
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లనున్నారు. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత దంపతులు హాజరుకానున్నారు. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.
తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరి.. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ.. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సీబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.