25న దేశవ్యాప్త ఆందోళన | - | Sakshi
Sakshi News home page

25న దేశవ్యాప్త ఆందోళన

Nov 10 2025 7:44 AM | Updated on Nov 10 2025 7:44 AM

25న దేశవ్యాప్త ఆందోళన

25న దేశవ్యాప్త ఆందోళన

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కార్మికుల మెడకు ఉరితాడైన నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికై నా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న నిర్వహిస్తున్న దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చలసాని వెంకటరామారావు కోరారు. ఆదివారం నగరంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్‌ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా జనరల్‌ బాడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు అవుట్‌ సోర్శింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజేషన్‌ చేయాలన్నారు. కేంద్రంలో ఉన్న 11 కార్మిక సంఘాలు ఉమ్మడిగా నవంబర్‌ 25 వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె చేసి ఈ నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయించుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేసీ బాదుల్లా ఉపాధ్యక్షులు మంజుల, శ్రీరాములు, చాంద్‌ బాషా, కార్యదర్శులు మద్దిలేటి, మస్తాన్‌, లింగన్న, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement