breaking news
realease
-
జగదేకవీరుడు.. అతిలోకసుందరి.. అప్పట్లోనే రూ.210 రూపాయలా!
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత మేకర్స్ రీ రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాను 2డీతో పాటు 3డీ వర్షన్లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వర్షన్తో ఆడియన్స్కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు జగదేకవీరుడు కథ ఎలా మొదలైందనే విషయాలతో పాటు మూవీ గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు.. అతిలోకసుందరి మూవీ టికెట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైజయంతి మూవీస్ పంచుకుంది.ఈ మూవీ రిలీజైన రోజుల్లో అంటే 1990ల్లో ఒక్క టికెట్ కేవలం రూ.6.50 గా ఉండేది. కానీ ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ రావడంతో విజయవాడలో మాట్నీ షోలకు ఏకంగా రూ.210 కి బ్లాక్లో అమ్మారట. అప్పట్లో 210 రూపాయలు అంటే ఈ రోజు పోలిస్తే రెండు వేలకు పైమాటే. దాదాపు 35 ఏళ్ల క్రితమే ఆ రేంజ్లో టికెట్స్ అమ్మారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకేందుకు ఆలస్యం బిగ్ స్క్రీన్పై చూసి మరోసారి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
పక్క పార్టీల పథకాలు కాపీ కొడుతున్న చంద్రబాబు..!
-
మూడు భాషల్లోకి ప్రియా వారియర్ సినిమా
ఒక్క కనుసైగతో దేశ వాప్తంగా పాపులర్ అయిన మళయాల నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం ఆమె నటించిన ఒరు అదార్ లవ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రియ పాపులారిటీని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సినిమా దర్శక, నిర్మాతలు. ఈ చిత్రాన్ని మరో మూడు భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో ప్రియకు జోడీగా రోషన్ అబ్దుల్ రహూఫ్ నటిస్తున్నాడు. ఒమర్ లులు దర్శకత్వం వహించగా, ఒసెపచ్చన్ ఒళకుంజి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియ పాపులారిటీ దర్శక, నిర్మాతలకు ఏమేరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలిమరి. -
‘కాపు సత్యాగ్రహ యాత్ర’ పోస్టర్ ఆవిష్కరణ
బోట్క్లబ్ (కాకినాడ) : స్థానిక కాపు కల్యాణమండపంలో సోమవారం ‘కాపు సత్యాగ్రహ యా త్ర’ పోస్టర్ను కాపు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, జిల్లా కాపు సద్భావన సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చుతామని ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. తుని ఘటన కొన్ని దుష్టశక్తులు కారణంగా జరిగిందని స్పష్టం చేశారు. కాపు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో తీసుకు వెళ్లేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కాపు జేఏసీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోను కాపు జేఏసీ ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొనుల తాతాజీ, రావూరి వేంకటేశ్వర్ారవు, పసుపులేటి చంద్రశేఖర్, పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు -
థింకింగ్, మేకింగ్ ఢిఫరెంట్ ‘కాలాయా తస్మై నమః’
కాలాన్ని నమ్మిన కళాకారులు ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షణ సినిమాయే లోకంగా అన్వేషణ తొలి ప్రయత్నమే విభిన్నం ‘సాక్షి’తో చిత్ర యూనిట్ సాక్షి,విశాఖపట్నం : సినిమా తీయాలనే కల వారిది..ఒక్క ఛాన్స్ వస్తే చాలు తామేంటో నిరూపించుకోవాలనే ఆశ వారిది. కానీ అందరిలా వారు ఆలోచించలేదు. తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. వెండితెరపైకి వస్తున్నామంటే తమవైపు ప్రపంచం చూడాలనుకున్నారు. ‘కాలమే దైవం’ అని నమ్మి ‘కాలాయా తస్మై నమః’ మొదలుపెట్టారు. టైటిల్లోనే వెరైటీ కనిపిస్తోంది. కానీ పేరు చూసి థియేటర్కు వచ్చే ప్రేక్షకుల మాత్రమే సరిపోరు. ఇంకా ఏదో కావాలి. జనాన్ని ఆకర్షించాలి. దానికోసం తమ చిత్రంలో ఏదోఒక ప్రత్యేకత చూపించాలనుకున్నారు. ఎప్పుడో 1987 సెప్టెంబర్ 10న పుష్పక విమానం వచ్చింది. కమల్హాసన్ నటనకు జనం బ్రహ్మర«థం పట్టారు. ఆ తర్వాత తెలుగులో మూకీ చిత్రాలు రాలేదు. కాలాయా తస్మై నమః చిత్రాన్ని మూకీలో తీస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు. చిత్ర క«థ ఎమోషన్స్పై ఆధారపడి ఉంటుంది. సినిమా మొత్తం హావభావాలతోనే ముడిపడిఉంటుంది. అలాంటప్పుడు మాటలతో పనేముందనుకున్నారు. ఇంకా సంతప్తి కలగడం లేదు. సాంకేతికంగా కూడా జనం మాట్లాడుకుకోవాలంటే గ్రాఫిక్స్ ఉండాలి. కానీ ఈ చిత్రం 1980లో ఓ పల్లెటూరి జరిగే కథ కావడంతో సహజంగానే ఉండాలనుకున్నారు. మరెంచేయాలని తీవ్రంగా మదనపడుతున్న తరుణంలో స్లోమోషన్ టెక్నిక్లో తీస్తే కొత్తగా ఉంటుందనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. సాధారణంగా ఏ చిత్రానైనా 24 ఫ్రేమ్స్లో తీస్తారు. కానీ ఈ సినిమా స్లోమోషన్లో 40 ఫ్రేమ్స్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇంకేం విభిన్న టైటిల్, తొలి భారత్లో పుష్పక విమానం తర్వాత తొలి మూకీ, ప్రపంచంలో తొలి స్లో మోషన్ చిత్రంగా కాలాయా తస్మై నమః సిద్ధమైంది. ఇన్ని విశేషాలున్న చిత్రంలో నటించాలంటే అత్యంత అనుభవజ్ఞులైన నటీనటులు కావాలి. కానీ దీనిలో అందరూ కొత్త వాళ్లే నటించడం మరో విశేషం. మూకీ చిత్రానికి మ్యూజిక్ అందించడమంటే కత్తిమీద సామే. దానిని అత్యంత ప్రభావవంతంగా చేసి చూపించాడు మ్యూజిక్ డైరెక్టర్ రాంనారాయణ్. నిజానికి ఈ చిత్రానికి ఆయన అందించిన సంగీతమే ప్రాణం. కో డైరెక్టర్లుగా ఉదయ్ శంకర్ దార్ల,భరత్ జె, అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీకాంత్, అసోసియేట్ డైరెక్టర్గా ఫ్రీడం వాసు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్గా అజ్గర్ అలీ పనిచేసిన ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసిన తర్వాత వాసు, సాయిరమేష్గౌడ్లు నిర్మాతలుగా మారారు. థియేటర్ల కోసం చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ చిత్రం కూడా రుచి చూసింది. అయితేనేం చివరికి పవన్ కల్యాణ్ బర్త్డే గిఫ్ట్గా ఈ నెల 2న ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. ‘సాక్షి’ కోసమే తొలిసారి: దర్శకుడు పూరీ జగన్నాథ్ నేతత్వంలో ‘సాక్షి’ నిర్వహించిన పూరీ ఐడియాస్ టెన్ కాంటెస్ట్ కోసం తొలిసారి షార్ట్షిల్మ్ నటుడిగా మారాను. మూడేళ్లు విప్రోలో ఉద్యోగం చేసినా సినిమా పిచ్చితో దానిని వదిలేశాను. రాకేష్రెడ్డి దర్శకత్వంలో వచ్చిన షార్ట్ఫిల్మ్ డర్టీ పిక్చర్తో నటుడిగా ఆవిష్కతమయ్యాను. కాలాయా తస్మై నమః వంటి విభిన్న చిత్రంతో వెండి తెరకు పరిచయం కావడం అదష్టం. ఈ చిత్రంలో ‘ఈసు’ అనే రికార్డింగ్ డాన్సర్గా నటించాను. ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టర్ ఓ హీరో. –నరేష్ నాయుడు, హీరో రొటీన్కు భిన్నంగా ఉండాలని: ఏడేళ్లు రక్షణ రంగంలో సేవలందించి వచ్చిన తర్వాత సినిమాయే జీవితంగా మారింది. చిన్నప్పుడు మా అమ్మ సినిమాలు బాగా చూసేది. బహుశా ఆ ప్రభావం నాపై పడినుట్టుంది. లవ్ఇన్వైజాగ్, డర్టీ పిక్చర్ వంటి షార్ట్ షిల్మ్స్ తర్వాత వెండి తెరపై దర్శకుడిగా నా పేరు ఒక్కసారైనా చూసుకోవాలనే కలను నిజం చేసుకోవడానికి కాలాయా తస్మై నమః మొదలుపెట్టాను. పవన్ కల్యాణ్ అంటే ఇష్టంతో ఆయన పుట్టినరోజు కానుకగా చిత్రాన్ని విడుదల చేశాం. రామ్గోపాల్వర్మ ప్రభావం నాపై ఎక్కువ. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెల్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. జేమ్స్ కామెరూన్ తన చిత్రాల్లో ఎమోషన్స్కి ప్రాధాన్యమిస్తారు. అదే ఈ చిత్రంలోనూ ఉంటుంది. ఇళయరాజా సంగీతంపై ఉన్న పిచ్చితో ఈ చిత్రంలో ఓ సీన్ బ్యాక్డ్రాప్లో ఆయన స్వరపరిచిన గీతం వినిపించాం. ఈ చిత్రం తర్వాత ‘రంగీలా’ అనే మరో విభిన్న చిత్రానికి, ‘జంతువు’ టైటిల్తో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాను. –రాకేష్రెడ్డి, దర్శకుడు హావభావాలతోనే వేల పదాలు ఎందుకో తెలియదు..సినిమా అంటే పిచ్చి..హీరోయిన్గా నన్ను నేను నిరూపించుకోవడం కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నా. షార్ట్ ఫిల్మ్స్ లవ్ఇన్ వైజాగ్, డర్టీ పిక్చర్లలో గుర్తింపు వచ్చింది. డర్డీ పిక్చర్లో నా పాత్ర పెను దుమారాన్నే లేపింది. అయితే మన దగ్గర నార్త్ హీరోయిన్లకు ఉన్న డిమాండ్ తెలుగు వాళ్లకు లేదు. అందుకే మా కంటూ ప్రత్యేకత చూపించాలి. తొలి చిత్రంతోనే అలాంటి అవకాశం రావడం అదష్టం. ఈ చిత్రంలో మల్లి అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశాను. కేవలం హావభావాలతోనే నా చేత వేల పదాలను డైరెక్టర్ రాకేష్రెడ్డి పలికించారు. –రేఖా భోజ్, హీరోయిన్ చాలా కష్టపడ్డాం బాల నటుడిగా చేసే అవకాశం వచ్చినపుడు సినీ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియకపోవడంతో పెద్దవాళ్లు వద్దన్నారు. కానీ అప్పుడే నా దష్టి సినిమాలపై పడింది. ఇంజినీరింగ్ చదివినప్పటికీ నటనవైపే మొగ్గుచూపాను. 13 షార్ట్షిల్మ్స్లో నటించాను. డర్టీపిక్చర్లో నటనను చూసిన ఆ షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ రాకేష్ రెడ్డి, తన తొలి చిత్రంలో విలన్గా నాకు అవకాశం ఇచ్చారు. అవుట్పుట్లో కాంప్రమైజ్ కాకూడదని బెటర్మెంట్ కోసం చాలా కష్టపడ్డాం. మొదట్లో షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఈ చిత్రంలో నటించకపోతే అనవసరం అనుకున్నాను. –సంజు, విలన్ కథలో నేనే కీలకం: రెండేళ్ల క్రితం ఓ షార్ట్ఫిల్మ్ తీశాను. ఆ తర్వాత డైరెక్టర్ రాకేష్రెడ్డితో పరిచయం ఏర్పడింది. నాపై నమ్మకంతో ఈ చిత్రంలో కీలక పాత్ర నాతో చేయించారు. కథకు అత్యంత కీలకమైన ఆ పాత్రను ఛాలెంజ్గా తీసుకుని చేశాను. ఈ సినిమాలో ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. –శ్రీధా భట్, నటుడు షార్ట్ఫిల్మ్స్తో గుర్తింపు: రంగ స్థలం నుంచి మొదలుపెట్టి ఇరవై ఏళ్లుగా నటనారంగంలో ఉన్నాను. కానీ గతేడాదే నాకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ‘షార్ట్ఫిల్మ్స్ రావు రమేష్’ అని అందరూ అనేలా గుర్తింపు తెచ్చుకున్నాను. ఈ చిత్రంలో నీతిగా బతికే ఊరి పెద్దగా నటించాను. తప్పు చేసిన వాడు కొడుకైనా సరే న్యాయం మాట్లాడే మనస్తత్వం ఉన్న పాత్ర అది. –సరిపల్లి సతీష్, నటుడు