
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత మేకర్స్ రీ రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాను 2డీతో పాటు 3డీ వర్షన్లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వర్షన్తో ఆడియన్స్కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు జగదేకవీరుడు కథ ఎలా మొదలైందనే విషయాలతో పాటు మూవీ గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు.. అతిలోకసుందరి మూవీ టికెట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైజయంతి మూవీస్ పంచుకుంది.
ఈ మూవీ రిలీజైన రోజుల్లో అంటే 1990ల్లో ఒక్క టికెట్ కేవలం రూ.6.50 గా ఉండేది. కానీ ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ రావడంతో విజయవాడలో మాట్నీ షోలకు ఏకంగా రూ.210 కి బ్లాక్లో అమ్మారట. అప్పట్లో 210 రూపాయలు అంటే ఈ రోజు పోలిస్తే రెండు వేలకు పైమాటే. దాదాపు 35 ఏళ్ల క్రితమే ఆ రేంజ్లో టికెట్స్ అమ్మారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకేందుకు ఆలస్యం బిగ్ స్క్రీన్పై చూసి మరోసారి ఎంజాయ్ చేయండి.