Archive Page | Sakshi
Sakshi News home page

Mancherial

  • పాముకాటుకు ఒకరి మృతి

    కౌటాల: మండలంలోని మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన ఉర్వత్‌ నాందేవ్‌ (55) పాముకాటుకు గురై మృతి చెందినట్లు ఎస్సై విజయ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నాందేవ్‌ తన భార్య నిర్మలతో కలిసి గ్రామ శివారులోని తమ పొలానికి వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా నాందేవ్‌ను పాము కాటు వేసింది. అతడి భార్య గమనించి వెంటనే నాందేవ్‌ను సిర్పూర్‌(టి)లోని సామాజిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు కార్తిక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

  • రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

    ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు హన్మకొండ వేదికగా ఈనెల 3 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో పీ స్వాతి (60 మీటర్స్‌ రన్నింగ్‌), పీ కావ్య (60 మీటర్స్‌), ఎం.శివాని (600 మీటర్స్‌), పీ రితిక(ట్రయాత్లాన్‌), వీ మహేశ్‌ (జావెలిన్‌ త్రో), డీ యువరాజ్‌ (80 హర్డిల్స్‌) ఎస్‌.చరణ్‌ (ట్రయాత్లాన్‌–ఏ), ఎం.హన్మంతు (ట్రయాత్లాన్‌–బీ) ఉన్నారు. వీరిని డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్‌ శుక్రవారం అభినందించారు. రాష్ట్ర స్థాయి పో టీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌, అథ్లెటిక్స్‌ కోచ్‌ రమేశ్‌ ఉన్నారు.

  • డీఈవో
    ● ఆదిలాబాద్‌కు ఐటీడీఏ పీవో ● ఆసిఫాబాద్‌కు అడిషనల్‌ కలెక్టర్‌ ● అక్రమార్కుల్లో మొదలైన గుబులు ● విద్యావ్యవస్థ గాడిలో పడేనా?

    ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా విద్యాశాఖకు తొలిసారిగా ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇన్‌చార్జి అధికారితో కొనసాగుతున్న డీఈవో పోస్టులో ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి ఖుష్బూ గుప్తాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆమె ఇప్పటికే ఐటీడీఏ పీవోతో పాటు స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌గా, ఆది లాబాద్‌ మున్సిపల్‌ ప్రత్యేకాధికారిగా అదనపు బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారికి జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖు ష్బూ గుప్తాకు విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరుండడంతో అక్రమార్కులు, డుమ్మా టీచర్లలో గుబులు మొదలైంది. 2018నుంచి రెగ్యులర్‌ అధికా రి లేక విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. అప్పటి నుంచి ఇన్‌చార్జి అధికారులతోనే కాలం నెట్టుకువస్తున్నారు. ఇన్‌చార్జి అధికారులకు శాఖపై పట్టులేకపోవడంతో పలువురు ఉపాధ్యాయులు, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

    ఏడేళ్లుగా ఇన్‌చార్జీలే..

    2018 నుంచి జిల్లాలో ఇన్‌చార్జి అధికారులతోనే విద్యావ్యవస్థ కొనసాగుతోంది. అప్పట్లో పనిచేసిన జనార్దన్‌రావును కార్యాలయ ఉద్యోగులు, ఉపాధ్యా య సంఘ నాయకులతో ఉన్న గొడవల కారణంగా అప్పటి కలెక్టర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. దీంతో డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మూడేళ్ల పాటు పనిచేసిన అతడిని నిర్మల్‌ జిల్లాకు బదిలీ చేయడంతో అక్కడ ఏడీగా పనిచేస్తున్న ప్రణీతను జిల్లా విద్యాధికారిగా నియమించారు. ఇటీవల ఆ మె ఉద్యోగ విరమణ పొందడంతో మోడల్‌ స్కూల్‌ డిప్యూటీ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జిల్లా వయోజన విద్యాశాఖ డీడీగా ఉన్న శ్రీనివాసరెడ్డికి కలెక్టర్‌ రాజర్షి షా ఇన్‌చార్జి డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. ఆయన నాలుగు నెలల పాటు ఇన్‌చార్జి డీఈవోగా విధులు నిర్వహించారు. ప్రస్తు తం అతడిని తప్పిస్తూ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాకు బాధ్యతలు అప్పగించారు. అయితే కీలకమైన ఐటీడీఏ పీవో పోస్టుతో పాటు స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేకాధికారిగా ఇప్పటికే మూడు ప్రధాన పోస్టుల్లో కొనసాగుతుండగా ఆమెకే జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు అప్పగించడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. కాగా, శనివారం నుంచి జిల్లాలో ఉపాధ్యా య ప్రమోషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ ప్రక్రియ సాఫీగా నిర్వహించడంతో పాటు విద్యాశాఖను ఏ విధంగా గాడిన పెడతారనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఐఏఎస్‌ అఽఽధికారిని డీఈవోగా నియమించడంతో విద్యాశాఖలో అక్రమాలకు చెక్‌ పడనున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

    ఆదిలాబాద్‌ డీఈవో కార్యాలయం

    ఆసిఫాబాద్‌కు అడిషనల్‌ కలెక్టర్‌ తివారీ

    ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా విద్యాశాఖలో ఏడాదిగా ఇన్‌చార్జి డీఈవో పాలన కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య ఇన్‌చార్జి డీఈవో కొనసాగతుండగా శుక్రవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ కి అదనంగా డీఈవో బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • పరీక్

    ఆదిలాబాద్‌టౌన్‌: పరీక్షల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురైన జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసముంటున్న భూమన్న–గీత దంపతులకు కూతురు, కుమారుడు రిత్విక్‌ (17) ఉన్నారు. రిత్విక్‌ జిల్లా కేంద్రంలోని సంజయ్‌ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నెల క్రితం ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల కాగా, ఆరు సబ్జెక్టులకు ఐదింటిలో ఫెయిలయ్యాడు. దీంతో కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడు. రెండు రోజుల నుంచి కళాశాలకూ రాలేదని కళాశాల ప్రిన్సి పల్‌ తెలిపారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. కూతురు లక్సెట్టిపేటలో ని వసతిగృహంలో ఉంటూ చదువుకుంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిత్విక్‌ చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు రోధించిన తీరు అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

    ఆర్థిక ఇబ్బందులతో యువతి..

    నెన్నెల: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జంగాల్‌పేట పంచాయ తీ పరిధి ఖర్జి గ్రామానికి చెందిన గిరిజన యువతి అద్దెరపల్లి మమత(19) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఉపాధి కోసం ఏడాది క్రితం రూ.1.60 లక్షలతో బెల్లంపల్లిలో సెకండ్‌ హ్యాండ్‌ ఆటో కొనుగోలు చేసింది. డ్రైవర్‌తో దానిని నడిపించుకుంటూ అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటోంది. అయితే.. అప్పటికే సదరు ఆటోపై ఫైనాన్స్‌ ఉంద న్న విషయం తెలియక మోసపోయింది. ఆటోను అమ్మిన వ్యక్తి కిస్తీలు కట్టకపోవడంతో నెల కిందట మమత వద్ద ఉన్న ఆటోను ఫైనాన్స్‌ వారు సీజ్‌ చేసి తీసుకెళ్లారు. దీంతో ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా న ష్టం జరగడంతో నిత్యం బాధపడుతోంది. ఈక్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లాక ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కు టుంబ సభ్యులు మమత విగతజీవిగా కనిపించడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి నాగేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

    కొండాపూర్‌లో యువకుడు..

    దండేపల్లి: అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌ గ్రామానికి చెందిన ఇప్ప మనోజ్‌ (31) ఏడాది క్రితం వరికోత యంత్రం కొనుగోలు చేశాడు. అది తరచూ మరమ్మతులకు గురికావడంతో దానిని అమ్మేశాడు. మళ్లీ సుమారు రూ.4లక్షల వరకు అప్పు చేసి ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. దానికీ తరచూ రిపేర్లు రావడంతో సరిగా నడవలేదు. దీంతో ట్రాక్టర్‌ కొనుగోలు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లో వారితో చెబుతూ బాధపడేవాడు. ఈ విషయంలో భార్య శిరీష అతనికి నచ్చజెప్పి బాధపడవద్దని చెప్పేది. అయినప్పటికీ మనస్తాపంతో మనోజ్‌ గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయాన్ని తమ బంధువు మల్లేశ్‌కు ఫోన్‌ చేసి తెలిపాడు. వెంటనే మల్లేశ్‌ అక్కడికి వెళ్లి మనోజ్‌ను చికిత్స కోసం లక్సెట్టిపేటకు తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

  • సీవోఈ తరలింపుపై ప్రభుత్వానికి నివేదిస్తా
    ● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా

    ఉట్నూర్‌రూరల్‌: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లోగల కాలేజ్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ)ని నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేటకు తరలించడంపై ప్రజల ఆక్షేపణను ప్రభుత్వానికి నివేదిస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. సీవోఈని హ యత్‌నగర్‌ నుంచి తరలించవద్దని శుక్రవారం ఆది మ గిరిజన కొలాం సేవా సంఘం ప్రతినిధులు పీ వోకు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. 200 మంది ఆదివాసీ విద్యార్థులు సీవోఈలో ఇంటర్‌ చదువుతున్నారని తెలిపారు. సీవోఈని అచ్చంపేటకు తరలిస్తే మరో 150 కిలోమీటర్ల దూరభారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తంజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ఆదిమ గిరిజన కొ లాం సేవా సంఘం ప్రతినిధులు అందించిన వినతిపత్రంపై గిరిజన సంక్షేమ కమిషనర్‌తో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. సంఘం ప్రతినిధులు కొడప సోనేరావు, మాడవి గోవిందరావు, టేకం లక్ష్మణ్‌, సిడాం అన్నిగా, మడవి నాగరావు, మడవి కిషన్‌, టేకం భీమ్‌ రావు పాల్గొన్నారు.

    సమస్యలు పరిష్కరించాలి

    సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు దివ్యాంగులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం పథకాలు అమలు చేయాలని కోరారు. ప్రతీ దివ్యాంగుడికి 35 కిలోల బియ్యం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. 165 రోజులు పని కల్పించాలని, బ్యాక్‌లాగ్‌ పోస్టులు, 100శాతం సబ్సిడీ రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అ నంతరం పీవో మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్ర భుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పా రు. నాగేశ్‌, గేడం జమున, జగతిరావు, బుచ్చన్న, సరోజ, ప్రియాంక తదితరులున్నారు.

  • సింగరేణి లాభాలు ప్రకటించాలి

    రెబ్బెన: గత ఆర్థిక సంవత్సరం సింగరేణి ఆర్జించిన లాభాలను వెంటనే ప్రకటించాలని హెచ్‌ఎంఎస్‌ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు కోరారు. శుక్రవారం గోలేటి సీహెచ్‌పీలో ఎస్‌ఈ కోటయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా ఎన్నికై న ఏఐటీయూసీ లాభాలను ప్రకటించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటూ దేశానికి వెలుగులు ప్రసాదిస్తున్న సింగరేణి కార్మికులు గత సంవత్సరం సంస్థ ఆర్జించిన లాభాలు తెలియక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఏఐటీయూసీ చేతకాని తనంతోనే లాభాల ప్రకటనలో జాప్యం ఏర్పడుతోందని విమర్శించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చేస్తామని ఎన్నికల సందర్భంగా ఏఐటీయూసీ హామీ ఇచ్చిందని, గుర్తింపు సంఘంగా గెలిచి 18 నెలలు పూర్తవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. ఏఐటీయూసీ నాయకత్వం పోరాటాలను మరిచి కార్మిక హక్కులను యాజమాన్యానికి తాకట్టుపెట్టి కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలు ప్రకటించి కాంట్రాక్టు కార్మికులకూ లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పిట్‌ కార్యదర్శి ఎండీ ఆరీఫ్‌, ఏరియా ఆర్గనైజర్‌ మరిశెట్టి దత్తు, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ పిట్‌ కార్యదర్శి బాలేశ్‌, అసిస్టెంట్‌ పిట్‌ కార్యదర్శి దీపక్‌రాజ్‌, ఆర్గనైజర్‌ రాజేశ్‌, కార్మికులు శోభన్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • రైతు సంక్షేమంపై ప్రభుత్వాలు స్పందించాలి

    దిలావర్‌పూర్‌: రైతు సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆత్మహత్యలు ఆపాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని మాయాపూర్‌ గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ కామిండ్ల భీమన్న కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. బాధి త కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు ప్రభుత్వాలు ముందే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులనూ ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఇప్పటివరకు ఇస్తున్న రైతు బీమా పరిహారాన్ని రెట్టింపు చేయాలని కోరారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు 60 ఏళ్లు దాటితే వారికి నెలకు రూ.5వేల పెన్షన్‌ అందజేయాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.10లక్షలు అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రైతు సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ, కోశాధికారి సూర్యకిరణ్‌, స్థానిక పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

  • బొగ్గు ఉత్పత్తిపై వర్షాల ప్రభావం

    శ్రీరాంపూర్‌: గత జూలైలో వర్షాలతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడిందని శ్రీరాంపూర్‌ జీఎం ఎం.శ్రీ నివాస్‌ తెలిపారు. శుక్రవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. జూలైలో 370 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని పేర్కొన్నారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 4.89 లక్షల టన్నులకు 4.30 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 21.49 లక్షల టన్నులకు 19.85 లక్షల టన్నులు సాధించి 92 శాతం లక్ష్యాన్ని నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వర్షాలతో ఓసీపీల్లో స్టాక్‌ కోల్‌ లిఫ్ట్‌ చేసినట్లు తెలిపారు. భూగర్భ గనుల్లో ఆర్కే 5, ఆర్కే 7, ఆర్కే న్యూటెక్‌, ఎస్సార్పీ 1, ఓసీపీల్లో ఐకే ఓసీపీ 135 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకున్నట్లు వివరించారు. డీజీఎం (పర్సనల్‌) అనిల్‌కుమార్‌, డీజీఎం (ఐఈడీ) రాజన్న, సీనియర్‌ పీవో కాంతారావు పాల్గొన్నారు.

Parvathipuram Manyam

  • పాలకొండ రూరల్‌: రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పొందుపర్చిన వెసులుబాటులను ఆసరాగా చేసుకుని తనకు దఖలుపడిన ఆస్తిపై ఉన్న హక్కును తన ప్రమేయం లేకుండా ఎలా రద్దు చేస్తారని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఎటువంటి నిబంధనలు ఉండవా? అడ్డగోలుగా వ్యవహరిస్తారా? అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించడంతో పాటు తనకు అన్యాయం చేయవద్దంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..అనకాపల్లి జిల్లా, అదే మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కట్టుమూరి సుమతి, అప్పారావు దంపతులు శుక్రవారం పాలకొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా రిజిస్ట్రార్‌ శ్రీరామ్మూర్తిని కలిసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఈ సందర్భంగా బాధితురాలు సుమతి మాట్లాడుతూ తన తల్లి ఓదిరి జయమేరి పసుపు కుంకుమ నిమిత్తం విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సర్వే నంబర్‌ 63/3 (డాబాగార్డెన్స్‌–కప్పరాడ గ్రామం) వద్ద డోర్‌ నంబర్‌ 57–28–16/7 అసెస్మెంట్‌ నంబర్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌ను గిఫ్ట్‌ రూపంలో అందించారన్నారు. ఇందుకు సంబంధించి 2021లో ద్వారకానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్తావేజు నంబర్‌ 2757/2021 రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వివరించారు. ఇటీవల తన ప్రమేయం లేకుండా సదరు గిఫ్ట్‌ దస్తావేజును పాలకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2025 జూన్‌ 25వ తేదీన ‘ఎనీవేర్‌’ పద్ధతిలో వేరొకరు రద్దు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. తన సోదరుడు ఓదిరి సతీష్‌, ఆయన భార్య విజేత ఈ చర్యలకు పాల్పడినట్లు వాపోయారు.

    నోటీసులు ఇవ్వకుండా చేశారు

    రిజిస్ట్రేషన్‌ సమయంలో పాలకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు తనకు ఎటువంటి నోటీసులు, సమచారం ఇవ్వకుండా తన ఆస్తిపై హక్కును రద్దు రిజిస్ట్రేషన్‌ చేయించడం అన్యాయమని వాపోయారు.

    రిజిస్ట్రేషన్‌ విధానంలో గల ఎనీవేర్‌ పద్ధతిని అడ్డుపెట్టుకుని అధికారం, పలుకుబడి, నగదు చెల్లించి నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులు ఈ వ్యవహరంపై లోతైన దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని బాధిత దంపతులు సుమతి, అప్పారావు కోరారు. ఫిర్యాదును పరిశీలించిన పాలకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ తన హయాంలో ఈ దస్తావేజు రద్దు జరగలేదన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు రద్దు చేయాలంటే కచ్చితంగా సంబంఽధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి. వారి సమక్షంలో రద్దు దస్తావేజీలు రూపొందించాల్సి ఉంటుంది. బాధితులు అందించిన ఫిర్యాదును ఉన్నతాఽధికారులకు అందిస్తామని చెప్పారు.

    సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద కన్నీరుపెట్టుకున్న బాధితులు

  • విద్యార్థుల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

    ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాత్సవ

    సాక్షి కథనానికి స్పందన

    పార్వతీపురం రూరల్‌: గిరిజన ప్రాంతాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించినా..ప్రత్యేక శ్రద్ధ చూపించకపోయినా ఉపేక్షించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాత్సవ సంబంధిత అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల బాగోగులు చూడాల్సిన బాధ్యత సంక్షేమ, వైద్యాధికారులపై ఉందని హెచ్చరించారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘‘ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అనారోగ్యం’’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో శుక్రవారం ఈ మేరకు పీఓ డోకిశీల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు, స్థానిక వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని చెప్పారు. ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, విద్యార్థులను ఎప్పటికప్పుడు పరిశీలించి అనుమానంగా ఉంటే రక్తపరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించాలని స్పష్టం చేశారు. మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి వ్యాధులు రాకుండా దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు ఆర్‌.కృష్ణవేణి, మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు.

  • దొంగతనానికి దారితీసిన జల్సాలు

    చోరీకేసును ఛేదించిన పోలీసులు

    రాజాం సిటీ: జల్సాలకు అలవాటుపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్‌ టీచర్‌ స్నేహితుల సహాయంతో దొంగతనానికి పాల్పడ్డాడు. జల్సాలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లకు పాల్పడిన ఓ యువకుడు తనకు గతంలో పరిచయమున్న స్నేహితులను ఆశ్రయించి సొంత గ్రామంలో ఏకంగా 18 తులాల బంగారాన్ని చోరీ చేయడంలో సూత్రధారిగా నిలిచాడు. నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడుకాగా మరో స్నేహితుడు ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి రాజాం టౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వంగర మండలం బాగెంపేట గ్రామంలో గత నెల 24న పశుమర్తి శంకరరావు ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 25న కేసు నమోదుచేసిన వంగర పోలీసులు ఈ దొంగతనానికి సూత్రధారిగా అదే గ్రామానికి చెదిన రెడ్డి గోపాలకృష్ణను గుర్తించి ఆరా తీశారు. ఆయన ఓ పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌తోపాటు జల్సాలకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఈ ఇబ్బందుల నుంచి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించి గతంలో వాలీబాల్‌ క్రీడలో పరిచయమైన పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన శ్రీరామ్‌ బాలరాజు, టీకే రాజపురం గ్రామానికి చెందిన జాడ దుర్గారావులను ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన పశుమర్తి శంకరరావు కుటుంబంతో సహా ఇంటికి తాళంవేసి హైదరాబాద్‌ వెళ్లారని, వారి ఇంట్లో బంగారం సులభంగా దొంగిలించవచ్చునని వారికి తెలియజేశాడు.

    16 తులాలు రికవరీ

    ఇదే అదునుగా వారు ముగ్గురూ దొంగతనానికి పాల్పడ్డారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మకానికి తీసుకువెళ్తున్న నిందితులను బూరాడ జంక్షన్‌ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకుని వారి నుంచి 18 తులాల బంగారానికి గాను 16 తులాలు రికవరీ చేయగా మిగిలిన రెండు తులాలు బాలరాజు పార్వతీపురంలోని సీఎస్‌బీ బ్యాంకులో తాకట్టుపెట్టాడని, అదికూడా త్వరలో రికవరీ చేస్తామని వెల్లడించారు. సీఐ కె.అశోక్‌కుమార్‌, వంగర ఎస్సై షేక్‌శంకర్‌ ఉన్నారు.

  • విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

    పార్వతీపురం: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్‌.పావని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహర దీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ పూర్తి అయిన తరువాత పీజీ చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, జిల్లా కేంద్రాల్లో పీజీ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని, కార్పొరేట్‌లను ప్రోత్సహించేలా విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు.

    విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌ మెంట్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలో ఏఎన్‌ఎంలను నియమించకపోవడంతో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా యన్నారు. ఈ దీక్షలకు యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు టి.అఖిల్‌, ఎం.సంధ్య, కె.డేవిడ్‌, ఎ.గంగారావు, ఎం.సురేష్‌, జి.సంజీవ్‌, సింహాచలం, రాజేష్‌, చంటి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    ఎస్‌ఎఫ్‌ఐ నిరాహార దీక్ష

  • ఫలించిన రన్‌ మిషన్‌ కష్టం..

    పోలీస్‌ ఉద్యోగాలకు 14 మంది ఎంపిక

    చీపురుపల్లి: రక్షణ దళంలో ఒకటైన ఎయిర్‌ఫోర్స్‌లో ఆయనొక ఉద్యోగి. అయితే అందరి ఉద్యోగుల్లాగా తన పని తాను చేసుకుంటూ కుటుంబం బాగోగులు చూసుకుంటూ ఆయన ఉండలేదు. తన లాగానే మరెంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత పోలీస్‌, రక్షణ దళంలో చేరాలని అందుకు అవసరమైన సహకారాన్ని అందజేయాలని తపించారు. అందులో భాగంగానే పుట్టుకొచ్చింది రన్‌ మిషన్‌. ఆ రన్‌ మిషన్‌ ఎంతో మంది యువత ఉద్యోగాలు సాధనకు వేదికై ంది. తాజాగా విడుదలైన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫలితాల్లో రన్‌ మిషన్‌ నేతృత్వంలో శిక్షణ పొందిన 14 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో వారంతా రన్‌ మిషన్‌ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి చెందిన ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగి కంది హేమంత్‌ రన్‌ మిషన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతీ, యువకులకు పట్టణంలోని జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా శిక్షణ తీసుకున్న యువతలో తాజాగా విడుదలైన కానిస్టేబుల్‌ ఫలితాల్లో 14 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సివిల్‌ విభాగంలో ఐదుగురు, ఏపీఎస్‌పీ విభాగంలో 9 మంది ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. రన్‌మిషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు లభిస్తుండడంతో వ్యవస్థాపకుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Mahabubabad

  • ఆదాయం
    శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025

    8లోu

    మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రైతులు అధికంగా సరుకులు తీసుకొస్తే స్థలం సరిపోవడం లేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన వాహనాలను మార్కెట్‌ బయటనే ఉంచి, మరుసటి రోజు లోనికి అనుమతిస్తున్నారు. ఆదాయం ఉన్నప్పటికీ.. వసతులు కల్పన, అభివృద్ధి లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    సరుకులు అధికంగా వస్తే అంతే సంగతులు..

    దశాబ్దాల క్రితం 9.30 ఎకరాల స్థలంలో మార్కెట్‌ నిర్మాణం చేపట్టారు. కాగా గత వార్షిక సంవత్సరంలో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 6,96,373 బస్తాల క్రయవిక్రయాలు జరిగాయి. 5వేల బస్తాల నిల్వ సామర్థ్యం కలిగిన మార్కెట్‌ యార్డులో సీజన్‌ సమయంలో 25 వేల బస్తాల నుంచి 30 వేల బస్తాల వరకు వస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణం సరిపోకపోవడంతో సరుకులు అధికంగా వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా యి. చిన్నపాటి వర్షం వస్తే కూడా రైతులు తమ సరుకులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. కాగా ప్రభుత్వం 25 నుంచి 30 ఎకరాల భూమిని కేటాయిస్తే వ్యవసాయ మార్కెట్‌ కా ర్యకలాపాలు సాఫీగా సాగుతాయి.

    లక్ష్యానికి మించి ఆదాయం..

    వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరుతోంది. గత వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.7.94 కోట్లు లక్ష్యం కాగా రూ.8.65 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఏటా ఇదే విధంగా అధిక ఆ దాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనుల్లో మాత్రం వెనకడుగు వేస్తున్నారు.

    సిబ్బంది కొరతతో ఇబ్బందులు..

    వ్యవసాయ మార్కెట్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం 14 పోస్టులకుగాను ప్రస్తుతం సెక్రటరీ, సూపర్‌ వైజర్‌, ఇద్దరు ఏఎంఎస్‌ పనిచేస్తుండగా ఐదు అటెండర్‌, టైపిస్టు, ఏఎంఎస్‌, ఎల్‌డీసీ, అసిస్టెంట్‌ సెక్రటరీ, వాచ్‌మెన్‌ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. 25మంది సెక్యూరిటీ గార్డులు అవసరం ఉండగా ప్రస్తుతం ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఆరుగురు మహిళలు, 12 మంది పురుషులు విధులు నిర్వహిస్తుండగా.. ఏడు సెక్యూరిటీగార్డు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్కెట్‌లో క్రయవిక్రయాలన్నీ ఇ–నామ్‌ పద్ధతిలో కొనసాగుతుండగా ఆన్‌లైన్‌ తక్‌ పట్టీలు, పేమెంట్‌ ఇంటిగ్రేషన్‌ పనులను ఇద్దరు డీఈఓలు మాత్రమే చేపడుతుండగా.. డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత వేధిస్తోంది.

    ట్రెజరీలో రూ.12 కోట్ల నిల్వ..

    వ్యవసాయ మార్కెట్‌ ట్రెజరీలో రూ.12 కోట్ల మేరకు నిల్వ ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బులతోనైనా మార్కెట్‌ ప్రాంగణంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు అనుసంధానంగా రెండువైపులా 18 షాపింగ్‌ కాంప్లెక్స్‌ షెటర్లు ఉండగా వాటిల్లో వ్యాపారస్తులు తక్కువ మంది మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిగతా షెటర్లన్నీ కూడా అద్దెకు ఇచ్చినప్పటికీ అవి కూడా అరకొర అద్దెలతో నిర్వహణ కొనసాగుతోంది. వాటికి టెండర్లు ఖరారు చేయడంలో సంబంధిత పాలకమండలి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    శిఽథిలావస్థకు చేరిన ఏఎంసీ కార్యాలయ భవనం

    న్యూస్‌రీల్‌

    మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో

    సమస్యల తిష్ట

    అధికంగా సరుకులు వస్తే సరిపోని స్థలం

    శిథిలావస్థలో కార్యాలయాల భవనాలు

    వసతులు లేక రైతన్నల ఇబ్బందులు

    శిఽథిలావస్థలో భవనాలు..

    వ్యవసాయ మార్కెట్‌ కార్యకలాపాలు నిర్వహించే భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ భవనం పక్కనే ఉన్న మార్కెట్‌ షాపింగ్‌ కాంప్లెక్‌ భవనంలో వ్యవసాయ మార్కెట్‌ పాలక వర్గం, అధికారులు, సిబ్బంది తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు శిథిలావస్థ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాల్సి ఉంది. అలాగే రైతుల అవసరాల నిమిత్తం మరో నూతన కవర్‌ షెడ్డు నిర్మించాల్సి ఉంది. రెండు విశ్రాంతి భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రైతులు, హమాలీలు, దడవాయిలకు నిలువ నీడ కరువైంది.

  • నేడు

    మహబూబాబాద్‌: జిలాలో పలు కార్యక్రమాలు వందశాతం పూర్తి చేసినందుకు కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ శనివారం అవార్డు అందుకో నున్నారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌ అధి కారులు వివరాలు తెలిపారు. 2024 జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో నిర్వహించిన సంపూర్ణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మొదటి త్రైమాసికం ఏఎన్‌సీలో గర్భిణులు వందశాతం నమోదయ్యారు. అలాగే బ్లాక్‌లో డయాబెటిస్‌ పరీక్షలు వందశాతం నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని గంగారం మండలం ఆరు పారామీటర్లతో ఉత్త మ ప్రతిభకనబర్చి ఐదు సంతృప్త సూచికలు సాధించినందుకు రాష్ట్రస్థాయిలో నీతి ఆయోగ్‌ కలెక్టర్‌కు సిల్వర్‌ మెడల్‌ ప్రకటించింది. ఈమేరకు నేడు హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

    బాలల హక్కులను కాపాడాలి

    మహబూబాబాద్‌ రూరల్‌: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ విజయవంతం కావడంతో ఎస్పీ శుక్రవారం మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ 11వ విడతలో జిల్లా వ్యాప్తంగా 40 మంది బాలబాలికలను గుర్తించామన్నారు. తెలంగాణ నుంచి 23 మంది బాలురు, ముగ్గురు బాలికలు, ఇతర రాష్ట్రాల నుంచి 13 మంది బాలురు, ఒక బాలిక ఉందన్నారు. 40 మందిలో ఆరుగురు బాలురు, ఒక బాలికను తల్లిదండ్రులకు అప్పగించామని, 30 మంది బాలురు, ముగ్గురు బాలికలను షెల్టర్‌ హోంలకు పంపించమన్నారు. జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 20 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఎస్పీ అభినందించారు.

    విద్యార్థులపై

    నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

    మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని వసతి గృహాల్లోని విద్యార్థులపై ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఎం. నరసింహస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వార్డెన్లు, నాలుగో తరగతి సిబ్బందికి వ్యక్తిగత పరిశుభ్రత, భోజనంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహస్వామి మాట్లాడుతూ.. పిల్లలకు భోజనం తయారు చేయడంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దన్నారు. అనంతరం వైద్యుడు కొప్పు ప్రసాద్‌, మెడికల్‌ ఆఫీసర్‌ మౌనిక మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్లు, విద్యార్థుల గదులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

    కార్యాచరణ పక్కాగా

    అమలు చేయాలి

    తొర్రూరు: వందరోజుల కార్యాచరణను పక్కాగా అమలు చేయాలని సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌ నారాయణరావు అన్నారు. స్థానిక మున్సిపాలిటీలో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ తీరును శుక్రవారం పర్యవేక్షించారు. ప్లాస్టిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం, హరితహారం తది తర అంశాలపై ఆరా తీశారు. అమృత్‌ పథ కం కింద నిర్మిస్తున్న నీటి ట్యాంకును పరిశీలించారు. కమిషనర్‌ వక్కల శ్యాంసుందర్‌తో కలిసి సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. సీ జనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పను లు సక్రమంగా చేపట్టాలన్నారు. చెత్తను వేరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నర్సరీల్లోని మొక్కలు నాటేందుకు స్థలాలు ఎంచుకోవాలన్నారు. సెప్టెంబర్‌ 9వరకు 100 రోజుల కార్యాచరణ కొనసాగించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చెత్తను వేరు చేయడం, పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఈ రంజిత్‌కుమార్‌, మేనేజర్‌ స్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ ఉన్నారు.

  • ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి

    చిన్నగూడూరు: ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల చదువుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌, ఉగ్గంపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలను పెంచి, అబార్షన్‌లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రతీ ఇంటికి తిరిగి ఆరోగ్య సర్వే నిర్వహించి, వివరాలు సేకరించాలన్నారు. ఇన్‌పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌ వివరాల రిజిస్టర్లను పరిశీలించి, పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, ఆహారం తదితర అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరీక్షించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, హాజరుశాతం గణనీయంగా పెరిగినందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సంపత్‌కుమార్‌, ఎంపీడీఓ యాకయ్య, ఎంపీఓ రజని, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం రెహమాన్‌, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.

    అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

  • పదేళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేసిచూపాం

    కొత్తగూడ: పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయలేని పనులు రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేసి చూపిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటాయి క్రాస్‌రోడ్డు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు స్వలాభం కోసం తాత్కాలిక పనులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో సకాలంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డులు ఇచ్చిందని, మళ్లీ ఇప్పుడు సీంఎ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జారీ చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్రం మొండి చేయి చూపినా కొత్తగూడ మండలానికి సరిపోను సరఫరా అయ్యే విధంగా చూస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు కావాలని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎంపికై న వారు వెంటనే ఇంటి పనులు ప్రారంభించాలని సూచించారు. కొత్తగూడ, గంగారం మండలాలకు ఇప్పటికే వెయ్యి ఇళ్లు మంజూరయ్యాయని, మరో 200ఇళ్ల మంజూరు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గుంజేడు ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీతక్క ఆలయ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

    పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క

  • స్కూళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ షురూ

    జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషి యల్‌ అటెండెన్స్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉమ్మడి వరంగ ల్‌ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) వి డుదల చేశారు. వరంగల్‌–8, హనుమకొండ–16, మహబూబాబాద్‌–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్‌ ఫోన్‌లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్‌ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్‌లో వేర్వేరుగా అటెండెన్స్‌ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్‌ అటెండెన్స్‌ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్‌ ఫేషియల్‌ అటెండెన్స్‌ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్‌ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్‌ తర్వాత ఫొ టో అప్‌లోడ్‌ అయ్యేందు కు అరగంట సమ యం పట్టిందని పలువు రు ఉ పాధ్యాయులు తెలిపా రు. సాంకేతిక సమస్య ఇ లాగే కొనసాగితే అటెండె న్స్‌ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.

    ఉమ్మడి జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు వివరాలు..

    జిల్లా పాఠశాలలు టీచర్లు మొదటిరోజు రిజిస్ట్రేషన్‌ శాతం ర్యాంకు

    వరంగల్‌ 534 3,211 2,085 64.93 08

    హనుమకొండ 472 2,987 1,883 63.04 16

    మహబూబాబాద్‌ 768 3,859 2,231 57.81 26

    జనగామ 459 2,773 1,572 56.69 27

    ములుగు 337 1,557 832 53.44 29

    జేఎస్‌.భూపాలపల్లి 414 1,927 901 46.76 33

  • పంట మార్పిడి విధానంతో రైతులకు మేలు

    మహబూబాబాద్‌ రూరల్‌: రైతులు పంట మార్పిడి విధానాన్ని అలవర్చుకోవాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని డీఏఓ ఎం.విజయనిర్మల అన్నారు. ఐసీఏఆర్‌, ఐఐఎంఆర్‌ షెడ్యూల్డ్‌ తెగల ఉప ప్రణాళిక ఆర్థిక సహకారంతో మహబూబాబాద్‌ మండలంలోని మల్యాల జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యాన రైతులకు శిక్షణ ఏర్పాటు చేసి ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ముందుగా కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ముద్రించిన మిరప పంటలో నల్ల తామర పురుగుల సమగ్ర యాజమాన్యం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయనిర్మల మాట్లాడుతూ.. ఎరువుల వాడకం తగ్గించి, సహజ వ్యవసాయాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ.. ఆయిల్‌ పామ్‌ పంట సాగు విధానం, ప్రభుత్వ సబ్సిడీ వివరాలు, పంటతో వచ్చే లాభాల గురించి రైతులకు వివరించారు. రైతులు ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలని తెలిపారు. జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అధిపతి కత్తుల నాగరాజు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ క్రాంతికుమార్‌, శాస్త్రవేత్త ప్రశాంత్‌ మాట్లాడారు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులను సాధించిన పలువురు రైతులను శాస్త్రవేత్తలు, అధికారులు సన్మానించారు. సమావేశంలో కేవీకే శాస్త్రవేత్త సుహాసిని, మల్యాల ఉద్యాన కళాశాల టీచింగ్‌ అసోసియేట్స్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌, డాక్టర్‌ అశోక్‌, రైతులు పాల్గొన్నారు.

    డీఏఓ ఎం.విజయనిర్మల

  • ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి

    హన్మకొండ కల్చరల్‌ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్‌కు శుక్రవారం బెస్ట్‌ లిరిక్స్‌ కేటగిరిలో నేషనల్‌ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్‌ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.

    ఎంతో సంతోషంగా ఉంది..

    నేషనల్‌ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్‌ సంగీతంపాటు మంగ్లీ, రామ్‌ మిర్యాల వాయిస్‌లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాట రూపంలో రాశా. –కాసర్ల శ్యామ్‌, పాటల రచయిత

    జిల్లావాసి కాసర్ల శ్యామ్‌కు నేషనల్‌ అవార్డు

    ఉత్తమ లిరిక్‌రైటర్‌గా గుర్తింపు

    హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

  • పిల్లలకు తల్లిపాలు మాత్రమే తాగించాలి

    నెహ్రూసెంటర్‌: అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరు నెలల పిల్లలకు తల్లిపాలు మాత్రమే తాగించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. కాన్పు జరిగిన కొద్ది రోజుల పాటు తల్లిపాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయని, ముర్రుపాలలో ప్రొటీన్లు, రోగ నిరోధనశక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డకు సంజీవని వంటిదని, అమృతంతో సమానమన్నారు. ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం అత్యంత ప్రయోజనకరమన్నారు.

    సబ్‌ సెంటర్‌ ఆకస్మిక తనిఖీ

    నర్సింహులపేట: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌ను శుక్రవారం డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు, సీజనల్‌ జ్వరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవన్నా రు. తండాలు, కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

  • సాంకేతిక పురోభివృద్ధి..

    టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న టీజీ ఎన్పీడీసీఎల్‌

    హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ మండలి (టీజీఎన్పీడీసీఎల్‌) సాంకేతిక పురోభివృద్ధిలో దూసుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా దిశగా పరుగులు పెడుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీగా కర్నాటి వరుణ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రధానంగా బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన వరుణ్‌ రెడ్డి టెక్నాలజీలో తన అనుభవాన్ని జోడిస్తూ ఆన్‌లైన్‌ సేవలను వినయోగదారుల ముందుకు తీసుకొచ్చారు. ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా కంపెనీలో టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. 17 జిల్లాల పరిధి కలిగి ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్‌ 72.35 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్‌లో ప్రవేశపెట్టిన టెక్నాలజీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

    సైది.. సైఫీ..

    సిస్టమ్‌ ఆవరేజ్‌ ఇంటరప్షన్‌ డ్యూరేషన్‌ ఇండెక్స్‌ (సైది) అనగా వినియోగదారులకు ఎదురయ్యే సగటు అంతరాయ వ్యవధిని, సిస్టమ్‌ ఆవరేజ్‌ ఇంటరప్షన్‌ ఫ్రిక్వెన్షీ ఇండెక్స్‌ (సైఫీ) అనగా సగటు అంతరాయాల సంఖ్యని విద్యుత్‌ అంతరాయాలకు కొలమానంగా తీర్చిద్దిదడం. సగటున వినియోగదారుడికి ఎన్ని సార్లు జరిగిన అంతరాయంపై రియల్‌ టైం డేటాను క్రోడీకరించి వాస్తవ గణాంకాల ఆధారంగా విశదీకరించి అంతరాయాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకుని అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకొచ్చారు. సైది, సైఫీ ద్వారా తరచూ విద్యుత్‌ అంతరాయాలు జరిగే ఫీడర్లపై దృష్టి సారించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

    హైపర్‌..

    ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించిన సమయంలో అతి తక్కువ సమయంలో విద్యుత్‌ పునరుద్ధరణ చేపట్టడానికి ‘హైపర్‌’ అనే కార్యాచరణను రూపొందించారు. ఉద్యోగులు పని చేసే చోట నివాసముండి, సిబ్బంది, సామగ్రిని సమీకరించుకోవడం, సమాచార సేకరణ చేరవేయడం, పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా విద్యుత్‌ సరఫరాను వేగంగా పునరుద్ధరించడం హైపర్‌ ఉద్దేశం.

    ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్ల ఏర్పాటు

    వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణం చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటెనెన్స్‌, ఇతరత్రా ఏదేని కారణాలతో ఒక లైన్‌లో సమస్య ఉత్పన్నమైతే మరో లైన్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ లైన్లు వేశారు. ప్రధానంగా 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల మధ్య ఈ ఇంటర్‌ లింక్‌ లైన్లు వేశారు. ఫలితంగా ఒక సబ్‌ స్టేషన్‌లో సమస్య ఉంటే మరో సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అవుతుంది.

    రియల్‌టైం మానిటరింగ్‌ సిస్టమ్‌..

    వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌ అందించడానికి రియల్‌ టైం ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టం ఎంతో దోహదపడుతుంది. ఇందులో రియల్‌ టైంలో కచ్చితమైన సమాచారం పొందడం ద్వారా వేగంగా చర్యలు చేపట్టొచ్చు. ఫీడర్ల పర్యవేక్షణ, త్వరితగతిన ప్రతిస్పందించడం ద్వారా అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి. రియల్‌ టైంలో విద్యుత్‌ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్‌ సిబ్బందికి అందించి అతి తక్కువ సమయంలో సరఫరాను పునరుద్ధరించడం దీని ద్వారా సాధ్యం.

    ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లు..

    విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లలో తలెత్తే సాంకేతిక లోపాలు వెంటనే తెలుసుకునేందుకు పొడవాటి విద్యుత్‌ లైన్లలో ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ లైన్‌లో లోపం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం వెళ్తుంది. లోపం ఏ ప్రాంతంలో తలెత్తిందో స్పష్టంగా తెలియడం ద్వారా వేగంగా ఆ లోపాన్ని సరిచేసి తక్కువ సమయంలో విద్యుత్‌ను పునరుద్ధరిస్తారు. దీని ద్వారా విద్యుత్‌ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చు.

    ఇ–స్టోర్‌..

    పేపర్‌ విధానంలో మెటీరియల్‌ విడుదలకు ఆలస్యమవుతుండడంతో ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఇ–స్టోర్‌ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో సంబంధిత సెక్షన్‌ ఏఈ పనికి కావాల్సిన మెటీరియల్‌ స్టాక్‌ ఉందో సాఫ్ట్‌వేర్‌లో పరిశీలిస్తారు. అవసరమైన స్టాక్‌ను రిజర్వ్‌ చేసుకుంటాడు. రిజర్వ్‌ చేసుకున్న మెటీరియల్‌ తాలూకు సమాచారం సంబంధిత ఏడీఈకి, తర్వాత స్టోర్స్‌కు ఆన్‌లైన్‌ ద్వారా వెళ్తుంది. మెటీరియల్‌ స్వీకరించే అధికారికి ఏ రోజు మెటీరియల్‌ విడుదల చేస్తారో ఆ తేదీని, సమయాన్ని ఎస్‌ఎంఎస్‌, సాప్‌ మెయిల్‌ రూపంలో సమాచారం చేరవేస్తారు. దీంతో నిర్ణీత సమయానికి స్టోర్స్‌కు చేరుకుని మెటీరియల్‌ తీసుకుంటారు. తద్వారా అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరముండదు. సమయం ఆదా అవుతుంది. వ్యయప్రయాసలు తగ్గుతాయి.

    వినియోగదారులకు మెరుగైన

    సేవలందించడమే లక్ష్యంగా ముందుకు

    అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా దిశగా పరుగులు..

    వాట్సాప్‌ చాట్‌బాట్‌

    విద్యుత్‌ వినియోగదారులు తమ సమస్యలు అధికారులకు తెలియజేసేందుకు యాజమాన్యం వాట్సాప్‌ చాట్‌ బాట్‌ను తీసుకొచ్చింది. ఇందులో ముందు వినియోగదారులు తమ మొబైల్‌ నుంచి వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు చాట్‌ చేయగానే అందులో రిజిస్టర్‌ కంప్లైంట్‌, ట్రాక్‌ కంప్లైంట్‌, చాట్‌ విత్‌ ఏజెంట్‌ అని వస్తుంది. అందులో రిజిస్టర్‌ కంప్లైంట్‌ ఎంటర్‌ చేయగానే విత్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌, విత్‌ అవుట్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌, ప్రీవియస్‌ మెను వస్తుంది. ఇలా విత్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే వినియోగదారుడి సర్వీస్‌ వివరాలు వస్తాయి. ఈ వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్‌కు సంబంధించిన వివిధ రకాలు మెనులో కనపిస్తాయి. ఇందులో కంప్లైంట్‌కు సంబంధించి సబ్‌ టైప్‌ లేదా చాట్‌ విత్‌ ఏజెంట్‌ వస్తుంది. ఇలా ఏజెంట్‌తో చాట్‌ చేయొచ్చు లేదా కంప్లైంట్‌ నమోదు చేయొచ్చు.

    ఎల్‌సీ యాప్‌..

    విద్యుత్‌ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఎల్‌సీ యాప్‌ను ప్రవేశపెట్టారు. మరమ్మతుల సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసేందుకు, పునరుద్ధరణకు సమాచారం ఇచ్చేందుకు ఎల్‌సీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్‌సీయాప్‌ ద్వారా మానవతప్పిదాలకు అవకాశముండదు. తద్వారా విద్యుత్‌ ప్రమాదాలు తగ్గుతాయి.

  • 34 రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు

    కాజీపేట రూరల్‌ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్‌ మీదుగా ప్రయాణించే చర్లపల్లి–పట్నా ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు.

    పొడిగింపు రైళ్ల వివరాలు..

    ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 29వ తేదీ వరకు పట్నా–చర్లపల్లి (03253) పట్నా ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ సోమ, బుధవారాల్లో 17 రైళ్ల సర్వీస్‌లు, ఆగస్టు 6వ తేదీ నుంచి ఆక్టోబర్‌ 1వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07255) పట్నా ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ బుధవారం 9 రైళ్ల సర్వీస్‌లు, ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 26వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07256) పట్నా ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ శుక్రవారం 8 రైళ్ల సర్వీస్‌లను పొడిగించి నడిపిస్తున్నట్లు తెలిపారు.

    హాల్టింగ్‌ స్టేషన్లు..

    కాజీపేట మీదుగా చర్లపల్లి–పట్నా అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో ప్రయాణించే రైళ్ల సర్వీస్‌లకు సికింద్రాబాద్‌, కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బల్హార్షా, నాగ్‌పూర్‌, గోండియా, దుర్గ్‌, రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, జర్సుగూడ, రూర్కెలా, హథియా, రాంచీ, బొకారో స్టీల్‌ సిటీ, గోమ్‌, కోడేమా, గయా, జెహన్‌బాద్‌ స్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించారు. ఈ రైళ్లకు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌ అండ్‌ జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌ల సౌకర్యం కల్పించారు.

  • విద్య

    వెంకటాపురం(కె): విద్యుదాఘాతంతో ఓ జీపీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం బీసీ మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బీసీ మర్రిగూడెం గ్రామపంచాయతీ కార్మికుడు విజయ్‌(33) శుక్రవారం శాంతినగర్‌లోని ప్రభుత్వ పాఠశాలో ఫ్యాన్‌ బిగిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన గ్రామస్తులు విజయ్‌ను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    కుటుంబ కలహాలతో

    వ్యక్తి ఆత్మహత్య

    జఫర్‌గఢ్‌: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తీగారంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రామ్‌చరణ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముక్కమాల భిక్షపతి (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల వరి నారు విక్రయించిన విషయంలో దంపతుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో భిక్షపతి అప్పటి నుంచి వ్యవసాయ బావి వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన భిక్షపతి.. శుక్రవారం వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్‌చరణ్‌ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

    కిడ్నాపర్ల కోసం

    ఒడిశాకు పోలీసు బృందం

    గీసుకొండ : మండలంలోని ధర్మారం బస్టాండ్‌ సమీపంలో గురువారం సాయంత్రం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులోని కై టెక్స్‌ కంపెనీలో పని చేస్తున్న వివాహిత రింకిమల్లి కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు ముందు రెక్కీ నిర్వహించి ప్లాన్‌తో సదరు వివాహితను కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. కారులో వచ్చి కిడ్నాప్‌ చేసిన అనంతరం దుండగులు నర్సంపేట వైపునకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కిడ్నాప్‌నకు పాల్పడి వారు సదరు వివాహితభర్తతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులే అని పోలీసులు నిర్ధారించారు. వారి ఆచూకీ కోసం ఎస్సై కూడిన పోలీసు బృందాన్ని శుక్రవారం ప్రత్యేకంగా ఒడిశాకు పంపించినట్లు గీసుకొండ సీఐ మహేందర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. రింకిమల్లి విషయంలో కై టెక్స్‌ కంపెనీ ప్రతినిధులు ఆమె ఆచూకీ కోసం పలుమార్లు సెల్‌ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా ఆమె వారితో మాట్లాడి తన భర్తే తనను తీసుకుని వెళ్తున్నాడని, ఇందులో కిడ్నాప్‌ ఏమీ లేదని రింకిమల్లి బదులిచ్చినట్లు సమాచారం. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

  • నైపుణ

    ఖిలా వరంగల్‌: పోలీసులు విధి నిర్వహణతోపాటు నైపుణాలను పెంపొందించుకుంటేనే శాఖాపరమైన గుర్తింపు లభిస్తుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. వరంగల్‌ మామునూరు పోలీస్‌ శిక్షణ కళాశాల పరేడ్‌ గ్రౌండ్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌లో భాగంగా శుక్రవారం రెండో రోజు జరిగిన పోటీలను సీపీ ప్రారంభించి మాట్లాడారు. పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత లభిస్తుందన్నారు. పోలీసుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయన్నారు. శనివారం సాయంత్రం 5గంటల ముగింపు వేడుకలు జరగనున్నాయని, ముఖ్యఅతిఽథిగా డీజీపీ జితేందర్‌తోపాటు విశిష్ట అతిథిగా జైళ్ల విభాగం డీజీపీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా హాజరవుతున్నట్లు తెలిపారు. కాగా, డ్యూటీ మీట్‌ విజయవంతానికి కృషి చేస్తున్న అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులను సీపీ అభినందించారు.

    ఉత్కంఠగా కొనసాగుతున్న పోటీలు..

    రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. నువ్వా? నేనా అన్నట్లు విజయం కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బాంబ్‌ డిస్పోజల్‌, పోలీస్‌ జాగిలాలకు సంబంధించి నాలుగు విభాగాలు,కంప్యూటర్‌, వీడియో గ్రఫీ, సైంటిఫిక్‌ ఎయిడ్‌ విభాగాల్లో పోటీలు జరిగాయి.

    మోహన్‌ కృష్ణకు బంగారు పతకం..

    రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పీఆర్‌ఓ మన్నవ మోహన కృష్ణ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ విభాగంలో బంగారు పతకం సాధించారు. కాగా, ఆయనను సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ అభినందించారు.

    ఆటా..పాట

    డ్యూటీమీట్‌లో భాగంగా సాయంత్రం విందు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీపీ తన సహచరులతో కలిసి పా టలకు స్టెప్పులేసి అందరినీ అలరించారు.

    పోటీలతో మానసిక ఒత్తిడి దూరం

    వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌సింగ్‌

  • చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగిం

    ఖిలా వరంగల్‌ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్‌ ఏనుమాముల పోలీస్‌ స్టేషన్‌ పరిధి బాలాజీ నగర్‌లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రితేష్‌ సింగ్‌ ఠాకూర్‌ అలియాస్‌ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్‌ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్‌క్రీమ్‌ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్‌ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్‌, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్‌ క్రీమ్‌ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్‌ సింగ్‌ ఇద్దరు ఉత్తర్‌ ప్రదేశ్‌ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్‌ సింగ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్‌కు మార్చాడు. మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్‌ సింగ్‌ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్‌ సింగ్‌.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్‌పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ జే.సురేశ్‌ తెలిపారు.

    భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

    వివాహేతర సంబంధమే కారణం

    ఏనుమాముల బాలాజీనగర్‌లో ఘటన

  • బీసీల్లో సామాజిక విప్లవం వస్తుంది

    కేయూ క్యాంపస్‌ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పాలకులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని, ఆ వాటా సాధించుకునేందుకు బీసీల్లో సామాజిక విప్లవం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ పూలే ఆశయ సాధన సమితి (పాస్‌), నేషనల్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీసీడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యకేంద్రంలో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్స్‌ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రసాధన తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు న్యాయం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామన్నారు. ఆ పార్టీ బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉపక్రమించిందన్నారు. అయితే బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం మూడునెలలుగా ఆమోదించకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ బీజేపీ తోడుదొంగలేనన్నారు. బీఆర్‌ఎస్‌కు బీసీలపై ప్రేమ ఉంటే కరీంనగర్‌లో 8న జరగబోయే బీఆర్‌ఎస్‌ బీసీ శంఖారావం సభకు ముందు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎన్‌బీసీడబ్లూఏ బాధ్యుడు చలమల్లా వెంకటేశ్వర్లు, ‘పాస్‌’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ సంగనిమల్లేశ్వర్‌, రాష్ట్ర ఉద్యమకారులవేదిక చైర్మన్‌ కె. వెంకటనారాయాణ, ‘కుర్తా’ జనరల్‌ సెక్రటరీ వడ్డెరవీందర్‌, ‘పాస్‌’ జిల్లా అధ్యక్షుడు శాస్త్రి, వివిధ సంఘాల బాధ్యులు బాబుయాదవ్‌, చందా మల్ల య్య, గడ్డం కృష్ణ, ఆకుతోట శ్రీనివాస్‌, తిరునహరిశేషు, తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సదస్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాలని సదస్సు తీర్మానించింది. ఆ లేఖను రాష్ట్రపతికి ట్విటర్‌ ద్వారా పంపినట్లు సంగని మల్లేశ్వర్‌ తెలిపారు.

    బీసీ సంక్షేమ సంఘం జాతీయ

    అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

  • రైల్వేస్టేషన్లలో మెరుగైన వసతులు

    డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌

    మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రయాణికుల అవసరాల మేరకు రైల్వే స్టేషన్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ గోపాలకృష్ణన్‌ అన్నారు. అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకున్న డీఆర్‌ఎం.. నిర్మాణ పనులు పరిశీలించి గడువులోగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

    డీఆర్‌ఎంను కలిసిన ఎమ్మెల్యే..

    మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో కొత్త బజారు వైపున నాలుగో ప్లాట్‌ ఫామ్‌ నిర్మించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌.. డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌ను కోరారు. అలాగే, రైల్వే స్టేషన్‌లో మౌలిక వసతులు కల్పించాలని, రైల్వే మెయింటెనెన్స్‌ వర్క్‌ షాపుతో పాటు గ్రాండ్‌ ట్రంక్‌, ఏపీ, తమిళనాడు, వందేభారత్‌, ఎల్‌టీటీ, గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను ఆపాలని, అండర్‌ పాస్‌ నిర్మించాలని కోరారు. అలాగే, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఫరీద్‌, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, ఇస్లాహే మాషిరా అధ్యక్షుడు ఎక్బాల్‌ కూడా డీఆర్‌ఎంను కలిసి మానుకోట రైల్వే స్టేషన్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.

    రైల్వే స్టేషన్‌ తనిఖీ..

    డోర్నకల్‌: డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ గోపాలకృష్ణన్‌ తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో డోర్నకల్‌ చేరుకున్న డీఆర్‌ఎం రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేశారు. అనంతరం గూడ్స్‌ యార్డులోని సీ అండ్‌ డబ్ల్యూ డిపోను తనిఖీ చేశారు. డీఆర్‌యూసీసీ సభ్యులు ఖాదర్‌, వర్తక సంఘం ప్రముఖులు కాలా మహేందర్‌జైన్‌ తదితరులు రద్దయిన ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని, పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు డోర్నకల్‌లో హాల్ట్‌ కల్పించాలని కోరుతూ డీఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు.

  • హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష

    వరంగల్‌ లీగల్‌ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమైపె కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్‌ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్‌ ఉన్నవ్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం ఊకల్‌కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్‌ ఊకల్‌కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్‌ 7న ఊకల్‌కు వచ్చిన అనిల్‌ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్‌.. పార్వతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్‌ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్‌ ఉన్నవ్‌ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్‌ అధికారులు ఎస్‌.శ్రీనివాస్‌, ఆర్‌.సంతోష్‌ పరిశోధించగా లైజన్‌ ఆఫీసర్‌ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్‌ సోమనాయక్‌, కానిస్టేబుల్‌ అనిల్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

    హన్మకొండ: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుంటే ఇప్పటికై నా రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు అని, కాంగ్రెస్‌ నాయకులు వక్రభాష్యం పలుకుతున్నారని విమర్శించారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంపై గౌరవం ఉంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు స్పీకర్‌ పెండింగ్‌లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తెలిపిందన్నారు. స్పీకర్‌కు నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమాంతర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, నాయకులు జోరిక రమేశ్‌, తాళ్లపల్లి జనార్దన్‌ గౌడ్‌, పులి రజినీకాంత్‌, రవీందర్‌ రావు, నయీముద్దీన్‌, బండి రజినీకుమార్‌, పోలెపల్లి రామ్మూర్తి, బొల్లికొండ వీరేందర్‌, బుద్దె వెంకన్న, మూటిక రాజు, రమేశ్‌, శ్రీకాంత్‌ చారి, మహేందర్‌, సతీశ్‌, దేవమ్మ, గౌస్‌ఖాన్‌, జేకే పాల్గొన్నారు.

    ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు

  • రామప్ప నుంచి  లక్నవరానికి నీటి కాల్వ

    గోవిందరావుపేట: రామప్ప నుంచి లక్నవరం వరకు నీటి కాల్వ ఏర్పాటు చేస్తామని, తద్వారా రైతులకు ఏడాదిలో రెండు పంటలకూ నీరు అందే అవకాశం ఉంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని లక్నవరం సరస్సు నీటిని కలెక్టర్‌ దివాకర టీఎస్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణితో కలిసి పంట కాల్వ లకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి వనరుల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధికి కాకతీయులు చెరువులు తవ్వించి సాగు, తాగునీరు అందించేవారన్నారు. వారి స్ఫూర్తితోనే గ్రామీణాభివృద్ధికి ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు. చెరువులో నీరు ఉంటే గ్రామం పచ్చగా ఉంటుందని, అదే స్ఫూర్తితో రైతులకు నీటి కొరత లేకుండా పని చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమం కోసం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఈ నారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

    తద్వారా రెండు పంటలకూ సాగు నీరు

    ● రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క

Karnataka

  • శాంతిభద్రతలు లేవు: విపక్ష నేత

    ఈ దుర్ఘటనపై బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేదానికి ఇదే నిదర్శనం అని ట్వీట్‌ చేశారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. హోంమంత్రి పరమేశ్వర్‌.. మీ శాఖ మేలుకోవడానికి ఇంకా ఎంతమంది బలి కావాలి, ఇలాంటి దుర్ఘటనలు ఇంకా ఎన్ని జరగాలి అని ఆయన దుయ్యబట్టారు. మైకు దొరికితే చాలు జాతీయ అంతర్జాతీయ , ప్రపంచంలోని అన్ని విషయాలపై ఉపదేశంచేసే మహామేధావి, కలబుర్గి జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి ప్రియాంక్‌ఖర్గేకు తమ జిల్లాల్లో సంభవిస్తున్న రైతుల ఆత్మహత్యలు కనబడటంలేదా అని ప్రశ్నించారు.

    బనశంకరి: సిలికాన్‌ సిటీలో ఘోరం సంభవించింది. బాలుడు ట్యూషన్‌ ముగించుకుని ఇంటికి వెళుతుండగా దుండగులు కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. దీంతో బాలుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘోరం రాజధాని అంతటా తీవ్ర సంచలనం కలిగించింది. బుధవారం రాత్రి కిడ్నాపైతే గురువారం రాత్రి మృతదేహం లభించింది. ఆ తర్వాత నేరస్తులపై కాల్పులు జరిగాయి.

    డ్రైవరే కుట్ర చేసి..

    ● అరకెరె శాంతినికేతన్‌ లేఔట్‌లో బాలుడు నిశ్చిత్‌ (13) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. క్రైస్ట్‌ స్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్నాడు.

    ● నిశ్చిత్‌ తండ్రి అచ్యుత్‌ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అచ్యుత్‌ వద్ద గురుమూర్తి అదనపు డ్రైవర్‌గా ఉండేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు డబ్బు కోసం నిశ్చిత్‌ను కిడ్నాప్‌ చేయాలని కుట్ర పన్నాడు.

    ● బాలుడు జూలై 30న బుధవారం సాయంత్రం ట్యూషన్‌ ముగించుకుని 7:30 కు సైకిల్‌లో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో గురుమూర్తి, గోపాలకృష్ణ తదితరులు బాలునికి మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేశారు. మీ నాన్న చెప్పాడు అని బాలున్ని దుండుగుడు బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తేలింది. ఆ సీసీ కెమెరా దృశ్యాలు లభించాయి.

    ● ట్యూషన్‌ ముగిసి ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల గాలించి రాత్రి 10 గంటలకు హుళిమావు ఠాణాలో ఫిర్యాదు చేశారు.

    రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తాం

    అంతలో బాలుని తండ్రికి కిడ్నాపర్లు ఫోన్‌ చేసి కుమారున్ని ప్రాణాలతో చూడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇస్తామని వారు ఒప్పుకున్నారు. హుళిమావు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు తీవ్రం చేశారు. ఓ పార్కు వద్ద బాలుని సైకిల్‌ దొరికింది. మరోవైపు పోలీసులకు దొరికిపోతామనుకున్న కిడ్నాపర్లు బాలుడు నిశ్చిత్‌ని బన్నేరుఘట్ట రోడ్డులో చెట్ల మధ్యలో గొంతు కోసి చంపి, ముఖం గుర్తు పట్టకుండా పెట్రోల్‌పోసి నిప్పుపెట్టినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది.

    రూ. 5 లక్షలు డిమాండ్‌

    ఇస్తామన్న తల్లిదండ్రులు

    అంతలోనే హత్య చేసి నిప్పు

    దుండగులపై పోలీసుల కాల్పులు, అరెస్టు

    24 గంటల తరువాత..

    గురువారం రాత్రి బన్నేరుఘట్ట రోడ్డు సమీపంలో చెట్లలో బాలుని మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు తెలిపారు. అర్ధరాత్రి కగ్గలిపుర రోడ్డులో దుండగులు దాగిఉన్నట్లు తెలిసి హుళిమావు పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. దుండగులు మరణాయుధాలతో దాడికి దిగారు. దీంతో సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ అరవింద్‌కుమార్‌ కాల్పులు జరపగా గురుమూర్తికి రెండుకాళ్లు, గోపాలకృష్ణ కు కాలికి బుల్లెట్‌ తగిలి కూప్పకూలిపోయారు. పోలీసులు వారిని పట్టుకుని విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు ఈ హత్యోదంతంలో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనాస్థలిని ఎలక్ట్రానిక్‌సిటీ డీసీపీ నారాయణ్‌, రూరల్‌ ఎస్పీ సీకే బాబా పరిశీలించారు.

  • టీసీఎ

    శివాజీనగర: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ పెద్ద స్థాయిలో ఐటీ ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. టీసీఎస్‌ 12 వేల మంది ఉద్యోగులను తీసేస్తోందనే వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆ సంస్థను కోరినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ లాడ్‌ తెలిపారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, టీసీఎస్‌తో లేఆఫ్‌కు కారణాలపై సమాలోచన జరుపుతామన్నారు. గత ఐదేళ్లుగా సన్‌రైజ్‌ పేరిట అనేక సంస్థలకు కార్మిక చట్టాల నుంచి మినహాయింపులు ఇచ్చాం, కంపెనీలు ఎవరినైనా ఉద్యోగాల నుంచి తొలగిస్తే మాకు ఆ సమాచారం ఇవ్వాలి. ఎందుకు, ఏమిటి అనేది మాట్లాడుతామని మంత్రి తెలిపారు.

    నవంబరులో బీబీఎంపీ ఎన్నికలు!

    బనశంకరి: నవంబరులో బీబీఎంపీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. బీబీఎంపీ ఎన్నికల పిటిషన్‌ సోమవారం విచారణకు రానుండడంతో అంతలోగా లిఖితపూర్వకంగా వివరాలు అందించాలని ధర్మాసనం సర్కారు తరఫు న్యాయవాదులకు ఆదేశించింది. బీబీఎంపీ వార్డుల విభజన, సరిహద్దులు, రిజర్వేషన్‌ ప్రక్రియ, ఓటర్ల జాబితా సిద్ధం చేయడం తదితర ప్రక్రియలు ఉన్నట్లు కోర్టుకు వివరించారు. నవంబరులోగా పూర్తి ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తిచేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బెంగళూరు పాలికెకు ఎన్నికలు జరగలేదు.

    ఆరడుగుల కోసం ఆక్రోశం

    చింతామణి: రంగేనహళ్లిలో ఆరడుగుల కోసం రగడ ఏర్పడింది. పూర్వం నుంచి గ్రామస్తులు చనిపోతే గ్రామ శివార్లలోని సర్వే నంబరు 8 స్థలంలోని స్మశానంలో పూడ్చేవారు. అయితే ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని, మృతదేహాలను పూడ్చరాదని హెచ్చరించారు. శుక్రవారం తాలూకాలోని రంగేనహళ్లిలో చెందిన కొండప్ప (60) అనే వృద్దుడు అనారోగ్యంతో మరణించాడు. బంధువులు అంత్యక్రియల కోసం తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. గత్యంతరం లేక న్యాయం చేయాలని శవాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళన చేశారు. తహశీల్దార్‌ సూచనతో సర్వే సిబ్బంది అక్కడ సర్వే చేపట్టారు. ఇంతలో మరోచోట అంత్యక్రియల్ని పూర్తిచేశారు.

    కంఠీరవ సహోదరి కన్నుమూత

    మైసూరు: కన్నడ కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ సహోదరి నాగమ్మ శుక్రవారం చామరాజనగర జిల్లా సరిహద్దులో ఉన్న తాళవాడి సమీపంలోని గాజనూరులోని నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు, వయోభారంతో బాధపడుతోంది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి. వెంటనే రాజ్‌కుమార్‌ తనయుల కుటుంబాలు గాజనూరుకు బయలుదేరాయి. నాలుగేళ్ల కిందట రాజ్‌కుమార్‌ చిన్నకుమారుడు పునీత్‌ మరణించడం తెలిసిందే. ఆ విషయాన్ని ఇప్పటికీ నాగమ్మకు చెప్పలేదు. పునీత్‌ అంటే నాగమ్మకు ఎంతో ఇష్టం. పునీత్‌ తరచూ ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించేవాడు. పునీత్‌ లేడని తెలిస్తే నాగమ్మ భరించలేదని అప్పటినుంచి ఆమెకు తెలియకుండా ఉంచారు. చివరికి పునీత్‌ మరణ వార్త తెలియకుండానే నాగమ్మ మరణించడం గమనార్హం.

  • 15 ను

    దొడ్డబళ్లాపురం: రాజధానిలో నమ్మ మెట్రో త్వరలో ఎల్లో లైన్‌లో రైలు సంచారం ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్‌ సిటీ ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేసే 19.15 కిలోమీటర్ల ఆర్‌వీ రోడ్డు– బొమ్మసంద్ర ఎల్లో లైన్‌లో, ఆ రూట్‌లోని అన్ని మెట్రో స్టేషన్‌లలో జూలైలో ప్రయాణ భద్రతా తనిఖీలు పూర్తయ్యాయి. సక్రమంగా ఉన్నాయంటూ అనుమతులు లభించాయి. ఆగస్టు 15న రైలు సంచారం మొదలయ్యే అవకాశముంది. గత మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ప్రతి 20 నిమిషాలకు ఒక మెట్రో రైలు సంచరిస్తుంది. సెప్టెంబరు నుంచి సర్వీసులు పెరుగుతాయి. ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్రకు వయా సిల్క్‌ బోర్డు జంక్షన్‌, ఎలక్ట్రానిక్‌ సిటీ ద్వారా మెట్రో సర్వీసుల వల్ల దక్షిణ బెంగళూరులో ప్రయాణ వసతి మెరుగవుతుంది.

    అమ్మోనియా లీకై అస్వస్థత

    యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బైకంపాడి పారిశ్రామికవాడలో చేపల ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా వాయువు లీక్‌ అయింది. దీనితో 25 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం కార్మికులు పనిలో ఉండగా ట్యాంకు నుంచి వాయువు లీకై ంది. వాయువును పీల్చడంతో కళ్లు తిరిగి పడిపోయారు. ఏడు మంది కార్మికులు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. నలుగురికి వైద్యం చేసి పంపించారు.

    వ్యాపారులకు నోటీసులు

    శివాజీనగర: వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది రిజిస్టర్డ్‌ చిరు వ్యాపారులకు నోటీసులు జారీచేసింది. ఇందులో పాలు, కూరగాయలు, చిరుతిండ్లు, హోటళ్ల వ్యాపారులు ఉన్నారు. నోటీసుల్లో పన్ను డిమాండ్‌ లేదని, జీఎస్టీ ఖాతా రిజిస్ట్రేషన్‌ చేసువాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. ను పొందేందుకు కోరడమైనది. వ్యాపారుల ఖాతాల్లో యూపీఐ లావాదేవీల మొత్తాలను పరిశీలించి నోటీసులు ఇవ్వడం గమనార్హం.

    మిమ్స్‌ కబ్జాలను

    తొలగించాలి

    మండ్య: మిమ్స్‌ ఆస్పత్రి స్థలంలోని తమిళ కాలనీతో పాటు 24 ఎకరాలకు పైగా ఉన్న స్థలంలో ఆక్రమణలను తొలగించడం లేదని, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహించిందని కర్ణాటక రక్షణ వేదిక, కరునాడ సేవకర సంఘం కార్యకర్తలు ఆరోపించాయి. ఆస్పత్రికి చెందిన స్థలాన్ని తమిళ కాలనీవాసులతో పాటు పలువురు ప్రముఖులు కబ్జా చేశారని కరునాడ సేవకర సంఘం నేత ఎంబీ నాగణ్ణగౌడ అన్నారు. ఈ స్థలాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించాలని గత నెల 1న కన్నడ సంఘాలు, రైతు సంఘాలు బైక్‌ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. పోరాటానికి తలొగ్గిన జిల్లాధికారి, ఉప విభాగాధికారి, తహసీల్దార్‌, నగరసభ కమిషనర్‌ ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామని ఒప్పుకున్నారన్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. వెంటనే ఆక్రమణలు తొలగించకుంటే ఈనెల 15 నుంచి రెండో దశ పోరాటం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో నిరసనకారులు బైఠాయించి నిరసన తెలిపారు.

  • అధిక లాభాలంటూ రూ.30 లక్షలు మస్కా

    మైసూరు: మైసూరు నగరంలో మరో రెండు సైబర్‌ మోసాలు బయటపడ్డాయి. షేరు మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు గడించవచ్చని ఆశపడిన ఓ వ్యక్తి రూ.30 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. మైసూరులోని రాఘవేంద్రనగర నివాసికి ఓ యువతి ఫోన్‌ చేసి తన పేరు లావణ్య అని పరిచయం చేసుకుంది. షేర్ల వ్యాపారం చేస్తున్నామని, మీరు డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆశ పెట్టింది. ఆమె మాయమాటలను నమ్మిన బాధితుడు తన ఖాతా, తల్లి, స్నేహితుల ఖాతాల నుంచి దశల వారీగా రూ.30 లక్షలను పెట్టుబడి పెట్టాడు. అయితే ఎలాంటి లాభం అందక పోగా అసలు కూడా కోల్పోయినట్లు గ్రహించిన బాధితుడు సరస్వతీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    డిజిటల్‌ అరెస్టు చేసి రూ.7.25 లక్షలు..

    ముంబై పోలీసులమని చెప్పి మైసూరుకు చెందిన ఓ వ్యక్తిని బెదిరించిన దుండగులు రూ.7.25 లక్షలను మోసగించారు. మైసూరులోని కువెంపునగర నివాసికి ముంబై పోలీసుల పేరిట ఫోన్‌ చేసిన దుండగులు మీరు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు, మీపై చర్యలు తీసుకుంటున్నామని డిజిటల్‌ అరెస్టు చేశారు. మీ ఖాతాలో ఉన్న డబ్బులను కొంతకాలం పాటు తాము చెప్పిన ఖాతాకు బదలాయిస్తే పరిశీలించి తరువాత వాపస్‌ చేస్తామని నమ్మబలికారు. దీంతో తన ఖాతాలో ఉన్న రూ.7.25 లక్షలను బదిలీ చేసి మోసపోయాడు. సైబర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    సింబాలిక్‌ పోటో

    మైసూరులో ఆన్‌లైన్‌ నేరాలు

  • తీర్థయాత్ర విషాదమయం

    హోసూరు: తిరువణ్ణామలై యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు చనిపోగా, ఐదు మందికి గాయాలేర్పడిన ఘటన గురువారం సాయంత్రం క్రిష్ణగిరి సమీపంలో జరిగింది. వివరాల మేరకు బెంగళూరుకు చెందిన వెంకటస్వామిరెడ్డి (56), భార్య మమత (55), కుమారుడు అనిల్‌ (28), బంధువులు రమేష్‌ (60) భార్య గిరిజ (50), కూతురు మౌల్యాతో కలిసి తిరువణ్ణామలైలోని ఆలయానికెళ్లి స్వామివారిని దర్శించుకొన్నారు. గురువారం సాయంత్రం బెంగళూరుకు బయల్దేరారు. క్రిష్ణగిరి– హోసూరు హైవేలో కురుబరపల్లి సమీపంలో కారు అదుపుతప్పి పల్లంలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మమత, గిరిజా తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్‌ ఆనేకల్‌వాసి మంజునాథ్‌ (45)తో పాటు వెంకటస్వామిరెడ్డి, రమేష్‌, అనిల్‌, మౌల్య తీవ్ర గాయాలకు గురయ్యారు. గమనించిన స్థానికులు, కురుబరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను హోసూరు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వారి వారి బంధువులు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

    కారు పల్టీ, ఇద్దరు మహిళల మృతి

  • ధర్మస్థలలో తీవ్ర గాలింపు

    శివాజీనగర: ధర్మస్థల పుణ్యక్షేత్రంలో నేత్రావతి నదీ తీరంలో వందలాది మృతదేహాలను పాతిపెట్టిన కేసులో సిట్‌ అధికారులు, స్థానిక పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 8వ పాయింట్‌లో అన్వేషణను ముగించారు. కొత్తగా పురోగతి ఏమీ లేదని సమాచారం. 13వ స్థలంలో వందలాది శవాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదుదారు చెబుతున్నాడు. 7 పాయింట్లలో పూర్తి చేయగా 6వ పాయింట్‌లో అస్థిపంజరం అవశేషాలు లభించాయి. శుక్రవారం 7వ పాయింట్‌లో శోధించగా కర్చీఫ్‌ దొరికినట్లు తెలిసింది. తరువాత 8వ పాయింట్‌లో కూలీలు, మినీ జేసీబీ ద్వారా తవ్వకాలు ప్రారంభించారు.

    మీడియాపై ఆంక్షలు రద్దు

    ధర్మస్థల నేర విచారణ గురించి హైకోర్టు అతి ప్రాముఖ్యమైన తీర్పునిచ్చింది. ఈ కేసులో మీడియాపై విధించిన ఆంక్షలను రద్దు చేసింది. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్‌ పలు మీడియా సంస్థల విరుద్ధంగా గ్యాగ్‌ ఉత్తర్వులను తీసుకొచ్చారు. శుక్రవారం ఈ నిబంధనలను ప్రశ్నిస్తూ హైకోర్టుకు దక్షిణ కన్నడకు చెందిన కుడ్ల ర్యాంపేజ్‌ సంపాదకుడు అజయ్‌ సమర్పించిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న విచారణ జరిపారు. మీడియాపై ఉన్న ప్రతిబంధకాదేశాన్ని రద్దుచేశారు.

    8వ పాయింట్‌లో తవ్వకాలు

  • కోర్టు తీర్పును గౌరవించాలి

    మండ్య: న్యాయస్థానం ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో తీర్పు గురించి మాజీ ఎంపీ సుమలత స్పందించారు. శుక్రవారం మండ్యలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాట్లాడేందుకు ఇంకేమీ లేదని, దోషి అని తేల్చడంతో అంతా ముగిసిందని అన్నారు. ఇక ఏ శిక్ష పడుతుందో చూడడమేనని అన్నారు. తనను కొందరు ఆన్‌లైన్‌ ట్రోల్‌, అసభ్యపదజాలంతో దూషించడం కొత్తేమీ కాదని, ఐదారేళ్ల నుంచి ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సామజిక మాధ్యమాల్లో జరిగిన ట్రోలింగ్‌పై కేఆర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు, ఇప్పటివరకు చర్యలు లేవని వాపోయారు. ఆరోపణలు చేయడం అందరికీ చాలా సులభమని, నిరూపితం చేయాలంటే చాలా కష్టమని అన్నారు.

  • కందీల

    సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించగా, కందీలు సినిమా అత్యుత్తమ ప్రాంతీయ కన్నడ చలనచిత్రంగా ఎంపికైంది. ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో అత్యుత్తమ కన్నడ సినిమా అవార్డును యశోధ ప్రకాశ్‌ దర్శకత్వం వహించిన ‘కందీలు– ది రే ఆఫ్‌ హోప్‌’ గెలుచుకుంది. ఇది గ్రామీణ ఇతివృత్తం కలిగిన సినిమా. ఒక రైతు, ఆయన కుటుంబం చుట్టూ అల్లిన సున్నితమైన కథ.

    మడికెరికి చెందిన యశోద ప్రకాశ్‌ ఈ సినిమాకు దర్శకురాలు. ఈ సినిమా 29వ కోల్‌కతా చిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. యశోద కొడవ భాషలో మూడు, కన్నడలో ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ స్క్రిప్టుగా మైసూరుకు చెందిన చిదానంద నాయక్‌ దర్శకత్వం వహించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో’ ఎంపికై ంది. గతంలో ఈ సినిమా ప్రతిష్టాత్మక కేన్స్‌ చిత్రోత్సవంలో అవార్డును అందుకుంది.

  • ఘనంగా అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన

    శ్రీనివాసపురం : పట్టణ సమీపంలోని పుంగనూరు క్రాస్‌లో నూతనంగా ఏర్పాటు చేసినఅభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. లోకకళ్యాణ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ వైఏ నారాయణస్వామి హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షించే ఉద్దేశంతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను విరివిగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఆలయాన్ని రూ.15 కోట్లతో నిర్మిస్తుండగా ఇప్పటికే రూ. 10 కోట్ల మేర పనులు ముగిశాయన్నారు. ప్రతిష్టాపనా పూజా కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది.

  • ఉత్తమ విద్యార్థులకు సత్కారం

    రాయచూరు రూరల్‌ : విద్యార్థుల ప్రతిభకు ప్రదర్శనలు తార్కాణం కావాలని కేఈబీ పాఠఽశాల హెడ్‌మాస్టర్‌ హీరాలాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం మాదర చెన్నయ్య సభా భవనంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. సమాజ సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. స్వార్థం వదిలి నిస్వార్థంతో పని చేయాలన్నారు. విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి స్వశక్తితో ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో సంతోష్‌, రావుత్‌ రావ్‌, వీరేశ్‌, మారెప్ప, లోకేష్‌, మౌనేష్‌లున్నారు.

  • బళ్లా

    బళ్లారిఅర్బన్‌: బళ్లారి జిల్లాకు ఎప్పటి నుంచో దేశ, విదేశాల్లో గుర్తింపు ఉందంటే అందుకు పలు రకాల కారణాలు ఉన్నాయి. ప్రముఖంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హంపీ ద్వారా బళ్లారి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. అయితే చాలా సంవత్సరాల నుంచి హంపీతో పాటు బళ్లారి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అందుకు బళ్లారి జిల్లాలో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేపథ్యం, ఇనుప ఖనిజ నిల్వలు తదితరాలతో బళ్లారి ఖ్యాతి దశ, దిశలా వ్యాపించిందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగస్టు 2వ తేదీన జన్మించిన బసప్ప అనే వ్యక్తి తర్వాత బళ్లారిలో స్థిరపడి బళ్లారి రాఘవగా తన పేరును రూపాంతరం చేసుకుని బళ్లారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అలాంటి గొప్ప వ్యక్తి 145వ జయంతి వేడుకలు శనివారం బళ్లారిలోని రాఘవ కళామందిరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

    ఆయన చరిత్రను ఒకసారి తిలకిస్తే..

    అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో 1880లో కన్నడాంధ్ర ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ జన్మించారు. పుట్టింది తాడిపత్రిలో అయితే పెరిగింది, పేరు ప్రఖ్యాతులు గడించింది బళ్లారిలోనే. విద్యార్థి దశ నుంచి నాటక రంగంపై ఆసక్తి పెంచుకుని బళ్లారి రాఘవ దేశ, విదేశాల్లో వివిధ పాత్రల్లో తన నటనాశైలితో ప్రపంచంలోనే వివిధ దేశాల్లో గుర్తింపు తెచ్చుకుని బళ్లారికి పేరు తెచ్చిన మహానటుడిగా నిలిచారు. నాట్యకళాప్రపూర్ణగా, విశ్వవిఖ్యాత నటుడుగా, నాటక రంగం ద్వారానే తన అపూర్వ ప్రతిభను కనబరిచి నాటకాలకే వన్నే తెచ్చారు బళ్లారి రాఘవ. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలన్నింటిలోనూ నటించిన ఘనత బళ్లారి రాఘవ స్వంతం. హరిశ్చంద్రుడు, హిరణ్య కశిపుడు, బాహుకుడు, యమధర్మరాజు, దుర్యోధనుడు, దశరథుడు, భరతుడు, రావణుడు, కీచకుడు, అర్జునుడు, చాణుక్యుడు, రాజరాజు, రామదాసు తదితర పాత్రలలో నాటకాల్లో తన అపార ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు రాఘవ.

    అపార ప్రతిభతో పాత్రలకు వన్నె

    ఆయన కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ తదితర భాషల్లో అపారమైన ప్రతిభతో నాటకాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. భక్త ప్రహ్లాద నాటకంలో హిరణ్యకశిపుడు పాత్ర పోషించి, సాక్షాత్తూ హిరణ్యకశిపుడే వచ్చారనే విధంగా ఆయన నటించేవారు. బళ్లారి రాఘవ వృత్తి రీత్యా లాయర్‌. ఆయన న్యాయవాద వత్తితో పాటు చిన్నప్పటి నుంచి పుణికి పుచ్చుకున్న నాటక రంగం ద్వారానే అపారమైన పేరు గడించారు. ఆయనకు పేరుతో పాటు ఆయన పుట్టి, పెరిగిన అటు తాడిపత్రికి, ఇటు బళ్లారికి పేరు వచ్చిందంటే అందులో బళ్లారి రాఘవ నటనా వైభవం కూడా దాగి ఉంది. బళ్లారి రాఘవ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. నాట్య కళాప్రపూర్ణగా బిరుదాంకితుడైన బళ్లారి రాఘవ రంగస్థల నటుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

    నేడు బళ్లారి రాఘవ 145వ జయంతి

    బళ్లారి రాఘవ 145వ జయంతి సందర్భంగా రాఘవ కళా మందిరంలో ఈ నెల 2న బళ్లారి రాఘవ రాజ్య ప్రశస్తికి కన్నడ కళాకారుడు బెంగళూరుకు చెందిన డింగ్రి నాగరాజ్‌ ఎంపికయ్యారు. ధార్వాడకు చెందిన కళా సంఘం సంస్థ ఆధ్వర్యంలో వీరేష్‌ బళగాలపేట్‌ రచించిన సమరసింహ సంగొళ్లి రాయణ్ణ అనే కన్నడ ఐతిహాసిక నాటకాన్ని ప్రభు హంచనాళ్‌ దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నెల 3న తెలుగు రాష్ట్ర ప్రశస్తి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన గుమ్మడి గోపాలకృష్ణ ఎంపికయ్యారు. శ్రీ రామన్‌ ఫౌండేషన్‌, శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ బృందంచే విజయవాడ సంస్కార భారతి అధ్యక్షుడు డాక్టర్‌ పీవీఎస్‌.కృష్ణ రచించిన జయహో చత్రఫతి శివాజీ మహారాజ్‌ అనే చారిత్రక తెలుగు నాటకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

  • యువత

    రాయచూరు రూరల్‌ : యువత దురలవాట్లకు బానిస కారాదని తహసీల్దార్‌ సురేష్‌వర్మ పిలుపు ఇచ్చారు. శుక్రవారం ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలలో జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో మహంత స్వామి జన్మదినం సందర్భంగా ఇలకల్‌ మహంత శివయోగి చేపట్టిన మద్యపాన వ్యసనం నుంచి విముక్తి కోసం చేసిన పోరాటం గురించి వివరించారు. యువత సన్మార్గం వైపు నడవాలని, మన భారతీయ సంస్కృతి, ఆచార, విచారాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. వార్త శాఖాధికారి గవిసిద్దప్ప, డాక్టర్‌ మనోహర్‌ పత్తార్‌, బాబూరావ్‌ శేగుణశి, ప్రకాష్‌లున్నారు.

    దేవదుర్గలో టోల్‌గేట్లు తొలగించండి

    రాయచూరు రూరల్‌ : జిల్లాలోని లింగసూగూరు తాలూకా తింథిణి వంతెన నుంచి దేవదుర్గ తాలూకా కాకరగల్‌ మధ్య ఏర్పాటు చేసిన రెండు టోల్‌గేట్లను తొలగించాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరియమ్మ నాయక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం బెంగళూరు వికాససౌధలో ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్‌ జార్కిహోళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. కేషిప్‌ ఆధ్వర్యంలో రూ.46 కోట్లతో రహదారి పనులు నాసిరకంగా చేపట్టారన్నారు. వ్యవసాయ కూలీ కార్మికులు అధికంగా పనులకు వెళ్లే వారి నుంచి టోల్‌ వసూలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినా మంత్రి అంగీకరించలేదు. దీంతో ఆమె కన్నీరు పెట్టారు. సమావేశంలో శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌, ఎమ్మెల్సీ వసంత్‌ కుమార్‌లున్నారు.

    విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై రైల్వే క్లర్క్‌ సస్పెండ్‌

    ఫోన్‌లో మాట్లాడుతూ రైలు టిక్కెట్‌ ఇవ్వడానికి సతాయించిన వైనం

    హుబ్లీ: ప్రభుత్వ విధి దైవ విధి అనే నానుడి ఉంది. ప్రభుత్వ పని దొరకడం అంత సులభం కాదు. అయినా ఇక్కడ ఓ రైల్వే క్లర్క్‌ ఫోన్‌లో బాతాఖానీ కొడుతూ ప్రయాణికులకు టిక్కెట్‌ ఇవ్వడానికి సతాయించాడు. సదరు వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ ఉద్యోగి తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. యాదగిరి రైల్వే స్టేషన్‌లో టిక్కెట్‌ ఇష్యూయింగ్‌ క్లర్క్‌గా పని చేస్తున్న వ్యక్తి విధి నిర్వహణ వేళ ఫోన్‌లో మాట్లాడుతూ టిక్కెట్‌ ఇవ్వడంలో ఆలస్యం చేస్తూ ప్రయాణికులను వేధించాడు. ఎంతో పొడవు ఉన్న క్యూలైన్‌లో నిలబడిన ప్రయాణికులకు టిక్కెట్‌ ఇవ్వకుండా ఫోన్‌లో మాట్లాడటంలో మునిగి పోయాడు. ఓ ప్రయాణికుడు ఈ విషయమై గొడవకు దిగాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

    నేడు కళస ఎగ్జిబిషన్‌ ప్రారంభం

    సాక్షి బళ్లారి: నగరంలోని రాయల్‌ఫోర్ట్‌ హోటల్‌లో కళస ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు శ్వేషాన్‌ తెలిపారు. ఈనెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు రాయల్‌ఫోర్టు హోటల్‌లో కళస ఫైన్‌ జ్యూవెలరీలో బంగారం, డైమండ్‌, జాడో ఎగ్జిబిషన్‌లో అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ఇక్కడ ఎలాంటి తరుగు, మేకింగ్‌ చార్జీలు లేకుండా ఇతర బంగారం షాపుల్లో దొరికిన ధర కన్నా తక్కువ ధరకే నాణ్యమైన, నమ్మకమైన బంగారం అమ్మకాలు జరుగుతాయని, నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టంగా చూస్తారని, వారి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా కళస ఫైన్‌ జ్యూవెలరీ నిర్వహిస్తున్నామన్నారు. నగర వాసులు బంగారం కొనే ఆసక్తి గలవారు ఎగ్జిబిషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

  • ఎస్సీ

    బళ్లారిటౌన్‌: ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్‌ కల్పించాలని మాదిగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నగరంలో దళిత సంఘాల నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రాయల్‌ సర్కిల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లాధికారి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు వినతిపత్రాన్ని సమర్పించారు. నేతలు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీ వర్గాలకు వర్గీకరణ, రిజర్వేషన్‌ కల్పించాలని చెప్పిన ఆదేశాలు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలైనా కర్ణాటకలో మాత్రం కాలయాపన జరుగుతోందన్నారు. తమ కోటా రిజర్వేషన్లు ఇతర వర్గాల పాలవుతున్నాయని, ముఖ్యంగా మాదిగ సంక్షేమం కోసమే నాడు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అయితే ఇందులో 101 ఇతర వర్గాలు చేరడంతో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. సమాఖ్య నేతలు రాజేష్‌, దానప్ప, కెంచప్ప, మారెణ్ణ, మునిస్వామి, హనుమంతప్ప, కృష్ణ, నారాయణ స్వామి, కొండయ్య, హులుగప్ప, దేవ, మధు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

    అంతర్గత రిజర్వేషన్ల కోసం ర్యాలీ

    హొసపేటె: ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్త నిరసనకు ఇచ్చిన పిలుపు నేపథ్యంతో శుక్రవారం మాదిగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. సమాజ నేత వీరస్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గాల్లో అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ఆగస్టు 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాధికారుల కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఏడాది అయినా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన విధానాన్ని అనుసరిస్తోందన్నారు. రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోక పోతే కర్ణాటక బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌లలో అంతర్గత రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అయితే కర్ణాటకలో అనవసర జాప్యం జరుగుతోందన్నారు. అంతర్గత రిజర్వేషన్లను సత్వరం అమలు చేయకుంటే పోరాటం అనివార్యమని ఆయన అన్నారు. సమాజ నేతలు భరత్‌కుమార్‌, ఉమాపతి పాల్గొన్నారు.

    మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలి

    రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించడం లేదని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి సంచాలకుడు రవీంద్ర జాలదార్‌ ఆరోపించారు. శుక్రవారం అంబేడ్కర్‌ సర్కిల్‌లో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ను వర్గీకరణకు పలువురు నేతలు అడ్డు పడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం వర్గీకరణను అమలు చేసిందన్నారు. నాగమోహన్‌ దాస్‌ నివేదికలో లోపాలను సవరించాలన్నారు. అది ద్రావిడ, కర్ణాటక పేరుతో ఉన్న ఉపకులాలపై సమీక్ష జరపాలన్నారు. మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణకు ఏ పార్టీ నాయకులు మద్దతివ్వడం లేదన్నారు. దళితుల ఓట్ల కోసం వర్గీకరణపై ద్వంద్వ వైఖరిని వీడాలన్నారు. రాజు, యల్లప్ప, తిమ్మప్ప, శంశాలం, సతీష్‌, విరుపాక్షి, భీమయ్య, అంజినేయ్య, నాగరాజ్‌, రవికుమార్‌లున్నారు.

  • అనైతి

    హొసపేటె: నాగ పంచమి రోజున ఓ భార్య తన అనైతిక సంబంధాన్ని వ్యతిరేకించిన భర్తను తన ప్రియుడి ద్వారా చంపించిన ఘటన వెలుగు చూసింది. వివరాలు.. ద్యామన్న హత్యకు గురైన భర్త. నిందితుడు, లారీ డ్రైవర్‌ అయిన ప్రియుడు శ్యామన్న కొప్పళ తాలూకాలోని కామనూరు నివాసి. నేత్రావతి, శ్యామన్న ఒకే గ్రామానికి చెందినవారు. నేత్రావతికి బూదగుంప గ్రామానికి చెందిన ద్యామన్నతో వివాహమైంది. భర్త తమ అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించడంతో ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఆ మేరకు గతనెల 25న బూదగుంప సమీపంలోని గ్యారేజ్‌ నుంచి ఇనుప రాడ్‌ని తెచ్చిన శ్యామన్న మాయమాటలతో అతనిని తన సొంత పొలానికి పిలుచుకెళ్లి అక్కడ ఇనుప రాడ్‌తో ద్యామన్నను కొట్టి చంపాడు. ఆపై మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. హత్య తర్వాత ఇనుప రాడ్‌ను తిరిగి ఇచ్చేశాడు. తన భర్త చనిపోగా నేత్రావతి ఇంట్లో నాగపంచమి పండుగ చేసుకుంది. హత్య తర్వాత తన భర్త ధర్మస్థలకు వెళ్లాడని ఆమె తమ కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పింది. ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ చేసి 5 రోజులు ఇంట్లోనే ఉంది. ఇంతలో ద్యామన్న సోదరులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మునిరాబాద్‌ పోలీసులు తమదైన శైలిలో చేపట్టిన విచారణలో నేత్రావతి తన భర్తను ప్రియుడు శ్యామన్నతో కలిసి హత్య చేయించిన విషయంపై నోరు విప్పింది. హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు నిందితులు నేత్రావతి, శ్యామన్నలను అరెస్టు చేశారు.

    ప్రియుడితో కలిసి భర్తను

    చంపించిన భార్య

  • 5న ఆర్టీసీ ఉద్యోగుల   నిరవధిక సమ్మె

    హొసపేటె: ఆర్టీసీ ఉద్యోగుల వివిధ డిమాండ్లను తీర్చాలని ఒత్తిడి చేస్తూ హొసపేటె డివిజన్‌లోని ఆర్టీసీ ట్రేడ్‌ యూనియన్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతృత్వంలో ఈనెల 5న నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్‌ జీ.శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని పత్రికా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ల ఆర్థిక బలాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతనాలను సవరించే వ్యవస్థ అమలులో ఉందన్నారు. కానీ ప్రభుత్వం 2024 నుంచి జీతాలను సవరించలేదు. అంతేకాకుండా 38 నెలల బకాయి డబ్బులను నిలిపేసింది. ఆర్టీసీ ఉద్యోగులు వీధుల్లోకి దిగి పోరాడాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ఒత్తిడి లేదా బెదిరింపులకు మేం తలొగ్గం. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు మేం ఎట్టి పరిస్థితుల్లోను సమ్మెను విరమించబోమని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్‌ వాహన డ్రైవర్లు సహా వివిధ సంస్థలు సమ్మెకు మద్దతు ఇచ్చాయి. ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులకు గైర్హాజరవుతారు. ఆ రోజు ఆర్టీసీ బస్సులేవీ రోడ్డుపై తిరగవు. అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాయకులు వీకే.హిరేమట్‌, పీ.రాజశేఖర్‌, నిర్మల్‌కుమార్‌, అబ్దుల్‌ రెహమాన్‌ సాబ్‌, మహిద్‌ బాషా, హోలి బసప్ప, యూ.సోమశేఖర్‌, శేఖరప్ప గులాటి తదితరులు పాల్గొన్నారు.

  • ఉరకలె

    రాయచూరు రూరల్‌: గత కొన్ని రోజులుగా పశ్చిమ కనుమలు, మహారాష్ట్రలోని నదీ పరివాహక ప్రాంతంలో అధికంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. కృష్ణా నదీ తీరంలోని విజయపుర, బాగల్‌కోటె జిల్లాల్లోని ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి డ్యాంలో 518.30 మీటర్ల మేర నీరు నిల్వ చేరాయి. 2 లక్ష క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా, 1.60 లక్షల క్యూసెక్కుల నీరు ఔట్‌ ఫ్లో రూపంలో బయటకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిప్పాణి తాలూకా బోజ, కున్నూర వద్ద గల వేదగంగా నదిపై కడకోళ వద్ద నిర్మించిన వంతెన, లింగసూగూరు తాలూకా శీలహళ్లి వంతెనతో పాటు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటక ప్రాంతాల్లో సుమారు 50 వంతెనలు నీట మునిగాయి. యాదగిరి జిల్లాలో భీమా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భీమా నది ప్రవాహంతో కడగోలు ఆంజనేయ ఆలయం వరద నీటిలో మునిగి పోయింది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్‌కోటె, విజయపుర, యాదగిరి, రాయచూరు జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • సకాల సేవల్లో  విజయనగర జిల్లా ప్రథమం

    హొసపేటె: జూలై– 2025లో సకాలలో పని తీరు పరంగా రాష్ట్రంలోనే విజయనగర జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. ఈ విషయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లాధికారి దివాకర్‌ ప్రశంసించారు. ప్రస్తుతం విజయనగర జిల్లాలో ప్రజలకు సకాలలో సేవలను అందించడానికి ప్రజల నుంచి మొత్తం 85,978 దరఖాస్తులు అందగా, వాటిలో మొత్తం 84,904 దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించారు. 98.75 శాతం సకాలలో పరిష్కార రేటును కొనసాగించారు. నిర్ణీత వ్యవధిలో ప్రజా సేవలను పరిష్కరించిన అధికారుల సేవలను జిల్లాధికారి కొనియాడారు. భవిష్యత్తుల్లో కూడా అదే వ్యవధిలో అన్ని ప్రజా సేవలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారు.

    కరియప్ప సేవలు స్ఫూర్తిదాయకం

    హుబ్లీ: శివాజీ అన్న జోళిగె ద్వారా లక్ష్మేదశ్వరలో ప్రతి రోజూ వందలాది మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్న నీలప్ప కుడ్డప్ప శిరహట్టి సేవా సంస్థ నిర్వాహకులు కరియప్ప, సునంద దంపతుల సమాజ సేవ అందరికీ స్ఫూర్తిదాయకం అని హెస్కాం చైర్మన్‌ అజ్జంపీర్‌ ఖాద్రి అన్నారు. ఆయన సంబంధిత పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. జంట నగరాలలో ఫుట్‌పాత్‌ మీద ఉన్న నిరాశ్రయులకు పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఈ పుణ్య దంపతులు ప్రస్తుతం లక్ష్మేదశ్వర కేంద్రంగా సంస్థను ప్రారంభించడం హర్షనీయం అన్నారు. నాగరాజు, హెచ్‌వీ బళెగార, రామన్న, విలేకరులు సోమన్న, గాళప్ప, అల్తాఫ్‌, కేఈబీ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

National

  • సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్‌’ నూతన డైరెక్టర్‌గా ఈఎస్‌ పద్మకుమార్‌ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా బదిలీ కావడంతో బెంగళూరులోని ఇస్రో ఇనర్షియల్‌ సిస్టమ్‌ యూనిట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈఎస్‌ పద్మకుమార్‌ను షార్‌ నూతన డైరెక్టర్‌గా నియమించారు. 

    పద్మకుమార్‌ బెంగళూరు ఐఐఎస్సీలో సిస్టం సైన్స్‌ అండ్‌ ఆటోమేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి, 1996లో ఇస్రోలో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆయన ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం3, ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగ వాహనాలతో పాటు మార్స్‌ ఆర్బిటార్‌ మిషన్, చంద్రయాన్, ఆదిత్య ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించారు.  

Dr B R Ambedkar Konaseema

  • సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర రాజధానిని లక్ష ఎకరాల్లో నిర్మిస్తామంటున్నారని, అంత భూమి అవసరమా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చింతా మోహన్‌ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌లలో వెయ్యి ఎకరాలతో రాజధాని నిర్మించారన్నారు. రైతుల భూములు లక్ష ఎకరాలు ఎందుకు సేకరించాలని, వారి పొట్ట ఎందుకు కొట్టాలని నిలదీశారు. 50 అంతస్తుల భవనాలు నిర్మించాలని చంద్రబాబు అంటున్నారని, కృష్ణా తీరంలో అన్ని అంతస్తులతో భవనాల నిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు కడతామంటున్నారని, వర్షం కురిస్తే ఆ ప్రాంతం ముంపునకు గురవుతోందని, అప్పుడు నీటిలో నడిపే విమానాలు తీసుకొస్తారా అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం రాజధాని పూర్తి చేస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి చాలా చిన్న వయస్సు నుంచే తనకు తెలుసన్నారు. ఆయన తల్లిదండ్రులు కూడా తనకు తెలుసని, మిథున్‌రెడ్డి అరెస్టు చాలా బాధాకరమని మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డి చిన్న బిడ్డ అని, రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు పాలన గురించి ఎంతో ఊహించానని, కానీ, ఆయన పాలన వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఇప్పటి వరకూ అప్పులు చేయడానికే మాత్రమే చంద్రబాబు చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఏ మేలూ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు పచ్చచొక్కా కనిపిస్తే సెల్యూట్‌ కొడుతున్నారని, మిగిలిన వారిని శత్రువులుగా చూస్తున్నారు ఇది సరికాదని మోహన్‌ అన్నారు.

    ఫ చంద్రబాబు పాలన ఈవిధంగా

    ఉంటుందని ఊహించలేదు

    ఫ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌

    కాంగ్రెస్‌ నాయకుడు చింతా మోహన్‌

  • మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా యూనియన్‌ ఎన్నిక

    అమలాపురం టౌన్‌: జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు స్థానిక యూటీఎఫ్‌ హోమ్‌లో శుక్రవారం సమావేశమై జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌ సీహెచ్‌ లోవలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా యూనియన్‌ గౌరవాధ్యక్షురాలిగా కె.కృష్ణవేణి, అధ్యక్షురాలిగా ఎస్‌.బేబీ సరోజిని, ప్రధాన కార్యదర్శిగా టి.నాగవరలక్ష్మి, కోశాధికారిగా ఎస్‌.వెంకటలక్ష్మి, ఉపాధ్యక్షులుగా దుర్గ, కరుణ, సంయుక్త కార్యదర్శిగా లోవలక్ష్మి ఎన్నికయ్యారు. మొత్తం 23 మందితో యూనియన్‌ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. మధ్యాన్న భోజన పథకానికి బడ్జెట్‌ పెంచి కార్మికులు వేతనాలు పెంచాలని సమావేశం డిమాండ్‌ చేసింది. కార్మికునికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.10 వేల వేతనం ఇవ్వాలని సూచించింది. వంట చేసేటప్పుడు కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సమావేశం డిమాండ్‌ చేసింది. సమావేశంలో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు.

  • దాత సాయంతో స్కూల్‌కు డైనింగ్‌ హాల్‌

    మామిడికుదురు: స్థానిక జెడ్పీహెచ్‌ స్కూల్‌ ప్రాంగణంలో పాశర్లపూడి గ్రామానికి చెందిన భూపతి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం అతని కుటుంబ సభ్యులు రూ.35 లక్షలతో అధునాతన డైనింగ్‌ హాల్‌ నిర్మించారు. స్కూల్‌ పూర్వ విద్యార్థి అయిన నాగేశ్వరరావు ఈ ప్రాంతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి పేదల డాక్టర్‌గా గుర్తింపు పొందారు. అతని పేరిట స్కూల్‌ ప్రాంగణంలో శాశ్వత కట్టడం నిర్మించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి డైనింగ్‌ హాల్‌ను నిర్మించారు. డైనింగ్‌ హాల్‌ నిర్మాణంతో పాటు 40 స్టీలు బెంచీలు, 20 టేబుల్స్‌ కొని ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్కూల్ల్‌ 460 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. స్కూల్‌లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం తీనేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైనింగ్‌ హాల్‌ నిర్మించారు. శనివారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని హెచ్‌ఎం బి.చిరంజీవిరావు తెలిపారు.

Karimnagar

  • తప్పం
    ● రెవెన్యూశాఖ సమాచార లోపంతోనే పొరపాట్లు ● స్థలాల డీమార్కేషన్‌ చేయకపోవడంతోనే తప్పులు ● ప్రతీ డాక్యుమెంట్‌ పరిశీలించాలంటే ఇబ్బంది ● సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నాం ● పత్రాలు ఉంటే ఇంటినంబర్లకు రిజిస్ట్రేషన్లు ● డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌

    సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

    కటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.వందల కోట్లు అవినీతి.. ప్రభుత్వ భూములను ఏదో ఒక కారణం చూపడం, రిజిస్ట్రేషన్లు చేసేయడం, విషయం బయటికి పొక్కితే అవునా..? అంటూ నాలిక కరుచుకోవడం.. నెపమంతా రెవెన్యూ విభా గంపైకి నెట్టేయడం.. ఇదీ రిజిస్ట్రేషన్‌శాఖలో భూ ములు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారుల తీరు. ఇటీవల కరీంనగర్‌ పరిధిలో రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు అప్పనంగా రిజిస్ట్రేషన్‌ చేయడంపై లోకాయుక్త మొట్టికాయలు వేయడంతో రిజిస్ట్రేషన్‌శాఖ లీలలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. సంబంధితశాఖ డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ మాత్రం జరుగుతున్న అవినీతి కార్యక్రమాల్లో సబ్‌రిజిస్ట్రార్ల పాత్ర అసలు లేదని, ఇదంతా రెవెన్యూ విభాగం చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఏ భూమి ప్రభుత్వానిదో, ఏ భూమి నిషేధితమో వారు సమాచారం ఇవ్వడం లేదని, అందువల్లే.. సబ్‌రిజిస్ట్రార్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, సమాచారం ఉంటే వారు అలా ఎందుకు చేస్తారని శుక్రవారం శ్రీసాక్షిశ్రీతో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హుజురాబాద్‌, ఇటీవల గంగాధర సబ్‌రిజిస్ట్రార్లపై ఈ కారణంగానే వేటు పడిందని చెప్పుకొచ్చారు.

    ఇప్పటికీ రికార్డుల్లో..

    కొత్తపల్లిలోనే సర్వే నంబరు 272/14లో ఉన్న 20 గుంటల భూమిని తొమ్మిదిమందికి ఇటీవల మాజీ సబ్‌రిజిస్ట్రార్‌ నూర్‌ అఫ్జల్‌ఖాన్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సబ్‌రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్‌ వేటువేశారు. జూలై 26వ తేదీన సస్పెండ్‌ చేసినా.. కార్యాలయానికి వచ్చి.. 28వ తేదీన కూడా పనిచేయడం గమనార్హం. ఆయన చేతికి సస్పెన్షన్‌ ఆర్డర్‌ వచ్చేలోగా.. 20 గుంటల భూమిలో జరిగిన తొమ్మిది రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. 272 సర్వేనంబర్‌లో మిగిలిన బైనంబర్లతో ఉన్న భూమి కూడా ప్రభుత్వ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ చూపిస్తోంది. అయినా, తమకు సమాచారం లేదంటూ రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు. పైపెచ్చు.. రెవెన్యూ విభాగం తమకు ప్రొహిబిటెడ్‌ భూముల సమాచారం ఇవ్వడం లేదంటూ సబ్‌రిజిస్ట్రార్లు యథేచ్ఛగా ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తుండటం గమనార్హం.

    ఇంటి నంబర్ల బాగోతం

    జిల్లా రిజిస్ట్రేషన్‌శాఖలో వెలుగుచూస్తున్న వరుస అక్రమాలపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. కొత్తపల్లిలోని సర్వే నంబరు 272/14లోని 20 గుంటల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంటి నంబర్లతోనూ పలు ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కరీంనగర్‌లో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో షెడ్లుకట్టి, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా ఇంటినంబర్లు పొందిన వందలాది ఇళ్ల వివరాలను కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గుర్తించింది. ఆయా నంబర్లపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్‌ శాఖకు అధికారికంగా లేఖ రాసింది. దీంతో నగరంలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్ట వేయగలిగినట్లయింది.

    జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

    రెండు నెలల్లో రూ.వందల కోట్ల అక్రమాలు

    కొత్తపల్లి మండలంలోని సర్వే నంబర్లు 175, 197, 198లోని దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జరిగిన 476 రిజిస్ట్రేషన్లు లోకాయుక్త ఆదేశాలతో రద్దయిన విషయం తెలిసిందే. 175, 197, 198 సర్వేనంబర్లలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల మధ్య సమన్వయలోపం ఉందన్న విషయం 1995లోనే వెలుగుచూసింది. మూడు దశాబ్దాలు గడిచినా ఈ రెండు శాఖలు ఎందుకు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోలేదో.. ఎందుకు లోకాయుక్త నుంచి ఆదేశాలు వచ్చే వరకూ రిజిస్ట్రేషన్లు చేశారో జిల్లా ఉన్నతాధికారులకే తెలియాలి. ఫలితంగా ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొన్న 476 మంది అమాయకులు న్యాయం కావాలంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కొనుగోళ్లతో రూ.వందల కోట్లు చేతులు మారాయి.

    పత్రాలుంటే రిజిస్ట్రేషన్లు చేస్తాం

    ఇంటినంబర్ల విషయంలో మాకు కొన్ని ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. సరైన డాక్యుమెంట్లు, పన్నులు కట్టిన పత్రాలు, గ్రామ కార్యదర్శి లేదా బల్దియా కమిషనర్‌ ఎండార్స్‌మెంట్‌ ఉంటే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. ప్రొహిబిటెడ్‌ భూముల విషయంలో రెవెన్యూశాఖదే బాధ్యత. వివాదాస్పద భూములను ఎప్పటికప్పుడు డీమార్కేషన్‌ చేసి రికార్డులను అప్‌డేట్‌ చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. చాలా సందర్భాల్లో సబ్‌రిజిస్ట్రార్లు ప్రొహిబిటెడ్‌ ప్రాపర్టీలను తెలియకుండా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. మాకు ఫీల్డ్‌ స్టాఫ్‌ లేరు. ప్రతీ ప్రాపర్టీని విచారణ చేయాలంటే.. మేం రోజుకు ఒక్క డాక్యుమెంట్‌ కూడా చేయలేం. ఇప్పటికే పని ఒత్తిడితో సతమవుతున్నాం. – ప్రవీణ్‌కుమార్‌,

    డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, కరీంనగర్‌

  • దోమలప
    గంబూిసియా చేపలతో దోమల వ్యాప్తికిచెక్‌●
    ● నీటి గుంతల్లో వేసేందుకు ప్రణాళిక ● లక్ష్మినగర్‌ చేపలు వదిలిన కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ● నగరం మొత్తం అమలుకు ఆదేశం

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో దోమల వృద్ధికి చెక్‌ పెట్టేందుకు నగరపాలకసంస్థ చర్యలు చేపట్టింది. వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడం, అందుకు దోమలే ప్రధాన కారణం అవుతుండడంతో నివారణ దిశగా ప్రణాళిక రూపొందించింది. నగరంలో ఖాళీ ప్రదేశాలు అధికం కావడం, వర్షపు నీళ్లు నిలుస్తుండడం తెలిసిందే. ఆ నీటి గుంతలు దోమల పుట్టుకకు కారణమవుతుండడంతో, దోమల పుట్టుకను హరించే గంబూసియా చేపలను వదిలే కార్యక్రమానికి బల్దియా శ్రీకారం చుట్టింది.

    లార్వా తినే గంబూిసియా

    దోమల వృద్ధిని అరికట్టడంలో గంబూసియా చేపలు అత్యంత కీలకం. సాధారణంగా వర్షాకాలంలో దోమలు వ్యాధుల విజృంభణకు కారణమవుతాయి. దోమల నివారణకు స్ప్రే, ఫాగింగ్‌, ఆయిల్‌బాల్స్‌ లాంటివి రసాయనాలతో కూడి ఉంటాయి. దోమల పుట్టుకనే లేకుండా చేసే ఈ గంబూసియా చేపలు ఎలాంటి హానికరం కావు. నీటి గంతల్లో దోమలు పెట్టిన గుడ్లు, లార్వా దశ దాటి దోమలుగా మారడానికి దాదాపు పదిహేను రోజులు పడుతుంది. ఆ గుంతల్లో గంబూిసియా చేపలు వదలడం వల్ల, ఆ చేపలు దోమల గుడ్లు, లార్వాను ఆహారంగా తీసుకొంటాయి. ఫలితంగా దోమల పుట్టుకే లేకుండా పోతుంది.

    మత్స్యశాఖ నుంచి సేకరణ

    నగరంలోని ఉజ్వల పార్క్‌ సమీపంలోని మత్స్యశాఖ చేపల పెంపక కేంద్రంలో ఈ గంబూసియా చేపలను పెంచుతున్నారు. ఒక్కో ప్యాకెట్‌లో 200 నుంచి 300 చేపపిల్లలు ఉంటాయి. ఇలా ప్యాకెట్‌లలో తీసుకువచ్చి, నీటి గుంతల్లో వదులుతుంటారు.

    నీటి గుంతల గుర్తింపు

    నగరపాలకసంస్థ పరిధిలో వర్షపు నీళ్లు నిలిచి, దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్న నీటిగుంతల గుర్తింపును పారిశుధ్య విభాగం చేపట్టింది. ఆయా డివిజన్లలో ఉన్న నీటి గుంతల వివరాలు సేకరించి ఇవ్వాలని సంబంధిత జవాన్లను అధికారులు ఆదేశించారు. నగరంలోని 66 డివిజన్లలో దాదాపు 250 నీటి గుంతల వరకు గుర్తించినట్లు సమాచారం. ఇలా గుర్తించిన నీటి గుంతల్లో దశలవారీగా అంటే వారం రోజుల్లోగా గంబూిసియా చేపలను వదిలేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

    లక్ష్మినగర్‌ నుంచి శ్రీకారం

    లక్ష్మినగర్‌ నుంచి గంబూిసియా చేపలను నీటి గుంతల్లో వదిలే కార్యక్రమానికి బల్దియా శ్రీకారం చుట్టింది. కాలనీలోని నీటి గుంతలో గంబూసియా చేపలను కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, అధికారులతో కలిసి వదిలారు. దోమలు వృద్ధిచెందే ప్రతి నీటి గుంతలో చేపలు వదిలి, దోమలను ఆదిలోనే అంతమొందించాలని నగరవాసులు కోరుతున్నారు.

    వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి

    నీటి గుంతల్లో గంబూసియా చేపలను వదిలే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తాం. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఎక్కడెక్కడ నీటి గుంతలున్నాయనేది గుర్తిస్తున్నాం. ఆ నీటి గుంతల్లో చేపలను వదలడం ద్వారా, దోమలు పుట్టకుండా చర్యలు చేపడుతాం.

    – డాక్టర్‌ కట్ట సుమన్‌కుమార్‌,

    మెడికల్‌ ఆఫీసర్‌, నగరపాలకసంస్థ

  • తల్లి
    ● అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే

    కరీంనగర్‌: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 7వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో తల్లిపాల ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే సూచించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వా రోత్సవాల నిర్వహణ సమన్వయ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఐసీడీఎస్‌, ఆరోగ్యశాఖ సమన్వయంతో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య, పోషన్‌ అభియాన్‌ సిబ్బంది తల్లిపాల ప్రాధాన్యతను వివరించాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించే పోస్టర్లు బ్యానర్లు ప్రదర్శించాలని తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు.

    ఫేస్‌ రికగ్నేషన్‌ హాజరుకు సర్వర్‌ సమస్య

    కరీంనగర్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల హాజరు కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ విధానానికి సాంకేతిక సమస్యలేర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఉపాధ్యాయులందరూ యాప్‌ను వినియోగించడంతో సర్వ ర్‌ సమస్య తలెత్తింది. జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అయిన తర్వాత ఉదయం 8.50గంటలకు నిర్ధేశిత సమయంలో ఫేస్‌ రికగ్నేషన్‌ హాజరు వేసుకున్నారు. అనంతరం పాఠశాల ముగింపు సమయంలో తిరిగి హాజరు వేసుకోవడం జరిగింది. ప్రారంభంలో యాప్‌ వినియోగించడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో కొంత జాప్యమేర్పడిందని పలువురు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

    హాస్టల్‌లో మెనూ పాటించాలి

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రభుత్వం రూపొందించిన ప్రకారం మెనును హాస్టల్‌లో తప్పకుండా పాటించాలని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని ముకరంపుర కళాశాలస్థాయి వసతిగృహాన్ని సందర్శించారు. హాస్టల్‌ను పరిశీలించారు. కిచెన్‌ను తనిఖీ చేశారు. మెనూ పాటిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్‌ విద్యార్థుల కోసం ప్రభుత్వం డైట్‌ చార్జీలు పెంచిందన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించే విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వార్డెన్‌కు సూచించారు.

    పవర్‌కట్‌ ప్రాంతాలు

    కొత్తపల్లి: కొత్త విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ.అంబేద్కర్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌, శివాజీనగర్‌, ఎస్టీకాలనీ, కిసాన్‌నగర్‌ ప్రాంతాలతో పాటు విద్యుత్‌ లైన్ల షిఫ్టింగ్‌ పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.భగత్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని ఎర్రగట్టు, వాసుదేవకాలనీ, న్యూ శ్రీనగర్‌కాలనీ, కట్టరాంపూర్‌, ఆయోధ్యకాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈలు పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌, ఎం.లావణ్య తెలిపారు. చెట్ల కొమ్మల తొ లగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.తీగలగుట్టపల్లి ఫీడర్‌ పరిధిలోని సరస్వతీనగర్‌, విద్యారణ్యపురి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

  • 8న బీఆర్‌ఎస్‌ ‘బీసీ గర్జన’

    కొత్తపల్లి(కరీంనగర్‌): ‘మేమెంతో మాకంతా’ అనే డిమాండ్‌తో రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పష్టం చేశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగరంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8వ తేదీన కరీంనగర్‌లోని జ్యోతిరావు ఫూలే మైదానంలో నిర్వహించే బీసీ గర్జన బహిరంగ సభకు కదలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివా స్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌తో కలిసి శుక్రవారం జ్యోతిరా వు ఫూలే మైదానాన్ని పరిశీలించారు. చింతకుంటలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రవతి వద్ద పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్‌ తెస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడు రాష్ట్రపతి, పార్లమెంట్‌లో ఆమోదించే విధంగా ఒత్తిడి తేలేదని విమర్శించారు. రేవంత్‌ ట్రాప్‌లో పడ్డ కాంగ్రెస్‌ హైకమాండ్‌ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్‌ కనుక రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, విద్యాసాగర్‌ రావు, సుంకె రవిశంకర్‌, వొడితెల సతీశ్‌ కుమార్‌,రసమయి బాలకిషన్‌, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

    కరీంనగర్‌ సభకు యావత్‌ తెలంగాణ కదలి రావాలి

    సీఎం ట్రాప్‌లో కాంగ్రెస్‌ హైకమాండ్‌

    శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి

  • అంగన్‌వాడీలను సద్వినియోగం చేసుకోవాలి
    ● కలెక్టర్‌ పమేలా సత్పతి

    తిమ్మాపూర్‌: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ కోసం అంగన్‌వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్‌ మండలంలోని నుస్తులాపూర్‌ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. పోషణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం గుడ్లు పంపిణీ చేశారు. ప్రీస్కూల్‌ పిల్లలతో ముచ్చటించారు. సిలబస్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. ప్రతీ శుక్రవారం నిర్వహించే సమావేశాలకు మహిళలు హాజరై, అంగన్వాడీ సేవల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్‌ సందర్శించి, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించి, వారి అభ్యసన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచీలు లేదా మ్యాట్‌లపై కూర్చోబెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల ప్రగతి నివేదికను తెలియజేయాలని ఆదేశించారు. బుధవారం బోధనను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, బాలల సంక్షేమ ప్రాజెక్టు అధికారి శ్రీమతి, ఎంఈవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • శాంతి భద్రతలకు విఘాతం కల్గించొద్దు
    ● పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ● కొత్తపల్లిలో కార్డన్‌ సెర్చ్‌

    కొత్తపల్లి(కరీంనగర్‌): శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ గౌస్‌ఆలం హెచ్చరించారు. కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పాత నేరస్తులపై ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 45వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్‌ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్‌ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని స్థానికులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ట్రాఫిక్‌ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, షీం టీంలతో అవగాహన కల్పించారు. టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు నిరంజన్‌రెడ్డి, పుల్లయ్య, ప్రదీప్‌కుమార్‌, శ్రీలత పాల్గొన్నారు.

  • బైక్‌ అదుపుతప్పి ఒకరి మృతి

    తిమ్మాపూర్‌: తిమ్మాపూర్‌ మండలం మొగిపాలెం శివా రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్‌లో నివసిస్తున్న చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన మోరే రాజు(38), మామిడి కనకయ్య(55) శుక్రవారం బైక్‌పై రేకొండకు వెళ్లి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి కరీంనగర్‌ వెళ్తుండగా మొగిలిపాలెం వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడ్డారు. కనకయ్య అక్కడిక్కడే మృతిచెందగా, రాజు తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో రాజును కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనకయ్య చిన్నాన్న ఐదురోజుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • గుర్తుతెలియని వాహనం  ఢీకొని యువకుడి మృతి

    గొల్లపల్లి: మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని తునికి శ్రీనివాస్‌ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాములపల్లికి చెందిన తునికి శ్రీనివాస్‌ జగిత్యాల వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెంగళాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్‌ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన విధులు ముగించుకొని ఇంటికి వచ్చాక వెంగళాపూర్‌ ఎక్స్‌రోడ్డుకు సమీపంలో చిరువ్యాపారం నిర్వహిస్తున్న తన తల్లి వద్దకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  • కట్నం
    రాజన్నకు మొక్కులు

    బస్సు ఢీకొని వ్యక్తి మృతి

    కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌ ఔట్‌ గేట్‌ వద్ద శుక్రవారం బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన దావు రాజయ్య(65) కరీంనగర్‌లో కూలీ పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ బస్టాండ్‌లో ఉంటున్నాడు. బస్టాండ్‌ ఔట్‌ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ గాంధీపై కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ సీఐ కోటేశ్వర్‌ తెలిపారు.

    మానకొండూర్‌: కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మానకొండూర్‌ మండలం గంగిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి తల్లి కొయ్యడ సమ్మక్క వివరాల ప్రకారం.. గంగిపల్లికి చెందిన చలిగంటి నాగయ్యతో మెట్‌పల్లికి చెందిన హేమలతకు ఐదేళ్లక్రితం వివాహమైంది. భర్త, అత్త, ఇద్దరు ఆడబిడ్డలు అదనపు కట్నం తేవాలని వేధించారు. దీంతో తల్లిగారింటికి వెళ్లింది. కుమారుడు జన్మించడంతో ఐదు నెలల తరువాత అత్తగారింటికి వచ్చింది. మరోసారి డబ్బులు తేవాలంటూ వేధించడంతో ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సంజీవ్‌ తెలిపారు.

    ఉరేసుకుని ఒకరు..

    చొప్పదండి: పట్టణంలోని బీసీకాలనీలో నివాసముండే దండే పరందాములు (43) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టైలరింగ్‌ పనిచేసే పరందాములు కొద్దికాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి టైలర్‌షాప్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దండె కవిత ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

    పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన దుర్శెట్టి రాకేశ్‌ (32) పురుగుల మందు తాగి శుక్రవారం మరణించాడు. మూడేళ్లక్రితం రాకేశ్‌ మానసిక స్థితిసరిగ్గా లేదని భార్య తన కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. భార్య రావడం లేదని రాకేశ్‌ మరింత మనస్తాపానికి గురై క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నగేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై మల్లేశ్‌తెలిపారు.

    శతాధిక వృద్ధురాలు మృతి

    రాయికల్‌: రాయికల్‌ మండలం రామారావుపల్లికి చెందిన దయ్యాల రాజు (120) అనే శతాధిక వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందింది. రాజుకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

    ఉరేసుకొని వృద్ధుడి ఆత్మహత్య

    మల్యాల: మండలంలోని నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌కాలనీకి చెందిన భీనవేని భాగయ్య (69) శుక్రవారం అనారోగ్యంతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డినట్లు మల్యాల ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు. భాగయ్య భార్య పదేళ్ల క్రితం మృతి చెందగా.. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన తన ఇంటి ఎదుట ఉన్న మామిడితోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    రౌడీషీటర్‌ మనోజ్‌పై పీడీయాక్ట్‌

    సిరిసిల్లక్రైం: భూ వివాదంలో బొల్లు మల్లవ్వ అనే మహిళను రెండు నెలల క్రితం హత్య చేసిన కేసులో చందుర్తి మండలానికి చెందిన రౌడీషీటర్‌ మనోజ్‌పై పీడీయాక్ట్‌ నమోదు చేసినట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. ఈమేరకు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చర్లపల్లి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. మనోజ్‌ 2023లో హత్య, దొంగతనం, బెదిరింపుకు పాల్పడిన కేసులలో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న యువకుడిపై 2024లో రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌ నిర్వహించినా ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తరచూ నేరాలకు పాల్పడుతుండడంతో పీడీయాక్ట్‌ అమలు చేసి, చర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు.

    హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు

    వేములవాడఅర్బన్‌: హత్యాయత్నం కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ అసిస్టెంట్‌ సెషన్‌ కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్‌ జాదవ్‌ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ తెలిపారు. బోయినపల్లికి చెందిన అలువాల శ్రీనివాస్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా భార్య పురుగుల మందు తాగి మృతిచెందింది. ఆమె మృతికి భర్త శ్రీనివాస్‌, కుటుంబ సభ్యులు కారణమని భార్య తండ్రి భూపతి మల్లయ్య, అన్న విజయ్‌ చింతాల్‌ఠాణా గ్రామస్తులు.. శ్రీనివాస్‌తోపాటు అతని స్నేహిడుతు మోహన్‌పై దాడి చేశారు. బాధితుడి శ్రీనివాస్‌ ఫిర్యాదుతో 2023, ఫిబ్రవరి 17న వేములవాడ అప్పటి ఎస్సై ఎండీ రఫీక్‌ఖాన్‌, వేములవాడ టౌన్‌ సీఐ వెంకటేశ్‌ కేసు నమోదు చేశారు. భూపతి మల్లయ్య, విజయ్‌కు ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు తెలిపారు.

    గతంలో దరఖాస్తులు స్వీకరించి నిలిపివేత

    ఈ నెల 5నుంచి మళ్లీ స్వీకరణ

    ఉమ్మడి జిల్లాకు రూ.10.4కోట్ల కేటాయింపు

    ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నిధులు: రూ.10.4 కోట్లు

    కొనుగోలు చేయనున్న పరికరాల సంఖ్య: 13,140

    ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు: 50 శాతం రాయితీ

    ఇతరులకు: 40 శాతం రాయితీ

    దరఖాస్తుల స్వీకరణ:

    ఈ నెల 5నుంచి 15వరకు

    ఉమ్మడి జిల్లాకు ఏయే పరికరాలు ఎన్నెన్ని ఇవ్వనున్నారంటే

    బ్యాటరీ స్ప్రేయర్స్‌ :9,579

    పవర్‌ స్ప్రేయర్స్‌ :1,761

    రోటవేటర్‌ : 564

    సీడ్‌ కమ్‌ ఫర్టిలైజర్‌ డ్రిల్‌: 110

    కల్టివేటర్‌ : 651

    బండ్‌ ఫార్మర్‌ : 30

    పవర్‌ వీడర్‌ : 59

    బ్రష్‌ కట్టర్‌ : 132

    పవర్‌ టిల్లర్‌ : 84

    స్ట్రా బాలర్స్‌ : 170

  • యాంత్రీకరణకు మహర్దశ

    ఈ సారైన రైతులకు చేరేనా..!

    ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయాలి. గత మార్చి నెల 17వ తేదీన నిధులు కేటాయించగా అంతే వేగంగా వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 25వరకు దరఖాస్తులు తీసుకోగా వచ్చిన వాటిని ఆన్‌లైన్‌ చేసి ప్రక్రియకు సిద్ధం చేయగా అంతలోనే ఆర్థిక సంవత్సరం ముగిసింది. దీంతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి. అయితే 1990 నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కొనసాగుతోంది. 2014వరకు యాంత్రీకరణ పథకానికి నిధులు రాగా అప్పటి నుంచి నిధుల కేటాయింపు లేదు. ఈ క్రమంలో గత మార్చి నెలలో యాంత్రీకరణ పథకాన్ని తెరపైకి తేగా 2024–25 సంవత్సరానికి గానూ కరీంనగర్‌ జిల్లాకు రూ.73లక్షలు కేటాయించింది. కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరిస్తాయి. ఈ పథకానికి మహిళా రైతులు మాత్రమే అర్హులు కాగా గతంలో పురుషులకే ఇచ్చేవారు. ఇదిలా ఉండగా 50శాతం రాయితీతో పరికరాలు ఇస్తుండటం, దాదాపు దశాబ్దం తరువాత అవకాశం రావడంతో దరఖాస్తులు 5వేల వరకు వచ్చాయని సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో తక్కువ నిధులు కేటాయించగా ఈ సారి రెట్టింపు నిధులు కేటాయించడం శుభ పరిణామం.

    కరీంనగర్‌ అర్బన్‌: దశాబ్దానికి పైగా దూరమైన వ్యవసాయ యాంత్రీకరణ పథకం మళ్లీ చేరువవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే రైతులకు రాయితీ పరికరాలు చేరాల్సి ఉండగా సదరు సంవత్సర ముగింపు నెలలో నిధులు కేటాయించడం, అంతలోనే మార్చి ముగియడంతో పథకం నిలిచిపోయింది. తాజాగా మళ్లీ నిధులను కేటాయించగా దరఖాస్తుల స్వీకరణకు జిల్లా వ్యవసాయశాఖ చర్యలు చేపడుతోంది. ఈ నెల 5నుంచి 15 వరకు దరఖాస్తులను స్వీకరించనుండగా ఆయా దశల వారీగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాకు 10.4కోట్లు కేటాయించారు.

    ఉమ్మడి జిల్లాకు రూ.10.4కోట్లు

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2025–26 సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు రూ. 10.4 కోట్ల నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళా రైతులకు 50 శాతం రాయితీ, జనరల్‌ కేటగిరీ రైతులకు 40శాతం రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌ నుంచి యాసంగి వరకు పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఈ సారి 15 రకాల యంత్ర పరికరాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేస్తున్నారు.

    మళ్లీ దరఖాస్తుల స్వీకరణ

    ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పథకం అమలుకు సంబంధించి ఆగస్టు 5నుంచి 15వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో చేసిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వచ్చిన దరఖాస్తులను వ్యవసాయాధికారులు 16వ తేదీన జిల్లా కలెక్టర్‌కు అందజేస్తారు. 20 వరకు వాటిని పరిశీలిస్తారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను తెలియజేస్తారు. ఎంపికై న రైతులకు ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 5వరకు మంజూరు పత్రాలు, సెప్టెంబరు 7 నుంచి 17 వరకు పరికరాలు పంపిణీ చేస్తారు.

  • ప్రాణ

    డ్రైవర్‌ మృతి

    మరొకరికి తీవ్రగాయాలు

    సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): శాసీ్త్రనగర్‌ సమీపంలోని రాజీవ్‌ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున అగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో రాజస్తాన్‌కు చెందిన డ్రైవర్‌ శౌకిన్‌(40) మృతి చెందాడు. మరో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కొత్తగూడెం నుంచి మిర్చిలోడ్‌తో ఢిల్లీకి వెళ్తన్న లారీ సుల్తానాబాద్‌కు చేరుకుంది. అయితే, నిద్రమత్తులో ఉన్న డ్రైవర్‌.. రోడ్డు పక్కన అగిఉన్న మరోలారీని వెనుకనంచి ఢీకొట్టాడు. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న మహబూబ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో డ్రైవర్‌ శౌకిన్‌ క్యాబిన్‌లో పడుకొని ఉండగా అక్కడికక్కడే మృతి చెందాడు. హరియాణాకు చెందిన వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.

    క్వారీ సూపర్‌వైజర్‌ మృతి

    సైదాపూర్‌: కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం జాగీర్‌పల్లిలోని శ్రీలక్ష్మీ గ్రానైట్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న దీకొండ రాజు(43) ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తికి చెందిన దీకొండ రాజు జాగీర్‌పల్లిలోని శ్రీలక్ష్మీ గ్రానైట్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం గ్రానైట్‌ బండను యంత్రంతో జరుపుతున్న క్రమంలో ఒక బండరాయి రాజు కుడికంతకు బలంగా తగిలింది. కంత, తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజుకు భార్య సంతోష్‌కుమారి, కూతురు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

    విద్యుత్‌షాక్‌తో ఎద్దు మృతి

    కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ శివారు గోపాల్‌పూర్‌లో శుక్రవారం రైతు అనుముల అంజయ్యకు చెందిన ఎద్దు విద్యుత్‌షాక్‌తో మృతిచెందగా రైతుకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. దాడి నర్సయ్యకు చెందిన పొలంలో అనుముల అంజయ్య ఎద్దులతో గొర్రు కొట్టేందుకు కిరాయికి వెళ్లాడు. గొర్రు కొడుతున్న క్రమంలో పొలంలో ఉన్న విద్యుత్‌ స్తంభం సపోర్టువైరుకు ఎద్దు తాకడంతో విద్యుత్‌షాక్‌తో మృతిచెందింది. అప్రమత్తమైన అంజయ్య పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎన్‌పీడీసీఎల్‌ రూరల్‌ ఏడీఈ రఘు, ఏఈ అనిల్‌, బొమ్మకల్‌ పశువైద్యాధికారి జ్యోత్స్న పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును బాధిత రైతును అడిగి తెలుసుకున్నారు. ఎద్దు విలువ సుమారు రూ.60వేల వరకు ఉంటుందని అంజయ్య తెలిపాడు. ప్రభుత్వం నష్టపరి హారం మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు.

  • కుళ్లిన మాంసం.. నాణ్యత లేని సామగ్రి
    ● వేములవాడలో రెస్టారెంట్‌ సీజ్‌ ● సిరిసిల్లలో నోటీస్‌లు ● రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

    సిరిసిల్ల: వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లోని రెస్టారెంట్లలో శుక్రవారం రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. వేములవాడలో ఫుడ్‌ సేఫ్టీ ప్రమాణాలు పాటించని తాజ్‌ రెస్టారెంట్‌ను సీజ్‌ చేసి, రూ.30 వేల జరిమానా విధించారు. సిరిసిల్లలో రుచి హోటల్‌లో అపరిశుభ్రతను గుర్తించి నోటీసులు జారీచేశారు. రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ శివలీల ఆదేశాల మేరకు జిల్లాలో అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వేములవాడ రెస్టారెంట్‌లో అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం, నిలువ చేసిన మాంసం దుర్వాసన రావడం, హానికర రసాయనాలతో ఉన్న కృత్రిమ రంగులను గుర్తించారు. రూ.20,500 విలువైన 70 కిలోల మాంసం నిల్వ ఉన్నట్లు తేలింది. రెస్టారెంట్‌ను సీజ్‌ చేసి, రూ.30వేల జరిమానా విధించారు. జిల్లా కేంద్రంలోని రుచి రెస్టారెంట్‌లోనూ అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం, ఫుడ్‌ హ్యాండ్‌లెట్స్‌ గ్లౌస్‌, హెయిర్‌ క్యాప్స్‌ ధరించకపోవడం, వండిన ఆహారంపై మూతలు కప్పకపోవడం, కుళ్లిన వస్తువులను గుర్తించిన అధికారులు హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అనుమానిత ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌ టీం హెడ్‌, జోనల్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ వి.జ్యోతిర్మయి, టాస్క్‌ఫోర్స్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌లు రోహిత్‌రెడ్డి, శ్రీషిక, స్వాతి, అంకిత్‌రెడ్డి పాల్గొన్నారు.

  • నాన్న

    మా నాన్న శౌరయ్య అనారోగ్యంతో గత జూన్‌ 3న మృతి చెందాడు. బంధువులు వారిస్తున్నా శ్మశాన వాటికలో పార్థివదేహాన్ని ఖననం చేయకుండా అర్ధగంట ఆపాం. సదాశయ ఫౌండేషన్‌ అవగాహన కల్పించగా, కుటుంబ సభ్యులను ఒప్పించా. టెక్నీషియన్‌ను శ్మశానవాటికకే రప్పించి నేత్రాలు దానం చేయించా.

    – విజయ్‌కుమార్‌,

    గోదావరిఖని

    ముగ్గురికి పునర్జన్మ

    మా నాన్న రామకృష్ణ బీపీ పెరి ఇంట్లో పడియాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాం. అక్కడ చికిత్స పొందుతూ గత జూన్‌ 29న బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. ఆయన అవయవాలను దానం చేస్తే పలువురికి పునర్జన్మ కల్పించవచ్చని జీవన్‌ధాన్‌ కో ఆర్డినేటర్లు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో కాలేయాన్ని ఒకరికి, మూత్రపిండాలను మరోఇద్దరికి దానం చేశాం. దీంతో మా నాన్న అవయవాలు వారికి పునర్జన్మ నిచ్చాయి. – తుమ్మ ప్రణయ్‌, గోదావరిఖని

    అవగాహన పెరుగుతోంది

    అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకు 1,511 వరకు నేత్రదానాలు, 90 వరకు అవయవదానాలు, 151 వరకు దేహదానాలు జరిగాయి. 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించాం. సుమారు 50,000లకు పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు ప్రజలు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు.

    – సీహెచ్‌ లింగమూర్తి, జాతీయ ప్రధాన

    కార్యదర్శి, సదాశయ ఫౌండేషన్‌

  • గుండెపోటుతో కార్మికుడి మృతి
    ● నేత్రదానం చేసిన కుటుంబసభ్యులు

    జ్యోతినగర్‌(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుడు నారిశెట్టి శ్రీకాంత్‌(39) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం విధులకు హాజరైన కార్మికుడు.. అస్వస్థతగా ఉందని తోటి కార్మికులకు చెప్పాడు. ఆ వెంటనే అంబులెన్స్‌లో పీటీఎస్‌లోని ధన్వంతరి ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స అందించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య అనూష, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌.. డీఎం ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. అయితే, పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య అనూష, కుటుంబసభ్యులు శ్రీకాంత్‌ నేత్రాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. సదాశయ ఫౌండేషన్‌, రామగుండం లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా, శ్రీకాంత్‌ మృతి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు.. డీఎం ప్లాంట్‌ కాంట్రాక్ట, కార్మిక సంఘాల నాయకులు, కాంట్రాక్టర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం శ్రీకాంత్‌ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం, ఇద్దరికి ఉద్యోగావకాశం కల్పించేందుకు, అంత్యక్రియలకు రూ.50వేలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్‌ రాజ్‌కుమార్‌, యూనియన్ల ప్రతినిధులు కౌశిక హరి, భూమల్ల చందర్‌, చిలుక శంకర్‌, నాంసాని శంకర్‌, కాంట్రాక్టర్లు ఏబీసీ రెడ్డి, ఎలిని నారాయణ, వెంకటేశ్వరరావు, రాజాకిషన్‌, రాజేశం, సోమిరెడ్డి ఉన్నారు.

YSR

  • ● స్ట

    జమ్మలమడుగు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ పాతపాటే పాడారు.. ఎప్పట్లాగే అబద్ధాలే వల్లె వేశారు. ‘రాయలసీమను హార్టికల్చర్‌ హాబ్‌గా మారుస్తా... జిల్లాను పర్యాటక హబ్‌గా చేస్తా..’ అంటూ అవే డాంబికాలు పోయారు. 2014లో మొదలుపెట్టిన రాగాన్నే మళ్లీ సవరించారు. ఇప్పటివరకు రెండుసార్లు సీఎం హోదాలో పని చేసినా ఇంతవరకు రూపాయి విదిల్చింది లేదు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందిన దాఖలా అస్సలు లేదు. ప్రపంచ పర్యాటకకేంద్రంగా ఉన్న గండికోటలో హరిత హోటల్‌ నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలోనే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన మౌళిక సదుపాయాలు సైతం కల్పించలేకపోయారు.

    గండికోట ప్రాజెక్టుకు రెండు సార్లు

    శిలాఫలకం వేసి ఏం చేశారు..

    గండికోటప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు సార్లు శిలాఫలకం వేశారు. ఏనాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం మొగ్గుచూపలేదు. 2004లో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గండికోట ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. 22 గ్రామాల ప్రజలకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 90 శాతం పనులు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. కేవలం పదిశాతం పనులు మాత్రమే చంద్రబాబు పూర్తి చేసి తామే ప్రాజెక్టు పూర్తి చేశామని చెబుతుండటంతో జిల్లావాసులు,నియోజకవర్గంలోని ప్రజలు నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం రాయలసీమకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీనీవా– గాలేరు–నగరి ప్రాజెక్టులు శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెబుతున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచి ఏకంగా గాలేరు–నగరి కాలువల్లో 20 వేల క్యూసెక్కులు వరద నీరు ప్రవహించేవిధంగా కాలువలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అవుకు, లింగాపురం వద్ద కొండలకు టన్నెల్‌ వేసి నీటిని గండికోట ప్రాజెక్టుకు తరలించేవిధంగా చర్యలుచేపట్టిన ఘనత వైఎస్‌దే అని జిల్లా వాసులకు తెలియందికాదు. అలాంటి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని సమావేశంలో చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని నియోజకవర్గవాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఇక మైలవరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కనీసం టీడీపీనే ఆవిర్భవించలేదని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాసుబ్రహ్మానందరెడ్డి 1974లో 100కోట్ల రూపాయలతో మైలవరం జలాశయం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దానిని 1983 నాటికిపూర్తి చేస్తే అప్పటి ముఖ్యమంత్రిగా ఎన్‌టీరామారావు ప్రారంభోత్సవం చేశారే తప్ప టీడీపీ చేసిందేమీ లేదు. కాలువల్లో నీరు ప్రవహించపోవడం, చివరి ఆయకట్టురైతుకు మైలవరం జలాశయం నుంచి నీరు అందకపోవడంతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైలవరం ఉత్తర,దక్షిణ కాలువలకు 150 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఉత్తర కాలువ రత్న కంపెనీ, దక్షిణ కాలువ పనులను సీఎం రమేష్‌ నాయుడు కు చెందిన రిత్విక్‌ కంపెనీ చేసింది. ఈ విషయం కూడా చంద్రబాబు తెలియకుండా మైలవరం ప్రాజెక్టు సైతం తామే పూర్తిచేశామని చెప్పుకోవడం పట్ల ప్రజలందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో టీడీపీ ప్రభుత్వం గాని చంద్రబాబునాయుడు గాని నిర్మించిన దాఖలాలులేవు. వచ్చిన ప్రతిసారి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా జిల్లాకు చేసిందేమీలేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు. కాగా చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపు జనాలు విసుగెత్తిపోయి చూస్తూ ఉండిపోతున్నారే తప్ప ఎటువంటి మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలన్ని సుద్ద అబద్ధాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    నిస్సిగ్గుగా అసత్యాలు వల్లెవేసిన సీఎం చంద్రబాబు

    గండికోటకు రెండు సార్లు శిలాఫలకం వేసి పైసాకూడ నిధులు కేటాయించలేదు

    వైఎస్సార్‌ హాయంలోనే రాయలసీమలోసాగునీటి ప్రాజెక్టులకు మోక్షం

    2019 జనవరి 24న మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన చంద్రబాబు ప్లాంట్‌ నిర్మాణం కోసం ఒక సెంటు భూమి కూడా కేటా యించలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సున్నపురాళ్లపల్లె వద్ద 3000 ఎకరాలు వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం భూమిని కేటాయించడంతోపాటు 70 కోట్ల రూపాయలతో పనులను కూడా చేపట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన బాధితులకు పట్టాగలిగిన రైతులకు పరిహారం అందించారు. జిందాల్‌ కంపెనీ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ముందుకు తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ప్రాంతంలోనే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది.

  • పార్ట

    కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వలంటీర్స్‌ విభాగం ఎంతో కీలకమైనదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామాంజనేయపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వలంటీర్స్‌ విభాగం విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీలో యువజన, విద్యార్థి, వలంటీర్స్‌ విభాగాలు కొత్త తరానికి ప్రతిరూపాలన్నారు. కూటమి ప్రభుత్వం అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, వారు ఇచ్చిన హామీలను ఇంటింటికీ వెళ్లి గుర్తు చేయాలన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి దుర్మార్గమైన పాలన లేదని, దోచుకోవడానికి, దాచుకోవడానికే వారు అధికారంలోకి వచ్చారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్లకు పదివేలు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ అన్నట్లు కరువు ఫ్రీగా వస్తుందని ఎద్దేవా చేశారు.

    రాష్ట్రంలో ఎల్లో ఎమర్జెన్సీ– రాష్ట్ర వలంటీర్స్‌ విభాగం అధ్యక్షుడు నాగార్జున యాదవ్‌

    రాష్ట్రంలో ఎల్లో ఎమర్జెన్సీ నడుస్తోందని రాష్ట్ర వలంటీర్ల విభాగం అధ్యక్షుడు నాగార్జున యాదవ్‌ విమర్శించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను జనం నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని, అందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందన్నారు. జేసీబీలతో రోడ్లు తవ్వి, వాహనాలు ఆపి జనాలను అడ్డుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 3లక్షల మంది జగన్‌ సైన్యాన్ని తయారు చేస్తామన్నారు. వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఒకే ఒక్క తేడా ఉందని, జగన్‌ అబద్ధాలు చెప్పడు, చంద్రబాబు నిజాలు చెప్పడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను గ్రామస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలన్నారు. డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, వలంటీర్స్‌ విభాగం రాయలసీమ జోన్‌ అధ్యక్షుడు అఖిలేష్‌ మాట్లాడారు. జిల్లా వలంటీర్స్‌ విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వలంటీర్స్‌ విభాగం ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగమల్లారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, కడప అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు వంశీ, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    సేవా స్ఫూర్తితో పనిచేయాలి: మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

    వలంటీర్ల విభాగంలోని వారంతా సేవా స్ఫూర్తి తో పనిచేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో 2.50లక్షల మంది వలంటీర్లను నియమించి వారి ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. వలంటీర్లంతా జగన్‌ సైన్యమన్నారు. పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో అవినీతిమయమైన అరాచకపాలన సాగుతోందని.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ 2.0లో కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

    పార్టీని ముందుకు తీసుకెళ్లే బృహత్తర బాధ్యత వారిపై ఉంది

    జిల్లా విస్తృత స్థాయి సమావేశంలోవైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి

  • అత్యధిక మెజార్టీతో ఇరగంరెడ్డిని గెలిపించండి

    ఎమ్మెల్యే ఆకేపాటి,

    కడప మేయర్‌ సురేష్‌ బాబు

    ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌ బాబు ప్రజలను కోరారు. శుక్రవారం మండల పరిధిలోని రాచగుడిపల్లి, సీతాపురం, గొల్లపల్లి, రాచపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి ఆకేపాటి అమరనాథరెడ్డి, సురేష్‌ బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ..సుబ్బారెడ్డిని గెలిపించుకుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచి, ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వస్తారన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, ఆర్థిక స్థితి గతులను మారుస్తారన్నారు. కడప మేయర్‌ సురేష్‌ బాబు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అవిర్భావం అయినప్పటి నుంచి ఒంటిమిట్ట జెడ్పీటీసీని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వారే దక్కించుకుంటున్నారన్నారు. ఈ సారి కూడా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ని గెలిపించి, ఒంటిమిట్ట చరిత్రను తిరగ రాయాలని ప్రజలను కోరారు. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ..తాను ఒంటిమిట్ట మండల ప్రజలకు సుపరిచితున్ని అన్నారు. నన్ను గెలిపిస్తే మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని, వాటిని పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ ఆకేపాటి వేణుగోపాల్‌ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్‌ వింగ్‌ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్‌రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్‌ దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వె వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసుల రెడ్డి, గురుమోహన్‌రాజు, రవిరాజు, నాగార్జున్‌ రాజు, రవిరెడ్డి, కత్తి శివయ్య పాల్గోన్నారు.

  • ఏపీఎల్‌–2025 ట్రోఫీ మనదే !

    కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: విశాఖపట్నంలో ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న ఆంధ్ర ప్రీమియం లీగ్‌– 2025 (ఏపీఎల్‌–2025) లో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి చాంపియన్‌గా నిలుస్తుందని రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు యజమాని శ్రీధర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 8 నుంచి వైజాగ్‌ లో ఆంధ్ర ప్రీమియం లీగ్‌– 2025 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఏపీఎల్‌– 2025లో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు పాల్గొంటుందని చెప్పారు. కడపలోని వైయస్‌ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు సాధన చేసేందుకు వచ్చిందని వివరించారు. ఈనెల 5వ తేదీ వరకు రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు క్రీడాకారులు ఇక్కడే సాధన చేస్తారన్నారు. ఆరో తేదీ జట్టు సభ్యులందరూ వైజాగ్‌ కు బయలుదేరి వెళ్తారన్నారు. వైయస్‌ రాజారెడ్డి ఏసిఏ స్టేడియంలో సాధన చేసుకునేందుకు అన్ని వసతులు అద్భుతంగా ఉన్నాయన్నారు. రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు హీరోలు చాలా స్ట్రాంగ్‌ గా ఉన్నారని, ఏ పీ ఎల్‌– 2025 ఛాంపియన్స్‌ గా జట్టును నిలబెడతారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన మొదటి మ్యాచ్‌ విజయవాడ సన్‌ షైన్‌ జట్టుతో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు ఆడబోతుందన్నారు. రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు హెడ్‌ కోచ్‌ పైడికాల్వ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఐపీఎల్‌ –2025 మ్యాచ్‌ లలో తమ జట్టు తప్పక విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు సహ యజమాని రాజారెడ్డి, రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు క్రీడాకారులు రషీద్‌, పైలా అవినాష్‌ పాల్గొన్నారు.

    రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ

    యాజమాన్యం ధీమా

  • ‘గండికోట’కు కృష్ణా జలాలు

    కొండాపురం: అవుకు రిజర్వాయర్‌ నుంచి గాలేరి నగరి సృజలస్రవంతి ప్రధాన కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులనీరు గండికోట జలాశయంలోకి చేరినట్లు శుక్రవారం జీఎన్‌ ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 18 వేల క్యూసెక్కులనీరు అవుకు రిజర్వాయర్‌ వచ్చి చేరుతున్నాయి. అవుకు రిజర్వాయర్‌నుంచి 6500 క్యూసెక్కులనీరు వదలడంతో సుమారు 54 కిలో మీటర్ల దూరం నుంచి జీఎన్‌ ఎస్‌ఎస్‌ కాలువ నుంచి గండికోట జలాశయంలో వస్తున్నాయి. గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసిలు ఉండగా ప్రస్తుతం 10.3టీఎంసీలు నీరు నిల్వ ఉందని వెల్లడించారు. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి 1500 క్యూసెక్కులనీరు, అలాగే జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కాలువ ద్వారా శెట్టివారిపల్లె రెగ్యూలెటర్‌ నుంచి 400 క్యూసెక్కుల నీటిని వామికొండ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నామన్నారు. అలాగే గండికోట ఎత్తిపోతలపథకం నుంచి చిత్రావతి బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌కు రెండు మోటర్లతో 1000 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నామన్నారు.

  • ఎమ్మె

    మైదుకూరు : మైదుకూరులో టీడీపీలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్ర, మాజీ ఎంపీపీ ధనపాల జగన్‌మోహన్‌ మధ్య గొడవలు చెలరేగాయి. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలోనే వారు ఇరువురు బాహాబాహీకి దిగారు. దీంతో అధికార పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంటున్న మున్సిపల్‌ చైర్మన్‌ పార్టీకి రాజీనామా చేయక ముందు నుంచే టీడీపీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన టీడీపీలో చేరడాన్ని అప్పటికే ఆ పార్టీలో ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాచనూరు చంద్రకు మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న ధనపాల జగన్‌మోహన్‌ అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. తాజాగా పట్టణంలోని మూలబాట వీధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న మూలబాట వీధిలో శుక్రవారం వితంతువులకు కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కొత్త పింఛన్లను పంపిణీ చేస్తారని అటు మున్సిపాలిటీ అధికారులు, ఇటు టీడీపీ నాయకులు ప్రకటించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మంత్రి కన్నా ముందుగా వచ్చారు. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్‌ పందిటి వెంకటలక్ష్మమ్మ, కుటుంబ సభ్యులు శాలువాతో ఎమ్మెల్యేను సత్కరిస్తుండగా.. ఎమ్మెల్యే పక్కనే ఉన్న మాజీ ఎంపీపీ ధనపాల జగన్‌ ఎమ్మెల్యేకు అటువైపు నిలబడి ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్రను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ తోసేశారు. నన్ను ఎందుకు తోస్తున్నావు అంటూ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశ్నించారు. ఒక వైపు మున్సిపల్‌ చైర్మన్‌ కుటుంబ సభ్యులు, మరో వైపు మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యులు గట్టిగా అరుస్తూ దూషించుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇరు వర్గాలను వారించారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఇరు వర్గాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేకు ఓటు కూడా వేయని మున్సిపల్‌ చైర్మన్‌కు ఇక్కడేం పని అంటూ మాజీ ఎంపీపీ జగన్‌మోహన్‌ కేకలు వేశారు. ఇరువర్గాలు తోసుకోవడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఇరువర్గాలపై ఆగ్రహించిన ఎమ్మెల్యే సుధాకర్‌ యాదవ్‌ ‘ఏం చేస్తున్నారు మీరు.. ఏమనుకుంటున్నారు, రౌడీయిజం చేస్తున్నారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న వారంతా సర్దిచెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం సద్దుమణిగింది. అదే సమయంలో మంత్రి సవిత అక్కడికి చేరుకోవడంతో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

    మున్సిపల్‌ ఎన్నికల నుంచి విభేదాలు

    మాచనూరు చంద్ర, మాజీ ఎంపీపీ ధనపాల జగన్‌మోహన్‌ మధ్య మున్సిపల్‌ ఎన్నికల నుంచి విభేదాలు ఉన్నాయి. చంద్ర వైఎస్సార్‌సీపీ తరఫున మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేయగా, ధనపాల జగన్‌ భార్య భారతి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో చంద్ర మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆయన వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మే 15న పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ అధికారులు ఈ ఏడాది జనవరి 15న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహావిష్కరణ చేసేందుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాగా అందులో మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా మాజీ ఎంపీపీ ధనపాల జగన్‌, మా కార్యక్రమంలో నువ్వు ఎలా పాల్గొంటావు.. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ మున్సిపల్‌ చైర్మన్‌ను నిలదీశారు. అప్పుడు కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పుడు తాజాగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనూ వారి మధ్య ఉన్న విభేదాలు బట్టబయలై కార్యక్రమాన్ని రసాభాసగా మార్చాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్‌ మేరకు పాల్గొన్న మున్సిపల్‌ చైర్మన్‌కు భంగపాటు ఎదురుకావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

    మున్సిపాలిటీలో భగ్గుమన్న

    ప్రత్యర్థుల విభేదాలు

    రసాభాసగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

  • వచ్చారు.. వెళ్లారు..!

    సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : కడప కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్‌ల వ్యవహారం మరింతగా కొనసాగుతూనే వుంది. దీనికి కారణం అధికారుల ‘నామమాత్రపు విచారణ’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప కేంద్ర కారాగారంలో దశల వారీగా నిర్వహించిన తనిఖీలలో పీడియాక్ట్‌ రిమాండ్‌ ఖైదీ జాకీర్‌ వద్దనే 12 సెల్‌ఫోన్‌లు, ఛార్జర్‌ దొరికాయి. ఆయా తనిఖీలలో దొరికిన సమయాలలో విధుల్లో వున్న వారిని బలిపశువులుగా మార్చి ఏకంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్‌లు, ఇద్దరు జైలర్లు, ముగ్గురు వార్డర్‌లను మొత్తం ఏడుగురిని సస్పెన్షన్‌ చేసి అధికారులు ‘మమ’ అనిపించారు. తరువాత ప్రతిరోజూ పత్రికల్లో కడప కేంద్ర కారాగారంలో అవినీతిపై కథనాలు ప్రచురితం కావడంతో.. జైళ్లశాఖ డీజీ అంజనీకుమార్‌ జూలై 29న కడప కేంద్ర కారాగారంలో పర్యటించారు. అంతకుముందు రాజమహేంద్రవరం డీఐజీ ఎం.ఆర్‌ రవికిరణ్‌ను ప్రాథమిక విచారణ అధికారిగా పంపడంతో.. ఆయన నివేదిక మేరకు పై ఏడుగురిని సస్పెన్షన్‌ చేశారు. సెల్‌ఫోన్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రాథమికంగా ఆరా తీసి బయటనుంచి పడేస్తున్నారని విచారణలో తేలిందని తెలియజేశారు. డిజీ అంజనీకుమార్‌ పర్యటనలో భవిష్యత్తులో నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించరని ‘ప్రామిస్‌’ చేశారని కూడా ‘మీడియా’కు బలంగా చెప్పి వెళ్లారు. కానీ రెండు రోజుల్లోనే తనిఖీలలో బయట నుంచి విధులకు వస్తున్న ఓ గైడ్‌ టీచర్‌ వద్ద ‘గుట్కా–హాన్స్‌’ ప్యాకెట్‌ దొరకడం ఎంత వరకు సమంజసం? అలాగే కడపలో ఓ యువకుడి హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తు తన అవసరం కోసం సెల్‌ఫోన్‌ను వేల రూపాయలను ఖర్చు చేసి రహస్యంగా తెప్పించుకున్నాడు. ఆ సెల్‌ఫోన్‌ను కడప కేంద్ర కారాగారంలోనే భూమిలో దాచిపెట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కారాగారంలోకి ‘సెల్‌ఫోన్‌ సరఫరా’ ఆపలేరని స్పష్టంగా తెలుస్తోంది. సెల్‌ఫోన్‌లను రహస్యంగా ఎవరు తెస్తున్నారు? ఎలా తెస్తున్నారు? అనే విషయాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేయాల్సి వుంది. ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకుని ‘డాగ్‌ స్క్వాడ్‌’, బాంబ్‌ స్క్వాడ్‌ వారు ఉపయోగించే మెటల్‌ డిటెక్టర్‌ల సహాయంతో.. కడప కేంద్ర కారాగారాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే మరిన్ని సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా సామగ్రి బయటపడే ఆవకాశాలు ఉన్నాయి. పిడియాక్ట్‌ రిమాండ్‌ ఖైదీ జాకీర్‌ ప్రధాన గేటు వద్దకు వచ్చి తాను 12 సెల్‌ఫోన్‌లు కాదు! ఇంకా సెల్‌ఫోన్‌లను తెప్పించుకుంటానని సవాలు విసిరిన వైనం పై కూడా.. ఎక్కడి నుంచి సెల్‌ఫోన్‌లను తెప్పిస్తున్నాడో పోలీసుల ద్వారా నైనా విచారణ చేయించి నిజానిజాలను తెలుసుకుని ‘సెల్‌ఫోన్‌’ల సరఫరాను కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై వుంది. జాకీర్‌ బంధువులు తమకు సహాయపడే ఓ డిప్యూటీ జైలర్‌ అనంతపురం ‘పీఓఏ’లో విధులను నిర్వహిస్తున్నాడనీ తెలుసుకుని అక్కడికే వెళ్లి, తమకు అనుకూలంగా మాట్లాడుకుని వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సెల్‌ఫోన్‌లను అమ్ముతున్న, సరఫరా చేస్తున్న వారిని పట్టుకుని, తనిఖీల సమయంలో విధుల్లో వున్న, తమకు సంబంధం లేని అధికారులపై చర్యలను మానుకుని, అసలైన దోషులపై చట్టపరంగా చర్యలను తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

    సెల్‌ఫోన్‌ల వ్యవహారంలో

    నామమాత్రం విచారణ

    ఏడుగురిపై సస్పెన్షన్‌ వేటు వేసి ‘మమ’ అనిపించిన అధికారులు

    తనిఖీలలో దొరికిన

    ‘గుట్కా–హాన్స్‌’ ప్యాకెట్‌

    క్షుణ్ణంగా తనిఖీ చేస్తే బయటపడనున్న సెల్‌ఫోన్‌లు

  • ● సీఎ
    ● మాకు వర్తించదా పీ ఫోర్‌..

    ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ–4 పథకం కింద నిరుపేదలను బంగారు కుటుంబం పేరుతో దత్తత తీసుకుని వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని ఒకవైపు ఉపన్యాసం ఇస్తుంటే.. మరోవైపు పది సంవత్సరాల బాలుడు తన బతుకు పోరాటం కొనసాగిస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం సాగుతుంటే.. బాలుడు వేరుశనగ కాయల గంప చేతితో పట్టుకుని సమావేశానికి హాజరైన ప్రజల వద్దకు వెళ్లి అమ్మకాలను కొనసాగిస్తున్నాడు. కొంత మంది అధికారులు సైతం ఆ బాలుడు వద్ద నుంచి వేరుశనగ కాయలు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి సమావేశంలోనే బాలుడు తన బతుకు పోరాటం కొనసాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. – జమ్మలమడుగు

    జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువులో పీఫోర్‌ (బంగారు కుటుంబాల లబ్ధిదారుల) సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ప్రజా వేదిక ప్రవేశ ద్వారంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సీఎం ఫ్లెక్సీ కింద ముద్దనూరుకు చెందిన మహిళ తన ముగ్గురు సంతానంతో కలిసి యాచిస్తోంది. అందులో ఒకరు గాంధీ వేషధారణలో ఉండటం గమనార్హం. అక్కడి సదస్సుకు వచ్చిన వారు అయ్యో పాపం వీరికి పీ ఫోర్‌ వర్తించదా అనుకుంటూ వెళ్లారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కడప

  • నేడు గండిలో రెండో శ్రావణ శనివారోత్సవం

    చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నేడు రెండో శ్రావణ మాస శనివారోత్సవం జరుగనుంది. గత వారం కంటే ఈవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని భావించిన ఆలయ వర్గాలు అందుకు సరిపడ ఏర్పాట్లు చేశారు. గత వారంలో తలెత్తిన చిన్నచిన్న లోపాలను సరిదిద్ది ఉత్సవాలకు తగు ఏర్పాట్లు చేశామని ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటసుబ్బయ్య, చైర్మన్‌ కావలి కృష్ణతేజ తెలిపారు. భక్తుల అంచనాల మేరకు లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఉదయం 3గంటలకు సుప్రభాతసేవ, ఉత్సవమూర్తులకు అభిషేకం (ఏకాంతంగా), అలంకరణ, ఆరాధన, 5 గంటలకు మహామంగళ హారతి, అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్‌, రాజగోపాలాచార్యులు తెలిపారు. అలాగే రాత్రి బస చేయు భక్తుల కాలక్షేప నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, అధికారులు సహకరించాలని చైర్మన్‌ కోరారు.

    పరిస్థితిని బట్టి ట్రాఫిక్‌ ఆంక్షలు

    శ్రావణ మాస ఉత్సవాల రెండవ శనివారం భక్తుల రద్దీని బట్టి ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగారావులు తెలిపారు. పరిస్థితిని బట్టి లారీలు, టిప్పర్లు తదితర వాటిని వేంపల్లె వైపు నుంచి వచ్చే వాటిని ఇడుపులపాయ క్రాస్‌ వద్ద, రాయచోటి వైపు నుంచి వచ్చే వాటిని అద్దాలమర్రి క్రాస్‌ వద్ద ఆపేస్తామన్నారు. బస్సులు, కార్లు తదితరాలను భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఉత్సవాల సందర్భంగా పులివెందుల డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతోపాటు సుమారు 130 మంది వరకు సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

    రక్తదాన శిబిరం ఏర్పాటు

    రక్త దానం చేసి అపాయంలో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడాలని ట్రిపుల్‌ ఐటీకి చెందిన ప్రసాద్‌ తెలిపారు. గండిలో రక్తదాన శిబిరం కడప రిమ్స్‌ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.

  • ‘ఇన్ఫోసిస్‌’ నేత్ర బ్యాంక్‌ ఏర్పాటు

    కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడపలోని ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల ప్రాంగణంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ నేత్ర బ్యాంక్‌ ఆవిష్కరించటం జిల్లా ఆరోగ్య సంరక్షణకు అదనపు విలువ జోడిస్తుందని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, స్పెషల్‌ కలెక్టర్‌ ఎస్‌.నిత్యానంద రాజు, రిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కెఎస్‌ఎస్‌ వెంకటేశ్వర రావు, వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ రామ గిడ్డయ్యలు తెలిపారు. ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలలో శుక్రవారం ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఐ బ్యాంక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల ఐ బ్యాంక్‌ విస్తరణ పరిధిలో ఇది అయిదవదని తెలిపారు. ఈ నేత్ర బ్యాంక్‌కు అవసరమైన పరికరాలను ఇన్ఫోసిస్‌ సమకూరుస్తుందని, ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల మౌలిక సదుపాయాలను అందిస్తుందన్నారు. కడపలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద ప్రారంభించిన హాస్పిటల్‌ కార్నియా రిట్రీవల్‌ ప్రోగ్రాం (హెచ్‌సీపీఆర్‌) ద్వారా స్వచ్ఛంద నేత్ర దానాలు, విరాళాలను ఇన్ఫోసిస్‌ ఐ బ్యాంక్‌ సేకరిస్తుందన్నారు. ఈ నేత్ర బ్యాంక్‌ పరిసర ప్రాంతాల ప్రజల కార్నియా మార్పిడి చికిత్స అవసరాలను తీరుస్తుందని వివరించారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ సునీల్‌ కుమార్‌, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ హెడ్‌ మనీషా సబూ, ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్‌లు మాట్లాడుతూ ఈ అత్యాధునిక ఐ బ్యాంక్‌ను స్థాపించడంలో ప్రసాద్‌ నేత్ర వైద్యశాలతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫైనాన్స్‌ – ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ సునీల్‌ కుమార్‌ ధరేస్వర్‌, ఇన్ఫోసిస్‌ హెడ్‌ మనిషా సాబూ వర్చువల్‌ విధానం ద్వారా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల టెక్నాలజీ – కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కృష్ణ వడ్డవల్లి, ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌ ఎమిరేట్స్‌ రామం ఆత్మకూరి, ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల రాజశేఖర్‌రెడ్డి క్యాంపస్‌ హెడ్‌ డాక్టర్‌ కావ్య మాధురి బెజ్జంకి, నెట్‌ వర్క్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఐ బ్యాంక్‌ హరిహరన్‌తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

  • సెల్‌ఫోన్లు రికవరీ

    జమ్మలమడుగు : ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌ పరిధిలో సెల్‌పోన్లు పోగొట్టుకున్న బాధితులకు రైల్వే పోలీసులు రికవరీ చేసి అప్పగించారు. శుక్రవారం స్థానిక రైల్వే ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌ పరిధిలో సెల్‌ఫోన్లు పోయాయంటూ తమకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్‌ సీఈఐఆర్‌ విధానం ద్వారా సెల్‌ఫోన్లు గుర్తించి వాటిని దొంగల నుంచి రికవరీ చేశామన్నారు. నాలుగు సెల్‌ఫోన్‌ల విలువ రూ.53 వేల వరకు ఉంటుందన్నారు.

    భార్యపై కరెంట్‌ వైర్లతో దాడి

    కడప అర్బన్‌ : కడప నగరం చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రకాష్‌ నగర్‌లో సప్తగిరి అనే వ్యక్తి తన భార్యపై కరెంట్‌ వైర్లతో దాడి చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాష్‌ నగర్‌ కు చెందిన సప్తగిరికి 5 సంవత్సరాల క్రితం వైష్ణవితో వివాహమైంది. భార్యను తరచు వేధించేవాడని, అయితే కరెంటు వైర్లతో గురువారం ఇష్టానుసారంగా చితక బాదడంతో తీవ్ర గాయాల పాలైంది. ఈ మేరకు వైష్ణవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    అరటికాయల వ్యాపారి ఆత్మహత్య

    పులివెందుల రూరల్‌ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె సమీపంలో ఉన్న ఎర్రబల్లె తండాలో నివాసముంటున్న ఆంజనేయ నాయక్‌(42) అనే అరటి కాయల వ్యాపారస్తుడు గడ్డి నివారణ మందు సేవించి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంజనేయ నాయక్‌ అరటి కాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పులివెందుల ప్రాంతంలోని అరటికాయలను ఢిల్లీ వ్యాపారస్తులకు ఎగుమతి చేసేవాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాపారస్తులు సుమారు లక్షలాది రూపాయల డబ్బులు పంపించకపోవడంతో ఆంజనేయ నాయక్‌ పులివెందుల ప్రాంతంలోని రైతులకు చెప్పుకోలేక గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గడ్డి గడ్డి మందు సేవించిన ఆంజనేయ నాయక్‌ను చికిత్స కోసం పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • దొంగకు దేహశుద్ధి

    సింహాద్రిపురం : ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురం మండలంలోని సుంకేసుల గ్రామంలో కాకర్ల భాస్కర్‌రెడ్డి భార్య తన ఇంటి వద్ద శుక్రవారం కల్లాపు చల్లుతూ ఉండగా.. బైకుపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. బైకుపైనే ఒకరు ఉండి మరొకరు ఆమె వద్దకు వచ్చి వివరాలు అడిగేటట్టు అడిగి.. మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లి బైకుపై వెళ్లిపోయారని బాధితురాలు పూర్ణ విలపించింది. అలాగే అంకాలమ్మ గూడూరులో గ్రామానికి చెందిన చిన్నిరెడ్డి తన తోట వద్ద ట్రాక్టర్‌ ఆపి పనులు చేసుకుంటూ నిమగ్నమై ఉండగా, దొంగ ట్రాక్టర్‌కు ఉన్న బీగం గమనించి స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోయాడు. రైతు ట్రాక్టర్‌ శబ్దాన్ని గమనించి బయటికి వచ్చి చూసేసరికి ట్రాక్టర్‌ చాలా దూరం వెళ్లిపోయింది. దీనితో బాధిత రైతు వెంటనే గ్రామస్తులకు ఫోన్‌ చేయడంతో వారు ఆ ట్రాక్టర్‌ను వెంబడించి దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి ట్రాక్టర్‌కు తాడుతో కట్టారు. గ్రామస్తులు దొంగను పట్టుకొని దబాయించగా పొంతన లేని సమాధానాలు చెబుతుంటే.. పోలీసులకు సమాచారమిచ్చి పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ నా పేరు సురేష్‌, నాది అనంతపురం జిల్లా బత్తలపల్లి సమీపంలోని డి.చెర్లోపల్లె గ్రామం అని చెప్పారు.

Khammam

  • ఆశ్రీ

    జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య నిత్యకృత్యమైంది. అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ

    విషయంలో బాలికల తిప్పలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటు, మరమ్మతులపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడమే కాక పలు చోట్ల నీటి

    సరఫరా లేకపోవడం.. ఇంకొన్ని చోట్ల తలుపులు బేడాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

    ఇలా ఉండాల్సిందే..

    పాఠశాలలో టాయిలెట్లు, యూరినల్స్‌ నిర్మాణంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్‌, ప్రతీ పది మందికి ఒక యూరినల్‌ ఉండాలి. కానీ ఎక్కడా ఇలా ఉన్న దాఖలాలు కానరావు. ప్రభుత్వం తరఫున చొరవ లేకపోగా విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం విద్యార్థుల సమస్యకు కారణమవుతోంది.

    ప్రతిపాదనలతోనే సరి

    జిల్లాలోని పలు పాఠశాలల్లో టాయిలెట్ల అవసరాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. బాలురకు సంబంధించి 75 పాఠశాలల్లో 75, బాలికలకు సంబంధించి ఆరు పాఠశాలల్లో ఆరు టాయిలెట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే, 14 పాఠశాలల్లో బాలురకు 103 టాయిలెట్లు, ఐదు చోట్ల బాలికలకు 26 టాయిలెట్ల మరమ్మతులు చేయించాలని పేర్కొన్నగా ప్రతిపాదనల దశ దాటలేదు. కానీ అమ్మ ఆదర్శపా ఠశాలల కమిటీల ఆధ్వర్యాన బాలురకు 89 టాయిలెట్లు, బాలికలకు 21 టాయిలెట్ల మరమ్మతు చేయించారు.

    లెక్కలో అంతా సరి...

    జిల్లాలో 1,216 పాఠశాలలు ఉండగా పలు స్కూళ్లలో విద్యార్థులు మరుగుదొడ్ల సమస్య ఎదుర్కొంటున్నారు. కానీ అధికారులు మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు లెక్కలు చూపిస్తుండడం గమనార్హం. జిల్లాలో బాలురకు 4,741 టాయిలెట్లు ఉండగా.. అందులో 4,591 టాయిలెట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇక బాలికలకు 5,871 మరుగుదొడ్లు ఉండగా.. అందులో 5,694 పనిచేస్తున్నాయని తేల్చారు. కానీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు అలంకారప్రాయంగా మారా యని విద్యార్థుల ద్వారా తెలుస్తోంది. కొన్నిచోట్ల నీటి సమస్య ఉండగా.. మరికొన్ని చోట్ల పైపులైన్లు ధ్వంసమై, తలుపులు, కిటికీలు దెబ్బతినడంతో ఉపయోగించుకునే వీలుండడం లేదు.

    సరిపడినంతగా లేవు..

    ఖమ్మం నడిబొడ్డున ఇందిరానగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 157 మంది బాలికలు, 278 మంది బాలురు చదువుతున్నారు. గత ఏడాది వరకు ఈ పాఠశాలలో బాలురకు యూరినల్సే లేవు. దీంతో సమీపంలోని పబ్లిక్‌ టాయిలెట్‌కు వెళ్లేవారు. గత ఏడాది కొత్తగా 16 యూరినల్స్‌ నిర్మించడంతో కొంత ఇబ్బంది తీరింది. బాలికలకు ఐదు యూరినల్స్‌, రెండు మరుగుదొడ్లు ఉండగా.. విద్యార్థుల సంఖ్యకు ఇవి సరిపోవడం లేదు. ఇంకా బాలురకు రెండు, బాలికలకు మూడు యూరినల్స్‌ నిర్మించాల్సి ఉంది. అలాగే, ఈ పాఠశాలలో మహిళా టీచర్లకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేకపోవడం గమనార్హం.

    క్యూ కట్టాల్సిందే..

    కారేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 121 మంది బాలురు, 45 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్నా ఇవి సరిపడా లేక క్యూ కట్టాల్సి వస్తోంది. ఇక్కడ ౖపైలెన్‌ పగిలి నీటి సౌకర్యం లేదు. టాయిలెట్ల తలుపులకు బేడాలు లేకపోవడంతో ఎవరైనా లోనకు వెళ్తే మరొకరు బయట కాపలా ఉండాల్సి వస్తోంది.

    ప్రభుత్వ పాఠశాలల్లో

    అధ్వానంగా మరుగుదొడ్లు

    పలు స్కూళ్లలో మరుగుదొడ్లు ఉన్నా నీరు కరువు

    కనీస మరమ్మతులకు నోచుకోక

    నిరుపయోగంగా..

    ఫలితంగా విద్యార్థులు,

    ఉపాధ్యాయినుల ఇబ్బందులు

    నీరు తెచ్చుకోవాలి..

    కామేపల్లి మండలం కొమ్మినేపల్లి ప్రాథమిక పాఠశాల మరుగుదొడ్డిలో నీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్డిపై ట్యాంక్‌ నిర్మించినా బోర్‌ మోటార్‌ నుంచి పైపులైను కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో ప్రతిరోజు స్కావెంజర్‌ నీరు సమకూర్చాల్సి వస్తోంది.

    మరమ్మతు చేయించాలి..

    మా పాఠశాలలో టాయిలెట్లు సరిగా లేవు. పైపులైన్లు పగిలి నీళ్లు సరిగా రావడం లేదు. వచ్చినా వృథా అవుతోంది. గోడలన్నీ బీటలు బారాయి. టాయిలెట్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నందున మరమ్మతులు చేయిస్తే బాగుంటుంది.

    – కె.లాస్య, పదవ తరగతి, కారేపల్లి హైస్కూల్‌

  • ఖమ్మం

    ఖమ్మంఅర్బన్‌: ఖమ్మంలో గ్రానైట్‌, మార్బుల్‌ వ్యాపారం మరింత అభివృద్ధి చెందేలా ఫిగ్సీ(ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ గ్రానైట్‌, స్టోన్‌ ఇండస్ట్రీ) ఆధ్వర్యాన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు నిర్వాహకులు సంసిద్ధత వ్యక్తం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పూణేలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం వెళ్లిన మంత్రి తుమ్మల ఫిగ్సీ చైర్మన్‌ ఇష్వీందర్‌ సింగ్‌ ఆహ్వానంతో అక్కడి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా యువతకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి.. ఖమ్మంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ప్రారంభించాలని సూచించారు. ఈమేరకు చైర్మన్‌ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే సెంటర్‌ ఏర్పాటు చేస్తామని బదులిచ్చారు. ఈ పర్యటనలో కాంగ్రెస్‌ నాయకుడు సాదు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    అప్రమత్తతతోనే

    వ్యాధులు దూరం

    కూసుమంచి: ప్రతీఒక్కరు ఇళ్లలోనే కాక పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉంటేనే సీజనల్‌ వ్యాధులు దరిచేరవని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ తెలిపారు. మండలంలోని పాలేరు, గైగొళ్లపల్లి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. డ్రై డే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించిన అదనపు కలెక్టర్‌.. ఇళ్ల ముందు వర్షపు, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అలాగే, గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహణతో జ్వరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. కాగా, గైగొళ్లపల్లిలో చేయూత పెన్షన్ల పంపిణీ తీరుపై ఆరా తీసిన శ్రీజ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

    ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కుటుంబానికి చేయూత

    ఖమ్మంవ్యవసాయం: విధినిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన పాడి పరిశ్రమ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కుటుంబానికి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ రూ.10లక్షల ఆర్థిసాయాన్ని మంజూరు చేసింది. విజయ డెయిరీ ఖమ్మం యూనిట్‌ పరిధి కామేపల్లి మండలం కొత్తలింగాలలో పదేళ్లుగా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పులి నాగేశ్వరరావు శరీరంపై ఇటీవల యాసిడ్‌ పడింది. ఎక్కడ చికిత్స చేయించినా ఫలితం లేక మృతి చెందడంతో ఆయన కుటుంబానికి రూ.10లక్షల సాయం ప్రకటించారు. ఈమేరకు నాగేశ్వరరావు భార్య సుగుణమ్మకు హైదరాబాద్‌లో విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి చెక్కు అందజేశారు.

    డ్రగ్‌ స్టోర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

    ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కొనసాగుతున్న సెంట్ర ల్‌ డ్రగ్‌ స్టోర్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల స్టాక్‌, రికార్డులు, పీహెచ్‌సీలకు సరఫరా, నిల్వల తీరును పరిశీలించారు. మందుల లభ్యత, గడువును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మేర స్టాక్‌ తెప్పించుకోవాలని ఉద్యోగులకు సూచించారు. తద్వారా కొరత ఎదురుకాదని తెలిపారు. అంతేకాకుండా నిల్వల విషయంలో జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు.

  • ప్రకాశ్‌నగర్‌ చెక్‌డ్యాం ఎత్తు తగ్గింపు

    ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం ప్రకాశ్‌నగర్‌లో మున్నేటిపై నిర్మించిన చెక్‌డ్యాం ఎత్తు తగ్గింపు పనులు మొదలయ్యాయి. ఈ చెక్‌డ్యాంను రూ.7కోట్లతో నిర్మించగా 2019లో మొదలైన పనులు 2022లో పూర్తయ్యాయి. అయితే, గత ఏడాది మున్నేటి వరద పోటెత్తగా ఈ చెక్‌డ్యాం వద్ద ప్రవాహం అడ్డుపడడంతోనే పరీవాహక ప్రాంతాలకు నష్టం జరిగిందనే అంచనాకు వచ్చారు. ఈమేరకు ఎత్తు తగ్గింపుపై కలెక్టర్‌ నివేదిక సమర్పించగా ఆయన ఆదేశాలతో శుక్రవారం పనులు మొదలుపెట్టారు. గ్రానైట్‌ రాళ్లు కట్‌ చేసేందుకు ఉపయోగించే యంత్రాల సాయంతో దాదాపు 200 మీటర్ల పొడవుతో ఉన్న చెక్‌డ్యాంను కొలత ప్రకారం ఎత్తు తగ్గిస్తున్నారు. కాగా, భూమి లోపలి నుంచి 11 అడుగుల ఎత్తుతో, ఉపరితలంపై ఏడు అడుగులుగా చెక్‌ డ్యాం ఉంటుంది. ప్రస్తుతం 5.5 అడుగుల మేర తొలగిస్తుండడంతో 1.5 అడుగులు మాత్రమే మిగిలే అవకాశముంది. ఈ పనులను ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ పి.రాంప్రసాద్‌ పర్యవేక్షిస్తున్నారు.

    ప్రత్యేక యంత్రాలతో మొదలైన పనులు

    భిన్నాభిప్రాయాలు

    రూ.7కోట్లతో ప్రకాశ్‌నగర్‌ వద్ద మున్నేటిపై చెక్‌ డ్యాం నిర్మించగా అన్ని కాలాల్లో ఇక్కడ నీరు నిల్వ ఉంటోంది. నగరంలో భూగర్భ జలాలు పెరగడానికి ఇక్కడి నిల్వలే కారణమని చెబుతున్నారు. కానీ నిర్మించిన మూడేళ్లలోనే చెక్‌ డ్యాం ఎత్తు తగ్గిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో వరద వచ్చినా ఈ ఏడాది కూడా పరిశీలించాక.. ప్రమాదముందని నిర్ధారణ అయ్యాక తొలగిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాంటిదేమీ లేకుండా చెక్‌డ్యాం తొలగిస్తుండడంతో నగరంలో భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని పలువురు చెబుతున్నారు. కాగా, ప్రజల భద్రత దృష్ట్యా చెక్‌ డ్యాం ఎత్తు తగ్గింపునకు కలెక్టర్‌ అనుమతి జారీ చేయగా... జలవనరుల శాఖ ఉన్నతాఽధికారుల అనుమతి కోసం లేఖ రాసినా బదులు రాలేదని సమాచారం.

  • పకడ్బందీగా ఆర్‌టీఐ చట్టం అమలు

    ఖమ్మంసహకారనగర్‌: గత రెండేళ్లుగా ఆర్‌టీఐ కమిషనర్లు లేని కారణంగా 15 వేలకు పైగా కేసులు పేరుకుపోయాయని, వీటిని త్వరగా పరిష్కరిస్తూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయడంపై అధికారులు దృష్టి సారించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్‌ పీ.వీ.శ్రీనివాసరావు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మరో కమిషనర్‌ భూపాల్‌, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, పోలీస్‌ కమీషనర్‌ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఉన్నందున అధికారులు సహకరించాలని తెలి పారు. దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యమైతే ప్రజల్లో అనుమానాలు రానున్నందున.. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ఇవ్వాలని సూచించారు. మరో కమిషనర్‌ భూపాల్‌ మాట్లాడుతూ ఆర్‌టీసీ చట్టంపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అనంతరం పెండింగ్‌ కేసులపై అప్పీళ్లను స్వీకరించారు. ఆతర్వాత కలెక్టర్‌ అనుదీప్‌ మాట్లాడగా ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, డీఆర్‌ఓ పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

    రిటైనింగ్‌ వాల్‌ పనులపై కలెక్టర్‌ సమీక్ష

    ఖమ్మం మున్నేరు అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణలో వేగం పెంచాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదేశించారు. మున్నేటి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పురోగతి, అవసరమైన భూసేకరణ, భూనిర్వాసితులకు ఇచ్చే లే ఔట్‌ పనులపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించడమే కాక, నిర్వాసితులకు స్థలాలు కేటాయించనున్న లేఔట్‌ అభివృద్ధిపై సూచనలు చేశారు. రైతుల పొలాలకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లును కేటాయిస్తున్నందున లేఔట్‌లో అంతర్గత రోడ్లు, వీధి లైట్లు, విద్యుత్‌ సంబంధిత పనులు చేపట్టాలని తెలిపారు. పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్‌, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    కమిషనర్లు శ్రీనివాసరావు, భూపాల్‌

  • మరింత వేగంగా ఆధునికీకరణ పనులు

    ఖమ్మం రాపర్తినగర్‌/మధిర: రైల్వేస్టేషన్లలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం ఎం. గోపాలకృష్ణన్‌ ఆదేశించారు. జిల్లాలోని ఖమ్మం, మధిర స్టేషన్లలో పనులను శుక్రవారం ఆయన తని ఖీ చేశారు. ఖమ్మంలో తనిఖీల సందర్భంగా అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్న ఆయన ఇకనైనా వేగం పెంచకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసందర్భంగా ఖమ్మంలో ఎక్సలేటర్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, విశ్రాంతి భవన్‌, రైల్వేస్టేషన్‌ కార్యాలయం పనులపై సూచనలు చేశారు. అలాగే, మధిర స్టేషన్‌లోని 1, 2వ నంబర్‌ ప్లాట్‌ఫారంలపై పనులు పరిశీలించిన డీఆర్‌ఎం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈకార్యక్రమాల్లో ఖమ్మం రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ సుభాస్‌ చంద్రబోస్‌, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

    రైల్వేస్టేషన్లలో తనిఖీ చేసిన డీఆర్‌ఎం

  • అమృతం కంటే విలువైనవి తల్లి పాలు

    ఖమ్మంవైద్యవిభాగం: తల్లిపాలు అమృతం కంటే విలువైనవని, బిడ్డ ఎదుగుదలకు దోహదపడతాయని ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ మెతుకు నరేందర్‌ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంసీహెచ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్‌ మాట్లాడుతూ పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించడం వల్ల రోగ నిరోధక శక్తి వస్తుందని, తల్లికి కూడా ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈమేరకు వారం పాటు తల్లి పాల ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ బి.కిరణ్‌కుమార్‌, వివిధ విభాగాల వైద్యులు, ఉద్యోగులు బాబు రత్నాకర్‌, రాంబాబు, వినాయక్‌ రాథోడ్‌, యామిని, కిరణ్‌కుమార్‌, పవన్‌కుమార్‌, డి.శాంతకుమారి, శేషు పద్మ, రఘురాం పాల్గొన్నారు.

    పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌ నరేందర్‌

Jagtial

  • ‘డబుల్‌’ అర్హుల సర్వే

    జగిత్యాల: పేదలకు గూడు కల్పించాలనే

    ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లాకేంద్రం శివారులోని నూకపల్లిలో డబుల్‌బెడ్‌రూం నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ఇక్కడ 4,520 ఇళ్లు నిర్మించారు. దాదాపు ఇళ్లన్నీ పూర్తయ్యాయి. లబ్ధిదారులను డ్రా పద్ధతిన ఎంపిక చేసి ఇళ్లను కేటాయించారు. ప్రస్తుతం సుమారు 880 వరకు ఇంకా ఖాళీగా ఉన్నాయి. వీటిని లబ్ధిదారులకు కేటాయించేందుకు ఇటీవలే కలెక్టర్‌ సత్యప్రసాద్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. జగిత్యాలకు చెందిన 1088 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి వివరాలు సేకరిస్తున్న అధికారులు.. అర్హులైన వారికి ఇళ్లు కేటాయించేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్వే చేపడుతున్నారు.

    యాప్‌లో నమోదు చేసిన అధికారులు అన్ని అర్హతలుంటేనే ఇల్లు కేటాయింపు

    పకడ్బందీగా చేపడుతున్న అధికారులు

    48 మందికి కేటాయింపు

    డబుల్‌బెడ్‌రూంల కోసం దరఖాస్తు చేసుకున్న 1088 మందిలో అర్హులెవరు.. అనర్హులెవరూ.. తెలుసుకునేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇందులో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంపీడీవోలు ఉన్నారు. వీరి పర్యవేక్షణలో సర్వే కొనసాగుతోంది. కచ్చితంగా అర్హులైన వారికే ఇళ్లు దక్కేలా పకడ్బందీగా సర్వే చేపడుతున్నారు. దీనికి 360 డిగ్రీల్లో ఓ యాప్‌ను ఏర్పాటు చేసి అందులో వీరి వివరాలు పొందుపర్చి కలెక్టర్‌కు పంపించనున్నారు. ప్రభుత్వానికి వెళ్లిన అనంతరం అర్హులైన వారి లిస్ట్‌ గృహ నిర్మాణశాఖకు రానుంది.

    గతంలో అనేక తప్పిదాలు

    నూకపల్లిలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో గ తంలో అనేక తప్పిదాలు జరిగాయి. ఆ శాఖలో పనిచేసిన ఓ ఉద్యోగి ఏకంగా అనుకూలమైన వ్యక్తులకు కేటాయించడంతో సస్పెండ్‌ అయ్యారు. ఈ సారి అలాంటిదేమీ చేయకుండా పకడ్బందీగా సర్వే చేపడుతున్నారు. గతంలో డ్రా పద్ధతిలో ఏర్పాటు చేసి మినీస్టేడియంలో అందరిముందే డ్రా తీశారు. డ్రా తీసి జాబితాను రూపొందించారు. ఆ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగికి ఇతర మండలాలకు చెందిన వారిని కొంత మందిని జాబితాలో చేర్చడంతో అనేకమంది అర్హులు కాని వారికి డబుల్‌బెడ్‌రూంలు దక్కాయి. ఈసారి అలాంటివి జ రగకుండా ఉండాలనే ఉద్దేశంతో తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీవోలు మొత్తం 48 మంది సర్వే చేస్తున్నారు.

    అభివృద్ధికి ఊతం

    నూకపల్లి సమీపంలో 4520 డబుల్‌బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో అతిపెద్ద కాలనీగా అవతరించింది. దీనిని మున్సిపాలిటీలో కూడా విలీనం చేశా రు. ఇక్కడే రాష్ట్ర ఆవిర్భావానికి ముందే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించింది. కానీ.. అవి పునాదుల వరకు.. కొన్ని స్లాబ్‌ వరకే నిర్మించుకుని వదిలేశారు. తాజాగా డబుల్‌బెడ్‌రూం కాలనీ వద్ద అంగన్‌వాడీ సెంటర్‌, స్కూల్‌ బిల్డింగ్‌, ఆస్పత్రి వంటి సౌకర్యాల నిర్మాణం చేపట్టేందుకు స్థలం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ని ర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కూల్చివేశారు. ఇది వివా దాస్పదంగా మారింది. గతంలో తమకు కేటాయించిన ఇళ్లను కూల్చివేశారంటూ కలెక్టర్‌కు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా ఆ కాలనీని సందర్శించి పేదలకు అన్యాయం చేయొద్దని అధికారులకు సూచించారు. మరోవైపు బాధితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ప్రకటించారు.

    అర్హుల

    ఎంపిక కోసం

    సర్వే

    డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం 1088 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సర్వే చేస్తున్నాం. పక్కాగా అర్హులైన వారికే ఇళ్లు కేటాయిస్తాం. వివరాలన్నీ యాప్‌లో నమోదు చేస్తున్నాం.

    – రాంమోహన్‌, అర్బన్‌ తహసీల్దార్‌

  • మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
    ● ఎస్పీ అశోక్‌కుమార్‌

    జగిత్యాలక్రైం: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడుతాయని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మెగా వాలీవాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. కొన్ని రోజులుగా పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌స్థాయిలో వాలీబాల్‌ టోర్నీ నిర్వహించామని, అందులో గెలుపొందిన వారిని జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. యువత తమ ఆలోచనలను సరైన దిశలో వినియోగించుకోవాలని, సామాజిక బాధ్యతతో ముందడుగు వేయాలన్నారు. ప్రతీ క్రీడాకారులు యాంటీడ్రగ్స్‌ వారియర్‌గా పనిచేసి డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చడంలో కృషి చేయాలని సూచించారు. అనంతరం గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి తనవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ వెంకటస్వామి, జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు రఘుచందర్‌, రాములు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్‌, వేణు, సైదులు, సీఐలు శ్రీనివాస్‌, ఆరీఫ్‌ అలీఖాన్‌, శ్రీనివాస్‌, కరుణాకర్‌, సుధాకర్‌, రాంనర్సింహారెడ్డి, సురేశ్‌, ఎస్సైలు అనిల్‌కుమార్‌, సదాకర్‌ పాల్గొన్నారు.

  • రాష్ట్రంలో గృహ నిర్మాణానికి ప్రాధాన్యం
    ● 4లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం ● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

    జగిత్యాలరూరల్‌: రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2025–26 సంవత్సరానికి 4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. దశాబ్దకాలంగా మంజూరు కాని రేషన్‌కార్డులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హత ప్రాతిపాదికన మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాజంగి నందన్న, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ శీలం సురేందర్‌, మాజీ ఎంపీపీ మహేశ్‌, నాయకులు శ్రీరాముల గంగాధర్‌, మంగళారపు మహిపాల్‌, సత్తిరెడ్డి, మన్మోహన్‌, వంశీ, శంకర్‌, మల్లారెడ్డి, తిరుపతిరావు పాల్గొన్నారు.

  • వర్షా

    ఈ సీజన్‌లో వర్షాలు కురువకపోవడం, కురిసిన ఒక్కటి, రెండు జల్లులకే పరిమితమవడంతో సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నాలుగైదు రోజులు వర్షాలు పడకపోతే ఆరుతడి పంటలు వాలిపోతాయి. ప్రస్తుతం వ్యవసాయ బావుల్లో ఉన్న నీటితో పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడింది.

    – రాజేందర్‌ రెడ్డి, చిట్టాపూర్‌, మల్లాపూర్‌(మం)

    ఇంకా సమయం ఉంది

    వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల జూలైలో పెద్దగా వర్షాలు కురవలేదు. నైరుతీ రుతుపవనాలకు ఇంకా సమయం ఉంది కాబట్టి అగస్టులో వర్షం పడేందుకు అవకాశాలు ఉన్నాయి. రైతులు వర్షాల గురించి ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    – డాక్టర్‌ హరీశ్‌కుమార్‌ శర్మ, వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌, పొలాస

  • పూర్వ వైభవం దిశగా  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

    జగిత్యాల: పునర్‌వైభవం దిశగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ముందుకెళ్తున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కడారు సురేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలను సందర్శించారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అడ్మిషన్లు సాధించడంలో ప్రభంజనం సృష్టించాయని తెలిపా రు. ప్రతీ అధ్యాపకుడు విద్యార్థులకు ఎన్నో సేవలందించడం జరుగుతుందని, విద్యార్థుల సంఖ్య పెరగడమే దానికి నిదర్శనమన్నారు. అధ్యాపకుల సంఘం తరుఫున అడ్మిషన్లతో పాటు, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆడెపు శ్రీనివాస్‌, కరుణాకర్‌, తోట మహేశ్‌, కృష్ణారెడ్డి, పడాల తిరుపతి, గోవర్దన్‌, మధూకర్‌, సంగీతరాణి, సుజాత పాల్గొన్నారు.

  • ఆస్తిపన్ను పక్కదారి  పట్టించిన ఉద్యోగిపై వేటు

    జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఆస్తిప న్ను డబ్బులు పక్కదారి పట్టించిన ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు. ఈ విషయమై కమిషనర్‌ స్పందనను అడుగగా.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సొంతానికి వాడుకున్న బిల్‌కలెక్టర్‌ నర్సయ్యను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఆలస్యంగా ఆస్తిపన్నుకు సంబంధించిన డిపాజిట్‌ను మున్సి పల్‌ అకౌంట్‌లో జమచేయడంతో మెమో ఇచ్చామని, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సస్పెండ్‌ చేశామని అన్నారు.

    తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలి

    జగిత్యాల: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంక్షేమ అధికారి నరేశ్‌ అన్నారు. ప్రస్తుతకాలంలో తల్లిదండ్రులు బిడ్డకు సంరక్షణ అందించడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని, ప్రసవం అనంతరం పిల్లల సంరక్షణ ఎంతో ముఖ్యమైందని తెలిపారు. తల్లిపాల గురించి ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు.

    ఓపెన్‌ స్కూల్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు

    జగిత్యాల: ఓపెన్‌ స్కూల్‌కు 2025–26 సంవత్సరానికి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌ ప్రవేశాల కోసం నిర్ణీత ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18 వరకు గడువు పొడిగించినట్లు డీఈవో రాము తెలిపారు. ఆలస్య రుసుముతో 19నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం అన్ని పత్రాలను విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

    అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

    జగిత్యాలఅగ్రికల్చర్‌: ఉద్యోగులు అంకితభావ ంతో పనిచేస్తేనే సంస్థకు గుర్తింపు వస్తుందని డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్‌ అన్నారు. జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖలో ఇటీవల బదిలీపై వచ్చిన ఏపీఎంలతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అమలు చేస్తున్న బ్యాంకు లింకేజీ, మార్కెటింగ్‌, ఫామ్‌–నాన్‌ ఫామ్‌, సీ్త్రనిధి కార్యక్రమాలు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను విజయవంతం చే యాలని కోరారు. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా ను ముందంజలో ఉంచేందుకు కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరిన ఏపీఎంలు డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్‌కు పుష్పగుచ్ఛం అందించారు. ఏపీడీ సునీత, డీపీఎంలు విజయభారతి, నాగేశ్వర్‌రావు, నారాయణ, పాల్గొన్నారు.

    మహిళా కళాశాలలో ఏఐ అంతర్జాతీయ ఉచిత శిక్షణ

    జగిత్యాల: ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినులకు విద్యాశాఖ, హైదరాబాద్‌ ఏఐ స్కూల్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ తెలిపారు. ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్న శిక్షణను ఆన్‌లైన్‌లో మూడు నెలల పాటు కల్పిస్తారన్నారు. ఈ కోర్సుతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 కళాశాలలు ఎంపిక చేయగా.. అందులో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉందని, ఇది మన అదృష్టమని పేర్కొన్నారు.

  • చిరుజల్లులకే పరిమితమైన వర్షాలు
    ● జిల్లాలోని 20 మండలాల్లో లోటు వర్షాపాతమే.. ● రైతులకు వ్యవసాయబావులే ఆధారం ● రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు అంతంతే..

    జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వానాకాలం సీజన్‌ ప్రారంభమై జూన్‌, జూలై నెలలు గడిచినప్పటికీ చిరుజల్లులకే పరిమితమవుతున్నాయి. ఒక్కటి, రెండు మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ పెద్దగా చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు నిండిన దాఖలాలు లేవు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షంతో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కంది, పెసర పంటలకు కొంతమేర ఉపశమనం కలిగింది. అయితే నాలుగైదు రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఆరుతడి పంటలు సైతం వాలిపోతున్నాయి. ఇక వరి పొలాలు సాగు చేసే రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాబోయే ఐదు రోజుల్లో కూడా వర్షాలు పెద్దగా లేవని, చిరుజల్లులకే పరిమితం కావచ్చని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    జిల్లా అంతటా లోటు వర్షపాతమే..

    ఆగస్టు నెల వచ్చినప్పటికీ ఇప్పటికి జిల్లాలోని 20 మండలాల్లో అంతంటా లోటు వర్షాపాతమే కనిపిస్తోంది. జిల్లాలో ఆగస్టు 1 నాటికి సాధారణ వర్షాపాతం 445.7 మి.మీ ఉండాల్సి ఉండగా.. 331.6 మి.మీ. మాత్రమే కురిసింది. జిల్లా అంతటా సగటున 26 మి.మీ. తక్కువ వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 28 మి.మీ, మల్లాపూర్‌లో 6.0 మి.మీ, రాయికల్‌లో 27.0 మి.మీ, బీర్‌పూర్‌లో 27.0 మి.మీ, సారంగాపూర్‌లో 10.0 మి.మీ, ధర్మపురిలో 27.0 మి.మీ, బుగ్గారంలో 35.0 మి.మీ, జగిత్యాల రూరల్‌లో 23.0 మి.మీ, జగిత్యాలలో 30.0 మి.మీ, మేడిపల్లిలో 15.0 మి.మీ, కోరుట్లలో 26.0 మి.మీ, మెట్‌పల్లిలో 40.0 మి.మీ, కథలాపూర్‌లో 32.0 మి.మీ, కొడిమ్యాలలో 19.0 మి.మీ, మల్యాలలో 26.0 మి.మీ, పెగడపల్లిలో 24.0 మి.మీ, గొల్లపల్లిలో 31.0 మి.మీ, వెల్గటూర్‌లో 35.0 మి.మీ, ఎండపల్లిలో 29.0 మి.మీ, బీమారంలో 16.0 మి.మీ తక్కువ వర్షాపాతం నమోదైంది.

    వ్యవసాయబావులపైనే ఆధారం

    జిల్లాలో లోటు వర్షాపాతం ఏర్పడటంతో రైతులు వ్యవసాయబావుల్లో ఉన్న నీటిపై ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో వానాకాలం సీజన్‌ పంటలన్నీ వర్షాధారంపైనే పండేవి, అవసరమైనప్పుడు బావి ద్వారా ఒక్కటి రెండు నీటి తడులు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు కురువకపోవడంతో పూర్తిగా వ్యవసాయబావులపైనే ఆధారపడుతుండటంతో ఆ బావులు సైతం అడుగంటుతున్నాయి.

  • ఉపాధ్
    ● విద్యార్థులకు ఉపయోగించే యాప్‌ వినియోగం ● అన్ని పాఠశాలల్లో అమలు ● తొలిరోజు 70శాతమే నమోదు

    జగిత్యాల: విద్యార్థులకే పరిమితమైన ముఖ గుర్తింపు హాజరు శుక్రవారం నుంచి ఉపాధ్యాయులకు సైతం అమలవుతోంది. గతంలో విద్యార్థులు పాఠశాలలకు రాకపోవడంతో హాజరు మాత్రం ఉండటంతో డుమ్మా కొట్టే విద్యార్థుల కోసం ఫేస్‌ రికగ్నైజ్డ్‌ అటెండెన్స్‌ విధానం(ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను అమలు చేశారు. ఉపాధ్యాయులకు సైతం అమలు చేయడంతో విధులకు డుమ్మా కొట్టే వారికి చెక్‌ పడే అవకాశం ఉంది.

    డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా అమలు

    విద్యార్థులకు ఉపయోగిస్తున్న డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఫేస్‌ రికగ్నైజ్డ్‌ సిస్టమ్‌ యాప్‌ ద్వారానే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్‌ టీ చింగ్‌ సిబ్బంది హాజరు కావాల్సి ఉంటుంది. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద మొదట పెద్దపల్లి జిల్లాలో చే పట్టగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో చేపడుతున్నారు.

    తొలిరోజు 70 శాతం

    ఉపాధ్యాయులకు శుక్రవారం నుంచి ముఖ గుర్తింపు హాజరు అమలు కావడంతో జగిత్యాల జిల్లాలో తొలిరోజు డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా 70 శాతం హాజరు నమోదైంది. 30 శాతం ఉపాధ్యాయుల అటెండెన్స్‌ నమోదు కాలేదు.

    సర్వర్‌ సమస్య:

    జిల్లాలో ఒకేసారి ఒకే సమయంలో అందరు ఒకే యాప్‌లో నమోదు చేయడంతో సర్వర్‌ సమస్యగా మారింది. కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు చాలా సేపు ప్రయత్నించినా సర్వర్‌ సమస్యతో అటెండెన్స్‌ పడలేదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచే యాప్‌ అమలులోకి వచ్చినప్పటికీ వారం రోజుల వరకు చూడటం జరుగుతుందని విద్యాధికారులు తెలిపారు.

    ముఖ హాజరు తప్పనిసరి

    ఉపాధ్యాయుల ముఖ హాజరు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. తొలిరోజు సర్వర్‌ సమస్య వచ్చింది. వారం రోజుల పాటు ఇది గమనించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దేలా చర్యలు తీసుకుంటాం.

    – రాము, డీఈవో

  • కోమన్‌పల్లి భూములకు పూర్తిస్థాయి రికార్డులు

    సారంగాపూర్‌: కోమన్‌పల్లి గ్రామ భూములకు ఇప్పటివరకు ఎలాంటి రికార్డులు లేవని, ప్రస్తుతం పూర్తిస్థాయి భూరికార్డులు, నక్షా, సేత్వార్‌ను రూపొందించినట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం బీర్‌పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామంలో భూభారతి కింద పునరావాస గ్రామమైన కోమన్‌పల్లిని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామంలోని భూములను రీసర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో కలెక్టర్‌ మాట్లాడుతూ కోమన్‌పల్లిలో మొత్తం 419 సర్వే నంబర్ల కింద 616 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని పైలెట్‌ ప్రాజెక్టు కింద రీసర్వే చేసి పూర్తిస్థాయి రికార్డులు రూపొందించామన్నారు. దీనిపై రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామశివారులోని భూములను, ఎస్సారెస్పీ కాలువల భూములను ఎస్సారెస్పీ ఈఈ చక్రూనాయక్‌తో కలిసి పరిశీలించారు. పంచాయతీ రాజ్‌ అధికారులతో గ్రామంలోని రోడ్ల భూములపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, జగిత్యాల ఏడీ(సర్వే) వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ సుజాత, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

    కేజీబీవీ సందర్శన

    సారంగాపూర్‌ కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు.విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని సూచించారు. 8వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్‌తో పాటు బయోలజీ సబ్జెక్టులను బోధించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి ఇచ్చిన సమాధానంతో మరింత వివరించారు. పరిసరాలు, వంట గదిలో నిల్వ ఉన్న స్టాక్‌ను పరిశీలించి భోజనం రుచిగా, శుచిగా ఉండాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి బాగుందని అభినందించారు.

    కలెక్టర్‌ సత్యప్రసాద్‌

  • రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
    ● మందులు అందుబాటులో ఉంచాలి ● సమయపాలన పాటించాలి ● రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్‌

    జగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలో వసతులు, రోగులకు మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలు నిత్యం సమీక్షించాలని సూచించారు. ముఖ్యంగా కాలానుగుణంగా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజూ వస్తున్న ఓపీ వివరాలను నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో అందుతున్న ల్యాబ్‌ సేవలు మెరుగ్గా ఉండాలని తెలిపారు. జగిత్యాల జిల్లా సిజేరియన్లలో 75 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని, దీనిని తగ్గించి సాధారణ ప్రసవాలు అయ్యేలా గర్భిణులను ప్రోత్సహించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, జైపాల్‌రెడ్డి, అర్చన, రవీందర్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

    మల్యాల పీహెచ్‌సీ సందర్శన

    మల్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని –రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు రవీంద్రనాయక్‌ శుక్రవారం సందర్శించారు. సేవల నాణ్యత, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్య సేవలు, మతా శిశు కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎన్‌.శ్రీనివాస్‌, జిల్లా ప్రోగ్రాం అధికారులు అర్చన, ఏఎంవో సత్యనారాయణ, మండల వైద్యురాలు మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

  • 36 మంది బాలకార్మికులకు విముక్తి
    ● జిల్లాలో ముగిసిన ఆపరేషన్‌ ముస్కాన్‌

    జగిత్యాలక్రైం: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయస్సులో పనిలో మగ్గిపోతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు జూలై1నుంచి 31వరకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ 11వ విడత కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. బడిబయట ఉన్న 36 మంది చిన్నారులను గుర్తించిన అధికారులు వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కొంతమంది చిన్నారులు ఆర్థికంగా ఇబ్బందులతో తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి బడికి వెళ్లకుండా వెట్టి చాకిరి చేస్తున్న బాలలకు జిల్లా పోలీసు శాఖ, ఐసీడీఎస్‌ అధికారులు విముక్తి కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అశోక్‌కుమార్‌ ఒక సబ్‌డివిజన్‌ పరిధిలో ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక్క మహిళా కానిస్టేబుల్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రతిరోజూ జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటళ్లు, దాబాలు, దుకాణాల్లో, బేకరీల్లో పనిచేస్తున్న 36 మందిని గుర్తించారు.

    చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలు

    జిల్లాలో బడీడు పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జూలై 1నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో 36 మందికి విముక్తి కల్పించాం. పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశాం. – అశోక్‌కుమార్‌, ఎస్పీ, జగిత్యాల జిల్లా

Jayashankar

  • శనివా

    మల్హర్‌ మండలంలో మొక్కదశలో ఉన్న పత్తిచేను

    పలిమెల 375.1

    భూపాలపల్లి 348.5

    మొగుళ్లపల్లి 318.4

    రేగొండ 311

    టేకుమట్ల 304.5

    చిట్యాల 303.4

    మహాముత్తారం 293.9

    గణపురం 283.5

    మహదేవపూర్‌ 278.3

    మల్హర్‌ 257.7

    కాటారం 247.2

    కొత్తపల్లిగోరి 214.2

    కల్యాణం.. కమనీయం

    రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణం నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్‌, సుధాకర్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

    లక్ష్మీదేవరకు పూజలు

    మల్హర్‌: శ్రావణ శుక్రవారం సందర్భంగా మండలంలోని కొయ్యూరు పీవీనగర్‌ గ్రామంలో ఆదివాసీలు శ్రీ లక్ష్మీదేవర ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలోని లక్ష్మీదేవర తల్లికి మహిళలు గాజులు సమర్పించి, పసుపు, కుంకమలతో అభిషేకం చేశారు. అనంతరం మహిళలు ఒకరికొకరు గా జులు వేసుకొని సంబరాలు జరుపుకున్నారు.

    ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు

    గడువు పొడిగింపు

    భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఓపెన్‌ ఇంటర్‌, టెన్త్‌ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడుపును పొడిగించినట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరాద రుసుము లేకుండా ఈ నెల 18వ తేదీ వరకు, అపరాద రుసుముతో 28వ తేదీ వరకు ప్రవేశాల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల కోసం ప్రతీ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్టడీ సెంటర్లను సంప్రదించాలని కోరారు.

    75శాతం బొగ్గు ఉత్పత్తి

    భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలోని కాకతీయ గనుల్లో గడిచిన జూలై మాసంలో 75శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై మాసంలో 2.91 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 2.18లక్షల బొగ్గు ఉత్పత్తిని వెలికితీసినట్లు చెప్పారు. వెలికితీసిన బొగ్గును రవాణా చేసినట్లు తెలిపారు. జూలై మాసంలో అత్యధికంగా 265 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఉత్పత్తి శాతం తగ్గిందన్నారు. రక్షణతో కూ డిన ఉత్పత్తిని సాధించాలని, గైర్హాజరు కాకుండా ప్రతీ రోజు విధులకు హాజరుకావాలని సూచించారు. సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.18 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు.

    మిర్చి, వరి సాగుపై

    తీవ్ర ప్రభావం..

    ఈ ఏడాది సీజన్‌ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురవకపోవడంతో వరి, మిర్చి పంటల సాగు ఆలస్యం అవుతోంది. జూన్‌, జూలై నెలల్లో కురిసిన వానలు పత్తి పంటలకు అనుకూలంగా మారాయి. ఆ వర్షాలకు వడ్లు అలికి వరిసాగుకు సిద్ధంగా ఉన్న రైతులు మాత్రం నిరాశ చెందుతున్నారు. సరిపడా వర్షాలు పడకపోవడంతో ఇప్పటికీ వరినాట్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. బోర్లు, బావులు, చెరువులు, కాల్వల కింద ఉన్న రైతులు ధైర్యంచేసి వరి నాట్లు వేస్తుండగా వానల మీద ఆధారపడే రైతులు ఇంకా నాట్లు వేయడం లేదు. దీంతో నారు ముదిరి రంగు మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మిర్చి సాగుచేసే రైతులు గింజలు అలుకగా అవి మొక్క దశలో ఉన్నాయి. మరిన్ని వర్షాలు కురిస్తే మిర్చి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు.

    భూపాలపల్లి: ఈ ఏడాది వర్షాలు అన్నదాతలను ఆందోళన కలిగిస్తున్నాయి. సకాలంలో వర్షాలు పడ క, లోటు వర్షపాతం నమోదు కావడం, చెరువులు, కుంటల్లోకి చుక్కనీరు చేరకపోవడంతో పంటల సా గుకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నా యి. పత్తికి వర్షాలు అనుకూలంగా కురుస్తున్నప్పటికీ వరి, మిర్చి పంటల సాగు ఆలస్యమవుతోంది.

    లోటు వర్షపాతమే..

    జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో ప్రధానంగా వరి 1,12,218, పత్తి 93,823, మిర్చి 28వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. జూన్‌ నెలలో మోస్తారు వర్షాలు కురవగా, జూలైలో మూడు, నాలుగవ వారాల్లో సాధారణ, లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో జిల్లావ్యాప్తంగా సగటున 16 రోజుల పాటు వర్షం కురిసినట్లుగా నమోదైనప్పటికీ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. మహదేవపూర్‌, మహాముత్తారం, కాటారం, మల్హర్‌, కొత్తపల్లిగోరి మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. గడిచిన మూడు రోజులుగా వాతావరణం వేడెక్కి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వర్షాలు కురుస్తాయా లేదా పంటల సాగు ఎలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

    చెరువుల్లో కనిపించని నీరు..

    వర్షాకాలం ప్రారంభం నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలోని ఏ ఒక్క రిజర్వాయర్‌, చెరువు కూడా నిండలేదు. చిన్న, చిన్న కుంటలు నిండినప్పటికీ ఆయకట్టులో పెద్దగా సాగు జరిగే అవకాశం లేదు. దీంతో జలాశయాల మీద ఆధారపడి సాగుచేసే రైతులు వరణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.

    దరఖాస్తుల స్వీకరణ

    భూపాలపల్లి రూరల్‌: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (రామంతాపూర్‌)లో 1వ తరగతిలో ప్రవేశం కోసం జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులు ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఆదాయం సర్టిఫికెట్‌లు జతచేసి ఈనెల 8వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో లేదా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో దరఖాస్తు అందించాలని కోరారు. వివరాలకు జిల్లాషెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

    నేడు మంత్రి పర్యటన

    మల్హర్‌: మండలంలోని తాడిచర్ల గ్రామంలో నేడు (శనివారం) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పర్యటించనున్నారు. తాడిచర్లలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన పీఏసీఎస్‌ భవనం, రూ.20 లక్షల నిధులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. రూ.15 లక్షలతో తహసీల్దార్‌ కార్యాలయం ప్రహరీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

    న్యూస్‌రీల్‌

    స్కూళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ షురూ

    జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషియల్‌ అటెండెన్స్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) విడుదల చేశారు. వరంగల్‌–8, హనుమకొండ–16, మహబూబాబాద్‌–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్‌ ఫోన్‌లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్‌ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్‌లో వేర్వేరుగా అటెండెన్స్‌ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్‌ అటెండెన్స్‌ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్‌ ఫేషియల్‌ అటెండెన్స్‌ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్‌ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్‌ తర్వాత ఫొటో అప్‌లోడ్‌ అయ్యేందుకు అరగంట సమయం పట్టిందని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. సాంకేతిక సమస్య ఇలాగే కొనసాగితే అటెండెన్స్‌ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.

    ఉమ్మడి జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు వివరాలు..

    జిల్లా పాఠశాలలు టీచర్లు మొదటిరోజు శాతం ర్యాంకు

    రిజిస్ట్ట్రేషన్‌

    వరంగల్‌ 534 3,211 2,085 64.93 08

    హనుమకొండ 472 2,987 1,883 63.04 16

    మహబూబాబాద్‌ 768 3,859 2,231 57.81 26

    జనగామ 459 2,773 1,572 56.69 27

    ములుగు 337 1,557 832 53.44 29

    భూపాలపల్లి 414 1,927 901 46.76 33

    మళ్లీ మొఖం చాటేసిన వానలు

    మూడు రోజులుగా

    వేసవిని తలపిస్తున్న ఎండ

    గత నెలలోనూ

    జిల్లాలో లోటు వర్షపాతం

    ఆలస్యం అవుతున్న

    వరి, మిర్చి పంటల సాగు

    ఆందోళనలో రైతులు

    ఇప్పుడిప్పుడే వరినాట్లు ..

    గత నెలలో కురిసిన వర్షాలకు చిన్నచిన్న చెరువులు నిండాయి. వర్షాలతో పత్తి పంటలకు ఇబ్బంది లేదు. రైతులు గడిచిన పది రోజులుగా వరినాట్లు ప్రారంభించారు. మరిన్ని వర్షాలు పడితే వరి సాగుచేసే రైతులంతా నాట్లు వేసే అవకాశం ఉంది. జిల్లాలో ఈ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    – వీరునాయక్‌, డీఏఓ

  • కోడి‘గుడ్‌’..విధానం!
    సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ‘ఆన్‌లైన్‌’ ప్రక్రియ

    సాక్షిప్రతినిధి, వరంగల్‌: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్‌ల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్‌ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనునన్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్‌ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్‌ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా గతనెల 23 నుంచి ఆన్‌లైన్‌ టెండర్‌లు ఆహ్వానించారు. ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్‌ షెడ్యూల్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్‌లతో కలెక్టర్‌లు ఫ్రీ బిడ్‌ సమావేశాలు కూడా నిర్వహించారు.

    ఒక్కో జిల్లాల్లో ఒక్కో రేటు...

    ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధికారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కోడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్‌ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్‌, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్‌లు ఈ టెండర్‌లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్‌ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్‌లైన్‌ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్‌లు సిండికేట్‌ కడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

    అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే..

    వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్‌ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీ ఆగ్మార్క్‌ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులైన కాంట్రాక్టర్‌లను ఎంపిక చేసేది. ఆ తర్వా త కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరి మాణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్‌లో పేర్కొన్న విధంగా కాకుండా తక్కువ గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారా ఆన్‌లైన్‌ టెండర్‌లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్‌లు బిడ్‌ డాక్యుమెంట్లను టౌన్‌లోడ్‌ చేసుకుని ఆన్‌లైన్‌లో బిడ్‌లను సమర్పించాలని నోటిఫికేషన్‌లో సూచించారు. సమర్పించిన బిడ్‌ల హార్డ్‌ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్‌/షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటా యించిన విధంగా టెక్నికల్‌ బిడ్‌లు, ధరల బిడ్‌లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు.

    విద్యాలయాల్లో

    7.33 కోట్ల కోడిగుడ్లకు..

    సుమారు రూ.40.60 కోట్లు

    ఉమ్మడి వరంగల్‌లో

    ఐదు జిల్లాలకే టెండర్లు..

    భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ

    ఈ నెల 6 నుంచి 12 వరకు

    షెడ్యూల్‌ దాఖలు..

    12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్‌

    అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలు

    అందుకే పాలసీ మార్చిన ప్రభుత్వం..

    జిల్లా సరఫరా కేటాయించిన

    చేయాల్సిన డబ్బులు (రూ.లలో)

    కోడిగుడ్లు

    హనుమకొండ 1,31,14,397 6,71,45,713

    వరంగల్‌ 1,40,76,730 7,89,70,455

    మహబూబాబాద్‌ 1,77,87,502 10,01,43,636

    జనగామ 1,26,05,592 7,09,69,483

    ములుగు 78,11,600 4,39,79,308

    భూపాలపల్లి 79,54,004 4,47,81,042

    మొత్తం 7,33,49,825 40,59,89,637

  • సరిహద్దు భూ సమస్యలను పరిష్కరించాలి

    భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో రెవెన్యూ, అటవీ సరిహద్దు భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌హాల్‌లో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలెక్టర్‌ సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కాటారం, మల్హర్‌, మహాముత్తారం, మహదేవపూర్‌ మండలాలలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాలు ఉన్నట్లు తెలిపారు. అటవీ, రెవెన్యూ భూముల సమస్యల పరిష్కారానికి సంయుక్త సర్వే నిర్వహించి హద్దులు కేటాయించాలన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరువురు శాఖల అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, కాటారం సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, ఎఫ్‌డీఓ సందీప్‌రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

    పనులను వేగవంతం చేయాలి..

    జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ పరికరం ఏర్పాటు పనులను కలెక్టర్‌ రాహుల్‌శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలకు సమయానుకూలంగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సీటీ స్కాన్‌ పరికరం ఏర్పాటును త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టంచేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా, సంబంధిత ఇంజినీరింగ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీటీ స్కాన్‌ యంత్రం ఏర్పాటుతో ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్‌కుమార్‌, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

    68వేల మందికి సబ్సిడీ గ్యాస్‌

    జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కి అందిస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,36,243 లక్షల గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసి రూ.655.19 లక్షల సబ్సిడీ మంజూరు చేసినట్లు చెప్పారు.

    ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

    గణపురం: మండలంలోని బుర్రకాయల గూడెం గ్రామంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్‌ కార్యాలయంలోని భూ భారతి దరఖాస్తుల స్టోర్‌ రూంను పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం లేకుండా నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్ధార్‌ను ఆదేశించారు. గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు కలెక్టర్‌కు గొర్రె పిల్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, తహసీల్దార్‌ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్‌ పాల్గొన్నారు.

    కలెక్టర్‌ రాహుల్‌శర్మ

  • ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి

    జిల్లావాసి కాసర్ల శ్యామ్‌కు నేషనల్‌ అవార్డు

    ఉత్తమ లిరిక్‌రైటర్‌గా గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

    హన్మకొండ కల్చరల్‌ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్‌కు శుక్రవారం బెస్ట్‌ లిరిక్స్‌ కేటగిరిలో నేషనల్‌ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్‌ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.

    ఎంతో సంతోషంగా ఉంది..

    నేషనల్‌ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్‌ సంగీతంపాటు మంగ్లీ, రామ్‌ మిర్యాల వాయిస్‌లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా.

    – కాసర్ల శ్యామ్‌, పాటల రచయిత

  • బైపాస్‌ రోడ్డు మంజూరు చేయాలి

    భూపాలపల్లి: వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా మారిన భూపాలపల్లి పట్టణానికి బైపాస్‌ రోడ్డు మంజూరు చేయాలని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరిని కోరగా సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కావ్య... భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా సింగరేణి, కేటీపీపీ పరిశ్రమల మూలంగా ఎన్‌హెచ్‌ 353సీ మీద వాహనాల రద్దీ పెరిగి పట్టణంలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో 576 ప్రమాదాలు జరిగి 233 మంది చనిపోయారని తెలిపారు. రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భూపాలపల్లి బైపాస్‌ రోడ్డులో రూ.175 కోట్లు నిర్మాణ పనులకు, రూ.75కోట్లు భూసేకరణకు వినియోగించాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి.. వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య వెల్లడించారు.

    కేంద్ర మంత్రిని కోరిన వరంగల్‌ ఎంపీ కావ్య