breaking news
Jagadeka Veerudu Athiloka Sundari
-
రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆ సినిమాలకు వెళ్లడంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. అందుకే ఈ మధ్య ఈ రీరిలీజులు ఎక్కువయ్యాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka sundari ) మళ్లీ థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు. దీనికోసం వైజయంతీ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 8 కోట్లవరకు ఖర్చు చేశారు. ఇదంతా అభిమానుల కోసమేచేస్తున్నట్లుగా ప్రకటించారు. వారి అంచనాలకు తగ్గట్టే చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ సినిమాను వీక్షించారు. దీంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.1.75 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. తమ అభిమాన హీరో సినిమా రీరిలీజ్కి ఈ స్థాయి కలెక్షన్స్ రావడం పట్ల మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా విషయానికొస్తే.. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం 1990 మే 9న రిలీజై సంచలనం సృష్టించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి. అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.‘మాస్ట్రో’ ఇళయరాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. -
హిట్ బొమ్మలు 'రీ రిలీజ్'
చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. అదే కోవలో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో హిట్గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజు కావచ్చు.. లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. లేకుంటే ఆ సినిమాకి ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయి. ఆ కోవలో భాగంగా ఈ నెలలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, దేశముదురు, జల్సా, యమదొంగ, వర్షం, ఖలేజా’ వంటి హిట్ బొమ్మలు (చిత్రాలు) ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.... ముప్పై ఐదేళ్ల తర్వాత... ముప్పై ఐదేళ్ల తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్గా నటించారు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ షాలినీ, బేబీ షామిలీ వంటి వారు కీలకపాత్రలుపోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా 1990 మే 9న విడుదలైంది.సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోనిపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా నేడు ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. అప్పట్లో ఈ సినిమాని రీల్ రూపంలో ప్రదర్శించారు. అయితే ఇప్పుడంతా డిజిటల్ మయం కావడంతో రీల్లో రిలీజ్ చేయడం కుదరదు.అందుకే 2018 నుంచి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నెగటివ్ రీల్ కోసం వెతుకులాట మొదలుపెట్టిన యూనిట్కి.. 2021లో విజయవాడలోని అ΄్పారావు అనే వ్యక్తి వద్ద ఒక ప్రింట్ రీల్ దొరికింది. ఆ రీల్ కూడా దుమ్ము, ధూళి పట్టడం.. అక్కడక్కడా గీతలు పడటంతో పెరిగిన సాంకేతికతని బేస్ చేసుకుని ఎంతో శ్రమించి రీల్లోని ఈ సినిమాని 8కే రెజల్యూషన్లో డిజిటలైజ్ చేసి 4కే ఔట్పుట్గా మార్చారు మేకర్స్. ఈ ప్రింట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది. 2డీతోపాటు ఈ చిత్రం 3డిలోనూ విడుదల కానుండటం విశేషం.దేశముదురు మళ్లీ వస్తున్నాడు... తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరోసారి వస్తున్నాడు దేశముదురు. అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘దేశముదురు’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా హన్సిక టాలీవుడ్కి పరిచయమయ్యారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2007 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి సిక్స్ప్యాక్ బాడీలో కనిపించారు అల్లు అర్జున్. సన్యాసిగా మారిన వైశాలిని (హన్సిక) ప్రేమించి, ఆ ప్రేమకథను సుఖాంతం చేసుకునే బాల గోవింద్పాత్రలో అల్లు అర్జున్ నటించారు. ఈ చిత్రానికి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పట్లో ఈ సినిమాలోనిపాటలు ట్రెండ్సెట్టర్గా నిలిచాయనడం అతిశయోక్తి కాదు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ సినిమా పద్దెనిమిదేళ్ల తర్వాత రీ రిలీజ్కి ముస్తాబైంది. ఈ నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు మేకర్స్. కరో కరో జల్సా... ‘హే సరిగమ పదనిస కరో కరో జర జల్సా...’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు పవన్ కల్యాణ్. ఆయన హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జల్సా’. ఇలియానా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలోపార్వతీ మిల్టన్, కమలినీ ముఖర్జీ, ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, అలీ, ముఖేష్ రిషి వంటి వారు కీలకపాత్రలుపోషించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 2008 ఏప్రిల్ 1న రిలీజై హిట్గా నిలిచింది. నక్సలైట్ (మావోయిస్టు) నుంచి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన సంజయ్ సాహుపాత్రలో పవన్ కల్యాణ్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్లస్గా మారింది. 17ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ నెల 16న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. పుట్టినరోజు కానుకగా... ‘రేయ్.. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో... పులితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు... సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’ అంటూ ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు ఎంతపాపులర్ అయ్యాయో తెలిసిందే. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమదొంగ’. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్గా నటించగా మంచు మోహన్బాబు, మమతా మోహన్దాస్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఖుష్బు వంటి వారు కీలకపాత్రలుపోషించారు.హీరోయిన్ రంభ ఈ చిత్రంలో ‘నాచోరే నాచోరే...’ అంటూ ఎన్టీఆర్తో కలిసి తనదైన డ్యాన్సుతో అదరగొట్టారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రాజా అనే దొంగపాత్రలో ఎన్టీఆర్ నటించారు. యమధర్మ రాజుపాత్రలో మోహన్బాబు నట విశ్వరూపం చూపించారు. రమా రాజమౌళి సమర్పణలో చెర్రీ, ఊర్మిళ నిర్మించిన ఈ సినిమా 2007 ఆగస్టు 15న రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాదు.. ఎన్టీఆర్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం కూడా ప్లస్ అయ్యింది. ఈ సినిమాని 17 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు.వర్షం వస్తోంది... మండు వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులపై చల్లని వర్షపు జల్లులు కురిపించనున్నారు ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘వర్షం’. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. హీరో గోపీచంద్ విలన్పాత్రపోషించారు. ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘ఈశ్వర్, రాఘవేంద్ర’ వంటి చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన మూడో చిత్రం ‘వర్షం’. ఈ చిత్రం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది.అంతేకాదు కెరీర్ ఆరంభంలో యూత్లో ప్రభాస్కు మంచి ఫాలోయింగ్ని, ఫ్యాన్స్ని తెచ్చిపెట్టిన చిత్రం ఇదే. వెంకట్ (ప్రభాస్), శైలు (త్రిష) ప్రేమకథకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రభాస్–గోపీచంద్ మధ్య వచ్చేపోరాట సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా 25 ఏళ్ల తర్వాత ‘వర్షం’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 23న 4కే వెర్షన్లో ఈ సినిమా విడుదలవుతోంది. మళ్లీ ఖలేజా... హీరో మహేశ్బాబు ఖలేజా చూపించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్బాబు, అనుష్క జోడీగా నటించిన చిత్రం ‘ఖలేజా’. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్, అలీ, తనికెళ్ల భరణి, ప్రకాశ్రాజ్, రావు రమేశ్ కీలకపాత్రలుపోషించారు. ఎస్. సత్యరామ్మూర్తి సమర్పణలో సింగనమల రమేశ్బాబు, సి. కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం 2010 అక్టోబరు 7న విడుదలైంది. మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం, మణిశర్మ సంగీతంలోనిపాటలకు మంచి స్పందన రావడం... వంటి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వెండితెర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.కానీ, బుల్లితెర ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమాని విరగబడి చూసేవాళ్లు ఉన్నారనడం అతిశయోక్తి కాదేమో. బహుశా.. అందుకేనేమో.... పద్నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాని మరోసారి వెండితెర ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ నెల 30న ‘ఖలేజా’ రీ రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నారట చిత్రయూనిట్. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి... ప్రచారంలో ఉన్నట్లు ‘ఖలేజా’ ఈ నెల 30న రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాలి. బాహుబలి రిటర్న్స్ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ చిత్రం తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న విడుదల కాగా, రెండోభాగం ‘బాహుబలి: ది కన్క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ రెండు చిత్రాలూ బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ అధికారికంగా ప్రకటించారు. అదికూడా కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా రీ రిలీజ్ చేయనున్నారు. అయితే రీ రిలీజ్లో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉంటాయని ఆయన చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అతడొస్తున్నాడుమహేశ్బాబు కెరీర్లో హిట్గా నిలిచిన చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. మహేశ్బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రమిది. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్రాజ్, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం వంటి వారు కీలకపాత్రలుపోషించారు. దుగ్గిరాల కిశోర్, రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2005 ఆగస్టు 10న విడుదలై, హిట్గా నిలిచింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. అది కూడా మహేశ్బాబు బర్త్డే కానుకగా. ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అతడు’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు... ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ వెర్షన్లోకి మార్చి 4కె, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో రిలీజ్ చేయబోతున్నారు. ఇలా రీ రిలీజ్ విషయంలోనూ మహేశ్బాబు సరికొత్త ట్రెండ్ను క్రియేట్ చేయబోతున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
త్రీడీలో జగదేక వీరుడు... అతిలోక సుందరి
జగదేక వీరుడు... అతిలోక సుందరి ఈసారి త్రీడీలో కనిపించి, అలరించనున్నారు. 1990లో ఈ ఇద్దరూ చేసిన సందడిని అప్పటి ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. నేటి తరం ప్రేక్షకులనూ ఈ ఇద్దరూ ఆకట్టుకుంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్పై సి. అశ్వనీదత్ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ 1990 మే 9న విడుదలై, బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు.2డీ ఫార్మాట్తోపాటు 3డీలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయాలని దాదాపు ఏడేళ్ల క్రితమే అనుకున్నారట. 2018లో ఈ చిత్రం నెగటివ్ రీల్ కోసం వెతకడం మొదలుపెట్టిందట చిత్రనిర్మాణ సంస్థ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏదైనా థియేటర్లో ఈ రీల్ ఉందేమో అని వాకబు చేశారు. కొన్ని చోట్ల లభ్యమైనా నాణ్యత లోపించింది. చివరికి 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్ ఒకటి దొరికిందని చిత్రబృందం పేర్కొంది. అయితే అది కూడా దుమ్ము... దూళితో నిండిపోయి మసకబడిపోయిన స్థితిలో ఉండగా.. చిత్రయూనిట్ ఎంతో కష్టపడి పునరుద్ధరణ ప్రారంభించింది. రీల్ కట్ అయిన చోట మరమ్మతు చేసి, జాగ్రత్తగా స్కాన్ చేయించి, ఫ్రేమ్ వారీగా ఉన్న డిజిటల్ స్క్రాచెస్ను తొలగించారు. తర్వాత ఈ చిత్రాన్ని 8కె రెజల్యూషన్ లో డిజిటలైజ్ చేసి, 4కె అవుట్పుట్గా మార్చారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని విధంగా, ఈ చిత్రాన్ని 3డీ రూపంలోకి మార్చే సాహసం చేశామని యూనిట్ అంటోంది. ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో, ప్రైమ్ ఫోకస్ సాయంతో 3డీలోకి మార్చారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నాటి తరంలో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు, ఈ తరం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఈ చిత్రాన్ని పునరుద్ధరించారు. అన్నట్లు... ఈ చిత్రాన్ని ఈ విధంగా మలచడానికి ‘మహానటి, కల్కి’ చిత్రాల ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కృషి చాలా ఉందని సమాచారం. -
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం గురించి పలు పాత విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయింది..? చిరు, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఎంత..? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సోషల్మీడియాలో కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. 35 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల కానుంది.‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. ఇళయరాజా అందించి ట్యూన్స్, దర్శకుడు రాఘవేంద్ర రావు విజన్, డీఓపీ విన్సెంట్, అద్భుతమైన సెట్స్తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం.. పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు ఇలా ఎందరో ఈ సినిమాకు పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ , ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోసం రూ. 2 కోట్లు ఖర్చు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి.మే 9న రీ-రిలీజ కానున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను మీరు చూస్తే రూ. 2 కోట్లతో ఇంతటి రిచ్ సినిమాను నిర్మించారా అంటూ ఆశ్చర్యపోతారు. ఇప్పట్లో అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం కనీసం రూ. 200 కోట్లు పైగానే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదల సమయంలో భారీ వర్షాల వల్ల మొదటి వారం కలెక్షన్స్ పెద్దగా లేవు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ప్రింట్స్ పెరిగాయి. ఎక్కడ చూసిన కూడా థియేటర్స్ నిండిపోయాయి. అలా ఏకంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 15 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు గాను చిరంజీవి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు రెమ్యునరేషన్గా తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. -
జగదేకవీరుడు.. అతిలోకసుందరి.. ప్రింట్ కోసం ఇంత కష్టపడ్డారా?
జగదేకవీరుడు.. అతిలోకసుందరి టీవీల్లో ఎన్నిసార్లు చూసి ఉంటారో లెక్కేలేదు. ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పుడు బుల్లితెరపై కనిపించినా పిల్లలతో పాటు పెద్దలు సైతం టీవీలకే అతుక్కుపోయేవారు. అలాంటి ఈ సినిమాను పెద్దతెరపై చూస్తే ఇంకెంత ఫీలింగ్ ఉంటుంది. ఆ కోరికను తీర్చేందుకే టాలీవుడ్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సిద్ధమైంది.చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరిని రీ రిలీజ్ చేయనుంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. అందుకే అదే తేదీకే ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, చిరంజీవి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ప్రింట్కు సంబంధించిన వైజయంతి మూవీస్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది.ఈ మూవీ ప్రింట్ అంతా పాడయిపోవడంతో మరో కాపీ కోసం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు వెళ్లాల్సి వచ్చిందని నిర్మాత స్వప్నదత్ వెల్లడించారు. ఈ మూవీ రీల్ కోసం తాము చాలా కష్టపడ్డామని.. ప్రత్యేకంగా రిమైండర్ సెట్ చేసుకుని మెసేజ్ చూసుకునే వాళ్లమని తెలిపింది. చివరికీ 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి దగ్గర ఈ సినిమాకు సంబంధించిన ప్రింట్ దొరికిందని తెలిపారు. చాలా రోజులు కావడంతో అది కూడా అంతా దుమ్ము పట్టిపోయి ఉందని.. ఆ రీల్ అంతా పింక్ కలర్లో ఉందని అన్నారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో ఆ ప్రింట్ను 2డీ, 3డీలోకి మార్చినట్లు సాంకేతిక సిబ్బంది వెల్లడించారు.కాగా.. ఈ సినిమాను 2డీతో పాటు 3డీ వర్షన్లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వర్షన్తో ఆడియన్స్కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించిన సంగతి తెలిసిందే.35 years later, the magic returns…💫From Film Reel to Digital Restoration, witness the hard work and meticulous effort that went into bringing #JagadekaVeeruduAthilokaSundari back to the big screen.Experience the timeless epic once again on May 9th, in 2D & 3D.–… pic.twitter.com/yABsIgvsy2— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 5, 2025 -
'చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం.. శ్రీదేవి వల్ల ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది'
తెలుగు చిత్రసీమ చరిత్రలోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం విడుదలై 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మే 9న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మించారు.కాగా.. మే 9వ తేదీ 1990న జగదేక వీరుడు అతిలోక సుందరి థియేటర్లలో విడుదలైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఈ సినిమా తుడిచిపెట్టేసింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనేలా ఈ మూవీ నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు దాని క్రేజ్ గురించి ఒక్క మాటలో ఓ ఉదాహరణగా చెప్పాలంటే.. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్లో రూ. 210 వరకు అమ్మేశారట. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలోని ఎవర్ గ్రీన్ సాంగ్ అబ్బనీ తీయని దెబ్బ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. 'ఈ పాటను ఒక రోజులోపు కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 లేదా 12:30 గంటల ప్రాంతంలో బాగుందా? లేదా వినండి అంటూ ఇళయరాజా మాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు, అశ్వనీదత్తో పాటు నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సింపుల్గా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి సాహిత్యం రాశారు. బాలు, చిత్ర గారు అలా సరదాగా పాడేశారు'అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ‘అందాలలో’ అనే పాట గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. 'కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది. దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించాము. ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన అదే' అని అన్నారు.‘దినక్కుతా’ అనే పాట గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ .. ‘ఈ పాటను షూట్ చేసే టైమ్కి చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో.. మేము అతని శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత, ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళ్లనుంది. మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు’ అని అన్నారు.శ్రీదేవి గతంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గురించి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో తనకు ఇష్టమైన పాట ‘ప్రియతమ’ సాంగ్ అని అన్నారు. అది చాలా అందమైన మెలోడీ. రాఘవేంద్రరావు దానిని ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు, సైగలతోనే కంపోజ్ చేయించారు. అది మరపురాని పాట అని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్లు అజయన్ విన్సెంట్, కె.ఎస్. ప్రకాష్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ‘మాస్ట్రో’ ఇళయరాజా ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్ప్లేను జంధ్యాల అందించారు. ఈ వేసవిలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలాన్ని మే 9న 2డీ, 3డీ ఫార్మాట్లలో చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
జగదేకవీరుడు.. అతిలోకసుందరి.. అప్పట్లోనే రూ.210 రూపాయలా!
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత మేకర్స్ రీ రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాను 2డీతో పాటు 3డీ వర్షన్లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వర్షన్తో ఆడియన్స్కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు జగదేకవీరుడు కథ ఎలా మొదలైందనే విషయాలతో పాటు మూవీ గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు.. అతిలోకసుందరి మూవీ టికెట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైజయంతి మూవీస్ పంచుకుంది.ఈ మూవీ రిలీజైన రోజుల్లో అంటే 1990ల్లో ఒక్క టికెట్ కేవలం రూ.6.50 గా ఉండేది. కానీ ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ రావడంతో విజయవాడలో మాట్నీ షోలకు ఏకంగా రూ.210 కి బ్లాక్లో అమ్మారట. అప్పట్లో 210 రూపాయలు అంటే ఈ రోజు పోలిస్తే రెండు వేలకు పైమాటే. దాదాపు 35 ఏళ్ల క్రితమే ఆ రేంజ్లో టికెట్స్ అమ్మారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకేందుకు ఆలస్యం బిగ్ స్క్రీన్పై చూసి మరోసారి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రీ రిలీజ్
-
త్రీడీలో జగదేక వీరుడు అతిలోక సుందరి
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత రీ–రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మే 9న ఈ చిత్రం రీ రిలీజ్కు సిద్ధమైంది. అది కూడా 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల కానుంది. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వెర్షన్తో ఆడియన్స్కు సరికొత్త అనుభూతినివ్వబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఇళయరాజా. -
మే 9.. మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్
మే 9న అనగానే తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన రోజు అని అంటారు. ఎందుకంటే అదే రోజున రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిరు చిత్రాలు ఆ రోజున రిలీజైనవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు అదే తేదీన మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్ ఉండబోతున్నాయి.మొదటి దాని విషయానికొస్తే రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతడి మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9నే ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాల్ని పెట్టగా.. ఇప్పుడు చరణ్ ఆ లిస్టులోకి చేరబోతున్నాడు.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) మరోవైపు చిరు కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒకటి. దీన్ని మే 9న రీ రిలీజ్ చేయబోతున్నారు. 2డీ, 3డీ వెర్షన్ తో ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో మే 9నే ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇలా ఒకేరోజున మెగా అభిమానులకు రెండు ట్రీట్స్ రాబోతున్నాయనమాట. లెక్క ప్రకారం మరొకటి కూడా ఉండాలి. అదే 'హరిహర వీరమల్లు'. పవన్ కల్యాణ్ నటించిన ఈ లేటెస్ట్ చిత్రాన్ని మే 9నే రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఈసారి కూడా వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) -
అజిత్, షాలినితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ‘విశ్వంభర’ సెట్స్లో అడుగుపెట్టారు చిరంజీవి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఆషికా రంగనాథ్ కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్లో అడుగుపెట్టేసింది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రాన్ని వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ని హైదరాబాద్లో చిత్రీకరించారు. అయితే, తాజాగా విశ్వంభర సెట్స్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.హైదరాబాద్లో జన్మించిన అజిత్సౌత్ ఇండియాలో టాప్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. హైదరాబాద్లో జన్మించిన అజిత్ పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన 'ప్రేమ పుస్తకం'తో ప్రారంభించాడు. ఈ సినిమాను కూడా ఆప్పట్లో మెగాస్టార్ చిరంజీవినే లాంచ్ చేశారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో అజిత్ పెళ్లి చేసుకున్నాడు.నా చేతుల మీదుగా లాంచ్ అయ్యాడు: చిరంజీవిఅయితే, అజిత్ విశ్వంభర సెట్స్లో అడుగుపెట్టడం పట్ల చిరంజీవి ఇలా చెప్పుకొచ్చారు. 'నిన్న సాయంత్రం 'విశ్వంభర' సెట్స్కి స్టార్ గెస్ట్గా వచ్చి అజిత్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. అజిత్ సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అజిత్ తొలి సినిమా 'ప్రేమ పుస్తకం' ఆడియో లాంచ్ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిగింది. ఆ సమయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ గడిపాం. ఇంకా చెప్పాలంటే అజిత్ జీవిత భాగస్వామి షాలిని కూడా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో నటిచింది. ఆ సినిమాలోని చిన్నపిల్లల పాత్రలో ఆమె ఒకరు. అలా అజిత్తో గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అజిత్ స్టార్డమ్ శిఖరాలను దాటేసింది. దానిని చూసి నేను చాలా సంతోషించాను.' అని మెగాస్టార్ అన్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?
'కల్కి' నిర్మాతలు మరోసారి సీరియస్ అయ్యారు. డార్లింగ్ ప్రభాస్ సినిమా విషయంలో నోటీసు ఇచ్చి ఇరవై రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో మూవీ విషయంలో లీగల్గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది కూడా అప్పుడెప్పుడో 1990లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' కోసం. ఇలా సడన్గా సోషల్ మీడియాలో చిరు క్లాసిక్ హిట్ సినిమాపై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ అసలేంటి గొడవ? ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: రాజమౌళి బర్త్డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?) అసలు ఏమైంది? టాలీవుడ్లో వైజయంతీ మూవీస్ ప్రముఖ నిర్మాణ సంస్థ. నిర్మాత అశ్వనీదత్ అప్పట్లో సినిమాలు తీశారు. కానీ ఇప్పటి జనరేషన్కి తగ్గట్లు మూవీస్ తీయలేకపోయారు. నిర్మాణం ఆపేశారు. దీంతో ఆయన కూతుళ్లు నిర్మాతలుగా మారారు. 'మహానటి', 'సీతారామం' లాంటి హిట్ సినిమాలతో మళ్లీ లైన్లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ పెట్టి 'కల్కి' అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీస్తున్నారు. కొన్నాళ్ల ముందు 'కల్కి' నుంచి ఓ ఫొటో లీక్ కావడం, అది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేసరికి నిర్మాతలు సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే దాన్ని షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబరు 21న ఈ నోటీసు విషయమై ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇది జరిగి 20 రోజులు కూడా కాలేదు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కాపీరైట్స్ విషయమై ప్రకటనతో పాటు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. (ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి) ఆ సినిమాపై పరోక్షంగా? ఈ పోస్ట్ ప్రకారం.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలోని స్టోరీ, కాన్సెప్ట్, పాత్రలు ఇలా దేన్ని కూడా తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీల్లేదని.. ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటనతో పాటు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇలా సడన్గా ఎందుకు సీరియస్ అయ్యారా అనేది చాలామందికి అర్థం కాలేదు. అయితే చిరు 157వ సినిమాని ఉద్దేశిస్తూనే పరోక్షంగానే ఈ నోటీస్ ఇచ్చారా అనేది డౌట్ కొందరికి వస్తోంది. ఎందుకంటే 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ్ దర్శకత్వంలో చిరు చేస్తున్న ఈ సినిమాకు 'ముల్లోకవీరుడు' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ మూవీ కాన్సెప్ట్.. హీరో, వేరే లోకానికి వెళ్లడం అక్కడ దేవకన్యలని కలవడం ఇలానే ఉండబోతుందని అంటున్నారు. చూస్తుంటే 'జగదేకవీరుడు అతిలోక సుందరి'తో పోలికలు కనిపిస్తున్నాయి కదా! అందుకే 'వైజయంతీ' సంస్థ ఎవరు కాపీ కొడుతున్నారు? లేదా కొట్టాలని ట్రై చేస్తున్నారనేది పేరు చెప్పకుండా నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే
మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజును నేడు (ఆగష్టు 22) జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్కు ఇది పండుగరోజు. కానీ ఈ మధ్యే చిరంజీవి కాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరగడం. అదీ కాకుండా చిరంజీవి నటించిన 'భోళాశంకర్' సినిమా పెద్ద డిజాస్టర్గా మిగలడం వంటి చేదు గుర్తుల నుంచి వారు బయటపడేందుకు మెగస్టార్ పుట్టినరోజు ఒక టానిక్లా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు ఆయన కొత్త సినిమా ప్రకటన కూడా ఉండటంతో వారు మరింత జోష్లో ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోస్ చిరంజీవినే ఇన్స్ఫరేషన్ తీసుకుంటారు. ఎందుకంటే మిగిలిన హీరోలతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం చాలా భిన్నంగా ఉంటుంది. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ,వాల్తేరు వీరయ్య మినహా మిగిలిన ఏ సినిమా అంతగా ఆకట్టుకోలేదు... సైరా సినిమాలో ఆయన నటన మెప్పించినా కలెక్షన్స్ పరంగా నష్టాలే తెచ్చిందని చెప్పవచ్చు ఒకరకంగా చిరంజీవి 1990 నాటి సమయంలో తన సినీ కెరీర్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఎలా మళ్లీ నిలదొక్కుకున్నాడంటే... 1990 దశకంలో ఏం జరిగింది 1990 సమయంలో కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమసింహం, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు వరుసగా వచ్చాయి. ఇవన్నీ ఒక సునామిలా భారీ కలెక్షన్స్తో ఇండస్ట్రీలో దుమ్మురేపాయి. కానీ 1993లో వచ్చిన 'ముఠామేస్త్రి' తర్వాత చిరంజీవి కెరియర్ కొంచెం తటపటాయించింది. ఆ పాట కోసం 500 మంది డ్యాన్సర్లు ఆ సమయంలో 'మెకానిక్ అల్లుడు' సినిమా లాంచ్ అయ్యింది. చిరంజీవిపై అభిమానంతో కనీసం కథ కూడా వినకుండా అక్కినేని నాగేశ్వరావు మెకానిక్ అల్లుడులో చేశారు. అలా వారిద్దరి క్రేజీ కాంబినేషన్లో సినిమా అనేసరికి అభిమానులు విపరీతంగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత కాగా బి గోపాల్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో 'ఝుమ్మని తుమ్మెద వేట' సాంగ్ కోసం అప్పట్లో రూ.25 లక్షలు ఖర్చు పెట్టారు. అప్పట్లో అదో రికార్డు. 7 రోజుల షూటింగ్... 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. ఇన్నీ హంగు ఆర్భాటాలు ఉన్నా కూడా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ పోలీస్ రియల్ లైఫ్ స్టోరీనే ఈ సినిమా ఆ తర్వాత అంజనా ప్రొడక్షన్స్ నుంచి తొలి సినిమా 'ముగ్గురు మొనగాళ్లు' వచ్చింది. అందులో చిరంజీవి త్రిపాత్రాభినయం చేశారు. దీనికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, నగ్మా, రోజా వంటి క్రేజీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆయనకు భారీగా నష్టాన్ని తెచ్చింది. ఆ తర్వాత ఎస్పీ 'పరుశురాం' సినిమా రిలీజ్ అయింది. తమిళనాడులో ఉండే వాల్టర్ అనే పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం అప్పట్లో బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న శ్రీదేవిని పిలిపించి అందుకు గాను భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి చేపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఆ సినిమా చుట్టూ ఎన్నో విమర్శలు అలా బ్యాక్ టూ బ్యాక్గా చిరంజీవికి డిజాస్టర్ సినిమాలు వస్తున్న సమయంలో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో మాస్ మసాలా ఎంటర్టైనర్ 'అల్లుడా మజాకా' వచ్చింది. సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. సినిమాలో బోల్డ్ సీన్లు ఉన్నాయని, సెన్సార్ వాళ్లు దీనిని పూర్తిగా నిషేధించాలని పలువురు కోరారు. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న చిరంజీవికి ఇది మరో దెబ్బ . అలాంటి సమయంలో చిరంజీవి అభిమానులు చాలా చోట్ల రోడ్డు మీదకి వచ్చి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పట్టుబట్టి ఎదోలా సినిమా రిలీజ్ అయ్యేలా చేసుకున్నారు. చిరంజీవి మార్కెట్ ఏంటో గుర్తుచేసిన సినిమా ఇదే మొత్తానికి 'అల్లుడా మజాకా' సినిమా థియేటర్లో పడింది. ఆపై విజయఢంకా మోగించింది. అప్పటి వరకు సుమారు 3 ఏళ్లకు పైగా ప్లాపుల్లో ఉన్న చిరంజీవి సినిమా మార్కెట్పై అంచనాలు తగ్గాయి. ఈ సినిమా విడుదలతో ఆయన మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ సినిమా భారీ కలెక్షన్స్తో పాటు పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆ తర్వాత 1995లో మళ్లీ బిగ్బాస్, రిక్షావోడు రెండూ భారీ డిజాస్టర్లే చిరుకు దక్కాయి. తెలుగులో ఫస్ట్ డాల్బీ సిస్టమ్ ఆడియో ఉన్న సినిమా రిక్షావోడు. చిరు కెరీర్లో సినిమాలకు దూరంగా ఈ సినిమాతోనే 'రూప్ తేరా మస్తానా' తెలుగులో మొదటి ర్యాప్ సాంగ్ను ఇండస్ట్రీకి చిరంజీవి పరిచయం చేశారు. ఈ సినిమా కోసం డ్యాన్స్, నటన విషయంలో ఎంతో కష్టపడి సినిమా తీస్తే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అప్పట్లో ఈ సినిమా ఫలితాన్ని ఏ మాత్రం ఊహించలేదని చిరంజీవి కూడా చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే మెగాస్టార్ మొట్టమొదటిసారి తన కెరీర్లో బ్రేక్ తీసుకున్నారు. ఏ సినిమా షూటింగ్కు వెళ్లకుండా .. కనీసం కథ కూడా వినకుండా సుమారు సంవత్సరం పాటు ఉన్నారు. ఈ సినిమాతో వెంటనే బ్లాక్బస్టర్ కొట్టిన చిరు అప్పటి వరకు సంవత్సరానికి 3 లేదా 4 సినిమాలు తీసే చిరంజీవి 1996లో మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ఆ తర్వాత 1997లో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ నుంచి 'హిట్లర్'గా మెగాస్టార్ తిరిగొచ్చారు. ఒకరకంగా ఆయనకు ఇదీ కం బ్యాక్ సినిమా అని చెప్పవచ్చు. 49 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. ఆ వెంటనే రజనీ కాంత్ 'భాషా' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సురేష్ కృష్ణతో చిరంజీవి 'మాస్టర్' సినిమాను ఒప్పుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెలుగులో మొట్టమొదటి డిటిఎస్ సౌండ్ సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పడిలేచిన కెరటం 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాతో అంజన ప్రొడక్షన్స్ అందుకున్న డిజాస్టర్ను చిరంజీవి మరిచిపోలేదు. 1998లో అదే ప్రొడక్షన్లో 'బావగారు బాగున్నారా' సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో 54 సెంటర్లలో 100రోజులు ఆడింది. అలా ఆయన పడిలేచిన కెరటంలా తన జర్నీని కొనసాగించారు. అందుకే చాలామంది యంగ్ హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్తు ఉంటారు. వరుస డిజాస్టర్ల తర్వాత హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా,చూడాలని ఉంది,స్నేహం కోసం,అన్నయ్య వంటి చిత్రాలు వచ్చాయి. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమాలు అంతగా ప్రేక్షకాధరణ పొందలేదనే చెప్పవచ్చు. ఇండస్ట్రీలో స్టామినా ఉన్న హీరోకు ఒక్క హిట్ సినిమా పడితే చాలు రికార్డులన్నీ గల్లంతు అవుతాయని చెప్పడానికి. రాబోయే రోజుల్లో ఆయన నుంచి అలాంటి హిట్ సినిమా తప్పకుండా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి ఆయన ఎప్పటికీ మెగాస్టారే... -
జగదేకవీరుడు సినిమా ప్రభాస్ కల్కి రిలీజ్ కి లింక్ ఏంటి?
-
హీరోలకు సమానంగా శ్రీదేవి పారితోషికం.. ఆ సినిమాలో ఎంతంటే ?
Chiranjeevi Sridevi Remuneration In Jagadeka Veerudu Athiloka Sundari: మెగాస్టార్ చిరంజీవి నటనలో, అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అందం, అభినయంలో ఎవరికీ వారే సాటి. వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అద్భుతమైన క్లాసిక్ చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమాతోనే శ్రీదేవికి 'అతిలోక సుందరి' అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం సినీ అభిమానులను అబ్బురపరిచింది. ఒక అందమైన లోకంలో విహరించేలా చేసింది. 1990 మే 9న విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి రూ. 15 కోట్లు వసూలు చేసింది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాను ఆ సమయంలో రూ. 9 కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మించారట. ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అందులో నటీనటుల రెమ్యునరేషన్ గురించి చెబుతూ చిరంజీవికి సుమారు రూ. 35 లక్షలు, శ్రీదేవికి రూ. 25 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో శ్రీదేవికి ఫుల్ క్రేజ్ ఉందని, హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేదన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉందని, కానీ ఆచరణలోకి ఇంకా రాలేదని పేర్కొన్నారు. ఈ సినిమాలో సుందరం మాస్టారు, ప్రభుదేవా కొరియోగ్రఫీతో పాటు మాస్ట్రో ఇళయరాజా సంగీతం కూడా హైలెట్గా నిలిచాయి. -
మే9 : తెలుగు ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్..ఎందుకంటే..
మే9..టాలీవుడ్లో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన రోజు ఇది. హీరో, హీరోయిన్లకు స్టార్ స్టేటస్తో పాటు దర్శక, నిర్మాతలక కాసుల వర్షం కురిపించిన రోజు. అందుకే క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం ఎప్పటికీ లక్కీ డేనే. ఎందుకంటే మే9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈరోఉ (మే9)న విడుదలయినవే. మరి ఆ హిట్ చిత్రాలేంటో చూసేద్దామా? జగదేకవీరుడు అతిలోకసుందరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1990 మే9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, శ్రేదేవిలకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్గ్రీన్గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ రిలీజ్కు కొన్ని వారాల ముందే రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేశాయట. అయినా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా సంగీతం సంగీత ప్రియులను ఆకర్షించి సినిమా విజయంలో భాగమైంది. గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. 1991లో విడుదలైన ఈ చిత్రం ముప్పైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. ఈ చిత్రంలోని మెగాస్టార్ నటన, స్టైల్, డ్యాన్స్ యూత్ను కట్టిపడేశాయి. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లవుతుంది. అయిన ఇందులో చేయి చూడు ఎంత రఫ్ ఉందో.. రఫాడిస్తా అనే పవర్ ఫల్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ప్రేమించుకుందాం రా వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడంతో సెంటిమెంట్గా ఆమెను వద్దనుకున్నారట. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ అయిన సంగతి తెలిసిందే లవ్ స్టోరీస్లో సరికొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. సంతోషం నాగార్జున, శ్రియ, గ్రేసీసింగ్, ప్రభుదేవా నటించిన ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాయగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. నాగార్జున కెరియర్లోనే బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిందీ ఈ చిత్రం. మహానటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు గాను నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై క్లాసిక్ హిట్గా నిలిచింది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినీ పాండేలు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియా దత్, స్వప్న దత్లు ఈ మూవీని నిర్మించారు. మహర్షి మహేష్బాబు హీరోగా మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. -
104 డిగ్రీల జ్వరంతో ధినక్ తా ధినక్ రో...
స్క్రీన్ మీద మాస్ హీరో చిరంజీవి, అందాల సుందరి శ్రీదేవి ‘ధినక్ తా ధినక్ రో..’ అంటూ డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తున్న ప్రేక్షకులకు ఒకటే హుషారు. అభిమానులు కూడా థియేటర్లో స్టెప్పులేశారు. హీరోయిన్లు ఎలానూ పాటల్లో గ్లామరస్గా కనిపిస్తారు. హీరోలు కూడా హ్యాండ్సమ్గా కనిపిస్తారు. ఈ పాటలో చిరంజీవి అలానే కనిపించారు. అయితే ఈ పాట చిత్రీకరించినప్పుడు ఆయన 104 డిగ్రీల జ్వరంతో ఉన్నారు. నేటితో (మే 9) ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలై 30 ఏళ్లయింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని విశేషాలను వైజయంతీ సంస్థ పంచుకుంది. ‘దినక్ తా ధినక్ రో’.. పాటకు వాహినీ స్టూడియోలో భారీ సెట్ వేశాం. షూటింగ్ అయిపోగానే శ్రీదేవి హిందీ సినిమా షూటింగ్కు ఫారిన్ వెళ్లిపోవాలి. కానీ చిరంజీవికి 104 డిగ్రీల హై ఫీవర్. రిలీజ్ డేట్ మే 9 అని ప్రకటించాం. చిరంజీవి హై ఫీవర్తోనే షూటింగ్కు రెడీ అయ్యారు. ఒక డాక్టర్ సెట్లో ఉండేట్లు ప్లాన్ చేసుకున్నాం. అనకున్న తేదీకి విడుదల చేయగలిగామంటే చిరంజీవియే కారణం. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతదర్శకుడు. ట్యూన్స్ అన్నీ మెలోడీవే. కానీ చిరంజీవి, శ్రీదేవి అంటే మాస్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా? రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వేటూరి ‘ఇదే ట్యూన్ ని మాస్ సాంగ్ చేస్తాను చూడండి’ అంటూ ‘అబ్బ నీ తీయనీ దెబ్బ’ అని రాశారు. ఈ పాటని రాఘవేంద్రరావు మైసూర్, బెంగళూర్లలో జస్ట్ రెండే రోజుల్లో ఫినిష్ చేశారు. కానీ ‘అందాలలో మహోదయం’ పాటకు మాత్రం 11 రోజులు పట్టింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్నీ మ్యాజికల్గా చూపించిన డీఓపీ విన్సెంట్ గారు, అద్భుతమైన సెట్స్తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం, ఎడిటింగ్ స్కిల్తో సినిమాకి సూపర్ టెంపోనిచ్చిన చంటి, పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు.. ఇలా ఎందరో. ఎన్నో రకాలుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ . ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్. -
ఫస్ట్లుక్ 5th July 2018