మూడు రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ(మంగళవారం, డిసెంబర్ 23) క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు.


