ఇవన్నీ ఉంటే అయిపోదా.. స్మార్ట్ కిచెన్ | Latest Gadgets For Smart Kitchen | Sakshi
Sakshi News home page

ఇవన్నీ ఉంటే అయిపోదా.. స్మార్ట్ కిచెన్

May 4 2025 4:10 PM | Updated on May 4 2025 4:48 PM

Latest Gadgets For Smart Kitchen

ఇంటి ఆరోగ్యం, ఆనందం అంతా ఉండేది వంటగదిలోనే.. మరి అలాంటి వంటగదిని ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మార్చేయాలంటే.. ఇలాంటి గ్యాడ్జెట్స్‌ (కిచెన్‌ టీవీ, పిజ్జా ఓవెన్‌, ఎకోజీ స్మార్ట్‌ నగ్గెట్‌ ఐస్‌ మేకర్‌, థర్మా ‘మీట్‌’ర్‌) ఉండాల్సిందే!. ఈ గ్యాడ్జెట్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కిచెన్‌ టీవీ
‘వంట చేయడం పెద్ద పనేం కాదు’ అని చేయి తిరిగిన నిపుణులు చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ఇదే మాటను వంట రాని వారు కూడా చెప్పగలరు. వాళ్ల వంటగదిలో ఈ ‘జీఈ కిచెన్‌ క్లబ్‌’ ఉంటే చాలు. ఇదొక స్మార్ట్‌ టీవీ లాంటిది. 27 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. వంటగదిలో దీనిని అమర్చుకుంటే, మనకు కావాల్సిన వంటను ఎలా వండాలో, ఏంమేం కావాలో, ఎంత మోతాదులో వేయాలో ఎప్పటికప్పుడు చూపిస్తూ, తెలియజేస్తుంది. మొబైల్, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ధర 999 డాలర్లు (రూ. 85,301).

పిజ్జా ఓవెన్
ఆర్డర్‌ చేసిన అరగంటలో వచ్చే పిజ్జాను వెంటనే తినేయాలి, చల్లారితే అసలు బాగోదు. ఇంట్లో ఉంటే, వెంటనే ఓవెన్‌లో పెట్టి వేడి చేసుకొని తింటాం. అదే బయట ఉంటే.. సాధ్యం కాని పని. ఇందుకోసం ఈ ‘ఓనీ కోడా 2 పిజ్జా ఓÐð న్‌’ బాగా ఉపయోగపడుతుంది. ఇదొక గ్యాస్‌ పవర్డ్‌ పిజ్జా ఓవెన్‌. కేవలం పిజ్జాను మాత్రమే ఇందులో వేడి చేసుకొని తినొచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లవచ్చు. విహార యాత్రలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ధర 449 డాలర్లు ( రూ. 38,338).

ఎకోజీ స్మార్ట్‌ నగ్గెట్‌ ఐస్‌ మేకర్‌
ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్‌ తయారు చేసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. అదే ఈ ‘ఎకోజీ స్మార్ట్‌ నగ్గెట్‌ ఐస్‌ మేకర్‌’ సాయంతో చాలా త్వరగా ఐస్‌ క్యూబ్స్‌ తయారు చేసుకోవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే ఐస్‌ క్యూబ్స్‌ తయారవుతాయి. బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. యాప్‌ ద్వారా కూడా ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీని ధర 239 డాలర్లు (రూ. 20, 407) మాత్రమే!

థర్మా ‘మీట్‌’ర్‌
సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి మాంసం తినటం వలన శరీరంలోకి టేప్‌ వార్మ్‌లు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే, మాంసం సరిగ్గా ఉడికిందా లేదా అని తెలసుకోవడానికి రూపొందించినదే ఈ ‘మీట్‌ర్‌ ప్లస్‌’. దీనికున్న సూదికొనను మాంసానికి గుచ్చితే, కేవలం పదిసెకండ్లలోనే మాంసం ఎంత వరకు ఉడికిందో పూర్తి సమాచారం ఇస్తుంది. మాంసం లోపలి ఉష్ణోగత్రను సుమారు 212 డిగ్రీ ఫారన్‌హీట్‌ వరకు, బయటి ఉష్ణోగత్రను 527 డిగ్రీ ఫారన్‌ హీట్‌ వరకు చెప్పగలదు. బ్లూటూత్‌ కెనెక్టివిటీతో మొబైల్‌కు కూడా కనెక్ట్‌ చేసుకొని వాడుకోవచ్చు. ధర 99 డాలర్లు (రూ. 8,543).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement