
సమాచారశాఖ ఉద్యోగికి ఘనంగా వీడ్కోలు
ఒంగోలు సబర్బన్: సమాచారశాఖలో సుమారు 38 ఏళ్లపాటు టైపిస్టుగా విధులు నిర్వర్తించి శనివారం ఉద్యోగ విరమణ పొందిన ఓ ఇందిరాకుమారిని సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. స్థానిక ప్రకాశం భవన్లోని కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐపీఆర్ఓ వేణుగోపాల్, డీపీఆర్ఓ రమేష్, డివిజినల్ పీఆర్ఓ దుర్గాప్రసాద్, రిటైర్డ్ డీఈఐఈ రమణమూర్తి, రిటైర్డ్ డీపీఆర్ఓ నారాయణ, కార్యాలయ సబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం డివిజన్ కార్యాలయంతో పాటు ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో పనిచేసిన ఇందిరాకుమారి సేవలను కొనియాడారు.