విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Jun 5 2025 8:14 AM | Updated on Jun 5 2025 8:14 AM

విద్య

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

కొమరోలు: ఓ శుభకార్యానికి డెకరేషన్‌ లైట్లు ఏర్పాటు చేయడానికి వెళ్లిన ఎలక్ట్రీషియన్‌ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని ఓబులాపురం గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని చింతలపల్లె గ్రామానికి చెందిన పిట్టల నాగేశ్వరరావు(40) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఓబులాపురం గ్రామంలో ఓ శుభకార్యానికి డెకరేషన్‌ లైట్లు వేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎస్సై నాగరాజు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ

యువకుడు మృతి

పెద్దదోర్నాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరులో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం రాత్రి మృతి చెందాడు. వివరాలు.. పెద్దదోర్నాల మండల కేంద్రంలోని గిరిజన కార్పొరేషన్‌ వీధిలో నివసించే నబీరసూల్‌ మే 30వ తేదీన తన బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై పంది అడ్డురావడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన యవకుడిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతుడు నబీ రసూల్‌కు భార్య కౌసర్‌తోపాటు ఓ కుమార్తె ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భంతో ఉందని బంధువులు తెలిపారు. నబీరసూల్‌ మృతితో తల్లిదండ్రులు నాసర్‌వలి, మాభున్నీ గుండెలవిసేలా రోదించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యువకుడు అనుమానాస్పద మృతి

మర్రిపూడి: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన మర్రిపూడికి చెందిన పడిదపు వెంకట్రావు(24) పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకట్రావు చిత్తూరు జిల్లాకు చెందిన పొక్లెయిన్‌ను బాడుగకు తీసుకుని తిప్పుతున్నాడు. ఈ నెల 2వ తేదీన ఒంగోలు రైల్వే స్టేషన్‌ సమీపంలో తీవ్ర రక్తగాయాలతో వెంకట్రావు పడి ఉండటాన్ని స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. పోలీసుల ద్వార సమాచారం తెలుసుకున్న బంధువులు బుధవారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వెంకట్రావు మృతి చెందాడు. వెంకట్రావు శరీరంపై తీవ్రగాయాలు ఉండటంతో ప్రమాదవశాత్తు గాయపడ్డాడా? లేదా ఎవరైన దాడికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు నుంచి జారిపడి గుర్తు

తెలియని యువకుడు మృతి

సింగరాయకొండ: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు(35) మృతి చెందిన సంఘటన బుధవారం సింగరాయకొండ–ఉలవపాడు స్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే లైనుపై చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మృతుడి శరీరంపై తెలుపు రంగు చారలు గల లైట్‌ పింక్‌ కలర్‌ హాఫ్‌ హ్యాండ్‌ టీషర్టు, లైట్‌ గ్రీన్‌ జీన్స్‌ ప్యాంట్‌ ఉన్నాయి. కుడి కాలి తొడ కింది భాగాన పుట్టుమచ్చ ఉంది. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆచూకీ తెలిసిన వారు 9440627647కు సమాచారం అందించాలని ఒంగోలు ఆర్పీ ఎస్సై కె.మధుసూదనరావు విజ్ఞప్తి చేశారు.

విద్యుదాఘాతంతో  వ్యక్తి మృతి 1
1/3

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో  వ్యక్తి మృతి 2
2/3

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో  వ్యక్తి మృతి 3
3/3

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement