పరమ శివుడు, పోలేరమ్మకు సూర్యాభిషేకం
వేటపాలెం: నాయినపల్లిలోని గంగా భవానీ సమేత భోగలింగేశ్వరస్వామి దేవస్థానంలో పరమ శివుడ్ని ఆదివారం భానుడి కిరణాలు అభిషేకించాయి. శివుడికి ప్రీతి పాత్రమైన కార్తిక మాసంలో శివలింగాన్ని తాకడాన్ని భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు. అర్చకులు స్వామికి పలు పూజలు చేశారు.
పోలేరమ్మ ఆలయంలో..
చీరాల: పట్టణంలోని పాపరాజుతోటలో గల శ్రీ పోలే రమ్మ అమ్మవారి అర్ధ ముఖాన్ని ఆదివారం సూర్య కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం అమ్మవారి దివ్య చైతన్యానికి సంకేతమంటు భక్తులు విశేష పూజలు నిర్వహించారు.
పరమ శివుడు, పోలేరమ్మకు సూర్యాభిషేకం


