కోలాహలం..కార్తీక వనభోజనం
కొరుక్కుపేట: చైన్నె తెలుగు అసోసియేషన్–వలసరవాక్కం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు కార్యక్రమాన్ని కోలహలంగా నిర్వహించారు. చెంబరబాక్కంలోని పి.శ్రీనివాసరావు ఫామ్హౌస్లో ఈ వేడుక ఆదివారం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు జీకే రెడ్డి, కార్యదర్శి వెంకయ్యనాయుడు, ఉపాధ్యక్షుడు విజయేంద్ర రావు, కల్చరల్ సెక్రటరీ డాక్టర్ ఏవీ శివకుమారిలతో కూడిన కార్యవర్గం, కమిటీ సభ్యులు నిర్వహణతో వనబోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. కుంటుంబసమేతంగా హాజరైన ఈ వేడుకల్లో పిల్లల కోసం క్రీడలు , ఆసక్తికరమైన కార్యక్రమాలతో, సంప్రదాయ మేళాతో, మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఉసిరి చెట్టు, గో పూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిండిపోయింది.


