రోడ్డెక్కిన పొగాకు రైతు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన పొగాకు రైతు

Jun 1 2025 12:31 AM | Updated on Jun 1 2025 12:47 AM

రోడ్డ

రోడ్డెక్కిన పొగాకు రైతు

ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి

మార్కాపురం: ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం సాయంత్రం మార్కాపురం మండలంలోని కుంట – చింతగుంట్ల గ్రామాల మధ్య జరిగింది. రూరల్‌ ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న లారీకి టైరు పంక్చర్‌ కావడంతో కుంట – చింతగుంట్ల గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఆపి ఉంది. టైరుకు పంక్చర్‌ వేసుకుంటుండగా, మార్కాపురం సబ్‌స్టేషన్‌లో హెల్పర్‌గా పనిచేసే తిప్పాయపాలేనికి చెందిన కుందురు చిన్న నారాయణరెడ్డి (32) ఇంటికి వెళ్తూ ఏమరపాటుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న భార్య, తల్లిదండ్రుల రోదనలు చూపరులతో సైతం కంటతడి పెట్టించాయి. రూరల్‌ ఎస్సై అంకమరావు, ఏఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

ఒంగోలు: స్థానిక మినీ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తూ విజేతలుగా నిలిచేందుకు కృషిచేయాలన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి జి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ మూడు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. జిల్లా కార్యదర్శి జి.భక్తధృవుడు మాట్లాడుతూ సబ్‌జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌, మాస్టర్స్‌ విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పవర్‌ లిఫ్టింగ్‌ సౌత్‌జోన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంటా వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎస్‌.కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు ప్రభాకరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కొండపి: వ్యాపారుల ధోరణితో పొగాకు రైతుల సహనం నశించింది. రోడ్డెక్కి రాస్తారోకో చేసేందుకు దారితీసింది. కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలో శనివారం మూగచింతల, నెన్నూరుపాడు, గురప్పడియా, కే అగ్రహారం, చతుకుపాడు గ్రామాల రైతులు బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. కొనుగోలు ప్రారంభం నుంచి డిస్‌ప్లే బోర్డుపై ధరలు కనిపించాల్సి ఉండగా, ఒక లైను పొగాకు కొనుగోలయ్యేంత వరకు ధరలు కనిపించలేదు. వేలం ప్రారంభంలో లో గ్రేడ్‌ పొగాకు కొనుగోలు చేశారని, వేలం కొనసాగుతున్నకొద్దీ ఎఫ్‌–3 పొగాకు బేళ్లను నో బిడ్లుగా చూపిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు. అనంతరం రైతులతో వేలం నిర్వహణ అధికారి మాట్లాడి వేలం కొనసాగించడానికి ప్రయత్నించారు. లోపలికి వెళ్లిన రైతులు అదే పరిస్థితి కొనసాగడంతో బయ్యర్లతో వాగ్వాదానికి దిగి వేలాన్ని బహిష్కరించి బయటికి వచ్చేశారు. అనంతరం రైతులు కొండపి, టంగుటూరు రోడ్డులో ధర్నాకు దిగి ఆందోళన వ్యక్తం చేశారు. వేలం నిర్వహణ అధికారి రైతుల పక్షాన నిలిచి వ్యాపారులతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించాలని, బేళ్ల కొనుగోలును ప్రారంభించాలని నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్సై ప్రేమ్‌కుమార్‌ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. వేలం నిర్వహణ అధికారితో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వేలం నిర్వహణ అధికారి దగ్గరికి మీరు కూడా రావాలని ఎస్‌ఐని రైతులు కోరగా, అందుకు అంగీకరించడంతో రైతులు ధర్నాను విరమించారు.

రైతును బట్టి ధరలా..?

వేలం కేంద్రంలో రైతును బట్టి గ్రేడ్‌, ధరలు నిర్ణయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మంచి ధర కల్పించాలని నిలదీస్తే అటువంటి రైతును టార్గెట్‌ చేసి ధర తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు మంచి గ్రేడ్లు, ధర ఇస్తున్నారన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుని రైతులందరికీ గ్రేడ్లను బట్టి మంచి ధరలు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలి...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దిగివచ్చి పొగాకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని రైతు కూలీ సంఘ కార్యదర్శి లలిత కుమారి, సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతుగా నిలిచి రోడ్డుపై వారు బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతులకు మద్దతు ధర కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఎట్టకేలకు ప్రారంభమైన వేలం...

రైతులతో పలు దఫాలుగా పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి చర్చలు జరిపిన అనంతరం గిట్టుబాటు ధర కల్పించే విధంగా బయ్యర్లతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించి వేలానికి మొగ్గుచూపారు. అనంతరం ఆగిన చోట నుంచి వేలం ప్రారంభమైంది. ఆందోళనలతో కాకుండా చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని రైతులకు వేలం నిర్వహణ అధికారి సూచించారు.

వేలం బహిష్కరించి రాస్తారోకో అధిక సంఖ్యలో మీడియం గ్రేడ్‌ బేళ్లను తిరస్కరిస్తున్నారంటూ ఆందోళన అన్ని బేళ్లను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌

రోడ్డెక్కిన పొగాకు రైతు1
1/2

రోడ్డెక్కిన పొగాకు రైతు

రోడ్డెక్కిన పొగాకు రైతు2
2/2

రోడ్డెక్కిన పొగాకు రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement