
కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం
ఒంగోలు టౌన్: ప్రార్ధించే పెదవుల కంటే సాయపడే చేతులే గొప్పవని చాటారు జిల్లా ఫార్మసి ఉద్యోగులు. నగరంలోని గద్దలగుంటకు చెందిన ఎ.ఆంజనేయులు నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఫార్మసి ఆఫీసర్గా పనిచేస్తూ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. కాంట్రాక్ట్ ఉద్యోగి కావడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందలేదు. ఈ క్రమంలో ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రకాశం జిల్లా ఫార్మసి అసోసియేషన్ నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా సంఘ సభ్యులందరూ కలిసి రూ.1.72 లక్షలు సేకరించారు. గురువారం గద్దలగుంటలోని ఆంజనేయులు నివాసంలో డీఎంహెచ్లో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. ఆంజనేయులు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేలా కలెక్టర్కు సిఫార్సు చేయాలని సంఘ సభ్యులు డీఎంహెచ్ఓకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ ఫార్మశీ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జె.రవికిరణ్, కార్యదర్శి కె.రత్నాకర్బాబు, నాయకులు పి.సూర్య ప్రగతి, స్వర్ణ మంజరి, పద్మ, కృపా కుమారి తదితరులు పాల్గొన్నారు.