
అనంతపురం జిల్లా: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 10 మంది వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ఇటీవల దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ రాక సందర్భంగా కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
చెన్నేకొత్తపల్లిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ధర్మవరం మెజిస్ట్రేట్.. పది మంది వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ పరామర్శించారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు.