breaking news
Mirai Movie
-
'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల కలెక్షన్ కూడా సాధించింది. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ సక్సెస్ని మంగళవారం రాత్రి విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 'మిరాయ్' టీమ్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన నిర్మాత.. హీరో, దర్శకుడికి కార్లు గిఫ్ట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)సాధారణంగా సినిమాలు హిట్ అయి, మంచి కలెక్షన్స్ సాధిస్తే నిర్మాతలు.. దర్శకుడికో హీరోలకో ఖరీదైన లగ్జరీ కార్లని బహుమతిగా ఇస్తుంటారు. ఇప్పుడు కూడా 'మిరాయ్' హిట్ కావడంతో నిర్మాత విశ్వప్రసాద్ ఆనందపడుతున్నారు. ఈ క్రమంలోనే హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి.. వాళ్లకు నచ్చిన కార్లని గిఫ్ట్గా ఇస్తానని స్టేజీపైనే ప్రకటించారు.'మిరాయ్' విషయానికొస్తే.. 'హనుమాన్' తర్వాత తేజ చేసిన మరో సూపర్ హీరో సినిమా ఇది. తేజ హీరో కాగా మంచు మనోజ్ విలన్గా ఆకట్టుకున్నాడు. స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని.. ఈ చిత్రంతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్, ప్రత్యేక పాత్ర చేసిన శ్రియ కూడా ఈ మూవీతో గుర్తింపు సాధించారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో గౌర హరి ఆకట్టుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా) -
ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్'
హను-మాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జ 'మిరాయ్' మూవీ (Mirai Movie)తో మరో బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరామ్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేయగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్నిర్మించిన ఈ మూవీకి హరి గౌర సంగీతం అందించాడు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మిరాయ్ రూ.100 కోట్లు కొల్లగొట్టిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. టికెట్ రేట్లు పెంచకుండానే మిరాయ్ ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం విశేషం! గొప్ప మనసుతో సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇది మంచి సినిమా సాధించిన విజయం అని అభివర్ణించాడు. 100 Crores⚔️🔥Big love and gratitude to Audience especially families for celebrating #Mirai with all your heart🙏🏼❤️🤗This is the Victory of Good Cinema🔥#BlackSword 🚀 pic.twitter.com/hKClY8PcrN— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 17, 2025 చదవండి: దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్బాబు రిక్వెస్ట్ -
‘మిరాయ్’ మూవీ సక్సెస్ మీట్లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)
-
విజయవాడలో ‘మిరాయ్’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)
-
రెబల్ స్టార్ రాజాసాబ్...మిరాయ్ని మరిపిస్తాడా?
ఓ వైపు పెద్ద పెద్ద హీరోల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో వస్తున్న చిత్రాలు ఊరించి ఊరించి ఉస్సురుమనిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్లో పెద్దగా ఫాలోయింగ్ లేని స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేసేస్తున్నాయి. అది మరీ వింత కాకపోయినా ఈ మధ్య తరచుగా జరుగుతుండడమే గమనార్హం. మరీ ముఖ్యంగా బలమైన నెట్ వర్క్,సమర్ధులైన సాంకేతిక నిపుణులు పనిచేసిన భారీ చిత్రాల్లో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక అప్రతిష్ట పాలవుతున్నాయి. ఇటీవల విడుదలైన విశ్వంభర టీజర్ గానీ, హరి హర వీరమల్లు, కన్నప్ప లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో చిన్న చిత్రాల్లోని గ్రాఫిక్స్ కళ్లప్పగించేలా చేస్తూ సినిమాని బ్లాక్ బస్టర్గా మారుస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు మిరాయ్(Mirai Movie) కూడా జేరింది. విడుదలైన రోజు నుంచి మిరాయ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు సమీక్షలు కూడా సాధిస్తోంది. ఈ చిత్రం బృందంలో సాంకేతికత పాత్ర భారీగా ప్రశంసలు అందుకుంటోంది. అత్యంత ఆశ్చర్యకరంగా, హాలీవుడ్లోని అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ కంపెనీలతో సమానమైన అవుట్పుట్ను మిరాయ్ బృందం అందించగలిగింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఇదంతా హైదరాబాద్లోనే స్థానికంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నియమించిన టీమ్ ఈ అద్భుతమైన ఆవిష్కరణను అందించడం.ట్రైలర్ విడుదలైనప్పుడే వీక్షకులు అందరూ అవుట్పుట్కి ఆశ్చర్యపోయారు నేడు, సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ ముందు పక్షి ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, రాముడి సీన్లు...తెరపైన ఆవిష్కృతమవుతుంటే.. ప్రేక్షకులు ఆ అద్భుతమైన గ్రాఫిక్స్ పనితీరుని కళ్లప్పగించి చూస్తుండటం కనిపిస్తోంది. ఇటీవల అనేక భారీ బడ్జెట్ చిత్రాలు పరిశ్రమలలోని టాప్ కంపెనీల నుంచి కూడా నమ్మదగిన విఎఫ్ఎక్స్ అవుట్పుట్ను పొందడంలో తరచుగా విఫలమవుతున్న పరిస్థితిలో హైదరాబాద్లోని సాంకేతిక నిపుణులే దీనిని సాధించగలగడం మరింత ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ లో ఎటువంటి అస్పష్టత రాకుండా కూడా చిత్రబృందం చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నారు, పరిమిత వనరులతోనే టీమ్ మిరాయ్ ఈ అద్భుతమైన అవుట్పుట్ను సాధించడం గమనార్హం.ఈ సినిమా సాధించిన అనూహ్య విజయం రాబోయే మరో అగ్రహీరో ప్రభాస్ భారీ చిత్రం రాజా సాబ్(The Raja Saab) ను చర్చనీయాంశంగా మారుస్తోంది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న రాజాసాబ్ కూడా మిరాయ్ ను అందించిన అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రానుంది. రెబల్ స్టార్ అభిమానులు ఈ చిత్రానికి కూడా అదే రకమైన అవుట్పుట్ ను ఊహిస్తున్నారు. దాంతో ఆ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగి ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి. రాజా సాబ్ ఒక హర్రర్ డ్రామా, దీనిని చాలా వరకూ సెట్లోనే చిత్రీకరించారు దాంతో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమా బృందం విడుదల చేసిన టీజర్ కూడా బాగుంది మిరాయ్ లాగే దీనికి కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ జతగూడితే...ప్రభాస్ అనే అగ్నికి ఆజ్యం పోసినట్టే అయి ఇక అభిమానులకు రికార్డుల పండగే అని చెప్పొచ్చు. -
తేజ సజ్జ దెబ్బకు ఇండస్ట్రీ షేక్
-
ఓటీటీలో 'వైబ్' ఉంటుంది: హరి గౌర
‘‘మిరాయ్’ చిత్ర సంగీతం, నేపథ్య సంగీతానికి థియేటర్స్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషాన్నిచ్చింది. చిత్ర నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ కూడా చక్కని మ్యూజిక్ ఇచ్చానంటూ నన్ను అభినందించారు. సినిమా విడుదల తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. నా ఫోన్కి కాల్స్ ఏకధాటిగా వస్తూనే ఉన్నాయి. చాలా మెసేజ్లు కూడా వచ్చాయి. అయితే ఆ సమయంలో నేను జ్వరంతో ఉండటం వల్ల ఎక్కువ కాల్స్ మాట్లాడలేకపోయాను’’ అని సంగీత దర్శకుడు హరి గౌర చెప్పారు.తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రం ‘మిరాయ్’. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు హరి గౌర విలేకరులతో మాట్లాడుతూ–‘‘హనుమాన్, మిరాయ్’ వంటి బ్యాక్ టు బ్యాక్పాన్ ఇండియా హిట్స్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్గారు చాలా అద్భుతమైన సినిమా తీశారు. కీరవాణిగారు లాంటి లెజెండరీ కంపోజర్తో నన్నుపోల్చడం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ.. అదే సమయంలో భయంగా, బాధ్యతగా అనిపిస్తోంది.ఈ సినిమా కోసం ‘వైబ్ ఉంది బేబి...’ తోపాటు మరో స్పెషల్ సాంగ్ని చిత్రీకరించాం. అయితే ఎడిటింగ్లో చూసుకుంటే.. కథ ఫ్లోకి ఇబ్బంది కలిగిస్తుందేమో అనే ఫీలింగ్ కలిగింది.. దీంతో యూనిట్ అంతా కలిసి ఆపాటలను తీసేయాలనే నిర్ణయం తీసుకున్నాం. అయితే ఓటీటీ స్ట్రీమింగ్లో మాత్రం ‘వైబ్ ఉంది బేబి...’ సాంగ్ ఉంచాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో నాది పదేళ్ల ప్రయాణం. కన్నడలో ‘చార్మినార్’ వంటి హిట్ చిత్రం తర్వాత తెలుగులో నిరూపించుకోవాలని ఇక్కడికి వచ్చాను. ‘తుంగభద్ర, డియర్ మేఘ, గాలివాన’ వంటి సినిమాలు చేశాను. దర్శక–నిర్మాతల నమ్మకాన్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో చాలా టైమ్ పట్టింది’’ అన్నారు. -
'మిరాయ్' కలెక్షన్.. రూ.100 కోట్లకు చేరువలో
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అందుకు తగ్గట్లే కలెక్షన్ కూడా వస్తోంది. తొలిరోజు ఓ మాదిరి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం.. రెండు, మూడో రోజు మాత్రం కాస్త ఎక్కువగానే వసూలు చేసింది. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన 'మిరాయ్'కి తొలి నుంచి కాస్త హైప్ ఏర్పడింది. కంటెంట్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్గా విజువల్స్ పరంగా ఆకట్టుకోవడంతో పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. అలా తొలిరోజు రూ.27.20 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు వచ్చేసరికి రూ.55.60 కోట్లకు చేరింది. ఆదివారం మంచి ఆక్యుపెన్సీలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులకు కలిపి రూ.81.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరువలో వసూళ్లు ఉన్నాయి. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ విషయంలో కాస్త డ్రాప్ ఉంటుంది. ప్రేక్షకులు కాస్త తక్కువగానే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. మరి 'ఓజీ' రావడానికి ఇంకా 10 రోజులకు పైనే టైమ్ ఉంది. మరి అంతలోపు 'మిరాయ్' ఎన్ని కోట్లు అందుకుంటుందో చూడాలి? ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఇది కూడా 'మిరాయ్'కి ప్లస్ కావొచ్చేమో?(ఇదీ చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్)From South to North, from India to Overseas, #MIRAI is rewriting history everywhere ❤️🔥Record Breaking ₹81.2 Cr Gross Worldwide in just 3 DAYS for #BrahmandBlockbusterMirai 💥💥💥India’s most ambitious action adventure is now the most celebrated film across the globe🔥—… pic.twitter.com/7MqeKGvWwV— People Media Factory (@peoplemediafcy) September 15, 2025 -
రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ రితికా నాయక్ (ఫొటోలు)
-
'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ..
తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా (Mirai Movie) భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. ఎడారిలో ఒయాసిస్సులా.. ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు మనోజ్కు సక్సెస్ దొరికినట్లైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ గ్రాండ్గా ఉండటం సినిమాకు మరింత ప్లస్సయింది.చివరిసారి ఎప్పుడు చూశానో..ఈ సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్) వేదికగా రివ్యూ ఇచ్చారు. మిరాయ్ చూశాక.. ఇంత మంచి వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తు రావడం లేదు. రూ.400 కోట్లకుపైగా ఖర్చు పెట్టి తీసిన సినిమాల్లోనూ ఇంత గ్రాండ్ విజువల్స్ చూడనేలేదు. ముందుగా మనోజ్ను ఈ సినిమాలో విలన్గా తీసుకుని తప్పు చేశారనుకున్నాను. కానీ సినిమా చూశాక అతడి పర్ఫామెన్స్ చూసి నన్ను నేనే కొట్టుకున్నా.. నా అంచనా తప్పుఇంత పెద్ద యాక్షన్ అడ్వెంచర్ మూవీలో తేజ మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తాడేమో అనుకున్నా.. ఇక్కడ కూడా నా అంచనా తప్పయింది. విజువల్స్, బీజీఎమ్, స్క్రీన్ప్లే.. అన్నీ అదిరిపోయాయి. ఇంటర్వెల్ సహా మరికొన్ని చోట్ల సినిమా నెక్స్ట్ లెవల్కు వెళ్లింది. కత్తులు, అతీంద్రియ శక్తుల బెదిరింపుల మధ్యలో ప్రేమ, మోసం వంటి అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించారు. లాభాలొక్కటే కాదు..కార్తీక్.. మిరాయ్ మీరు కన్న అద్భుతమైన కల. పురాణాలను, హీరోయిజాన్ని కలగలిపి చూపించారు. అన్ని విభాగాలపై మీకున్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. విశ్వప్రసాద్.. మీరు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా మీకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. తద్వారా విజయం సాధించారు. లాభాలు తీసుకురావడమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా చిత్రయూనిట్ బాధ్యత అని నిరూపించారు.మనోజ్ రిప్లైచివరగా నేను చెప్పేదేంటంటే.. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని రాసుకొచ్చారు. దీనికి మంచు మనోజ్ (Manchu Manoj).. అన్నా, మీ స్పంద చూస్తుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. చిన్నప్పటినుంచి మీ సినిమాలు చూస్తూ, మీతో కలిసి పనిచేస్తూ పెరిగాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు మీ నోటి నుంచి నా నటనకు ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు. Annaaaa …..reading this from you gave me goosebumps 🙏🏻 I grew up watching your cinema, working with you, learning from it and today to hear you speak of my performance like this… it’s beyond special ❤️ thank you anna 🙏🏼🙌🏽#Mirai #BlackSword https://t.co/y9hfmJUGkR— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2025 చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్
బాక్సాఫీస్ వద్ద తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మిడ్ రేంజ్ సినిమాలు, టైర్ 2 హీరోల విషయంలో రెండో రోజు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ని మిరాయ్ బద్దలు కొట్టింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లలో రూ.8.20 కోట్ల షేర్తో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించాడు. టైర్ 2 హీరోలుగా ఉన్న నాని హిట్ 3, శ్యామ్ సింగరాయ్, దసరా.. విజయ్ దేవరకొండ ఖుషి, కింగ్డమ్, గీత గోవిందం.. నాగ చైతన్య తండేల్, లవ్ స్టోరీ, మజిలీ లాంటి సినిమాల రికార్డులని ఈ చిత్రం దాటేసింది.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ సినిమాలలో హయెస్ట్ షేర్ వచ్చిన సినిమాగానూ టాలీవుడ్ చరిత్రలోనే మిరాయ్ ఘనత సాధించింది. ఈ సినిమాలో తేజ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో తేజ డూప్ లేకుండా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో పాటు కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయిందని ప్రశంసిస్తున్నారు. అన్ని భాషల్లోనూ తేజ పర్ఫామెన్స్కు యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ దక్కుతున్నాయి.ఈ దెబ్బతో టైర్ 2 హీరోలలో తేజ సజ్జా.. పైపైకి వచ్చినట్లుగానే ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు రోజుల్లో ఓవరాల్గా రూ.55 కోట్ల మేర గ్రాస వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!) -
'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?
థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్'.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతటా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే సూపర్ హీరో తరహా జానర్లో మూవీ తీసినప్పటికీ.. క్లైమాక్స్లో శ్రీ రాముడి రిఫరెన్స్ చూపించడం ప్రేక్షకులకు నచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఈ పాత్రలో ప్రభాస్ నటించాడని.. మూవీ రిలీజ్కి ముందు రూమర్స్ వచ్చాయి. కానీ ఆ పాత్రని ఓ యువ నటుడితో చేయించారు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? అతడి డీటైల్స్ ఏంటి?ఈ సినిమా చివరలో వచ్చే శ్రీ రాముడి పాత్ర.. కథని టర్న్ అయ్యేలా చేస్తుంది. పట్టుమని ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఆ పాత్రని చూపించారు. అది కూడా ముఖం కనిపించీ కనిపించకుండా చూపించారు. దీంతో ఆ పాత్రని ఎవరు చేశారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ రోల్లో హిందీ నటుడు గౌరవ్ బోరా కనిపించాడు. ఇతడిది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్. మాస్ కమ్యూనికేషన్ చదివిన గౌరవ్.. నటనపై ఇష్టంతో ఢిల్లీ వచ్చేసి థియేటర్ గ్రూప్లో చేరాడు. ఐదేళ్ల పాటు పలు నాటకాలు చేశాడు.(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)పలు షార్ట్ ఫిల్మ్స్, హిందీ సీరియల్స్ కూడా చేసిన గౌరవ్.. కొన్ని కమర్షియల్ యాడ్స్లోనూ నటించాడు. మరి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఎక్కడ చూశాడో ఏమో గానీ గౌరవ్ని శ్రీరాముడి పాత్ర కోసం ఎంపిక చేశాడు. రెండు రోజుల పాటు ఇతడికి సంబంధించిన షూటింగ్ అంతా జరిగింది. శ్రీ రాముడి సీన్స్కి వీఎఫ్ఎక్స్ కూడా జోడించేసరికి ఆ సన్నివేశాలు ఎలివేట్ అవుతున్నాయి.అయితే తెలుగులో శ్రీరాముడు అంటే చాలామంది సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. తర్వాత కాలంలో పలువురు నటులు.. ఈ పాత్రలో కనిపించినప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఒకవేళ 'మిరాయ్' టీమ్ ఎవరైనా తెలుగు నటుడిని ఈ పాత్రలో పెట్టుంటే కచ్చితంగా పోలిక వచ్చి ఉండేది. అందుకేనేమో ఉత్తరాది నటుడిని పెట్టి మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఏదైనా ఈ పాత్రకు కూడా రెస్పాన్స్ బాగానే వస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!) -
బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ సునామీ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?
మిరాయ్..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. తక్కువ బడ్జెట్లో గొప్ప సినిమా తీశారంటూ విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తొలి రోజు(సెప్టెంబర్ 12) 27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను సాధించింది. మొత్తం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.60 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.(చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!)ఓవర్సీస్లోనూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. నార్త్ అమెరికాలో రెండు రోజుల్లోనే 1 మిలియన్ల డాలర్లను రాబట్టింది. యూఎస్, కెనడాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ మూవీకి వచ్చిన హిట్ టాక్ని బట్టి చూస్తే..వీకెండ్లోగా ఈజీగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.(చదవండి: రెండోసారి ప్రసవం.. మానసికంగా దెబ్బతిన్నా: ఇలియానా)మిరాయ్ విషయానికొస్తే.. హనుమాన్ తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రమిది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషించాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించారు. -
మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!
మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించగా, రితికా నాయక్ హీరోయిన్గా చేసింది. శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు.రికార్డులు తిరగరాయడం ఖాయంమిరాయ్కు తొలి రోజే రూ.27 కోట్లు రావడంతో చిత్రయూనిట్ 'బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్ సక్సెస్' పేరిట విజయోత్సవాలు జరుపుకుంది. సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే మిరాయ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన గొంతు అరువిచ్చాడు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ గొంతు వినిపించగానే ప్రేక్షకులు ఎగిరిగంతేస్తున్నారు. మిరాయ్ మూవీకి అంత బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ దీనికోసం ఎంత డబ్బు తీసుకున్నాడని కొందరు చర్చలు మొదలుపెట్టారు. ఓటీటీ పార్ట్నర్అసలే ప్రభాస్ది వెన్నలాంటి మనసు. తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే సరేనని గొంతు అరువిచ్చి సాయం చేశాడే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదట! దీంతో రెబల్ స్టార్ను అభిమానులు మరోసారి ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకపోతే మిరాయ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాతే మిరాయ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ నెలలో మిరాయ్ ఓటీటీలో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది.చదవండి: ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి -
ప్రభాస్గారి వాయిస్ మిరాయ్కి మంచి వెయిట్ : తేజ సజ్జా
‘‘మిరాయ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. వాళ్ళ ఆదరణ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నాను. ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శ్రియ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్’ పేరిట శనివారం చిత్రయూనిట్ నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో తేజ సజ్జా మాట్లాడుతూ–‘‘దర్శకుడు కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్గార్లు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. మా మీద విశ్వప్రసాద్గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. మంచు మనోజ్గారి రాకతో మా సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ‘మిరాయ్’ కథ ప్రభాస్గారి వాయిస్ ఓవర్తో ప్రారంభమవ్వడం వల్లే మా సినిమాకు వెయిట్ వచ్చింది. మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రభాస్, రానాగార్లకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సక్సెస్తో నా ఫోన్ మోగుతూనే ఉంది. నాకు ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసిన కార్తీక్కు రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. తమ్ముడు తేజ మంచి స్థాయికి వెళ్తాడు. మా అన్నతమ్ముళ్లు ఇద్దరి కోసం ప్రభాస్గారు నిలబడ్డారు (మంచు విష్ణు ‘కన్నప్ప’లో ప్రభాస్ కీలక పాత్రలో నటించారు). ఆయనకు థ్యాంక్స్’’ అని తెలిపారు మనోజ్ మంచు. ‘‘మిరాయ్’ నాలుగేళ్ల జర్నీ. తేజ అప్పట్నుంచి ట్రావెల్ అవుతున్నాడు. నన్ను నమ్మిన విశ్వప్రసాద్ గారికి, ఈ సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు దర్శకుడు కార్తీక్. ‘‘2024 మాకు అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మిరాయ్’ సక్సెస్ మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీ ఇచ్చింది. గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా తర్వాతి నాలుగు సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. మా అమ్మాయి కృతి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా తన జర్నీ మొదలుపెట్టి, ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్మ్ అని భావిస్తున్నాం’’ అని తెలిపారు. -
‘మంచు’ బ్రదర్స్కి అండగా ప్రభాస్.. మనోజ్ ఎమోషనల్!
ప్రభాస్ మంచితనం గురించి అందరికి తెలిసిందే. సాయం కోరి వస్తే.. తనకు సాధ్యమైనంతవరకు చేస్తాడని ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. తన వల్ల ఒక సినిమాకు హెల్ప్ అవుతుందని చెబితే.. ‘స్టార్’ హోదాని సైతం పక్కకు పెట్టి వస్తాడని ‘కన్నప్ప’తో నిరూపించాడు.(చదవండి: నా కుటుంబాన్ని నిలబెట్టారు, నాలో భయాన్ని చంపేశారు: మనోజ్ భావోద్వేగం)ప్రభాస్కి ఉన్న క్రేజ్కి ‘కన్నప్ప’లోని రుద్ర పాత్ర చాలా చిన్నదనే చెప్పాలి. కానీ మోహన్ బాబు, మంచు విష్ణుల కోసం ప్రభాస్ ఆ పాత్ర ఒప్పుకున్నాడు. ప్రభాస్ కనిపించినంత సేపు థియేటర్స్ ఊగిపోయాయి. ఆయన ఉండడం వల్లే కన్నప్ప తొలి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టగలిగింది. అయితే ఈ చిత్రానికి ప్రభాస్ కూడా ఒక్క రూపాయి పారితోషికంగా తీసుకోకపోవడం గమనార్హం. ప్రభాస్ స్థానంలో మరో ఏ హీరో ఉన్నా.. ఇలా ఒప్పుకునేవారు కాదేమో. ఈ విషయాన్ని మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు(చదవండి: రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన మిరాయ్.. తేజ కెరీర్లోనే అత్యధికం..)అలా కన్నప్పతో మంచు విష్ణుకి తోడుగా నిలిచిన ప్రభాస్.. ఇప్పుడు ‘మిరాయ్’తో తమ్ముడు మనోజ్కి అండగా నిలిచాడు. తేజ సజ్జ, మనోజ్ నటించిన ఈ చిత్రానికి ప్రభాస్ గాత్రదానం చేశాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన చిత్ర యూనిట్..రిలీజ్కి కొన్ని గంటల ముందు అఫిషియల్గా ప్రకటించింది. ప్రభాస్ వాయిస్ ఓవర్కి థియేటర్స్ దద్దరిల్లిపోతుండగా, సోషల్ మీడియా ఊగిపోతుంది. ఇలా అటు కన్నప్ప, ఇటు మిరాయ్ చిత్రాలకు తనవంతు సాయం అందించి, మంచు బ్రదర్స్కి రెబల్ స్టార్ అండగా నిలిచాడు. ఇదే విషయాన్ని మిరాయ్ సక్సెస్ మీట్లో మంచు మనోజ్ గుర్తు చేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘మా అన్నదమ్ములకు సపోర్ట్గా నిలబడినందుకు థ్యాంక్యూ సో మచ్ డార్లింగ్’ అంటూ ప్రభాస్కి కృతజ్ఞతలు తెలిపాడు. -
సక్సెస్ చూసి 12 ఏళ్లు.. నా ఫ్యామిలీని నిలబెట్టారు: మనోజ్ ఎమోషనల్
విజువల్ వండర్గా తెరకెక్కిన మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ మూవీ తొలి రోజు రూ.27.20 కోట్లు రాబట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. శనివారం (సెప్టెంబర్ 13) ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. రుణపడి ఉంటా..ఇలాంటి సక్సెస్ మీట్లో పాల్గొని చాలాకాలమైందంటూ మనోజ్ (Manchu Manoj) భావోద్వేగానికి లోనయ్యాడు. సక్సెస్ వేదికపై నిలబడ్డందుకు సంతోషంగా ఉంది. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత నా ఫోన్ మోగుతోంది. అందరూ సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. కానీ, నాకు చాలాకాలమైంది. నిన్నటినుంచి అందరూ ఫోన్లు చేసి విషెస్ చెప్తుంటే అంతా కలలాగే ఉంది. దర్శకుడు కార్తీక్ ఏం ఆలోచించుకుని కథ రాసుకున్నారో కానీ నాకోసం ఓ పాత్ర రాసుకుని అడిగారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కమ్బ్యాక్ ఎప్పుడని అడిగేవారుఈ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని కార్తీక్ నాకు చెబుతూ ఉండేవాడు. ఆ మాట చాలనుకున్నాను. ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతూ ఉండేవాడిని. అప్పుడు సోషల్ మీడియాలో.. అన్నా, కమ్బ్యాక్ ఎప్పుడు? సినిమా చేయు, నీకు హిట్టు పడాలి, కమ్బ్యాక్ ఇవ్వు అని అడుగుతూ ఉండేవారు. వస్తున్నాను తమ్ముడు, త్వరలోనే చేస్తాను అనేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా లోపల మాత్రం ఏదో తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు దగ్గరివరకు వచ్చి వెళ్లిపోయాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరిగేది. నా కుటుంబాన్ని నిలబెట్టారుఇలాంటి సమయంలో డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్ నన్ను నమ్మారు. కార్తీక్లాంటి దర్శకుడు, టెక్నీషియన్ను నా జీవితంలో చూడలేదు. మిమ్మల్ని దగ్గరినుంచి చూసినందుకు సంతోషంగా ఉంది. మీరు నన్నొక్కడినే కాదు, నా కుటుంబాన్ని సైతం నిలబెట్టారు. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కానీ నాలో ఓ భయం ఉండేది. నేను పెరిగినట్లుగా నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా? వాళ్లను బాగా చూసుకోగలుగుతానా? అని రోజూ భయపడేవాడిని. ఆ భయాన్ని మీరు చంపేశారు. నేను గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి పాదాలకు నా వందనం అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు? -
‘మిరాయ్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘మిరాయ్’పై మంచు విష్ణు ట్వీట్.. రిప్లై ఇచ్చిన మనోజ్!
ఎంతో అన్యోన్యంగా ఉండే మంచు ఫ్యామిలీలో కొన్నాళ్ల క్రితం పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. మనోజ్పై తండ్రి మోహన్ బాబు కేసు పెడితే.. తండ్రి,అన్నయ్యలపై మనోజ్ కేసులు పెట్టాడు. మీడియా ముఖంగా దాడికి దిగారు. బౌన్సర్లను పెట్టుకొని హడావుడి చేశారు. కట్ చేస్తే..ఇప్పుడు అన్నదమ్ములిద్దరు కలిసిపోయినట్లు ఉన్నారు. ఒకరి సినిమాపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. ఆ మధ్య రిలీజైన కన్నప్ప సినిమాపై మనోజ్ ప్రశంసలు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సినిమా బాగుందని.. విష్ణు యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఇప్పుడేమో తమ్ముడు నటించిన మిరాయ్ సినిమాపై విష్ణు ట్వీట్ చేశారు.(‘మిరాయ్’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)సినిమా రిలీజ్ సందర్భంగా నిన్న(సెప్టెంబర్ 12) ‘మిరాయ్’ బృందానికి విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ దేవుని దయ మీపై ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్ చేశాడు. అన్నయ్య ట్వీట్కి తమ్ముడు మనోజ్ రిప్లై ఇచ్చాడు. మిరాయ్ యూనిట్ తరపున ‘థాంక్యూ సో మచ్ అన్న’ అంటూ మనోజ్ ట్విట్ చేశాడు. వీరిద్దరి ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని.. త్వరలోనే మంచు ఫ్యామిలీ ఒకటవ్వాలని కోరుకుంటున్నామంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించిన వెంకటేశ్, మహేశ్బాబు కలిసిపోయే ఎమోషనల్ సీన్కు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..‘అన్నదమ్ములు కలిసిపోయారు’ అని రీట్వీట్స్ చేస్తున్నారు.(చదవండి: బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు మిరాయ్ కలెక్షన్స్ ఎంతంటే?)ఇక మిరాయ్ విషయానికొస్తే.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటించగా, మనోజ్ విలన్ మహావీర్ లామా పాత్రను పోషించాడు. రిలీజ్ తర్వాత మనోజ్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మనోజ్ విలనిజం అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. హిట్ టాక్ రావడంతో తొలి రోజే రూ. 12 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. -
బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు ఎన్నికోట్లంటే?
ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్ (Mirai Movie) మాత్రం తక్కువ బడ్జెట్తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. హీరోయిన్గా రితికా నాయక్, విలన్గా మంచు మనోజ్, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.ఫస్ట్డే కలెక్షన్స్సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది హనుమాన్ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ మొదటిరోజు రూ.25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ రికార్డును మిరాయ్ బద్ధలు కొట్టింది. మిరాయ్ మూవీ నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా మిరాయ్ నిలిచింది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. BRAHMAND DAY 1 💥💥💥27.20 Crores WORLDWIDE GROSS for #MIRAI ᴡɪᴛʜ ɴᴏʀᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 🔥🔥🔥Keep showering your love on #BrahmandBlockbusterMIRAI and experience it ONLY on the Big Screens ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star… pic.twitter.com/lvYrluMkZS— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 #SuperYodha is setting the box office on fire 🔥🔥🔥#Mirai North America Gross $700K+ & counting 🇺🇸❤️🔥❤️🔥❤️🔥Experience '𝗕𝗥𝗔𝗛𝗠𝗔𝗡𝗗 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥' in cinemas now 💥North America by @ShlokaEnts @peoplecinemas Superhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/zDHsgJiJjQ— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 Blockbuster Vibes & Grateful Smiles 🤩🤩🤩Team #MIRAI shares overwhelming joy for the BRAHMAND BLOCKBUSTER ❤️🔥❤️🔥❤️🔥Experience India's Most Ambitious Action Adventure Only On the Big Screens 💥💥💥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/OxOzGeWKbr— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 చదవండి: ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్
'మిరాయ్' సినిమా మంచు మనోజ్ టాలెంట్ను బయటకు తెచ్చింది. తన సత్తా ఏంటో ఈ చిత్రంలో చూపించాడు. గతంలో ఆయన నటించిన చాల సినిమాలు ప్రత్యేక గుర్తింపును పొందాయని చెప్పవచ్చు. వేదం, నేను మీకు తెలుసా, ఒక్కడు మిగిలాడు, ప్రయాణం వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని తనలో మంచి నటుడు ఉన్నాడని ప్రేక్షకులకు తెలిపాడు. అయితే, కుటుంబంలో వివాదాలు, తన వ్యక్తిగత కారణాల వల్ల సరైన సినిమాలు చేయలేకపోయాడు. ఇప్పుడు మిరాయ్లో మహావీర్ లామా పాత్రలో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే తన అమ్మగారు నిర్మలా దేవి ఆనందంతో ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను మనోజ్ పోస్ట్ చేశారు.'మిరాయ్ విజయం మా అమ్మ అందరికంటే ఎక్కు గర్వంగా ఫీల్ అయింది. దీన్ని సాధ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా చుట్టూ ఉన్న నా ప్రియమైన వారితో ఇలా సంతోషాన్ని పంచుకోవడం మరింత చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ప్రతి సినిమా ప్రేమికుడికి మీరు చూపించే అపారమైన ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.' అని ఆయన తెలిపారు. మిరాయ్లో మంచు మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. మనోజ్ మాత్రమే చేయగలిగే పాత్ర అనేలా ఉంటుంది. ఈ సినిమా అతనికి మరిన్ని ఛాన్స్లు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు.మంచు కుటుంబంలో వివాదాల తర్వాత వారందరూ మళ్లీ కలిసిపోవాలని అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. మనోజ్ సోదరుడు మంచు విష్ణు కూడా మిరాయ్ యూనిట్ టీమ్ కోసం ఒక ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబం ఒక్కటి కాబోతుందని వారి అభిమానులు సంతోషిస్తున్నారు.My mom was the proudest 🙏🏼❤️ Thank u all for making this happen ♥️ Celebrating it with my dearest ones around me makes it even more memorable 🙌🏼My heartfelt thanks to each and every movie lover for the immense love 🙏🏻#Mirai #BlackSword pic.twitter.com/eJYQIWr7MU— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025 -
'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
'మిరాయ్' స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్.. చాలా తక్కువే
తేజ సజ్జా (Teja Sajja), మంచు మనోజ్ (Manchu Manoj) కాంబినేషన్లో తాజాగా విడుదలైన చిత్రం మిరాయ్... కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మిరాయ్లో ఈ మూడు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా బాగుందని ఇప్పటికే సోషల్మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇందులోని విజువల్స్ ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. అయితే, మిరాయ్ కోసం తేజ సజ్జా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది..? అనే చర్చ జరుగుతుంది.సినిమా హిట్ అయితే.. రెమ్యునరేషన్పై తేజమిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కోసం రూ. 60 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ ఔట్ పుట్ చూస్తే మాత్రం సుమారు. 200 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉంటారనిపించేలా ఉంటుంది. అందరూ మిరాయ్ కోసం తేజ సజ్జా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని భావించినా, వాస్తవం కొంచెం భిన్నంగా ఉన్నట్లు సమాచారం. తేజా స్వయంగా చెప్పిన ప్రకారం, హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్నే మిరాయ్కు కూడా తీసుకున్నానని ఒక వేదికపై చెప్పారు. అయితే, ప్రొడ్యూసర్ మీద తనకున్న నమ్మకం వల్ల, సినిమా హిట్ అయితే మంచి అమౌంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అది కేవలం నిర్మాత ఇష్ట ప్రకారంగా తీసుకునే నిర్ణయం మాత్రమేనని అన్నారు. హనుమాన్ హిట్ అయిన తర్వాత కూడా తాను ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడగలేదన్నారు. ఆ సినిమా నిర్మాతల నుంచి కూడా తనకు రెమ్యునరేషన్ మించి ఒక్క రూపాయి కూడా అదనంగా అందలేదని సమాచారం. మనోజ్కే ఎక్కువ రెమ్యునరేషన్హనుమాన్ కోసం తేజ సజ్జా రూ. 2 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతంలో తేజ చెప్పిన ప్రకారం మిరాయ్ సినిమాకు కూడా రూ. 2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు అర్థం అవుతుంది. అయితే, ఇకనుంచి ఆయన నటించనున్న కొత్త సినిమాలకు సుమారు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్.. హనుమాన్ సినిమా కంటే ముందే మిరాయ్తో తేజ సజ్జా ఒప్పందం చేసుకున్నారు. కానీ, తనకు కథ నచ్చితే రెమ్యునరేషన్ పెంచబోనని కూడా తేజ చెప్పడం విశేషం. మంచు మనోజ్ కూడా మిరాయ్ సినిమా కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రియ మాత్రం రూ. 2 కోట్ల వరకు అందుకున్నారని టాక్.. అయితే, ఇందులో హీరోయిన్గా అద్భుతంగా మెప్పించిన రితిక నాయక్ మాత్రం రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం ఉంది. -
బాహుబలి తర్వాత ఈ సినిమానే: రాం గోపాల్ వర్మ ట్వీట్
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025 -
మిరాయ్ పై అంచనాలు పెంచేసిన ప్రభాస్..!
-
మిరాయ్ సినిమా.. ప్రేక్షకుల రియాక్షన్స్ ఇదే!
-
‘మిరాయ్’ మూవీ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ఈ కుర్ర హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్డమ్ని నిలబెట్టుకోవాలంటే.. తేజకి ఇంకో హిట్ కచ్చితంగా కావాలి. అందుకే వెంటనే సినిమా చేయకుండా.. కాస్త సమయం తీసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మిరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తేజా సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ కథ అశోకుడి పాలన(క్రీ.పూ.232)లో ప్రారంభమై.. ప్రస్తుత కాలంలో సాగుతుంది. కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్ ఆశోకుడు పశ్చాత్తాపానికి లోనై.. తనలో దాగి ఉన్న దివ్య శక్తిని 9 గ్రంథాలలోకి ఇముడింపజేస్తాడు. ఒక్కో గ్రంథంలో ఒక్కో శక్తి ఉంటుంది. వాటికి తరతరాలుగా 9 మంది యోధులు రక్షకుల ఉంటారు. మహావీర్ లామా(మంచు మనోజ్) వాటిని చేజిక్కుంచుకుని దివ్య శక్తిలను పొంది.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తాడు. తనకున్న తాంత్రిక శక్తుల బలంతో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. తొమ్మిదో గ్రంథం అంభిక(శ్రియా శరన్) రక్షణలో ఉంటుంది. మహావీర్ కుట్రను ముందే పసిగట్టిన అంభిక.. తొమ్మిదో గ్రంథం రక్షణ కోసం తన కొడుకు వేద(తేజ సజ్జా)ను తయారు చేస్తుంది. అనాథగా పెరిగిన వేదకు విభా(రితిక నాయక్) దిశానిర్దేశం చేస్తుంది. మహావీర్ని ఆడ్డుకునే శక్తి ‘మిరాయ్’ ఆయుధంలో ఉందని వేదకు తెలిసేలా చేస్తుంది. మరి మిరాయ్ ఆయుధం కోసం వేద ఏం చేశాడు? ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? హిమాలయాల్లో ఉన్న ఆగస్త్య(జయరాం) అతనికి ఎలాంటి సహాయం చేశాడు. చివరకు ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ చేతికి వెళ్లిందా లేదా? మహావీర్ నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాణాలు, ఇతీహాసాల్లోని కథలను తీసుకొని, దానికి కాస్త ఫిక్షన్ జోడించి సినిమా చేయడం..ఈ మధ్య టాలీవుడ్లోనూ ట్రెండింగ్గా మారింది. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే ‘మిరాయ్’. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ని తీసుకొని.. ఒకవేళ ఆ గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నిస్తే.. మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. కథగా చూస్తే.. ఇది మరీ అంత కొత్తదేమి కాదు. హను-మాన్, కార్తీకేయ 2 తో పాటు హాలీవుడ్లోనూ ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, విజువల్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉన్నాయి. కార్తీకేయ 2లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే.. మిరాయ్లో శ్రీరాముడి కోదండం కోసం వెతుకుతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నిశాలు స్క్రీన్పై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్. అలాగే సెకండాఫ్లో కూడా ఒకటి, రెండు సీన్లు అదిరిపోయాయి. రాముడి ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే... సెకండాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ట్రైన్ ఎపిసోడ్, శ్రీరాముడి ఎపిసోడ్ .. ఆ సాగదీతను మరిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా ‘మిరాయ్’ మాత్రం థియేటర్స్లో చూడాల్సిన విజువల్ వండర్. ఎవరెలా చేశారంటే.. వేద పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఇదే తరహాలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పోతే మాత్రం..తేజ రేంజ్ ఊహించని స్థాయికి వెళ్తుంది. ఇక మంచు మనోజ్ విలనిజం అద్భుతంగా పండించాడు. తేజ సజ్జ కంటే మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి. మహావీర్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. శ్రీయకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. వేద తల్లి అంభిక పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. ఆగస్త్య పాత్రలో జయరాం చక్కగా నటించాడు. రితికా నాయక్, జగపతి బాబు, వెంకటేశ్ మహా, తిరుమల కిశోర్, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గౌర హరి నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా సంపాతి పక్షి ఎపిసోడ్, రాముడి ఎపిసోడ్కి ఇచ్చిన బీజీఎం గూస్బంప్స్ తెప్పిస్తాయి. దర్శకుడిగానే కాకుంగా సినిమాటోగ్రాఫర్గాను కార్తీక్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్గా ఉంది. ఇక వీఎఫెక్స్ పని తీరు గురించి ముఖ్యంగా చెప్పుకొవాలి. వందల కోట్ల పెట్టి తీసిన సినిమాల్లోనూ గ్రాఫిక్స్ పేలవంగా ఉంటుంది. కానీ రూ. 60 కోట్ల బడ్జెట్లో ఈ స్థాయి ఔట్ పుల్ తీసుకురావడం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం
రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాల్లో కచ్చితంగా డివోషనల్ ఎలిమెంట్స్ లేదా క్లైమాక్స్లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ వరకు కొన్నింటిని దాస్తుంటే మరికొన్నింటిని మాత్రం ముందే రివీల్ చేస్తున్నారు. కానీ తాజాగా థియేటర్లలో రిలీజైన 'మిరాయ్'లో మాత్రం ప్రభాస్ నటించాడనే రూమర్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఓ ఫొటో కూడా సర్కూలేట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన సినిమా 'మిరాయ్'. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్తోనే తీశారు. మంచు మనోజ్ విలన్ కాగా.. ఇందులో రాముడి రిఫరెన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేసుంటారా అని అందరూ మాట్లాడుకున్నారు. అలానే నిన్న రాత్రి తేజ్ సజ్జా.. సినిమాలో ప్రభాస్ సర్ప్రైజ్ కూడా ఉందని ట్వీట్ చేశాడు. దీంతో ఏంటా సంగతి అనుకున్నారు.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)అయితే సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్.. ప్రభాస్తో చెప్పించారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రభాస్ని రాముడిగా ఎడిట్ చేసి థియేటర్ స్క్రీన్పై ఆ బొమ్మని పెట్టేశారు. దీంతో చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇదో ఎడిటెడ్ ఫొటో. 'మిరాయ్' చిత్రం కోసం ప్రభాస్.. తన గొంతు మాత్రమే ఇచ్చాడు. ఇదే నిర్మాణ సంస్థ 'రాజాసాబ్' తీస్తుంది.ప్రస్తుతం 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. కానీ తొలిరోజు వచ్చే టాక్ కాదు, ఒకటి రెండు రోజుల తర్వాత అసలు టాక్ వస్తుంది. అప్పుడు సినిమా రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
మిరాయ్ ట్విటర్ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సిసిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిరాయ్’ ఎలా ఉంది? తేజ సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదతర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్లో మిరాయ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉందంటూ చాలా మంది ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే ఇందులో ప్రభాస్ కనిపించడం పెద్ద సర్ప్రైజింగ్ అంశం. ఎక్స్లో ప్రభాస్ పాత్రలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ సినిమాకు ప్లస్ అయిందని చెబుతున్నారు.#Mirai A Worthy Action Adventure Infused with Devotional Elements! Mirai delivers an engaging first half, with a few dips in the middle, but a good pre-interval to interval block. The second half slows down in places, but a few strong sequences and a superb climax hold it…— Venky Reviews (@venkyreviews) September 11, 2025‘చిన్న చిన్న మలుపులతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్ కొన్ని చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా..కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టినట్లు అనిపించదు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. #MiraiReview Positives@shriya1109#Jayaram@tejasajja123@HeroManoj1 (Mohan babu)#RitikaAnd everyone gave their best -VFX 👌👏-Second half BGM-Mirai daggariki vellaka vache sequence -Second half till climaxNegatives:Time ayipothundhani fast fast ga end chesinattundhi— ZoomOnZindagi (@ZoomOnZindagi) September 12, 2025 ‘తేజ సజ్జ, శ్రియ, మనోజ్, జయరామ్, రితికా..ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీఎఫెక్స్ అదిరిపోయింది. సెకండాఫ్ బీజీఎం బాగుంది. మిరాయ్ దగ్గరకు వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్. క్లైమాక్స్ బాగుంది. సినిమాలో నెగెటివ్ పాయింట్ ఏంటంటే.. టైమ్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఎండ్ చేసినట్లు ఉంటుంది’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Just a voice over turned the entire film reception into rebel vibe 🔥🔥🔥Just his name is enough 💥💥💥 #Prabhas #Mirai pic.twitter.com/rhvvntcNGO— Prabhas RULES (@PrabhasRules) September 11, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai – A Divine Action Adventure! 🔥✨High moments, solid interval, superb climax.Tech brilliance + Gowra Hari BGM elevate big time.@tejasajja123 shines bright.@HeroManoj1 👌💥Unique, engaging & worth a big-screen watch!Rating: ⭐⭐⭐⭐/5— 𝐕𝐢𝐡𝐚𝐚𝐧 (@TheRealPKFan) September 12, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai 12 सितम्बर को रिलीज़ हो रही है ये फ़िल्म सनातन धर्म के आदर्श और राम जी की ताक़त से प्रेरित है 🚩दक्षिण भारत हमें सुपरहीरो देता है, बॉलीवुड बस स्टारकिड्स 😏आधुनिक युग में एक बेहतरीन फिल्मइस बार सिनेमा हॉल भरकर दिखाओ कि असली कंटेंट ही जीतेगा 💪#Mirai— ठाकुर राजन तोमर (@rajanbhajpa) September 12, 2025#Mirai - 🆗Teja Sajja delivers a gud Perf. Graceful Shreya. Superb Visuals & BGM. Promising start, middle portions r draggy. Post Interval Transformation fight gud. Lord Rama saved d climax. Though not extra ordinary, it Deserves a One Time Watch for its Cinematic Experience!— Christopher Kanagaraj (@Chrissuccess) September 12, 2025#Mirai Baane undi, Parledu!A decent fantasy action adventure film which has similar tones of #Karthikeya2 & #HanumanFew sequences are fantastic but few are subpar.Loved #ShriyaSaran role👍🏻#TejaSajja is brilliant and he killed it👌#ManchuManoj role is underwhelming🥲 pic.twitter.com/r7gHrlhsph— Sanjeev (@edokatile) September 12, 2025 -
నా చిన్నప్పుడే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు: హీరో తేజ సజ్జా
‘‘మనం ఎంత ఖర్చుపెట్టినా ప్రేక్షకుల నమ్మకాన్ని కొనలేం. సినిమాలు స్పీడ్గా చేయాలని, రెండు మూడు సినిమాలు వరుసగా చేసేసి, ప్రేక్షకులను ఒక్కసారి నిరుత్సాహపరిచినా నాకు బాధగా ఉంటుంది. నేను దక్కించుకున్న క్రెడిబిలిటీ, నా కష్టం తాలూకు విలువ పోతుంది. నా సినిమా వస్తోంది... థియేటర్స్కు రండి అని ఆడియన్స్ని నేను కాన్ఫిడెంట్గా, ధైర్యంగా పిలిచేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. ‘మిరాయ్’ ఇలాంటి చిత్రమే’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా చెప్పిన సంగతులు. ⇒ ఫుల్ ఫ్యామిలీ అండ్ క్లీన్ ఫిల్మ్ ‘మిరాయ్’. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్... ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రం ఇది. చార్మినార్లోని కుర్రాడు వాడి ధర్మం ఏంటో వాడు గ్రహించి, తనకి, యోధ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని, ఓ పెద్ద ఆపదను ఆపడానికి ఎంత దూరం వెళ్లాడు? తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ప్రపంచం అంతరించబోతున్నటువంటి ఓ పెద్ద ఆపద రాబోతున్నప్పుడు మన ఇతిహాసాల్లో వేల సంవత్సరాల క్రితం పెట్టి ఉంచిన సమాధానాన్ని ఈ కుర్రాడు ఎలా కనుక్కుంటాడు? అన్నది ఈ సినిమా కథాంశం. ⇒ ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ సీక్వెన్స్లు వరకు ఉన్నాయి. వయసులో ఉన్నాను కాబట్టి ఫిజికల్ చాలెంజ్లు ఏం అనిపించలేదు. ఈ సీక్వెన్స్లు చూసి, ఆడియన్స్ ఎంత థ్రిల్ అవుతారో చూడాలనుకుంటున్నాను. టీజీ విశ్వప్రసాద్గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆడియన్స్కు నచ్చే మంచి సినిమా తీద్దామనుకునే నిర్మాత. ఆయనలాంటి నిర్మాతలు అరుదు. అందుకే ఆయనతో మరో సినిమా చేస్తున్నాను. ⇒ నా చిత్రాలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలని తపన పడుతుంటాను. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనుకుంటాను. ఆ ప్రెజర్ ఉంది. కానీ ‘హను–మాన్’ సినిమా సక్సెస్తో నాపై కొత్తగా పెరిగిన ఒత్తిడి ఏం లేదు. చె΄్పాలంటే ఒక రకంగా ‘హను–మాన్’ సినిమా విషయంలోనే ఒత్తిడి ఫీలయ్యాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించింది కదా అని ‘మిరాయ్’ సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు. ⇒ మా నాన్నగారు హార్డ్వర్కింగ్ పర్సన్. ఆయన వయసు 65. ఈ రోజుకీ ఆయన ఉదయం 6.30కి ఉద్యోగానికి వెళ్తారు. సాయంత్రం 8 గంటలకు వస్తారు. పనిని ఫస్ట్ ప్లేస్లో పెట్టేవారిలో మా ఫాదర్ ఒకరు. అలాంటి ఇంటి నుంచి వస్తున్నాను కాబట్టే పనికి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానేమో అనిపిస్తోంది. పనే దైవం అని భావిస్తాను. ⇒ కథ కుదరితే పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా రిలీజ్ చేస్తాం. నిజానికి పాన్ ఇండియా సూపర్ స్టార్లు నా చిన్నప్పట్నుంచి ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావుగార్ల సినిమాలు చెన్నైలో చూసేశారు. చిరంజీవిగారు స్ట్రయిట్గా హిందీలో సినిమాలు చేశారు. రజనీకాంత్, కమల్హాసన్గార్ల సినిమాలు నేను నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. అలాంటి వారికి జోడించాల్సిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని నాలాంటి యంగ్ హీరోస్కి పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నమ్మేవారిలో నేనొకడిని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మేం సినిమాలు చేస్తున్నాం. ఒకవేళ మేం చేసే చిత్రం ఇతర భాషల ఆడియన్స్కు కూడా నచ్చితే, అది మాకు బోనస్. దీని కోసం రిలీజ్ చేయడమే. అంతేకానీ... అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ప్రయత్నం ఏమీ లేదు. ⇒ ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నానా? లేదా అనేది ప్రశాంత్ వర్మగారు చెబుతారు. ‘జాంబిరెడ్డి 2’ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. ప్రశాంత్గారు కథ అందిస్తున్నారు. విశ్వప్రసాద్గారు నిర్మిస్తారు. ‘మిరాయ్’ సినిమా విజయం సాధిస్తే, రెండో భాగం కూడా ఉంటుంది. -
‘మిరాయ్’ షూటింగ్లో తేజకు గాయాలు, అనారోగ్యం.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ‘మిరాయ్’ అవకాశం వచ్చింది. అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ చిత్రంలోని యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అని అన్నారు హీరోయిన్ రితీకా నాయక్. హనుమాన్ తర్వాత తేజ సజ్జ నటించిన తాజా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా నటించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్గా రితీకా నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. ముఖ్యంగా తేజ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా చేసింది. అయినప్పటికీ ఆయన కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.మనోజ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా ఫన్ ఫుల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.కార్తీక్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. -
జూనియర్ ఎన్టీఆర్తో సినిమా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది భైరవం మూవీతో మెప్పించిన మనోజ్ మిరాయ్తో అలరించనున్నారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రంలో విలన్గా అభిమానులను మెప్పించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో తెరకెక్కించిన మిరాయ్ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన అభిమానులతో ఎక్స్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆస్క్ బ్లాక్స్వార్డ్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్లో ఫ్యాన్స్ పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని నిన్ను, జూనియర్ ఎన్టీఆర్ను తెరపై చూడాలన్న కోరిక ఉందని అడిగాడు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ..నాది కూడా అదే కోరిక అంటూ రిప్లై ఇచ్చారు.మరో అభిమాని మీరు నంద్యాలకు ఎప్పుడు వస్తారు అన్న అని అడిగాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మిరాయ్ సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తా.. నంద్యాల వైబ్ యే వేరు.. అది మిస్సయితే నా ఇంట్లో నాకు ఫుడ్ కూడా ఉండదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ట్విటర్లో సమాధానాలిచ్చాడు మంచు మనోజ్. కాగా.. మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Nakkuddaaa…♥️♥️♥️ #Tfi 🙏🏼❤️#AskBlackSword #Mirai https://t.co/P3PF1GwCat— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 Joining in to celebrate #Mirai big time!!! 🙌🏼Nandyal vibe ye veru :) ♥️♥️ Miss ayithe, na intilo naku food vundadhu… #AskBlackSword https://t.co/jw2isqn1LC— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్.. ట్రైలర్ రిలీజ్పై బిగ్ అప్డేట్!
తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం మిరాయ్. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ గురించి మాట్లాడారు. టికెట్ ధరలు పెంచబోమని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ మంది సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.ది రాజాసాబ్ అప్డేట్ ఇదే..మిరాయ్ ప్రెస్మీట్లో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా విడుదల కానుందని తెలిపారు. రిషబ్ శెట్టి కాంతార-2 ప్రదర్శించే థియేటర్లలో ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే ఈ లెక్కన అక్టోబర్ 2న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజున తొలి పాటను విడుదల చేసే ఆలోచన ఉందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ది రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.#TheRajaSaab trailer1 will be attached with #KantaraChapter1 🔥 - #TGVishwaPrasad, Producer. Be ready for mass trailer in just one month. #KantaraChapter1onOct2 #TheRajaSaabTeaser #Prabhas #RishabhShetty #Bijuria pic.twitter.com/pmV250U6Q6— Subha The Luck (@Subha_The_Luck) September 3, 2025 -
ఎనిమిది భాషల్లో మిరాయ్ రిలీజ్.. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న హీరో తేజ సజ్జా. ప్రస్తుతం యాక్షన్-ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్లో కనిపించనున్నారు.తాజాగా మిరాయ్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు హీరో తేజ సజ్జా ట్వీట్ చేశారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఈ మూవీని ఎంజాయ్ చేయండని పోస్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా యాక్షన్, ఎమోషన్, భక్తి ఉండే చిత్రమని రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా మెప్పించనుంది. అంతేకాకుండా శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. 2డీతో పాటు 3డీ ఫార్మాట్లో రిలీజవుతోంది.#MIRAI Censored with 𝐔/𝐀 ❤️🔥A CLEAN FILM for KIDS, FAMILIES and ALL SECTIONS OF AUDIENCE to experience Action, Emotion & Devotion on the big screens💥💥💥GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🥷Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg… pic.twitter.com/p3zCOrTWK9— Teja Sajja (@tejasajja123) September 8, 2025 -
మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా
'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించాడు హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ (Mirai Movie). మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. వారికోసమే ఈ నిర్ణయంతెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, మరాఠి, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సోమవారం నాడు మిరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై టికెట్ రేట్ల పెంపు గురించి హీరో క్లారిటీ ఇచ్చాడు. తేజ సజ్జా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు లేదు. తక్కువ ధరకే ఈ సినిమాను చూడబోతున్నారు. మా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ను ఇబ్బంది పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కుటుంబమంతా వచ్చి చూడాలనే టికెట్ రేట్లు పెంచడం లేదు అని తేజ సజ్జ పేర్కొన్నాడు.టికెట్ రేట్లు యథాతథంఅయితే ఓ రెండు సర్ప్రైజ్లు దాచుంచామని, అది ఎవరికీ తెలియదని, తెలుసుకోవాలంటే థియేటర్కు రమ్మని పిలుపునిచ్చాడు. ఈరోజుల్లో మధ్య తరహా, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. అలాంటి తరుణంలో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా తీసుకొస్తుండటంతో పలువురూ మిరాయ్ టీమ్ను అభినందిస్తున్నారు.కథేంటంటే?మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని భావించి దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. ఆ గ్రంథాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ వాటిని ఒక్కొక్కటిగా తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాటిని హీరో కాపాడాడా? లేదా? అన్నదే సినిమా కథ! ఈ మూవీని చైనా, జపాన్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
విశాఖలో 'మిరాయ్' ప్రీరిలీజ్ వేడుక.. సందడిగా స్టార్స్ (ఫోటోలు)
-
'మిరాయ్' కోసం శంకర్ మహదేవన్.. పవర్ ప్యాక్డ్ సాంగ్ వచ్చేసింది
మిరాయ్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. తేజ సజ్జా ప్రధాన కథానాయుకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్లోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో రితికానాయక్ హీరోయిన్గా నటించగా.. మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి 'జైత్రయా' సాంగ్ను విడుదల చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించారు. -
Mirai: విడుదలకు ముందే రూ.20 కోట్ల లాభం!
ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు.అందుకే థియేటర్స్లో ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం లేదు. ఒకవేళ జరిగిన లాభాలు లేకుండానే రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమా రిలీజ్కి ముందే రూ. 20 కోట్ల లాభాలను సంపాదించింది. అదే ‘మిరాయ్’.ట్రైలర్తోనే...హనుమాన్తో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన తేజ సజ్జా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. విలన్గా మంచు విష్ణు, హీరో తల్లిగా శ్రియ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు భారీ స్పందన లభించింది. మూవీ విజువల్ వండర్లా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. వీఎఫెక్స్ అదిరిపోయింది. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలే వీఎఫెక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. మాత్రం ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినట్లు ట్రైలర్తోనే తెలిసిపోతుంది. ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే..?సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే రిలీజ్కు ముందే ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చాయి. ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ. 45 కోట్ల ఆదాయం వచ్చిందట. రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడం లేదు. పెట్టిన ఖర్చును కూడా వెనక్కి తెచ్చుకోలేపోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తేజ సజ్జా లాంటి కుర్ర హీరో సినిమా రిలీజ్కు ముందే లాభాలు తెచ్చిపెట్టడం టాలీవుడ్కి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. -
మిరాయ్ కథకు ఆ స్కోప్ ఉంది: దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని
తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ– ‘‘ఏడేళ్ల క్రితమే ‘మిరాయ్’ ఐడియా పుట్టింది. ఈ సినిమా పూర్తిగా కల్పితం. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ ఉంది.ఈ తొమ్మిది గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నించగా, వీటిని మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు? అన్నదే ‘మిరాయ్’ సినిమా కథ. ఈ చిత్రంలో తల్లి–కొడుకుల బలమైన ఎమోషన్ కూడా ఉంది. తల్లి–కొడుకులుగా శ్రియ– తేజ నటించారు. ఆధ్యాత్మిక భావనలు గల అంబిక (శ్రియ పాత్ర పేరు) తన ఆశయం నెరవేరడానికి తన కొడుకుకి ఎలా మార్గనిర్దేశకత్వం చేసింది? అన్నది సినిమాలో చూడాలి. తేజ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్ల్యాండ్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు.మనోజ్ రోల్ కథలో చాలా బలంగా ఉంటుంది. హీరోని గైడ్ చేసే అగస్త్య మునిగా జయరామ్, తాంత్రిక గురువుగా జగపతిబాబు నటించారు. జటాయు బ్రదర్ సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం. ట్రైలర్లో కనిపించే పక్షి సీక్వెన్స్ ఇది. ఈ పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. రియల్ లొకేషన్స్లో ఈ సినిమాను చిత్రీకరించాం. శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయ్ల్యాండ్... మొత్తం ఆసియా అంతా తిరిగేశాం. ఈ చిత్రంలో ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. శ్రీలంకలో తేజపై ట్రైన్ నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం మన ఇతిహాసాల్లోనో, పురాణాల్లోనో ఉందనే నమ్మకంతో ఈ సినిమా కథ చేశాను.చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇతిహాస కథలు, పాత్రలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే ఈ అంశాలన్నింటినీ కథలో ఆసక్తికరంగా బ్లెండ్ చేయడం అనేది నాకు సవాల్గా అనిపించింది. ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే అయింది. అయినా విశ్వ ప్రసాద్గారు చాలా స పోర్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్ పనులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే లోకల్గా చేస్తున్నారు.సినిమాలో వీఎఫ్ఎక్స్ బాగుండాలంటే ఒకటి మన దగ్గర డబ్బులు ఉండాలి లేదా మన దగ్గర టైమ్ ఉండాలి. మాకు టైమ్ ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. హరి గౌర సినిమాను ఎలివేట్ చేసే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఓ ఫ్రాంచైజీ బిల్డ్ చేసే స్కోప్ ఉన్న కథ ‘మిరాయ్’. ఈ సినిమా విజయంపై అది ఆధారపడి ఉంటుంది. ఇక దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా, ఎడిటర్గా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఏదన్నా ఐడియా ఉన్నప్పుడు వేరేవాళ్లకు కథలు కూడా ఇస్తున్నాను’’ అని అన్నారు. -
'రాజమౌళి సార్ మాస్టర్ అయితే.. మేమంతా విద్యార్థులం'.. నిర్మాత కామెంట్స్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియన్ సినిమాకు ఆయన ఒక బెంచ్ మార్క్ అని అన్నారు. ఆయనతో పోల్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజమౌళి అంటే నాకు గౌరవమని కరణ్ జోహార్ వెల్లడించారు. ఒక సినిమాను మరో మూవీతో పోల్చవద్దన్నారు. టాలీవుడ్ మూవీ మిరాయ్ ఈవెంట్కు హాజరైన ఆయన.. దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి సార్ ఒక మాస్టర్ అయితే.. మేమంతా ఆయన దగ్గర నేర్చుకునే శిష్యులమని కరణ్ జోహార్ అన్నారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో విజువల్ వండర్ మూవీ మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించనుంది.ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. -
రజనీకాంత్గారు క్లాస్ తీసుకున్నారు: మంచు మనోజ్
తేజ సజ్జా, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా, మంచు మనోజ్ మరో ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంచు మనోజ్ చెప్పిన విశేషాలు. ⇒ తేజ చిన్నప్పట్నుంచి నాకు తెలుసు. క్యూట్గా ఉండేవాడు... బుగ్గలు గిల్లేసేవాడిని. ఓ సందర్భంలో మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు తమ్ముడూ సినిమా చేద్దామని అన్నాను. ‘నిజమా? అన్నా’ అని ‘మిరాయ్’ గురించి చెప్పాడు. దర్శకుడు కార్తీక్గారు కథ చెప్పారు. నచ్చి, ఈ సినిమా చేశాను. ⇒ ‘మిరాయ్’లో పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాను. వారసత్వం, లేజీనెస్ని ఏ మాత్రం సహించని క్యారెక్టర్ నాది. కథ రీత్యా తొమ్మిది గ్రంథాలు నా దగ్గరకు వస్తే, నా తలతో కలిసి పది తలల రావణుడిని అవుతాను. వాటి కోసం ఏం చేశాను? అన్నదే కథ. ఒక రకంగా మోడ్రన్ రావణాసురుడు అని చెప్పుకోవచ్చు. కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లడు. దర్శకుడు నా క్యారెక్టర్ను స్పెషల్గా డిజైన్ చేశారు. ‘మిరాయ్’ నాకు మంచి కమ్బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ⇒ ‘మిరాయ్’ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. శ్రీరాములవారి ప్రస్తావన, 9 పుస్తకాల బ్యాక్డ్రాప్, ఇతిహాస కోణాలు... ఇవన్నీ బాగుంటాయి. ఈ సినిమా కోసం తేజ చేసిన హార్డ్వర్క్ మీకు స్క్రీన్పై కనిపిస్తుంది. మేమిద్దరం డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశాం. హైదరాబాదులో జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ఉన్న బడ్జెట్లోనే కార్తీక్గారు హాలీవుడ్ స్థాయి సినిమా తీశారు.విశ్వప్రసాద్ రాజీ పడకుండా నిర్మించారు. ఇక ‘కూలీ’ సినిమాకు ముందు మా ఇంట్లో రజనీకాంత్గారిని కలిశాను. ‘మిరాయ్’ ట్రైలర్ చూశారు. ఆయనకు నచ్చింది. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు ఎనర్జీనిచ్చాయి. ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని రజనీకాంత్ గారు క్లాస్ తీసుకున్నారు. ⇒ ‘డేవిడ్ రెడ్డి, రక్షక్’ సినిమాలు చేస్తున్నాను. ఇంటెన్స్ యాక్షన్ చిత్రాలు ఇవి. ఇక ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రం రావాల్సినప్పుడు వస్తుంది. అలాగే డార్క్ కామెడీ ఫిల్మ్ ‘వాట్ ద ఫిష్’ ఎప్పుడొచ్చినా చాలా బాగుంటుంది. కామెడీ చిత్రాలు చేయాలని ఉంది. కథల కోసం చూస్తున్నాను. ‘నేను మీకు తెలుసా’ టీమ్తో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. నటుడిగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనుకుంటున్నాను... కథలు వింటున్నాను. -
మిరాయ్ స్టోరీ ఇదే.. ఆసక్తిగా 'తేజా సజ్జా' వ్యాఖ్యలు
హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిరాయి. మంచు మనోజ్, జగపతిబాబు, శ్రియ, రితికనాయక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని తెరకెక్కించారు. ఈ నెల 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లో భాగంగా చైన్నెకి వెళ్లిన నటుడు తేజా సజ్జా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని చిత్రాలను మాత్రమే థియేటర్లో చూడాలనిపిస్తుందని, అలాంటి వాటిలో మిరాయి చేరుతుందని అన్నారు.యాక్షన్ ఎడ్వేంచర్ ఫాంటసీ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని 3ఏళ్ల బాలల నుంచి 80 ఏళ్ల పెద్దలు వరకూ చూసి ఆనందించే విధంగా ఉంటుందన్నారు. మిరాయి అంటే భవిష్యత్, నమ్మకం అని చెప్పారు. అయితే, మరో అర్థం కూడా ఉందని అది చిత్రంలో ట్విస్ట్తో తెలుస్తుందని చెప్పారు. మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని ఒక గ్రంధంగా రచించారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందనే భావనతో దాన్ని 9 గ్రంధాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. వారికి ఆ గ్రంధాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ ఒక్కొటిగా తస్కరిస్తుంది. వాటిని హీరో ఎలా కాపాడే ప్రయత్నం చేశాడు..? అన్నదే చిత్ర కథ అంటూ చెప్పారు.ఏదైనా విపత్తు వప్తే దాన్ని ఆపడానికి మన ఇతిహాసాల్లో ఒక సమాదానం ఉంటుందన్నారు. తన ధర్మాన్ని తెలుసుకుని విపత్తును ఎలా నిరోధించాడు.. అన్న పలు ఆసక్తి కరమైన అంశాలతో కూడిన మిరాయి చిత్రాన్ని చైనా, జపాన్ దేశాల్లోనూ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే ఆ దేశాల్లో భారతీయ చిత్రాలకు మంచి మార్కెట్ ఉందన్నారు. ఇంతకు ముందు తాను నటించిన హనుమాన్ చిత్రం చైనా, జపాన్ దేశాల్లో విడుదలయ్యిందని గుర్తుచేశారు. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేయడం చాలా సవాల్గా మారిందన్నారు. చిత్రం అంతర్జాతీయ స్థాయి విలువలతో ఉండాలని వీఎఫ్ఎక్స్లో ప్రతిభావంతులైన ప్రసాద్, కార్తీక్ పని చేశారని చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్వాహకురాలు అర్చనకు తేజా సజ్జా ధన్యవాదాలు తెలిపారు. -
అంబిక... చాలా పవర్ఫుల్
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటించారు. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.ఈ సినిమాలో శ్రియ శరణ్ పోషించిన అంబిక పాత్రని పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్ను మంగళవారం విడుదల చేసింది యూనిట్. ‘‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు తేజ సజ్జా. ఈ సినిమాలో తేజ తల్లి పాత్రలో పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించారు శ్రియ. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్తో ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.మిరాయ్ ట్రైలర్ బాగుంది – రజనీకాంత్ ‘‘మిరాయ్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది’’ అని హీరో రజనీకాంత్ పేర్కొన్నారు. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. సోమవారం ఈ సినిమా ప్రెస్మీట్ని చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ని కలిసి, ‘మిరాయ్’ ట్రైలర్ చూపించారు మనోజ్. ‘‘మిరాయ్’ ట్రైలర్ చూస్తుంటే సినిమాని గ్రాండ్ స్కేల్లో నిర్మించారని తెలుస్తోంది. మనోజ్ పాత్ర పవర్ఫుల్గా ఉందని అర్థం అవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి... యూనిట్కి అభినందనలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. ‘‘మిరాయ్’ మూవీతో రజనీకాంత్గారి ఆశీర్వాదాలు నాకు దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మంచు మనోజ్. -
మంచు మనోజ్కు రజనీకాంత్ అభినందనలు
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సినిమా 'మిరాయ్'. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో మూవీ మేకింగ్ తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. 'మిరాయ్' మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.'మిరాయ్' సినిమాతో మనోజ్ తన కెరీర్ లో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్ మూవీ ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
మిరాయ్ చిత్రంలో మహేశ్ బాబు.. తేజా సజ్జా క్లారిటీ!
హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం తేజా సజ్జా మరో విజువల్ వండర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరో బ్లాక్బస్టర్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ ట్రైలర్లో చివర్లో రాముడి పాత్రను చూపించారు. ఆ రోల్ చేసింది ఎవరనేదానిపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాముడి పాత్రలో ఉన్నది ప్రిన్స్ మహేశ్బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సీన్లో ఉన్నది ఎవవనేది మాత్రం చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న తేజ సజ్జాకు దీనిపై ప్రశ్న ఎదురైంది. రాముడి పాత్రలో ఉన్నది మహేశ్ బాబేనా అని అడిగారు. దానికి ఆయన కాదని తేజ సజ్జా సమాధానమిచ్చాడు. దీంతో రూమర్స్కు చెక్ పడింది. కాగా.. రాముడి పాత్రలో స్టార్ హీరో ఉన్నారని.. ఏఐ సాయంతో ఆ క్యారెక్టర్ రూపొందించారని మొదట రూమర్లు వినిపించాయి. మరి రాముడి పాత్రలో ఉన్నది ఎవరో తెలియాలంటే మాత్రం థియేటర్లలో చూడాల్సిందే. కాగా.. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్ర్లో మెప్పించనున్నారు. -
మిరాయ్.. ఓ అద్భుతం!
ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్లో వావ్ ఫ్యాక్టర్ అనేలా విజువల్ బేస్డ్ మూవీస్తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు. హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ.. ఈసారి యూనివర్సల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మిరాయ్ అంటూ అద్భుతం చేయడానికి వస్తున్నాడు. సినిమాటోగ్రఫర్ కమ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తీసిన ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ మూవీ ఒక విజువల్ వండర్ అని.. జస్ట్ మూడు నిమిషాల ట్రైలర్తో అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ మధ్య కాలంలో వచ్చిన విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాల్లో.. ది బెస్ట్ అవుట్ పుట్ ఇదే అనేలా మిరాయ్ ట్రైలర్ ఓ రేంజ్లో ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు.. ప్రతీ ఫ్రేమ్ గూస్బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ మరోటి రాలేదనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే) ప్రామిసింగ్గా సాగిన ఈ ట్రైలర్.. తేజ సజ్జాకు మరో పాన్ ఇండియా హిట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యమైన ఓ తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలు.. వాటి కోసం వెతికే విలన్.. దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటంతో విజువల్ గ్రాండియర్గా ట్రైలర్ సాగింది. హీరో చేసిన యాక్షన్ స్టంట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయనే చెప్పాలి. యోధుడిగా కనిపించబోతున్న తేజ.. మరోసారి సూపర్ హీరోగా ట్రైలర్తో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా.. ట్రైలర్ చివర్లో వచ్చే శ్రీరాముడు షాట్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన ట్రైలర్ ఇచ్చి, విజువల్ వండర్ సినిమా ఇవ్వబోతున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా మీడియా ఫ్యాక్టరీ పై విఎఫ్ఎక్స్ విషయంలో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సినిమాలో డైనమిక్ హీరో మంచు మనోజ్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తంగా.. ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ పై పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా అంచనాలు పెరగడంతో పాటు.. భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో బడా బడా బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో.. సెప్టెంబర్ 12న మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) -
అవెంజర్స్ రేంజ్ లో మిరాయ్ మూవీ..?
-
ఆలస్యమైనా... అలరిస్తాం
చిత్ర పరిశ్రమలో సినిమాల రిలీజ్లు వాయిదా పడటం సాధారణమే. కానీ రిలీజ్లు దగ్గర పడుతున్న తరుణంలో విడుదల వాయిదా పడుతున్న సినిమాల సంఖ్య ఇటీవలి కాలంలో టాలీవుడ్లో పెరిగింది. ఆగస్టు నెలలో సినీ కార్మికుల సమ్మె ఓ కారణమైతే, భారీ చిత్రాల వీఎఫ్ఎక్స్ వర్క్స్కి ఎక్కువ టైమ్ పట్టడం మరో కారణం... ఇలా పలు కారణాల వల్ల సినిమా రిలీజ్లు వాయిదా పడుతున్నాయి. కానీ అందరు మేకర్స్ చెబుతున్న మాట ఒకటే...‘ఆలస్యమైనా... అలరిస్తాం’ అని. అలా లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటున్న కొన్ని చిత్రాల గురించి ఓ లుక్ వేద్దాం.వేసవిలో విశ్వంభర విశ్వంభర చిత్రం ఈ ఏడాది థియేటర్స్లోకి రావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. సంక్రాంతి రిలీజ్ వాయిదా పడిన తర్వాత ‘విశ్వంభర’ చిత్రం ఈ ఏడాది చివర్లో అయినా రిలీజ్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ను వచ్చే వేసవికి వాయిదా వేశారు. వచ్చే ఏప్రిల్లో ‘విశ్వంభర’ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు.త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి.. చిరంజీవి సిస్టర్స్గా కనిపిస్తారని, త్రిష ద్వి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. పధ్నాలుగు లోకాలు దాటి హీరో సత్యలోకానికి ఎలా చేరుకున్నాడు? అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకున్నాడు? అనే అంశాల నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు.దసరా బరిలో లేదుహీరో బాలకృష్ణ, దర్శకుడు బోయ పాటి శీను కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాను ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా సెప్టెంబరు 25న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ దసరా బరి నుంచి ‘అఖండ 2’ చిత్రం తప్పుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించారు.వీఎఫ్ఎక్స్ పనులు, రీ–రికార్డింగ్ పనులతో పాటు మొత్తం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్కు మరింత సమయం పడుతుందని ఈ కారణంగా ‘అఖండ 2’ సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నామని, ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఓ సెలబ్రేషన్లా ఉంటుందని చెబుతూ, ‘అఖండ 2’ సినిమా రిలీజ్ వాయిదాను గురువారం కన్ఫార్మ్ చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం డిసెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. బాలకృష్ణ, బోయ పాటి కాంబినేషన్లో రూ పొందిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్గా ‘అఖండ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సంక్రాంతి బరిలో... వచ్చే సంక్రాంతి బరిలో ‘ది రాజాసాబ్’ చిత్రం నిలిచింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ హారర్ కామెడీ యాక్షన్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తొలుత ‘ది రాజాసాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఆ తర్వాత డిసెంబరు 5న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. తాజాగా ‘ది రాజాసాబ్’ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్ కన్ఫార్మ్ చేశారు.దీంతో డిసెంబరు 5 నుంచి జనవరి 9కి ‘ది రాజాసాబ్’ సినిమా వాయిదా పడినట్లు, అధికారిక సమాచారం వెల్లడైంది. ఇక తాత–మనవడు నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని, ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్రదర్శకుడు మారుతి స్పష్టం చేశారు. ఈ చిత్రంలో సంజయ్దత్– ప్రభాస్ తాత–మనవడు పాత్రల్లో కనిపిస్తారని, ‘రాజా డీలక్స్’ అనే ఓ భవనం నేపథ్యంలో ఈ సినిమా మేజర్ కథనం సాగుతుందని తెలిసింది.ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే, సెప్టెంబరులో కేరళ వెళుతుంది చిత్ర యూనిట్. అక్కడ ప్రభాస్ పాత్ర తాలూకు ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తారట. ఆ నెక్ట్స్ విదేశాల్లో హీరో – హీరోయిన్లపై చిత్రీకరించే డ్యూయెట్ సాంగ్లతో ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుందని తెలిసింది. ఫ్యాంటసీ హారర్ కామెడీ సినిమా కనుక, వీఎఫ్ఎక్స్–΄ోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్పై స్పెషల్ కేర్ తీసుకుంటోందట చిత్రయూనిట్. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్ జాతర రవితేజ కెరీర్లోని 75వ చిత్రం ‘మాస్ జాతర’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టారు. అలాగే ఈ సినిమాలో మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇందులో రవితేజ లక్ష్మణ్ భేరి అనే రైల్వే పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు.షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. అయితే ఈ వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ కావాల్సిన ‘మాస్ జాతర’ చిత్రం వాయిదా పడింది. ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన సమ్మె పరిస్థితులు, కొన్ని ఊహించని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ను ఈ ఆగస్టు 27న రిలీజ్ చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలి పారు. అయితే ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ వాయిదా పడటం ఇదేం తొలిసారి కాదు.నిజానికి ఈ సినిమాను తొలుత 2025 సంక్రాంతి రిలీజ్కి ప్లాన్ చేశారు. ఆ తర్వాత మే 9కి, ఆ నెక్ట్స్ ఆగస్టు 27కి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఈ తేదీల్లో రిలీజ్ కుదర్లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబరు చివర్లో లేదా నవంబరు ప్రారంభంలో ‘మాస్ జాతర’ చిత్రం విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర విలన్గా చేస్తున్నారని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హీరో వర్సెస్ డైరెక్టర్ ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకునే ఓ హీరో, ఓ డైరెక్టర్ మధ్య ఎందుకు విభేదాలు ఏర్పడ్డాయి? అసలు వీరి మధ్య ఏం జరిగింది? అన్న అంశాలతో రూ పొందిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. ఈ సినిమాలో సూపర్స్టార్ చంద్రన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, లెజెండరీ డైరెక్టర్ అయ్యా పాత్రలో సముద్ర ఖని నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో భాగ్యశ్రీ బోర్సే నటించారు.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబరు 12న రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. కానీ 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ సినిమా సెప్టెంబరు 12న రిలీజ్ కావడం లేదని ఫిల్మ్నగర్ సమాచారం. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించనున్నారు మేకర్స్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోయ్ వర్గీస్ ఈ సినిమాను నిర్మించారు.తొమ్మిది గ్రంథాల నేపథ్యంలో... ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్ విలన్ రోల్ చేశారు. జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జా, బ్లాక్స్వార్డ్ పాత్రలో మంచు మనోజ్ నటించారు.ఈ సినిమాను తొలుత ఆగస్టు 1న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా వారం రోజులు ఆలస్యంగా... అంటే సెప్టెంబరు 12న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గురువారం ఈ సినిమా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అండ్ మైథలాజికల్ అడ్వెంచరస్ చిత్రం ప్రధానంగా తొమ్మిది గ్రంథాలు, ఓ మ్యాజికల్ స్టిక్ నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.ప్రేమలో సంఘర్షణ రష్మికా మందన్నా లీడ్ రోల్లో నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్ఫ్రెండ్’. ఈ లవ్స్టోరీ చిత్రంలో దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమా నిర్మించారు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాను సెప్టెంబరు 5న రిలీజ్కు రెడీ చేశారు మేకర్స్. కానీ ఈ సెప్టెంబరు 5న ‘ది గర్ల్ఫ్రెండ్’ చిత్రం విడుదల కావడం లేదని, త్వరలోనే మేకర్స్ నుంచి కొత్త విడుదల తేదీ వస్తుందని ఫిల్మ్నగర్ సమాచారం. ప్రేమలో ఓ యువతి పడే సంఘర్షణ తాలూకు అంశాలతో ఈ చిత్రకథనం సాగుతుందని తెలిసింది. సంబరాలు ఎప్పుడు? రాయలసీమ నేపథ్యంలో రూ పొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. రోహిత్ కేపీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను గతంలో సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటంచారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ గురించి, మరో అప్డేట్ లేక΄ోవడంతో ఈ మూవీ సెప్టెంబరు 25న రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ 75 శాతం పూర్తయిందని ఓ సందర్భంలో మేకర్స్ తెలి పారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.కోచింగ్ సెంటర్ల నేపథ్యంలో... చాలా సినిమాల రిలీజ్లు పోస్ట్΄ోన్ అవుతుంటే చిన్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ రిలీజ్ మాత్రం ప్రీ పోన్ అయ్యింది. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‘ వెబ్సిరీస్ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్లో నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాను నిర్మించారు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను తొలుత సెప్టెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ సెప్టెంబరు 5కి ఈ సినిమాను ప్రీ పోన్ చేశారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నంది పాటి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. టీనేజ్ పిల్లల చదువు, లవ్స్టోరీ, కోచించ్ సెంటర్లు.. వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఈ తరహాలో రిలీజ్ వాయిదా పడిన సినిమాలు, కొత్త రిలీజ్ డేట్లను కన్ఫార్మ్ చేసుకున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
అది బోనస్: తేజ సజ్జా
‘‘మన తెలుగు ప్రేక్షకుల స పోర్ట్ వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. నా సినిమా ఇతర భాషల వారికి నచ్చితే అది బోనస్’’ అని తేజ సజ్జా చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్’. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘మిరాయ్’ కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. చాలా క్లీన్ ఫిలిం. పిల్లలు, కుటుంబమంతా కలిసి చూడొచ్చు’’ అని తెలి పారు. మనోజ్ మంచు మాట్లాడుతూ– ‘‘మిరాయ్’లో నాది బలమైనపాత్ర.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి’’ అని చె ప్పారు. ‘‘మా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కృతీ ప్రసాద్. ‘‘చాలా సిన్సియర్గా తీసిన సినిమా ఇది’’ అని కార్తీక్ ఘట్టమనేని పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది ‘మిరాయ్’’ అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. -
హీరోయిన్ శ్రియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయి మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హనుమాన్ హీరో తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మిరాయ్లో విలన్గా మెప్పించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రసాద్ మల్టీప్లెక్స్లో జరిగిన ఈవెంట్కు మంచు మనోజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ను ఉద్దేశించి మంచు మనోజ్ మాట్లాడారు. మేమిద్దరం గతంలో కలిసి పనిచేద్దామని అనుకున్నామని అన్నారు. ఆమె నా ఫేవరేట్.. చివరికీ ఈ సినిమాలో మా ఇద్దరికీ కుదిరిందన్నారు. అలాగే సినిమాలో జరిగిన సంఘటనలకు సారీ చెప్తున్నా అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఈ మాటలు విన్న శ్రియా వేదికపైనే చిరునవ్వులు చిందించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అంతేకాకుండా మిరాయ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్పై మంచు మనోజ్ ప్రశంసలు కురిపించారు. కింగ్ ఆఫ్ కంటెంట్ అంటే ఆయనే అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఇండస్ట్రీలో బ్రతకడం చాలా కష్టమని తెలిపారు. జీరో సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చారని.. వంద సినిమాలు తీయాలనే ఆశయంతో అడుగుపెట్టారని కొనియాడారు. ఇలాంటి నిర్మాతను తాను ఎప్పుడు చూడలేదని అన్నారు. మహా మొండి అయితే ఇలా ఉండగలరని ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయని.. ఇక్కడ నిలదొక్కుకోవటం మీలాంటి వారికే సాధ్యమన్నారు మంచు మనోజ్. -
తేజ సజ్జా 'మిరాయ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'మిరాయ్' మూవీ ట్రైలర్ విడుదల
-
అంచనాలు పెంచేసిన 'మిరాయ్' ట్రైలర్..
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన 'మిరాయ్' ట్రైలర్ వచ్చేసింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
'మిరాయ్' విడుదలకు చేతులు కలిపిన టాప్ బ్యానర్స్
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో తేజ సజ్జా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సూపర్ యోధాగా ఆయన నటించిన చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో దేశంలోనే టాప్ నిర్మాణ సంస్థలు మిరాయ్ డిస్ట్రిబ్యూట్ హక్కులను పొందాయి.మిరాయ్ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్ బ్యానర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో హోంబాలే ఫిల్మ్స్, తమిళనాడులో AGS ఎంటర్టైన్మెంట్, మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ వారు మిరాయ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలోనే టాప్లో ఉన్న చిత్ర నిర్మాణ సంస్థలు కావడం విశేషం. తెలుగులో మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు విడుదల చేస్తున్నారు.టాప్ బ్యానర్స్ నుంచి మిరాయ్ సినిమా విడుదల కావడం అనేది ఖచ్చితంగా ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చినట్లు అయింది. దీంతో మిరాయ్ జాతీయ స్థాయిలో తప్పకుండా అద్భుతాలను సృష్టించగలదను అంచనాలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే రూ. 300 కోట్లకు పైగా మార్క్ను సులువుగా అందుకోవచ్చిన అంచనాలు ఉన్నాయి. -
తేజా సజ్జా 'మిరాయ్'.. వారం లేటుగా థియేటర్లలోకి
బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా 'హనుమాన్'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా.. ఇప్పుడు 'మిరాయ్'తో రాబోతున్నాడు. ఇది సూపర్ హీరో తరహా సినిమానే. చాన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్గా సెప్టెంబరు తొలివారం రిలీజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందని చెబుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి మరో కన్నడ నటి.. హిట్ సీరియల్తో గుర్తింపు)తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్గా చేస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ వారం ఆలస్యంగా అంటే సెప్టెంబరు 12న థియేటర్లలో తీసుకురానున్నట్లు ఇప్పుడు కొత్త పోస్టర్ వదిలారు.అలానే ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా విడుదలకు ముందే పీపుల్స్ మీడియా సంస్థలో తేజా సజ్జా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రీసెంట్గానే ఆ ప్రకటన కూడా వచ్చింది. అయితే అది 'జాంబీరెడ్డి' సీక్వెల్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: కన్నడ స్టార్ హీరోకి క్షమాపణ చెప్పిన నటుడు)From the ethos of Itihasas, born a battle for the future ⚔️#MiraiTrailer drops on 28th August 🔥Get ready to witness India’s most ambitious Action-Adventure Saga 🥷❤️🔥#MIRAI GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER💥Rocking Star @HeroManoj1 @Karthik_gatta @RitikaNayak_… pic.twitter.com/8orFDK7EkN— Teja Sajja (@tejasajja123) August 26, 2025 -
సూపర్ యోధ పోరాటం
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (ఆగస్టు 23) తేజ సజ్జా బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిరాయ్’ సినిమా నుంచి తేజ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కూలిపోతున్న వంతెనపై కేవలం ఒక స్టిక్తో నిలబడి ఓ సూపర్ యోధాలా హీరో పోరాటం చేస్తున్నట్లుగా ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది.‘‘ఈ చిత్రంలో ఓ సూపర్ యోధ అవతార్లో తేజ కనిపిస్తారు. అతనిపాత్రలో పట్టుదల, ధైర్యం కనిపిస్తాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్, ఫస్ట్ వైబ్ సాంగ్లకు మంచి స్పందన వచ్చింది. అలాగే నార్త్లో ‘మిరాయ్’ సినిమా హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు. ఈ సినిమాను 2డీ, 3డీ ఫార్మాట్స్లో ఎనిమిది భాషల్లో సెప్టెంబరు 5న విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి. ఫ్రమ్ రాయలసీమ: ‘మిరాయ్’ సినిమా తర్వాత తేజ సజ్జా హీరోగా టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ మరో సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. అలాగే ఈ చిత్రాన్నిపాన్–ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘ఫ్రమ్ రాయలసీమ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే ట్యాగ్లైన్ ఈ కాన్సెప్ట్ పోస్టర్పై ఉంది. -
సూపర్ సెప్టెంబర్
సెప్టెంబర్ నెల సినిమా లవర్స్కి సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి నెలా విడుదలవుతాయి కానీ పెద్ద సినిమాలు రెండో మూడో ఉంటాయి. అయితే సెప్టెంబర్లో విడుదలయ్యేవాటిలో పెద్ద సినిమాల సంఖ్య మెండుగానే ఉంది. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.యాక్షన్ డ్రామా... ‘అరుంధతి, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత అనుష్క లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రమిది. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యా రావు, రవీంద్రన్ విజయ్ ఇతర పాత్రలుపోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఘాటీ’. ఒక బలహీన మహిళ క్రిమినల్గా, ఆ తర్వాత లెజెండ్గా మారే పాత్రలో అనుష్క నటన అద్భుతంగా ఉంటుంది. అధిక బడ్జెట్తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో మా సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మా మూవీపై అంచనాలు పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. సూపర్ యోధ... ‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది.ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైనపోస్టర్స్, వీడియో గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘వైబ్ ఉంది బేబీ..’ పాట ట్రెండింగ్గా మారింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు.అందమైన ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా బిజీ బిజీగా వరుస ప్రాజెక్టులతో దూసుకెళుతూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకీ సై అంటున్నారు రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ‘‘అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది.మనసుని ఆకట్టుకునే అంశాలతో రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక నటన సరికొత్తగా ఉంటుంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను హీరో విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్తో రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నదివే...’ అంటూ సాగే తొలి పాట కూడా ఆకట్టుకుంది.కిష్కిందపురిలో... ‘భైరవం’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’. ‘రాక్షసుడు’ (2019) వంటి హిట్ మూవీ తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన ద్వితీయ చిత్రమిది. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘‘హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’.సాయి శ్రీనివాస్ కెరీర్లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన హారర్, మిస్టరీ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్, సామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకుంటాయి. సాహు గారపాటి గ్రాండ్గా నిర్మించిన ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్పోస్టర్కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం నుంచి ‘ఉండి పోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ భద్రకాళి సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు... ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ ఆంటోని. ఆయన నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఇతర పాత్రలుపోషించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్పై విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ సినిమాని తొలుత సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఆ తేదీకి కాకుండా 19వ తేదీ రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడు దల చేస్తోంది. ఈ చిత్రంలో కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని నటించారు. సుమారు 200 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గత చిత్రాల కంటే స్టైలిష్గా, యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్. వెండితెరపై తాండవం... హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చిన ‘సింహా (2010), లెజెండ్ (2014), అఖండ’ (2021) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్స్టర్ పాత్రలో... పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ‘‘ఓజీ’ చిత్రంలో పవన్ కల్యాణ్ భీకరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు సాయిదుర్గా తేజ్. ఆయనపోరాట సన్నివేశాలు సరికొత్తగా ఉంటూ ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.నవ్వులే నవ్వులు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫేమ్ శివానీ నగరం, ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్ జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచీ, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రలుపోషించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ బ్యానర్పై ఆదిత్య హాసన్ నిర్మించారు.ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2 గంటల పాటు మా చిత్రం ఆడియన్స్కి నవ్వులు పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సెప్టెంబరులో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ‘వైబ్’ అదిరింది
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ని విడుదల చేశారు మేకర్స్. ‘వైబ్ ఉంది బేబీ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. తేజ సజ్జా అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. -
యంగ్ హీరో తేజ సజ్జా అరుదైన ఘనత
యంగ్ హీరో తేజ సజ్జా తన సినీ ప్రస్థానంలో అరుదైన ఘనతను సాధించారు. బాల నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ.. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందారు. 2005లో వచ్చిన బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకుని తన టాలెంట్ను నిరూపించుకున్నారు.ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో విశేష గుర్తింపు పొందుతున్నారు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానాన్ని సంపాదించిన తేజ సజ్జా, మరో ప్రతిష్టాత్మక అవార్డు తన ఖాతాలో వేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2024 మధ్య విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో భాగంగా, 2023కి గాను ఉత్తమ ద్వితీయ చిత్రం (బెస్ట్ సెకండ్ ఫిల్మ్) విభాగంలో తేజసజ్జా హనుమాన్ చిత్రం అవార్డును గెలుచుకుంది.బాల నటుడిగా నంది అవార్డు, హీరోగా గద్దర్ పురస్కారం అందుకొని అరుదైన రికార్డు సాధించిన నటుడిగా నిలిచారు. ప్రస్తుతం తేజ మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుత స్పందన లభిస్తోంది. హనుమాన్ తరువాత తేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
తేజ సజ్జా మిరాయ్ మూవీ టీజర్ రిలీజ్
-
ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మరోసారి సూపర్ హీరోగా అలరించేందుకు సిద్ధమైపోయాడు. 'మిరాయ్' మూవీతో రాబోతున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)తేజ సజ్జా హీరోగా నటిస్తున్న 'మిరాయ్'లో పవర్ఫుల్ విలన్గా మంచు మనోజ్ కనిపించబోతున్నాడు. టీజర్ అయితే బందోబస్తుగా ఉంది. ప్రభాస్ 'కల్కి' తరహాలో త్రేతా యుగం, కలియుగం మధ్య ఏదో లింక్ ఉన్నట్లు చూపించారు. విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. అలానే లొకేషన్స్ కూడా అదిరిపోయాయి.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మించింది. తొలుత అనుకున్నట్లు ఆగస్టు 1న కాకుండా సెప్టెంబరు 5న ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి తేజ సజ్జా ఈసారి హిట్ కొడితే.. పాన్ ఇండియా వైడ్ హీరోగా సెటిలైపోవచ్చు. విలన్గా మనోజ్ కూడా అంచనాలు పెంచేలా కనిపించాడు. చివర్లో రాముడి ఎంట్రీ ఉందన్నట్లు చూపించి ఆసక్తి పెంచారనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ) -
ముంబైలో మిరాయ్
ముంబై గుహల్లో తేజా సజ్జా సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మిరాయ్’ కోసం. తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూపర్యోధగా తేజ కనిపిస్తారు.తాజాగా ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ , ఇతర ప్రధాన పాత్రధారులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.‘‘మిరాయ్’ కోసం తేజా సజ్జ పూర్తీగా మేకోవర్ అయ్యారు. 2డీ, 3డీ ఫార్మాట్స్లో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ప్రోడ్యూసర్: కృతీ ప్రసాద్. -
'మిరాయ్' ది సూపర్ యోధ విడుదలపై ప్రకటన
గత ఏడాదిలో విడుదలైన 'హనుమాన్' సినిమాతో హీరో తేజ సజ్జా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా 'మిరాయ్' పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు మేకర్స్ గుడ్న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో మిరాయ్ విడుదల తేదీని వారు ప్రకటించారు.'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్లైన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా యోధుడిగా కనిపించనున్నారు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ణు నిర్మిస్తోంది. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఆగష్టు 1న 2D, 3D ఫార్మెట్లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రక్షా బంధన్, ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇందులో రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా ఉండనుంది. మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
హనుమాన్ హీరో యాక్షన్ అడ్వెంచర్.. రిలీజ్ డేట్ ఇదే!
హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న హీరో తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద రాణించింది. అయితే తేజ సజ్జా ప్రస్తుతం మరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం మిరాయి. ఇవాళ తేజ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఘట్టంనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిరాయి గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Strap in for an adrenaline ride 😎The #SuperYodha is born 🥷⚡Team #MIRAI ⚔️ wishes the SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP— People Media Factory (@peoplemediafcy) August 23, 2024 -
‘మిరాయ్’ ది సూపర్ యోధ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
యోధుడిగా మంచు మనోజ్.. 'మిరాయ్' గ్లింప్స్ విడుదల
తేజ సజ్జా యోధుడిగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్లైన్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'ది బ్లాక్ స్వాడ్' గ్లింప్స్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మంచు మనోజ్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఇందులో ఆయన కనిపిస్తున్నారు. అసలుసిసలైన యోధుడిగా కత్తితో చేస్తున్న పోరాట సన్నివేశాన్ని చూపించారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.