జాళ్లపాలెం బాధిత మహిళలకు సజ్జల పరామర్శ | - | Sakshi
Sakshi News home page

జాళ్లపాలెం బాధిత మహిళలకు సజ్జల పరామర్శ

Jun 5 2025 1:32 PM | Updated on Jun 5 2025 1:32 PM

జాళ్లపాలెం బాధిత మహిళలకు సజ్జల పరామర్శ

జాళ్లపాలెం బాధిత మహిళలకు సజ్జల పరామర్శ

కొండపి: ీససీ ఫుటేజీ కోసం ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్సై రమేష్‌బాబు దుకాణంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో బాధిత మహిళలు చంద్రమ్మ, ఆదిలక్ష్మిలను వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన వివరాలను బాధిత మహిళలు సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. సీసీ ఫుటేజీ కోసం లోపలికి వెళుతున్న ఎస్సైను మా అన్న వచ్చిన తరువాత రావాలని చెప్పామని, కానీ ఎస్సై మాత్రం ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని నెట్టివేశారని తెలిపారు. ఆ విషయంలో విధులకు ఆటంకం కలిగించామని మా పైనే కేసులు పెట్టారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ మీకు అండగా ఉంటుందని, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన విషయమై కోర్టులో ప్రైవేట్‌ కేసు వేసి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపి పరామర్శించారు. బాధితులను పరామర్శించిన వారిలో మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సురేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement