ఖమ్మంమయూరిసెంటర్: ఏళ్లుగా ఇజ్రాయిల్.. పాలస్తీనాపై చేస్తున్న అమానవీయ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనాపై ఇజ్రాయిల్ కొన్నేళ్ల నుంచి యుద్ధం చేస్తూ, వేల మంది ప్రాణాలను బలిగొందని విమర్శించారు. కనీస యుద్ధ నియమ, నిబంధనలను పాటించకుండా విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తోందని, ముఖ్యంగా గాజాలోని పాఠశాలలు, వైద్యశాలలు, పౌర సముదాయాలు, రేషన్ దుకాణాలపై యుద్ధోన్మాదంతో దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే సుమారు 56,000 మంది పాలస్తీనా పౌరులు చనిపోయినట్లు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయని, అందులో సుమారు 20 వేల మంది పసిపిల్లలు ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. ఆగస్టు 7న ఖమ్మం నగరంలో ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ నిర్వహిస్తున్న ర్యాలీకి సీపీఎం సంఘీభావం తెలుపుతోందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Khammam
- ● 7న పాలస్తీనా సంఘీభావ ర్యాలీకి సీపీఎం మద్దతు ● పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం
సత్తుపల్లిటౌన్: ఈ ప్రాంత నిర్వాసితులకు చెందిన లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వకుండా రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కు బొగ్గు రవాణా ఇస్తే ప్రాణాలుపణంగా పెట్టి అయినా అడ్డుకుంటామని లారీ యజమానులు స్పష్టం చేశారు. సత్తుపల్లి సింగరేణి లారీ, టిప్పర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యా న ఆదివారం జరిగిన సమావేశంలో సింగరేణి యా జమాన్యం తీరుపై మండిపడ్డారు. నాణ్యమైన బొగ్గు ను సమయానికి ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను అతిక్రమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సత్తుపల్లి, కిష్టారం ఓసీల్లో ఉత్పత్తి అయిన బొగ్గులో 30 శాతం లోడింగ్ స్థానిక లారీలకు కల్పించాలని కోరారు. బొగ్గు లోడింగ్ లేకపోవటం వల్ల లారీ యజమానులకు పూటగడవటం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 600 లారీలు ఉంటే.. రోజుకు రెండు లారీలకు లోడింగ్ ఇవ్వటం సింగరేణి అధికారుల తీరుకు నిదర్శనమన్నారు. ఆంధ్రా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ స్థానిక లారీలకు లోడింగ్ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కొండపల్లి రమేశ్రెడ్డి, చిన్నంశెట్టి సూరిబాబు, మౌలాలి, మునీర్, రమేశ్, పాలకుర్తి దాసు, పీఎల్ ప్రసాద్, కోట మోహన్రావు, కోటేశ్వరరెడ్డి, ఐ.శ్రీనివాసరావు, మారేశ్వరరావు పాల్గొన్నారు.
- గుంతలమయంగా మారిన రహదారులు
● జిల్లాలో పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు.. ● గతేడాది భారీ వర్షాలకు ధ్వంసమైన వైనం ● మరమ్మతులు చేపట్టక వాహనదారుల ఇక్కట్లువర్షాలకు దెబ్బతిని..
తల్లాడ – కొత్తగూడెం, తల్లాడ – సత్తుపల్లి ఆర్అండ్బీ రోడ్లు పలుచోట్ల గుంతలు పడి అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తల్లాడ – లక్ష్మీనగర్, బిల్లుపాడు – అంజనాపురం, మల్సూర్తండా వద్ద రోడ్లు పాడయ్యాయి. తారు కొట్టుకుపోయింది. తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. అన్నారుగూడెం – నరసింహారావుపేట వద్ద కూడా రోడ్డు అక్కడక్కడా దెబ్బతిన్నది. రోడ్లు ఇలా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వెళ్లే వాహనాలన్నీ ఈ రోడ్డుపైనే వస్తుంటాయి. ఇప్పటికై నా ఈ రోడ్డు మరమ్మతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలోని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భారీ గుంతలతో ఉన్న రహదారులు వాహనదారులను భయపెడుతున్నాయి. ఏడాదిగా రోడ్లన్నీ ఈ దుస్థితిలోనే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా శాఖల పరిధిలో ప్రతిపాదనలు పంపడం, నిధులు మంజూరయ్యాయని చెప్పడానికే పరిమితమయ్యారు తప్పితే.. కొత్త రహదారుల మాట అటుంచి కనీసం గుంతలు పూడ్చడం, మరమ్మతులు చేయడం కూడా మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఈ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలగడంతో పాటు పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గతేడాది తుపానుతో జిల్లాలోని పలు రహదారులు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
అధ్వానం.. అసౌకర్యం..
జిల్లాలోని రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు గత ఏడాది వచ్చిన భారీ వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల దుస్థితి అధ్వానంగా ఉంది. అలాగే వైరా – జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై పలు చోట్ల గుంతలు పడ్డాయి. ఈ గుంతల్లో నీరు నిల్వడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వైరా మండలం స్టేజీ పినపాక నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నెమలికి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. రోడ్డు మధ్యలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పైగా పలుచోట్ల కంకర తేలి గుంతల్లో నీరు నిలిచింది. ఆ రోడ్డుపై వాహదారులు వేగంగా వస్తే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. వైరా – కొణిజర్ల, కొణిజర్ల మండలంలోని పలు రహదారుల పరిస్థితీ ఇలాగే ఉంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లన్నీ అధ్వానంగా మారాయి.
ప్రయాణం.. ప్రమాదమే..
భారీ గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులపై కొత్తగా ప్రయాణించేవారు వీటిపై అవగాహన లేక ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా ఉన్నాయి. వైరా – జగ్గయ్యపేట రహదారిపై ఇలా పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయారు. కనీసం గుంతలు పూడ్చడంపై అయినా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
దెబ్బతిన్న పల్లిపాడు – ఏన్కూరు రహదారి..
కొణిజర్ల మండలం పల్లిపాడు – ఏన్కూరు మధ్య రహదారి దెబ్బతిన్నది. ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వెళ్లేందుకు కొంత దూరం తగ్గేందుకు పలువురు ఈ రోడ్డుపై నుంచే వెళ్తుంటారు. దీంతో 2018లో అప్పటి ప్రభుత్వం దీన్ని డబుల్ రోడ్డుగా మార్చింది. ఇప్పుడు వర్షం పడితే రోడ్డంతా గుంతలమయం అవుతోంది. తీగల బంజర సమీపంలో పగిడేరు ప్రవహిస్తే రోడ్డు దాదాపు 100 మీటర్ల మేర కొట్టుకుపోతోంది. అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. ఈ రోడ్డుపై దాదాపు మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తీగలబంజరకు చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంతో సహా గుంతలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. పల్లిపాడు నుంచి అంజనాపురం వరకు, ఆ తర్వాత జన్నారం నుంచి ఏన్కూరు వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
- ● ఏళ్లుగా భర్తీ కాని డీఈఓ పోస్టు ● ఇన్చార్జ్లతో పాలన అంతంతమాత్రమే.. ● రెగ్యులర్ అధికారిని నియమించాలంటున్న ఉపాధ్యాయులు
ఖమ్మం సహకారనగర్ : అత్యంత కీలకమైన ప్రభుత్వ శాఖల్లో విద్యా శాఖ ఒకటి. అంతటి ప్రాధాన్యత గల శాఖకు జిల్లాలో సుమారు మూడేళ్లుగా రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల కాలం వరకు డైట్ ప్రిన్సిపాల్కు అదనపు బాధ్యతలు అప్పగించగా.. ఆయన రెండు బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో దేనిపైనా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని పాఠశాలలపై పర్యవేక్షణ, అధికారులతో సమావేశాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధ్యాయుల సర్దుబాటు, మంత్రులు, ఇతర అధికారుల కార్యక్రమాలకు డీఈఓ హాజరు కావాల్సి ఉంటుంది. వీటితో పాటు నిత్యం పాఠశాలలు, ఉపాధ్యాయులపై పర్యవేక్షణ చేయాలి. అలాంటి కీలక పోస్టు మూడేళ్లుగా ఖాళీగా ఉంది.
గతంలో అలా..
డైట్ లెక్చరర్గా ఉన్న సోమశేఖర శర్మను ఎఫ్ఏసీ డీఈఓగా నియమించగా ఆయన పనిచేసిన సుమారు రెండేళ్ల కాలంలోనూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సైతం వినిపించాయి. ఆయన డీఈఓగా ఉన్న సమయంలో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వగా దానిపై విచారణ అనంతరం వారిని ఉద్యోగం నుంచి తొలగించారు.
ప్రస్తుతం ఇలా..
డైట్ ప్రిన్సిపాల్గా ఉన్న సత్యనారాయణ సుమారు మూడు నెలల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు శిక్షణ సమయంలో ప్రభుత్వం నిధులు కేటాయించగా, వాటిలో కొన్ని దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆయన ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రోజు కూడా ఆయన పెండింగ్ ఫైళ్లపై సంతకాలు చేశారని కార్యాలయ సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. ఉద్యోగ విరమణకు ముందు కూడా పలు కీలక అంశాల్లో సంతకాలు చేశారనే విమర్శలు సైతం వస్తున్నాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే..
జిల్లా విద్యాశాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఇతరులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఇష్టారీతిన విధులు నిర్వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పిదాలు వెలుగుచూశాక తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడంతో ఇతర అధికారులు కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రెగ్యులర్ డీఈఓను నియమిస్తే పాలన గాడిన పడే అవకాశం ఉంటుందని ఉపాద్యాయులు అంటున్నారు.
జెడ్పీ డిప్యూటీ సీఈఓకు బాధ్యతలపై
అసంతృప్తి..
ఇన్చార్జ్ డీఈఓగా ఉన్న సత్యనారాయణ ఉద్యోగ విరమణ పొందగా తాత్కాలికంగా జెడ్పీ డిప్యూటీ సీఈఓతో ఆ పోస్టు భర్తీ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తున్న సమయంలో పూర్తిస్థాయి డీఈఓ లేకుంటే ఎలా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖపై పూర్తిస్థాయిలో అవగాహన లేని వారికి డీఈఓ పోస్టు ఎలా ఇస్తారని అంటున్నారు.
వెల్లువెత్తుతున్న ఆరోపణలు..
జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై ప్రతీ ఏడాది తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగంలో మార్పు రాకపోవడం గమనార్హం. కీలక అధికారి పోస్టుకు ఇన్చార్జ్గా నియమితులైన అధికారి చేసే కార్యకలాపాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు. సుమారు నాలుగేళ్లుగా విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో డైట్ కళాశాల సీనియర్ లెక్చరర్, ప్రిన్సిపాల్ ఎఫ్ఏసీ డీఈఓగా విధులు నిర్వహించారు. వీరిద్దరి పనితీరుపై పలు ఆరోపణలు వస్తుండడం విమర్శలకు బలం చేకూరుస్తోంది.
Kamareddy
కామారెడ్డి క్రైం : జిల్లాలో ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.24 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా 3.18 లక్షల ఎకరాల్లో వరి సాగవవచ్చని భావించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 4.19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో 1,95,423 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. 51,802 ఎకరాల్లో సోయాబీన్, 32,552 ఎకరాల్లో మొక్కజొన్న, 17,713 ఎకరాల్లో పత్తి, 6,965 ఎకరాల్లో కంది, లక్షా 14 వేల ఎకరాలలో మిగతా పంటలు సాగయ్యాయి. మరో 40 వేల నుంచి 60 వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని నిజాంసాగర్ ఆయకట్టు ప్రాంతంలో ముందుగానే వరినాట్లు వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోరుబావుల కింద చాలామంది రైతులు నాట్లు వేశారు. సాగు నీటి వసతులు తక్కువగా ఉండే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని కొన్ని మండలాలలో ఏటా వరి సాగు ఆలస్యంగానే జరుగుతుంది. ఆయా మండలాల పరిధిలో రైతులు ఇప్పుడు నాట్లు వేసే పనిలో ఉన్నారు.
గతేడాదితో పోలిస్తే..
ఈసారి రోహిణి కార్తెకు ముందే వర్షాలు కురిశాయి. ముందస్తుగా వర్షాలు కురియడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి వానాకాలంలో జూలై నాటికి జిల్లాలో పంటల సాగు బాగా పెరిగింది. జూలై చివరి నాటికి ఈసారి 4.19 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు తక్కువగా కురియడంతో రైతులు ఆలస్యంగా పంటలు సాగు చేశారు. దీంతో ఆ ఏడాది జూలై నాటికి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి.
సూచనలు పాటించాలి..
జిల్లాలో ఇప్పటివరకు 4.19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. రైతులు తమ పంటల సాగులో ఏవైనా సందేహాలు ఉంటే స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. పంటల సాగులో అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి.
– మోహన్రెడ్డి, డీఏవో, కామారెడ్డి
వానాకాలంలో భారీ వర్షాలు కురవకపోయినా ప్రస్తుతానికి జిల్లాలో పంటల సాగు ఆశాజనకంగానే ఉంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 4.19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ప్రధానంగా సుమారు 2 లక్షల ఎకరాలలో వరి నాట్లు పడ్డాయి. మరో 60 వేల ఎకరాలలో నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
పంటలకు ఢోకా లేనట్లే!
ఆశాజనకంగా సాగు పనులు
చివరి దశకు వరి నాట్లు
4.19 లక్షల ఎకరాల్లో పంటలు
భారీ వర్షాలు పడితేనే..
ఇప్పటివరకు సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదయ్యింది. సరైన వానలు లేకపోవ డంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. అడపాదడపా కు రిసిన వర్షాలతో కొద్దిమేర భూగర్భ జలాలు పె రిగి బోరు బావుల్లో ఊటలు పెరిగాయి. ఈ నీటి వనరులతో వానాకాలం పంటలకు ఢోకా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే యాసంగిపై ఆందోళన నెలకొంది. భారీ వర్షాలు కురియకపోతే జలాశయాలు నిండే పరిస్థితులు కనిపించడం లేదు. వరుణుడు ముఖం చాటేస్తే యాసంగిలో ఇబ్బందులు తప్పకపోవచ్చన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈనెలలో మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది అన్నదాతలకు ఊరటనిచ్చే అవకాశం.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెరిగిన నిత్యావసరాల ధరలు ఏమాత్రం తగ్గకపోగా కూరగాయల ధరలు క్రమక్రమంగా పెరుగుతూ సామాన్యుడు కొనలేని పరిస్థితికి చేరుకుంటున్నాయి. కొన్ని కూరగాయల ధరలైతే ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. మార్కెట్కు వెళ్లి ఏది కొందామన్నా పావు కిలోకు రూ.25 నుంచి రూ.30 దాకా పలుకుతోంది. పచ్చిమిర్చి కిలో ధర రూ. వందకు చేరింది. నిన్నమొన్నటి దాకా టమాట ధర కిలోకు రూ.40 ఉండగా.. ఇప్పుడు రూ.70 వరకు అమ్ముతున్నారు. కాకరకాయ, బీరకాయలను కిలోకు రూ.80 నుంచి రూ. వంద వరకు అమ్ముతున్నారు. ఆకు కూరల ధరలూ పెరిగాయి. ఆకు కూరలు కిలోకు రూ.80 వరకు చేరాయి. మునగ కాయలు కూడా కిలోకు రూ.80కి అమ్ముతున్నారు. కొత్తిమీర మాత్రమే కాస్త చీప్గా దొరుకుతోంది. పది రూపాయలకు రెండుమూడు చిన్నచిన్న కట్టలు ఇస్తున్నారు. స్థానికంగా పంట తగ్గడంతో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు శ్రావణ మాసం కావడం, శుభ ముహూర్తాల సమయం కావడం కూడా కూరగాయల ధరలపై ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు.
ఉల్లిగడ్డ కూడా పిరమయ్యింది..
మార్కెట్లో ఉల్లిగడ్డ ధర కూడా పెరిగింది. పంట చేతికొచ్చిన సమయంలో కొంత తగ్గినట్టే తగ్గినా తిరిగి పుంజుకుంది. నెల క్రితం వరకు వంద రూపాయలకు ఐదారు కిలోలు ఇచ్చేవా రు. ప్రస్తుతం కిలోకు రూ.40 నుంచి రూ.50 దాకా అమ్ముతున్నారు. పచ్చళ్ల సీజన్లో ఎల్లిపాయల ధరలు పెరిగాయి. ఇప్పటికీ అదే స్థాయి లో ఉంటున్నాయి. పెరిగిన ధరల మూలంగా మార్కెట్కు వెళితే కన్నీళ్లే వస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.
కిలోకు రూ. వంద దాటిన పచ్చిమిర్చి
బీర, కాకర కిలోకు రూ. 80..
టమాటతోపాటు ఇతర కూరగాయలదీ అదే దారి..
కొనడానికి ఇబ్బందిపడుతున్న
సామాన్యులు
సామాన్యుడి కష్టాలు రెట్టింపు...
మార్కెట్లో పెరిగిన ధరలతో సామాన్యుడి కష్టాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలన్నీ ఆకాశానికి చేరాయి. ఉప్పు, పప్పులతో పాటు ఇతర నిత్యావసరాల ధరలన్నీ పెరిగి కూర్చున్నాయి. మటన్, చికెన్తో పాటు కోడి గుడ్డు ధరలదీ అదే దారి.. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వారానికోసారి మార్కెట్కు వెళ్లి రూ. వంద నుంచి రూ.150 పెడితే బస్తా నిండా కూరగాయలు వచ్చేవి. పెరిగిన ధరలతో అవే కూరగాయలకు రూ. 3 వందల నుంచి రూ.350 దాకా వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు మార్కెట్లో ధరలు చూసి రెగ్యులర్గా తీసుకునే కూరగాయలకు బదులు ఏది తక్కువ ఉందో అదే కొనే ప్రయత్నం చేస్తున్నారు. కొందరైతే నలుగురిని అడిగి, బేరమాడి కొంటున్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంలో పది ఎకరాల విస్తీ ర్ణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోర్సులు ఉన్నా లెక్చరర్లు లేకపోవడంతో విద్యార్థు లు నష్టపోతున్నారు. భిక్కనూరులో 1984 సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ, సీఈసీ కోర్సులతో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అప్పట్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కళాశాల కొనసాగింది. 1994లో హుషారిలాల్ విరాళంగా అందజేసిన పది ఎకరాల భూమిలో భవనం నిర్మించి అందులోకి మార్చారు. అయితే జువాలజీ లెక్చరర్ లేకపోవడంతో బైపీసీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ఇక్కడి బైపీసీ గ్రూప్ను జగిత్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటినుంచి మూడు గ్రూపులతో కళాశాల కొనసాగుతోంది. 1997 కెమిస్ట్రీ అధ్యాపకుడిని బదిలీ చేసిన ఇంటర్ బోర్డ్.. ఆ లెక్చరర్ స్థానంలో ఎవరినీ పంపించలేదు. కనీసం కాంట్రాక్ట్ లెక్చరర్ను కూడా నియమించలేదు. ఈ కళాశాలలో సుమారు 28 ఏళ్లుగా కెమిస్ట్రీ లెక్చరర్ లేకపోవడం గమనార్హం. గెస్ట్ లెక్చరర్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
మూడు దశాబ్దాల తర్వాత..
కళాశాలలో బైపీసీ గ్రూప్ను తిరిగి ప్రవేశపెట్టాలని విద్యార్థులు ఏళ్లుగా కోరుతున్నారు. బడిబాటలో నూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇదే విషయాన్ని చె ప్పారు. దీంతో స్పందించిన ఇంటర్ బోర్డ్ ఈ ఏడా ది బైపీసీ గ్రూపును తిరిగి ప్రారంభించింది. ప్రస్తు తం ఈ కళాశాలలో హెచ్ఈసీ ప్రథమ సంవత్సరంలో ఏడుగురు, ద్వితీయ సంవత్సరంలో ఏడుగురు విద్యార్థులున్నారు. సీఈసీలో ప్రథమ సంవత్సరంలో 22 మంది విద్యార్థుండగా.. ద్వితీయ సంవత్సరంలో 18 మంది ఉన్నారు. ఎంపీసీ ఫస్టియర్లో 32 మంది విద్యార్థులు చేరగా.. ద్వితీయ సంవత్సరంలో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాదే బైపీసీ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం 23 మంది విద్యార్థులతో నడుస్తోంది. అయితే కెమిస్ట్రీ, జువాలజీ లెక్చరర్లను నియమించకపోవడంతో గెస్ట్ లెక్చరర్ల తో నెట్టుకొస్తున్నారు. ఇతర కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లతో వారానికి రెండు మూడు రోజులు పాఠా లు చెప్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రధాన సబ్జెక్టులకు రెగ్యులర్ లెక్చరర్లను నియమించకపోతే ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.
ప్రహరీ లేక ఇబ్బందులు
కళాశాలకు ప్రహరీ లేదు. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీనికి తోడు రాత్రి పూట మద్యం ప్రియులు ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నారు. దీంతో కళాశాల పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
28 ఏళ్లుగా కెమిస్ట్రీ లెక్చరర్ పోస్ట్ ఖాళీ
ఈ ఏడాది బైపీసీ పునఃప్రారంభం..
జువాలజీ లెక్చరర్ను నియమించని బోర్డ్
గెస్ట్ లెక్చరర్లతో పాఠాలు..
నష్టపోతున్న విద్యార్థులు
ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం
కెమిస్ట్రీ, జువాలజీ లెక్చరర్లు లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతి థి అధ్యాపకులతో పాఠాలు చెప్పిస్తున్నాం. విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తున్నాం. రెగ్యులర్ లెక్చరర్ల ను నియమించాలని ఉన్నతాధికారులను కోరాం.
– జ్యోతిర్మణి రాధాదేవి, ప్రిన్సిపాల్
రెండుమూడు రోజులే..
కెమిస్ట్రీ లెక్చరర్ లేకపోవడంతో ఇబ్బంది అవుతోంది. వారానికి రెండు మూడు క్లాసులే నడుస్తున్నాయి. రెగ్యులర్ లెక్చరర్ ఉంటే బాగుంటుంది. ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రెగ్యులర్ లెక్చరర్ను నియమించాలి.
– శ్రీశాంత్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి
వర్ని: అడవులను ఆక్రమించనివ్వొద్దని, పర్యావరణానికి హాని కలిగించే చర్యలకు పాల్పడే వారిపై అటవీశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మోస్రా, చందూర్ మండలాల్లో ఆదివారం ఆమె పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా రు. చందూర్లో లబ్ధిదారులకు రేషన్కార్డులు, మండల మహిళా సమాఖ్యకు రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్పటికే అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి ఇబ్బంది కలిగించకుండా సంయమనం పాటించాలని సూచించారు. మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీలో అద్దె బస్సులను పెట్టించి ప్రతి నెలా రూ.70 వేల ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆదాయ వనరును సృష్టించామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి డ్వాక్రా సంఘాల్లో రుణాలు ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు సురేశ్బాబా, శ్యామల, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్గౌడ్, లావణ్య, మాజీ జెడ్పీటీసీలు అంబర్సింగ్, హరిదాసు, గంగారాం, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
ఇప్పటికే సాగు చేసుకుంటున్నవారికి
ఇబ్బందులు కలిగించొద్దు
పర్యావరణానికి హాని కలిగించే
వారిపై చర్యలు తీసుకోండి
జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క
● బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు
● నాలుగు ముక్కల ఆటతో బీఆర్ఎస్
భూస్థాపితమైంది
● పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
● ముగిసిన జనహిత పాదయాత్ర
ఆర్మూర్ : దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే ప్రజలు నమ్మరని, ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరి స్థితి లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. రా ష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిన బీఆర్ఎస్ నాలుగు ము క్కల ఆటతో భూస్థాపితం అయిపోయిందన్నారు. రాబో యే 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన రెండు రోజుల ‘జనహిత పాద యాత్ర’ ఆదివారం ముగిసింది. ముందుగా ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారా ల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీ తక్కతో కలిసి శ్రమదానం చేశారు. అక్కడి నుంచి ఆర్మూర్ మండలం అంకాపూర్కు చేరుకున్నారు. గ్రామంలో పాదయాత్ర చేసి, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ నియోజకవ ర్గం పరిధిలోని జక్రాన్పల్లి మండలం అర్గుల్ శివారులో ఉన్న యమునా గార్డెన్స్లో ఉమ్మడి జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ పార్టీ కో సం ఎన్నో త్యాగాలు చేసిన పాత కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని, అలాగే కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తా మని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని త్వరలోనే వ్యవసాయ కళాశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఇన్చార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, ఎమ్మె ల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకొనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో శాసీ్త్రయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటా యించేలా కృషి చేయడంతో అందరూ తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. బీజేపీ మాత్రం నాగ్పూర్ నుంచి ఆర్ఎస్ఎస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ దేశ ప్రజలను మతం పేరిట విడదీస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 5న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఈ నెల 5న నిర్వహించే ధర్నాకు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారం స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో బామ్సెఫ్, అంబేడ్కర్ యువజన సంఘం, ఇండియన్ లాయర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, లంబాడా హక్కుల పోరాట సమితి, బహుజన సంఘాల ఐక్యవేదిక, బీసీ సంక్షేమ సంఘం, భారత్ ముక్తి మోర్చా, బహుజన విద్యార్థి మోర్చాలు తమ మద్దతు ప్రకటించాయి. 5న మంగళ వారం ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొంటాయని ఆయా సంఘాల నాయకులు ప్రకటించారు. నాయకులు ఆకుల బాబు, దుబాసీ నరేందర్, శ్యాంసన్, రెవల్లి శంకర్, దాస్రాం నాయక్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కేజ్వీల్స్ ట్రాక్టర్లు రోడ్లపై తిరగడం వల్ల గ్రామాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో ఇటీవల నూతనంగా వేసిన జాతీయ రహదారిపై నుంచి కేజ్వీల్స్ ట్రాక్టర్ను తీసుకెళ్లాల్సి వచ్చింది. కాని కేజ్వీల్స్ ట్రాక్టర్ను జాతీయ రహదారిపై నుంచి తీసుకెళ్తే రోడ్డు ధ్వంసమవుతుందని భావించిన రైతులు వినూత్నంగా ఆలోచించారు. కేజ్వీల్స్ ట్రాక్టర్ వెనుకవైపు భాగాన్ని మరో ట్రాక్టర్ వెనుకవైపు గునపం సహాయంతో పైకిలేపి తరలించారు.
- రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● కులాస్పూర్లో ఒకేరోజు
11 ఇళ్లల్లో దొంగతనాలు
● పదిరోజులైనా లభ్యం కాని
నిందితుడి ఆచూకీ
● రెండు బృందాలు గాలిస్తున్నా
ఫలితం శూన్యం
దేమికలాన్లో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని దేమికలాన్ గ్రామంలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కొనింటి గంగయ్య(71)కు భార్య సంగవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంగవ్వ కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించిన్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. అలాగే తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడంతో అప్పులపాలయ్యారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన గంగయ్య శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
మహిళ అదృశ్యం
మోపాల్: మండలంలోని చిన్నాపూర్ గ్రామానికి చెందిన కోతోళ్ల భారతి అదృశ్యమైనట్లు ఎస్ఐ జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. భారతికి, ఆమె భర్త నర్సయ్యకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా గొడవ జరగడంతో తాను చనిపోతానని ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భారతి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
శాంతాపూర్లో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని శాంతాపూర్ గ్రామంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు క్లినిక్ ప్రారంభించి నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శనివారం సాయంత్రం క్లినిక్ సీజ్ చేశారు. అర్హతకు మించి వైద్యం చేస్తున్నాడని గ్రామస్తులు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో డీఎంహెచ్వో ఆదేశాల మేరకు పెద్దకొడప్గల్ పీహెచ్సీ డాక్టర్లు రోహిత్, ఉమాకాంత్, ఆర్ఐ రవిందర్ శాంతాపూర్ వెళ్లి విచారణ చేపట్టారు. సమాచారం తెలుసుకున్న సదరు ఆర్ఎంపీ వైద్యుడు అక్కడి నుంచి పారిపోయాడు. అధికారులు క్లినిక్కు తాళం వేసి సీజ్ చేశారు. పైఅధికారుల ఆదేశాల మేరకు పొలీసులకు ఫిర్యాదు చేస్తామని పూర్తి విచారణ చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని అధికారులు తెలిపారు.
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కులాస్పూర్ గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనపై పురోగతి కన్పించడం లేదు. దుండగులు ఒకే రోజు ఏకంగా 11 ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడి భారీగా సొత్తు దోచుకెళ్లినా.. పోలీసులు కేసును ఇప్పటివరకు ఛేదించలేకపోయారు. పోలీసులు మాత్రం రెండు బృందాల ద్వారా గాలిస్తున్నామని చెబుతున్నా.. నిందితులను పట్టుకోవడంలో సఫలీకృతం కావడంలేదు.
గత నెలలో జరిగిన ఘటనలు..
మోపాల్ ఎస్ఐగా జాడే సుస్మిత బాధ్యతలు స్వీకరించిన రోజే (జూలై 6న) నర్సింగ్పల్లిలో ఓ చోరీ ఘటన జరిగింది. దుండగులు 11 తులాల బంగారం, రూ.35వేల నగదును దోచుకెళ్లారు. అదే నెలలో 23న అర్ధరాత్రి కులాస్పూర్లో తాళం వేసిఉన్న 11ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పక్కనున్న ఇళ్లకు బయటి నుంచి గొళ్లాలు బిగించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 7.3 తులాల బంగారం, 54 తులాల వెండి, రూ.3.85లక్షల నగదు చోరీకి గురైంది. అంతేగాకుండా ముదక్పల్లి చిలుకల చిన్నమ్మ ఆలయం, మంచిప్పలోని గండి మైసమ్మ ఆలయాల్లో కూడా దొంగతనాలు జరిగాయి.
సీరియస్గా తీసుకున్న పోలీసులు..
చోరీ కేసులను జిల్లా పోలీస్ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. సీపీ సాయి చైతన్య స్వయంగా కులాస్పూర్ గ్రామాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీస్వర్గాల భోగట్టా. కానీ నిందితుడు బోధన్కు చెందిన పాత నేరస్తుడిగా అనుమానిస్తున్నారు. మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చోరీల నివారణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
● ఇద్దరికి గాయాలు
త్వరలోనే పట్టుకుంటాం..
కులాస్పూర్ చోరీ కేసులో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాం. దీని కోసం ప్రత్యేకంగా రెండు బృందాలు గాలిస్తున్నాయి. కొన్ని ఆధారాలు లభించాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లకు తాళం వేసి వెళ్తే పక్కంటి వారికి సమాచారమివ్వాలి.
– సురేష్కుమార్, నిజామాబాద్ నార్త్ సీఐ
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్, బేగంపూర్, వడ్లం, అంజని, కాటేపల్లి, చిన్న దేవిసింగ్ తండా, టీకారాం తండా, పోచారం గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న మొక్కజొన్న, పత్తి, సోయా, పెసర, మినుము తదితర పంటలకు తెగుళ్లు ఆశించి పంటలను నష్టపరుస్తున్నాయి. ప్రతి యేటా కొత్త రకం పురుగులు ఆశించడం వల్ల రైతాంగానికి ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. వ్యవసాయ అధికారులు రైతులకు పంటలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వకపోవడంతో రైతులు పురుగు మందుల దుకాణదారుల వద్దకు వెళ్లి వారు ఇచ్చిన మందులు పిచికారీ చేస్తున్నారు. ఈ మందుల వల్ల ఉపయోగం ఉండటంలేదు. ఏ మందులు వాడాలో తెలపాల్సిన వ్యవసాయ అధికారులు గ్రామాల్లో కనిపించడం లేదు. కొంత మంది రైతులు పశువులకు ఉపయోగించే గోమార్ మందును మొక్కజొన్న పంటకు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, స్థానిక అధికారులు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏడీఏను ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.
మందులు పిచికారీ చేసినా
తగ్గని తెగుళ్ల ఉధృతి
ఆందోళన చెందుతున్న అన్నదాతలు
వ్యవసాయ అధికారుల సూచనలు,
సలహాలు కరువు
మొగి పురుగు ఆశించింది
మొక్కజొన్న పంట వేశా. కాని పంటకు మొగి పురుగు ఆశించి పంట నాశనం చేస్తున్నాయి. ప్రతి యేటా కొత్త రకం పురుగులు ఆశిస్తున్నాయి. మాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేకపోవడంతో దుకాణదారులు ఇచ్చిన మందులను పిచికారీ చేస్తున్నాం. వాటి ఉధృతి తగ్గడం లేదు. ఉన్నత అధికారులు స్పందించి వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– బడదావల్ దశరథ్, రైతు, టీకారాం తండా
సూచనలివ్వాలి
ఆరుతడి పంటల సాగు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని ఆ పంటల వైపు ఎక్కువగా మొగ్గుచుపుతాం. పంటలో ఇప్పడు ఆశించి పురుగులకు ఎన్ని మందులు కొట్టినా చావడం లేదు. ప్రతి సారి కొత్త రకం పురుగులు వస్తున్నాయి. పురుగు మందుల పిచికారీపై వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
– గోతి సుప్చంద్, రైతు, టీకారాం తండా
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు.
ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
జిల్లాలో పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు
నిర్వహించిన పూర్వవిద్యార్థులు
ఆత్మీయ పలకరింపులతో
భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు
సాక్షినెట్వర్క్: కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని బీజేపీ నాయకులు సూచించారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా మహా సంపర్క్ అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా నాయకులు, కార్యకర్తలు.. ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా డబ్బులు జమ చేస్తుందని, ఉపాధిహామీ పథకం కేంద్రం నిధులతో కొనసాగుతుందని వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రైతుల కోసం పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిందని అన్నారు. పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.
సుభాష్నగర్: స్నేహమనేది మానవ జీవితంలో అత్యంత విలువైన బంధమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కలం స్నేహం అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ధన్పాల్ మాట్లాడుతూ.. కలం ద్వారా స్నేహం పెంచుకుంటూ, భావాల పరస్పర మార్పిడికి వేదికలను కల్పిస్తున్న కలం స్నేహం అసోసియేషన్ వంటి సంస్థల సేవలు ప్రశంసనీయమన్నారు. సమాజాన్ని చైతన్యపర్చడంలో కవులు, కళాకారులు కీలకపాత్ర పోషిస్తారని, కళలు మానవ వికాసానికి తోడ్పడుతాయని తెలిపారు. మహిళా సాధికారతలో భాగంగా ఎందరో కవులను తీర్చిదిద్దుతున్న అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ ఆచార్య, ఉపాధ్యక్షుడు హరిప్రియను ప్రత్యేకంగా అభినందించారు. సమ్మేళనంలో కవిత్వాలు, సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సాహితీ, సంగీత కవులు, మహిళలు పాల్గొన్నారు.
జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్టౌన్: హ్యాండ్బాల్ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నటరాజ ఫంక్షన్ హాల్లో జిల్లా హ్యాండ్బాల్ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా హ్యాండ్బాల్ సంఘం చైర్మన్గా అల్జాపూర్ దేవేందర్, ప్యాట్రన్గా టీ విద్యాసాగర్రెడ్డి, అధ్యక్షుడిగా కోల గంగామోహన్ చక్రు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ఓ.సునీత, సౌడ సురేశ్, బీ శ్యామ్, బాపూరావు, ప్రధాన కార్యదరిగా పింజ సురేందర్, సంయుక్త కార్యదర్శులుగా అనుపల రజిత, రమణమూర్తి, మాధురి, సతీశ్ రెడ్డి, లింగం, కోశాధికారి గట్టడి రాజేశ్, నిర్వహణ కార్యదర్శిగా రాహుల్, ఎం.సాయికుమార్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి, హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న శ్యామల పవన్కుమార్ సంఘం సభ్యులు సన్మానించారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
నగరంలో ఘనంగా సంగీత, సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి అర్బన్: విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా గోకులాష్టమి రోజున వీహెచ్పీ కమిటీలున్న గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించాలని వీహెచ్పీ ప్రాంత సహ కార్యదర్శి చింతల వెంకన్న అన్నారు. స్థానిక ఆర్బీ నగర్ హన్మాన్ ఆలయం వద్ద ఆదివారం వీహెచ్పీ జిల్లా బైఠక్ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. జిల్లా అధ్యక్షుడు ఎ.నిత్యానందం, ఉపాధ్యక్షుడు సామల గంగారెడ్డి, ప్రతినిధులు గోపిరాజు శ్రీకాంత్రావు, ఊర పాపారావు, వడ్ల వెంకటస్వామి, వంగ ప్రసాద్, ఎల్లారెడ్డి, బిచ్కుంద, పిట్లం, నసురుల్లాబాద్ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పామ్ ఆయిల్ సాగుతో
అధిక లాభాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): పామ్ఆయిల్ సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ ప్రతినిధులు సూచించారు. ఆదివారం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మాజీ సర్పంచ్ పైడి సుదర్శన్ సాగు చేసిన పామ్ ఆయిల్ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పలు రకాల సూచనలు చేశారు.
చిన్నారి చికిత్స కోసం
ఆర్థిక సహాయం
మాచారెడ్డి: పాల్వంచ మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన బాలొల్ల రాజుకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం కామారెడ్డి జిల్లా మాదిగ సేవా సమితి వ్యవస్థాపకుడు గంగసాని శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. రాజు కూతురు విలాసిని అనారోగ్యంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.. ఆ చిన్నారికి రక్త కణాలు తగ్గినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి చికిత్స కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. సమితి సభ్యులు శంకర్, నవీన్ మల్లేష్, జగన్ పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: ఒకపూట అల్పాహారం లేకపోతే నకనక లాడి పోయేవారికి ఈ వార్త నమ్మలేని నిజం. జైనుల పవిత్రమైన చాతుర్మాస్య ఉపవాస దీక్షలు నాలుగు నెలల పాటు రోజు ఒక పూట భోజనం చేయడం, రాత్రి పూట అంటే సూర్యుడు అస్తమించిన నాటి నుంచి సూర్యోదయం వరకు నీళ్లు సైతం తాగకపోవడం నియామావళి. కాగా కామారెడ్డికి చెందిన ఇద్దరు జైనులు మాత్రం ఎలాంటి ఆహారం లేకుండా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇది ఆశ్చర్యం కల్గించే విషయమైనా.. కఠోర నిజం. 30 ఏళ్ల సుశీల్ కొఠారి అనే యువకుడు 25 రోజులుగా ఎలాంటి ఆహారం లేకుండా ఉపవాసం పాటిస్తున్నారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన అర్చన బోరందియా అనే మహిళ 27 రోజులుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటామని ఇరువురు సాక్షితో చెప్పారు. రాత్రి పూట నీళ్లు సైతం తీసుకోరు. కాలక్షేపం కోసం జైన మత గ్రంథం ఆగమ సూత్రాలు చదువుతుంటారు. దేవుని స్మరణలో ఉపవాస దీక్షలు సాధ్యమౌతాయని అన్నారు. దీక్షలు చేపట్టిన మూడు రోజుల వరకు కొంత ఇబ్బందిగా ఉన్న ఆధ్యాత్మిక చింతనలో ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు రాలేదన్నారు. జైనుల చాతుర్మాస్య ఉత్సవాల్లో భాగంగా ఉపవాస దీక్షలు అనేది సాధారణమైన విషయమని కామారెడ్డి జైన సంఘం ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ బోరా అన్నారు. ఉపవాసంలోనూ ఆదివారం నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో సుశీల్ కోఠారి, అర్చన బోరందియా.. వారి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా పాల్గొన్నారు.
25 రోజులుగా సుశీల్ కొఠారి ఉపవాసం
27 రోజులుగా అర్చన బోరందియా..
Kurnool
- ● ఇష్టానుసారంగా ఆర్ఎంపీల వైద్యం ● ఇటీవల నందికొట్కూరులో మహిళకు అబార్షన్ ● గత నెలలో కల్లూరులో ఓ మహిళకు వికటించిన వైద్యం ● తరచూ జిల్లాలో ఎక్కడో చోట ఇలాంటి ఉదంతాలు ● పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ
కర్నూలు(హాస్పిటల్): ఆర్ఎంపీలు చేస్తున్న వైద్యానికి అమాయకులైన పేదల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. వెళ్లిన వెంటనే పనైపోతుందని, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. అర్ధరాత్రి అయినా వీరు అందుబాటులో ఉండటం, ఏ రోగమైనా రెండు ఇంజెక్షన్లు వేస్తే తగ్గిపోతుందని ప్రజల్లో నమ్మకం బలంగా ఏర్పడటంతో ప్రజలు ఆర్ఎంపీలను నమ్ముకుంటున్నారు. అధిక శాతం అప్పటికప్పుడు వ్యాధి నయం అవుతున్నా...కొందరికి భవిష్యత్తులో, మరికొందరికి కొన్ని రోజుల తర్వాత రియాక్షన్ వస్తోంది. ఇలాంటి వారు చివరి దశలో నిపుణులైన వైద్యుల వద్దకు చికిత్స చేయించుకుంటున్నారు. నకిలీ వైద్యుల చికిత్సతో సైడ్ఎఫెక్ట్ వచ్చి మెరుగైన వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు వేల మందికి పైగా ఆర్ఎంపీలు రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరి నిర్వహించే క్లినిక్లకు ఎలాంటి అనుమతులు ఉండవు. అవసరమైన మందులు, వైద్యపరీక్షల పరికరాలు, స్కానింగ్ మిషన్లు వీరి వద్ద ఉన్నా కూడా ఎవ్వరూ అడగరు. ఇలాంటి అనుమతి లేని ఆసుపత్రుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
నాడు మారుమూల పల్లెకూ వైద్యం
ప్రజలకు నిపుణులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉండేందుకు గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతా ల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. గ్రామీ ణ ప్రాంత ప్రజలకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ప్రథమ చికిత్స కోసం వీటిని సంప్రదించేలా చర్యలు తీసుకుంది. అక్కడ ప్రాథమిక వైద్యపరీక్షలతో పాటు బీఎస్సీ నర్సింగ్ చదివిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు జిల్లా లో 450లకు పైగా విలేజ్హెల్త్ క్లినిక్లు ఏర్పాటయ్యా యి. వీరి స్థాయికి మించిన వ్యాధి వస్తే ముందుగా పీహెచ్సీల్లోని వైద్యాధికారిని సంప్రదిస్తారు. వారికీ అర్థం గాకపోతే టెలిమెడిసిన్ ద్వారా కర్నూలు జీజీహెచ్, నంద్యాల జీజీహెచ్లలోని టెలిమెడిసిన్ వైద్యులకు వీడియో కాల్ ద్వారా కలిసి రోగికి ఉన్నచోటే అవసరమైన వైద్యాన్ని అందించేలా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా రోగి వద్దకే వైద్యులు వచ్చి చికిత్స అందించేవారు. ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా ఊళ్లోనే వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి చికిత్స అందించేవారు. అలాగే పట్టణాల్లో మురికివాడల్లో సైతం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింతగా పెంచి అక్కడ ఎంబీబీఎస్ చదివి న వైద్యులను నియమించారు. బేసిక్ వ్యాధులన్నింటికీ అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు సైతం ఇక్కడ ఉన్నారు. మురికివాడల్లోని పేదలు ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ఇక్కడే వారికి ప్రాథమిక స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చారు.
అల్లోపతి వైద్యుల ఖర్చుకు భయపడి!
వైద్యం ప్రస్తుత పరిస్థితుల్లో భారంగా మారింది. పట్టణాల్లోని వైద్యుల వద్దకు జ్వరం వచ్చిందని వెళ్లినా రూ.3వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చు వస్తోంది. పెద్దరోగమైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే ఏ చిన్నరోగమొచ్చినా మందుగా ఆర్ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఎంపీలు తెలిసీ తెలియని వైద్యంతో వారికి చికిత్స చేసి ప్రాణాల మీదుకు తీసుకొస్తున్నారు. కొందరు సైలెన్లు(ఫ్లూయిడ్స్) ఎక్కించడంతో పాటు ప్రసవాలు, అబార్షన్లు, స్కానింగ్, మైనర్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, కోడుమూరు, గూడూరు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు వంటి ప్రాంతాల్లో ఆసుపత్రులు కూడా తెరిచి ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
మృతులు వీరే..
విచ్చలవిడిగా ఆర్ఎంపీల వైద్యం
గ్రామాల్లో సాయంత్రం దాటితే విలేజ్ హెల్త్ క్లినిక్లో కమ్యూనిటీ ఆఫీసర్లు, యుపీహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదు. ప్రజలు ఉదయం పనులకు వెళ్లిన సాయంత్రం మాత్రమే ఇళ్లకు చేరుకుంటారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వైద్యం చేయడానికి వీరికి ఎలాంటి అర్హత లేకపోయినా రోగులకు చికిత్స చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కర్నూలులోని పలు ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీలు ఇష్టానుసారం వైద్యం చేస్తున్నారు. గూడూరు, కోడు మూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూ రు, కౌతాళం, హాలహర్వి, ఆలూరు మండలాల్లో 5వేల మందికి పైగా ఆర్ఎంపీలు ఉన్నారు.
గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శివమ్మ కుమార్తె శ్రీవాణి గత నెల 28న నందికొట్కూరు పట్టణంలోని గీతారాణి అనే మహిళకు ఆర్ఎంపి వద్ద అబార్షన్ చేయించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో 30వ తేదీన ఆమె మృతి చెందారు. ఆమెకు కర్నూలులోని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న ఓ హాస్పిటల్లో లింగనిర్ధారణ చేసినట్లు సమాచారం. శనివారం వరకు ఆ స్కానింగ్ సెంటర్ను అధికారులు తనిఖీ చేయని పరిస్థితి నెలకొంది.
కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జ్వరం రావడంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీ ఇంజెక్షన్లు ఇచ్చారు. అవి వికటించి ఆమె మృతి చెందారు.
కౌతాళానికి చెందిన రాణమ్మకు కీళ్లనొప్పి ఉండటంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆమెకు వరుసగా మూడు రోజుల పాటు ఇంజెక్షన్లు ఇవ్వడంతో వికటించి మృతిచెందారు.
పత్తికొండ పట్టణానికి చెందిన వై.రంగస్వామి(35) ఛాతీలో మంటగా ఉండటంతో గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక క్లినిక్కు వెళ్లగా అసిస్టెంట్ వైద్యం చేశాడు. ఇంటికి వెళ్లిన వెంటనే రంగస్వామి ప్రాణాలు కోల్పోయాడు.
గత ఏడాది గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో రాజేష్(12) జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించారు. అతను బాలునికి ఇంజెక్షన్ వేయడంతో అక్కడ గడ్డ ఏర్పడింది. దాని నుంచి చీము, రక్తం కారడంతో ఆసుపత్రిలో చేరగా కోలుకోలేక మృతి చెందాడు.
చర్యలు తీసుకుంటాం
ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. కనీసం ఇంజెక్షన్ కూడా వేయకూడదు. సర్జరీలు, ప్రసవాలు, అబార్షన్లు అసలే చేయకూడదు. ఎంబీబీఎస్ చదివిన వారు మాత్రమే అల్లోపతి వైద్యం చేయాలి. ఇతరులు వైద్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. స్థానికంగా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్ పి.శాంతికళ,
డీఎంహెచ్ఓ, కర్నూలు
శ్రీవాణి (ఫైల్)
- ● రెండు టెంకాయలు రూ.100 చొప్పున విక్రయం ● గుండుకు రూ.100 వసూళ్లు ● రాత్రికి రాత్రే గమనిక ఫ్లెక్సీలు మాయం ● కాంట్రాక్టర్లకు ‘రాజకీయ’ అండ
మంత్రాలయం: కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు వైభవోపేతంగా జరగుతుండగా.. కాంట్రాక్టర్ల మాత్రం ‘రాజకీయ’ అండతో దోపిడీ జాతరకు తెరతీశారు. ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ భక్తులు 20 లక్షల నారీకేళాలు కొడుతున్నట్లు అంచనా. అందులో కాంట్రాక్టర్ ద్వారా రూ. 15 లక్షలకు పైగా విక్రయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా ఇక్కడ టెండర్ దారుడు ఒక్క టెంకాయి రూ.20 మాత్రమే విక్రయించాలని నిబంధన. అయితే కాంట్రాక్టర్ ఒక్కో టెంకాయను రూ.40కు దుకాణాలకు వేస్తున్నాడు. దుకాణ దారులు ఇక్కడ రెండు ఊది బత్తీలు, విభూతి, రెండు పూలు, రెండు టెంకాయలు కలిపి రూ.100 చొప్పున భక్తులకు విక్రయిస్తున్నారు. విక్రయదారుల దోపిడీని పక్కన పెడితే కాంట్రాక్టర్ దోపిడీ చాలా ఎక్కువ. జోడు టెంకాయలపై ఆయన రూ.40 ఆదాయం పొందుతున్నాడు. టీడీపీ నేత అండదండలతో స్థానికుడు టెంకాయల విక్రయ వేలం కై వసం చేసుకున్నాడు. నిరుడు కూడా ఆయనే టెండర్ సొంతం చేసుకున్నాడు. క్వింటా కొబ్బరి రూ.13 వేలు ధర పలుకుతోంది. దాదాపు 20 లక్షల చిప్పలకు గానూ 180 టన్నులు బరువు వస్తోంది. ఈ లెక్కన టెంకాయ చిప్పల నుంచి రూ.2.34 కోట్లు వస్తోంది. అయితే ఇక్కడ ముత్తన్న అనే టెండర్ దారుడు మాత్రం కేవలం రూ.60.13 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు.
కల్యాణ కట్ట దోపిడీ రూ.9 కోట్లు
టెంకాయల దోపిడీ ఒక ఎత్తు ఉంటే. ఇక్కడ కల్యాణకట్ట దోపిడీ మరీను. ఇక్కడ భక్తుడు తలనీలాలు ఇవ్వడానికి తలకు రూ.40 టిక్కట్ చెల్లించాల్సి ఉంది. అందులో రూ.35 కాంట్రాక్టర్కు కేటాయిస్తారు. తలనీలాల్లో వచ్చిన వెంట్రుకలు ఆయనే విక్రయిస్తాడు. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది భక్తులు తలనీలాలు ఇస్తున్నట్లు అంచనా. టిక్కెట్ ధర చెల్లించడమే కాకుండా కల్యాణ కట్ట క్షురకులు గుండుకు రూ.100 వసూలు చేస్తున్నారు. దాదాపు రూ.9 కోట్లకు పైగా అక్రమార్జన సాగిపోతోంది. కల్యాణ కట్ట టెండర్ దారుడు కరోనా నష్టం పేరుతో కేవలం 10 శాతం అధికంతో ఇక్కడ రెండేళ్లుగా తన టెండర్ను కొనసాగిస్తూ వస్తున్నాడు.
రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు మాయం
భక్తుల అవగాహన నిమిత్తం ఆలయ ఈవో విజయరాజు క్షేత్రంలో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ముఖ్యంగా టెంకాయ రూ.20కు మాత్రమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తమకు ఫిర్యాదు చేయాలని వీధుల్లో, టెంకాయ దుకాణాలతో ఫ్లెక్సీలు పాతించారు. అయితే రాత్రి రాత్రే ఫ్లెక్సీలు మాయమయ్యాయి. క్షేత్రంలోని ఫ్లెక్సీలన్నీ తొలగించి దోపిడీకి తెర తీశారు. భక్తులకు అసలు గుట్టు తెలియకుండా మాయాజాలం చేశారు.
ఆలయ ఆవరణలో దుకాణాలు
రూ.కోట్ల వెనుక వాటాల మూటలు
ఉరుకుంద ఈరన్న స్వామి హుండీ ఆదాయాన్ని మించి ఇక్కడ రూ.కోట్లతో దోపిడీ సాగిపోతోంది. దోపిడీ మూటలో వాటాల మాట దాగి ఉండటం బహిరంగ రహస్యం. రాజకీయ నాయకుల వత్తాసుతోనే కాంట్రాక్టర్ల దోపిడీ పర్వం నడుస్తోంది. టీడీపీ నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి గ్రామ స్థాయి నేతల వరకు వాటాల మూటలు ముడుతున్నట్లు తెలుస్తోంది. తిలా పాపం తలా పిడికెడు పంపకాలు బాగానే సాగిపోతున్నాయి. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నం చేయకుండా సంకెళ్లు వేసేశారు. నోరు మెదిపితే ఇక్కడి నుంచి సాగినంపుతామన్న సంకేతాలు సైతం ఉన్నట్లు సమాచారం. కాగా.. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని దేవాదాయ ముఖ్య కార్యదర్శికి సైతం అధికారికంగా ఫిర్యాదులు వెళ్లాయి. ఫెస్టివల్ ఆఫీసర్గా సబ్ కలెక్టర్ను నియమించగా ఆయన దృష్టికి కూడా దోపిడీ వ్యవహారం వెళ్లింది. అయితే రాజకీయం అడ్డు రావడంతోనే అధికారులు మిన్నకుండి పోయారనే చర్చ ఉంది.
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలో నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలను కల్పించి వివిధ కార్యాలయాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. జెడ్పీలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు కారుణ్య నియామకాల కింద మృతిచెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యో గం కల్పించామన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి మాట్లాడుతూ.. జెడ్పీ యాజమాన్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న కార్యాలయ సహాయకుల పోస్టుల్లో వీరిని నియమించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో బీ నీరజాబాయి (జెడ్పీహెచ్ఎస్, నొస్సం, సంజామల మండలం), పీ శేఖర్ (ఎంపీపీ, ఓర్వకల్లు ), ఎన్ రమాదేవి (పీఆర్ పీఐయు డివిజన్, నంద్యాల), ఎస్ విజయకుమారి (జెడ్పీహెచ్ఎస్, గార్గేయపురం) ఉన్నారు.
జీడీపీ నుంచి నీరు విడుదల
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) నుంచి కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్ ఆలీ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు 110 క్యూసెక్కుల నీరు వస్తోందని, కుడి కాలువకు 100 , కోడుమూరు పట్టణానికి తాగునీటి కోసమని ఎడమ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. జీడీపీ నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి ఒక టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు.
బోధనలో మెలకువలు అవసరం
కర్నూలు(సెంట్రల్): విద్యా బోధనలో ఉపాధ్యాయులు నిరంతరం మెలకువలు నేర్చుకోవాలని సమగ్ర శిక్ష అభియాన్ అదనపు రాష్ట్ర పథక సంచాలకులు డాక్టర్ ప్రసన్నకుమార్ సూచించారు. ఆదివారం రాఘవేంద్ర బీఈడీ కాలేజీలో తొమ్మిది జిల్లాల కేజీబీవీ పీజీటీలకు ఇన్ సర్వీసు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతను ముఖ్యఅ అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేజీబీవీల్లో పేద విద్యార్థినులు ఉంటుండడంతో వారి వ్యక్తిగత పరిస్థితులను తెలుసుకోని బోధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు ఆరుగురు రిసోర్స్పర్సన్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్పాల్, జీసీడీఓలు సువర్చల, స్నేహలత పాల్గొన్నారు.
సీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీటిని విడుదల చేయాలి
నంద్యాల(అర్బన్): రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు నేటికి పూర్తి కాకపోవడం, పంట కాల్వలు లేకపోవడంతో ప్రాజెక్టుల కింద ఉన్న లక్షలాది ఎకరాలకు నేటికి సాగునీరు అందలేదన్నారు. వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియజేసేందుకు ఆలోచన పరుల వేదిక నాయకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో రైతు సేవా సంస్థ అధ్యక్షుడు భవానీప్రసాద్ సాగునీటి రంగ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, సామాజిక వేత్త రామారావు రాకపై ఆదివారం స్థానిక కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు సాధారణం కంటే నెల రోజుల ముందే వరదలు వచ్చినా సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని దిగువకు విడుదల చేయడం అన్యాయమన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా గాలేరునగరి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరనాయుడు, సుధాకర్కుమార్, అసదుల్లా, భాస్కరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంటెంపుల్: భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చే భక్తులకు జేబులకు చిల్లులు పడుతున్నాయి. క్షేత్రంలో ఆహార పదార్థాల ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దేవస్థాన అధికారులు, సివిల్ సప్లయ్ అధికారులు ధరల నియంత్రణలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అధిక ధరల పోటు తప్పడం లేదు. శ్రీగిరి క్షేత్రంలో చిన్న, పెద్దహోటళ్లు అన్ని కలిపి 50 వరకు ఉంటాయి. క్షేత్రంలో ప్రైవేట్ హోటళ్లలో టిఫిన్, భోజనం చేద్దామంటే భక్తుల జేబుకు చిల్లులు పడే ధరలు దర్శనమిస్తున్నాయి. భక్తుల అవసరాలను అసరాగా చేసుకుని స్థానిక ప్రైవేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నా అడిగేవారు లేరు. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో మాత్రమే సివిల్ సప్లయ్ అధికారులు ధరలను ఫిక్స్ చేసి ధరల పట్టిక ఏర్పాటు చేస్తారు తప్పా..మిగతా రోజుల్లో అంతా వ్యాపారుల చేతుల్లోనే ధరలు ఉంటాయి. హోటల్లో ఆహార పదార్థాలలో నాణ్యమైన పదార్థాలు వినియోగిస్తున్నారా? లేదా? అని తనిఖీలు చేసే అధికారులు కరువయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా కేంద్రంలో ఉండడం, జిల్లా కేంద్రానికి శ్రీశైలం సుదూర ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చి ఆహార పదార్థాల శాంపిల్స్ తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. తక్కువ ధరకు వచ్చే వస్తువులతో ఆహార పదార్ధాలు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో శుచీ, శుభ్రతను సైతం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై న దేవస్థానం, సివిల్ సప్లయ్ అధికారులు స్పందించి శ్రీశైల మహాక్షేత్రంలో ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయించకుండా, సామాన్య భక్తులకు సైతం అందుబాటులో ఉండేవిధంగా ధరలను నిర్ణయించి, ధరల పట్టికను హోటల్ నిర్వాహకులు ప్రదర్శించేలా ఏర్పాటు చేసి భక్తుల జేబులకు చిల్లులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
శ్రీశైల
ఆలయం
శ్రీగిరిలో అధికరేట్లకు ఆహార పదార్థాలు
హోటళ్లు, దుకాణాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ
కర్నూలు (అర్బన్): జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా బీసీ సంక్షేమం సాధికారత అధికారిణి కె ప్రసూన ఆదేశించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో మెగా పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వసతి గృహ సంక్షేమ అధికారులు హాస్టళ్ళ పరిసరాలు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా, తాగునీరు కలుషితమైనా విద్యార్థులు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్డబ్ల్యూఓలందరూ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. తరచూ హాస్టళ్లను పరిశీలిస్తుంటామని, ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోడుమూరు రూరల్: కోడుమూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యం దుకాణం వద్ద మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 6 గంటలకు చోటుచేసుకుంది. కోడుమూరుకు చెందిన ఆంజనేయులు (37)కు భార్యాపిల్లలు లేరు. తాపీ పనిచేస్తూ బతికేవాడు. మద్యానికి అలవాటు పడి ఆదివారం సాయంత్రం కోడుమూరు పట్టణంలోని వెంకటగిరి రోడ్డులో గల ఓ మద్యం దుకాణం వద్ద వచ్చాడు. అతిగా మద్యం తాగి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సమీప బంధువులు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా.. మద్యం దుకాణం వద్ద అనధికారికంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్లో ఆంజనేయులు మద్యం తాగి మృతిచెందినట్లు సమాచారం. అయితే నిర్వాహకులు ఎక్కడ తమపైకి సమస్య వస్తుందోనని గ్రహించి ఆంజనేయులు మృతదేహాన్ని అనధికారిక పర్మిట్ రూమ్లో నుంచి తెచ్చి తమ దుకాణానికి కొద్ది దూరంలో పడేసి వెళ్లినట్లు తెలిసింది.
కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లె సమీపంలో ఆదివారం రోడ్డు పక్క న కారు అదుపు తప్పి బోల్తా పడింది. పెట్ని కోట వైపు నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో గొర్విమానుపల్లె దాటాక లొక్కిగుండం సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రమే ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. కారులో ఇరుక్కుపోయిన ఆ వ్యక్తిని స్థానికులు అద్దాల పగుల గొట్టి బయటకు తీశారు.
ఆళ్లగడ్డలో చోరీ
ఆళ్లగడ్డ: పట్టణంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొరుగుల బట్టి వీధికి చెందిన సంజీవరాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి పట్టణంలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రార్థన ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.1.50 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. సంజీవరాయుడు కుమార్తెకు ఇటీవల వివాహం నిశ్చయం కాగా.. అందుకు సంబంధించి బంగారు, నగదు సిద్ధం చేసుకున్నాడు. ఇంతలో చోరీ జరగడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ యుగంధర్ తెలిపారు.
ఏపీహెచ్ఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయు సంఘం ( ఏపీహెచ్ఎంఏ) జిల్లా నూ తన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీహెచ్ఎంఏ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో 2025–27 కాల వ్యవధికి నూత న కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా వై. నారాయణ, డీసీ హుస్సేన్, ట్రేజరర్గా రమేష్నాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పూర్వపు అధ్యక్షుడు జి.ఒంకార్ యాదవ్ పాల్గొన్నారు.
స్నేహితుల ఆపన్న హస్తం
మంత్రాలయం రూరల్: స్నేహితుల దినోత్స వం స్నేహభావం పరిమళించింది. స్నేహితుడు మృత్యువాత పడగా తోటి మిత్రులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రాలయానికి చెందిన డి.భీమేష్ అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న 2003 కు చెందిన 10 తరగతి బ్యాచ్ స్నేహితులు రూ.60 వేలు స్నేహితుడి కూతురు దీక్షిత పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.బాండ్ను మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి భార్య రాధ భర్త స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
మద్దికెరలో..
మద్దికెర: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2004 –05లో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు తమతో పాటు చదువుకొని కొందరు మిత్రులు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు రూ.72 వేలు అందజేశారు. మాజీ ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు రంగస్వామి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పొలంలో అక్రమ తవ్వకాలు
చిప్పగిరి: రైతులను సంప్రదించకుండా, కనీస సమాచారం ఇ వ్వకుండా గాలి మరల కంపెనీ తమకు ఇష్టం వచ్చినట్లు అక్రమంగా తవ్వకాలు జరుపుతోంది. చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన తలారి నెట్టికల్లుకు 0.99 ఎకరాల పొలం ఉండగా అందులో పెద్దకాలువ తవ్వి వదిలేశారు. తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చినా ఫలితం రాలేదని, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళతానని రైతు తెలిపారు.
- ● దొంగను అరెస్టు చేసిన పోలీసులు ● బంగారు, వెండి నగలు స్వాధీనం
ప్యాపిలి: మిక్సీలు, గ్యాస్ స్టవ్లు రిపేరు చేస్తానని సైకిల్పై గ్రామాల్లో తిరుగుతూ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు అపహరించేవాడు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుని గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడు. ఈ దొంగను, అతనికి సహకరించిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ప్యాపిలి సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరామిరెడ్డి, జలదుర్గం ఎస్ఐ నాగార్జున ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా యాడికి పట్టణానికి చెందిన జోగి రాజ అలియాస్ రాజ కుళ్లాయప్ప, గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన మునగాల సుంకన్నను బావిపల్లి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి ఐదు తులాల బంగారు నగలు, 10 తులాల వెండి కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపామనానరు. జోగి రాజు.. హుసేనాపురం గ్రామంలో రెండు ఇళ్లలో, మామిళ్లపల్లి గ్రామంలోని ఒక ఇంటిలో గత రెండు, మూడు నెలల క్రితం చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అపహరించిన సొమ్ములో కొంత సొమ్మును విక్రయించడానికి మునగాల సుంకన్నకు ఇచ్చినట్లు వెల్లడించారు. జోగి రాజు మిక్సీలు, గ్యాస్ స్టవ్లు రిపేరు చేస్తానని సైకిల్పై తిరుగతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. అపహరించిన నగలను విక్రయించి వచ్చిన సొమ్ముతో గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడని తెలిపారు. గతంలో జోగి రాజుపై తాడిపత్రి టౌన్ పోలీస్స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు. కేసు ఛేదించిన ఎస్ఐ నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ నీలకంఠ, పీసీలు మాధవరెడ్డి, వెంకటరాజు, మాదన్న, నరసయ్య, మద్దిలేటి, అశోక్కుమార్, హోంగార్డులు హుసేన్బాష, మహబూబ్ బాషాలను సీఐ అభినందించారు.
నంద్యాల(న్యూటౌన్)/కర్నూలు (టౌన్): చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల అధ్యక్ష ఖండం పీఠాధిపతి(బిషప్)గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును నియమించినట్లు నంద్యాల డయాసిస్ సెక్రటరీ స్టాండ్లీ విలియమ్స్ ఆదివారం పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 11వ తేదీన నంద్యాలలో జరిగిన బిషప్ ఎన్నికల్లో నలుగురు బిషప్ అభ్యర్థులుగా విజయం సాధించారు. వీరిలో రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును చైన్నెలోని మోడరేటర్ కార్యాలయంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ రూబెన్మార్క్ అధ్యక్షతన ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. దాదాపు ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న బిషప్ ఎంపిక ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నంద్యాల డయాసిస్ పరిధిలోని సంఘాల పాస్టరేట్ చైర్మన్లు, హోలీక్రాస్ కెథడ్రల్ పాస్టరేట్–1, 2, 3, 4, 5, 6 గురువులు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల అధ్యక్ష ఖండం పీఠాధిపతులుగా నియమితులు కావడంతో పరిపాలన సౌలభ్యం ముందుకు సాగుతుందన్నారు. హోలీక్రాస్ కెథడ్రల్ చర్చి డీనరీ చైర్మన్ కొత్త మాసి జోసెఫ్, ఇమ్మానియేల్, నందం ఐజక్, విజయ్కుమార్, సంజీవ్కుమార్, పాస్టరేట్–1 సెక్రటరీ ప్రభుదాసుతో పాటు కమిటీ సభ్యులు, పాస్టరేట్–2 బాలయ్య, కిరణ్కుమార్, కమిటీ సభ్యులతో పాటు ఆయా సంఘాల కాపర్లు, కమిటీ పెద్దలు, క్రైస్తవులు నంద్యాల అధ్యక్ష ఖండం బిషప్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.
5న పట్టాబిషేకం
గత బిషప్గా ఉన్న పుష్పాలలిత పదవీ విరమణ చెందడంతో నూతన బిషప్గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును ఎంపిక చేశారు. ఈయన వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో పాస్ట్రేట్లో డినరీ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని చిల్డ్రన్స్ పార్కు సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును అభినందించారు. ఈనెల 5వ తేదీ నంద్యాల కేథడ్రల్ చర్చిలో సంతోష్కు బిషప్ పట్టాభిషేకం జరుగుతుందని చర్చి నిర్వాహకులు తెలిపారు.
- ● తెగిన విద్యుత్ లైన్లు
ఆదోని అర్బన్: రాయచోటి నుంచి నెల్లూరుకు ఆదోని మీదుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఎల్బీ లైన్ను ఢీకొట్టింది. దీంతో మూడు విద్యుత్ స్తంభాలు ఇళ్లపైన కూలాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో కాలనీవాసులు, ఆ రోడ్డున వెళ్లే పాదచారులు, వాహనదారులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టారు. కాలనీలో ఒకచోట విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి ఇంటిపై పడింది. మరో రెండు స్తంభాలు ఒరిగి విద్యుత్ లైన్లన్నీ కిందకు పడిపోయాయి. ఒక్కసారిగా విద్యుత్ స్తంభాలు ఒరగడంతో పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. ఎంఎం కాలనీకి విద్యుత్ అధికారులు ఎల్బీ లైన్ ఏర్పాటు చేసేటప్పుడు రోడ్డు ఉందని తెలిసినా కూడా ఎత్తులో పోల్ వేయలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కాలనీవాసులు మండిపడుతున్నారు. ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ప్రధాన రహదారుల్లో పెద్ద పెద్ద వాహనాలు వెళ్తుంటాయని, అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Karimnagar
మల్యాల(చొప్పదండి): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి గుండెపోటుతో మృతిచెందిన వలసజీవి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బూస అంజయ్య(51) జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. జూలై 6న అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. దుబాయ్లో ఉన్న మృతుడి కుమారుడు బూస హరీశ్ తన తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని ముత్యంపేట మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండ్లపల్లి నరసింహ, ఉపాధ్యక్షుడు శేఖర్గౌడ్ దృష్టికి తీసుకెళ్లాడు. వారు కంపెనీ యాజమాన్యంతో సంప్రదించి, మృతదేహాన్ని ఆదివారం దుబాయ్ నుంచి ముత్యంపేటకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
● విత్తనోత్పత్తిలో నూతన ప్రక్రియకు శ్రీకారం
● మంత్రి ఆదేశాలు అమలైతే అన్నదాతకు మేలు
కరీంనగర్ అర్బన్: విత్తనోత్పత్తిలో దళారీ బెడద లేకుండా నేరుగా కంపెనీలే రైతులతో సంబంధాలు పెట్టుకోవాలన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటన అన్నదాతల్లో ఆనందం నింపుతోంది. సదరు ఆదేశాలు అమలైతే రైతులకు గిట్టుబాటు ధర రానుండగా, కంపెనీలకు మేలు చేకూరనుంది. ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం సాగుతుండగా విత్తనాలకు డిమాండ్ లేదంటూ రైతులను మోసగిస్తున్న ఘటనలు అనేకం.
ఆర్గనైజర్లతోనే రైతులకు నష్టం
విత్తనోత్పత్తిలో దక్షిణ ఆమెరికా తరువాత తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమన్నది శాస్త్రవేత్తల మాట. అందులో ఉత్తర తెలంగాణ మరింత అనువైనదని గుర్తించారు. ప్రధానంగా పంట కోత సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ చీడపీడల బెడద, గాలిలో తక్కువ తేమశాతం, నేలల్లో పొటాష్ పోషక సమతౌల్యం, సాగునీటి లభ్యత ఉండటం వంటి అంశాలు విత్తనోత్పత్తికి ఉపయోగకరంగా ఉండటంతో కంపెనీలు కరీంనగర్పై కన్నేశాయి. ఆర్గనైజర్ల ద్వారా జిల్లాలో రైతుల శ్రమతో ఆటలాడుతున్నాయి. పలు రకాల విత్తనాలను సాగు చేయించి ముందొక మాట దిగుబడి తదుపరి మరో ధర చెల్లిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల డబ్బులు ఎగవేసిన సందర్భాలున్నాయి. విత్తనోత్పత్తి వ్యవస్థలో ఆర్థికంగా బాగుపడిన రైతుల సంఖ్య పదిశాతం ఉంటే, మధ్యవర్తులుగా ఉండి రూ.కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య వందశాతం ఉంది. ప్రధాన ఆర్గనైజర్లు ఊరురా వందల సంఖ్యలో సబ్ ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్గనైజర్లతో రైతులకు నేరుగా ఒప్పందాలు లేవు. దస్త్రాల్లో రైతుల వివరాలు మాత్రమే నమోదు చేసుకుంటారు. రైతులకు ఇచ్చే ప్రతి రూపాయికి బాధ్యులుగా సబ్ ఆర్గనైజర్లు ఉంటున్నారు.
హైబ్రిడ్, సూటి రకాల్లో చేతివాటం
జిల్లాలో 65వరకు సూటి వరి విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన మొక్కజొన్న విత్తన కంపెనీలు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన జొన్న, సజ్జ సంస్థలు జిల్లాలో విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం, పరిశోధన స్థానాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయశాఖ గ్రామీణ విత్తనోత్పత్తి కేంద్రం వంటి వాటి ద్వారా సూటి రకాల్లో విత్తనోత్పత్తి చేయిస్తున్నారు. సూటిరకాల్లో రైతులకు పెద్దగా మోసాలు జరగకపోయినా హైబ్రిడ్ విత్తనోత్పత్తిలోనే తీవ్రంగా మోసపోతున్న ఉదంతాలున్నాయి. ప్రధానంగా రైతులు అమాయకంగా సంస్థల సూచనలు పాటిస్తుండటం.. వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో హైబ్రిడ్ విత్తన ఉత్పత్తిలో ప్రయివేటు సంస్థలదే పెత్తనంగా మారింది. గతంలో మెట్పల్లి, కోరుట్ల, మానకొండూరు, హుజూరాబాద్ ప్రాంతాల రైతులతో పలువురు ఏజెంట్లు పలు విత్తనాలు ఉత్పత్తి చేయించి పంట తీసుకెళ్లాక సంస్థలు రైతులు చెల్లింపులు చేయకుండా మోసగించాయి. దీంతో ప్రభుత్వమే రైతులకు రూ.10కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అంతకుముందు జమ్మికుంట ప్రాంతంలో బీపీటీ సూటిరకానికి క్వింటాల్కు రూ.1800పైగా ధర చెల్లిస్తామని విత్తన కంపెనీ సంస్థలు పంట పండిన తరువాత రూ.200 తగ్గించడంతో రైతులు ఆందోళన చేపట్టారు.
- ● జాతీయస్థాయిలో రాణిస్తున్న ఆయా గ్రామాల యువకులు ● ఉద్యోగాల కోసం ఎదురుచూపులు
వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఎదురుగట్ల, చెక్కపల్లి, నూకలమర్రి, అనుపురం గ్రామాలు క్రీడాకారులకు పెట్టింది పేరుగా నిలిచాయి. ఈ గ్రామాల నుంచి ఎందరో క్రీడాకారులు గ్రామీణస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఎలాంటి శిక్షణ లేకున్నా పాఠశాల స్థాయి నుండే క్రీడల్లో పాల్గొని మంచిపేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ కొంత మంది యువకులు క్రీడలపై ఆసక్తితో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని గ్రామీణ క్రీడలకు ఊపిరి పోస్తున్నారు. కబడ్డీ పోటీలంటేనే సదరు గ్రామాల యువకులు పాల్గొంటారని పేరుంది. కాగా, నూకలమర్రి గ్రామంలో చైతన్య యూత్ క్లబ్ పేరుతో క్రీడాకారులు యూత్గా ఏర్పడి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
ఉద్యోగాల కోసం నిరీక్షణ
కబడ్డీ క్రీడపై ఎంతో ఆసక్తి ఉన్న యువకులు క్రీడల కోటాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా, చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వయస్సు దాటిపోయి ఉద్యోగాలకు అనర్హులుగా ఉండిపోతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం, కుల వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పంచాయతీలో కప్లు
మండలంలోని ఎదురుగట్ల, చెక్కపల్లి, నూకలమర్రి గ్రామాల నుంచి కబడ్డీ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన క్రీడాకారులు వారికి వచ్చిన కప్లను ఆయా గ్రామపంచాయతీల్లో భద్రంగా ఉంచుతారు. కాగా, కప్లను చూసి సంతోష పడడం తప్ప ఉద్యోగాలు మాత్రం రావడం లేదని ఆయా గ్రామాల క్రీడాకారులు నిరాశలో ఉన్నారు.
పదుల సంఖ్యలో క్రీడాకారులు
జిల్లాలోనే నూకలమర్రి, ఎదురుగట్ల, చెక్కపల్లి, అనుపురం క్రీడా గ్రామాలుగా పేరుపొందాయి. ఈ గ్రామాల నుంచి 30 ఏళ్లుగా ఎందరో క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ప్రతీ గ్రామం నుంచి పదుల సంఖ్యలో కబడ్డీ క్రీడాకారులు ఉన్నారు. ప్రస్తుతం ఒకరిద్దరికి తప్ప మిగతా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు.
కరీంనగర్అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు సమావేశం రసాభాసాగా సాగింది. కొంతకాలంగా అంతర్గతంగా ఉప్పు నిప్పులా ఉన్న వైరం ఆదివారం రెవెన్యూ గార్డెన్ వేదికగా బయటపడింది. గత పాలకవర్గం, ప్రస్తుత పాలకవర్గానికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇటీవల టీఎన్జీవో భవన్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కోరం లేదని ఈ నెల 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమావేశ ఆరంభంలో బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి హైకోర్టు తీర్పు ప్రతంటూ చూపిస్తూ వాటి సారాంశాన్ని వివరించారు. గత పాలకవర్గాల తీరు నిబంధనలకు విరుద్ధమని, కోరం లేకుండా ఎన్నో తప్పులు చేశారని ఆరోపించారు. దీంతో మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారుల కనుసన్నలో సమావేశాలు జరిగాయని, కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెరవెనుక ఎవరున్నారో తెలుసని, ఎవరికీ భయపడేదిలేదన్నారు. దీనివెనుక రాజకీయ కోణం ఉందని, ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో పోటీపడి గెలవాలని, తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
15మంది సభ్యుల శాశ్వత తొలగింపు
సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 2007–17 వరకు ఉన్న పాలకవర్గ సభ్యులు కర్ర రాజశేఖర్, ఎండీ సమియుద్దీన్, ఇ.లక్ష్మణరాజు, వరాల జ్యోతి, దేశ వేదాద్రి, అనరాసు కుమార్, కె.రవి, సరిల్ల ప్రసాద్, వజీర్ అహ్మద్, తాటికొండ భాస్కర్, బాశెట్టి కిషన్, బొమ్మరాతి సాయికృష్ణ, దునిగంటి సంపత్, తాడ వీరారెడ్డి, ముద్దసాని క్రాంతిలను బ్యాంకు సభ్యత్వం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు సభ ఆమోదం తెలుపగా చైర్మన్ విలాస్రెడ్డి ప్రకటించారు. సమావేశంలో బ్యాంకు సీఈవో నునుగొండ శ్రీనివాస్, సభ్యులు మడుపు మోహన్, ముక్క భాస్కర్, రేగొండ సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, మంగి రవీందర్, నాగుల సతీశ్, రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
గత పాలకవర్గ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన
అంతా చట్టప్రకారమే జరిగిందన్న మాజీ అధ్యక్షుడు
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్కు చెందిన బొల్లి విద్యాసాగర్(37) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. కొంతకాలంగా విద్యాసాగర్కు మానసిక పరిస్థితి సరిగా లేక మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఈనెల 1న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా, గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంతుదూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు.
ఎలిగేడులో ఒకరు..
ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తీగల నరేశ్(32) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు.. నరేశ్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగితే ఎలా అని ఈనెల 2న అతడి భార్య మమత మందలించగా మనస్తాపానికి గురయ్యాడు. అదేరోజు మధ్యాహ్నం 12గంటలకు గడ్డి మందు తాగానని చెప్పడంతో వెంటనే చికిత్సకోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం ప్రతిమ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నరేశ్కు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కొడుకు చేతిలో గాయపడిన తండ్రి..
రాయికల్: కొడుకు చేతిలో గాయపడిన పట్టణానికి చెందిన చిట్యాల లక్ష్మీనర్సయ్య (55) వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. గత నెల 29న నర్సయ్యపై ఆయన కొడుకు రాజేందర్ కత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్యను జగిత్యాల.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. చాతిలో తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. నర్సయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. నర్సయ్యపై దాడి చేసిన కొడుకు రాజేందర్తోపాటు సహకరించిన అస్లాంను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహం
కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంట రెవెన్యూ పరిధిలోని ఎల్ఎండీ రిజర్వాయర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలినట్లు కొత్తపల్లి ఎస్సై సంజీవ్ తెలిపారు. 50–55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచామని, వ్యక్తికి సంబంధించి ఆచూకీ తెలిస్తే కొత్తపల్లి పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.
వేములవాడ: ‘శివయ్యా.. మా కష్టాలు తీర్చయ్యా’.. అంటూ వివిధ ప్రాంతాలకు చెందిన 35 వేల మంది భక్తులు ఆదివారం రాజన్నను దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను మహారాష్ట్ర రాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్వార్ (ఐఏఎస్) ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారికి రూ.30 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాలలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. స్నేహితుల ద్వారా ఆనందంతో పాటు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆపదకు ఆపన్నహస్తంగా స్నేహితులు నిలుస్తారని, నేటి పోటీ ప్రపంచంలో సమయభావం వల్ల చాలామంది స్నేహితులు దూరమవుతున్నారని, వారితో సంప్రదింపులకు సైతం సమయం కేటాయించకపోవడం విచారకమరని పేర్కొన్నారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి స్నేహబంధ వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని, విశిష్టతను ప్రతిఒక్కరూ పాటిస్తూ, స్నేహబంధంలో నైతిక విలువలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. వేడుకల్లో భాగంగా నరేందర్రెడ్డికి ఉపాధ్యాయులు ఫ్రెండ్షిప్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
- ● విశ్రాంత ఏఈ మల్లేశం దాతృత్వం
సిరిసిల్లకల్చరల్: పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ఓ విశ్రాంత ఉద్యోగి ముందుకొచ్చారు. తన పెన్షన్ డబ్బుల్లోంచి రూ.1.50లక్షల చొప్పున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వాటిపై వచ్చే వడ్డీ సొమ్ముతో ప్రతిభావంతులకు పురస్కారాలిచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లకు చెందిన కుసుమ రామయ్య పెద్దకుమారుడు మల్లేశం ఏఈగా ఉద్యోగ విరమణ చేశారు. తనకొచ్చిన పెన్షన్ డబ్బుల్లోంచి రూ.1.50లక్షల చొప్పున తాను చదువుకున్న శివనగర్ జెడ్పీ హైస్కూల్తోపాటు అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాలలకు అందజేశారు. వీటిపై వచ్చే వడ్డీ సొమ్ముతో ఏటా ప్రతిభ చూపే విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వాలని ఆయా సంస్థల హెచ్ఎం, ప్రిన్సిపాళ్లకు సూచించారు. మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే తరహా నిధి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
శంకరపట్నం/మానకొండూర్/రామడుగు/కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలు కడుపునిండా భోజనం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఇన్చార్జి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జిల్లాలో పర్యటించారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలో, రామడుగు మండలం షానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పలువురు లబ్ధిదారులకు రేషన్కార్డులు పంపిణీ చేశారు. మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో విశాల సహకార పరపతి సంఘ నూతన భవనం, షాపింగ్ కాంప్లెక్స్, సంఘ వ్యవస్థాపకుడు అనభేరి వెంకటరమణారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అన్నారు. గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ పనులు త్వరలో చేపడతామని, గోదావరి జలాలు చొప్పదండి నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, పౌరసరాపరాలశాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, గట్టుదుద్దెనపల్లి సొసైటీ చైర్మన్ అనభేరి రాధా కిషన్రావు, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రులకు ఘనస్వాగతం
జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్కు స్పోర్ట్స్స్కూల్లోని హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఆర్డీవో మహేశ్వర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, వెలి చాల రాజేందర్రావు ఘన స్వాగతం పలికారు.
స్కూటీని ఢీకొన్న మంత్రి
కాన్వాయ్లోని పోలీస్ వాహనం
కేశవపట్నం పోలీస్స్టేషన్ సమీపంలో ఆదివారం మంత్రుల కాన్వాయ్లోని ఓ పోలీస్వాహనం స్కూటీని ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యా యి. కేశవపట్నంకు చెందిన చల్ల వెంకటి సాయంత్రం స్కూటీపై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం ముగించుకుని మంత్రుల కాన్వాయ్ అదే రోడ్డుమీదుగా వెళ్తోంది. కాన్వాయ్లోని ఓ పోలీస్ వాహనం స్కూటీని తప్పించే క్రమంలో రోడ్డు కిందకు వెళ్లింది. రోడ్డు పక్క బండరాయికి తాకి ముందుటైర్లు పగిలిపోయాయి. అదుపు తప్పి స్కూటీకి తగిలింది. గాయపడిన వెంకటిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మూడు పంటలకు సాగునీరు
రామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతల ద్వారా ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ శివారులో రూ.75 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో రూ.45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పంపుహౌస్లను రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించారని, ఒక్క ఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ రామగుండాన్ని పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం సంపూర్ణంగా అమలవుతోందన్నారు. మంత్రి లక్ష్మణ్కుమార్ విన్నపం మేరకు పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మిస్తామని, డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు కేటాయించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
రామడుగు, శంకరపట్నంలో రేషన్కార్డులు పంపిణీ
గట్టుదుద్దెనపల్లిలో సొసైటీ నూతన భనవం ప్రారంభం
హుజూరాబాద్: బీజేపీ రాష్ట్రశాఖ పిలుపుమేరకు జిల్లాలో తలపెట్టిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వీణవంక మండలం బేతిగల్లో మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ– ప్రతీ ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి చేపట్టిన కార్యాచరణగా తెలిపారు. ప్రతీ బూత్ కమిటీ అధ్యక్షుడు కనీసం 100 ఇళ్లను సందర్శించి, ప్రధాని మోదీ సందేశం అందించాలనన్నారు. మద్దతు తెలిపేందుకు 92400 15366 మిస్డ్కాల్ నంబర్ ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహారాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గొట్టుముక్కుల సంపత్రావు కిషన్, ప్రధాన కార్యదర్శి మాడుగురి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల మానవహారం
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం మార్చి 2025లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర పెన్షనర్డ్ సమాఖ్య న్యూఢిల్లీ పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన అల్ ఇండియా పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం కరీంనగర్లోని టవర్ సర్కిల్లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల రామేశం మాట్లాడుతూ నూతన పెన్షన్ చట్టం రద్దు చేయాలని, కరోనా సమయంలో రావల్సిన 36 నెలల కరువు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పెన్షనర్ల కన్నా కేంద్ర పెన్షనర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరీంనగర్లో కేంద్ర ఆరోగ్య పథకం ద్వారా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పెన్షనర్లు మంచికట్ల లక్ష్మిపతి, కొండపాక చంద్రమోహన్రావు, యస్వాడ చంద్రమౌళి పాల్గొన్నారు.
కేసీఆర్కు కొనసాగింపే రేవంత్రెడ్డి పాలన
కరీంనగర్: కేసీఆర్ ప్రభుత్వానికి కొనసాగింపుగానే రేవంత్రెడ్డి పాలన ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికార జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్– రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రజలు రాజ్యాధికారం సాధించడమే అసలైన తెలంగాణ అన్నారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ కేవలం ‘వెలమ–రెడ్డి’ వర్గాలకు సంబంధించినదే అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోసం యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని అణగారిన వర్గాల రాజ్యాంగ హక్కుల కోసం లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభమైందని, అతి త్వరలో కరీంనగర్కు రాబోతున్న యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు రాఘవేంద్ర ముదిరాజ్, వినోద్ యాదవ్, సభ్యులు శ్రీకాంత్, రాము యాద వ్, కార్తీక్ ఏకలవ్య, బీసీ సంఘాల నాయకులు రణధీర్ సింగ్, విశ్వం, కాంతక్క, లక్ష్మీ, నరేశ్ యాదవ్, నరేశ్, మనోజ్గౌడ్ పాల్గొన్నారు.
- ● కసరత్తులో అటవీశాఖ ● జిల్లాలో అటవీ విస్తీర్ణం 0.02శాతమే
కరీంనగర్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల పెంపుదలపై దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అడవులను రక్షించడంతో పాటు పచ్చదనంతో విస్తరించి ఉండే రెవెన్యూ, ప్రైవేట్ భూముల్లో అడవుల పెంపకానికి ప్రాధాన్యమిస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 33శాతం అడువులుండాలనేది నిబంధన. కానీ జిల్లాలో అడవుల శాతం 0.02శాతమే.
పచ్చదనమే లక్ష్యం
అటవీ సంరక్షణకు సంబంధితశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. అభివృద్ధి పనులు ఖర్చుల వివరాల నివేదిక తయారు చేశారు. ప్రధానంగా అటవీ భూముల స్థిరీకరణ, అటవీ ప్రాంత పునరుజ్జీవం, అటవీ జంతువుల సంరక్షణకు కావా ల్సిన నిధుల ప్రతిపాదనలను ఇప్పటికే అందజేశా రు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి పట్టణాల్లో అర్బన్ పార్కులను ఏర్పాటు చేశారు. ప్రతి నర్సరీల్లో 10వేలకు పైగా మొక్కలను పెంచుతుండగా పంచాయతీలకే బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ ఖాళీ స్థలముంటే అక్క డ మొక్కలు పెంచేలా కార్యచరణ చేస్తున్నారు.
జిల్లా అడవులు 0.30 శాతమే
రాష్ట్రంలోని మన జిల్లా అడవుల వాటా 0.30శాతమే. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్ రేంజ్లుండగా కరీంనగర్ అటవీ రేంజ్లో 101.75 హెక్టా ర్లు, హుజూరాబాద్ రేంజ్లో 692.5 హెక్టార్ల అడవి ఉన్నట్లు అధికారిక లెక్కలు చాటుతున్నాయి. హు జూరాబాద్ పరిధిలో సైదాపూర్ మండలం ఆకునూరులో మాత్రమే అడవి ఉండగా కరీంనగర్ పరిధిలో గంగాధర మండలం వెంకటాయపల్లి శివారులో అడవి ఉంది. పచ్చదనంతో కూడిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ లేవో తెలుసుకునేందుకు ఇప్పటికే శాటిలైట్ ఆధారంగా క్షేత్రస్థాయిలోని వివరాల క్రోడీకరణ కోసం ఛాయచిత్రాలను సేకరించే ప్రక్రియను అటవీశాఖ ప్రారంభించింది. జిల్లాలవారీగా పచ్చదనం విస్తరించిన ప్రాంతాల్లో ప్రైవేట్ పరిధిలోనివా,? రెవెన్యూ పరిధిలోనివా.? నని ఆరా తీస్తోంది.
అధికారుల సర్వే పూర్తి
రిజర్వ్, సాధారణ, ప్రైవేట్ మూడు రకాలైన అటవీ ప్రాంతాలుంటాయన్నది తెలిసిందే. రిజర్వు అటవీ ప్రాంతం ప్రత్యేక విధి విధానాలతో ఉండనుండగా అటవీ భూములకే పరిమితం. ప్రైవేట్ అడవి ప్రైవే ట్ వ్యక్తుల పరిధిలోకి వస్తుంది. సాధారణ అడవి ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది. ఈ భూములు రెవెన్యూ శాఖ పరిధిలోనివా? అటవీ శాఖ పరిధిలో నివా అనేది తేల్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఛాయచిత్రాల ద్వారా లెక్క తీస్తున్న భూములు సాధారణ అటవీ ప్రాంతాల్లోనివి కావడంతో భవిష్యత్తులో నిర్వహించే సంయుక్త సర్వేకు ఉపయోగపడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లా విస్తీర్ణం:
2,125 చదరపు కిలోమీటర్లు
అటవీ విస్తీర్ణం: 793.80 హెక్టార్లు
మొత్తం విస్తీర్ణంలో
అడవుల శాతం: 0.30శాతం
జనాభా: 10.25లక్షలు
తిమ్మాపూర్లోని రామగుండం– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కొందరు కళాశాల కుర్రాళ్లు ఖరీదైన బైక్లపై చక్కర్లు కొట్టారు. భారీ శబ్దాలు వచ్చే బైక్లతో తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. బైక్పై ఫీట్లు వేస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. వారు నడిపే బైక్ల నుంచి వచ్చే శబ్దం కిలోమీటర్ వరకు వినిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చినా తీరుమారడం లేదంటున్నారు.
కరీంనగర్లోని ఓ కాలనీలో ఒకరోజు రాత్రి 11 గంటలకు కొందరు యువకులు భారీ శబ్దాలు వచ్చే బైక్లతో చక్కర్లు కొడుతున్నారు. నాలుగైదు బైక్లపై తిరుగుతూ చెవులు పగిలిపోయేలా సౌండ్ చేస్తూ.. ఇబ్బందులకు గురిచేశారు. నిద్రపోతున్న కాలనీవాసులు ఏం జరుగుతుందోనని రోడ్లపైకి వచ్చారు. సదరు యువకులను ప్రశ్నించేలోపే అక్కడి నుంచి జారుకున్నారు.
బైక్లకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు ప్రధానరోడ్లు.. గల్లీల్లో యువత స్టంట్లు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు కొరడా ఝులిపిస్తున్న పోలీసులు నగరంలో ఇటీవల 243 వాహనాలు పట్టివేత, జరిమానా విధింపు
- ● ఓ వర్క్ ఇన్స్పెక్టర్ వ్యవహారం ● మూడు నెలలుగా కాంట్రాక్టర్ వద్దే విధులు
కరీంనగర్ కార్పొరేషన్: ఆ వర్క్ ఇన్స్పెక్టర్ జీతం తీసుకునేది కరీంనగర్ నగరపాలకసంస్థలో. పనిచేసేది మాత్రం ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద. గత మూడు నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. కొంతమంది అధికారుల అండదండలతో సదరు వర్క్ఇన్స్పెక్టర్ సేవలు ప్రైవేట్లో తరిస్తున్నట్లు సమాచారం. నగరపాలకసంస్థ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా ఇంజనీరింగ్ అధికారులకు వర్క్ ఇన్స్పెక్టర్లు సహాయకులుగా పనిచేస్తుంటారు. ఔట్సోర్సింగ్ కింద నియామకం అయ్యే వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రతి ఏఈ పరిధిలో దాదాపు నలుగురు ఉంటారు. నగరపాలకసంస్థ 60 డివిజన్ల నుంచి 66 డివిజన్లకు పెరిగిన తరువాత అధికారులు, ఉద్యోగులపైన కూడా పనిభారం పెరిగింది. ఏ అధికారి, ఉద్యోగి ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ఇదిలాఉంటే సుడా నిధులతో నగరంలోని ఓ పార్క్లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్ వద్ద సదరు వర్క్ ఇన్స్పెక్టర్ పనిచేస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. గత మూడు నెలలుగా పార్క్లో కాంట్రాక్టర్కు సంబంధించిన పనులు చక్కబెడుతూ, నగరపాలకసంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఉన్నతాధికారులు గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికై నా నగరపాలకసంస్థలో కొనసాగుతున్న ఇష్టారాజ్య వ్యవహారాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
బదిలీల్లో ఆ పేర్లుండవ్
నగరపాలకసంస్థలోని వర్క్ ఇన్స్పెక్టర్లను అంతర్గత బదిలీ చేస్తూ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. 20 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను ఏఈలకు అసిస్టెంట్లుగా, ఒకరిని వాహన నిర్వహణకు కేటాయించారు. వర్క్ ఇన్స్పెక్టర్ల బదిలీ జరిగిన ప్రతిసారి నలుగురి పేర్లు మాత్రం అందులో ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో పనిచేసే ఆ వర్క్ ఇన్స్పెక్టర్లకు బదిలీలు లేకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశామని, కార్యాలయంలో పనిచేస్తున్నందునే వారిని బదిలీ చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
- ● డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు ● 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశం
సాక్షి, పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కోసం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడినుంచి నేరుగా కాకతీయ కాలువలోకి పంపిస్తారు. రేవెల్లి సమీపంలోని హెడ్రెగ్యులేటర్ ద్వారా ఎస్సారెస్సీ డీ–83, డీ–86 కాలవలకు అందిస్తారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2.40లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
ప్రాథమిక అంచనాలు సిద్ధం..
ప్రతిపాదిత ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ అధికారులతో కలిసి గతంలోనే పరిశీలించి సమీక్షించారు. రిజర్వాయర్ ఎంత సామర్థ్యంతో నిర్మించాలి..? ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతాయి..? ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఎన్ని..? తదితర అంశాలపై ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా ప్ర తిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే 1,700 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాకు వ చ్చారు. ఇందులో 400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉంటుంది.
కరీంనగర్: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఆదివారం డీఈవో కార్యాలయంలో ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం అర్హులైన వారి జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందుపరిచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఎస్జీటీలు తమ విద్యార్హతల ఒరిజినల్ ఽధ్రువపత్రాలు, సర్వీస్ రిజిస్టర్ను పరిశీలించారు. జాబితాలో దొర్లిన తప్పులను సవరించాలని కొంత మంది ఆధారాలతో సహా అర్జీలు పెట్టుకో, రానున్న జాబి తాలో ఆయా కేటగిరీల వివరాలను పొందుపర్చే అవకాశం ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన రాత్రి వరకు కొనసాగింది. డీఈవో చైతన్య జైనీ దగ్గరుండి పర్యవేక్షించారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కార్యాలయం ఆవరణలో జాబితాపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు.
Parvathipuram Manyam
ఉభాలు జరగని వరిపొలాలు
వర్షాధారమే..
వరుణుడు కరుణిస్తేనే పంటలు పండుతాయి. లేదంటే కష్టమే. ప్రతీ ఏటా కొండపోడు పంటలు ఎక్కువగా పండేవి. ప్రస్తుతం అవి కూడా లేవు. వర్షాలు పడితే ఖరీఫ్లో వరి, రాగులు వంటివి వేసుకోవాల్సింది. గెడ్డలు అడుగంటడం, చెరువులు, చెక్డ్యాంలలో నీరు నిల్వలు లేకపోవడంతో ఈ ఏడాది ఇబ్బందులు తప్పవు.
– ఎన్. అబ్బాస్, కుశిమి
ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు
ప్రతీ ఏటా ఈ సీజన్ వచ్చేసరికి వర్షాలు పడేవి. పంటలు వేసుకునే వాళ్లం. ఎప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో పంటలు వేయలేదు. ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఆదుకోవాలి.
– ఎస్.సన్నాయి, చాపరాయిగూడ
● అడుగంటిన చెక్డ్యాంలు, చెరువులు
● నీరు నిల్వలేని గెడ్డలు
● కరుణించని వరుణుడు
● ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ప్రారంభం కాని ఉభాలు
● ఆందోళనలో ఏజెన్సీ రైతాంగం
ఏజెన్సీలో
ఖరీఫ్ గట్టేక్కేనా..!
సీతంపేట: నైరుతి రుతుపవనాలు మే నెలలోనే వచ్చేశాయని రైతులు ఆనందపడ్డారు. ఆ ఆనందం ఎంత కాలం నిలవలేదు. జూన్ నుంచి వరుణుడి కరుణలేదు. చుక్క చినుకు లేక పొలాలు బీడు వారుతున్నాయి. ఆగస్టు వచ్చినా వర్షాలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉభాలు ఇంకా జరగలేదు. దిక్కుతోచని స్థితిలో మన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏ పరిధి సబ్ప్లాన్ మండలాల్లో 80 శాతం వర్షాధార పంటలే. వానలు పడితేనే పంటలు పండుతాయి. లేకపోతే గడ్డు పరిస్థితి తప్పదు. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటలు ఎలా పండుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడా చెక్డ్యాంలు, చెరువులు గతంలో నిర్మించారు. అవి కూడా అడుగంటిపోయి కనిపిస్తున్నాయి. చెక్డ్యాంలు నిర్మించి ఏళ్లు గడిచాయి. ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు సైతం నీరు లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఖరీఫ్ గట్టెక్కుతుందా.. లేదా.. అనేది ప్రశ్నార్దకంగా మారింది. వేసవిలోనే చెక్డ్యాంలు, చెరువులు అడుగంటిపోయాయి. రబీ పంటలు సైతం పండక రైతులు ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం వర్షాలు అనుకున్నంతగా కురవకపోవడంతో ఖరీఫ్ పంటలు ఎలా పండించాలని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎస్ఎంఐ విభాగం ద్వారా లక్షలాది రూపాయిలు వెచ్చించి నిర్మించిన చెక్డ్యాంలు, చెరువులు వృథాగా పడి ఉంటున్నాయి. కొన్ని మరమ్మతలకు గురయ్యాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని టీపీఎంయూ మండలాల్లో ఖరీఫ్ సీజన్లో భాగంగా 13 వేల హెక్టార్లలో వరి పండుతుంది. మిగతా చిరుధాన్యాల పంటలు మూడు వేల హెక్టార్ల వరకు పండుతున్నాయి. ప్రతీ ఏటా ఈ సీజన్లో ఈ పాటికే వర్షాలు పడేవి. ఉభాలు చేసి వరినాట్లు వేసేవారు. కొద్ది రోజుల కిందట ఆకుమడులు తయారు చేసి వరినారు వేశారు. అవి మొలకలు వచ్చాయి. వర్షాలు లేని కారణంగా 30 శాతం కూడా ఉభాలు జరగని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ఉభాలు ఊపందుకున్నాయి. ఇక్కడ మాత్రం ఆకుమడులే కనిపిస్తున్నాయి తప్ప ఉభాలు లేవు. మెట్టపంటలకు కూడా ఆ మాత్రం వర్షాలు అవసరం ఉంది. ఈ సీజన్లోనే కంది ఇతర చిరుధాన్యాల పంటలు కూడా వేస్తారు. ఈ తరహా పంటలకు సైతం మొదట చిరుజల్లులు అయినా అవసరమౌతాయి. ఆ మాత్రం చినుకులు ప్రస్తుతం పడక పోవడంతో ఏం చేయాలో రైతులకు అర్ధం కావడం లేదు.
ఉద్యానవన పంటలకు తప్పని నష్టాలు
ఉద్యానవనాల పంటలకూ నష్టాలు తప్పడం లేదు. ఐటీడీఏ కూడా గతంలో సుమారు 15 వేల వరకు ఉద్యాన వనాల పంటలైన జీడి, మామిడి, పనస వంటి పంటలను ప్రోత్సాహించింది. అంతేకాకుండా ఎన్ఆర్ఈజీఎస్లో సైతం ఉద్యానవన మొక్కలు వేశారు. అయితే వీటికి కూడా నీరు లేదు. పసుపు, అల్లం, ఇతర పంటలకు ఈ నెలలో వర్షాలు అవసరమవుతాయి. గెడ్డల్లో నీరు కరువైంది. గిరిజనులకు బోర్లు వంటి సౌకర్యం లేకపోవడంతో నీరెలా పొలాలకు పెడతామని రైతులు వాపోతున్నారు.
న్యూస్రీల్
- సౌర విద్యుత్తో
సాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం సూర్యఘర్పై విస్తృత ప్రచారం చేయడంతో పాటు.. అందరూ వినియోగించుకునేలా చైతన్యం చేస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ పార్వతీపురం సర్కిల్ పర్యవేక్షక ఇంజినీరు కె.మల్లికార్జునరావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు బిల్లుల ఆదాతోపాటు, అంతరాయాలు లేకుండా సరఫరా పొందవచ్చని.. మిగులును విక్రయించుకోవచ్చని చెప్పారు. స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం పడుతుందన్నది కేవలం అపోహేనని ఆయన తెలిపారు. ఇటీవల వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు విద్యుత్తు మీటర్లు, ఆధార్ లింకులో తప్పిదాల వల్ల అర్హత కోల్పోతున్నారని, తమ దృష్టికి వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఆధార్ అనుసంధానంలో తప్పిదాలు ఉంటే.. సంబంధిత సెక్షన్ కార్యాలయాల్లో సిబ్బందిని సంప్రదించవచ్చని సూచించారు. ‘సాక్షి’తో ముఖాముఖిలో సర్కిల్ పరిధిలో శాఖాపరంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పీఎం సూర్యఘర్కు రాయితీ అందిస్తున్నాం..
పీఎం సూర్యఘర్ సోలార్ యూనిట్ రూ.2 లక్షల స్కీం. ఇందులో రూ.78 వేలు రాయితీ ఉంటుంది. మిగతా మొత్తం బ్యాంకులు రుణాల రూపంలో అందిస్తాయి. ఈఎంఐ విధానంలో చెల్లించుకోవచ్చు. 3 కిలోవాట్స్ వరకు లోడు పెట్టుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ, ఇన్వర్టర్స్ అందిస్తాం. 25 ఏళ్ల వారంటీ కూడా ఉంటుంది. అధిక బిల్లు భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉత్పత్తిలో వినియోగం పోను తిరిగి విక్రయించుకోవచ్చు. యూనిట్కు రూ.2.65 పైసలు చొప్పున మేమే కొనుగోలు చేస్తాం. నెట్ మీటరింగ్ పెడతాం. ఈ ఏడాదిలో సర్కిల్కు 6 వేల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 422 ఇళ్లకు బిగించాం. 14 గ్రౌండింగ్ దశలో ఉన్నాయి.
ఎస్సీ, ఎస్టీల గృహాలను లీజుకు తీసుకుంటాం...
పీఎం సూర్యఘర్ కింద సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు తిరిగి డబ్బులివ్వనున్నాం. రూఫ్ టాప్ 200 ఎస్ఎఫ్టీ ఉండాలి. అటువంటి ఇళ్లను లీజుకు తీసుకుంటాం. మొత్తం ప్యానెళ్లన్నీ మేమే ఇస్తాం. వారికి అద్దె చొప్పున ఎస్ఎఫ్టీకి రూపాయి చొప్పున నెలకు రూ.200 తిరిగి ఇస్తాం. వారు వినియోగించే విద్యుత్ కూడా ఉచితమే. దీనిపై సర్వే చేసి, ఆసక్తి ఉన్న వినియోగదారులను గుర్తిస్తున్నాం.
ప్రతిపాదనలో కొత్త సబ్స్టేషన్లు
అడ్డాపుశీలలోని టిడ్కో గృహాల వద్ద 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం తుది దశలో ఉంది. కురుపాంలో 132/33 కేవీ సబ్ స్టేషన్ కోసం స్థలం సిద్ధంగా ఉంది. అక్కడ నిర్మాణం చేపడతాం. మరికొన్ని చోట్ల ప్రతిపాదనల దశలో ఉన్నాయి.
ఆర్డీఎస్ఎస్ పథకంతో వివిధ పనులు
ఆర్డీఎస్ఎస్ స్కీం ద్వారా జిల్లాలో వివిధ పనులు చేపడుతున్నాం. ఇందులో ప్రధానంగా ప్రత్యామ్నాయ లైన్లు, సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయాలు తగ్గించేలా అదనపు ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ఫీడర్లు, వ్యవసాయ ఫీడర్లు వేరుచేసే పనులు అవుతున్నాయి. సర్కిల్లో 59 ఫీడర్ల పనులు చేస్తున్నాం. పట్టణంలో ఎనిమిది ఫీడర్లు వేస్తున్నాం. మూడు సర్కిళ్లలో మొత్తం రూ.4 వేల కోట్లతో వివిధ పనులు జరుగుతున్నాయి. అడ్డాపుశీల టిడ్కో వద్ద సబ్స్టేషన్ నిర్మాణంతో పాటు.. గరుగుబిల్లి నుంచి బూర్జ వరకు 12 కిలోమీటర్ల మేర 33 కేవీ ఇంటర్ లింకింగు లైన్లు వేశాం. దీనివల్ల విద్యుత్తు అంతరాయం తగ్గుతుంది. దీంతో పాటు జిల్లాకు కొత్త సర్కిల్ కార్యాలయం భవనం మంజూరైంది. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నాం. ఏడాదిలో పూర్తవుతుంది.
ఆన్లైన్లోనే వ్యవసాయ కనెక్షన్ల రిజిస్ట్రేషన్
ప్రస్తుతం జిల్లాలో 22,277 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 908 మంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 156 మంది నగదు కట్టలేదు. 696 మందికి కనెక్షన్ల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు నిరంతర ప్రక్రియ. రైతులు నేరుగా 1912 టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
విద్యుత్తు కోతలు లేవు..
ప్రస్తుతం జిల్లాలో విద్యుత్తు కోతలు ఎక్కడా లేవు. ప్రతి శుక్రవారం నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నాం. ఆ సమయంలో సంబంధిత ఏరియాలో కొద్డి గంటలు సరఫరా ఆపివేస్తున్నాం. ఆ విషయం ముందుగానే వినియోగదారులకు మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేస్తున్నాం.
స్మార్ట్ మీటర్లపై సందేహాల నివృత్తి
ప్రీపెయిడ్ తరహాలోనే విద్యుత్ బిల్లులు చెల్లించేలా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల అధికంగా బిల్లులు వస్తాయన్నది అపోహే. ప్రస్తుతానికి కేటగిరీ–2(వాణిజ్య), ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా మీటర్లు అమర్చుతున్నాం. అధిక వినియోగం ఉన్న గృహాలకూ పెడుతున్నాం. ప్రస్తుతం జిల్లాలో 13,259 సర్వీసులకు మీటర్లు అమర్చాం. బిల్లు సెల్ఫోన్కే వస్తుంది. వినియోగదారులకు ఉండే సందేహాలను మా సిబ్బంది నివృత్తి చేస్తున్నారు.
పీఎం సూర్యఘర్ను ప్రతి ఇంటికీ చేరువ చేస్తాం..
ఎస్సీ, ఎస్టీలు సోలార్లు ఏర్పాటు చేసుకుంటే తిరిగి డబ్బులిస్తాం
స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం అపోహే
‘సాక్షి’తో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మల్లికార్జునరావు
మెంటాడ: కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజా క్షేత్రంలో ప్రశ్నిస్తే మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఎందుకంత ఉలికిపాటు అని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిని చొక్కా పట్టుకొని అడగండి అని మంత్రి సంధ్యారాణి చెబుతున్నారని ఇచ్చిన హామీలపై అడిగితే అంత కోపమెందుకని ప్రశ్నించారు. ఎన్నికల వేళ నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో సూపర్ సిక్స్ అమలు చేయకుంటే చొక్కా పట్టుకుని అడగండి అని చెప్పారని ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ 50 సంవత్సరాలు దాటిని వారికి పింఛన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమయ్యాయని ప్రశ్నించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అర్హులందరికీ నగదు జమ కాలేదని దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు. వీటిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, జేసీఎస్ కన్వీనర్ కనిమెరక త్రినాధరెడ్డి, రాజప్పలనాయుడు, బాయి అప్పారావు, లెంక రత్నాకర్ ఉన్నారు.
మీరిచ్చిన హామీలనే మేము గుర్తు చేస్తున్నాం..
మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
చీపురుపల్లి: పట్టణంతో పాటు పల్లెల్లో కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతీ గ్రామంలోనూ ప్రజలు జ్వరాలతో మంచాన పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు బారిన పడుతు న్న వారు సమీపంలోని ఆర్ఎంపీల ద్వారా స్వంత డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్నారు. మండలంలోని విశ్వనాథపురంలో ఐదేళ్ల బాలిక జ్వరంతో మృత్యువాత పడడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు కాని, జ్వరాలు వచ్చిన తరువాత పంపిణీ చేయాల్సిన మందులు విషయంలో సైతం ఎక్కడా వారు కనిపించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అకస్మాత్తుగా...
మండలంలోని అలజంగి పంచాయతీ మధురా గ్రామమైన విశ్వనాథపురం గ్రామానికి చెందిన దన్నాన జాస్మిన్(5) అనే బాలిక వింత జ్వరంతో ఆదివారం మృతి చెందింది. రామప్పడు, నాగమణి దంపతులకు చెందిన జాస్మిన్ గత మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా ఆర్ఎంపీలు వద్ద వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యంలో మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
● విశ్వనాథపురంలో ఐదేళ్ల చిన్నారి మృతి
● పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ
మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని ఆదివారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ వీఆర్ఎస్ ప్రాజెక్టు ద్వారా మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాలకు చెందిన 24,700ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. వీఆర్ఎస్ ప్రాజెక్టు నీటిమట్టం 1610 మీటర్లు కాగా, ప్రస్తుతం శతశాతం నీరు నిల్వ ఉందన్నారు. రైతులు సక్రమంగా నీటిని వినియోగించుకుంటే, శివారు గ్రామాల పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందన్నారు. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు రూ.263.27లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. పనులు పూర్తయితే ప్రాజెక్టు పరిధిలో 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
● ఎంఓయూ జరిగి రెండు నెలలైనా పూర్తిస్థాయిలో జరగని గార్డుల
నియామకం
● 58 మందిసెక్యూరిటీ గార్డులకు విధుల్లో 23 మంది
● సెక్యూరిటీ పూర్తిస్థాయిలో లేక కానరాని భద్రత
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కావడంతో జిల్లా ఆస్పత్రి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారింది. దీంతో ఆస్పత్రిలో వైద్యసిబ్బందితో పాటు, వసతులు కూడా పెరిగాయి. ఈ క్రమంలో ఓపీ సంఖ్య పెరిగింది. అయితే ఆస్పత్రికి, రోగులు, వైద్యసిబ్బందికి భద్రత మాత్రం పూర్తి స్థాయిలో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వజన ఆస్పత్రికి నిబంధన ప్రకారం ఉండాల్సిన సెక్యూరిటీ గార్డుల్లో సగం సిబ్బంది మాత్రమే ఉన్నారు. దీంతో వారు ఆస్పత్రి అంతటికీ భద్రత కల్పించలేక పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీని కూడా మార్చేసింది.
గతంలో కాటలాండ్ సెక్యూరిటీ ఏజెన్సీవారు బాధ్యతలు నిర్వహించేవారు. కూటమి సర్కార్ ఆ ఏజెన్సీని తప్పించి శ్రీ కార్తికేయ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది.
58మంది సెక్యూరిటీ గార్డులకు ఎంఓయూ
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి నూతన నిబంధన ప్రకారం 58మంది సెక్యూరిటీ గార్డులు ఉండాలని సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు సెక్యూరిటీ ఎజెన్సీతో ఎంఓయూ చేసుకున్నారు. అగ్రిమెంట్ మే నెలలో జరిగింది. జూన్ నెల 1వతేదీ నుంచి 58 మంది సెక్యూరిటీ గార్డులను సెక్యూరిటీ ఏజెన్సీ సరఫరా చేయాల్సి ఉంది. అగ్రిమెంట్ జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో సెక్యూరిటీ గార్డులను సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో 23 మంది సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు సెక్యూరిటీ సూపర్వైజర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.
గార్డులను సరఫరా చేయక పోవడం వెనుక..
జూన్ ఒకటో తేదీ నుంచి సెక్యూరిటీ గార్డులు పూర్తిస్థాయిలో ఆస్పత్రిలో పనిచేయాల్సి ఉంది. అయినప్పటికీ సగం మందితో పనిచేయిస్తున్నారు. దీని వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తక్కువ మందితో పనిచేసినప్పటికీ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నట్లు చూపించి నిధులు కొట్టేయడానికే ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం మందితో పనిచేయించడం వల్ల నెలకు రూ.లక్షల్లో మిగులుతుంది. ఈ ఉద్దేశంతో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో గార్డులు
సర్వజన ఆస్పత్రి సెక్యూరిటీ నిర్వహణ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీకి వచ్చింది. మే నెలలో ఎంఓయూ జరిగింది. జూన్ ఒకటో తేదీ నుంచి 58 మంది సెక్యూరిటీ గార్డులతో పనిచేయించాలని ఎంఓయూ జరిగింది. ప్రస్తుతం 23 మంది గార్డులు, ఇద్దరు సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి సెక్యూరిటీ గార్డులను సరఫరా చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.
డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
వేపాడ: మండలంలోని వల్లంపూడి సమీపంలో ఆటోలో రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని వల్లంపూడి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై సుదర్శన్ ఆదివారం తెలిపారు. పట్టుబడిన బియ్యం, వాహనం స్టేషన్లో ఉంచామని సోమవారం రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్సై చెప్పారు. పట్టుబడిన బియ్యం సుమారు 350 కేజీలు ఉంటాయన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి
● పారా స్పోర్ట్స్ అసోసియేషన్
గౌరవాధ్యక్షుడు దయానంద్
విజయనగరం: పారా జూనియర్, సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులు అక్కడ కూడా సత్తా చాటాలని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం విజయనగరంలో గల సారథి వెల్ఫేర్ అసోసియేషన్ బ్లైండ్ స్కూల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 135 మంది పారా క్రీడాకారులు పాల్గొన్నారని, వారిలో 47 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. పాతవారితో పాటు మొదటిసారి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 9 న విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా సత్తా చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని, అలాగే హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో సారథి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రదీప్, అమ్మ సేవా సంఘం వ్యవస్థాపకుడు లక్కీ శేఖర్, మహేష్, కిరణ్ కుమార్, శర్మ, వెంకటరావు, పారా క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం పూర్తయ్యాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారికి వివిధ విభాగాల్లో పరుగు పోటీలతో పాటు లాంగ్ జంప్, షాట్పుట్, హైజంప్, జావెలిన్ త్రో తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ ఎంపికలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పి.సీతారామరాజు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఐవీపీ రాజు ప్రారంభించారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాల జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టెక్నికల్ ఆఫీషియల్స్, సీనియర్ అథ్లెట్లు పాల్గొన్నారు.
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా ట్రైన్లో లోకల్ పోలీసులు, జీఆర్పీ, ఈగల్, ఆర్పీఎఫ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్తో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఐదు పోలీసు బృందాలు సంయుక్తంగా కిరండోల్ పాసింజర్ ట్రైన్లో శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ప్రత్యేకంగా రైళ్లలో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తిలు ముందుగా ప్రయాణికులకు చేస్తున్న తనిఖీల గురించి వివరించి, వారు నిర్వర్తించే విధుల గురించి దిశా నిర్దేశం చేశారన్నారు. అన్ని భోగీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆరు కిలోల గంజాయి, ఒక వ్యక్తి నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 1972కుఅందించాలని ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్ ఆర్పీఎఫ్ ఎస్సై పి.శ్రీనివాసరావు డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఈగల్ టీమ్ పోలీసులు, 40మంది పోలీసు అధికారులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఏడున్నర కేజీల గంజాయి లభ్యం
జీఆర్పీకి చిక్కిన పల్నాడు వాసి
రైలులో గంజాయి అక్రమ రవాణా
విశాఖ నుంచి కిరండోల్ వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్లో గంజాయి అక్రమ రవాణాను గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తన సిబ్బందితో కలిసి కిరండోల్ రైలులో సోదాలు చేస్తుండగా ఓ వ్యక్తి కొత్తవలసలో రైలు దిగి పారిపోతూ అడ్డంగా దొరికిపోయాడు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ముందలమూరివారిపాలానికి చెందిన తన్నేరు ఏసుబాబు ఒడిశాలో కొనుగోలు చేసి బెంగళూరుకు 1.133కేజీల గంజాయిని తరలిస్తూ చిక్కాడని ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఈ మేరకు నిందితుడు ఏసుబాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.
పాలకొండ రూరల్: ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి..తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా నాన్నా..అంటూ మృతుడి తల్లిదండ్రుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. భవన నిర్మాణ కార్మికుడైన ఆ తండ్రి తన రెక్కల కష్టంతో పిల్లలను, కుటుంబాన్ని సాకాడు. ఎదుగుతున్న పిల్లలు ఉన్నత చదువులు చదవాలకున్నాడు. భార్య భారతి సహకారంతో పిల్లలకు కష్టం తెలియకుండా కుమార్తె యమున డిగ్రీ, కుమారుడు దుర్గాప్రసాద్(18) ఇంటర్ చదువుతుండడంతో కష్టం మరిచి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. విధి చిన్న చూపు చూసి వారి ఏకై క కుమారుడిని నాగావళి నది కబళించి ఆ కుటంబంలో తీరని శోకం నింపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
పాలకొండ నగరపంచాయతీలోని బల్లంకి వీధిలో నివాసముంటున్న శాసుబిల్లి రాము, భారతి దంపతులకు ఇద్దరు పిల్లలు. భవన నిర్మాణ పనులు చేస్తున్న రాము పిల్లలను చదువులవైపు నడిపించాడు. కుమార్తె డిగ్రీ చదువుతుండగా, కుమారుడు దుర్గాప్రసాద్ స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో మిత్రులతో కలిసి దుర్గాప్రసాద్ బయటకు వెళ్లాడు. అప్పటి వరకూ తమతో కలిసి ఉన్న కుమారుడు స్నేహితులతో ఉన్నాడని భావించిన తల్లిదండ్రులకు మధ్యాహ్నానికి వచ్చిన పిడుగులాంటి వార్త వారు ఉన్నచోట కుప్పకూలేలా చేసింది. ఒక్కసారిగా తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ ఒక్కగానొక్క కుమారుడు ఏడుగురు స్నేహితులతో కలిసి సమీప శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట సమీపంలో నాగావళి నది వద్దకు వెళ్లాడని, అక్కడ స్నానం చేసే క్రమంలో దుర్గాప్రసాద్ నదిలో చిక్కుపోవడం, రక్షించే యత్నంలో స్నేహితులు విఫలం కావడంతో సమీపంలో ఉన్న లాబాం గ్రామస్తుల సాయం కోరగా గ్రామస్తులు రక్షించే యత్నం చేస్తున్న క్రమంలో విగతజీవిగా దుర్గాప్రసాద్ను నదిలో గుర్తించారని తెలిసి షాక్కు గురయ్యామని మృతుడి తండ్రి రాము వాపోయాడు.
రూ.200 ఫోన్పే చేశాను..
నాన్నా..నేను ఫ్రెడ్స్తో కలిసి బయటకు వచ్చానని, బిర్యానీ తినేందుకు రూ.200 కావాలని ఫోన్ చేయడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తండ్రి రాము కుమారుడికి ఫోన్ పే చేసి నాన్నా జాగ్రత్త అని చెప్పాడు. త్వరగా ఇంటికి వచ్చేయాలన్నాడు. ఇంతలోనే ఘోరం జరిగిందని మృతుడి తండ్రి రాము చెబుతూ గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని మిగిలిన ఏడుగురు స్నేహితులు క్షేమంగా ఉన్నారని బూర్జ ఎస్సై ఎం.ప్రవల్లిక తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు పోలీసులు తరలించారు.
తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా నాన్నా..
మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
కంటతడి పెట్టిన గ్రామస్తులు
వేపాడ:
వేపాడ–ఆనందపురం ప్రధాన రహదారిలో నీలకంఠరాజపురం వద్ద రైవాడ కాలువ కల్వర్టు సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నీలకంఠరాజపురం రైవాడ కాలువ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. వ్యక్తిని ఢీకొన్న వాహనం, ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదని సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని వల్లంపూడి ఎస్సై సుదర్శన్, సీఐ అప్పలనాయుడు సిబ్బంది సందర్శించి ప్రమాదంపై గ్రామస్తులను ఆరాతీశారు. తెల్లవారుజామున 2గంటల నుంచి 4 గంటల మధ్య ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వ్యక్తికి సంబంధించిన స్కూటీ కల్వర్టుగోడ పక్కన ఉందన్నారు. మృతదేహాన్ని ఎస్.కోట ఆస్పత్రికి తరలించామని కుటుంబసభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు.
బైక్తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి..
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి, జన్నివలస జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ద్విచ్రవాహనంతో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జన్నివలస పంచాయతీ పరిధిలోని నేరళ్లవలస గిరిజన గ్రామానికి చెందిన కుడుమూరు కన్నయ్య దొర (26) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై రామభద్రపురం మండలకేంద్రానికి వచ్చాడు. పని ముగించుకుని తిరిగి సొంత గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని అక్కడిక్కడే మృతిచెందాడు.ఆదివారం ఉదయం అటువైపు వాకింగ్కు వెళ్తున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితిని పరిశీలించారు.
మృతుడికి భార్య భవాని, పిల్లలు అజిత్ కుమార్, సోను ఉన్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్న ఇంటి పెద్ద దిక్కు ను కోల్పోవడంతో తల్లి, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించి మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలియరాని మృతుడి వివరాలు
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి ఒడిశా వెళ్తున్న ఓ లారీని ఆరికతోట వద్ద డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి టిఫిన్కు వెళ్లాడు. లారీకి బ్రేకులు ఫెయిలయ్యాయో ఏమో గానీ సడన్గా లారీ ముందుకు వెళ్లి ఎదురుగా ఆగి ఉన్న 3 బైకులు, రెండు ఆటోలు, ఒక బొలెరో వ్యాన్ను ఢీ కొట్టుకుంటూ దూసుకెళ్లి రహదారి పక్కన ఉన్న ఓ ఆటోను ఢీ కొట్టి ఆగింది. ముందుగా మొక్కజొన్న కంకుల లోడు కోసం ఆగి ఉన్న బొలెరో వ్యాన్ను ఢీ కొనడంతో ఆ వ్యాన్ పక్కన ఉన్న గోతిలో పడింది. అలాగా టిఫిన్ కొట్టు ముందు ఆగి ఉన్న ఆటోను ఒక్క సారిగా ఢీ కొనడంతో ఆ ఆటో టిఫిన్ కొట్టులోకి వెళ్లి దుకాణంలో ఉన్న సామగ్రి ధ్వంసం చేసింది. తర్వాత మరికొంత దూరంలో ఉన్న మూడు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టడంతో ఒక బైక్ నుజ్జు నుజ్జవగా మరో రెండు బైక్లు లారీ కింద చక్రాల మధ్య ఇరుక్కుపోయి పూర్తిగి ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని ఆరికతోట యజ్జల భాస్కరరావుకు చెందిన ఆటోతో పాటు టీ దుకాణంలో ఉన్న సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే ఇదే దుప్పలపూడి గ్రామానికి చెందిన చిప్పాడ రవితో పాటు మరో ఇద్దరి ద్విచక్రవాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఈ రోడ్డు ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం, ఏ ఒక్కరికీ చిన్న గాయం కూడా జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ బీభత్సంపై బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
3 బైకులు, రెండు ఆటోలు, ఒక బొలెరో వ్యాన్ ధ్వంసం
ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
రామభద్రపురం:
గిరిజన రైతులు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రామభద్రపురం మండలంలోని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతుల సాగు భూములను దౌర్జన్యంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాకర్లవలస గ్రామంలో గిరిజన రైతులతో కలిసి ఆదివారం ఆయన ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేకుండా గిరిజనుల భూములు అక్రమంగా లాక్కోవడం చట్ట విరుద్ధమన్నారు. కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతుల సాగు భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ఎవరు వచ్చినా సహించేది లేదన్నారు.అధికార బలంతో గిరిజనులపై దౌర్జన్య కాండను ఆపకుంటే వామపక్షాలన్నీ ఏకమై గిరిజనుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తాయని హెచ్చరించారు. గిరిజన రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మామిడితోటలు, జీడితోటలు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసిన ఏపీఐఐసీ అధికారులు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకుడు బలస శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని
సూర్యనారాయణ
Andhra Pradesh
సాక్షి, అమరావతి: నయా బేతాళ కుట్రలో చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా కలసికట్టుగా మరో అంకాన్ని సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దలు, సిట్కు దిమ్మతిరిగిపోయింది. వెంటనే ఏదో ఒకటి చేసి.. ఈ విషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించకపోతే ఇది పూర్తిగా తప్పుడు కేసేనని తెలిసిపోతుందని అప్పటికప్పుడు ఓ వీడియోను ఎల్లో మీడియాకు లీక్ చేశారు.
తద్వారా ఆ వీడియోకు విపరీత ప్రచారం కల్పించారు. ఆ వీడియోలో వెంకటేశ్ నాయుడు కరెన్సీ నోట్ల పక్కన ఉన్న ఫొటోను ఎల్లో మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు. వీళ్లు చెప్పినట్లు వినేవారిని ముందు పెట్టి సరికొత్త నాటకానికి తెరతీశారు.
చెల్లని నోట్లతో కట్టుకథ
చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు పంపిణీ చేస్తున్న డబ్బుగా దానిని చిత్రీకరించారు. ఆ ఫొటోలు, వీడియోల్లో రూ.2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో రూ.2 వేల నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ఆర్బీఐ చివరి సారిగా ప్రకటించింది. కానీ 2024 ఎన్నికల సమయంలో మద్యం సొమ్ము అక్రమంగా తరలించారని చెవిరెడ్డిని అరెస్టు చేశారు.దీనిని బట్టి అర్థం కావడం లేదూ ఇదంతా కట్టుకథ అని. ఇదే వెంకటేశ్ నాయుడికి టీడీపీ నేతలతోనే సంబంధాలున్నాయని సోషల్ మీడియా సాక్షిగా బైటపడింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని, ఎంపీలు భరత్, పుట్టా మహేష్లతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ డబ్బు వారందరిదీ అని కూడా అనుకోవచ్చు కదా. వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న ఫొటో పక్కన వీరి ఫొటోలు కూడా పెట్టి.. ఇది వీరి డబ్బే అని చెప్పగలరా? తాము చెప్పినట్టు వినేవాళ్లను రంగంలోకి దించి కట్టుకథ అల్లుతున్నారనేందుకు ఇదే ప్రబల నిదర్శనం.
ఇదేవిషయం గతంలోనూ వెల్లడయ్యింది ఇపుడూ నిరూపితమయింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు, సిట్, ఎల్లో మీడియా కూడబలుక్కుని సమష్టిగా ఆడుతున్న నాటకం అని ఇట్టే తెలిసిపోతోంది. ఎలాగైనా సరే మద్యం అక్రమ కేసును సక్రమం అని నిరూపించడమే లక్ష్యంగా సిట్ బరితెగించి వ్యవహరిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్లో పరువు పోగొట్టుకున్న సిట్.. మరో సరికొత్త ఎపిసోడ్ ద్వారా బేతాళ కథను రక్తి కట్టించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది.
Mahabubabad
- సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
సాక్షి, మహబూబాబాద్: ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 25శాతం రాయితీ కల్పించింది. కాగా, సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఉద్యోగులు చెప్పిన మాటలు విని ఫీజులు చెల్లించిన వారు ఇప్పుడు ప్రొసీడింగ్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయని డబ్బులు తీసుకున్న అధికారులు ఇప్పు డు రకరకాల కొర్రీలు పెడుతూ.. ప్రొసీడింగ్స్ ఇవ్వ డం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
క్రమబద్ధీకరణ అవుతుందని..
ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ కల్పించి నెలరోజుల గడువు ఇచ్చారు. ఇది 2020 డిసెంబర్ 31 వరకు రూ.1000 చెల్లించి రశీదులు తీసుకున్న వారికే వర్తింపజేశారు. ఈమేరకు మహబూబా బాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సి పాలిటీల పరిధిలో 26,001 మంది రూ.1000 చెల్లించి రశీదులు తీసుకున్నారు. అయితే ఇందులో ప్రభు త్వ నిబంధనల మేరకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 20,586 దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ చెల్లించుకునేందుకు అర్హత ఉందని అధికారులు చెప్పారు. దీంతోపై నాలుగు మున్సిపాలిటీల పరిధిలో భూ యజమానులకు ఆయా మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు ఫోన్లు చేయడం, ఫ్లెక్సీలు పెట్టి అవగాహన కల్పించారు.
రూ.16.49 కోట్ల ఆదాయం..
ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంతోపాటు తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కార్యాలయాలకు వెళ్లి కొందరు, ఆన్లైన్ ద్వారా మరికొందరు ఫీజులు చెల్లించారు. ఇలా మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ.11.60కోట్లు, తొర్రూరు రూ.4కోట్లు, డోర్నకల్ రూ. 50లక్షల, మరిపెడ రూ. 99లక్షల ఆదాయం వచ్చింది.
ప్రొసీడింగ్స్లో జాప్యం
మున్సిపల్ అధికారులు మూడు దశల్లో పరిశీలన చేసి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పిన తర్వాతనే భూ క్రమబద్ధీకరణకు ఫీజు తీసుకున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు కలిపి మొత్తం 20,586 మంది డబ్బులు చెల్లించారు. ఇందులో 6,708 మంది రూ.16,49,60,000 చెల్లించారు. ఇందులో 2,571 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ ఇవ్వగా 4,137 మంది మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫీజులు చెల్లించడంతో తమ భూమికి ఎలాంటి ఇబ్బందులు రావని భావించిన యజమానులకు మున్సిపల్ అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు ప్రొసీడింగ్ వెంటనే ఇవ్వాలంటే తమకు ముడుపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం. అదే విధంగా ఎల్ఆర్ఎస్ చలాన్లు చెల్లించిన తర్వాత ఇప్పుడు భూమి విలువలో తేడా పడిందని.. కొత్త లెక్కల ప్రకారం చూస్తే మరిన్ని డబ్బులు చెల్లించాలని చెబుతున్నట్లు యజమానుల అంటున్నారు. ఇప్పటికే డబ్బులు చెల్లించామని ఇప్పుడు మళ్లీ డబ్బులు అంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించిన తమకు ప్రొసీడింగ్లు వెంటనే ఇచ్చేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని ఇళ్ల స్థలాల యజమానులు కోరుతున్నారు.
న్యూస్రీల్
మున్సిపాలిటీల్లోని ఎల్ఆర్ఎస్ వివరాలు
మున్సిపాలిటీ అర్హత పొందిన ఫీజు ప్రొసీడింగ్
దరఖాస్తులు చెల్లించినవి ఇచ్చినవి
మహబూబాబాద్ 12,304 4044 1004
తొర్రూరు 6,181 2015 1267
మరిపెడ 1,228 427 78
డోర్నకల్ 873 222 222
మొత్తం 20,586 6,708 2,571
ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించి ఎదురుచూపులు
ప్రొసీడింగ్స్ కోసం కార్యాలయాల చుట్టూ ఇళ్ల స్థలాల యజమానుల ప్రదక్షిణ
కొర్రీలు పెడుతూ
కాలయాపన చేస్తున్న ఉద్యోగులు
డీసీసీలకు కొత్త సారథులు!?
● బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం
● పునరాలోచనలో పార్టీ అధిష్టానం
● నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే..
త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం
● అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు..
నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు
● ఇటీవలే ఉమ్మడి జిల్లాల
ప్రజాప్రతినిధులతో సమావేశం
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాల ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు.
పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్..
మహిళలకు ప్రాధాన్యం
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పరిశీలనలో ఉన్న డీసీసీ
ఆశావహుల పేర్లు ఇవే...
వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మే నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీని యర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చందర్రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
డోర్నకల్: నిండుగా మున్నేరు వాగు.. దానికి అనుసంధానంగా సుమారు 12కిలోమీటర్ల పొడవుతో కట్టుకాల్వ నిర్మాణం.. సుమారు 2,000 ఎకరాల ఆయకట్టు పారుతోంది. డోర్నకల్, అమ్మపాలెం తహసీల్దార్ బంజర, పాపటపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు వందల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. అయితే పిచ్చి మొక్కలు, చెట్లు మొలిచి కట్టుకాల్వ చివరి ఆయకట్టుకు సాగు నీరందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆరు కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు..
కట్టుకాల్వలో కొంతకాలం క్రితం సుమారు 6 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టారు. మున్నేరువాగుకు డోర్నకల్ వైపు కట్టుకాల్వకు నీటిని విడుదల చేసేందుకు రెండు షట్టర్లు ఏర్పాటు చేసి వాగు నిండుగా ఉన్న సమయంలో షట్టర్లు తెరిచి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు. వానాకాలంలో సుమా రు రెండు వేల ఎకరాల్లో రైతులు ప్రధాన పంటగా వరితో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకు చేరని నీరు..
పలు కారణాల వల్ల కట్టుకాల్వ చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండి రైతులు నష్టపోతున్నారు. మున్నేరువాగు వద్ద రెండు షట్టర్లు ఉండగా ఒక షట్టర్ డోర్తో పాటు పైభాగంలో డోర్ తెరిచే పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో ప్రస్తుతం ఒకే షట్టర్ను తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. కాల్వలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి. కిలోమీటర్ల మేర చెట్లు, గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. మున్నేరువాగు నుంచి సుమారు కిలోమీటరు దూరంలో కాల్వ నీటి ప్రవాహం కోసం చిన్నపాటి టన్నెల్ నిర్మాణం చేశారు. సక్రమంగా నిర్మాణం చేపట్టకపోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాల్వ నిండి నీరు రోడ్డు మీదుగా తిరిగి మున్నేరువాగులోకి ప్రవహిస్తోంది. అలాగే కాల్వకు అక్కడక్కడా గండ్లు పడడంతో నీరు వృథాగా పోతోంది.
ఆ గ్రామాలకు అందని నీరు..
చివరి ఆయకట్టు గ్రామాలైన తమసీల్దారు బంజర, సీతారాంపురం తదితర గ్రామాల రైతుల భూములకు నీరందడం లేదు. ప్రస్తుతం కట్టుకాల్వ ప్రారంభంలో నిండుగా ప్రవహిస్తుండగా తహసీల్దారు బంజర సమీపంలో కాల్వలో చుక్క నీరు కనిపించదు. కట్టుకాల్వ నీటిని నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న ఆయకట్టు చివరి రైతుల పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. ఏటా వానాకాలం ముందు కట్టుకాల్వలో చెట్లు తొలగించి శుభ్రం చేయాలని, పూర్తిస్థాయి కాల్వకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాల్వ పూర్తిస్థాయి మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.
మరమ్మతులు చేపట్టాలి
మున్నేరువాగు నుంచి 12 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కట్టుకాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. చాలా చోట్ల చెట్లు, పిచ్చి మొక్కలు పెరగడంతో కాల్వకు గండ్లు పడి చివరి ఆయకట్టుకు సాగు నీరందడం లేదు.
–వేల్పుల వెంకన్న, రైతు, తహసీల్దారు బంజర
చెట్లు, పిచ్చిమొక్కలతో
పూడుకుపోయిన కట్టుకాల్వ
మున్నేరువాగు వద్ద
తెరుచుకున్న ఒకే షట్టర్
చివరి ఆయకట్టు రైతుల ఆందోళన
కొత్తగూడ: హక్కుల సాధనకు ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగబోయిన రవి సూచించారు. మండల కేంద్రంలో జరిగిన ఆదివాసీ సంఘాల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓవైపు అక్రమ వలసలు, మరో వైపు ప్రభుత్వాల అలసత్వంతో ఆదివాసీలు తమ అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని, అన్ని సంఘాలు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మన ఐక్యతకు ఈనెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సం వేదిక కావాలని అన్నారు. అందుకు అందరూ కలిసి వచ్చి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలన్నారు. పలు ఆదివాసీ సంఘాల నాయకులు సందీప్దొర, సతీష్, వెంకన్న, నాగేశ్వర్రావు, లక్ష్మీనారానయణ, ప్రశాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు సిద్దబోయిన బిక్షం, సుంచ సారయ్య, కల్తి ఎల్లయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యలో అంతరాలు
తొలగించాలి
కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కె. వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బాధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్గౌడ్, విజయకుమార్, వీరస్వామి, రాజిరెడ్డి, పెండెం రాజు, రవీందర్రాజు, శ్రీధర్రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : సీపీ సన్ప్రీత్సింగ్
వరంగల్ క్రైం: రిటైర్డ్ పోలీసులు, ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ఏఎస్సై వీవీఎల్ఎన్ మూర్తి, హెడ్కానిస్టేబుల్ జె.కేశవ్, కానిస్టేబుల్ ఎం.ఎల్లయ్య, నాలుగో తరగతి ఉద్యోగి కె.యాదయ్యను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రిటైర్డ్ అధికారుల సేవలు నేటితరం పోలీసులకు అదర్శమని, ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని పేర్కొన్నారు. అదనపు డీసీపీ, శ్రీనివాస్, ఆర్ఐలు నాగయ్య, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నేడు కన్నెపల్లి పంపు హౌస్ సందర్శన
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపు హౌస్ను నేడు (సోమవారం) బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, రసమయి బాలకిషన్, వోడితల సతీష్బాబు, సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రానున్నారు.
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ద్వారా అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. కాగా జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రైవేట్కు దీటుగా ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపడుతున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది.
కళాశాల అభివృద్ధి..
జిల్లాలోని తొర్రూరు, కేసముద్రం, మరిపెడ, గార్ల, మానుకోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో 1983లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ గ్రూపులతో ప్రారంభమైంది. ప్రస్తుతం కళాశాలలో 575 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కళాశాల అభివృద్ధిపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అత్యాధునిక టెక్నాలజీతో కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లిష్ లెర్నింగ్ ల్యాబ్, సైన్స్, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తరగతి గదుల్లో సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతులు, స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే కళాశాలలో మంచి వాతావరణం, ఆహ్లాదాన్ని అందించేందుకు మొక్కలు నాటిసంరక్షించే బాధ్యతలు చేపడుతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక చొరవతో ఇంగ్లిష్లో బోధన జరుగుతోంది. దీంతో గత సంవత్సరం నుంచి విద్యార్థుల అడ్మిషన్లు భారీగా పెరిగాయి. అంతేకాకుండా క్రీడలు, పీజీ సెట్ ర్యాంకుల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరస్తున్నారు.
కళాశాలలోని కోర్సులు..
బీఏ (హెచ్ఈపీ), బీకాం కంప్యూటర్స్, జనరల్, బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీఏ (హెచ్పీసీఏ), బీఎస్సీ (బైపీసీ), బీఎస్సీ (బీజెడ్సీ) కోర్సులు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగుతోంది. కాగా, న్యాక్లో 2.98 పాయింట్లతో జాతీయ స్థాయిలో మానుకోట డిగ్రీ కళాశాల బి–ప్లస్ప్లస్ గ్రేడ్ గుర్తింపు పొందింది. కళాశాల నుంచి చాలా మంది విద్యార్థులు పలు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలతో విద్య
మానుకోట డిగ్రీ కళాశాలలో అన్ని కోర్సులను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశంలోని పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో సీట్లు సాధించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక వరంలాంటిది. బాలికలకు ప్రత్యేకంగా బీసీ బాలికల హాస్టల్ డిగ్రీ కళాశాల ఆవరణలోనే కలెక్టర్ చొరవతో ఏర్పాటు చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలి.
– లక్ష్మణ్నాయక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
అధ్యాపకుల ప్రోత్సాహంతోనే
ర్యాంకు సాధించా..
ప్రతీ సబ్జెక్టులో సందేహాలు ఉంటే వెంటనే అధ్యాపకులు నివృత్తి చేసేవారు. ఎప్పటి సిలబస్ అప్పుడే పూర్తి చేసేది. కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో నేను బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)లో 28వ ర్యాంకు సాధించాను.
–యాప శిరీష, కళాశాల విద్యార్థిని
డిగ్రీ కళాశాలల్లో
దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ
జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో
ఇంగ్లిష్ మీడియంలో బోధన
అత్యాధునిక టెక్నాలజీతో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాది గా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామి వారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకన్నారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల స్తోమత మేరకు నిత్య అన్నదాన కార్యక్రమ నిర్వహణకు విరాళాలను అందజేశారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో స్వాగతించారు. ఆమె ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
Karnataka
బనశంకరి: ఎన్నో ఆశలతో గర్భం దాలిస్తే, పుట్టింది మృతశిశువు అని తెలిసిన తల్లి గుండె మంట, కడుపు కోతకు పరిహారం ఏమిటి? రాష్ట్రంలో నిర్జీవ శిశువుల జననం అధికమవుతోంది. ఆధునిక వైద్యరంగం ఎంతో ప్రగతి సాధించినప్పటికీ శిశువుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. గర్భంలో, లేదా కాన్పు సమయంలో శిశువు కన్నుమూయడం (స్టిల్ బర్త్) సమస్య అనేక జిల్లాల్లో పెద్ద సమస్యగా ఉంది. 12 జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. విచిత్రం ఏమిటంటే.. గ్రామీణ ప్రదేశాల కంటే నగరాలు, పట్టణాల్లో మృత శిశువుల జననం ఎక్కువగా ఉండడం.
వెయ్యి మందిలో 3.41 కేసులు..
రాష్ట్రంలో జన్మిస్తున్న ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 3.41 శాతం మంది నిర్జీవులు. కొన్ని జిల్లాల్లో ఇది 9.30 శాతం ఉండడంతో ఆరోగ్యశాఖ కు సవాల్గా మారింది. 2024 ప్రభుత్వ గణాంకాల హవేరి జిల్లాలో అధిక కేసులు నమోదు కాగా తదుపరి స్థానాల్లో ధారవాడ, చామరాజనగర, గదగ, మైసూరు, బళ్లారి జిల్లాలు ఉన్నాయి.
ఆ జిల్లాల్లో పెరుగుదల
తల్లీ బిడ్డల మరణాలు పెరగడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వైద్యసేవల ప్రామాణికతకు దీనిని మైలురాయిగా తీసుకుంటారు. 2020లో మంచి ర్యాంకులో ఉన్న మైసూరు, చిక్కమగళూరు, బెంగళూరు గ్రామాంతర, బళ్లారి, దావణగెరె జిల్లాల్లో 2–3 ఏళ్ల నుంచి నిర్జీవ శిశువులు జనన రేటు పెరగడం గమనార్హం. 2020లో 9,88,143 జననాల్లో 3,326 మంది నిర్జీవ శిశువులు ఉన్నారు. ఇందులో 221 మంది (2.11 శాతం) గ్రామీణ, 3,105 (5.24 శాతం) నగర ప్రదేశాల్లో ఉన్నారు.
ఈ జిల్లాలు మేలు
స్టిల్ బర్త్ నియంత్రణలో హాసన్, కొడగు, యాదగిరి జిల్లాలు ఆదర్శంగా ఉన్నాయి. 2023లో యాదగిరి జిల్లాలో ఒక్క మృత శిశు జననం కూడా నమోదు కాలేదు. గత రెండేళ్లలో నిర్జీవ జనన రేటు 1.5 శాతానికి దాటలేదు. బెంగళూరు నగరం, కొప్పళ, రామనగర జిల్లాల్లో 2 శాతం, మండ్య, బెళగావి, రాయచూరు, బీదర్, కలబుర్గి, కోలారు, తుమకూరు జిల్లాల్లో 3 శాతంలోగా ఉంది.
నివేదిక రావాలి: మంత్రి
నిర్జీవ శిశు మరణాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. హావేరి, గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఎందుకు శిశు మరణాలు పెరుగుతుయో అధికారులు నివేదిక వచ్చాక నివారణ చర్యలను చేపతామని చెప్పారు.
ఇందుకు కారణాలపై వైద్యశాఖ పరిశీలన చేస్తోంది. ప్రసూతి సమయంలో తలెత్తిన శ్వాసకోశ ఇబ్బంది, గర్భిణిలు జాగ్రత్తలు పాటించకపోవడం, అసురక్షిత పరిస్థితుల్లో ప్రసవం, గర్భస్రావం, కాన్పు సమయాల్లో తీవ్ర జ్వరం వంటి అనారోగ్యాలు తదితర కారణాలు వెలుగుచూశాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తల్లికి మధుమేహం, బీపీ, థైరాయిడ్, అధిక బరువు, వరుసగా గర్భధారణలు, గతంలో ప్రసూతిలో నిర్జీవ శిశువు జననం, అవధికి ముందుగా జననం, తల్లికి ధూమ, మద్యపానం అలవాట్లు, మేనరికాలు, కొన్ని రకాల ఔషధాలను వాడడం వల్ల సమస్య వస్తోందని ప్రసూతి నిపుణురాలు డాక్టర్ ఉమా సుల్తానపురి తెలిపారు.
రాష్ట్రంలో 12 జిల్లాల్లో అధికం
పల్లెల కంటే పట్టణాల్లో తీవ్రం
మైసూరు: జాతీయ జంతువు పులి, వర్సెస్ అటవీ గ్రామాల ప్రజలుగా పరిస్థితి తయారైంది. పులి నిబంధనల పేరుతో తమ దైనందిన జీవితాలను కట్టుదిట్టం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. చామరాజనగర జిల్లాలో మలేమహదేశ్వర బెట్ట పరిధిలోకి వచ్చే అటవీ ప్రాంతంలో విషం పెట్టడం వల్ల ఐదు పులులు మరణించిన ఘటన కొన్ని గ్రామాలకు ఇబ్బందులను కలిగిస్తోంది. జనం అడవిలోకి అనవసరంగా ప్రవేశించకుండా అటవీశాఖ నిర్బంధం విధించారు. ముఖ్యంగా గ్రామాల్లో అనారోగ్యాలతో , తదితర కారణాల వల్ల మరణించిన వారి అంత్యక్రియలకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. నంజనగూడు తాలూకా మహదేవనగర గ్రామం ప్రజలకు ప్రస్తుతం ఈ సమస్య ఎక్కువగా ఉంది. చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ అని తలబాదుకోవాల్సి వస్తోందంటున్నారు.
అడవిలోకి రావద్దు
బండీపుర జాతీయ ఉద్యానవనం అడవిని ఆనుకుని ఉండే మహదేవనగరలో ఎవరు మరణించినా అటవీ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించే వారు. తాజాగా పులుల మరణం కారణంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశం నిర్బంధించడంతో వీరికి ఇబ్బంది ఏర్పడింది. మృతదేహాల అంత్యక్రియలకు అడవిలోకి వెళ్లనివ్వడం లేదని వాపోయారు. తమ వారి అంత్యక్రియలకు స్థలం కేటాయించాలని రెవెన్యూ, అటవీ అధికారులను కోరుతున్నారు.
నానా యాతన
తాజాగా గ్రామంలో ఒక మరణం జరిగింది. మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థలం లేదు. తాలూకా పాలన అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చివరకు ఇంటి ముందే గొయ్యి తవ్వి శవాన్ని పూడ్చాలని తొలుత భావించినా, ఆ తర్వాత మహదేవనగర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోసవీడు గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. పొరుగు గ్రామాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. పులుల మరణాలను సాకుగా చూపి తమ జీవితాలను కట్టడి చేయవద్దని, తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
చామరాజనగర జిల్లా అడవుల్లో పులులు
ఇటీవల 5 పులులు మృతి..
అడవిలోకి పల్లెవాసులు వెళ్లకుండా కట్టడి
అంత్యక్రియలకు నానా అవస్థలు
శ్మశానికి స్థలం ఇవ్వాలని మొర
మైసూరు: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా మహోత్సవాల కోసం సన్నాహాలు ఊపందుకున్నాయి. దసరా ఉత్సవాలలో ప్రధాన పాత్ర పోషించేవి గజరాజులే. ఆ ఏనుగుల మొదటి బృందం సోమవారం కదలిరానుంది. 9 ఏనుగులు వస్తున్నట్లు సమాచారం. హుణసూరు తాలూకా వీరనహోసహళ్లిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది.
భారీ స్వాగతోత్సవం
వీరనహోసహళ్లికి సోమవారం మధ్యాహ్నం 12:34 నుంచి 12:59 శుభలగ్నంలో అడవిలోని శిబిరం నుంచి గజబృందం చేరుకోనుంది. వీటికి ప్యాలెస్ పురోహితులు వేద మంత్రాల తో స్వాగతిస్తారు. జిల్లా మంత్రి హెచ్సీ మహదేవప్ప పుష్పార్చన చేసి గజపయనాన్ని ప్రారంభిస్తారు. పూజల తర్వాత కార్యక్రమంలో హాసన్, సకలేశపుర, కొడగు తదితర ప్రాంతాల్లో రౌడీ ఏనుగులు, వన్యజీవులను పట్టుకోవడంలో నిపుణుడైన భీమా ఏనుగు మావటీ గుండ, అలాగే కాపలాదారు నంజుండస్వామికి అవార్డులను అందజేస్తారు. మావటీలు, కాపలాదారులకు కిట్లను ఇస్తారు. తొలి దశలో 9 ఏనుగులు మైసూరు ప్యాలెస్కు వస్తున్నాయి. డీసీఎఫ్ ప్రభుగౌడ మాట్లాడుతూ దసరా మహోత్సవంలో పాల్గొనే అన్ని ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
నేడే ఆర్భాటంగా గజ పయనం
కోలారు: కేఎస్ ఆర్టీసీ లగ్జరీ రాజహంస బస్సుకు స్వల్ప ప్రమాదం జరిగింది. డివైడర్ మీదకు దూసుకెళ్లి నిలిచిపోయింది. తాలూకాలోని చుంచదేనహళ్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి కోలారు మీదుగా కేజీఎఫ్కు వెళుతున్న బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు మధ్యలోని ఖాళీ స్థలంలోకి వెళ్లి నిలిచిపోయింది. బస్సు డ్రైవర్, ప్రయాణికులకు చిన్న గాయాలు అయ్యాయి. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయాలైన వారికి నగరంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
10న ప్రధానిచే మెట్రో
ఎల్లో లైన్కు నాంది
శివాజీనగర: బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ రైలు సేవలను ప్రధాని మోదీ ఈ నెల 10వ తేదీన ప్రారంభిస్తారని తెలిసింది. ఆర్.వీ.రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు మెట్రో ఎల్లో రైలు సంచరిస్తుంది. ఇది సిల్క్బోర్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీని చాలా తగ్గించనుంది. ఈ మార్గం పొడవు 19.15 కి.మీ. ఇప్పటికే మూడు రైళ్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ టిటాగడ్ రైల్ కార్మాగారం నుండి నాలుగో రైలును పంపించారు. 10వ తేదీలోగా బెంగళూరుకు చేరుకొంటుంది. ప్రధాని మోదీ ఈ మార్గానికి రిబ్బన్ కట్ చేస్తారని కేంద్ర వసతి, నగర వ్యవహారాల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సోషల్ మీడియాలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
6 నుంచి వర్షసూచన
యశవంతపుర: రాష్ట్రంలో కొన్నిరోజులుగా వానలు తగ్గాయి, రైతులు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు మళ్లీ భారీగా వానలు పడే అవకాశం ఉందని బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. బెంగళూరు, రూరల్, చిక్కబళ్లాపుర, హాసన్, కొడగు, కోలారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఇంకా అనేక జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. ఆదివారం కార్వార, చిక్కమగళూరు జిల్లాల్లో వానలు పడ్డాయి. బెంగళూరు చుట్టుపక్కల మేఘావృతమై ఉంది.
నీటి ట్యాంకులో విషం.. ముగ్గురు అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా సవదత్తి తాలూకా హూలికట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సమీపంలోని నీటి ట్యాంక్లో పురుగుల మందును కలిపిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రెండువారాల కిందట ఆ నీటిని తాగి పలువురు విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. పాఠశాల హెచ్ఎంను బదిలీ చేయించాలనే దురుద్దేశంతో శ్రీరామసేన తాలూకా నాయకుడు సాగర్ పాటిల్, మరో ఇద్దరు ఈ పన్నాగం పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్టు చేయడం గమనార్హం. మతోన్మాదంతో కొందరు చిన్న పిల్లల ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వాటర్ ట్యాంక్లో విషం కలపడం కలవరపెడుతోందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టేవారిపై నిఘా పెట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
కోలారు: హత్య, దోపిడీతో పాటు వివిధ ప్రాంతాలలో సుమారు 14 అపరాధ కేసులలో నిందితునిగా ఉండి పరారీలో ఉన్న మాఫియా నేరగాడు కవిరాజ్ అలియాజ్ రాజ్ను కోలారు సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ (సెన్) పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఉత్తరాఖండ్ లోని నేపాల్ సరిహద్దు ప్రాంతానికి చెందిన వాడు. తల్లిదండ్రులతో కలిసి బెంగుళూరుకు నివాసం మార్చాడు. అండర్వరల్డ్ డాన్లు అయిన రవి పూజారి, ముత్తప్ప రై సహచరునిగా ఉండేవాడని తెలిసింది.
చాలా కేసుల్లో నిందితుడు
కవిరాజ్ 2020లో జరిగిన మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కిడ్నాప్ కేసుతో పాటు దేశవ్యాప్తంగా 14కు పైగా వివిధ కేసులలో కోర్టు విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్నాడు. బెంగళూరులో కామాక్షిపాళ్య, తిలక్నగర్, కెంగేరి, ఆడుగోడి లలో సర్జాపుర, కాడుగోడి, ఇందిరానగర, బయ్యప్పనహళ్లి , తళి, కోలారు రూరల్ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై కేసులు ఉన్నాయి. ఎస్పీ నిఖిల్ నేతృత్వంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్లు కనుగొన్నారు. జూలై 31వ తేదీన అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆచూకీ తెలియరాదని కవిరాజ్ మొబైల్ఫోన్ను ఉపయోగించే వాడు కాదు.
నోయిడాలో పట్టుకున్న కోలారు పోలీసులు
శివాజీనగర: ధర్మస్థలలో వందలాది మంది మృతదేహాల కోసం గాలింపులో పెద్ద మలుపులేవీ కానరాలేదు. 6వ పాయింట్లో లభించిన అస్థిపంజరం 40–50 సంవత్సరాల పాతబడినదని సమాచారం. ధర్మస్థల నేత్రావతి ఒడ్డులో 13 పాయింట్లలో గాలింపు జరుగుతోంది. ఇప్పటివరకు 6వ పాయింట్ మాత్రం ఓ అస్థిపంజరం లభించింది. అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. 40 సంవత్సరాల క్రితం శవం పూడ్చిపెట్టి ఉంటారని నిపుణులు చెప్పినట్లు తెలిసింది. ఇది పురుషుని అస్థిపంజరం. మరో వారంలో దీనిపై అఽధికారిక సమాచారం వెల్లడి కానున్నది. కాగా, సిట్ సిబ్బంది, పోలీసులు, కూలీలు విశ్రాంతి కోసం ఆదివారం తవ్వకాలకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటివరకు 10 పాయింట్లలో తవ్విచూశారు. 6వ పాయింట్లో మినహాయిస్తే మిగతాచోట్ల పెద్దగా ఏమీ దొరకలేదు. సోమవారం 11, 12, 13 పాయింట్లలో తవ్వుతారు. అన్ని పాయింట్ల వద్ద సాయుధ పోలీసు భద్రత ఏర్పాటైంది. సోమవారం ఏమైనా జరగవచ్చా అని కుతూహలం నెలకొంది. 13 పాయింట్ల తవ్వకాలు పూర్తయిన తరువాత సిట్ తదుపరి కార్యాచరణపై యోచించనుంది.
అందరి చూపు వాటి మీదే
హొసపేటె: రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కిత్తూరు తాలూకాలోని హనుమానహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు రంగప్ప తలవార్ (34) ఆదివారం ఉదయం పొలంలో పనులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. అతన్ని తోలహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కొట్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
జిల్లాస్పత్రిలో అన్నీ అక్రమాలే
కోలారు: నగరంలోని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రిలో దళారుల బెడద అధికంగా ఉంది, వారికి అడ్డుకట్ట వేయాలని, అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న అంబులెన్స్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం రైతు సంఘం నాయకులు ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న పేద రోగులకు ఆస్పత్రిలో కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇస్తున్నారని ఆరోపించారు. సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్లను గంటలో చేసిస్తామని పలువురు దళారులు రోగుల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
రాయచూరు రూరల్: బడాబాబులు నివాసం ఉంటున్న కాలనీల్లో సిమెంటు రోడ్లు, మంచినీరు తదితర సదుపాయాలు ఉంటాయి. అదే పేదలు, కార్మికులు నివాసం ఉంటున్న కాలనీల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అధికారులు ఆ కాలనీల వైపు కన్నెత్తి చూడరు. ఇలాంటి పరిస్థితే నగరంలో కనిపిస్తుంది. ఇక్కడి ఏపీఎంసీ హమాలీ కాలనీలో సమస్యలు తిష్టవేశాయి. 2011లో ముఖ్య మంత్రి ఎస్ఎం కృష్ణ హయాంలో ఏపీఎంసీ హమాలీల, కార్మికులకు కాలనీ నిర్మించారు. వారికి పక్కా గృహాలు కల్పించి ఇంటి హక్కు పత్రాలందించారు. అయితే నగర సభలో రిజిస్ట్రేషన్ చేయలేదు. కాలనీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో నీరు చేరడంతో గుంతలు కనిపించక వాహనదారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. ఇక మురుగు కాలువలు పూడికతో నిండిపోయి వాటి స్వరూపానే కోల్పోయాయి. దీంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరుతోంది. కాలనీవాసులు దుర్వాసన మధ్య జీవనం చేయాల్సి వస్తోంది. కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు దుస్థితికి చేరాయి. భవనాల కప్పులు పెచ్చులూడుతున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళన మధ్య పాఠాలు వింటున్నారు. కాలనీలో ఇన్ని సమస్యలున్నా పాలకులు, అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని పేదలు కోరుతున్నారు.
అధ్వానంగా రహదారులు
పూడిక నిండిన మురుగు కాలువలు
దుస్థితిలో పాఠశాల, అంగన్వాడీ భవనాలు
సమస్యల మధ్య సహజీవనం చేస్తున్న పేదలు
రాయచూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని రూరల్ ఎమ్మెల్యే బసవన గౌడ సూచించారు. తాలూకాలోని మన్సలాపూర్లో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, చిక్కసూగురులో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన భూమి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడుతామన్నారు.
ఎలుగుబంటి, అడవి పంది దాడిలో పంటలు ధ్వంసం
హొసపేటె: ఎలుగుబంటి, పందుల దాడిలో పంటలు ధ్వంసమయ్యాయి. ఈఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కనమడుగు గ్రామంలో జరిగింది. రాత్రి సమయంలో ఎలుగుబంట్లు, పందులు మొక్కజొన్న పంటలోకి చొరబడి మొక్కజొన్నను తినడమే కాకుండా వాటిని తొక్కి విరిచి నాశనం చేశాయి. గ్రామం పొరుగున ఉన్న దావణగెరె జిల్లాలోని జగలూరు తాలూకాలోని అనబురు అటవీ ప్రాంతంలో నుంచి నిత్యం వన్యజీవులు పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు, పందుల బెడదనుంచి పంటలను కాపాడాలని, ధ్వంసమైన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కామయ్యవర బొమ్మప్ప, తిప్పేస్వామి, మంజమ్మ, తిండమ్మ, నాగరాజు, దుగ్గప్ప కోరారు.
కళాశాల విద్యార్థిపై క్రికెట్ బ్యాట్లతో దాడి
సాక్షి,బళ్లారి: ఓ కాలేజీ విద్యార్థిపై సినిమా రీతిలో 10 మంది కాలేజీ గ్యాంగ్ దాడి చేయడం నగరంలో కలకలం సృష్టించింది. నగరంలోని రెడియో పార్క్లో ఉన్న ఐటీఐ కాలేజీ మైదానంలో జరిగిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చి దాడి దృశ్యాలు సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ బాలిక ఫొటో వ్యాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడని కాలేజీ విద్యార్థి దొడ్డబసవ (19)పై శశికుమార్, సాయికుమార్ తదితరులు 10 మంది దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కాళ్లు పట్టుకున్నా వదలకుండా దాడి చేశారు. తల, నడుము భాగంలో క్రికెట్ బ్యాట్తో దాడి చేశారు. బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌల్బజార్ పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దాడి చేసిన వారు కూడా కాలేజీ విద్యార్థులే అని తెలిసింది. తీవ్రంగా గాయపడిన దొడ్డబసవ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లారు.
నేహా హత్యకేసు నిందితుడి బెయిల్పై నేడు విచారణ
హుబ్లీ: నగరంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహ హిరేమఠ హత్య కేసును నిందితుడి బెయిల్ పిటిషన్ అదనపు జిల్లా సెషన్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో నేహ తండ్రి, కార్పొరేటర్ నిరంజనయ్య హిరేమఠ కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి నివాసానికి ఆదివారం వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం నిరంజనయ్య మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె హత్య విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు తన కుమార్తె విషయంలో పోరాటం చేశాయన్నారు. నిందితుడు ఫయాజ్కు బెయిల్ లభిస్తే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. నటుడు దర్శన్కు ఇచ్చినట్లుగానే బెయిల్ ఇవ్వాలని నిందితుడి తరపున న్యాయవాది వాదిస్తున్నారన్నారు. 2024 ఏప్రిల్ 18న హుబ్లీ బీవీబీ కళాశాల ఆవరణలో 24 ఏళ్ల ఎంసీఏ విద్యార్థి నేహ హిరేమఠ దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే 10కి పైగా కత్తిపోట్లతో విద్యార్థిని బలైంది. ఈ కేసులో నిందితుడు బెళగావి జిల్లాకు చెందిన ఫయాజ్ కొండ నాయక్(24) అరెస్ట్ అయ్యాడు.
ఆకట్టుకున్న స్టీల్ సిటీరన్
సాక్షి,బళ్లారి: దైనంది జీవితంలో ప్రతి ఒక్కరు యోగా, వాకింగ్, రన్నింగ్ తదితర ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. బళ్లారి సైక్లిస్ట్, రన్నర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బళ్లారిలో ఆదివారం స్టీల్ సిటీ రన్ నిర్వహించారు. స్థానికులతోపాటు వివిధ రాష్ట్రాల యువతీ యువకులు పాల్గొన్నారు. విజిడం ల్యాడ్ స్కూల్ నుంచి యువతీ యువకులు పరుగును ప్రారంభించారు. 10 కిలో మీటర్లు, అనంతరం 5 కిలో మీటర్లు, అనంతరం 3 కిలో మీటర్లు రన్నింగ్ రస్ నిర్వహించారు. జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డాక్టర్లు.బీకే.సుందర్, సోమనాథ, తదితరులు పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉడమ్ గల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండెప్ప బిరదార్ పిలుపునిచ్చారు. ఆ పాఠశాలో శనివారం ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ అధిక జనాభాతో అనర్థాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రజలందరికీ సదుపాయాలు కల్పించడ కష్టసాధ్యమవుతుందన్నారు. పరిమిత కుటుంబంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.
చెస్ పోటీల్లో విజయపుర, రాయచూరు గెలుపు
రాయచూరు రూరల్ : రాజీవ్ గాంధీ అరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో నవోదయ కళాశాల క్రీడాంగణంలో నిర్వహిస్తున్న కలబుర్గి డివిజన్ స్థాయి చెస్ పోటీల్లో విజయపుర, రాయచూరు జిల్లాలు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ఆదివారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో నవోదయ కళాశాల రిజిస్ట్రార్ శ్రీనివాస్ హాజరై విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. చెస్ క్రీడలు మేథస్సును పెంపొందిస్తాయన్నారు. గురుచార్, దొడ్డయ్య, సుధా కుమారి, గిరస్ కట్టి, కౌశిక్ రెడ్డి, చంద్రకాంత్, సావిత్రి, నేతానియల్ పాల్గొన్నారు.
కారు బోల్తా .. ఒకరి మృతి
రాయచూరు రూరల్: కారు బోల్తా పడి ఒకరు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈఘటన రాయచూరు తాలుకా మన్సలాపూర్ వద్ద జరిగింది. కొందరు ఉడుపి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా మన్సలాపూర్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఉడుపి జిల్లా కుందాపూర్ తాలూకా కోట్రేశ్వర హజీర(65) అనే మహిళ మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. రూరల్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను, హజీరా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
విద్యా సంస్థల్లో మానసిక వైద్యులను నియమించాలి
రాయచూరురూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలల్లో మానసిక వైద్యులను నియమించాలని సామాజిక కార్యకర్త సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు అదివారం ప్రభుత్వానికి పోస్టు ద్వారా కార్డులు పంపారు. అనంతరం ఆయన మాట్డాడుతూ విద్యార్థులు నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అలాంటివారికి విద్యా సంస్థల్లోనే కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారిని సరైన మార్గంలో నడిపించవచ్చన్నారు. ఇందు కోసం బియస్డబ్ల్యూ, యంయస్డబ్ల్యూ కోర్సులు చేసిన వారిని విద్యాసంస్థల్లో నియమించాలన్నారు.
డిమాండ్ల సాధనకు
5 నుంచి సమ్మె
రాయచూరు రూరల్: కేఎస్ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు ముద్దుకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని పాత్రికేయల భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో ఆయన మాట్లాడారు. 38 నెలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో ఈనెల 5 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు.
వర్క్ ఫ్రం హోం అంటూ వంచన
హుబ్లీ: ఇంటి వద్దనుంచే పని అంటూ సైబర్ వంచకులు ఓ వ్యక్తి నుంచి రూ. 5లక్షలు దోచుకున్నారు. ఈఘటన హుబ్లీలో చోటు చేసుకుంది. రక్షిత అనే మహిళకు వంచకులు వ్యాట్సాప్ ద్వారా పరిచయం చేసుకున్నారు. ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించవచ్చని మభ్య పెట్టారు. ఆమె స్నేహితురాలు డీ సోహెప్ప ఖాతా నుంచి రూ.5.99 లక్షలు తమ ఖాతాకు జమ చేయించుకున్నారు. అనంతరం ఎలాంటి ఉద్యోగమూ ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాయచూరు రూరల్ : అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ముక్కుపచ్చలారని చిన్నారులు గంటలకొద్దీ బందీలుగా మారారు. ఆహారం, నీళ్లు లేకుండా ఆకలి దప్పులతో గడిపారు. అంగన్వాడీ సహయకురాలు పిల్లలను గదిలో ఉంచి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. దీంతో పిల్లలు గంటలకొద్దీ గదిలోనే బందీగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈఘటన యాదగరి జిల్లా గురుమిటకల్ తాలూకాలో జరిగింది. బందూర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రం కార్యకర్త నెలవారీ సమావేశం కోసం శనివారం గురుమిటకల్ వెళ్లారు. ఆ సయయంలో సహాయకురాలు సావిత్రి విధుల్లో ఉన్నారు. ఉదయం 9 గంటలకు పిల్లలు కేంద్రానికి వచ్చారు పిల్లల యెగ క్షేమాలు చూసుకోవాల్సిన సావిత్రి వారిని గదిలో ఉంచి తాళం వేసి పొలం పనులకు వెళ్లింది. దీంతో పిల్లలు ఏడుస్తుండగా స్థానికులు గమనించి కార్యకర్తకు సమాచారం ఇచ్చారు. ఆమె 12గంటలకు కేంద్రానికి చేరుకొని పిల్లలను గది నుంచి బయటకు తీసుకువచ్చారు. సహాయకురాలు తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో నమ్మకంతో పిల్లలను కేంద్రానికి పంపితే వారిని గదుల్లో బంధించి వేరే పనులకు వెళ్తారా అని మండిపడ్డారు.
పిల్లలను గదిలో ఉంచి పొలానికి వెళ్లిన అంగన్వాడీ సహాయకురాలు
గంటలపాటు అన్నం నీళ్లు లేకుండా గడిపిన చిన్నారులు
బళ్లారిఅర్బన్: విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని 60, 70 ఏళ్ల క్రితం కూడా బళ్లారి రాఘవ తన అద్భుతమైన వాగ్దాటితో కళావాచ్చస్పతిగా ఖండాంతర ఖ్యాతిని గడించారని తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలిదండ నిత్యానందరావ్ అన్నారు. బళ్లారి రాఘవ జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం స్థానిక రాఘవ కళా మందిరంలో రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమం, నాటకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగు, కన్నడ, ముఖ్యంగా ఇంగ్లిష్ నాటకాలలో బళ్లారి రాఘవ తనదైన శైలిలో ప్రతిభ చాటి విదేశాలలో కూడా తన అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకుల మనసు చూరగొన్నారన్నారు. బళ్లారి గడ్డపై పుట్టి విదేశాలలో కూడా తన అద్భుతమైన అభినయంతో సరికొత్త చరిత్ర సృష్టించారని, నాటక రంగానికి రాఘవ చేసిన సేవలు అనన్యమని కొనియాడారు. నాటక రంగానికి ఆయన వన్నెలు అద్దిన మహానటుడని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మేడూరు గ్రామానికి గుమ్మడి గోపాలకృష్ణకు బళ్లారి రాఘవ రాష్ట్ర ప్రశస్తిని అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన బళ్లారి రాఘవ సేవలను కొనియాడి ఆయన స్వరంతో పద్యాలను కూడా ఆలపించారు. బళ్లారి రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు కే.చెన్నప్ప, పదాధికారులు రమేష్ గౌడ పాటిల్, విష్ణువర్ధన్రెడ్డి, ఎన్.ప్రకాష్, ధనుంజయ, రామాంజినేయలు, ప్రముఖులు స్థానిక, ఆంధ్ర కళాభిమానులు పాల్గొన్నారు.
రాయచూరు రూరల్ : రెడ్డి సమాజం ఐక్యమత్యం ప్రదర్శించాలని హేమరెడ్డి మల్లమ్మ వేమానంద హోసల్లి మఠాధిపతి వేమానంద మహా స్వామీజీ పిలుపునిచ్చారు. రాయచూరులోని ప్రైవేటు కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సభలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. కులగణనలో హిందూ రెడ్డిగా రాయించాలన్నారు. సముదాయంలోని ఉప కులాలన్నీ ఏకమై హక్కులను పొందాలన్నారు. సభలో గోపాల్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, అచ్యుత రెడ్డి, శ్రీనివాస రెడ్డి, సుధాకర రెడ్డి, బసన గౌడ, కేశవ రెడ్డి, బుడ్డనగౌడ, రామనగౌడ, విరుపన గౌడ, సత్యనారాయణ, లక్ష్మికాంత రెడ్డి పాల్గొన్నారు.
హొసపేటె: నైరుతి రుతుపవనాలు రాకమునుపే విస్తారంగా వర్షాలు కురిసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన మొత్తంలో యూరియా, ఎరువులను సరఫరా చేయలేక పోయిందని బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు. యూరియా కోసం రైతులు క్యూలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 8.73 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయగా 6.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి చెలువరాయ స్వామి వ్యాఖ్యలు చేశారని, మిగిలిన 2.43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్లో విక్రయించిందా అని ప్రశ్నించారు. బీజేపీ రైతు మోర్ఛా జిల్లా అధ్యక్షుడు హోంబలే రేవన్న మాట్లాడుతూ బీజేపీ హయాంలో రైతుల పిల్లలకుచ్చే రైతు విద్యానిధి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే నానోయూరియాను అందిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని పై అవగాహన కల్పించడం మర్చిపోయిందన్నారు.
Dr B R Ambedkar Konaseema
●
●
● వ్యవసాయం వదులుకునేలా
కూటమి ప్రభుత్వ విధానాలు●
●
● భారీగా పెరిగిన కాంప్లెక్స్
ఎరువుల ధరలు
● జిల్లాలో రైతులపై
రూ.20.08 కోట్ల అదనపు భారం
ఆలమూరు: రైతే రాజన్నారు.. దేశానికే వెన్నెముక అన్నారు.. కానీ ఏమున్నది లాభం. ప్రస్తుతం రైతు పరిస్థితి అత్యంత దారుణం.. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతూ.. కరవు కోరల్లో చిక్కుకుంటూ.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతూ.. కల్తీ పురుగు మందులు, నకిలీ విత్తనాల బారిన పడుతూ.. పంట నష్టాలను చవిచూస్తున్న పుడమి పుత్రులకు ఆకలే మిగులుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక సాగు దండగ అన్నట్టు మార్చేసింది. పంటల సాగు వైపు రైతన్నలు చూడకుండా చేస్తోంది.. అన్నదాత సుఖీభవ పథకాన్ని తొలి ఏడాది అమలు చేయకుండా కష్టపెట్టింది. పంటల బీమా భారం సైతం రైతులపై వేసింది. ఇదిలా ఉంటే వరి సాగులో ఏటా పెట్టుబడి పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో ఎరువుల ధరలు కూడా భారీగా పెరగడం ఇబ్బందికరంగా పరిణమించింది. రాష్ట్రంలో ఎరువుల ధరలు పెరుగుతున్నంత వేగంగా ధాన్యానికి మద్దతు ధర పెరగకపోవడంతో వ్యవసాయం చేయడానికి చాలామంది వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖరీఫ్ సీజన్లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.300 వరకూ పెరిగింది. జిల్లాలో 1.64 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుండగా, పెరిగిన ఎరువుల రూపంలో 1.35 లక్షల మంది రైతులపై రూ.20.08 కోట్ల మేర అదనపు భారం పడనుంది.
సరిపడా రాక.. సమస్య తీరక
నత్రజని (ఎన్), భాస్వరం (పి), పొటాషియం (కె) మిశ్రమంతో కూడిన కాంప్లెక్స్ ఎరువులు పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందిస్తాయి. అలాంటి కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయడం ఏటా రైతులకు భారం అవుతోంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలోని వరి సాగుకు 43,493 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 24,405 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతుంది. ప్రస్తుతం జిల్లాలోని 166 సొసైటీలతో పాటు కొన్ని ఎరువు, పురుగు మందుల దుకాణాల ద్వారా ఎరువుల విక్రయం జరుగుతోంది. వ్యాపారులు, అధికారులు, డీలర్లు కొన్నిచోట్ల కుమ్మకై ్క ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా ఎకరాకు మూడు బస్తాల కాంప్లెక్స్ ఎరువులు, 90 కిలోల (రెండు బస్తాలు) యూరియా, 25 కిలోల వరకూ జింక్, పొటాష్ వినియోగిస్తుంటారు. జిల్లాలో వెదజల్లు విధానంతో పాటు వరి నాట్లు వేస్తున్నాయి. ఇందులో ఈ ఏడాది 80 శాతం మేర స్వర్ణ (ఎంటీయూ 7029) రకం సాగు చేస్తుండగా, మిగిలిన చోట ఎంటీయూ 1318తో పాటు కొన్ని ఇతర రకాలను పండించడానికి రెడీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం భారీగా రాయితీని అందించే యూరియా నిల్వలు జిల్లాకు సరిపడా సరఫరా కాలేదని తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్లో ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
స్పందించని వ్యవసాయ శాఖ
ఎరువుల నిల్వలు, పంపిణీ విధానంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా ఏవిధమైన స్పందన లేకుండా పోయింది. కనీసం నిల్వల వివరాలు కూడా చెప్పకపోవడం విమర్శలకు తావిస్తుంది. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్ల కాంప్లెక్స్ ఎరువులను రోజుకోఽ ధరకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎరువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ముడిసరకుల ధరలు పెరుగుతున్నందు వల్ల కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుందని చెబుతున్నారు.
పినపళ్లలో వరి పొలంలో ఎరువులు చల్లుతున్న రైతు
పినపళ్లలో వరి పొలంలో ఎరువులు జల్లుతున్న రైతు
వరి పొలంలో ఎరువులను
చల్లేందుకు మిశ్రమం సిద్ధం చేస్తున్న రైతు
ఎరువుల పెరుగుదల ఇలా..
50 కిలోల బస్తా (రూపాయల్లో)
రకం 2019 2021 2024 2025
10–26–26 1,175 1,375 1,550 1,850
20–20–0–13 950 1,175 1,200 1,400
14–35–14 1,250 1,450 1,700 1,900
19–19–19 950 1,175 1,350 1,850
పొటాష్ 1,225 1,350 1,535 1,800
డీఏపీ 1,350 1,350 1,350 1,400
28–28–0 1,275 1,400 1,550 1,850
● డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం
● ఇప్పటికీ విడుదల కాని ప్రభుత్వ నోటిఫికేషన్
● ఆందోళన చెందుతున్న విద్యార్థులు
రాయవరం: విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది.. సరైన ప్రణాళిక లేకుండా సాగుతున్న వైనం విద్యార్థులను ఇబ్బంది పాల్జేస్తోంది.. దీనికి ఉదాహరణే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ. ఈ కళాశాలల్లో చేరికలకు ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విద్యా వ్యవస్థను అయోమయంలో పడేస్తోంది. ఇంటర్ ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు దాటినా నేటికీ డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా జూలై మాసానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై తరగతులు సైతం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంత వరకూ ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 12,825 మందికిగాను 9,246 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారున్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
జిల్లాలో 53 కళాశాలలు
జిల్లాలోని మొత్తం 53 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆయా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ వంటి కోర్సులను వివిధ కాంబినేషన్లతో డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది కూడా అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 30 శాతం సీట్లు మిగిలిపోయాయి.
వీడని సందిగ్ధత
డిగ్రీ కోర్సులకు సంబంధించి సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుపై సందిగ్ధత కొనసాగుతోంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుతో నూతన డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. అయితే వీటిపై వస్తున్న సందిగ్ధతతో విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిపై ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కూడా ఆందోళనలో ఉన్నారు.
తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి
ఇంటర్ ఫలితాలు విడుదలై మాసాలు గడుస్తున్నా ప్రవేశాలు చేపట్టకపోవడంపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలలు పునః ప్రారంభమై నెలన్నర దాటింది. ఇంకా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తక్షణమే డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలి.
– బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్యూ
ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి
డిగ్రీ అడ్మిషన్లపై నేటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణం. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గతేడాది ఆలస్యంగా నోటిఫికేషన్ ఇచ్చారనుకుంటే, ఈ ఏడాది మరింత జాప్యం చేశారు. డిగ్రీ అడ్మిషన్లపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రాష్ట్రంలో ప్రవేశాలు చేపట్టకపోవడం సరికాదు.
– మిందిగుదిటి శిరీష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, అమలాపురం
● భక్తులతో కిక్కిరిసిన వెంకన్న క్షేత్రం
● ఒక్క రోజే రూ.6.70 లక్షల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా ఆ జనంలో ప్రదక్షిణలు చేయలేని భక్తులు ఇతర వారాల్లో ఏదో ఒక రోజు నిర్ణయించుకుని ఏడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలి రావడంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, మిగిలిన ఆరు రోజులూ అత్యధికంగా వస్తున్నారు. దానితో ఈ క్షేత్రం శనివారాలే కాకుండా వారంలో మిగిలిన రోజుల్లో కూడా నిత్య కల్యాణం పచ్చతోరణంలా మారుతోంది. ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు ఆదివారం అష్టోత్తర పూజ, స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్క రోజే దేవస్థానానికి రూ.6,70,313 ఆదాయం వచ్చిందని చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశాఖపట్నం కళారాధన నృత్య కళాశాల కళాకారిణుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
నేటి నుంచి పవిత్రోత్సవాలు
వాడపల్లి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ సూర్యచక్రధరరావు తెలిపారు. సోమవారం ఉదయం రుత్విక్కులు దీక్షాధారణ, అకల్మష హోమం నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ప్రతిష్ఠ పూజలు చేయనున్నారు. ఐదో తేదీ ఉదయం అష్ట కలశ స్థాపన, మహా శాంతి హోమం, ఆరో తేదీ ఉదయం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి నిర్వహిస్తారని ఈఓ వివరించారు.
అంబాజీపేట: రైతులు ఐక్యంగా సాగితే ఎందులోనైనా విజయం సాధించవచ్చని ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడు ముత్యాల జమ్మిలు, కోకో ఫెడ్ చైర్మన్ అరిగెల బలరామమూర్తి అన్నారు. స్థానిక సీ్త్రల ఆస్పత్రి సమీపంలోని కొర్లపాటి కోటబాబు వ్యవసాయ క్షేత్రంలో అంబాజీపేట రైతు సంఘం నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జమీలు, బలరామమూర్తి మాట్లాడుతూ కొంతకాలంగా వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుండగా, కొన్ని మోటార్లకు బిల్లులు కట్టించుకునేవారన్నారు. దీనిపై రైతులు విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులకు వివరించినా ప్రయోజనం కలగలేదన్నారు. ఈ మేరకు రైతులు అందరితో కలసి ప్రత్యేక కోర్టులో కేసు వేయించామన్నారు. 16 మంది రైతులకు సుమారు రూ.3.20 లక్షల ప్రయోజనం కలిగేలా కోర్టు తీర్పు వచ్చిందన్నారు. రైతుల పక్షాన పోరాడి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ముత్యాల జమీలు, అరిగెల బలరామూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొర్లపాటి కోటబాబు, మట్టపర్తి పరమేశ్వరరావు, మట్టపర్తి కొండ, దొమ్మేటి వెంకటేశ్వరరావు, సూదాబత్తుల శ్రీను, నిట్టాల విజయసాయి పాల్గొన్నారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని, అలాగే కొత్త ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రజల సౌకర్యార్థం మూడు రెవెన్యూ డివిజన్లు, 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు తమ సమస్యలను తెలపవచ్చన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు
ఇండక్షన్ స్టౌలు
రాయవరం: అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పుడు గ్యాస్ స్టౌల స్థానంలో ఇండక్షన్ స్టౌలు అందజేసేందుకు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 1,726 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో ఆరు నెలల లోపు చిన్నారుల నుంచి ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులు 16 వేల వరకూ ఉన్నారు. చిన్నారులకు ఆట పాటలతో కూడిన విద్యతో పాటు, నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సి ఉంది. చిన్నారులకు ఆహార పదార్థాలను వండి వడ్డించేందుకు వంటలకు ఉపయోగించే గ్యాస్ ఆధారిత పొయ్యిల స్థానంలో విద్యుత్తు సాయంతో నడిచే ఇండక్షన్ స్టౌలు అందజేసే దిశగా చర్యలు చేపట్టారు. సిలిండర్ల బిల్లులు నెలల తరబడి పెండింగ్ ఉండటంతో సిబ్బంది సకాలంలో గ్యాస్ సరఫరా చేయడం లేదు. ఫలితంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 277 ఇండక్షన్ స్టౌలు సరఫరా చేశారు. చిన్నారులకు సులభంగా ఆహారం తయారు చేసేందుకు వీలుగా విద్యుత్ సాయంతో పనిచేసే స్టౌలతో పాటు నాలుగు రకాల కుక్కర్లు, ఇతర పరికరాలను అందజేస్తున్నారు. మూడు ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలకు వీటిని ఇచ్చారు. త్వరలోనే మిగిలిన వాటికి అందజేయనున్నారు. ఇప్పటి వరకూ ఏజెన్సీల నుంచి గానీ, ప్రైవేట్ వ్యక్తులు గానీ కేంద్రాలకు సిలిండర్లను సరఫరా చేసేవారు. వారికి ప్రభుత్వం నేరుగా నగదు జమచేసేది. ఇప్పుడు ఇండక్షన్ స్టౌలతో బిల్లుల ఇబ్బంది తప్పనుంది.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేస్థానంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,05,890, పూజా టికెట్లకు రూ.1,71,160, కేశఖండన శాలకు రూ.18,760, వాహన పూజలకు రూ.9,240, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.77,426, విరాళాలు రూ.58,967, కలిపి మొత్తం రూ.5,41,443 ఆదాయం సమకూరింది.
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠం 53వ వార్షికోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్ఓ వి.వేణుగోపాల్ (బాబీ) తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వార్షికోత్సవ వివరాలు వెల్లడించారు. పీఠాధిపతి గాడ్ 1972 ఆగస్టు 18న మంత్రోపదేశం పొందారన్నారు. 1989 ఆగస్టు 16న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థస్వామి విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేసి, భవానీ శంకర స్ఫటిక బాణాన్ని విజయదుర్గాదేవి సన్నిధిలో ప్రతిష్ఠించారన్నారు. పీఠంలో నిరంతరాయంగా విజయదుర్గా అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వచ్చే నెల 16న పీఠంలో సర్వతోభద్రతా మండప ఆవాహన జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
సీతారామ కల్యాణం
ఈ నెల 16న ఉదయం 8.45 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని బాపిరాజు, బాబీ తెలిపారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం భద్రాచలం వేద పండితులతో సీతారామచంద్రుల కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.15 గంటలకు శ్రీ సాయి సత్సంగ నిలయం, పీఠం మహిళా భక్తులతో శక్తిమాల సహిత మణిద్వీప వర్ణన శ్లోకాల పారాయణ, నవదుర్గల సువాసినీ పూజ నిర్వహిస్తారు. 17న జొన్నవాడ వద్ద ఉన్న శ్రీ కామాక్షితాయి అమ్మవారి ప్రధానార్చకులతో మహానవావరణ హోమం, సాయంత్రం 6 గంటలకు అన్నవరం దేవస్థానం పండితులతో అనంత లక్ష్మీ సత్యవతీదేవి సమేత వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దివ్య కల్యాణం నిర్వహిస్తారన్నారు. 18వ తేదీ ఉదయం టీటీడీ వారితో విజయదుర్గా పీఠం వద్ద నెలకొల్పిన విజయ వెంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం శ్రీ వైఖానస ఆగమ పండితులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక అర్చన, హారతులు, చతుర్వేదస్వస్తి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. వార్షికోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో పీఠం భక్తజన కమిటీ సభ్యులు గాదె భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం టౌన్: ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘానికి అనుబంధంగా జిల్లా సంఘం ఏర్పాటైంది. జిల్లా సంఘ గౌరవాధ్యక్షుడిగా జేఎన్ఎస్ గోపాలకృష్ణ, అధ్యక్షుడిగా మోకా ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా నిమ్మకాయల గణేశ్వరరావు, కోశాధికారిగా రాయుడు ఉదయ భాస్కరరావు ఎన్నికయ్యారు. వీరితోపాటు రాష్ట్ర కౌన్సిలర్లుగా బీవీవీ సుబ్రహ్మణ్యం, పి.శ్రీనివాసు, యు.మాచిరాజు, ఇతర జిల్లా కౌన్సిలర్లుగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.పల్లయ్యశాస్త్రి, హెడ్ క్వార్టర్ సెక్రటరీగా పీఎన్వీ ప్రసాదరావు, మహిళా ప్రతినిధిగా చిట్టినీడి నిరంజని, మున్సిపల్ పాఠశాలల ప్రతినిధిగా కె.ఘన సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులుగా జి.నాగ సత్యనారాయణ, ఎం.వెంకటరాజు, పి.శ్రీరామచంద్రమూర్తి, బి.చిరంజీవిరావు, టీవీ రాఘవరెడ్డి, ఎం.రాజు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర సంఘం కోశాధికారి సీవీవీ సత్యనారాయణ వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. రత్నగిరి పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను శనివారం రాత్రి, ఆదివారం వేకువజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో, అధిక సంఖ్యలో నవదంపతులు సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించారు. వారికి వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారిపోయింది.
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ప్రధానార్చకుడు వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది పాల్గొన్నారు. లక్ష్మీగణపతి హోమంలో 20 జంటలు పాల్గొన్నాయి. పది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఐదుగురికి తులాభారం, తొమ్మిది మంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. 49 మంది వాహన పూజలు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదం 2,200 మంది స్వీకరించారు. ఈ ఒక్క రోజే ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.2,25,767 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు.
National
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి, మృతదేహాలను సామూహికంగా ఖననం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మీకుడు ప్రకటించడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. 15 ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండాపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కార్యకర్త జయంత్ ఈ విషయం బహిర్గతం చేశారు. 2000 నుంచి 2015 దాకా అసహజ మరణాల రిజిస్టర్(యూడీఆర్)లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసినట్లు వెల్లడయ్యింది. ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద, నమోదు కాని మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అధికారుల సమక్షంలోనే ఖననం
ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్ చెప్పారు. దీనిపై ఈ నెల 2వ తేదీన సిట్కు ఫిర్యాదు చేశారనని వివరించారు. ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు. జయంత్ ఫిర్యాదుపై సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ చాలాకాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, యువతుల పూర్తి వివరాలు, ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెళ్తంగడి పోలీసులను కోరగా, వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పా రు. సంబంధిత డాక్యుమెంట్లు, పోస్ట్మార్టం రిపోర్టులు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలను నాశనం చేసినట్లు వారు బదులిచ్చారని పేర్కొన్నారు. గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టంచేశారు.
ఇప్పుడు ఆ సమయం వచ్చింది
అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన శునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని, ఆ సంఘటన చాలాకాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు. ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయతీ గల అధికారులకు అప్పగించకపోతే తనకు నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. అందుకే సిట్కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదని తేల్చిచెప్పారు.నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తవ్వకాల్లో అస్తిపంజరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టంచేశారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలని అన్నారు. సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు.
Kakinada
పట్టించుకోని వ్యవసాయ శాఖ
ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నా వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేచి ఉన్నా ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యవసాయ శాఖ వేధింపుల కారణంగా ఎరువుల స్టాకు తెచ్చుకోవడం మానేశామని ప్రైవేటు డీలర్లు బహిరంగంగానే చెబుతున్నారు. అటు ప్రభుత్వం ఎరువులు ఇవ్వక.. ఇటు ప్రైవేటు డీలర్ల వద్ద కూడా దొరక్కపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. పైరు పొట్ట పోసుకొనే దశలో ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఎరువులు ఏ మేరకు అవసరమో ప్రభుత్వానికి, వ్యవసాయ అధికారులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
ఎరువుల కోసం నేడు
వైఎస్సార్ సీపీ వినతులు
ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని వ్యవసాయ అధికారులకు వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం వినతి పత్రాలు ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతులు ఇబ్బందులను అధికారులకు తెలియజేయాలని నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు, పార్టీ నాయకులకు ఆయన సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ సగిలికి దాడిశెట్టి రాజా వినతిపత్రం ఇవ్వనున్నారు.
● జిల్లావ్యాప్తంగా 2.10 లక్షల
ఎకరాల్లో వరి సాగు
● ప్రస్తుతం ముమ్మరంగా నాట్లు
● ప్రతి రైతుకూ రెండు మూడు బస్తాల ఎరువులు అవసరం
● వాటి కోసం గంటల తరబడి నిరీక్షణ
● ఇదే అదనుగా కూటమి నాయకుల దందా
● బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకూ అధికంగా వసూళ్లు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ‘చంద్రన్న ఉన్నంత వరకూ రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో అన్నారు. ఆ మాటలు నిజమే అన్నట్టుగా ఉంది జిల్లాలోని రైతుల పరిస్థితి. ఖరీఫ్లో అన్నదాతకు అదనుకు పెట్టుబడి సాయం అందించని కూటమి సర్కారు.. వారికి కావాల్సిన ఎరువులు సైతం సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో, ఎరువుల కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో వ్యవసాయం పండగలా సాగేది. అన్నదాతలకు సకాలంలో పెట్టుబడి సాయం అందించేవారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి ముంగిట్లోనే ఎరువులు అందేవి. కూటమి సర్కారు వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. మరో 30 వేలకు పైగా ఎకరాల్లో పొగాకు, మొక్కజొన్న, పత్తి, అపరాలు సాగవుతున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు లభించడం లేదు. ప్రస్తుతం సహకార సంఘాల్లో ఎరువులు విక్రయిస్తున్నారు. ఒక లోడు వచ్చినా రైతుల అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవసాయ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో (ఆర్ఎస్కే) అవసరాల మేరకు ఎరువులు అందుబాటులో ఉంచలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదనుకు ఎరువులు లభించకపోవడంతో గత్యంతరం లేక అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి వారికి కావలసినంతగా..
ప్రస్తుతం వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ దశలో యూరియా, డీఏపీ, నత్రజని ఎరువులు అవసరం. మూడెకరాలు సాగు చేసే రైతుకు యూరియా 3 బస్తాలు, కాంప్లెక్సు ఎరువులు మూడు బస్తాలు అవసరం. కానీ, ప్రస్తుతం యూరియా, కాంప్లెక్సు ఎరువులు ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు ఆర్ఎస్కేలు, సహకార సంఘాలకు ఒక లోడు (సుమారు 200 బస్తాలు) ఎరువులు వస్తే.. కూటమి నాయకులు వాలిపోతున్నారు. వచ్చిన ఎరువుల్లో సగానికి పైగా తమకు కావాల్సిన రైతులకే ఇస్తున్నారని, మిగిలిన వారికి ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామర్లకోట మండలం ఉండూరులో శనివారం ఒక లోడు ఎరువులు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన కూటమి నాయకులు వారికి కావాల్సిన వారికి దగ్గరుండి మరీ ఎక్కువ బస్తాలు ఇచ్చి, మిగిలిన వారికి ఒక్కో బస్తా మాత్రమే ఇచ్చారని ఆరోపిస్తూ అక్కడి రైతులు ఆర్ఎస్కే వద్ద ధర్నా చేశారు. చాలా మందికి ఒక్క బస్తా కూడా ఇవ్వకుండా రేపు మాపు అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, ఎరువులను పక్కదారి పట్టించి, ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. ఇదే అదనుగా కూటమి నాయకులు ఒక్కో బస్తాను రూ.200 నుంచి రూ.300 వరకూ అధికంగా అమ్ముకుంటూ దోచుకుంటున్నారని రైతులు బహిరంగంగానే విమర్శించారు. సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఎరువుల కొరత ఎప్పుడూ లేదని, తమను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఎరువులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.
గంటలో అయిపోతున్నాయి
ప్రస్తుతం ఎరువుల అవసరం ఎక్కువగా ఉంది. ఎప్పుడో ఒకసారి లోడు ఎరువులు వస్తున్నాయి. అవి గంటలో అయిపోతున్నాయి. ఇక మళ్లీ ఎరువులు రైతు సేవా కేంద్రాలకు రావడం లేదు. సకాలంలో ఎరువులు సరఫరా చేయాల్సిన వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. – సుర్ల నాగ రమణ, టీజే నగరం,
కోటనందూరు మండలం
చాలా ఇబ్బందులు పడుతున్నాం
గతంలో ఎన్ని బస్తాలు కావాలన్నా రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. నేను ఐదెకరాలు సాగు చేస్తున్నాను. రెండు బస్తాలు ఎన్ని ఎకరాలకు సరిపోతుంది? ప్రభుత్వం కనీసం ఎరువులు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
– నేతల హరిబాబు, రైతు, సామర్లకోట
● వైద్య విద్యార్థులకే కేటాయించిన మైదానం
● కూటమి నేతల ఒత్తిళ్లకు
తలొగ్గిన అధికారులు
● ఈ నెల 10 నుంచి వాకర్స్కు అనుమతి
● ఆ ముసుగులో వివాదాస్పద వ్యక్తులు చొరబడతారని ఆందోళన
● విద్యార్థుల భద్రతకు భరోసా కరవు
కాకినాడ క్రైం: చాలా నెలల తరువాత రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) క్రీడా మైదానం గేట్లు ఎట్టకేలకు తెరచుకోనున్నాయి. కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఈ మైదానంలో వాకింగ్కు, వ్యాయామం చేసుకునేందుకు వాకర్స్కు అనుమతులు ఇచ్చారు. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఏం జరిగిందంటే..
గత ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం అప్పటి ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుత కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేశారు. తాను గౌరవనీయమైన హోదాలో ఉన్న ఓ ప్రజాప్రతినిధినని.. అవతలి వ్యక్తి సమాజానికి సేవలందించే వైద్యుడనే కనీస గౌరవం కూడా లేకుండా పిడిగుద్దులు గుద్దుతూ, బూతులు తిట్టారు. విద్యార్థులతో గొడవలకు దిగుతూ, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆయన అనుచరులను డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆర్ఎంసీ గ్రౌండ్ నుంచి బయటకు పంపించేయడమే దీనికి కారణం. దాడి చేస్తున్న క్రమంలో అప్పటి వైస్ ప్రిన్సిపాల్, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ అడ్డుపడి, ఎమ్మెల్యేను నిలువరించారు. దీంతో, దాడి నుంచి డాక్టర్ ఉమామహేశ్వరరావు బయటపడ్డారు. ఈ విజువల్స్ అప్పట్లో వైరల్ కాగా.. ఈ వివాదం ముఖ్యమంత్రి వరకూ వెళింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కలెక్టర్ షణ్మోహన్, అప్పటి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. దఫదఫాల చర్చల అనంతరం ఎమ్మెల్యే నానాజీకి, డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే, తోటి వైద్యుడికి ఎమ్మెల్యే చేసిన అవమానాన్ని వైద్య సంఘాలు మాత్రం అంత తేలికగా విడిచిపెట్టలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. అప్పటి నుంచీ ఆర్ఎంసీ క్రీడా ప్రాంగణంలోకి వైద్య విద్యార్థులను తప్ప మరెవరినీ అనుమతించరాదనే డిమాండ్ తెర మీదికి వచ్చింది. ఒక దశలో ఒత్తిళ్లకు లొంగిన అధికారులు మైదానంలోకి బయటి వారిని కూడా అనుమతించాలని భావించినా అందుకు విద్యార్థులు ఎంత మాత్రమూ అంగీకరించలేదు.
ముక్తకంఠంతో వద్దని..
ఆర్ఎంసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యాన మొత్తం 2,400 మంది వైద్య విద్యార్థులు దశల వారీగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. తమ కళాశాల గ్రౌండ్లోనికి ఇతరులను అనుమతించవద్దని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించారు. వాకర్స్ ముసుగులో గంజాయి బ్యాచ్లు, అసాంఘిక శక్తులు క్రీడా ప్రాంగణంలోకి ప్రవేశించడం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అలాగే, వైద్య బృందాలు కూడా ఏకమయ్యాయి. వివిధ సమావేశాల్లో విద్యార్థులకు తప్ప మరెవ్వరికీ ఆర్ఎంసీ క్రీడా మైదానాన్ని కేటాయించరాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో 11 నెలల పాటు విద్యార్థులు తప్ప మరెవ్వరికీ కళాశాల క్రీడా ప్రాంగణంలో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది. తాము వాకర్స్కు వ్యతిరేకం కాదనీ, కానీ ఆ ముసుగులో అసాంఘిక మూకలు దురుద్దేశాలతో గ్రౌండ్లోకి వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులివ్వడం అనివార్యమైతే విద్యార్థినీ విద్యార్థులకు ఎటువంటి సమస్యా ఉత్పన్నమవ్వకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆర్ఎంసీ క్రీడా మైదానంలోకి వాకర్స్ను అనుమతించాలంటూ అధికారులపై కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ షణ్మోహన్ జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ ఈ నెల 10వ తేదీ నుంచి వాకర్స్కు అనుమతివ్వాలని ఎట్టకేలకు నిర్ణయించారు. అయితే, ఒత్తిడి తెచ్చిన రాజకీయ నాయకులు మాత్రం విద్యార్థుల భద్రతకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. యాజమాన్యం రిస్క్తోనే అనుమతులివ్వాలన్నట్లు మంత్రాంగం నడిపారు. కలెక్టర్ సహా ఆర్ఎంసీ ప్రిన్సిపాల్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ రాజకీయ క్రీడలో చివరకు తమ పంతం నెగ్గించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు చొరవతోనే ఆర్ఎంసీ క్రీడా ప్రాంగణం గేట్లు తెరచుకున్నాయని ఆయన అనుచరులంటున్నారు.
అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 9న శ్రావణ పౌర్ణమి వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజున అమ్మవారిని బాలాత్రిపురసుందరిగా అలంకరించి, పండితులు పూజలు చేస్తారు. పౌర్ణమి వరకూ రోజుకో అలంకారం చేస్తారని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు వనదుర్గ అమ్మవారి ఆలయంలో పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. నవధాన్యాలతో మండపారాధన, కలశ స్థాపన చేస్తారు. 50 మంది రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్య నమస్కారాలు, సప్తశతీ పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. చండీ హోమానికి పండితులు అంకురార్పణ చేస్తారు. ఆ రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. తొమ్మిదో తేదీన శ్రావణ పౌర్ణమి నాడు వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. దీంతో శ్రావణ మాస పూజలు ముగుస్తాయి.
రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన
40 వేల మంది భక్తులు
● 2,500 వ్రతాల నిర్వహణ
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. రత్నగిరి పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను శనివారం రాత్రి, ఆదివారం వేకువజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో, అధిక సంఖ్యలో నవదంపతులు సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించారు. వారికి వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారిపోయింది. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. స్వామివారిని దర్శించిన భక్తులు శ్రీగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించారు. అనంతరం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి, జ్యోతులు వెలిగించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,05,890, పూజా టికెట్లకు రూ.1,71,160, కేశఖండన శాలకు రూ.18,760, వాహన పూజలకు రూ.9,240, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.77,426, విరాళాలు రూ.58,967, కలిపి మొత్తం రూ.5,41,443 ఆదాయం సమకూరిందని వివరించారు.
● భక్తులతో కిక్కిరిసిన వెంకన్న క్షేత్రం
● ఒక్క రోజే రూ.6.70 లక్షల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా ఆ జనంలో ప్రదక్షిణలు చేయలేని భక్తులు ఇతర వారాల్లో ఏదో ఒక రోజు నిర్ణయించుకుని ఏడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలి రావడంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, మిగిలిన ఆరు రోజులూ అత్యధికంగా వస్తున్నారు. దానితో ఈ క్షేత్రం శనివారాలే కాకుండా వారంలో మిగిలిన రోజుల్లో కూడా నిత్య కల్యాణం పచ్చతోరణంలా మారుతోంది. ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు ఆదివారం అష్టోత్తర పూజ, స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్క రోజే దేవస్థానానికి రూ.6,70,313 ఆదాయం వచ్చిందని చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశాఖపట్నం కళారాధన నృత్య కళాశాల కళాకారిణుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
నేటి నుంచి పవిత్రోత్సవాలు
వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ సూర్యచక్రధరరావు తెలిపారు. సోమవారం ఉదయం రుత్విక్కులు దీక్షాధారణ, అకల్మష హోమం నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ప్రతిష్ఠ పూజలు చేయనున్నారు. ఐదో తేదీ ఉదయం అష్ట కలశ స్థాపన, మహా శాంతి హోమం, ఆరో తేదీ ఉదయం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి నిర్వహిస్తారని ఈఓ వివరించారు.
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠం 53వ వార్షికోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్ఓ వి.వేణుగోపాల్ (బాబీ) తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వార్షికోత్సవ వివరాలు వెల్లడించారు. పీఠాధిపతి గాడ్ 1972 ఆగస్టు 18న మంత్రోపదేశం పొందారన్నారు. 1989 ఆగస్టు 16న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థస్వామి విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేసి, భవానీ శంకర స్ఫటిక బాణాన్ని విజయదుర్గాదేవి సన్నిధిలో ప్రతిష్ఠించారన్నారు. పీఠంలో నిరంతరాయంగా విజయదుర్గా అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వచ్చే నెల 16న పీఠంలో సర్వతోభద్రతా మండప ఆవాహన జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
సీతారామ కల్యాణం
ఈ నెల 16న ఉదయం 8.45 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని బాపిరాజు, బాబీ తెలిపారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం భద్రాచలం వేద పండితులతో సీతారామచంద్రుల కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.15 గంటలకు శ్రీ సాయి సత్సంగ నిలయం, పీఠం మహిళా భక్తులతో శక్తిమాల సహిత మణిద్వీప వర్ణన శ్లోకాల పారాయణ, నవదుర్గల సువాసినీ పూజ నిర్వహిస్తారు. 17న జొన్నవాడ వద్ద ఉన్న శ్రీ కామాక్షితాయి అమ్మవారి ప్రధానార్చకులతో మహానవావరణ హోమం, సాయంత్రం 6 గంటలకు అన్నవరం దేవస్థానం పండితులతో అనంత లక్ష్మీ సత్యవతీదేవి సమేత వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దివ్య కల్యాణం నిర్వహిస్తారన్నారు. 18వ తేదీ ఉదయం టీటీడీ వారితో విజయదుర్గా పీఠం వద్ద నెలకొల్పిన విజయ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం శ్రీ వైఖానస ఆగమ పండితులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక అర్చన, హారతులు, చతుర్వేదస్వస్తి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. వార్షికోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో పీఠం భక్తజన కమిటీ సభ్యులు గాదె భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మహా సహస్రావధాని గరికిపాటి నరసింహరావు
కాకినాడ సిటీ: అష్టావధానులకు మార్గదర్శిగా, సాహితీ స్రష్టగా నిలచి, సంస్కృత భాషాసాహిత్యాలకు విశేష సేవలందించిన రాణి సుబ్బయ్య దీక్షితులు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని మహాసహస్రావధాని గరికిపాటి నరసింహరావు అన్నారు. బాణుడు సంస్కృతంలో రచించిన కాదంబరి కావ్యంపై ఆయన సాహితీ ప్రసంగం చేశారు. రాణి సుబ్బయ్య దీక్షిత, సాహితీ కౌముది ఆధ్వర్యాన సూర్య కళా మందిరం ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. కాదంబరి కావ్యంలోని అనేక పాత్రల వ్యక్తిత్వాన్ని గరికిపాటి ఆవిష్కరించారు. కావ్యంలో పరిపాలన చేసే రాజు, నాయికా నాయకులను వర్ణిస్తూ నేటి యువతకు ఆదర్శనీయంగా ఉండేలా ఆయన ప్రసంగం సాగింది. రాణి సుబ్బయ్య దీక్షితులుతో తనకున్న అనుబంధాన్ని గరికిపాటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాదంబరి కావ్యంలోని ఉదాత్త పాత్రలతో సుబ్బయ్య దీక్షితులును సరిపోల్చారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులకు గరికిపాటి సూచించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు రాణి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యాన గరికిపాటి నరసింహరావును సత్కరించారు. ముందుగా సంస్థ నిర్వాహకురాలు గంటి బాలాత్రిపురసుందరి, ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి బాబ్జీ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాణి సుబ్బయ్య దీక్షితులు కుటుంబ సభ్యులు, నగరానికి చెందిన సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి, మార్ని జానికిరామ్ చౌదరి, గరికిపాటి మాస్టారు, గౌరినాయుడు, శిరీష, సీఎస్ తదితర సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): భద్రత, సరకు రవాణా సామర్థ్యం, సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) మోహిత్ సోనాకియా అధికారులను ఆదే శించారు. కాకినాడ టౌన్, పోర్టు రైల్వే స్టేషన్లను, సీపోర్ట్, సరకు రవాణా నిర్వహణ, భద్రతా సంసిద్ధత, సిబ్బంది సౌకర్యాలు, కోచ్ సర్వీసింగ్ కార్యకలాపాలను ఆదివారం ఆయన పరిశీలించారు. రైల్వే కార్యకలాపాలు, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడంలో బ్యాక్ ఎండ్ జట్లు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. కాకినాడలోని రన్నింగ్ రూమ్ను తనిఖీ చేసి, ఆపరేటింగ్ సిబ్బందికి విశ్రాంతి, రిఫ్రెష్మెంట్ సౌకర్యాలను సమీక్షించారు. పరిశుభ్రత, పోషకాహారం, డిజిటల్ లాగ్బుక్ వ్యవస్థల్లో సిబ్బంది సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి పని చేసే సిబ్బందిని డీఆర్ఎం అభినందించారు.
Komaram Bheem
రెబ్బెన మండలం గొల్లగూడకు చెందిన మొగిలి చిన్నన్న, అనసూయ దంపతుల కుమారుడు శ్యాం(4) గత నెల 29న తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నేలపై పడుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి శ్యాం చెవిపై పాముకాటు వేసింది. తల్లిదండ్రులు బైక్పై రెబ్బెన పీహెచ్సీకి తీసుకెళ్లారు. బెల్లంపల్లికి, అక్కడి నుంచి మంచిర్యాలకు అంబులెన్స్లో తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కౌటాల మండలం మొగడ్ధగడ్కు చెందిన ఉర్వత్ నాందేవ్(55) ఈ నెల 1న భార్య
నిర్మలతో కలిసి గ్రామశివారులోని పంట పొలానికి వెళ్లాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. గమనించిన భార్య వెంటనే సిర్పూర్–టి సామాజిక ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆసిఫాబాద్/కౌటాల: జిల్లాలో విషసర్పాలు కలవరపెడుతున్నాయి. వర్షాలకు పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగడంతో ఇళ్ల ఆవరణతోపాటు పాఠశాలలు, వసతి గృహాల్లో పాములు సంచరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్లేందుకు అంబులెన్సులు అందుబాటులో లేక సకాలంలో వైద్యం అందడం లేదు. పాముకాటుతో జిల్లాలో ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా సర్పాల సంచారం పెరగగా, కొంతమంది కనిపించిన వెంటనే చంపుతున్నారు. మరికొందరు స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చి పట్టించి సురక్షితంగా అడవుల్లో వదిలిపెడుతున్నారు.
విధిలేని పరిస్థితుల్లోనే..
పాముల్లో విషపూరితం, విషపూరితం కానివి ఉంటాయి. చాలావరకు సర్పాలు ఆత్మరక్షణ కోసం విధిలేని పరిస్థితుల్లో కాటువేస్తుంది. తాచు, కట్లపాముల వంటి 15 శాతం సర్ప జాతులతోనే ప్రమాదం ఉంటుంది. అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కాదు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషంలేనివే ఉంటాయి. వీటికి సాధారణ చికిత్స తీసుకుంటే చాలు. ఒకవేళ విషపూరిత పాము కాటువేస్తే ఆందోళనకు గురికాకుండా తక్షణమే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేసుకోవాలి. ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే చాలామంది షాక్కు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో వారికి ధైర్యం చెప్పాలి.
అందుబాటులో మందులు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో యాంటి వీనమ్ మందులు అందుబాటులో ఉన్నాయి. బాధితులు గాయాన్ని వెంటనే సబ్బుతో శుభ్రంగా కడగాలి. వీలయినంత త్వరగా ఆస్పత్రికి తరలించి చిక్సిత అందించాలి. నాటువైద్యం అందిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాము, తేలు, ఇతర విషపురుగులపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
– సీతారాం, డీఎంహెచ్వో
31 మందికి పాముకాటు
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 31 మంది పాముకాటుకు గురయ్యారు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 176 యాంటి వీనమ్ టీకాలు, ఐదు సీహెచ్సీల్లో 40 యాంటి వీనమ్ టీకాలు అందుబాటులో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత నెల నుంచి ఇప్పటివరకు 30 విష విరుగుడు టీకాలు వినియోగించారు. చాలామంది సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. గత నెల 29న రాత్రి రెబ్బెన మండలంలో ఓ బాలుడు, కౌటాల మండలం మొగడ్ధగడ్కు చెందిన రైతు పాముకాటుతో ప్రాణాలు కోల్పోయారు. జైనూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సిడాం కన్నీబాయి గత వారం పాముకాటుకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యసిబ్బంది సూచనల మేరకు ఆదిలాబాద్కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన దుర్గం ప్రియత(26) మే 16న ఇంటి ఆవరణలో పని చేస్తుండగా పాముకాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్నగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందింది. పీహెచ్సీల్లో రాత్రిపూట వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. ఆధునిక కాలంలోనూ గిరిజనులు, గ్రామీణ ప్రజలు నాటువైద్యాన్ని నమ్ముకోవడం ప్రమాదకరంగా మారుతోంది. పాము కరిచినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాల మీదకు వస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోయినా, భయాందోళనతో గురైనా తీవ్రత మరింత పెరుగుతుంది.
కాగజ్నగర్టౌన్: వివాదాస్పద అంశాన్ని ఓ పత్రిక(సాక్షి కాదు) లోగోతో ఫేక్ వార్త సృష్టించిన వ్యక్తిపై ఆదివారం కాగజ్నగర్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు టౌన్ సీఐ ప్రేంకుమర్కు ఫిర్యాదు చేశారు. కాగజ్నగర్ మండలం చింతగూడకు చెందిన లెండుగురే శ్యామ్రావు శనివారం వాట్సాప్ గ్రూప్ల్లో వివాదా స్పద రాజకీయ అంశాన్ని వార్త పత్రికలో వచ్చినట్లుగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనలో నిందితుడితోపాటు సూత్రదా రులపై చర్యలు తీసుకోవాలని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు టి.సురేందర్రావు కోరారు. అనంతరం జర్నలిస్టులు కాగజ్నగర్ డీఎస్పీ రామానుజంను కలిసి విషయం వివరించారు. సోషల్ మీడియాలో వైరల్ చేసిన వార్తను తొలగించాలని ఫోన్ చేసినా సదరు వ్యక్తి స్పందించలేదని తెలిపారు. కాగా, టి.సురేందర్రావు ఫిర్యాదు మేరకు చింతగూడ గ్రామానికి చెందిన లెండుగురే శ్యాంరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేంకుమార్, ఎస్సై సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
కెరమెరి(ఆసిఫాబాద్): అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హా మీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బన్న మూర్తి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వీహెచ్పీఎస్, ఎమ్మార్పీ ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆది వారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడా రు. ఒంటరి మహిళలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హామీ లపై చర్చించేందుకు నిర్వహించే సన్నాహక సభ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తిరుసుల్ల సాయికుమార్, పొర్ల వెంకటేశ్, పిట్టల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్/ఖానాపూర్: సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ధీమా పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుచి మళ్లీ అధికారంలోకి వస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లూ కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తంజేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులతో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము ఏసీల్లో కూర్చోకుండా తమ నేత రాహుల్గాంధీ చెప్పినట్లు ప్రజల్లో ఉండేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఆదివాసీలతో అనుబంధం ఉంది : మీనాక్షి
మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఆదివాసీగానే పుట్టాలని కోరుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కరించవచ్చన్న తమనేత రాహుల్గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. తనకు ఆదివాసీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్తోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలోనూ సర్వోదయ యాత్రలో భాగంగా ఆదిలాబాద్కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ సమాజం నుంచి మంచితనాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన ఆదివాసీలే తమకు స్ఫూర్తి అన్న రాహుల్ ఆశయాలతోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీసులు, గిరిజనుల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్కు దోచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిలుకపలుకులు పలుకుతున్నారని, గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చి, తెలంగాణకు మొండిచేయి చూపారని ఆరోపించారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదని, దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎలా దోపిడీ జరిగిందో, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తోందో ప్రజలకు తెలుపుతూ.. సమస్యలు పరిష్కరించేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ దోపిడీకి పాల్పడితే, బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రేషన్కార్డులు ఇస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో జీవోలే తప్పా పైసలు ఇవ్వలేదని, అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఎద్దేవా చేశారు. గత సీఎం కేసీఆర్కు ఎన్నిసార్లు విన్నవించినా సదర్మట్ మినీబ్యారేజీ నుంచి ప్రత్యేక కాలువ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ మండిపడ్డారు.
జనహితం.. విజయవంతం
జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడి సారథ్యంలో తొలిసారి చేపట్టిన జనహిత పాదయాత్ర కార్యక్రమం సక్సెస్ కావడంపై ఆ పార్టీ శ్రేణులు హ ర్షం వ్యక్తంచేస్తున్నాయి. నిర్మల్ జిల్లా సరిహద్దు అయిన ఖానాపూర్ మండలం బాదన్కూర్తికి చేరుకున్న నేతలు ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని బస్టాండ్ వద్ద గల బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బాదన్కూర్తి గ్రామస్తులు వారికి రైతు నాగలిని బహూకరించారు. అక్కడి నుంచి సుర్జాపూర్ చౌరస్తాకు చేరుకున్న వారికి ఆదివాసీ గుస్సాడీ నృత్యాలతో పాటు బంజారా మహిళల సంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర సుర్జాపూర్ నుంచి మస్కాపూర్ గ్రామ ప్రధాన రహదారి మీదుగా ఖానాపూర్కు చేరుకుంది. ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్, వారసంత, శివాజీనగర్, శాంతినగర్ మీదుగా వ్యవసాయ మార్కెట్యార్డులోని రాజీవ్గాంధీచౌరస్తాకు చేరుకుంది. అక్కడ విగ్రహానికి పూలుచల్లి విద్యానగర్ మీదుగా జగన్నాథ్రావు చౌరస్తాలోని సభాస్థలికి చేరుకుంది. స్థానిక శాంతినగర్ చౌరస్తాలో కాలనీవాసులు మీనాక్షి నటరాజన్కు బతుకమ్మ అందజేశారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాగూర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, నాయకులు అల్లూరి మల్లారెడ్డి, అడె గజేందర్, కంది శ్రీనివాస్, బొంత రామ్మోహన్, నారాయణరావుపటేట్, పడిగెల భూషణ్, ఎంఏ మజీద్, దయానంద్, తోట సత్యం, చిన్నం సత్యం, అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రెండోసారి అధికారంలోకి వస్తాం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఖానాపూర్లో ‘జనహిత’ పాదయాత్ర భారీగా తరలివచ్చిన నేతలు, శ్రేణులు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి
మీనాక్షి, పలువురు మంత్రులు హాజరు
- ● ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు షురూ ● రోజుకు రెండుసార్లు అటెండెన్స్ వేయాల్సిందే..
కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలో ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు(ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు డీఎస్ఈ– ఎఫ్ఆర్ఎస్ యాప్ను మొబైళ్లలో డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ ద్వారా హాజరు వేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లుగా ఉపాధ్యాయులు ట్యాబ్లు, మొబైల్ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది 2,458 మంది ఉండగా.. ఆదివారం వరకు 1,978 మంది(80.47 శాతం) రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు విధులకు డుమ్మా కొడుతూ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో విద్యాశాఖ ముఖ గుర్తింపు హాజరుకు శ్రీకారం చుట్టింది.
గతంలో బయోమెట్రిక్..
ప్రభుత్వ టీచర్లకు గతంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు అమలు చేశా. కరోనా విస్తరించడంతో ఆ విధానం మరుగున పడింది. జిల్లాలో 2022లో బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి రాగా, కొన్నిరోజులు మాత్రమే కొనసాగింది. ఉపాధ్యాయులకు ప్రత్యేక ఐడీలతో వేలిముద్ర ద్వారా హాజరు వేసేవారు. ఆ తర్వాత సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయుల సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఆ విధానాన్ని నిలిపివేశారు.
రోజుకు రెండుసార్లు..
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది. కొంతమంది ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరవుతూ సొంత పనులు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ముఖగుర్తింపు హాజరుకు మొగ్గు చూపింది. ఈ విధానం ద్వారా ఉదయం 9 గంటలకు పాఠశాల ఆవరణలోనే ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో హాజరు నమోదు చేయాలి. మళ్లీ సాయంత్రం 4 గంటలకు స్కూల్ ముగింపు సమయంలో మళ్లీ హాజరు వేయాలి. నిర్ణీత సమయానికి తప్పనిసరిగా పాఠశాలలోనే యాప్ను ఆన్చేసి లొకేషన్ ద్వారా అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది.
అనధికార గైర్హాజరుకు అవకాశం ఉండదు
ఉపాధ్యాయులు యాప్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వందశాతం రిజిస్ట్రేషన్కు సహకరించాలి. ముఖ గుర్తింపు హాజరుతో ఉపాధ్యాయుల హాజరు పెరిగి, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. టీచర్ల అనధికార గైర్హాజరుకు అవకాశం ఉండదు. స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న స్కూళ్లతోపాటు యూఆర్ఎస్, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ వేయాలి.
– అబిద్ అలీ, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్
జిల్లాలో పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలు
మార్పు వచ్చేనా..?
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తు న్న కొందరు టీచర్లతో విద్యాశాఖకు చెడ్డ పేరు వస్తుందని విద్యాశాఖ భావిస్తుంది. రూ.వేలల్లో వేతనం పొందుతూ అనధికా రికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. మరికొందరు రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత సొంత పనులకు వెళ్తున్నారే ఆరో పణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న వారైతే ఒప్పందం ప్రకారం ఒకరు విధులకు వెళ్లి, మరొకరు డుమ్మా కొట్టడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరుతో మార్పు వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన రేంజ్ పరిధిలో ఆదివారం సీఎఫ్ ఫీల్డ్ డైరెక్టర్ కవ్వాల్ టైగర్ రిజర్వ్(ఎఫ్డీపీటీ) శాంతారాం పర్యటించారు. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ టిబ్రేవాల్తో కలిసి తక్కళ్లపల్లి బీట్ను సందర్శించారు. అటవీశాఖ తిరిగి స్వాధీనం చేసుకున్న పోడు భూముల్లో చేపట్టనున్న పనులపై ఆరా తీశారు. కొత్తగా పోడు వ్యవసాయం జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేటగాళ్లు అటవీ జంతువులను వేటాడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీవో దేవిదాస్, రెబ్బెన రేంజ్ అధికారి భానేష్, బీట్ అధికారులు అయాజ్, స్వాతి పాల్గొన్నారు.
ఖర్జెల్లి రేంజ్లో..
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని ఖర్జెల్లి రేంజ్లో ఆదివారం సీఎఫ్, ఎఫ్డీపీటీ శాంతారాం పర్యటించారు. రేంజ్ పరిధిలోని దిందా, బందెపల్లి అటవీ బీట్లను డీఎఫ్వో నీరజ్ టిబ్రేవాల్, ఎఫ్డీవో సుశాంత్ బొగాడేలతో కలిసి పరిశీలించారు. అటవీ భూముల్లో ఆక్రమణలు, కందకాలు, అటవీ అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. స్థానిక అటవీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్, ఎఫ్ఆర్వో ఎ.సుభాష్, ఎస్సై ఇస్లావత్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో ఈ నెల 13న సీపీఐ నాలుగో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడా రు. మహాసభల్లో జిల్లాకు సంబంధించిన సమగ్ర అభివృద్ధిని చర్చించి, భవిష్యత్ ఉద్య మ కార్యాచరణ రూపొందించనున్నట్లు పే ర్కొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న వాగ్దానాలు అమలు చేయడంపై చర్చిస్తామన్నారు. కాంగ్రెస్తో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ ప్రజాభివృద్ధిలో ప్రభుత్వం సరైన సమయంలో వాగ్దానాలు అమలు పర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపా రు. పార్టీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బద్రి సాయి, నాయికిని వెంకటేశ్, అజయ్కుమార్, దివాకర్, బుద్దాజీ, శంకర్నారాయణ, రంజిత్, పవన్ పాల్గొన్నారు.