
మైసూరు పోలీసు కమిషనర్కు బెదిరింపు ఈ–మెయిల్
ప్రముఖ ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు
మైసూరు: మైసూరు నగరంలో శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ అందరినీ పరుగులు పెట్టించింది. పోలీసు కమిషనర్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్ చేశాడు. నగరంలో పలుచోట్ల బాంబులు పెట్టామని, అవి పేలిపోతాయని అందులో రాసి ఉంది. వెంటనే పోలీసులు ప్రముఖ స్థలాల్లో బాంబు నిరీ్వర్యక దళాలు, శునకాలతో సోదాలు ఆరంభించారు. లలిత మహల్ ప్యాలెస్, మైసూరు ప్యాలెస్, రైల్వే స్టేషన్, బస్టాండుతో పాటు పలు ముఖ్య ప్రదేశాల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా పేలుడు వస్తువులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అంతటా ఉత్కంఠ
కొన్ని గంటల సేపు ఉత్కంఠ నెలకొంది. పర్యాటకులు టెన్షన్ పడ్డారు. చివరకు నకిలీ బెదిరింపు మెయిల్ అని తేల్చారు, దానిని పంపినవారి కోసం గాలిస్తున్నట్లు కమిషనర్ పోలీస్ సీమా లాట్కర్ తెలిపారు.