Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Blaze In Secunderabad Patny Centre SBI Admin Building1
ప్యాట్నీ సెంటర్‌ ఎస్‌బీఐ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్యాట్నీ సెంటర్ ఎస్ బీఐ అడ్మిన్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఐదవ ఫ్లోర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. దాంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో అక్కడకు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. అయితే మంటలు ఆర్పడం కష్టతరంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధమౌతున్నట్లు సమాచారం. బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది.

IPL 2025 KKR Vs RR: Kolkata Beat Rajasthan By 1 Run Play Offs Hope Alive2
ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!

ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓడిపోయింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR vs RR)తో మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా రాజస్తాన్‌ ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడింది.ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ (35) రాణించగా.. సునిల్‌ నరైన్‌ (11) విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ అజింక్య రహానే (30), అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (44) కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు.ఆండ్రీ రసెల్‌ తొలి ఫిఫ్టీఇక ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ (Andre Russel), రింకూ సింగ్‌ విశ్వరూపం ప్రదర్శించారు. రసెల్‌ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 57 పరుగులతో చెలరేగగా.. రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో దుమ్ములేపారు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్‌ 206 పరుగులు సాధించింది.రాజస్తాన్‌ బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, రియాన్‌ పరాగ్‌, జోఫ్రా ఆర్చర్‌, యుధ్‌వీర్‌ సింగ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రాజస్తాన్‌కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (4), వన్‌డౌన్‌లో వచ్చిన కునాల్‌ సింగ్‌ రాథోడ్‌ (0) పూర్తిగా విఫలమయ్యారు.రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌వీరికి తోడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (0), వనిందు హసరంగ (0) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి కఠిన దశలో రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి వైభవ్‌ అరోరాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.పరాగ్‌ అవుటైన తర్వాత జోఫ్రా ఆర్చర్‌ (12), శుభమ్‌ దూబే (25 నాటౌట్‌) ఆఖరి బంతి వరకు పోరాడారు. కానీ చివరి బాల్‌కు మూడు పరుగులు కావాల్సి ఉండగా.. ఆఖరి బంతికి ఆర్చర్‌ రనౌట్‌ కావడంతో రాయల్స్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి రాజస్తాన్‌ 205 పరుగుల వద్ద నిలిచిపోయింది.ఫలితంగా కేకేఆర్‌ సొంతగడ్డపై ఒక్క పరుగు తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్‌కు ఇది తొమ్మిదో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మరోవైపు.. 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచిన కేకేఆర్‌ ఆరో స్థానానికి ఎగబాకింది. ఐపీఎల్‌ 2025: కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌👉కేకేఆర్‌ స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్‌ స్కోరు: 205/8 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్‌ విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌: ఆండ్రీ రసెల్‌చదవండి: శెభాష్‌ రియాన్‌!.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు.. కానీ పాపం..Another day, another #TATAIPL classic 🤩@KKRiders prevail by 1️⃣ run in a last-ball thriller in Kolkata to boost their playoff hopes 👏💜Scorecard ▶ https://t.co/wg00ni9CQE#KKRvRR pic.twitter.com/mJxuxBSPqw— IndianPremierLeague (@IPL) May 4, 2025

Indian Railways Announces Nationwide Digital Clock Design Competition Full Details3
ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్

భారతదేశంలో రైల్వే స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రేల్వే దేశవ్యాప్తంగా ఒక పోటీ ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో, స్టేషన్ ప్రాంగణాలలో ఉపయోగించే గడియారాలు ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ పోటీలో పాల్గొనేవారిని ''ప్రొఫెషనల్స్, కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు (12వ తరగతి వరకు)'' అని మూడు వర్గాలుగా విభజించడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్‌లను 2025 మే 1 నుంచి మే 31 మధ్య ఆన్‌లైన్‌లో (contest.pr@rb.railnet.gov.in) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఈ పోటీ గురించి రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'దిలీప్ కుమార్' మాట్లాడుతూ.. గెలుపొందిన విజేతకు.. మొదటి బహుమతి రూ. 5 లక్షలు అందిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా మూడు విభాగాలలో ఇదుమందికి కన్సోలేషన్ బహుమతులుగా రూ. 5000 చొప్పున ఇవ్వనున్నట్లు స్పష్టంగా చేశారు.ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్లను.. హై రిజల్యూషన్‌లో, ఎలాంటి వాటర్ మార్క్ లేదా లోగో వంటివి లేకుండా, ఒరిజినాలిటీ సర్టిఫికెట్‌తో సబ్మిట్ చేయాలని దిలీప్ కుమార్ పేర్కొన్నారు. డిజైన్ వెనుక ఉన్న థీమ్.. ఆలోచనను వివరించే కాన్సెప్ట్ నోట్ కూడా ఉండాలి. మీరు సబ్మిట్ చేసే డిజైన్స్ అసలైనవిగా ఉండాలి, వాటిపై ఎలాంటి కాపీరైట్స్ ఉండకూడదని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!పాఠశాల విభాగంలో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్ ఐడీ కార్డును సైతం అప్‌లోడ్ చేయాలి. కళాశాల విభాగంలో ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో చేరిన వ్యక్తులు సంబంధిత ఐడీ కార్డును అందించాలి. మిగిలినవారు ప్రొఫెషనల్ కేటగిరీ కిందకు వస్తారని ఆయన అన్నారు.

APSDMA Warns Heavy Rains In Few Areas Of AP4
ఏపీకి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

విశాఖ : రాబోవు ‍ కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.గంటలకు 60 నుంచి 80 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఐదు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌రాగల రెండు మూడు గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, రోణంకి కూర్మనాథ్,పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

25 Meter Deep Crater At Israel Biggest Airport After Houthi Missile Strike5
వీడియో వైరల్‌.. ఇజ్రాయిల్‌పై హౌతీ క్షిపణి దాడి.. ఎయిర్‌పోర్టులో భారీ బిలం

హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్‌ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. మిస్సైల్‌ ధాటికి 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇజ్రాయిల్‌కి ఉన్న శక్తివంతమైన నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని క్షిపణి దాడి జరగడం సంచలనం కలిగిస్తోంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు.🚨 HOUTHI MISSILE FROM YEMEN STRIKES BEN-GURION AIRPORT AREA, ONE LIGHTLY WOUNDED IN ATTACKFollowing sirens that sounded across several areas in Israel, the IDF Spokesperson confirmed that multiple attempts were made to intercept a missile launched from Yemen. Despite these… pic.twitter.com/I9D2srJc0x— Israel Realtime (@IsraelRealtime) May 4, 2025ఇజ్రాయెల్‌పై హౌతీ ఎటాక్‌తో భారత్‌ అలర్ట్‌..మరోవైపు, ఇజ్రాయెల్‌పై హౌతీ ఎటాక్‌తో భారత్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీన్‌కు ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. టెల్‌ అవీవ్‌కు వెళ్లే విమాన సర్వీసులను అబుదాబికి మళ్లించింది. రెండు రోజల పాటు టెల్‌ అవీవ్‌కు సర్వీసులను రద్దు చేసింది. Absolutely INSANE footage of the impact from a Houthi missile on Israel’s Ben Gurion airport.What would happen if this was JFK or Heathrow - do you think the Houthis would exist tomorrow? How about their Iranian backers? pic.twitter.com/Qbv5BeGxWG— Aviva Klompas (@AvivaKlompas) May 4, 2025

India looking for partners, not preachers: Jaishankar6
మాకు కావాల్సింది భాగస్వాములు.. బోధకులు కాదు: జై శంకర్‌

న్యూఢిల్లీ: యూరోపియన్‌ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్‌ జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్‌. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. భారతదేశానికి భాగస్వాములు కావాలని, అంతే కానీ బోధకులు అవసరం లేదని చురకలంటిచారు. న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ లో జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు గ్రిమ్సన్ తదితరులతో జరిగిన చర్చావేదికలో యూరప్ తీరును జైశంకర్ బహిర్గతం చేశారు. యూరప్ దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుదని అడిగిన ప్రశ్నలో భాగంగా జై శంకర్ఇలా సమాధానమిచ్చారు. ‘మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాం. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని చేసుకోవాలంటే, కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహ ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థవంతంగా ఉండగా, మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు.గతంలో కూడా యూరప్ దేశాల తీరుపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చూపిస్తారని, ప్రపంచ సమస్యల్ని మాత్రం వారు పట్టించుకోరంటూ వ్యాఖ్యలు చేశారు.

PM Modi meeting With Air Force Chief Air Marshal Amar Preet Singh7
ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ కీలక భేటీ.. ఏం జరగనుంది?

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు.ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్‌ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.జాతీయ భద్రతతోపాటు ప్రస్తుత కీలక సమయంలోని నిర్వహణ అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రపుర్‌ జిల్లా కర్మాగారం అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయామని, ఆ లోటును భర్తీ చేయడానికే దీర్ఘకాల సెలవులను తక్షణం రద్దు చేస్తున్నట్లు ఖమరియా ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.Indian Air Force Chief Air Marshal Amar Preet Singh is meeting Prime Minister Narendra Modi right now: Sources pic.twitter.com/qytnt88F0G— ANI (@ANI) May 4, 2025

Pak MPs funny reply to India Pak war query goes viral8
‘మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా’

కరాచీ: తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తమకు చుక్కలే కనిపిస్తాయనే భావన కొందరి నాయకుల్లో కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఒక పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఒకవేళ తమతో భారత్ యుద్ధానికి దిగితే తాను ఇంగ్లండ్ కు పారిపోతానంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఎంపీ సరదాగా చేసినా సీరియస్‌ గా ఈ వ్యాఖ్యలు చేసినా ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వంగానేఅభివర్ణించినట్లు ఆయన మాటల్లో కనబడుతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి చెందిన ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక లోకల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సదరు ఎంపీ ఈ కామెంట్స్ చేశారు. పాక్ పై భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తాను ఇంగ్లండ్ వెళ్లిపోతానంటూ తేల్చిచెప్పారు.ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి తగ్గమని చెప్పొచ్చు కదా.. అని అడిగిన మరో ప్రశ్నకు ‘నేను చెబితే వినడానికి.. మోదీ జీ ఏమైనా మా బంధువా.? అంటూ చమత్కరించారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.Pakistaniyon ki fat ke char ho gayi hai🧵Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiyeSher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025 ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున ఆయన ఎంపీగా ఉన్నారు. గతంలో అంటే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఎంపీ హవా నడిచేది. పీటీఐలో కీలకంగా వ్యవహరించేవారు షెర్ ఆఫ్జల్ ఖాన్,.గత కొన్నినెలలుగా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అఫ్జల్ ఖాన్,. ఈ క్రమంలోనే భారత్ తో యుద్ధాన్ని పాక్ తట్టుకోలేదనే సంకేతం వచ్చేలా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఎంపీ అఫ్జల్ ఖాన్.

Jagadeka Veerudu Athiloka Sundari Movie Ticket Price Goes Viral9
జగదేకవీరుడు.. అతిలోకసుందరి.. అప్పట్లోనే రూ.210 రూపాయలా!

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత మేకర్స్ రీ రిలీజ్‌ చేయనున్నారు.ఈ సినిమాను 2డీతో పాటు 3డీ వర్షన్‌లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వర్షన్‌తో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు జగదేకవీరుడు కథ ఎలా మొదలైందనే విషయాలతో పాటు మూవీ గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు.. అతిలోకసుందరి మూవీ టికెట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైజయంతి మూవీస్ పంచుకుంది.ఈ మూవీ రిలీజైన రోజుల్లో అంటే 1990ల్లో ఒక్క టికెట్‌ కేవలం రూ.6.50 గా ఉండేది. కానీ ఈ మూవీకి విపరీతమైన ‍క్రేజ్ రావడంతో విజయవాడలో మాట్నీ షోలకు ఏకంగా రూ.210 కి బ్లాక్‌లో అమ్మారట. అప్పట్లో 210 రూపాయలు అంటే ఈ రోజు పోలిస్తే రెండు వేలకు పైమాటే. దాదాపు 35 ఏళ్ల క్రితమే ఆ రేంజ్‌లో టికెట్స్ అమ్మారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకేందుకు ఆలస్యం బిగ్‌ స్క్రీన్‌పై చూసి మరోసారి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

Pakistan Again Nuclear Warning To India10
అదే జరిగితే.. భారత్‌కు పాక్‌ మరోసారి అణు బెదిరింపులు

మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్‌ దౌత్యవేత్త మహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్‌ ఆర్‌టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్‌ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్‌ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్‌ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్‌ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్‌ జాతీయులని తేలింది. దీంతో భారత్‌ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్‌ ప్రకటనలు గుప్పిస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement