శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని మైసూర్ ఆర్ఐఈ విద్యావిభాగం ప్రొఫెసర్ బుర్ర రమేశ్ సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్గా డాక్టర్ ఎ. సంజీవయ్య విధులు నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని అధ్యాపకులు హనుమకొండలోని డైమండ్హిల్స్ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సు, సంజీవయ్య అభినందన సభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. విద్యార్థులను విజ్ఞానం వైపు మరలించేందుకు తరగతి గది ఉపయోగపడాలని పేర్కొన్నారు. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, రాష్ట్ర మాజీ కార్యదర్శి కడారి భోగేశ్వర్, అధ్యాపకులు ఎడమ శ్రీనివాస్రెడ్డి, బైరి సత్యనారాయణ, మధుసూదన్రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, సోమయ్య, అధ్యాపకుల జ్వాల సంపాదకుడు డాక్టర్ గంగాధర్రెడ్డి, డాక్టర్ ఎం.శంకర్నారాయణ, ఆసనాల శ్రీనివాస్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సంజీవయ్య అధ్యాపకుడిగా అందించిన సేవలు కొనియాడారు.
విద్యాసదస్సులో మైసూర్ ఆర్ఐఈ
ప్రొఫెసర్ బుర్ర రమేశ్


