రక్త నాళాల వ్యాధులపై అవగాహన అవసరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన పెంచుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. వాస్క్యూలర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో వాస్క్యూలర్ వాక్థాన్ నిర్వహించారు. గవర్నర్ పేటలోని ఐఎంఏ హాలు వద్ద ఈ వాక్థాన్ను కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. అక్కడి నుంచి చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ ఆఫీసు వరకూ వెళ్లి, తిరిగి ఐఎంఏ హాలుకు చేరుకుంది.
నిర్లక్ష్యం వద్దు..
కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ వాస్క్యూలర్ వ్యాధులు, సర్జరీలు గురించి అవగాహన కల్పించేందుకు వాక్ థాన్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రముఖ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కిరణ్ మాకినేని మాట్లాడుతూ వాస్క్యూలర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో 800 మంది వరకు సభ్యులు ఉన్నారని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో అంప్యూటేషన్ ఫ్రీ ఇండియా నినాదంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహించినట్లు తెలిపారు. అంప్యూటేషన్లు 80 శాతం మందిలో మందులు వాడటం, జాగ్రత్తలు పాటించడం, రక్తనాళాలకు చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చన్నారు.. న్యూరోపతి, వాస్క్యూలోపతి, డయాబెటిస్ ఉంటే కాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, వాస్క్యూలర్ సర్జన్స్ పాల్గొన్నారు.
విజయవాడలో ఉత్సాహంగా
వాస్క్యూలర్ వాక్థాన్


