
సత్తా చాటిన తెలంగాణ ఎడ్లు
సీఎస్పురం(పామూరు): మండల కేంద్రమైన సీఎస్పురంలో రాచూరి పెద్దమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా గురువారం కాపునాయుళ్ల సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం హుజూర్నగర్కు చెందిన ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచింది. పోటీలను వైఎస్సార్ సీపీ నాయకుడు కదిరి ప్రకాశరావు, కాపు సంఘ నాయకులు ఆమంచి స్వాములు ప్రారంభించారు. పోటీల్లో మొత్తం 10 జతల ఎడ్లు పాల్గొనగా హుజూర్నగర్కు చెందిన కేశవరెడ్డి, సురేందర్రెడ్డిల ఎడ్ల జత ప్రథమ స్థానం, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేష్యాదవ్ ఎడ్ల జత ద్వితీయ స్థానం, అదేజిల్లా రంగసాయపల్లెకు చెందిన వెంకటసుబ్బారెడ్డి ఎడ్ల జత తృతీయ స్థాఽనం, నంద్యాల జిల్లా రామసుబ్బారెడ్డి ఎడ్ల జత నాలుగో స్థానం, బాపట్ల జిల్లా పావులూరి వీరాస్వామి ఎడ్ల జత ఐదో స్థానం, నంద్యాల జిల్లా దినేష్రెడ్డి ఎడ్ల జత ఆరో స్థానం, అనంతపురం జిల్లా రామాంజనేయులు ఎడ్ల జత ఏడో స్థానంలో నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.1,00,116 తులబందుల చలమయ్య నాయుడు, ద్వితీయ బహుమతి రూ.75,116ను మరాసుల రోశయ్య, తృతీయ బహుమతి రూ.50,116ను తిరుమలశెట్టి కిరణ్కుమార్, నాలుగో బహుమతి రూ.30,116ను ఆకుపాటి రమణయ్య, 5వ బహుమతి రూ.20,116ను మన్నేపల్లి వెంకటనరసయ్య, ఆరో బహుమతి రూ.15 వేలు బోయిన మాలకొండయ్య, ఏడో బహుమతి రూ.10 వేలను తోట అశోక్నాయుడు అందజేశారు.