చిన్నప్పటి నుంచి చదువులో టాప్‌ | - | Sakshi
Sakshi News home page

చిన్నప్పటి నుంచి చదువులో టాప్‌

Apr 25 2025 11:30 AM | Updated on Apr 25 2025 11:30 AM

చిన్నప్పటి నుంచి చదువులో టాప్‌

చిన్నప్పటి నుంచి చదువులో టాప్‌

జరుగుమల్లి(సింగరాయకొండ): జరుగుమల్లి మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన జోగులపర్తి వెంకట లక్ష్మి నిహారిక కామేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ 584 మార్కులు సాధించింది. చిన్నప్పటి నుంచి నిహారికకు చదవంటే ఎంతో ఇష్టం. తండ్రి సుబ్బారావు గ్రామంలో చిన్న రైస్‌మిల్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న నిహారిక చదువులో ఎప్పుడూ ముందుండేది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ఇచ్చే రూ.15 వేల అమ్మఒడి నిహారికకు ఎంతో ఉపయోగపడింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌బీ ప్యానెళ్ల ద్వారా విద్యాభ్యాసం ఎంతో ఉపకరించిందంటుంది నిహారిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement