. మెట్‌పల్లి మండల వైద్యాధికారి అంజిత్‌రెడ్డి, సీసీఎంబీ చీఫ్‌ సైంటిస్ట్‌ కార్తికేయన్‌, సైంటిస్ట్‌ సుమిత్‌, శ్రీనివాస్‌, స్వప్నిల్‌, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

  • మినీ స్టేడియం పనులు జాప్యం

    సారంగాపూర్‌: మండలంలోని పోతారం శివారు గణేష్‌పల్లిలో మినీస్టేడియం నిర్మాణ పనులు మొదలు కాలేదు. 2016–17లో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని మండలవాసులు కోరడంతో అప్పటి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. గ్రామ శివారుల్లో 6.5 ఎకరాల భూమి సేకరించిన రెవెన్యూ అధికారులు.. సర్వే చేసి సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించారు.

    రూ.2.65 కోట్లు మంజూరు

    భూసేకరణ జరిగిన తరువాత ప్రభుత్వం స్టేడియం నిర్మాణానికి రూ.2.65 కోట్లు మంజూరీ చేసింది. నిర్మాణం పూర్తయితే వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, టెన్నిస్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ (షటిల్‌), ఇతర ఇండోర్‌ గేమ్స్‌ నిర్వహించడానికి వీలుంది. స్టేడియంలో పెవిలియన్‌ బిల్డింగ్‌, ఇండోర్‌ హాల్‌, స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం చేపట్టాలని భావించారు. స్టేడియం పూర్తయితే బీర్‌పూర్‌ మండలంలోని 17 గ్రామాలు, సారంగాపూర్‌ మండలంలోని 18 గ్రామాల క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. కానీ.. పనులు ప్రారంభించకపోవడంతో క్రీడాకారుల ఆశ నీరుగారిపోతోంది.

    టెండరు ప్రక్రియ పనులు

    మినిస్టేడియం నిర్మాణం కోసం టెండరు ప్రక్రియ పనులు పురోగతిలో ఉన్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. సాంకేతిక పనులు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

  • వనభోజనాలతో అనుబంధాల పెంపు

    ధర్మపురి: కార్తీకమాసంలో వనభోజనాలతో కుటుంబాల మధ్య అనుబంధాలు పెరుగుతాయని ధర్మపురికి చెందిన ప్రముఖ పురోహితులు జన్మంచి వంశీకృష్ణ అన్నారు. మిత్ర–99 ఎస్సెస్సీ బృందం ఆధ్వర్యంలో నేరెళ్ల అటవీప్రాంతంలోని సాంబశివ ఆలయ ఆవరణలో ఆదివారం కార్తీక వనభోజనాలు చేశారు. ముందుగా శివాలయంలో మిత్రబృందం సభ్యులంతా ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక వనభోజనాల ప్రాముఖ్యత, శాసీ్త్రయతను వంశీకృష్ణ వివరించారు. కార్యక్రమంలో మిత్రబృందం సభ్యులంతా ఆటపాటలతో సందడి చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జాజాల రవీందర్‌, సభ్యులు పైడి మారుతి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. అధ్యక్షుడు తాళ్లపల్లి సురేందర్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు చిలువేరి కిరణ్‌, గౌరవ అధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

  • యాజమాన్య హక్కుల్లేని ఆస్తి ఎలా అమ్ముతారు..?

    జగిత్యాలటౌన్‌: వివాదంలో ఉన్న 20గుంటల పెట్రోల్‌బంక్‌ స్థలాన్ని మంచాల కృష్ణ తాతలు 70ఏళ్ల క్రితం కొన్నట్లు ఎమ్మెల్యే సర్టిఫికెట్‌ ఎలా ఇస్తారని, ఆయన వ్యాఖ్యలు విచారణ కమిటీని ప్రభావితం చేసేలా ఉన్నాయని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కిబాల ఒరిజినల్‌ పత్రాన్ని మంచాల కృష్ణ ఏ కోర్టులోనూ దాఖలు చేయలేదని, యాజమాన్య హక్కుల కోసం ప్రయత్నించలేదని స్పష్టంచేశారు. ఇందిరాభవన్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. హైడ్రా తరహ వ్యవస్థ ఉంటే ఇప్పటికే వివాదాస్పద పెట్రోల్‌ బంక్‌ను కూల్చేసేదని తెలిపారు. దారం వీరమల్లయ్యకు కిబాలా ద్వారా కేటాయించినట్లు చెబుతున్నా.. ఆయన వారసులు ఏనాడూ యాజమాన్య హక్కు కోసం ఏ కోర్టునూ ఆశ్రయించలేదన్నారు. వారు ఇంజెక్షన్‌ ఆర్డర్‌ కోసం మాత్రమే ప్రయత్నించారని పేర్కొన్నారు. నిజాలు నిగ్గు తేల్చి ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్‌ విచారణ కమిటీని నియమించారని, ఆ కమిటీని ప్రభావితం చేసేలా ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం సరికాదని తెలిపారు. మంచాల కృష్ణతో కుమ్మక్కయిన మున్సిపల్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయనవెంట బండ శంకర్‌, గాజుల రాజేందర్‌, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్‌, జున్ను రాజేందర్‌, చందా రాదాకిషన్‌, అల్లాల రమేశ్‌, సురేందర్‌ తదితరులు ఉన్నారు.

  • ‘పీఎంశ్రీ’ కేంద్రాలు ఉపసంహరించుకోవాలి

    జగిత్యాలటౌన్‌: నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపి) అమలులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేయతలపెట్టిన పీఎంశ్రీ మోబైల్‌ అంగన్వాడీ కేంద్రాల కారణంగా ఐసీడీఎస్‌ మూతపడే ప్రమాదం ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. సీఐటీయూ అనుబంధం అంగన్‌డీ యూనియన్‌ జిల్లా మూడో మహాసభలు జిల్లా అధ్యక్షురాలు రజిత అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎల్‌జీ గార్డెన్స్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్య చట్టం అమలైతే ఐసీడీఎస్‌ స్వతంత్య్రంగా ఉండదని, అనేక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అంగన్వాడీ టీ చర్లు, హెల్పర్లు ఉద్యమిస్తున్న విషయాన్ని గుర్తు చే శారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి, సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందూరి సులో చన, కోమటి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Nirmal

  • నిర్మ

    ఒత్తిడి తట్టుకోలేక..!

    ఇటీవల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, గృహిణులు ఇలా అన్నివర్గాలు, అన్నివయసులవారు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

    లోకేశ్వరం: ఈ వర్షాకాలం వానలతో ఇప్పటికే పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా పంటలు చేతికి వచ్చే సమయంలో మోంథా తుఫానుతో జిల్లాలో కుసిన భారీ వర్షాలకు వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరిచేలు పూర్తిగా నేలవాలాయి. దీంతో పంటలు కోయడం భారంగా మారింది. ఇప్పటికే తెగుళ్లు, వర్షాలతో పెట్టుబడి పెరిగింది. వరణుడి దెబ్బతో మరింత భారం పడింది. పంటలు కోయాల్సిన సమయాన వర్షాలు కురవడంతో వరి పొలాలు నీట మునిగాయి.

    నేల వాలిన పంటలు..

    వర్షాకాలం ప్రారంభంలో కురిసిన చినుకులు రైతులకు ఆశ కలిగించాయి. ఆగస్టు సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో పంటలు పుష్టిగా పండాయి. అయితే అక్టోబర్‌ నెలలో కురిసిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. పెసర, మినుము, సోయా, చిక్కుడు, పత్తి, మొక్కజొన్న పంటలతోపాటు వరి పొలాలు నీటమునిగాయి. చేతికొచ్చిన సమయంలో వర్షాలు పడటం రైతులు నష్టపోయారు. ఇప్పుడు పొలాలు కోయడం మరింత భారంగా మారింది.

    యంత్రాలే ఆధారం..

    వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో కూలీలతో పనులు కష్టంగా మారింది. మహిళా కూలీల కొరత, కూలి రేట్లు పెరగడం రైతులకు భారంగా మారింది. ఒక్కో మహిళా రైతుకు రోజు కూలీ రూ.600 నుంచి రూ.800 వరకు చెల్లిస్తున్నారు. అయినా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు హార్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు. వర్షాలతో పొలాల్లో బురద ఉండడంతో సాధారణ యంత్రాలతో పంటలు కోసే పరిస్థితి లేదు. దీంతో చైన్‌ యంత్రాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో యజమానులు అద్దె కూడా పెంచారు. గంటకు రూ.2,600 నుంచి రూ.3100 వరకు వసూలు చేస్తున్నారు. నీటితో తడిసిన పొలాల్లో యంత్రాలు నెమ్మదిగా పని చేయడంతో సమయం, ఖర్చు రెండూ పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    చివరికి నష్టాలే..

    ఆకాల వర్షాలతో నష్టం..

    ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి పంటలు పూర్తిగా నెలవాలాయి. పొట్ట దశ నుంచి వర్షాలు దంచి కొట్టడంతో పంటకు నష్టం జరిగింది. వరి పైరు వెన్ను విరిగి నెల వాలడంతో కోయడం కష్టంగా మారింది. యంత్రాలతో కోపించినా దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. యంత్రాల చార్జీలు పెరిగాయి. – గిర్మాయి చిన్న దేవన్న, రైతు, కన్కాపూర్‌

    మిషన్లకు పైసలు పోతున్నయి

    నాకున్న ఆరు ఎకరాల్లో వరి పంట వేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలవాలింది. ఐదెకరాలు చైన్‌ మిషన్‌తో కోయించాను. గంటకు రూ.2,600 తీసుకున్నారు. నూర్పిడి చేసిన ధాన్యం తీసుకురావడం కూడా కష్టంగా మారింది. వర్షాలకు పొలాలు చిత్తడిగా ఉండడంతో పెట్టుబడి మరింత పెరిగింది. – గీజ భోజన్న, రైతు, ధర్మోర

    జిల్లాలో పంటల వారీగా సాగువిస్తీర్ణం..

    వరి 1.40 లక్షల ఎకరాల్లో

    పత్తి 1.57 లక్షల ఎకరాల్లో

    సోయా 40 వేల ఎకరాల్లో

    మొక్కజొన్న 15,371 ఎకరాల్లో

    వానాకాలం పంటలపై రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేసినా చేతికొచ్చే దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. వర్షాల కారణంగా పంట నష్టంతో అప్పులు, వడ్డీ భారాన్ని భరించాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రమ వృథా అవుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సహకరించకపోతే తమ కష్టం వర్షార్పణం అవుతోందని పేర్కొంటున్నారు.

  • ఆయిల్

    లక్ష్మణచాంద: అన్నదాతలకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటల సాగును కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా మూడేళ్లుగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఒకసారి నాటితే 30 ఏళ్లు ఆదాయం వచ్చే ఈ పంటపై రైతుల్లో ఇంకా సరైన అవగాహన లేకపోవడంతో సాగు ఆశించిన స్థాయిలో జరగలేదు. వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలను(పీఏసీఎస్‌) భాగస్వామ్యంతో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల పీఏసీఎస్‌ సీఈవోలతో సమీక్ష నిర్వహించారు.

    ఒక్కో సొసైటీకి 100 ఎకరాలు..

    ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా సహకార అధికారి నర్సయ్య తెలిపారు. సొసైటీలో సభ్యులైన రైతులతో సమావేశాలు నిర్వహించి పంట లాభాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 17 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 40 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సంఘం తమ పరిధిలో లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని సూచించారు.

    ఉమ్మడి జిల్లాలో ప్రగతి

    ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో 8,786 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 3,092 ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 2,505 ఎకరాలు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 1,187 ఎకరాల్లో సాగవుతోంది. ఉమ్మడి జిల్లాలో 15,570 ఎకరాలు ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ఒక మొక్క ధర రూ.193 ఉండగా, సబ్సిడీపై కేవలం రూ.20కే అందిస్తుంది. ఎకరంలో సగటుగా 50–55 మొక్కలు నాటేందుకు అవసరమైన రూ.10,615 విలువైన మొక్కలను కేవలం రూ.1,100లకే రైతులకు అందిస్తోంది. అలాగే బిందు సేద్యం పరికరాలను రాయితీతో అందిస్తూ, ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు నగదు ప్రోత్సాహకం ఇస్తోంది. అదనంగా పవర్‌ టిల్లర్లు, బ్రష్‌ కట్టర్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, బీసీ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు.

    లక్ష్యం పూర్తికి చర్యలు

    ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒక్కో పీఏసీఎస్‌కు నిర్దేషించిన లక్ష్యం 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేరేందుకు త్వరలో రైతులతో సమావేశాలు నిర్వహిస్తాం. ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించి, లక్ష్యం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం.

    – నర్సయ్య, జిల్లా సహకార అధికారి,

    నిర్మల్‌ జిల్లా

    సాగు విస్తీర్ణం పెంపునకు కృషి

    ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రాథమిక సహకార సంఘాల సమన్వయంతో సాగు విస్తీర్ణం పెంచడానికి చర్యలు చేపడతాం. రైతులను ప్రోత్సహిస్తాం.

    – బీవీ రమణ,

    జిల్లా హార్టికల్చర్‌ అధికారి, నిర్మల్‌

  • ఆమెకు సుస్తీ!

    నిర్మల్‌చైన్‌గేట్‌:ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం చక్కగా నడుస్తుంది అన్నది నూటికి నూరుపాళ్లు నిజం. జిల్లాలో మహిళలు వ్యవసాయంలోనూ కుటుంబ జీవితంలోనూ కీలక భూమిక పోషిస్తున్నారు. గృహపనులతోపాటు పొలంలోనూ కృషి చేస్తున్న ఈ మహిళల ఆరోగ్యంపై అవగాహన తక్కువ. అందుకే గ్రామీణ మహిళల మెరుగైన ఆరోగ్యం కోసం కేంద్రం స్వస్త్‌ నారీ సశక్తి పరివార్‌ యోజన ప్రారంభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 17 నుంచి మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్‌ 2 వరకు జిల్లాలో పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. భైంసా ఏరియా ఆస్పత్రి, 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 59 సబ్‌ సెంటర్లు, నిర్మల్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, ఖానాపూర్‌, నర్సాపూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ప్రత్యేక శిబిరాలు ఏ ర్పాటు చేశారు. జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పిల్ల ల వైద్యం, సైకియాట్రి, డెంటల్‌, చర్మ, ఈఎన్టీ, స ర్జరీ తదితర విభాగాల వైద్యులు సేవలందించారు.

    80 వేల మందికి వైద్య సేవలు

    కార్యక్రమం భాగంగా మొత్తం 732 శిబిరాలు నిర్వహించారు. ఇందులో 95 ప్రధాన శిబిరాలు, 637 ఇంటింటి సర్వేలు భాగమయ్యాయి. ఈ క్రమంలో 80 వేలమంది మహిళలను వైద్యులు సమగ్రంగా పరీక్షించారు. ఎక్కువగా బీపీ, షుగర్‌, రక్తహీనత, గర్భస్థ సమస్యలు, క్యాన్సర్‌, టీబీ, హెచ్‌బీ, సికిల్‌ సెల్‌ వంటి వ్యాధుల లక్షణాలు గుర్తించారు. సుమారు 16,548 మందికి బీపీ, షుగర్‌, రక్తహీనత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులతో బాధపడుతున్న వారికి తక్షణంగా మందులు అందించగా, తీవ్రమైన స్థితిలో ఉన్న వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.

    ఇటీవలి పరీక్షల్లో వ్యాధులు,

    నిర్ధారణ అయిన వారి సంఖ్య..

    బీపీ 9,050 షుగర్‌ 6,907

    క్యాన్సర్‌ 1,724 అనీమియా 2,598

    గైనిక్‌ 1,361 టీబీ 1,668

    సికిల్‌ సెల్‌ 50

    పకడ్బందీగా పరీక్షలు..

    ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 2వరకు జిల్లా వ్యాప్తంగా స్వస్ట్‌ నారీ.. సశక్తి పరివార్‌ కార్యక్రమాన్ని నిర్వహించాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు అన్ని ఆస్పత్రుల్లో క్యాంపులు పెట్టి మహిళలకు పరీక్షలు నిర్వహించాం. నివేదికను ఉన్నతాధికారులకు అందించాం.

    – డాక్టర్‌ రాజేందర్‌, డీఎంహెచ్‌వో

  • గుర్త

    లింగాపూర్‌ పాఠశాలలో 2010–11 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు

    అబ్దుల్లాపూర్‌–కన్కాపూర్‌ పాఠశాలలో గురువులతో పూర్వ విద్యార్థులు

    లోకేశ్వరం: వారంతా ఒకేపాఠశాలలో కలిసి చదువుకున్నారు. మైదానంలో నువ్వానేనా అంటూ క్రీడాల్లో పాల్గొన్నారు. చిలిపి చేష్టలతో ఉపాధ్యాయులతో బెత్తం దెబ్బలు తిన్నారు. చదువులోనూ పోటీపడ్డారు. పదో తరగతి తర్వాత అంతా దూరమయ్యారు. కానీ 15 ఏళ్ల తర్వాత మళ్లీ తాము చదువుకున్న బడికి చేరుకున్నారు. అంతరాల్లో తేడా ఉండోచ్చు.. ఉద్యోగం, జీవన విధానాల్లో తేడా ఉండొచ్చు.. కానీ, గడిచిన రోజులు మళ్లీ రావని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా రు. ఇందుకు లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌–కన్కాపూర్‌ ప్రభుత్వ పాఠశాల వేదికై ంది. 2011 –12 విద్యాసంవత్సరం పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. తమను ఉన్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులను సన్మాంచారు. రోజంతా ఉత్సాహంగా గడిపారు. గురువులు బొడ్డు లక్ష్మణ్‌, రాజేశ్వర్‌, కాశీరాం, రాజారత్నం, దయాకర్‌, నగేశ్‌, వినయను సన్మానించారు.

    లింగాపూర్‌ పాఠశాలలో..

    కడెం: మండలంలోని లింగాపూర్‌ జెడ్పీ పాఠశాలలో 2010–11 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాలలో కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు హాజరై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆడిపాడారు.. రోజంతా ఉల్లాసంగా గడిపారు. గురువులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

  • మైనర్‌ డ్రైవింగ్‌పై కొరడా

    నిర్మల్‌టౌన్‌:ఇంటర్మీడియెట్‌స్థాయి విద్యార్థులతోపాటు పాఠశాల పిల్లలు సైతం బైక్‌లు, కార్లు నడపడం ఇప్పుడు సరదాగా మారింది. తమ పిల్లలు వాహనాలు నడపడం చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కానీ, వాహనాలతో రోడ్లపైకి ఎక్కాక టీనేజర్లు హీరోయిజం చూపుతున్నారు. రయ్‌.. రయ్‌ మంటూ దూసుకుపోతున్నారు. విన్యాసాలు చేస్తున్నారు. కొందరు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదు. దీంతో పోలీసులు మైనర్‌ డ్రైవింగ్‌పై కొరడా ఝళిపిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వాహనాలతో రోడ్లపైకి వచ్చిన వారి ఆటకట్టించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు సూచిస్తున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు.

    పోలీసులు సీరియస్‌

    ఎస్పీ జానకీషర్మిల ఆదేశాలతో మేరకు పోలీసులు మైనర్‌ డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సీజ్‌ చేసి, మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్‌ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమో దు చేస్తామని వార్నింగ్‌ ఇస్తున్నారు.

    46 వాహనాలు సీజ్‌..

    ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో పోలీసులు 46 వాహనాలను సీజ్‌ చేశారు. 70 మందికిపైగా తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం మైనర్ల డ్రైవింగ్‌కు వాహనం యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. మైనర్ల చేతుల్లో వాహనాలు ప్రమాదాలకు కారణమవుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు.

    మైనర్‌ డ్రైవింగ్‌ నేరం

    మైనర్‌ డ్రైవింగ్‌ చట్టరీత్యా నేరం. జిల్లాలో మైనర్‌ డ్రై వింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వాహనా లు నడిపితే సీజ్‌ చేస్తున్నాం. మైనర్‌ డ్రైవింగ్‌ చేసిన వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. మరోసారి పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చే స్తాం. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదా లకు కారణం కావొద్దు. – జానకీషర్మిల, ఎస్పీ

  • మత్తు

    లక్ష్మణచాంద:మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని మిషన్‌ పరివర్తన్‌ – నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం, విద్యార్థుల భవిష్యత్తుపై వాటి ప్రభావాలను వివరించారు. మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సామాజిక సంబంధాలను నాశనం చేస్తాయని తెలిపారు. విద్యార్థులు ఇలాంటివాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సత్యనారాయణరెడ్డి, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ షేక్‌ ఇలియాస్‌, సోషల్‌ వర్కర్‌ పుట్టి అశోక్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

    గజ్జలమ్మకు పూజలు

    కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. అర్చకులు శ్రీకాంత్‌ రామానుజదాస్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి నిర్వహించారు. పల్లకి సేవలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.

    అడెల్లి మహా పోచమ్మకు వెండి కిరీటం

    సారంగపూర్‌: మండలంలోని అడెల్లి మహాపోచమ్మకు నిర్మల్‌ పట్టణంలోని చింతకుంటవాడకు చెందిన పంచాయతీ కార్యదర్శి ప్రేమలత–రాజేశ్వర్‌గౌడ్‌ దంపతులు ఆదివారం వెండి కిరీటం బహూకరించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని కిరీటాన్ని అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేవారు. అనంతరం కిరీటాన్ని ఈవో భూమయ్యకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • సంఘ కార్యమే ధర్మకార్యం

    కుభీర్‌: ఆరెస్సెస్‌ వందేళ్ల వేడుకల్లో భాగంగా కుభీర్‌లో స్వయం సేవకులు ఆదివారం పథసంచలన్‌ నిర్వహించారు. సమావేశానికి విభాగ్‌(నాలుగు జిల్లాలు) ప్రచారక్‌ నర్ర వెంకటశివకుమార్‌ హాజరై మాట్లాడారు. హిందువుల ఐక్యత కోసం డాక్టర్‌ కేశరావ్‌ బిలిరాం పంత్‌ హెడ్గేవార్‌ 1925లో ఆరెస్సెస్‌ను ప్రారంభించారన్నారు. సంస్థ కార్యకలాపాలు నేడు 75 దేశాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దానికి అనుబంధంగా 44 అనుబంధ సంస్థలు పని చేస్తున్నాయని వివరించారు. ఐదుగురితో ప్రారంభమైన సంఘంలో నేడు కోట్లాదిమంది కార్యకర్తలు ఉన్నారన్నారు. సంఘ కార్యమే ధర్మకార్యమన్నారు. దేశాన్ని ధర్మాన్ని కాపాడటమే ఆరెస్సెస్‌ ధ్యేయమన్నారు. ప్రపంచంలో ఏశక్తి ఆరెస్సెస్‌ను ఏమీ చేయలేదన్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఆరెస్సెస్‌పై నిషేధం విధించిందని తెలిపారు. కోర్టు దానిని రద్దు చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘ చాలక్‌ సాదుల కృష్ణదాస్‌, ముఖ్య అథితి రెడిశెట్టి సంతోష్‌సేట్‌, జిల్లా కార్యవాహ అరుణ్‌, జిల్లా శారీరక్‌ ప్రముఖ్‌ హన్మాండ్లు, జిల్లా సేవాప్రముఖ్‌ అడెపు శ్రీనివాస్‌, జిల్లా కార్యకారిణి సభ్యులు దామోదర్‌, ఖండ కార్యవాహ గణేశ్‌, ఖండసహ కార్యవాహ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

  • పోచమ్మ తల్లీ.. సల్లంగ చూడు

    ఖానాపూర్‌: ఖానాపూర్‌ మండలం సుర్జాపూర్‌ నల్లపోచమ్మ ఆలయ వార్షికోత్సవం ఆదివారం ముగిసింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి బో నాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ మహిళలు ఊరేగింపుగా డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో ఆలయానికి చేరుకున్నారు. చల్లంగ చూసు పోచమ్మ తల్లి అని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు తోకల బుచ్చన్నయాదవ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

    ఆలయానికి తరలివచ్చిన భక్తులు

Nizamabad

  • ఫోకస్
    నిజామాబాద్‌

    క్రీడల్లో ఉన్నతస్థాయికి..

    క్రీడా రంగంలో అవకాశాలను సద్వినియో గం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని మైనారిటీ సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు.

    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

    – 8లో u

    జూనియర్‌

    కళాశాలలపై

    ఖలీల్‌వాడి : జిల్లాలోని జూనియర్‌ కళాశాలలపై ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ కాలేజీలను ఇప్పటికే ప్రక్షాళన చేయగా, క్షేత్రస్థాయిలో ఆచరణ, పరిస్థితుల అధ్యయనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల వివరాలను రోజువారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జీపీఎస్‌ ఆధారంగా తనిఖీలు చేపడుతుండటంతో కాలేజీ యాజమాన్యాల్లో గుబులు పుడుతోంది. తనిఖీలతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లోని వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసే అవకాశం ఏర్పడింది. దీంతో నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని రెండు బృందాలు ఈనెల 4వ తేదీ నుంచి తనిఖీలు ప్రారంభించాయి. రాష్ట్రస్థాయి అధికారులతో కూడిన మరో బృందం సైతం కాలేజీలను తనిఖీ చేయనున్నాయి. జిల్లాలో ప్రతిరోజూ రెండు నుంచి నాలుగు కాలేజీలను రెండు బృందాలు తనిఖీ చేస్తున్నాయి.

    జిల్లాలో మొత్తం 133 జూనియర్‌ కాలేజీలు ఉండగా వాటిలో 16 ప్రభుత్వ, 71 ప్రభుత్వ సెక్టార్‌, కేజీబీవీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల కళాశాలలు, 49 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఇంటర్‌ బోర్డు మూడు బృందాలను ఏర్పాటు చేసింది. మొదటి బృందంలో డీఐఈవో, మరో బృందంలో ప్రత్యేకాధికారి (ఇంటర్మీడియెట్‌ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ), ఇంకో బృందంలో డిప్యూటీ సెక్రటరీలతో తనిఖీలు చేపడుతున్నారు. తొలి విడతలో డీఐఈవో నేతృత్వంలోని బృందానికి 12 కళాశాలలు, మరో రెండు బృందాలకు 15 చొప్పున కళాశాలల్లో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల డీఐఈవో బోధన్‌, ఆర్మూర్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలను తనిఖీ చేశారు.

    ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో తనిఖీలు చేపడుతున్నాం. జీపీఎస్‌ ట్రాకింగ్‌ విధానంలో ఎప్పటికప్పుడు నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో రెండు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. రాష్ట్రస్థాయి బృందం సైతం తనిఖీలు చేస్తుంది.

    – రవికుమార్‌, డీఐఈవో, నిజామాబాద్‌

    మూడు బృందాలతో ఇంటర్‌

    కాలేజీల తనిఖీ

    మౌలిక వసతులు, విద్యాబోధన

    తీరు పరిశీలన

    ఆన్‌లైన్‌లో నివేదిక

    ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాల్లో గుబులు

    పరిశీలించే అంశాలివే..

    కాలేజీలో సమయసారిణి అమలు, సబ్జెక్టుల వారీగా సిలబస్‌ ఎంత వరకు చేశారు. కాలేజీకి వచ్చే విద్యార్థులు, లెక్చరర్ల హాజరు శాతం, కా లేజీలో మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తారు. వసతులు లేకుంటే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే వివరాలను సేకరిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తీసుకునే చర్యలతోపాటు ఎ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే అంశాలపై వాకబు చేస్తారు. కాలేజీ పరిధిలో ఏఏ గ్రా మాల నుంచి అడ్మిషన్లు వస్తున్నాయి.. మిగతా ప్రాంతాల నుంచి అడ్మిషన్లు రాకపోవడానికి కా రణాలను లెక్చరర్లను అడిగి తెలుసుకుంటున్నా రు. లెక్చరర్ల బోధనపై సైతం ఆరా తీస్తున్నారు.

  • అగమ్య

    రెండు నెలలవుతున్నా

    జీపీవోలకు అందని వేతనాలు

    సగానికిపైగా గ్రామాల్లో జీపీవోలకు ఆఫీసులు లేవు

    గ్రామాల్లో కార్యాలయాలు లేక జీపీవోలు ఎక్క డో ఓ చోట కూర్చుంటున్నారు. గతంలో వీఆర్‌ఏ, వీఆర్‌వోలు గ్రామ చావిడీల నుంచి విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం సగానికిపైగా (దా దాపు 80శాతం గ్రామాల్లో) క్లస్టర్లలో ఆ కార్యాలయాలు కూడా లేకుండా పోయాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలు, అద్దె గదుల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. మండలకేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాల అధికారులు తహసీల్‌ కార్యాలయాల నుంచి విధులు కొనసాగిస్తున్నారు. అలాగే రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రస్థాయిలో శాఖల మధ్య స మన్వయలోపమో, వివిధ శాఖల్లో ఉన్న వారిని జీపీవోలుగా నియమించడం వంటి సాంకేతిక కారణమో కానీ వేతనాలు అందడం లేదు. ప్ర భుత్వం ప్రత్యేక జీవో ద్వారా కార్యాలయాలు కేటాయించాలని, ఉన్నతాధికారులు స్పందించి జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని జీపీవోలు కోరుతున్నారు.

    మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌) : రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూమి, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ పాలన అధికారులను రెండు నెలల క్రితం నియమించింది. పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులకు కార్యాలయాలు లేకపోవడంతో విధుల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. సగానికిపైగా గ్రామాల్లో పాలనా అధికారులకు సొంత కార్యాలయాలు లేవు. విధుల్లో చేరి రెండు నెలలు కావొస్తున్నా.. ఇంతవరకూ వారికి వేతనాలు అందలేదు. జీపీవోలపై ప్రభుత్వం శ్రద్ధ చూపి కార్యాలయాల ఏర్పాటుతోపాటు ప్రతినెలా జీతాలు చెల్లించడం, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు కోరుతున్నారు.

    జిల్లాలో 453 రెవెన్యూ క్లస్టర్లు ఉండగా 300 మంది గ్రామ పాలనా అధికారులను ప్రభుత్వం నియమించింది. మాజీ వీఆర్వోలు, అర్హులైన వీఆర్‌ఏలకు పరీక్ష నిర్వహించి జీపీవోలుగా అవకాశం కల్పించింది. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, వీఆర్‌ఏలు, వీఆర్‌వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయంతెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హత, ప్రవేశపరీక్షలో మెరిట్‌ సాధించిన వారిని జీపీవోలుగా నియమించింది. ఖాళీగా ఉన్న 153 క్లస్టర్లకు కూడా త్వరలోనే పరీక్ష నిర్వహించి భర్తీ చేయనున్నట్లు తెలిసింది.

    వివిధ జిల్లాల్లో పలు శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, వార్డు ఆఫీసర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మమ్ముల్ని సొంత జిల్లాలో జీపీవోలుగా నియమించడం ఆనందంగా ఉంది. సొంత కార్యాలయాలు లేకపోవడంతో ప్రభుత్వ భవనాల నుంచి విధులు చేపడుతున్నాం. సాంకేతిక సమస్య కారణంగా జీతాలు జమ కాలేదని ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది.

    – గున్నం సంతోష్‌, జీపీవో, ముదక్‌పల్లి

    గ్రామ పాలన అధికారులను నియమించి రెండు నెలలు గడిచింది. వారికి భవిష్యత్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. సొంత కార్యాలయాలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తాం. త్వరలోనే వారి జీతాలు జమవుతాయి. ఖాళీగా ఉన్న క్లస్టర్ల జీపీవోల నియామకాలను ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది.

    – కిరణ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌

  • వైద్య

    నిజామాబాద్‌అర్బన్‌ : ప్రాణదాతలుగా సమాజంలో గౌరవంగా సేవలందించాల్సి న పలువురు వైద్యులు తమ పనుల కారణంగా తలదించుకుంటున్నారు. కొంత మంది కారణంగా వృత్తి కే కళంకం వస్తోందని తోటి వైద్యులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల లైంగిక వేధింపుల కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తనను ఓ దంత వైద్యుడితోపాటు రియల్టర్‌ లైంగికంగా వేధిస్తున్నారని ఇటీవ ల ఓ మహిళ నాల్గో టౌన్‌ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నగరంలో క లకలం సృష్టించింది. దీంతో మరికొంత మంది వైద్యుల వ్యవహారంపై సర్వత్రా చర్చసాగుతోంది.

    ● రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం సమీపంలోని డయాబెటిస్‌ వైద్యుడి వద్దకు నగరానికి సమీపంలోని మేజర్‌ గ్రామానికి చెందిన యువతి తన తల్లితోపాటు వచ్చింది. తన తల్లికి డయాబెటిస్‌ ఉందని సదరు వైద్యుడిని సంప్రదించింది. ఈ క్రమంలో యువతిని మాటల్లోకి దింపిన డాక్టర్‌ ఆమె ఫోన్‌ నెంబర్‌ తీసుకొని రాత్రివేళ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడు. యువతి వెంటనే కుటుంబ సభ్యులకు తెలుపగా వారు డాక్టర్‌ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. అనంతరం ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ డాక్టర్‌ మరోసారి తప్పు చేయనని చెప్పి సయోధ్యకుదుర్చుకున్నాడు. ఇదే వైద్యుడు అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన మరో మహిళను రక్త పరీక్షలు నిర్వహించాలంటూ గంటల తరబడి ఆస్పత్రిలో ఉంచి, తన గదిలో అసభ్యకరంగా తాకుతూ ఇబ్బందులకు గురి చేశాడనే ఆరోపణలున్నాయి. అలాగే ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ సెల్‌ఫోన్‌ నంబర్‌ తీసుకుని వైధింపులకు పాల్పడగా ఆమె సోదరుడు వచ్చి వైద్యుడిని హెచ్చరించినట్లు తెలిసింది.

    ● మరో పిల్లల వైద్యుడు కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టాఫ్‌నర్సులను వేధించగా వారు అతని ఫోన్‌ కాల్‌ రికార్డులను చూపించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అనడంతో వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన శిశువును చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళ తీసుకురాగా ఆమెను అసభ్యకరంగా తాకడంతో ఆమె అక్కడే ఉన్న తన భర్తకు విషయం తెలిపింది. ఆమె భర్త సదరు వైద్యుడికి దేహశుద్ధి చేయగా విషయం బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. అదే ఆస్పత్రిలో పనిచేసే మరో మహిళను ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి సినిమాలకు షికార్లకు తీసుకెళ్లగా విషయం తెలుసుకున్న వైద్యుడి భార్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యకు క్షమాపణ చెప్పి చివరకు కేసునుంచి తప్పించుకున్నాడు. తన ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిని హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు టూర్ల పేరిట తీసుకెళ్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆ వైద్యుడిపై ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను మాత్రమే ఉద్యోగంలో కొనసాగిస్తాడని ఆ డాక్టర్‌కు పేరుంది.

    ● దీర్ఘకాలిక రోగాల వైద్య నిపుణుడిగా సేవలందిస్తున్న ఓ డాక్టర్‌ మహిళలను వేధిస్తున్నట్లు తెలియడంతో తోటి వైద్యులు హెచ్చరించగా వివాదం జరిగింది.

    వైద్యం కోసం వచ్చే వారికి

    లైంగిక వేధింపులు

    ఆస్పత్రుల్లో స్టాఫ్‌నూ వదలని వైనం

    పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు

    ఇప్పటికే వెలుగులోకి పలు ఘటనలు

  • త్వరలో వన్యప్రాణుల గణన

    డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): వన్య ప్రాణుల గణన ప్రక్రియ ఈనెలాఖరున లేదా డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. దేశమంతటా ఒకేసారి చేపట్టే వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ సన్నద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇటీవల వర్నిలో నిజామాబాద్‌, జగిత్యాల్‌ జిల్లాల అధికారులు, సిబ్బంది శిక్షణ పొందారు. పులులు, చిరుతలు, జింకలు, ఎలుగు బంట్లు, తోడేళ్లు, నక్కలు, దుప్పులు, మానుబోతులు వంటి అటవీ జంవుతులు ఎన్ని ఉన్నాయి? వాటిని ఏ విధంగా లెక్కించాలనే దానిపై అదిలాబాద్‌ అడవులకు చెందిన వన్యప్రాణి నిపుణులు వచ్చి శిక్షణ ఇచ్చారు. వన్యప్రాణుల గణన సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతులు, మెలకువలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ ఇచ్చిన వెంటనే వన్యప్రాణుల గణనను ప్రారంభించనున్నారు. అటవీ సిబ్బంది టీములుగా అడవుల్లోకి వెళ్లి జంతువుల పాదముద్రలు, ట్రాప్‌ కెమెరాల ఆధారంగా వాటిని సంఖ్యను అంచనా వేస్తారు. ప్రభుత్వం నాలుగేళ్లకోసారి వన్యప్రాణుల గణన చేపడుతుండగా చివరిసారిగా 2021లో జరిగింది.

    జిల్లాలో 86,871.45 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. అడవులు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం సిరికొండ, కమ్మర్‌పల్లి, ఇందల్వాయి, నిజామాబా ద్‌ సౌత్‌, నిజామాబాద్‌ నార్త్‌, వర్ని, ఆర్మూర్‌ రేంజ్‌ లు ఉన్నాయి. ఇందల్‌వాయి తర్వాత సిరికొండ, క మ్మర్‌పల్లి, వర్ని, నిజామాబాద్‌సౌత్‌ రేంజ్‌లలో ఎ క్కువగా అడవులున్నాయి. ఈ ప్రాంతాల్లోనే వన్య ప్రాణులు ఎక్కువగా ఉంటాయి. పాత గణాంకాల తో పోలిస్తే ప్రస్తుతానికి వన్యప్రాణుల సంఖ్య పెరిగి ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. వన్య ప్రాణుల సంఖ్య ఏ మేరకు పెరిగింది అనేది ప్రస్తుతం చేపట్టనున్న గణనతో తేలనుంది.

    వన్యప్రాణుల గణనకు అటవీ అధికారులు, సిబ్బందితోపాటు పారెస్ట్రీ కోర్సులు చేస్తున్న విద్యార్థులను వలంటీర్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు. జిల్లా లో బీట్‌, సెక్షన్‌ అఫీసర్లతోపాటు డిప్యూటీ ఎఫ్‌ఆ ర్వోలు, ఎఫ్‌ఆర్వోలు, ఎఫ్‌డీవోలు కలిపి 150మంది అటవీ శాఖలో లేరు. వీరితో వన్యప్రాణుల గణనను త్వరగా పూర్తి చేయడం సాధ్యం కాదు. అందుకే స ర్వేలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరుతున్నారు. వచ్చిన వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.

    ఈ నెలాఖరున లేదా

    వచ్చే నెలలో ప్రారంభం

    నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు..

    లెక్కించే విధానంపై

    అటవీ సిబ్బందికి శిక్షణ పూర్తి

  • ప్రసూతి సేవలకు మంగళం

    మోర్తాడ్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు మార్పు కార్యక్రమాన్ని చేపట్టినా మోర్తాడ్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మాత్రం సేవలు అందడం లేదు. గైనకాలజిస్ట్‌, మత్తు వై ద్యులు రాకపోవడంతో మూడున్నర సంవత్సరాల నుంచి మోర్తాడ్‌లో ప్రసవ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంత గర్భిణులు ప్రసవం కోసం ఆర్మూర్‌, మెట్‌పల్లిలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మోర్తాడ్‌ ఆసుపత్రిని వైద్య విధానపరిషత్‌లో విలీనం చేసినా సేవలు మెరుగుపడలేదు. మోర్తాడ్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, వేల్పూర్‌, మండలాలు ఉన్నాయి. సాధారణ ప్రసవాలను చౌట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేస్తుండగా, 2018 నుంచి శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలను మాత్రం మోర్తాడ్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ప్రారంభించారు. మార్పు పథకం అమలుతో మోర్తాడ్‌ ఆస్పత్రిలో రికార్డు సంఖ్యలో ప్రసవాలు చేశారు. సుమారు మూడు సంవత్సరాల పాటు గైనకాలజిస్టులు, మత్తు వైద్యులను ఆర్మూర్‌ నుంచి రప్పించి గర్భిణులకు సేవలు అందించారు. ప్రతి బుధ, శుక్ర వారాల్లో గర్భిణులకు శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలు చేసేవారు. శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేసినందుకు గైనకాలజిస్ట్‌, అనస్థీషియాకు రూ.2,500 చొప్పున చెల్లించేవారు. అయితే ప్రభుత్వం చెల్లించే పారితోషికం తక్కువగా ఉండటంతో వైద్యులు ఆసక్తి చూపలేదు. క్రమంగా ప్రభుత్వం వైద్యులకు ఇచ్చే పారితోషికం అంశం మరుగున పడడంతో వైద్య సేవలకు మంగళం పలికినట్లయ్యింది. ఎంతో మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులు ప్రసవం కోసం మోర్తాడ్‌ ఆస్పత్రికి వస్తుండగా ఇక్కడ సేవలు అందకపోవడంతో వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో ఆర్మూర్‌, మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడ రద్దీ ఎక్కువ ఉంటే ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో భారీగా ఫీజు వసూలు చేస్తుండటంతో పేదలకు, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రసవ సేవలను మోర్తాడ్‌లో పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు.

    మోర్తాడ్‌ కమ్యూనిటీ ఆస్పత్రిలో

    మూడున్నరేళ్లుగా సేవలు బంద్‌

    ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పపత్రి లేదా

    ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సిందే..

    తీవ్ర ఇబ్బందులు పడుతున్న గర్భిణులు

  • 23 నుంచి సైన్స్‌ఫేర్‌

    ఖలీల్‌వాడి : బోధన్‌ పట్టణంలోని విజయమేరీ పాఠశాలలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జిల్లా స్థాయి ఇన్‌స్సైర్‌, సైన్స్‌ఫేర్‌ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు డీఈవో అశోక్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలు తప్పనిసరిగా తమ పాఠశాల నుంచి ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులతోపాటు ఇంటర్‌ విద్యార్థులు ప్రదర్శనల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. 2024–25 సంవత్సరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డుకు 119 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, వారి ఖాతాల్లో రూ.పది వేల చొప్పున జమ చేసినట్లు వివరించారు. సామాజికంగా ఉపయోగపడే ప్రదర్శనలతో విద్యార్థులు పాల్గొనేలా చూడాలని, మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి కే గంగాకిషన్‌ (98482 19365)ను సంప్రదించాలని సూచించారు.

    క్రీడలతో మానసికోల్లాసం

    మోపాల్‌ : క్రీడలతో మానసిక, శారీరక ఉల్లా సం కలుగుతుందని బీసీ గురుకులాల డి ప్యూటీ సెక్రెటరీ తిరుపతి తెలిపారు. ఆదివా రం మండలంలోని కంజర్‌ శివారులో మహా త్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో అండర్‌–14, 19 ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా తిరుపతి మాట్లాడు తూ క్రీడలతో శారీరక దారుఢ్యం మెరుగుపడుతోందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మురళి, శంకర్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

    రాష్ట్ర సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ మహిళల

    చాంపియన్‌ నిజామాబాద్‌

    నిజామాబాద్‌ నాగారం : రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళల సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో నిజామాబాద్‌ జిల్లా జట్టు చాంపియన్‌గా నిలిచింది. జగిత్యాలలోని గీతా విద్యాలయం క్రీడామై దానంలో ఈనెల 7 నుంచి 9వరకు రాష్ట్రస్థా యి సాఫ్ట్‌బాల్‌ పోటీలు జరిగాయి. ఇందులో నిజామాబాద్‌ జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబర్చి సెమీఫైనల్‌కు చేరి, సిద్దిపేట జట్టుతో తలపడింది. ఈపోటీల్లో నిజామాబాద్‌ జట్టు 12–0 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌ కు చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టుతో ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడి 3–0 పరుగుల తే డాతో విజయం సాధించి టోర్నమెంట్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంపై జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. క్రీడాపోటీల ముగింపు కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌ బాబు ముఖ్యఅతిథిగా హాజరై, విజేతలకు ట్రోఫీ, పతకాలు అందజేశారు. జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్‌, హనుమకొండ సెక్రెటరీ రాజేందర్‌, నల్గొండ కార్యదర్శి నాగిరెడ్డి, మెదక్‌ సెక్రెటరీ శ్యాంసుందర్‌ శర్మ, జగిత్యాల కార్యదర్శి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జట్టుకు కోచ్‌ మేనేజర్లు గా అనికేత్‌ నరేశ్‌, వినయ్‌, సుజాత, మౌనిక వ్యవహరించారు.

  • సమాజ పరివర్తనే సంఘ్‌ లక్ష్యం

    సుభాష్‌నగర్‌ : స్వదేశీ, స్వాభిమానము, స్వావలంబనతో కూడిన సమాజ నిర్మాణమే రాష్ట్రీయ స్వ యంసేవక్‌ సంఘ్‌ లక్ష్యమని.. అందుకోసం 100 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూరు విభాగ్‌ ప్రచారక్‌ నర్రా వెంకట శివకుమార్‌ అన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశంలోని ప్రతి హిందూ గృహానికి వెళ్లి వారి కర్తవ్యా న్ని గుర్తు చేయడమే లక్ష్యంగా రానున్న నెల రోజులపాటు స్వయం సేవకులు పర్యటించనున్నారని తెలిపారు. ఇందూరు నగర పథ సంచలన్‌ కార్యక్రమా న్ని చంద్రశేఖర్‌ కాలనీలోని హెచ్‌పీఎస్‌ పాఠశాల నుంచి ప్రారంభించి కంఠేశ్వర ప్రాంతంలోని వివిధ కాలనీల గుండా కదిలిన వందలాది మంది స్వయం సేవకులు తిరిగి అక్కడికే వచ్చి ప్రార్థనతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేశ సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పాత్ర ఎంతో కీలకమన్నారు. సమాజ నిర్మాణంలో, సాంస్కతిక విలువల పరిరక్షణలో ఆర్‌ఎస్‌ఎస్‌ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. పథ సంచలన్‌ సందర్భంగా దేశభక్తి గీతాలు, నినాదాలతో నగరం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. జిల్లా సంఘచాలకులు డాక్టర్‌ కాపర్తి గురు చరణం, విభాగ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్‌ నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్యవాహలు సుమిత్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Sri Sathya Sai

  • వైభవం

    హిందూపురం: గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు గోవింద శర్మ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతసేవతో మూలవిరాట్‌ స్వామివారికి అభిషేకాలు, పుష్ప, తులసీపత్రాలతో అర్చనలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తర్వాత శ్రీదేవి, భూదేవి రంగనాథస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి.. ప్రాకారోత్సవం చేశారు. ప్రత్యేక హోమాల తర్వాత బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు. రథాన్ని గుడ్డం చుట్టూ తిప్పి తిరిగి ఆలయ రాజగోపురం వద్దకు తీసుకొచ్చి ఉత్సవ మూర్తులకు హారతులిచ్చి భక్తుల దర్శనం కోసం ఉంచారు. తర్వాత పార్వేట ఉత్సవం నిర్వహించారు.

    రొళ్ల: మండల పరిధిలోని కొడగార్లగుట్ట గ్రామంలో వెలసిన అభయ ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సుప్రభాత సేవ, అంకురార్పణ, హోమం, గణపతిపూజ, కలశ స్థాపన, యోగిశ్వరాధన తదితర పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారిని కొలువు దీర్చారు. అనంతరం భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు. భక్తులు రథంపైకి అరటిపండ్లు, బొరుగులు, తమలపాకులు, పూలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు జ్యోతులను సమర్పించుకున్నారు.

  • ఓవరాల్‌ చాంపియన్‌గా ‘అనంత’

    అనంతపురం కార్పొరేషన్‌: రాష్ట్రస్థాయి 7వ రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో 38 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను అనంతపురం జట్టు కై వసం చేసుకుంది. తర్వాతి రెండు స్థానాల్లో వరుసగా విశాఖపట్నం, కాకినాడ జిల్లాలు నిలిచాయి. మూడ్రోజులుగా ఆర్డీటీ స్టేడియం వేదిక రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రెవెన్యూ క్రీడలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖామాత్యులు అవగాని సత్యప్రసాద్‌, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవితతో పాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిడంబి శ్రీకాంత్‌, టెన్నిస్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత మైనేని సాకేత్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కేశవ్‌ హామీనిచ్చారు. మంత్రి అవగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు తిరుపతిలో రెవెన్యూ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేలతో రెవెన్యూ ఉద్యోగులు నరకయాతన పడుతున్నారని, సర్వేలు, తదితర పనులకు నిర్ధేశిత సమయం కేటాయించాలన్నారు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, ఆర్‌ఐ, డీటీలకు శిక్షణనిచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, డీఆర్‌ఓ మలోల, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటరాజేష్‌, డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునుడు, మల్లికార్జున రెడ్డి, జిల్లా స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, హరిప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    చివరి రోజు హోరాహోరీగా మ్యాచ్‌లు..

    ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం వివిధ విభాగాల్లో ఫైనల్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. క్రికెట్‌లో మొదటి మ్యాచ్‌లో కృష్ణ, అనంతపురం జట్లు తలపడగా... కృష్ణా జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. త్రోబాల్‌ (ఉమెన్‌)లో చిత్తూరు విజేతగా, కాకినాడ రన్నర్స్‌గా, టగ్‌ ఆఫ్‌ వార్‌ (మెన్‌)లో కాకినాడ విజేతగా, నెల్లూరు రన్నర్‌గా, ఉమెన్‌లో కాకినాడ విన్నర్‌గా, విశాఖపట్నం రన్నర్‌గా నిలిచాయి. 100 మీటర్ల(మెన్‌)పరుగు పందెంలో రవివర్మ (విశాఖ), ఉమెన్‌లో వి.లలిత (అనంతపురం) మొదటి స్థానంలో నిలిచారు. వంద మీటర్ల రిలే పరుగు (మెన్‌)లో విశాఖ మొదటి స్థానం, నెల్లూరు రెండో స్థానంలో నిలిచాయి. ఉమెన్‌ విభాగంలో అనంతపురం మొదటి స్థానం, శ్రీ సత్యసాయి జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో(ఉమెన్‌) విశాఖపట్నంపై అనంతపురం జట్టు విజయం సాధించింది.

    ముగిసిన రెవెన్యూ క్రీడలు

    విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసిన మంత్రులు సత్యప్రసాద్‌, కేశవ్‌, సవిత

  • ఈ నరకం భరించలేకున్నా..

    గుంతకల్లు: కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు దూరం చేసేందుకు ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ మహిళ అష్టకష్టాలు పడుతోంది. తనను ఈ నరకం నుంచి బయట పడేయాలంటూ ఓ సెల్ఫీవీడియో ద్వారా అభ్యర్థిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు పట్టణానికి చెందిన నూర్‌ మహమ్మద్‌, షకీలాభాను దంపతులకు నలుగురు కుమార్తెలు. అనారోగ్యంతో దంపతులు మృతి చెందారు. స్థానిక దోనిముక్కల రోడ్డులో నివాసముంటున్న నూర్‌ మహమ్మద్‌ మూడో కుమార్తె షబానాబేగం చెల్లెలు జుబేదా బేగాన్ని ఆదరించి, ఆటో డ్రైవర్‌ అలీ బాషాకు ఇచ్చి పెళ్లి జరిపించింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారం కావడంతో జుబేదా బేగం దుబాయ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని, కడపకు చెందిన ఏజెంట్‌ మహమ్మద్‌ రఫీని సంప్రదించింది. అతని ద్వారా కువైట్‌లో ఇంటి పనిచేయడానికి 8 నెలల క్రితం వెళ్లింది. అయితే అక్కడ యజమాని 8 నెలలుగా వేతనం ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తుండడంతో దిక్కుతోచలేదు. కనీసం భోజనం కూడా పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేస్తుండడంతో భరించలేని జుబేదా బేగం సెల్ఫీ వీడియోలో తన వేదనను వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు పంపింది. తనను ఎలాగైనా గుంతకల్లుకు రప్పించాలని వేడుకుంది. లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని కన్నీటి పర్యంతమైంది. ఈ విషయంగా కుటుంబసభ్యులు నేరుగా వెళ్లి ఏజెంట్‌ను సంప్రదిస్తే... వెనక్కు రప్పించేందుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించలేని స్థితిలో తాము ఉన్నామని, ఎలాగైనా జుబేదాబేగంను గుంతకల్లుకు రప్పించాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

    ఎలాగైనా గుంతకల్లుకు రప్పించండి

    ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన

    మహిళ వేదన

    సెల్ఫీవీడియో తీసి కుటుంబసభ్యులకు పంపినా జుబేదా

  • ధర్మవరం అర్బన్‌: తాగుడు మానేయమని చెప్పినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన మేరకు.. ధర్మవరంలోని లోనికోట ప్రాంతానికి చెందిన శివ (36)కు భార్య నవనీత, ఓ కుమారుడు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల తాగుడుకు బానిసై, ఇంటి బాగోగులు పట్టించుకోవడం మానేశాడు. దీంతో తాగుడు మానేయాలని తరచూ భార్య చెబుతూ వచ్చేది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆదివారం కూడా భార్య నచ్చచెప్పే ప్రయత్నం చేయడంతో క్షణికావేశానికి లోనైన శివ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శివ మృతి చెంనట్లు నిర్ధారించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ధర్మవరం వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

    వ్యక్తి బలవన్మరణం

    మడకశిర రూరల్‌: మండలంలోని మణూరు గ్రామానికి చెందిన కదురప్ప (45) ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బెంగళూరులో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఓ భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న అతను ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. శస్త్రచికిత్స అనంతరం ప్రాణాలు దక్కాయి కానీ, మతిస్థిమితం లేక తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేవాడు. ఈ నెల 4న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను సాయంత్రమైన ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం స్థానికులు గ్రామ సమీపంలోని పొలంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని విగత జీవిగా వేలాడుతున్న కదురప్పను గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

    బాధితుడికి దుద్దుకుంట పరామర్శ

    పుట్టపర్తి టౌన్‌: టీడీపీ గూండాల దాడిలో గాయపడిన స్థానిక వైఎస్సార్‌సీపీ నేత, బిల్డర్‌ మల్లికార్జునను మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ఆదివారం పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్య్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తుంగా ఓబుళపతి, పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కురాష

    అనంతపురం కార్పొరేషన్‌: రాష్ట్రస్థాయి 69వ అండర్‌–14, 17, 19 కురాష్‌ పోటీల్లో అనంతపురం జట్టు క్రీడాకారులు ఐదు విభాగాల్లో విజయం సాధించి, ఆల్‌రౌండ్‌ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. ఆదివారం పోటీలు ముగిసాయి. వివిధ విభాగాల్లో ఫిలిప్‌, యూసఫ్‌, జశ్వంత్‌ గిరిబాబు, సుజితకుమార్‌, శశికాంత్‌రెడ్డి, జతిన్‌, వెంకట్‌, చరణ్‌తేజ్‌. వరుణ్‌కుమార్‌, తేజ, దేవదర్శన్‌రెడ్డి, యోగీశ్వర్‌ రెడ్డి, మణికంఠ, ఫయాజ్‌, ధృవరెడ్డి, దీపుసింగ్‌, లావణ్య, వరలక్ష్మి, గోపిక, చందన, లోకేశ్వరి, పూజిత, భవ్య, లేక్షణ్యరెడ్డి, నవీన్‌, మనోహర్‌, వివేకానంద, అశోక్‌, మౌలాలి, దినేష్‌కుమార్‌, పూజిత్‌రాజ్‌, చరణ్‌, ప్రణతి, రిక్షిత, మనీషా, నిర్మల, జ్యోతి, ఝాన్సీ, లక్ష్మి, సాయి లిఖిత, హృదయ బంగారు పతకాలు సాధించారు. విజేతలను అభినందిస్తూ బహుమతులను డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, మాంటిస్సోరీ కరస్పాండెంట్‌ భరత్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి శ్రీనివాసులు ప్రదానం చేశారు.

    రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో

    ‘అనంత’కు మూడో స్థానం

    సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి 12వ సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో అనంతపురం జిల్లాకు మూడో స్థానం దక్కింది. విజేతగా గుంటూరు జట్టు నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల క్రీడా మైదానంలో పోటీలు జరిగాయి. రెండో స్థానంలో విజయనగరం జట్టు నిలిచింది. విజేత జట్లను అభినందిస్తూ ట్రోఫీలను సత్తెనపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు ప్రదానం చేశారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్‌ వంశీకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణ, స్కాలర్స్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, కె.సత్యం, లయోలా కళాశాల అడ్మిషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, సాఫ్ట్‌బాల్‌ అసోసియేసన్‌ గుంటూరు జిల్లా సామంత్‌రెడ్డి, ట్రెజరర్‌ జనార్ధన్‌ యాదవ్‌ ఆవుల, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • భూముల్ని లాక్కునే కుట్రలు ఆపండి

    హిందూపురం: కూటమి ప్రభుత్వం కుట్రలతో రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూములు సేకరించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని రైతు సంఘ నాయకులు, బాధిత రైతులు హెచ్చరించారు. హిందూపురం మండలం చలివెందులలో రైతులు ఏర్పాటు చేసిన సమావేశానికి రైతు సంఘం నాయకుడు రామకృష్ణరెడ్డి అధ్యక్షత హిందూపురం, చలివెందుల, రాచపల్లి, మలుగూరు, నందమూరి నగర్‌, సి చెర్లోపల్లి, మినుకుంటపల్లి, బాలంపల్లి, జంగాలపల్లి, కోడూరు, లేపాక్షి పరిసర ప్రాంతాల రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల పచ్చటి పంట పొలాలు లాక్కొవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రైతుల పొలాలను కారు చౌకగా లాక్కుని కంపెనీలకు కట్టబెట్టెందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. అసలు ఇష్టంలేకుండా భూములు లాక్కునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హరి, జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ 20 ఏళ్ల కిందట పరిశ్రమల కోసం మడకశిర, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం, ఓడిసి ప్రాంతాలలో వేలఎకరాలు పరిశ్రమ కోసం సేకరించిన భూములలో ఒక్క పరిశ్రమ పెట్టలేదని, ఆ భూములు తిరిగి రైతులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సేకరించిన ఆభూములలో ఎన్ని పరిశ్రమలు పెట్టారు ఎంతమందికి ఉపాధి కల్పించారని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జెడ్పి శ్రీనివాసులు, రాజప్ప, రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ చెన్నారెడ్డి, నాగిరెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు.

West Godavari

  • పేకాటకు అడ్డాగా నూజివీడు

    నూజివీడు: మామిడికి ప్రసిద్ధిగాంచిన నూజివీడు నియోజకవర్గం ప్రస్తుతం పేకాటకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి జూదాలను విచ్చలవిడిగా ప్రోత్సహించడం పరిపాటిగా మారిందనే విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో మామిడి తోటలు, అటవీ ప్రాంతం పేకాటకు అడ్డాగా మారాయి. అధికార పార్టీ నాయకులు పేకాట శిబిరాలను నిర్వహిస్తూ పేకాటనే సంపాదన మార్గంగా మలుచుకొంటున్నారు. పేకాటకు తోడు కోడిపందేలు సైతం అక్కడక్కడా ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు. పేకాటకు సంబంధించి ఇటీవల నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడి అనుచరుడికి, పేకాట నిర్వాహకుడికి మధ్య జరిగిన సంబాషణ ఆడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ అనుచరుడు పోలీసులు దాడి చేయడానికి వచ్చే సమాచారం తనకు ముందుగానే అందుతుందని, నాకు రెండు ఫోన్‌ నెంబర్లు ఇస్తే వాటికి ఫోన్‌చేసి చెప్తానని, పేకాట శిబిరం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో లొకేషన్‌ షేర్‌ చేయాలని ఆ సంభాషణలో పేర్కొన్నాడు.

    దేవరగుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో నూజివీడు, ముసునూరు మండలాల సరిహద్దులో ఏర్పాటు చేసుకోండంటూ సలహా కూడా ఇచ్చాడు. పట్టణానికి చెందిన ఒక వ్యక్తి మామిడి తోటల్లో పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి ఎంట్రీ ఫీజు రూ.5 వేలు పెట్టగా ప్రతిరోజూ ఈ శిబిరానికి 25 నుంచి 30 మంది వస్తున్నారు. రెండు రోజులకోసారి ప్లేస్‌లు మారుస్తూ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. నూజివీడు మండలంలోని సుంకొల్లుకు చెందిన అధికార పార్టీ నాయకులు కొందరు యనమదల నుంచి మైలవరం మండలం పోరాటనగర్‌కు వెళ్లే మార్గంలో అడవిలోని కొండల ప్రాంతంలో కొన్ని నెలలుగా యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక్కడకు నూజివీడు, మైలవరం, జీ కొండూరు, ఏ కొండూరు ప్రాంతాల నుంచి జూదగాళ్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడి పోలీసులు కాకుండా మైలవరం పోలీసులు ఈనెల 6న పేకాట శిబిరంపై మెరుపు దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.లక్షకు పైగా నగదును, 49 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి చేసిన సమయంలో శిబిరాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి తాను మంత్రి మనిషినని, మంత్రి దృష్టికి తీసుకెళ్తానని మైలవరం పోలీసులను బెదిరించినా పోలీసులు ఏమాత్రం తలొగ్గకుండా స్టేషన్‌కు తరలించి కేసు కట్టారు.

    నూజివీడు మండలంలోని మిట్టగూడెం, నూజివీడు పట్టణం, తుక్కులూరు, ముక్కొల్లుపాడు, ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో, ఆగిరిపల్లి మండలంలో ఈదర, కొత్త ఈదర, కనసానపల్లి, ఆగిరిపల్లి, గన్నవరం మండలాల సరిహద్దుల్లో పేకాట శిబిరాలు సాగుతున్నాయి. చాట్రాయి మండలం పోలవరంలో ఇటీవల వరకు పేకాట శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే పోలీసులకు తెలియడంతో ఈ శిబిరాన్ని నిలిపివేశారు.

    నియోజకవర్గంలోని సరిహద్దు ప్రాంతాలే అడ్డా

    నూజివీడు సర్కిల్‌ పరిధిలో ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు అనుమతి లేదు. ఎవరైనా పేకాట గానీ కోడిపందాలు, ఎలాంటి సంఘవిద్రోహ కార్యక్రమాలు నిర్వహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. నియోజకవర్గంలో ఎక్కడైనా కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.

    –కొప్పిశెట్టి రామకృష్ణ, నూజివీడు సీఐ

  • కుక్క

    ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏకంగా ఆలయ ఆవరణలో సంచరిస్తూ.. భక్తులను హడలెత్తిస్తున్నాయి. గతంలో ఆలయ అధికారులు వీధి శునకాలను పట్టించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేలా చర్యలు చేపట్టేవారు. కొన్నాళ్లుగా వీధి కుక్కల నిర్మూలనకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆలయ పరిసరాల్లో వాటి సంచారం అధికమైంది. ఘాట్‌ రోడ్లలో, కొండపైన పార్కింగ్‌ ప్రదేశాల్లో, షాపింగ్‌ కాంప్లెక్స్‌, అనివేటి మండపం వద్ద, తూర్పు రాజగోపుర ప్రాంతంలో శునకాల బెడద ఎక్కువగా ఉంది. భక్తుల మద్యలోంచి సంచరించడం, దారుల్లో పడుకోవడం వంటి వాటివల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో అవి దాడి చేస్తాయోనని భీతిల్లుతున్నారు. శునకాలను పట్టించి, అటవీ ప్రాంతాలకు తరలిస్తుంటే జంతు ప్రేమికులు తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, అందువల్ల ఏమీ చేయలేకపోతున్నామని దేవస్థానం ఎలక్ట్రికల్‌ డీఈ టి.సూర్యనారాయణ పేర్కొన్నారు.

    సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తారా..

    వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో తాజాగా సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో సంచలన ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల ప్రాంగణాల్లో వీధి కుక్కలను పూర్తిగా లేకుండా చేయాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ పరిసరాలు సున్నితమైన ప్రాంతాలే కాబట్టి వీధి కుక్కల నిర్మూలనకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టొచ్చు. అయితే ఇక్కడి అధికారులు స్పందిస్తారా.. లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

    శ్రీవారి ఆలయ ఆవరణలో వీధి కుక్కల స్వైరవిహారం

    వాటిని పట్టించేందుకు ఇంతవరకూ వెనకడుగు

    సుప్రీంకోర్టు ఆదేశాలతో ముందడుగు వేసేనా..

  • నిరుప

    బయటనుంచి కొనుగోలు చేస్తున్న వైనం

    ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి

    ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రజలకు సక్రమంగా అందే పరిస్థితి కానరావటం లేదు. బోధనాసుపత్రిగా మారిన అనంతరం అత్యాధునిక వైద్యసేవలు అందిస్తారని ప్రజలు ఆశపడగా.. కూటమి సర్కారు హయాంలో పేదలకు వైద్యసేవలు దూరమయ్యాయి. ఇక మరోవైపు జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్స్‌ ఉండగా.. బయటనుంచి ఆక్సిజన్‌ సరఫరా కావడం గమనార్హం. కరోనా విలయం సృష్టిస్తోన్న తరుణంలో గత ప్రభుత్వం ఆక్సిజన్‌ బయట నుంచి సరఫరా కంటే లోపలే తయారీ ప్లాంట్స్‌ ఏర్పాటు చేయటం మేలనే ఆలోచనతో ప్లాంట్స్‌ ఏర్పాటు చేసింది. మెల్లగా ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను బూజుపట్టేలా చేస్తూ.. బయట కొనుగోలు చేయటం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించటంలో అధికారులు విఫలం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

    నిరుపయోగంగా ఆక్సిజన్‌ ప్లాంట్స్‌?

    కరోనా విపత్కర కాలంలో ఏలూరు జీజీహెచ్‌లో యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. సర్వజన ఆసుపత్రిలోని సుమారు 400 బెడ్లకు ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పటి హాస్పిటల్‌ సూపరింటిండెంట్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేంద్రం నిధులు రూ.కోటి వ్యయంతో భారీగా వెయ్యి ఎల్‌పీఎం ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఠాగూర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ మరో చిన్నపాటి 250 ఎల్‌పీఎం ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయటంలో తమ సహకారాన్ని అందించారు. ఎంతో వ్యయప్రయాసలతో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌లు అప్పట్లోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అధికారులు నిర్మించారు. నేడు ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్స్‌ నిరుపయోగంగా ఉన్నాయి.

    బయటనుంచి సరఫరా

    ఆసుపత్రిలో ప్రస్తుతం అసలు ఆక్సిజన్‌ బెడ్లు ఎన్ని ఉన్నాయో తెలియని దుస్థితి నెలకొంది. గతంలో ఎమర్జెన్సీ విభాగంలోనే మూడు వార్డుల్లో అత్యవసర కేసులకు చికిత్స అందించేలా ఆక్సిజన్‌ సరఫరా, ఏసీ గదులు ఉండేవి. ఒక్కో రూమ్‌లో కనీసం 20 మంది రోగులకు వైద్య సేవలు అందించేవారు. జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులతోపాటు, ఎంసీహెచ్‌ బ్లాక్‌లోని అత్యవసర విబాగాలకు ఆక్సిజన్‌ సరఫరా పైప్స్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కంటివైద్య విభాగం వద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వ చేసే ట్యాంక్‌లో బయట నుంచి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. నెలకు కనీసం రూ.2 లక్షల వరకూ ఆక్సిజన్‌కు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను నిరుపయోగంగా వదిలేసి.. బయట నుంచి డబ్బులు చెల్లించి తెచ్చుకోవటం దేనికంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

  • ప్రత్

    పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీకమాసం సందర్భంగా ఆదివారం భక్తులు, పంచారామ యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి భక్తులు స్వామికి మహాన్యాస పూర్వక అభిషేకాలు చేయించుకున్నారు. అభిషేకాల అనంతరం వివిధ రకాల పూలతో స్వామివారిని అత్యంత వైభవంగా అలంకరించారు. మధ్యాహ్నం నుంచి పంచారామ యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు స్వామివారి అలంకరణను తిలకించారు. ఆలయంలో పడమర వైపు ప్రహరీగోడ ప్రమాదకర పరిస్థితుల్లో ఉండడంతో కర్రలు కట్టి ప్రదక్షిణలను నిలుపుదల చేశారు.

    బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

    ముదినేపల్లి రూరల్‌: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపుకుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు.

    కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు మాకు అందించమ్మా అంటూ భక్తులు ఆర్తీతో అమ్మను వేడుకున్నారు. అమ్మవారి దేవస్థానానికి సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు అమ్మకం, వాహన పూజలు, భక్తుల విరాళాల ద్వారా రూ.23,365 ఆదాయం వచ్చిందని తెలిపారు.

  • బతుకు

    గండేపల్లి: బతుకు దెరువు కోసం జిల్లా దాటి వచ్చిన వారు విగత జీవులయ్యారు. యజమానిని రక్షించే యత్నంలో సహాయకుడితో సహా విద్యుదాఘాతానికి గురై సెకన్ల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసుల కధనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగరవం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెట్టి సింహాద్రి(57) తన దగ్గర ఉన్న వరికోత యంత్రంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వరి కోత కోస్తుంటాడు. ఆదివారం మండలంలోని గండేపల్లి, రామయ్యపాలెం మీదుగా ఐషర్‌ వ్యాన్‌లో వరికోతకు యంత్రాన్ని తీసుకువెళ్తున్నాడు. రామయ్యపాలెం గ్రామ శివారుకు వచ్చే సరికి యంత్రం పైపునకు 11 కేవీ విద్యుత్‌ తీగలు అడ్డం వచ్చాయి. వాటిని తొలగించేందుకు డ్రైవింగ్‌ సీటు నుంచి కిందకు దిగిన సింహాద్రి వ్యాన్‌కు అడుగు భాగంలో కర్రను తీసే యత్నంలో తలుపుపై చేయి వేయడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకే మోటారు సైకిల్‌పై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన సహాయకుడు గెడ్డం సందీప్‌ (17) సింహాద్రిని రక్షించబోయాడు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

    ఆ కుటుంబాల్లో తీరని విషాదం

    ఇరగవరం: కుటుంబ పోషణ కోసం కోత మిషన్‌ తీసుకుని కాకినాడ జిల్లా వెళ్లిన ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన డ్రైవర్‌ కె సింహద్రి అప్పన్న (58), రాపాక గ్రామానికి చెందిన హెల్పర్‌ గెడ్డం సందీప్‌లు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద విద్యుత్‌ షాక్‌తో మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో ఆదివారం విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు విదేశాల్లో ఉండగా, మరొకరు జాబ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. రాపాక గ్రామానికి చెందిన గెడ్డం సందీప్‌ తండ్రి లాజర్‌ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తల్లి సుమలత గల్ఫ్‌లో ఉంటుంది. ఒక అక్కకు వివాహం కాగా మరొకరి వివాహం కావాల్సి ఉంది.

  • సందడిగా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం

    తణుకు అర్బన్‌: స్నేహితుడి గుర్తుగా ఏర్పాటైన డాక్టర్‌ పీఎన్‌ఎస్‌ కిరణ్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ అద్భుతమని కలెక్టర్‌ నాగరాణి అన్నారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంకల్పం 2025 పేరుతో తణుకు కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంతమంది దివ్యాంగులను ఒక వేదికపైకి తీసుకువచ్చి వారికి వైద్యం, ఇతర సదుపాయాలను అందించేలా రూపొందించిన ఆత్మీయ సమ్మేళనం అభినందనీయమని అన్నారు. ఈ సమ్మేళనానికి వివిధ జిల్లాల నుంచి సుమారుగా 5 వేలకు పైగా దివ్యాంగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 విభాగాలతో ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్యశిబిరాల్లో వైద్యులు దివ్యాంగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఆటలపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఫౌండేషన్‌ చైర్మన్‌ బొల్లా సతీష్‌కుమార్‌, వజావత్‌ కాన్‌రాజ్‌, షర్మిష్ట వీరన్న, సృష్టి సుబ్బారావు, సింహాద్రి కాశీ, గమిని మహీపాల్‌, నాగళ్ల వెంకటేశ్వరరావు, వేండ్ర లక్ష్మణ్‌, మానేపల్లి కాశీ, జగదీష్‌, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

  • ఉత్సాహంగా టెన్నిస్‌ పోటీలు

    పాలకొల్లు సెంట్రల్‌: పట్టణంలో బుద్ధావతారం రాజు మెమోరియల్‌ ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో క్వాలిఫై మ్యాచ్‌ల్లో మెయిన్‌ డ్రాకు 32 మంది క్రీడాకారులు విజయం సాధించినట్లు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గొట్టుముక్కల బూన్‌రాజు తెలిపారు. శనివారం, ఆదివారం జరిగిన ఆలిండియా సీనియర్స్‌ టెన్నిస్‌ పోటీల్లో 82 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూన్‌రాజు మాట్లాడుతూ 72 మంది క్రీడాకారులు సోమవారం నరసాపురంలో ఉన్న రెండు కోర్టుల్లో ఉదయం 8 గంటల నుంచి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే నైట్‌ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపారు.

    దెందులూరు: నిరంతర సాధనతో ఏ రంగంలోనైనా విజయం సాధ్యపడుతుందని రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ కాంపిటీషన్‌ అబ్జర్వర్‌ రమేష్‌ అన్నారు. కృష్ణా జిల్లాలో 69వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో దెందులూరు మండలం ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి బి.హిమవంశీ కృష్ణ సిల్వర్‌ మెడల్‌ సాధించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సురేష్‌ కుమార్‌ తదితరులు అభినందించారు.

  • చిట్టీల పేరుతో మోసంపై ఆందోళన

    కొయ్యలగూడెం: చిట్టీల పేరుతో తూర్పుపేటలోని ఒక వ్యక్తి తమను బురిడీ కొట్టించాడని ఆ ప్రాంతవాసులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. తూర్పుపేట పరిసర ప్రాంతాలలో వందలాది మంది నుంచి ఒక వ్యక్తి సుమారు రూ.10 కోట్ల మేర చిట్టీల పేరుతో సొమ్ము వసూలు చేశాడని తీరా ఇప్పుడు మొహం చాటేసుకొని తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో చిట్టీల నిర్వాహకుడికి సంబంధించిన చేపల పేటలో ఉండే అతని పొలం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. నిర్వాహకుడు తన పొలాన్ని కొందరు వ్యక్తులకు విక్రయిస్తున్నాడనే సమాచారంతో వారు వెళ్లి ఆందోళన చేశారు.

Hanamkonda

  • ఇండియన్‌

    జెజెబెల్‌

    కెమెరాలో సీతాకోక చిలుకలను బంధిస్తున్న అధ్యయన బృందం

    బారోనెట్‌

    టానీ రాజు రకం

    రెక్కలు విప్పిన

    80 రకాల జాతులు గుర్తించాం..

    ములుగు జిల్లా అడవుల్లో జరిగిన సర్వేలో 80 రకాల సీతాకోక చిలుకల జాతులను గుర్తించాం. అత్యాధునిక కెమెరాల సాయంతో వాటి సంఖ్య, అరుదైన జాతులను గుర్తించాం. వీటితోపాటు రాత్రి పూట సంచరించే చిమ్మటలు (మాత్‌) గుర్తించడం, వాటికి కావాల్సిన నివాసం, రక్షణ చర్యలపై అటవీశాఖ అధికారులకు వివరించాం.

    రంగుల సొబగులు

    ములుగు జిల్లాలో 80 నూతన జాతుల గుర్తింపు

    లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో మూడు రోజులు సర్వే

    సెలయేర్ల చాటున దాగి ఉన్న సీతాకోక చిలుకలు

    తెలంగాణలో మొట్టమొదటి అధ్యయనం

    భవిష్యత్‌ తరాల కోసమే..

    భవిష్యత్‌ తరాలకు జీవరాశులు, కీటకాల గురించి తెలియజేసేందుకే తెలంగాణలో మొదటిసారి అధ్యయనం చేశాం. ప్రకృతితో మమేకమై మా పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.

    – చిత్రశంకర్‌,

    సైంటిస్ట్‌, ఎంటమాలజిస్ట్‌

    ఏటూరునాగారం: పూల గనిపై మధుబనిని పీల్చుకునే సప్తవర్ణాల సొగసులు. పట్టుకునేలోపే జారిపోయే పగడాల జీవులు.. ఇంద్రధనస్సు ఇలపై విహరిస్తోందా అన్నట్లుండే సీతాకోక చిలుకలు. పచ్చని వనాల నడుమ మకరందాలు ఆరగిస్తుండగా.. ప్రకృతితో మమేకమైన పరిశోధకులు కెమెరాల్లో క్లిక్‌మనిపించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ములుగు జిల్లా లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో చేసిన అధ్యయనం ఆదివారంతో ముగిసింది. ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, వరల్డ్‌ వైల్డ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌తోపాటు మరికొంత మంది అధ్యయన బృంద సభ్యులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సర్వే చేశారు. 80 రకాల నూతన జాతుల సీతాకోక చిలుకలు ఉన్నట్లు ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌కు నివేదిక అందజేశారు. సీతాకోక చిలుకలు మనుగడ కొనసాగించేందుకు అడవుల్లో పూల మొక్కలు సైతం పెంచాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.

    – ఇందారం నాగేశ్వర్‌రావు,

    ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

  • పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎ

    సాక్షిప్రతినిధి, వరంగల్‌:

    కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతులను నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవలే కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్‌ సప్లయీస్‌ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.

    ఏసీకేల వారీగా వసూళ్లు..

    31 మంది రైస్‌మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్‌లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్‌ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, ఆయా జిల్లాల కలెక్టర్లకు వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్‌ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్‌ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్‌, ములుగు, జేఎస్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్‌ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్‌ఓలపై ఏసీబీ అడిషనల్‌ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సీఎంఆర్‌లో అక్రమాలపై ఓ వైపు ఏసీబీ మరో వైపు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రంగంలోకి దిగి ఆరా తీస్తుండడం ఆ శాఖ అధికారుల్లో చర్చనీయాంశమవుతోంది.

    ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్‌ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్‌ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇదే క్రమంలో సీఎంఆర్‌ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు 1,83,985 మెట్రిక్‌ టన్నులు రాబట్టారు. ఇదే సమయంలో ఇంకా రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యం 31 మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.

    సీఎంఆర్‌ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనకేసుకొస్తూ భారీగా నజరానాలు

    ఒక్కో ఏసీకేకు రూ.25 వేలకు పైనే.. మిల్లర్ల వద్దే 1.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం

    ప్రభుత్వానికి చేరని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌.. నాలుగేళ్లుగా పెండింగ్‌

    ఏసీబీ అడిషనల్‌ డీజీ వరకు ఫిర్యాదులు.. కమిషనర్‌ పేషీకి సీఎంఆర్‌ దందా

    రంగంలోకి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. అక్రమార్కులపై ఏసీబీ ఆరా

  • నేడు

    వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ కోరారు.

    వరంగల్‌ కలెక్టరేట్‌లో..

    న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    ముగిసిన మోడల్‌

    యునైటెడ్‌ నేషన్స్‌

    హసన్‌పర్తి: అన్నాసాగరంలోని ఎస్సార్‌ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహించిన మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ (ఎస్సార్‌యూ–ఎంయూఎన్‌) కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఇందులో 9 మంది అంతర్జాతీయ కౌన్సిల్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వివిధ దేశాల సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. ఎస్సార్‌ యూనివర్సిటీ విద్యార్థుల్లో ప్రపంచ దృక్పథం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతతో కూడిన నాయకత్వాన్ని పెంపొందించాలనే నిబద్ధత ప్రతిబింబించింది. ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్‌ ఎల్‌.గుణాకర్‌రావు, ఎన్‌.మహేందర్‌, డాక్టర్‌ రమేశ్‌, ఎస్సార్‌ యూ–ఎంయూఎన్‌ సెక్రటరీ మాస్టర్‌ శాంతం శ్రీవాస్తవ్‌ పాల్గొన్నారు.

    ‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ ఆవిష్కరణ

    హన్మకొండ కల్చరల్‌: తెలంగాణ రచయితల సంఘం వరంగల్‌ శాఖ, మిత్రమండలి ఆధ్వర్యంలో ‘కవిత్వంతో కలుద్దాం’ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. హనుమకొండ భీమారంలోని చాణక్యపురిలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి, డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌ రచించిన ‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాళోజీ పురస్కార గ్రహీత నెల్లుట్ల రమాదేవి ‘చావుకు కళ లేదు’ అనే కవితను వినిపించారు. కార్యక్రమంలో తెరసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపురం దేవేందర్‌, కవులు బాలబోయిన రమాదేవి, మాదారపు వాణిశ్రీ, అనితారాణి, నాగవెల్లి జితేందర్‌, రాములు, రామ బ్రహ్మచారి, గోవర్ధన్‌రెడ్డి, మైస ఎర్రన్న, బిటవరపు శ్రీమన్నారాయణ తదితర కవులు తమ కవితలను వినిపించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.

  • పెన్షనర్ల సంక్షేమంపై ఉదాసీనత వీడాలి

    హన్మకొండ: పెన్షనర్ల సంక్షేమం, వారి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో ప్రభుత్వం ఉదాసీనత వీడాలని తెలంగాణ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని అసోసియేషన్‌ కార్యాలయంలో అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో తెలంగాణలో మినహా ఏ రాష్ట్రం కూడా ఐదు డీఏలు ఇవ్వకుండా లేదని విమర్శించారు. పీఆర్‌సీ ప్రకటించకుండా తీవ్ర కాలయాపన చేస్తోందని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు అనుమతించాలని, ఐదు డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని ప్రకటించాలని, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో అసోసియేషన్‌కు సభ్యత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా కె.గోపాల్‌రెడ్డి, పరిశీలకుడిగా తిరువరంగం ప్రభాకర్‌ వ్యవహరించారు. వరంగల్‌ అధ్యక్షుడిగా శ్రీపాద సోమయ్య, సహ అధ్యక్షుడిగా కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా వరయోగుల సురేశ్‌, ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, మధుసూదన్‌, జి.బాల, కార్యదర్శులుగా పి.శ్రీనివాసరెడ్డి, కె.వెంకటరాములు, కోశాధికారిగా రమేశ్‌, సంయుక్త కార్యదర్శులుగా కేదారి, రామ్మోహనాచారి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా కుమారస్వామి, రాంభద్రయ్య, లలిత, పబ్లిసిటీ సెక్రటరీగా యాదగిరి, రాష్ట్ర కౌన్సిలర్లుగా లక్ష్మారెడ్డి, ఈశ్వరమూర్తి ఎన్నికయ్యారు.

    టీఎస్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌

    అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి టి.ప్రభాకర్‌

  • శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి

    విద్యారణ్యపురి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని మైసూర్‌ ఆర్‌ఐఈ విద్యావిభాగం ప్రొఫెసర్‌ బుర్ర రమేశ్‌ సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా డాక్టర్‌ ఎ. సంజీవయ్య విధులు నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని అధ్యాపకులు హనుమకొండలోని డైమండ్‌హిల్స్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సు, సంజీవయ్య అభినందన సభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. విద్యార్థులను విజ్ఞానం వైపు మరలించేందుకు తరగతి గది ఉపయోగపడాలని పేర్కొన్నారు. వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్‌, రాష్ట్ర మాజీ కార్యదర్శి కడారి భోగేశ్వర్‌, అధ్యాపకులు ఎడమ శ్రీనివాస్‌రెడ్డి, బైరి సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్‌, సోమయ్య, అధ్యాపకుల జ్వాల సంపాదకుడు డాక్టర్‌ గంగాధర్‌రెడ్డి, డాక్టర్‌ ఎం.శంకర్‌నారాయణ, ఆసనాల శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సంజీవయ్య అధ్యాపకుడిగా అందించిన సేవలు కొనియాడారు.

    విద్యాసదస్సులో మైసూర్‌ ఆర్‌ఐఈ

    ప్రొఫెసర్‌ బుర్ర రమేశ్‌

  • నైపుణ్యాలతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

    విద్యారణ్యపురి: నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని హనుమకొండ అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ ఎ.వెంకట్‌రెడ్డి అన్నారు. వృత్తివిద్యలో శిక్షణ పొందిన యువతకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2015 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన వృత్తి విద్యాకోర్సులను 2030 వరకు అన్ని పాఠశాలలకు విస్తరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వృత్తివిద్యా కో–ఆర్డినేటర్‌ బి.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. వృత్తివిద్యతో యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చునని తెలిపారు. అధ్యక్షత వహించిన మర్కజీ హైస్కూల్‌ హెచ్‌ఎం రామారావు మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు ఆన్‌లైన్‌లో 1,200 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 682 మంది హాజరైనట్లు తెలిపారు. 24 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 214 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామకపత్రాలు అందజేశారు. కాస్మోటిక్‌ కంపెనీలు, అపోలో ఫార్మసీ, రిటైల్‌ షాపుల్లో వీరు పనిచేయనున్నారు. జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.మన్మోహన్‌, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్‌, ప్రాక్టీసింగ్‌ హై స్కూల్‌ ఇంచార్జ్‌ ఎంఈఓ జగన్నాథం పాల్గొన్నారు.

    హనుమకొండ అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి

  • రక్తదానం ప్రాణదానంతో సమానం

    మామునూరు: రక్తదానం ప్రాణదానంతో సమానమని, అర్హులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌ సూచించారు. వరంగల్‌ మామునూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్‌ ఈదురు అరుణవిక్టర్‌ ఆధ్వర్యంలో జేఎన్‌వీ వరంగల్‌ అల్మినీ అసోసియేషన్‌ సహకారంతో ఉచిత వైద్యశిబిరం, మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ బలరాం నాయక్‌ హాజరై మాట్లాడుతూ రక్తదానాన్ని మించిన దానం మరోటి లేదన్నారు. అనంతరం రక్తదాతలకు మెమోంటోలు, రక్తదాన ధ్రువీకరణ పత్రాలను అందజేసి ఎంపీ అభినందించారు.

Yadadri

  • చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

    రాజాపేట: మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆదివారం రాజాపేట ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బర్ల పెంటయ్య(42), కవిత దంపతులు అదే గ్రామానికి చెందిన బోళ్ల రాఘవరెడ్డి పౌల్ట్రీఫామ్‌లో పనిచేస్తున్నారు. వారికి ఊర్లో సొంతం ఇల్లు ఉన్నప్పటికీ అది చిన్నగా ఉండడంతో పౌల్ట్రీఫామ్‌లోనే ఓ గదిలో నివాసముంటున్నారు. పెంటయ్య గురువారం రాత్రి మద్యం తాగి వచ్చాడు. అనంతరం అదే ఊర్లో ఉంటున్న తన తల్లి దగ్గరకు వెళ్తానని భార్యకు చెప్పగా.. రాత్రివేళ మద్యం మత్తులో బయటకు వెళ్లొద్దని ఆమె చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన పెంటయ్య పౌల్ట్రీఫామ్‌ వెనుకకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం ఇంటికి వచ్చి తాను పురుగుల మందు తాగినట్లు తన పెద్ద కుమారుడు పరుశరాములుకు చెప్పాడు. వెంటనే పెంటయ్యను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆదివారం మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

  • మూసీలో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

    నేరేడుచర్ల: నేరేడుచర్ల మండలం బురుగులతండా సమీపంలో శనివారం మూసీ నదిలో గల్లంతైన సోమారం గ్రామానికి చెందిన కొమరాజు సుస్మిత(13) మృతదేహం ఆదివారం లభ్యమైంది. సుస్మిత సోమారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం సరదాగా తన స్నేహితులతో కలిసి తయారుచేసిన మట్టి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు బురుగులతండా శివారులోని సోమప్ప దేవాలయం సమీపంలో మూసీ నది వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీం సహాయంతో బాలిక ఆచూకీ కోసం గాలించగా.. ఆదివారం బురుగులతండా వద్ద మూసీ నదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

    వినాయకుడిని నిమజ్జనం

    చేసేందుకు వెళ్లి మృత్యువాత

    వరద నీటికి ఎదురెళ్లి నదిలో నుంచి

    మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన ఎస్‌ఐ

  • ప్రయోగాలతోనే పాఠాల బోధన సులువు

    సూర్యాపేటటౌన్‌: ప్రయోగాలతోనే విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించవచ్చని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలుర జెడ్పీహెచ్‌ఎస్‌లో సైన్స్‌ అకాడమీ బృందం ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 7 నుంచి 10వ తరగతి వరకు పాఠాలను సులభంగా బోధించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి 40 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బయాలజికల్‌ సైన్స్‌ ఫోరం అధ్యక్షుడు ఎల్‌.దేవరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • ఎస్‌ఐ ఈదుకుంటూ వెళ్లి..

    వరద ప్రహావానికి బాలిక మృతదేహం అవతలి ఒడ్డుకు కొట్టుకుపోగా.. నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌ స్వయంగా అవతలి ఒడ్డు నుంచి నదిలో ఈదుకుంటూ వరద నీటికి ఎదురు వెళ్లి బాలిక మృతదేహాన్ని తెప్ప మీద ఉంచి తాడుతో బయటకు తీసుకొచ్చారు. ఎస్‌ఐ ధైర్య సాహసాలను పలువురు ప్రశంసించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సుస్మిత మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

  • పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న ఆటోలు సీజ్‌

    మునగాల: హైదరాబాద్‌–విజయవాడ జాతీ య రహదారిపై మునగాల మండల కేంద్రంలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి.. పరిమితికి మించి ప్రయాణికులు, వ్యవసాయ కూలీలను తరలిస్తున్న ఆటోలను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పది ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్న వ్యవసాయ కూలీలతో పాటు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. పది ఆటోలకు రూ.9,200 జరిమానా విధించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు జరిమానా చెల్లించిన తర్వాత తిరిగి అదే తప్పును కొనసాగిస్తే ఆటోలను సీజ్‌ చేసి కోదాడ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని హెచ్చరించారు. ఆటోల యాజమానులు, డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

    ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

    చౌటుప్పల్‌: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. లక్కారం గ్రామానికి చెందిన రాచకొండ సతీష్‌కుమార్‌(40) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన ఇంట్లోని వంట గదిలో దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడి భార్య సురేఖ గమనించి చున్నీని కత్తితో కట్‌ చేసి కిందకు దింపి చూడగా అప్పటికే సతీష్‌కుమార్‌ మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే సతీష్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

    గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టిన కారు

    ముగ్గురికి గాయాలు

    చిలుకూరు: కారు అదుపుతప్పి గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చిలుకూరు మండల కేంద్రం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. చిలుకూరు మండలం సీతరాంపురం గ్రామానికి చెందిన పులగం వంశీకృష్ణ, ఆసోజు త్రివాసు, పులగం ప్రశాంత్‌ శనివారం ఉదయం కారులో ఖమ్మంలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి రాత్రి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో చిలుకూరు మండల కేంద్రం శివారులోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి ముందువెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంశీకృష్ణకు తీవ్ర గాయాలు కాగా.. త్రివాసు, ప్రశాంత్‌ స్వల్ప గాయాలయ్యాయి. వంశీకృష్ణను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌రెడ్డి తెలిపారు.

    బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ

    ఇద్దరు ప్రయాణికులకు గాయాలు

    ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట): ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామ స్టేజీ సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సూర్యాపేట గ్రామ స్టేజీ సమీపంలో ఆదివారం సాయంత్రం బైక్‌ అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో సూర్యాపేట నుంచి తొర్రూర్‌ వెళ్తున్న సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు నెమ్మదిగా వెళ్తుండగా.. వెనుక నుంచి కలప లోడుతో వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏనుబాముల గ్రామానికి చెందిన కల్లేపల్లి ఉపేంద్ర, నెమ్మికల్‌ గ్రామానికి చెందిన చెందిన రాణికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పరారయ్యాడు.

    తప్పిపోయిన పిల్లలు.. తల్లిదండ్రులకు అప్పగింత

    యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఆదివారం పలువురు చిన్నారులు తప్పిపోయారు. వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆర్‌ఐ శేషగిరిరావు వెల్లడించారు. రద్దీ కారణంగా ఈఓ వెంకట్రావ్‌ ఆదేశాలతో ఆర్‌ఐ శేషగిరిరావు కొండపైన తప్పిపోయిన పిల్లల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొండపైన కంట్రోల్‌ రూం వద్దకు తప్పిపోయిన చిన్నారుల తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేయడంతో కంట్రోల్‌ రూం వద్ద ఉన్న సీసీ టీవీని పరిశీలించి, మైక్‌ ద్వారా అనౌన్స్‌మెంట్‌ చేశారు. దీంతో వేర్వేరుగా తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించామని ఆర్‌ఐ శేషగిరిరావు పేర్కొన్నారు.

  • నల్లబ

    భువనగిరిటౌన్‌ : ఏపీలోని చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు బొలేరో వాహనంలో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న ముగ్గురిని నల్లగొండ ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం ఆదివారం ఉదయం భువనగిరి పట్టణంలో పట్టుకున్నారు. వారి నుంచి నాటుసారా తయారీకి ఉపయోగించే 1600 కేజీల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. రవిచంద్రారెడ్డి తెలిపారు. పట్టుడిన బానోత్‌ సాయికిరణ్‌, ఎండీ బషీర్‌, భూక్య అఖిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఈతకు వెళ్లి కృష్ణా నదిలో

    యువకుడి గల్లంతు

    హుజూర్‌నగర్‌, మేళ్లచెరువు: ఈతకు వెళ్లి కృష్ణా నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద ఆదివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలం లింగగిరి గ్రామానికి చెందిన ఎస్‌కే ముజీబ్‌, నాగుల్‌మీరా, మరో నలుగురు స్నేహితులు కలిసి పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ప్రాజెక్టు దిగువన ఏపీలోని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వైపు పుష్కరఘాట్‌ వద్ద ఈత కొట్టేందుకు ముజీబ్‌, నాగుల్‌మీరా కృష్ణా నదిలోకి దిగగా.. నీటి ప్రవాహానికి వారు కొట్టుకుపోయారు. మిగతా వారు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు గమనించి నాగుల్‌మీరాను కాపాడారు. ముజీబ్‌ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న చింతలపాలెం పోలీసులు, హుజూర్‌నగర్‌, కోదాడ ఫైర్‌ సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి.

    గరిడేపల్లి: గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామ సమీపంలోని సాగర్‌ ఎడమ కాల్వలో పడి లారీ డ్రైవర్‌ గల్లంతయ్యాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ ఈట శ్రీకాంత్‌(36) చైన్నె నుంచి కెమికల్‌ బ్యాగ్స్‌ లోడుతో మంచిర్యాలకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆదివారం మధ్యాహ్నం గరిడేపల్లి మండలం మర్రికుంట సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ లారీని ఆపిన శ్రీకాంత్‌.. క్లీనర్‌తో పాటు ఇతర లారీల డ్రైవర్లతో కలిసి వంట చేసుకొని భోజనం చేశారు. అనంతరం కాళ్లు, చేతులు కడుక్కునేందుకు సాగర్‌ ఎడమ కాలువ వద్దకు వెళ్లిన శ్రీకాంత్‌ ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ చలికంటి నరేష్‌ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

    హ్యాండ్‌ కట్టర్‌ తగిలి

    వలస కార్మికుడు మృతి

    చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం నేలపట్ల గ్రామ పరిధిలోని పట్టుపురుగుల పరిశ్రమలో ఆదివారం హ్యాండ్‌ కట్టర్‌ తగిలి వలస కార్మికుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాకు చెందిన ఆకాష్‌కుమార్‌ కర్మ(22) తన భార్య వర్షతో కలిసి ఏడాది క్రితం నేలపట్లలోని యాదాద్రి రిల్లింగ్‌ అండ్‌ ట్విస్టింగ్‌ యూనిట్‌లో పనిచేయడానికి వచ్చాడు. పరిశ్రమలో పట్టుదారం కండెలు కట్టే పనిచేసే ఆకాష్‌కుమార్‌కు ఆదివారం పరిశ్రమ యాజమాని గంజి మహేష్‌ మట్టి పనిపాటు యూనిట్‌లో ఉన్న ఇనుప రాడ్లను హ్యాండ్‌ కట్టర్‌తో కట్‌ చేయమని చెప్పాడు. అయితే తనకు హ్యాండ్‌ కట్టర్‌ ఉపయోగించడం రాదని ఆకాష్‌కుమార్‌ చెప్పినా కూడా యాజమాని పట్టించుకోకుండా రాడ్లు కట్‌ చేయమని చెప్పడంతో.. అతడు రాడ్లు కట్‌ చేస్తుండగా హ్యాండ్‌ కట్టర్‌ జారి ఎడమ కాలు తొడపై పడింది. దీంతో ఆకాష్‌కుమార్‌ తొడ కట్‌ అయ్యి తీవ్ర రక్తస్రావం జరిగింది. 108 వాహనంలో అతడిని చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆకాష్‌కుమార్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య వర్ష ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాని గంజి మహేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సిరెడ్డి తెలిపారు.

  • యాదగి

    యాదగిరిగుట్ట: కార్తీక మాసం, ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కొండ కింద బస్టాండ్‌, లక్ష్మీ పుష్కరిణి, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, పాతగుట్ట, శివాలయం వంటి ప్రాంతాలు కిక్కిరిసిపోయారు. స్వామివారి ధర్మ దర్శనానికి 4గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. 78,200మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాధాయం రూ.1,00,57,322 వచ్చినట్లు ఆలయ ఈఓ వెంకట్రావ్‌ వెల్లడించారు. ప్రధానాలయం వద్ద 1,758 జంటలు, పాతగుట్టలో 200 జంటలు సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో పాల్గొన్నారు.

    స్వామివారి ధర్మ దర్శనానికి

    4 గంటల సమయం

  • బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడి దుర్మరణం

    ఆలేరు: బైక్‌పై వెళ్తున్న యువకుడిని అతివేగంగా వస్తున్న కారు ఎదురుగా ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆలేరు – రఘునాథపురం ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఆది వారం తెల్లవారుజామున జరిగింది. సీఐ యాలా ద్రి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎర్ర మాతమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె ఆలేరు మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. మాతమ్మ చిన్న కుమారుడు ఉదయ్‌(22) డిగ్రీ చదువుతున్నాడు. ఉదయ్‌ ప్రతిరోజు తెల్లవారుజామున మాతమ్మను బైక్‌పై ఎక్కించుకుని ఆలేరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద దించుతాడు. అక్కడ మాతమ్మ అటెండెన్స్‌(బయోమెట్రిక్‌) ప్రక్రియ పూర్తికాగానే ఆమెకు పని కేటాయించిన ప్రాంతంలో వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. రోజుమాదిరిగా ఆదివారం తెల్లవారుజామున కూడా ఉదయ్‌ ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయంలో తన తల్లి బయోమెట్రిక్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమెను రైల్వే గేట్‌ చౌరస్తాలో వదిలి తిరిగి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో ఆలేరు–రఘనాథపురం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదకు చేరుకోగానే.. అదే సమయంలో రఘునాథపురంలోని అత్తగారింటికి వచ్చిన తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన వ్యాపారి హరిరామకృష్ణన్‌ తన భార్య, కుమార్తెతో కలిసి కారులో ఆలేరు వైపు వెళ్తూ అదుపుతప్పి ఉదయ్‌ బైక్‌ను ఎదురుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఉదయ్‌ బైక్‌ పైనుంచి ఎగిరి ఫ్లైఓవర్‌ కింద రోడ్డు పైన పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, మున్సిపల్‌ సిబ్బంది గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే ఉదయ్‌ మృతిచెందాడు. కారు ఫ్లైఓవర్‌ పైన ఫుట్‌పాత్‌ మీదకు ఎక్కి ఆగింది. కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో హరిరామకృష్ణన్‌, అతడి భార్య, కుమార్తె సురక్షింతగా బయటపడ్డారు. అతివేగంగా కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు సీఐ యాలాద్రి చెప్పారు. మృతుడి సోదరుడు ఉమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి సుమారు రూ.3.50లక్షల పరిహారం చెల్లించేందుకు చర్చలు జరిగినట్లు తెలిసింది.

  • కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా

    ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట): కూలీలతో వెళ్తున్న ఆటోకు కుక్క ఎదురురావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్‌ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన 14 మంది మహిళా కూలీలు పత్తి ఏరేందుకు ఆదివారం ఉదయం ఆత్మకూరు(ఎస్‌) మండలం కోటపహాడ్‌ గ్రామానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఆటోలో స్వగ్రామానికి పయణమయ్యారు. మార్గమధ్యలో తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామ పరిధిలోని ఎస్సీ కాలనీ సమీపంలోకి రాగానే ఆటోకు కుక్క అడ్డువచ్చింది. కుక్కను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ ఎక్కినపల్లి పుల్లయ్యతో పాటు మరో ఆరుగురు మహిళా కూలీలు సలిగంటి నాగమ్మ, ఆకుల సోమమ్మ, అబ్బగాని సత్యవతి, చిత్తలూరు జ్యోతి, శేషగాని రమణ, చిత్తలూరు లక్ష్మమ్మకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ పుల్లయ్య, సలిగంటి నాగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

    డ్రైవర్‌తో పాటు ఆరుగురు

    మహిళా కూలీలకు గాయాలు

    ఇద్దరి పరిస్థితి విషమం

  • హైవేపై కారు బోల్తా

    చౌటుప్పల్‌ రూరల్‌: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామ పరిధిలో ఆదివారం లారీని తప్పించబోయి బీఎండబ్ల్యూ కారు బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామ పరిధిలో రాగానే ముందున్న లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌ కూడా సడెన్‌ బ్రేక్‌ వేయడంతో కారు అదుపుతప్పి పక్కన వెళ్తున్న స్విఫ్ట్‌ కారును ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారులో ఇద్దరు ప్రయాణిస్తుండగా.. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. కారు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌ జాం అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

Krishna

  • అసంబద

    సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ కనబరుస్తోంది. వీలైనంతగా పంట నష్టాన్ని తగ్గించి, రైతుల నోట్లో మట్టి కొట్టే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మోంథా తుపాను పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రాథమిక అంచనాలకు, తుది జాబితా మధ్య భారీగా వ్యత్యాస్యం కనిపిస్తోంది. తొలుత వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రాథమిక అంచనా 1.16లక్షల ఎకరాలు కాగా, సర్వే తరువాత తుది పంట నష్ట అంచనా 75వేల ఎకరాలకు పరిమితం అయ్యింది. అంటే 38వేల ఎకరాల్లో కోత విధించారు. ఉద్యాన పంటలకు సంబంధించి 3,540 ఎకరాల్లో పంటలకు నష్టం వాటినట్లు అంచనా వేయగా, సర్వే తరువాత తుదిపంట నష్ట అంచనా 1,715 ఎకరాలుగా లెక్క కట్టారు. ఈ లెక్కన 1825 ఎకరాల్లో కోత విధించారు. దీనికి తోడు పంట నష్టం పరిహారం వస్తే, ఆ పొలంలో పండిన ధాన్యం కొనుగోలు చేయబోమని మెలిక పెట్టి, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. కౌలు రైతులకు రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోమవారం కేంద్ర బృందం జిల్లాలోని పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రానుంది.

    భారీ నష్టమైనా..

    మోంథా తుపాను అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షానికి వరి పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చిరుపొట్ట దశ, గింజ గట్టి పడే దశలో ఉన్న వరి పంట నేలవాలింది. వరి దుబ్బులు మీదుగా వర్షపునీరు ప్రవహించింది. చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో వర్షం కురవటంతో తాలు తప్ప గింజ ఏర్పడుతుందని, మానుగాయ వచ్చి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ. 30వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. పంట చేలు కోతకు సిద్ధమయ్యే దశలో వచ్చి పడ్డ తుపానుతో పెట్టుబడులు పూర్తిగా నీటిపాలై నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పంటలు డెబ్బతింటే, ఎకరాకు రూ.25వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చిందని, ఇప్పుడు ఎకరాకు పంట నష్ట పరిహారం రూ.10వేలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.

    కంకిపాడు మండలం దావులూరులో మోంథా ధాటికి పడిపోయిన వరిని చూపుతున్న రైతు (ఫైల్‌)

    ఈ ఏడాది 35 ఎకరాల్లో వరిసాగు చేశా. వరి కంకులు పాలుపోసుకునే దశలో ఉండగా వచ్చిన తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు ఎంతసేపు పడిందా, నిలబడిందా అని అడుగుతున్నారు, పడిన దానికంటే నిలబడిన పొలాల్లోనే కంకులు రాసుకుని గింజలు తప్పలుగా మారిపోతున్నాయి. దీనిని ఎవరూ గమనించడం లేదు. నిలబడిన పంటపొలాల రైతులకు పరిహారం అందించాలి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.

    – వేమూరి రత్నగిరి, రైతు, ఘంటసాల

    ఉద్యాన పంటల నష్టం వివరాలు..

    దెబ్బతిన్న పంటల ప్రాథమిక అంచనా : 3,540.55 ఎకరాలు

    దెబ్బతిన్న పంటల తుది అంచనా : 1,715.07 ఎకరాలు

    పంట నష్టం ప్రాథమిక అంచనా : రూ.73.45 కోట్లు

    తుది అంచనా : రూ.23.43 కోట్లు

    జిల్లాలో వ్యవసాయ పంటల నష్టం ఇలా..

    పంట రకం ప్రాథమిక అంచనా తుది అంచనా ఇన్‌పుట్‌ సబ్సిడీ

    (ఎకరాల్లో..) (ఎకరాల్లో..) (రూ.లక్షల్లో)

    వరి 1,12,600 75,781.5 7,878.15

    ఇతర పంటలు 3,742.5 2,056.2 75.75

    మొత్తం 1,16,342.5 77,837.7 7,953.90

  • కృష్ణ
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

    చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. కాల్‌ సెంటర్‌(1100) ద్వారా కూడా అర్జీ నమోదు, స్థితి తెలుసుకోవచ్చని చెప్పారు.

    పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం ట్రైనీ ఐఏఎస్‌లు ఏడుగురు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వారితో పలువురు అధికారులు ఉన్నారు.

    ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యభగవానుడికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యనమ స్కారాలు, సూర్యోపాసన సేవ జరిపించారు.

    7

  • మామూళ్ల వెంబడి!
    ఎన్టీఆర్‌ జిల్లాలో ఎంఈవోల ఇష్టారాజ్యం

    వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లాలో మండల విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యారంగంలో విద్యార్థులకు మేలు చేసేందుకు అవసరమైన పర్యవేక్షణ చేయాల్సిన మండల విద్యాశాఖాధికారులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి మరోవైపు తమకిష్టమైన రీతిలో లంచాలకు అలవాటుపడి మామూళ్ల మత్తులో ఉంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారిపై పదేపదే ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

    జిల్లాలో ఇదీ పరిస్థితి..

    ఎన్టీఆర్‌ జిల్లాలో 20 మండలాలకు ఎంఈవో–1లు తొమ్మిది మంది, ఎంఈవో–2లు 20 మంది కొనసాగుతున్నారు. 20 మండలాలకు కేవలం తొమ్మిది మంది మాత్రమే మండల విద్యాశాఖాధికారులు పని చేయటం సైతం వారి ఆదాయానికి అండగా నిలుస్తోంది. ఒక్కొక్క ఎంఈవో–1కు నాలుగైదు మండలాలు కేటాయించటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు ఉన్నాయి. అందులోనూ ఎంఈవో–1లు బాధ్యతలు నిర్వర్తిస్తున్న మండలాలు చాలా సుదూర ప్రాంతాలు కావటంతో వారి పర్యవేక్షణ సైతం అంతంతమాత్రంగానే ఉంటుందనే వాదనలు ఉన్నాయి.

    ఉపాధ్యాయుల నుంచీ వసూళ్లు..

    జిల్లాలో సుమారుగా 969 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 5,160 మంది ఉపాధ్యాయులు వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి పనికి ఎంఈవోలు రేటు నిర్ణయించి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీస్‌ విషయాలు, బిల్లు తయారీ తదితర అంశాలకు సంబంధించి ఎంఈవోల వసూళ్లు మాములుగా ఉండదని పలువురు గురువులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల సర్వీస్‌ రిజిస్టర్ల విషయంలోనూ ఎంఈవోలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయా టీచర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

    ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోరు..

    జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులపై ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. నగరంలోని ఒక ఎంఈవో ప్రైవేట్‌ విద్యాసంస్థకు వెళ్లి తనకు భారీగా ముడుపులు కావాలని బేరం పెట్టి విసిగించాడు. దాంతో ఆ విద్యాసంస్థ యాజమాన్యం నేరుగా అక్కడి నుంచే జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా చర్యలు చేపట్టడం లేదు. అంతేకాకుండా సర్వీస్‌ రిజిస్టర్ల నిర్వహణలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రిటైర్డ్‌ అయిన ఉపాధ్యాయులకు సైతం బిల్లులు తయారు చేశారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఆ ఆరోపణలపై విచారణకు అధికారులు ఆదేశించారు. అయితే ఆ తరువాత దానిని బుట్టదాఖలు చేశారని తెలిసింది.

  • పండ్ల

    పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో కార్తిక మాస ప్రత్యేక అలంకరణల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని వివిధ రకాల పండ్లతో అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విశేష అలంకరణలోని అమ్మవారి దర్శించుకున్నారు. పాలు, పొంగళ్లతో బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. పండ్ల అలంకరణకు వత్సవాయి మండల గోపినేనిపాలెం గ్రామానికి చెందిన కామినేని రాంబాబు, అనిల్‌, గన్నవరం పట్టణానికి చెందిన చిలకపాటి లక్ష్మీగణేష్‌ సహకారం అందజేశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈవో భూపతిరాజు వెంకట సత్య నాగకిషోర్‌కుమార్‌, ఈఈ ఎల్‌ రమ, ఏఈఓ జంగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

    చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలో ఆదివారం ఓ ప్రైవేటు నివాస గృహంలో మంత్రులు పాత్రికేయులతో మాట్లాడారు. తుపాను సమయంలో సీఎం చంద్రబాబునాయుడు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసి తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారన్నారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన నిరాశ్రయులకు నిత్యావసర సరుకులను అందజేశామన్నారు. హెక్టారుకు రూ. 25వేలు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బాబాప్రసాద్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రొండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందించేందుకు కాపు అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌(కోపా) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోపా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ దావులూరి కై లాసరావు, దుట్టా రమేష్‌ కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, డిప్లొమా తదితర కోర్సులు చదువుతున్న మెరిట్‌ విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు kopakrishnavja@gmail. com మెయిల్‌కు రిక్వెస్ట్‌ పంపితే తాము దరఖాస్తు పంపిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులకు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లు జత చేసి తమకు పంపించాలని వారు కోరారు. మరింత సమాచారం కోసం 94402 39989, 70936 39919లో కానీ, మెయిల్‌ ఐడీ ద్వారా కానీ సంప్రదించాల్సిందిగా వారు కోరారు.

    నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన యలవర్తి శశిధర్‌, వారి తల్లి యలవర్తి పద్మజ రూ.1,01,116 విరాళం అందజేశారు. ఆదివారం త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ కార్యాలయంలో విరాళం చెక్‌ను సూపరింటెండెంట్‌ చల్లా శ్రీనివాసరావుకు అందించారు.

    మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి రూ.12,24,960 ఆదా యం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ. 6,80,370, లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయం ద్వారా రూ. 2,69,045, నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా రూ.1,30,348, శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ. 1,10,867, స్వామివారి కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ.30,840 సమకూరినట్లు వివరించారు. సుమారు 40వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు.

  • రక్త నాళాల వ్యాధులపై అవగాహన అవసరం

    లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన పెంచుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. వాస్క్యూలర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో వాస్క్యూలర్‌ వాక్‌థాన్‌ నిర్వహించారు. గవర్నర్‌ పేటలోని ఐఎంఏ హాలు వద్ద ఈ వాక్‌థాన్‌ను కలెక్టర్‌ లక్ష్మీశ ప్రారంభించారు. అక్కడి నుంచి చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసు వరకూ వెళ్లి, తిరిగి ఐఎంఏ హాలుకు చేరుకుంది.

    నిర్లక్ష్యం వద్దు..

    కలెక్టర్‌ లక్ష్మీశా మాట్లాడుతూ వాస్క్యూలర్‌ వ్యాధులు, సర్జరీలు గురించి అవగాహన కల్పించేందుకు వాక్‌ థాన్‌ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రముఖ వాస్క్యులర్‌ సర్జన్‌ డాక్టర్‌ కిరణ్‌ మాకినేని మాట్లాడుతూ వాస్క్యూలర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియాలో 800 మంది వరకు సభ్యులు ఉన్నారని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో అంప్యూటేషన్‌ ఫ్రీ ఇండియా నినాదంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాక్‌థాన్‌ నిర్వహించినట్లు తెలిపారు. అంప్యూటేషన్‌లు 80 శాతం మందిలో మందులు వాడటం, జాగ్రత్తలు పాటించడం, రక్తనాళాలకు చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చన్నారు.. న్యూరోపతి, వాస్క్యూలోపతి, డయాబెటిస్‌ ఉంటే కాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, వాస్క్యూలర్‌ సర్జన్స్‌ పాల్గొన్నారు.

    విజయవాడలో ఉత్సాహంగా

    వాస్క్యూలర్‌ వాక్‌థాన్‌

  • జిల్లాలో క్షేత్ర పర్యటనకు ట్రైనీ ఐఏఎస్‌లు
    మార్గనిర్దేశం చేసిన కలెక్టర్‌ లక్ష్మీశ

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌లు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని.. ఈ అవగాహన మున్ముందు విధి నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న 20 మంది ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు మూడు బృందాలుగా ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎన్టీఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌లకు కలెక్టర్‌ లక్ష్మీశ ఆదివారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియతో కలిసి సమావేశం నిర్వహించారు.

    అధికారులు సహకరించండి..

    ఫీల్డ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌ఎస్‌ఆర్పీ) కింద ఆరు రోజుల క్షేత్ర పర్యటనను విజయవంతంగా పూర్తిచేసేందుకు మార్గనిర్దేశం చేశారు. జిల్లా భౌగోళిక పరిస్థితులు, మండలాలు, గ్రామాల వివరాలతో పాటు సాంస్కృతికంగా, పర్యాటకంగా కీలక ప్రాంతాల గురించి వివరించారు. టూర్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా జరిగే క్షేత్ర పర్యటనలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, పోలీస్‌, విద్య, వైద్య ఆరోగ్యం.. ఇలా వివిధ శాఖల అధికారులతో సమావేశాలతో పాటు స్వర్ణాంధ్ర, వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధన దిశగా క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన పెంపొందించేలా నోడల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఏ పీడీ ఏఎన్‌ఏవీ నాంచారరావు, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.

  • వైద్య విద్యార్థులకు  రక్షణ కల్పించాలి

    మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. ఏలూరు మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ విద్యార్థులను ఎలుకలు కరవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్‌ అన్నారు. స్థానిక ముత్యాలంపాడులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.ప్రభుదాస్‌తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎలుకలు కరవటం వల్ల ఆరుగురు విద్యార్థులు రేబీస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్య విద్యార్థుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పరిపాలన, ప్రజా సంక్షేమంపై కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని.. రాజకీయాలకు కాదని హితవు పలికారు.

  • రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

    రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌ సమీపంలో కదులుతున్న రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి విజయవాడ నుంచి కన్యాకుమారి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరింది. ఆ సమయంలో రైల్వేస్టేషన్‌ దక్షిణ ప్రవేశ ద్వారం, పార్శిల్‌ కార్యాలయం గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తపు గాయాలతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై వచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, బ్లాక్‌ కలర్‌ జీన్స్‌, వైట్‌ కలర్‌ ఫుల్‌హ్యాండ్‌ షర్ట్‌ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

  • మూత్రాన్ని ఆపుకోవడం సరి కాదు..

    మూత్రం వస్తున్న సిగ్నల్‌ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు ఆపుకోవడం సరికాదు. అలా చేయడం ద్వారా మూత్రాశయ, కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నాయి. మా వద్దకు వచ్చే వారిలో కిడ్నీలో రాళ్లు, ప్రొస్టేట్‌ సమస్యలు, యూరినరీ ట్యూబ్‌ సన్నబడటం, అర్జంట్‌గా యూరిన్‌ రావడం, అసలు రాకపోవడం వంటి వారు ఉంటున్నారు. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్‌ సమస్యలున్న వారికి అందరికీ సర్జరీ అవసరం లేదు. చాలా మందిలో మందులతో నయం చేయవచ్చు. యూరిన్‌ ట్యూబ్‌ సన్నబడటం వంటి సమస్య పుట్టుకతో పిల్లల్లో కూడా ఉంటుంది. అలాంటి వారికి మందులు, సర్జరీ ద్వారా సరిచేస్తున్నాం. 10 ఏళ్లలో 12,500 వరకూ యూరాలజీ సర్జరీలు చేశాం.

    – డాక్టర్‌ గుంటక అజయ్‌కుమార్‌, యూరాలజిస్ట్‌

  • మూత్రం ఆపుకొంటే ముప్పే !

    లబ్బీపేట(విజయవాడతూర్పు): వాష్‌రూమ్స్‌ కంపు కొడుతున్నాయని కొందరు, అందుబాటులో లేక ఇంకొందరూ, సమయం లేని మరికొందరూ యూరిన్‌ వస్తున్నా.. గంటల కొద్ది ఆపుకొంటున్న వారు అనేక మంది ఉంటున్నారు. అంతేకాదు ఇంటి నుంచి విధులకు, కళాశాలలకు వెళ్లే వారు తిరిగి ఇంటికి వచ్చే వరకూ మూత్ర విసర్జన చేయని వారు కూడా ఉంటున్నారు. నీళ్లు తాగితే వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుందని తక్కువగా తాగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో మూత్రాశయ, కిడ్నీ సమస్యలు తలెత్తుతుండటంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నగరంలోని యూరాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో ఇలాంటి వారు అధికంగా ఉంటున్నారు. మూత్రం వస్తున్నట్లు సిగ్నల్‌ వచ్చిన తర్వాత ఆపుకోవడం కరెక్ట్‌ కాదంటున్నారు. అలా చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

    ఇవే నిదర్శనం..

    సమస్యలివే..

    నీళ్లు తాగడం లేదు..

    రప్రొస్టేట్‌ సమస్యలతో...

    ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో ప్రొస్టేట్‌ సమస్య కామన్‌గా మారినట్లు వైద్యులు చెబుతున్నారు.

  • స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం స్ఫూర్తిదాయకం

    చల్లపల్లి: స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ నినాదాన్ని అందిపుచ్చుకుని స్వచ్ఛ చల్లపల్లిని ప్రారంభించి ఉద్యమంగా ముందుగు తీసుకువెళుతూ అందరికీ ఆదర్శంగా నిలవటం అభిందనీయమని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్‌ పి.కృష్ణయ్య అన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని ప్రారంభించి 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం స్వచ్ఛ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కృష్ణయ్య, కలెక్టర్‌ బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రి(హైదరాబాద్‌) వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి, విజయవాడకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు కాలేషావలి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా 216 జాతీయ రహదారిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నూతనంగా జంక్షన్‌ పాయింట్‌లో ఫ్లడ్‌లైట్ల స్థంభాన్ని అతిథులచే ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా శ్మశానవాటిక, వర్మీ కంపోస్టును, డంపింగ్‌ యార్డును తిలకించారు. కొత్తగా ఏర్పాటుచేసిన బోర్డు వద్ద అందరూ గ్రూప్‌ ఫొటో దిగారు. గతంలో స్వచ్ఛ కార్యక్రమానికి ముందు తరువాత చల్లపల్లి పరిసరాల ఫొటోలను వైద్యులు డీఆర్కే ప్రసాద్‌, పద్మావతి దంపతులు చూపించారు.

    యువతను ప్రోత్సహించాలి..

    అనంతరం స్వగృహ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన సభలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌ పి.కృష్ణయ్య మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సందర్భంగా డీఆర్కే ప్రసాద్‌, పద్మావతి దంపతులను, స్వచ్ఛ కార్యకర్తలను అభినందించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాలలో యువతను ప్రోత్సహించాలని తద్వారా భవిష్యత్తులో కూడా ఈ స్వచ్ఛ కార్యక్రమాలు కొనసాగటానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు కాలేషావలి మాట్లాడుతూ.. సమాజంలో పేరుకుపోయిన చెత్తను తొలగించటం వల్ల దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త తన ప్రవచనాల్లో పేర్కొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోలె నాగమణి, సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు.

    కాలుష్య నియంత్రణ

    బోర్డు చైర్మన్‌ కృష్ణయ్య

  • తొమ్మ

    లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్ర హాస్పిటల్స్‌లో హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 2 నుంచి 8 వరకూ నిర్వహించిన శిబిరంలో 9 మందికి ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్‌ చీఫ్‌ డాక్టర్‌ పాతూరి వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరంలో స్పెయిన్‌కు చెందిన పిడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ బోస్కో మోస్కోసోతో పాటు పిడియాట్రిక్‌ కార్డియాక్‌ ఇంటెన్సివిస్ట్‌లు, డాక్టర్‌ ఫిలిప్‌, డాక్టర్‌ ఐతోర్‌ లోపెజ్‌, నటాలియా సొరొళ్ల, లారా పాల్గొని చిన్నారులకు సర్జరీలు చేశారని తెలిపారు. రిప్లేస్‌ మెంట్‌ ఆఫ్‌ మైట్రల్‌ వాల్వ్‌, సూడో ఎన్యూరిసం, డీఓఆర్వీ + టెట్రాలజి ఆఫ్‌ ఫాలో వంటి అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలున్న తొమ్మిది మందికి విజయవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు డాక్టర్‌ రామారావు తెలిపారు. సమావేశంలో పిడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ కె.విక్రమ్‌, డాక్టర్‌ నాగేశ్వరరావులతో పాటు కార్డియాక్‌ ఎనస్థిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

    మంత్రి పార్థసారథి ఎస్కార్ట్‌ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి

    గుడివాడరూరల్‌/కోనేరుసెంటర్‌: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఎస్కార్ట్‌ ఎస్‌ఐ ఆర్‌.ఎస్‌.రంగనాథరావు(60) ఆదివారం గుడివాడలో గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి పార్థసారథి మచిలీపట్నం నుంచి నూజివీడు వెళ్తుండగా ఎస్కార్ట్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రంగనాథరావు ప్రయాణంలో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఆయనను సిబ్బంది తరలించగా వైద్యులు వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందారు. ఆయన స్వగ్రామం అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెం. ఎస్‌ఐ రంగనాథరావుకు గతంలో ఓ సారి హార్ట్‌సర్జరీ జరిగిందని సిబ్బంది తెలిపారు. రంగనాథరావు మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి ఎస్‌ఐగా పని చేస్తూ మంత్రి ఎస్కార్ట్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్‌ఐ మృతి చెందారన్న సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్‌ వినీల్‌, వన్‌టౌన్‌ సీఐ కొండపల్లి శ్రీనివాస్‌ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎస్‌ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, డీఎస్పీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.