breaking news
YS Jagan Mohan Reddy
-
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
18న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్కు వైఎస్ జగన్ తెలియజేయనున్నారు.ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను వైఎస్ జగన్ స్వయంగా గవర్నర్కు సమర్పించి.. ప్రైవేటీకరణను అడ్డుకునేలా విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్ కార్యాలయం షెడ్యూల్ ప్రకారం.. తొలుత 17వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఒకరోజు ముందుకు మార్చినట్లు గవర్నర్ కార్యాలయం వైఎస్సార్సీపీకి సమాచారం అందించింది. దీంతో 18వ తేదీన భేటీ జరగనుంది. ఆరోజు సాయంత్రం 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలుస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(వ్యతిరేకత) ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్కి చూపిస్తారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి.. ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించనున్నారు. -
పవన్పై అంబటి వ్యంగాస్త్రాలు
సాక్షి,గుంటూరు: పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్పై కూటమి నేతలు విషప్రచారం చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. వైఎస్సార్సీపీ హయాంలో పరాకామణి భవన నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో భక్తులు చనిపోయారు. దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణిస్తే పవన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. తిరుమల లడ్డూపై పవన్ అసత్య ప్రచారం చేసి టీటీడీ పరువును అప్రతిష్టపాలు చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ రోజుకో వేషం వేస్తున్నారు. చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నారు. 2003లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిందెవరు?. విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చిందెవరు? చంద్రబాబు తన ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు తీశారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్కు లేదు. చంద్రబాబు,పవన్ ఎంత బురద జల్లిన వైఎస్ జగన్కు అంటుకోదని స్పష్టం చేశారు. -
‘వైఎస్సార్సీపీతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయం’
సాక్షి,విజయనగరం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్కు గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది. ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు. -
జమలపూర్ణమ్మకు వైఎస్ జగన్ పరామర్శ, పార్టీ అండగా ఉంటుందని భరోసా
-
Kodali Nani Speech: జగన్ను మళ్ళీ సీఎం చేసేందుకు.. రంగంలోకి కొడాలి నాని
-
స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తైనా కూడా.. ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి(ఆర్థిక) బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై చేసిన అంకెల గారడీపై బుధవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో బుగ్గన మాట్లాడారు. ఏడాదిన్నర అయినా కూడా ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది అని చంద్రబాబు వ్యూహాత్మకంగా చెప్పారు. ఆదాయం, స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 2014-19 బాబు హయాంలో కేంద్రానికి 4.45 శాతం ఇస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 4.8 శాతం ఇచ్చాం. కోవిడ్ సమయంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థూల ఉత్పత్తిని పెంచింది.... తలసరి ఆదాయంలో చంద్రబాబు పాలనలో ఏపీ 18వ స్థానంలో ఉంది. అదే.. జగన్ పాలనలో 15వ స్థానంలో ఉంది. జగన్ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు 3 లక్షల 32 వేల కోట్లు. చంద్రబాబు 18 నెలల్లో 2 లక్షల 66 వేల కోట్ల అప్పు చేశారు. కాగ్ లెక్కల ప్రకారం.. 2025-2026గానూ ఏపీ అప్పుల్లో నెంబర్ వన్గా ఉంది. చంద్రబాబు ప్రతీ నెలా 9 వేల కోట్ల అప్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఏజెన్సీలే చెబుతున్నాయి. స్థూల ఉత్పత్తి లెక్కల్లో ఆర్బీఐ చెప్పినవి తప్పు.. కాగ్ చెప్పినవన్నీ తప్పు చంద్రబాబు అంటున్నారు. కేవలం తాను చెప్పినవే నిజాలు అనట్లు మాట్లాడుతున్నారు. సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆ పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు జనం నమ్మరు అని బుగ్గన అన్నారు. చంద్రబాబు పాలన అంటే అసమర్థతతో కూడిన విధ్వంసం. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కోసే పరిస్థితుల్లో కూడా రైతులు లేరు.కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం చేశాం. రెండు పంటలకు ఇచ్చాం. 34 లక్షల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కొలంబో అవుతుందా బాబు చెప్పాలి. సంపద ఎలా సృష్టిస్తున్నారో బాబు చెప్పాలి. పోలవరం కోసం కేంద్రం అడ్వాన్స్ ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన ఆ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు. -
జమలపూర్ణమ్మకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం నగరంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ ఇటీవలె అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆమెను పరామర్శించారు. కేదారేశ్వరపేటలోని జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని స్థానిక నేతలకు పురమాయించారు. వైఎస్ జగన్ రాకతో లోటస్ రోడ్లు కిటకిటలాడాయి. పార్టీ కార్యకర్తలు, జగన్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. -
కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే అంకెల గారడీ. చంద్రబాబు జీఎస్డీపీ ముందస్తు అంచనాలపై వైఎస్ జగన్ ధ్వజం
-
ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల గారడీ
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి ఆర్నెల్లకు సంబంధించి సీఎం చంద్రబాబు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ముందస్తు అంచనాలను తప్పులతడక అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ... తన మార్గదర్శకత్వంలో ఆర్థికంగా వృద్ధి చెందుతోందని ప్రజలను మభ్యపెట్టడానికే ఈ అంకెలను తయారుచేసినట్టుగా చంద్రబాబు చెప్పకనే చెప్పారంటూ దెప్పిపొడిచారు.దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉన్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉంటాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెబుతున్నట్లుగా రాష్ట్ర జీఎస్డీపీ సీఏజీఆర్ (సగటు వార్షిక వృద్ధి రేటు) 10.40 శాతంగా ఉన్నట్లయితే... రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదని, అది కేవలం 2.58 శాతానికే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు.‘కొందరిని కొంతకాలంపాటు మభ్యపెట్టగలవు... కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయగలవు... కానీ, అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టలేవు’ అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) నివేదికల్లోని గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు విధానాలను కడిగిపారేస్తూ మంగళవారం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం‘‘చంద్రబాబు, టీడీపీ కూటమి ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్లకు సంబంధించిన జీఎస్డీపీ అంచనాలను విడుదల చేసింది. ముందస్తు అంచనాల గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయగలుగుతుంది. కావాలనుకుంటే వక్రీకరించగలుగుతుంది కూడా. కానీ, రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్... రాష్ట్ర ఖాతాలను ఆడిట్ చేసి వెల్లడించే గణాంకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వక్రీకరించలేరు. రాష్ట్ర ఖాతాలను పరిశీలించి కాగ్ విడుదల చేసిన గణాంకాల ద్వారానే ఏపీ ఆర్థిక పరిస్థితి వాస్తవికత ఏంటో తెలుస్తుంది. కాగ్ గణాంకాలు చంద్రబాబు సలహా ప్రకారమో లేక ఆయన మార్గనిర్దేశంలోనో తయారైనవి కావు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిజమైన ఆదాయాలు, చేసిన వాస్తవ ఖర్చుల ఆధారంగా ఈ సమగ్ర గణాంకాలు వెల్లడవుతాయి.𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025 ఈ ఆర్థిక ఏడాది మొదటి అర్ధభాగంలో కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాస్తవం ఏమిటంటే... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగాయి. మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది. మూలధన వ్యయం, సగటు పౌరుడు చేసే ఖర్చులు ప్రమాదకరంగా తగ్గాయి. రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండి పడుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా అబ్రహం లింకన్ గారి మాటలను గుర్తు చేయాల్సి వస్తోంది. లింకన్ గారు అన్న మాటలు ఇప్పుడు చంద్రబాబుకు సరిపోతాయి.ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?నేను అడిగే ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలరా?⇒ నిజంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లైతే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది?⇒ 2014–19 మధ్య మీ పాలనలో జీఎస్డీపీ వృద్ధి అంత గొప్పగా ఉన్నట్లైతే దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రాష్ట్రం వాటా 4.45 శాతానికి మాత్రమే ఎందుకు పరిమితమైంది?⇒ వైఎస్సార్సీపీకి ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలంలో కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు సంక్షోభం తలెత్తినా సరే... వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో దేశ జీడీపీలో రాష్ట్రం వాటా (2019–24) మధ్య 4.78 శాతంగా ఉన్న మాట వాస్తవం కాదా?⇒ మీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బాగా నడిచినట్లైతే, తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ర్యాంకు ఒక్క మెట్టు అయినా ఎందుకు పెరగలేదు?((చంద్రబాబు వాస్తవిక సమర్థత గురించి, అలాగే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన వాస్తవ ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ఆయన అబద్ధాలను బట్టబయలు చేస్తూ ఈ ట్వీట్కు స్లైడ్లను జత చేశాం. వీటిని అందరూ ఓసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.)) బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట⇒ 2014–19 కాలానికి చెందిన జీఎస్డీపీ సీఏజీఆర్ను, 2019–24 కాలానికి చెందిన సీఏజీఆర్తో పోల్చి.. తాను 2019–24 మధ్య అధికారంలో కొనసాగి ఉంటే 2023–24లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 13.5 శాతం అయ్యేదంటూ చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.⇒ 2019–24 మధ్య ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం కోవిడ్ కారణంగా అనూహ్యమైన ఆర్థిక సంక్షోభాన్ని, అలాగే దాన్నుంచి కోలుకోవడంలో కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో, తాను అధికారంలో ఉంటే 13.5 శాతం వృద్ధి సాధించేవాడినని చంద్రబాబు చెప్పడం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు.⇒ సీఏజీఆర్ అనేది మొదటి సంవత్సరం, చివరి సంవత్సరాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని లెక్కిస్తారు. కానీ, ప్రతి సంవత్సరానికీ గణాంకాలను విడివిడిగా విశ్లేషిస్తేనే సంపూర్ణమైన, నిజమైన పోలిక సాధ్యమవుతుంది. ఆ వివరాలను ఒక్కసారి చూస్తే... 2014–19 కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.54 శాతం మాత్రమే. అదే 2019–24 మధ్య మా ప్రభుత్వ హయాంలో 4.78 శాతం. ఇది మాత్రమే కాదు.. అత్యంత తీవ్రమైన సంక్షోభ సంవత్సరాలైన 2020–21, 2021–22లో దేశ జీడీపీలో ఏపీ వాటా వరుసగా 4.93 శాతం, 4.79 శాతం.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా తీసుకొచ్చిన విధానాలు, దీంతోపాటు అభివృద్ధి మీద పెట్టిన దృష్టి కారణంగా... కోవిడ్ సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిని దేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మరింత సమర్థంగా ఎదుర్కోగలిగాం. ఇంత స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అత్యంత దారుణ పనితీరును చంద్రబాబు ప్రదర్శించినప్పటికీ, తానుఇంకా మెరుగ్గా పనిచేసే వాడిని అని ఆయన ఎలా చెప్పగలరు?భారీగా అవినీతి... రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గడమే దీనికి నిదర్శనం⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం వెల్లడించిన అంచనాల ప్రకారం 2024–25 తొలి ఆర్నెల్లలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 9.89 శాతం.. 2025–26 తొలి ఆర్నెల్లలో 10.91 శాతం. ఈ రెండేళ్ల మొత్తాన్ని కలిపిచూస్తే జీఎస్డీపీ సీఏజీఆర్ 10.40 శాతం మాత్రమే కనిపిస్తోంది.⇒ సహజంగానే, ఈ స్థాయి జీఎస్డీపీ వృద్ధితో పాటు రాష్ట్ర సొంత ఆదాయాలు కూడా కనీసం 10 శాతం సీఏజీఆర్తో పెరగాలి. కానీ, వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అంతేకాదు ఇంకా నిరాశాజనకంగా ఉంది.⇒ రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని ప్రతిబింబించే ఎస్జీఎస్టీ ఆదాయాల సీఏజీఆర్ 4.35 శాతం మాత్రమే పెరిగాయి. సేల్స్ ట్యాక్స్ ఆదాయాల సీఏజీఆర్ –2.80 శాతానికి తగ్గిపోయాయి. మొత్తంగా చూస్తే, రాష్ట్ర సొంత ఆదాయాల సీఏజీఆర్ కేవలం 2.58 శాతం మాత్రమే. ⇒ కొత్త ప్రభుత్వం మద్యం విధానంలో పెద్ద పెద్ద మార్పులు చేసినప్పటికీ.. మద్యం రిటైల్ను ప్రైవేటీకరించడం, షాపులు పెంచడం, విక్రయ వేళలపై పరిమితులను ఎత్తివేయడం, బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్లను తిరిగి అనుమతించడం తదితర తీవ్ర మార్పుల తర్వాత కూడా ఎక్సైజ్ సుంకం సీఏజీఆర్ కేవలం 5.10 శాతం మాత్రమే పెరిగింది. లిక్కర్ వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతుందనే విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయాల సీఏజీఆర్ ఎక్కడా 10 శాతానికి దగ్గరగా కూడా లేదు. అది కేవలం 2.58 శాతం మాత్రమే. అన్నిటికంటే ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం (కేపిటల్ ఎక్స్పెండేచర్) భయంకరంగా పడిపోయి సీఏజీఆర్ –16 శాతంగా నమోదైంది.⇒ నిజమైన వృద్ధి కనిపించిన ఏకైక అంశం... కేంద్ర పన్నులలో రాష్ట్రానికి లభించిన వాటా. అది కూడా సీఏజీఆర్ 17.78 శాతం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరుకు సంబంధించినది. రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి సంబంధించింది కాదు.విద్యుత్ రంగంపై వాస్తవాలకు భిన్నంగా బాబు మాటలువిద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవాలకు ఇది పూర్తి విరుద్ధం. ఎఫ్పీపీసీఏ (ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్) పేరుతో, చంద్రబాబు ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలపై రూ.18,272 కోట్లు భారం వేసింది. గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలపై సెక్యూరిటీ సృష్టించింది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టింది అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సరే గత ప్రభుత్వం రూ.25 వేల కోట్ల రుణం కోసం రూ.1,941 కోట్ల విలువైన ఆస్తులను తాకట్టు పెట్టింది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల బాండ్ల విడుదల కోసం రూ.1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను సెక్యూరిటీగా పెట్టింది. భవిష్యత్తు ఆదాయాలనూ అప్పుల కోసం పణంగా పెట్టింది.ఇంకా, రాష్ట్ర సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) మీద బాండ్ హోల్డర్లకు హక్కు కల్పించింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని, అత్యంత ప్రమాదకర చర్య. చంద్రబాబు గారు... వైఎస్సార్సీపీ పాలనలో విద్యుత్ రంగం దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నారు. కానీ, వాస్తవాలు మాత్రం ఆయన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. టీడీపీ పాలనలో (2014–19) విద్యుత్ రంగపు అప్పులు సీఏజీఆర్ 23.88 శాతం. వైఎస్సార్సీపీ పాలనలో (2019–24) ఆ అప్పుల పెరుగుదల సీఏజీఆర్ 7.28 శాతం మాత్రమే. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించిందని స్పష్టమవుతోంది.వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామిక ప్రగతిచంద్రబాబు గారు... వైఎస్సార్సీపీ పాలనలో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టారని చేసిన ఆరోపణ కూడా పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన తయారు చేసిన అబద్ధమే ఇది. ఎంవోఎస్పీఐ గణాంకాల ప్రకారం.. ఏపీలో పరిశ్రమల జీవీఏ (స్థూల విలువ జోడింపు) వృద్ధి (2019–24) సీఏజీఆర్ 11.14 శాతం. అదే కాలంలో దేశ పరిశ్రమల జీవీఏ వృద్ధి సీఏజీఆర్ 8.96 శాతం. అంటే, వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో దేశ సగటు కంటే రాష్ట్రం ఎక్కువ వృద్ధిని సాధించిందన్నది స్పష్టమవుతోంది. పారిశ్రామిక వృద్ధికి సంబంధించి ఇలాంటి స్పష్టమైన విజయాలు ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని విడిచిపెట్టారని చంద్రబాబు గారు ఎలా అంటారు? అది నిజానికి అసత్య ఆరోపణ... ప్రజలను మభ్యపెట్టే ప్రచారం మాత్రమే. -
కృష్ణార్పణం.. ఏడాదికి అద్దె వెయ్యే!
సాక్షి టాస్క్ ఫోర్స్: సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అతి తక్కువ ధరకు పప్పు బెల్లాల్లా అనుయాయులకు కట్టబెట్టేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పల్లెల్లోనే ప్రజలకు సర్కారు సేవలందించేందుకు నిర్మించిన బీసీ, ఎస్సీ సామాజిక భవనాలు, టీటీడీ కల్యాణ మండపం, ఆర్బీకే వంటి ఖరీదైన భవనాలను దశాబ్దాల పాటు లీజు పేరుతో ధారాదత్తం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురంలో ఈ భవనాలన్నీ బాబు అనుయాయుల పరమవుతున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) చైర్మన్ కృష్ణయ్య బావమరిది పరమవుతున్నాయి. ఈ ప్రయత్నాలను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంకన్నపురం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య స్వగ్రామం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో టీటీడీ నిధులతో కల్యాణ మండపం, డైనింగ్ హాలు నిర్మించారు. పంచాయతీరాజ్, ఎంపీ ల్యాడ్స్ (రాజ్యసభ సభ్యుడు), కార్పొరేట్ సీఎస్ఆర్ నిధులతో 14,400 చదరపు అడుగుల స్థలంలో ఎస్సీ, బీసీ సామాజిక భవనాలు, మహిళా భవనం నిర్మించారు.వీటిని గ్రామస్తులే కాక సమీపంలోని బసవాయపాళెం, దామేగుంట, గుండాలమ్మపాళెం, పద్మనాభసత్రం తదితర గ్రామాల ప్రజలు వినియోగించుకొంటారు. ఇక్కడి కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకొన్న వారు భోజనాలకు సమీపంలోని డైనింగ్ హాల్ను వినియోగిస్తారు. పొదుపు మహిళల సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మహిళా భవనాన్ని ఉపయోగిస్తున్నారు. బీసీ భవనంలో ఆర్బీకే ఉంది. ఎస్సీ సామాజిక భవనాన్ని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి నివాసానికి కేటాయించారు. తుపాను, వరదల్లాంటి విపత్తుల సమయంలో గ్రామంలోని వారు ఈ భవనాల్లోనే తలదాచుకొంటారు. 99 ఏళ్ల పాటు లీజు.. ఏడాదికి రూ. వెయ్యే! తన స్వగ్రామంలోని ఈ ప్రభుత్వ భవనాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య కన్ను పడింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సాకుతో వీటిని సొంతం చేసుకోవాలనుకొన్నారు. కృష్ణయ్య బావమరిది పి.లక్ష్మీ శ్రీనివాస ప్రసాద్ పేరుతో తొలుత 33 ఏళ్ల లీజు, తర్వాత మరో రెండు పర్యాయాలు 33 సంవత్సరాల వంతున ఏకంగా 99 ఏళ్లపాటు లీజు పొడిగించుకొనే వెసులుబాటుతో అన్ని భవనాలకు కలిపి ఏడాదికి కేవలం రూ.వెయ్యి అద్దె ప్రతిపాదనను పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదన పంపారు.కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ కావడం, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో ఫైల్ చకచకా కదిలింది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్కు, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్కు చేరింది. కలెక్టర్ ఆమోదం పొందగానే డీపీఓకు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులందాయి. వెంటనే భవనాలను స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధమైపోయారు. ఈ విషయం గ్రామస్తులకు చేరడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వినియోగించుకొనే ప్రభుత్వ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారంటూ మండిపడ్డారు. సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా గ్రామాభివృద్ధిపై సమీక్ష సమావేశానికి మంగళవారం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ప్రభుత్వ భవనాలను ప్రైవేటు పరం చేయొద్దని గట్టిగా కోరారు. కలెక్టర్ నుంచి వారికి సానుకూల సమాధానం రాలేదు. గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పారు. దానికి ఒక భవనం సరిపోతుందని, ఇన్ని అవసరం లేదంటూ గ్రామస్తులు చెప్పారు. ఇదంతా పెద్ద కుట్ర అని, దీనికి సమ్మతించేది లేదని, ఉద్యమం తప్పదని తెగేసి చెప్పారు. అసౌకర్యమైన చోట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటేమిటి? వెంకన్నపురం గ్రామానికి ఇరువైపులా ఉన్న రోడ్లు దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. సొంత వాహనాలు తప్ప రవాణా సౌకర్యం ఉండదు. ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామనడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇదే మండలంలో జాతీయ రహదారికి ఆనుకొని చంద్రశేఖరపురం వద్ద ఇదే కృష్ణయ్య ఏపీఐఐసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కు ఉంది. అందులో కావాల్సినంత స్థలం ఉందని, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ గ్రామంలోని ప్రభుత్వ భవనాలను చెరబట్టడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంతకంటే దారుణం లేదు గ్రామంలో 60 శాతం పేద ఎస్సీలే. వీరి అవసరాలకు గ్రామంలోని ప్రభుత్వ భవనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ భవనాలను ప్రభుత్వ పెద్దల అండతో హస్తగతం చేసుకోవడం దారుణం. కలెక్టర్ కూడా వారికే సహకరించడం విడ్డూరంగా ఉంది. దళితులు ఎక్కువగా ఉన్న గ్రామంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది. – బండి పెంచలయ్య, సర్పంచ్, వెంకన్నపురం -
చంద్రబాబు బాగోతం లెక్కలతో బయటపెట్టిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దొంగ లెక్కలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP) అంచనా గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని.. ఈ గణాంకాలు ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తయారు చేసినవని అన్నారు.కాగ్ (Comptroller and Auditor General) విడుదల చేసిన రాష్ట్ర ఖాతాల గణాంకాలు మాత్రం నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. ఆ గణాంకాలు చెబుతున్నది ఏమిటంటే.. ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉందిఅప్పులు గణనీయంగా పెరిగాయిఅభివృద్ధి పనుల కోసం ఖర్చు తగ్గిపోయిందివినియోగం, పెట్టుబడులు పడిపోయాయిరెవెన్యూ, ఫిస్కల్ లోటు ఆందోళనకరంగా పెరిగాయిఅవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు దోపిడీకి గురవుతున్నాయిఈ పరిస్థితుల్లో కూడా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని జగన్ మండిపడ్డారు. ఆయన అబ్రహాం లింకన్ మాటలను ఉటంకిస్తూ, “కొంతకాలం అందరినీ మోసం చేయవచ్చు, కొంతమందిని ఎప్పటికీ మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు” అని చంద్రబాబుకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుంటే, ఈ స్థాయి ఆర్థిక ఒత్తిడి ఎందుకు?2014–19లో టీడీపీ పాలనలో GSDP వృద్ధి గొప్పదైతే.. ఇప్పుడు రాష్ట్రం జాతీయ GDPలో వాటా 4.45% మాత్రమే ఎందుకు ఉంది? 2019–24లో 4.78%గా ఉన్న సంగతేంటి?..టీడీపీ పాలనలో రాష్ట్రం వ్యక్తి ప్రాతి ఆదాయ ర్యాంక్ ఒక్క స్థానం కూడా మెరుగుపడకపోవడానికి కారణం ఏమిటి?.. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ నిలదీశారు.టీడీపీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని.. కానీ కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయని వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి అబద్ధపు ప్రచారాలు.. 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుపై చేస్తున్న ఆరోపణల వెనుక నిజాన్ని బహిర్గతం చేసే గణాంకాలను అందరూ పరిశీలించండి అంటూ సమాచారాన్ని ఆయన మంగళవారం ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. 𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025 -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తే ఇలాంటి పరిస్థితే APకి వస్తుంది
-
రఫ్పాడించిన వైఎస్ జగన్
ఎవరన్నారు ర్యాగింగ్, ట్రోలింగ్లు.. కాలేజీలు, సోషల్ మీడియాలకు మాత్రమే పరిమితమని? రాజకీయాల్లోనూ వీర ర్యాగింగ్ చేయవచ్చు. కావాలంటే వైఎస్ జగన్ తాజా ప్రెస్మీట్ చూడండి!. కాలేజీలలో ర్యాగింగ్ నిషిద్ధం కానీ రాజకీయాలలో ప్రత్యర్థులను సమర్థంగా ఇరుకున పెట్టగలిగే ర్యాగింగ్పై అడ్డంకులేవీ లేవు. రఫ్ఫా రఫ్పా అన్న సినిమా డైలాగును ఫ్లెక్సీల్లో పెడితే ఏపీ పోలీసులు కేసులు పెట్టగలరేమో కానీ.. ఈటెల్లాంటి మాటలతో దాడి చేసే రాజకీయ ప్రత్యర్థులను బిత్తరపోయేలా రఫ్పాడిస్తే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి?.వైఎస్ జగన్ ర్యాగింగ్కు తెలుగుదేశం పార్టీ కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారు. దీంతో ఏవేవో అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. మరి కొందరు పిచ్చి వ్యాఖ్యలు చేసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వాదనతో బిత్తరపోయిన ఎల్లో మీడియా సహజంగానే దాన్ని తక్కువ చేసేందుకు, వక్రీకరించేందుకు అన్ని శక్తులూ ఒడ్డింది. ఇదంతా వారి ఉడుకుమోతు తనానికి నిదర్శనం అనుకోవాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు ఎంతసేపూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలన్న ధోరణితో తప్ప, నిజానిజాలపై దృష్టి పెట్టడం మానేశాయి. జగన్పై రాస్తున్న ఏడుపుగొట్టు కథనాలే అందుకు నిదర్శనం.జగన్ ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే..మొట్టమొదట అరటి రైతుల సమస్యల గురించి.. అరటి, మిర్చి, తదితర ఉద్యాన పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్న విషయాన్ని కూటమి ప్రభుత్వం పంటల బీమా సదుపాయాలు లేకుండా చేసిన అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు దీనికి సమాధానం ఇవ్వలేదు. ‘‘సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలు చేశారు?’’ అని అడుగుతూ అది సూపర్ మోసం అని, చంద్రబాబుపై చీటింగ్ కేసుపెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు అమలుపై నిలదీశారు. అమలు చేసినట్లు చెప్పుకుంటున్న కొన్ని హామీలలోని డొల్లతనాన్ని, ఏడాది కాలం ఎగవేసిన వైనాన్ని కూడా ఎండగట్టారు. ఆయా స్కీములలో ఎగవేతల ద్వారా కూటమి సర్కార్ ప్రజలకు ఎంతెంత బాకీ పడింది లెక్కలు చెప్పారు. వీటికి కూడా టీడీపీ నుంచి నేరుగా జవాబు రాలేదు. కూటమి తన మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎలా హుళ్లక్కి చేసింది జగన్ సోదాహరణంగా వివరించారు. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు అడక్కుండా, ప్రైవేటు కంపెనీ కోసం టీడీపీ ఎంపీలు గనులు మంజూరు చేయడం గురించి అడగడంపై ఆయన మండిపడ్డారు. వీటన్నిటిపై తన ప్రశ్నల పరంపరతో చంద్రబాబును రాజకీయంగా జగన్ మాస్ ర్యాగింగ్ చేశారని చెప్పాలి. అయితే ఇది ఆరోగ్యకరమైన ర్యాగింగ్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఉన్న అవకాశం.చంద్రబాబు సత్యాసత్యాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై బురద చల్లుతుంటారు. జగన్ అలా కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడుతుంటే టీడీపీ, జనసేన, బీజేపీలకి ముచ్చెమటలు పట్టి ఉంటాయనడంలో సందేహం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం, పరకామణి కేసుల గురించి జగన్ చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలేసి ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో జంతు కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్లను సిట్ ముందుగా ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే పెద్ద అనుమానం. అంతేకాక టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్న బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చిందే చంద్రబాబు సర్కార్ టైమ్లో అన్న సంచలన వాస్తవాన్ని జగన్ వెల్లడించడంతో కూటమి పెద్దలు, ఎల్లో మీడియా కిక్కురమనలేకపోయాయి. అప్పట్లో టీటీడీ బోర్డు చేసిన తీర్మానం కాపీని కూడా జగన్ ప్రదర్శించడం విశేషం. ఆ రోజుల్లో ఒక అధికారిక బృందం వెళ్లి బోలేబాబా కంపెనీలను తనిఖీ చేసి వచ్చీ మరీ ధ్రువీకరించాయన్న సంగతి బయటపడింది. ఇక్కడ ఇంకో సంగతి గమనించాలి.చంద్రబాబు కూడా హెరిటేజ్ పేరుతో డెయిరీ సంస్థను నడుపుతున్నారు. ఆయనకు బోలే బాబా కంపెనీ గురించి ముందే తెలిసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అది సరైన కంపెనీ కాకపోతే అప్పుడే తప్పించి ఉండాలి కదా! అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెయ్యి ట్యాంకులను తిప్పి పంపడం, మళ్లీ తర్వాత వాటిలో కొన్నిటిని అనుమతించడం వంటి విషయాలను కూడా జగన్ వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ పెద్దలకు ,ఎల్లో మీడియాకు దిమ్మదిరిగినంత పనైంది. వీటిపై వీరెవ్వరూ నోరు విప్పితే ఒట్టు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకసారి తిరస్కరణకు గురైన నెయ్యిని వాడారని, అయినా చైర్మన్, అధికారులపై ఎందుకు కేసులు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. పరకామణి కేసు గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ టైమ్లోనే నిందితుడిని పట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ కేసులో నిందితుడి ఆస్తి మొత్తం స్వామి వారికి రాసిస్తే అది తప్పన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేయడం ఏమిటో తెలియదు.చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో కూడా ఈ నిందితుడు దొంగతనాలు చేసి ఉండవచ్చు కదా! అదే కదా సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నది?. అలాంటప్పుడు! అప్పుడెందుకు పట్టుకోలేకపోయారు. అంతేకాదు. తిరుమల, ఇతర ఆలయాలలో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వారు పట్టుబడితే కేసులు పెట్టి చర్య తీసుకుంటారు. అంతే తప్ప ఆస్తుల స్వాధీనం వరకు వెళ్లరు. కానీ, ఈ కేసులో లోక్ అదాలత్ నిర్ణయం మేరకు ఆస్తి మొత్తం రాయించుకుంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకెంత చోరీ చేశారో అని అడుగుతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్న సిట్ ఆ విషయం విచారించి ఉంటుంది కదా! ఇంకేమైనా ఆస్తులు ఎవరికైనా రాసిచ్చారా అన్నది పట్టుకునేవారు కదా! ఈ కేసును ఏదో రకంగా మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డికి పులమాలని విశ్వప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య ఈ కేసుకు సంబంధించి ఉన్నత స్థాయి జడ్జి ఒకరు సిఫారసు చేశారని చెప్పిన వీడియోను జగన్ ప్రదర్శించారు. ఆ జడ్జి టీడీపీకి దగ్గరగా ఉండేవారని అంటున్నారు. ఇప్పుడు ఆయనను కూడా విచారించవలసి ఉంటుంది కదా!అలాగే పరకామణి కేసులో ఆరోపణలు చేసిన లోకేశ్ తదితర మంత్రులను కూడా పిలిచి మాట్లాడి ఉండాలి కదా! ఇవేవీ ఎందుకు చేయలేదు! ఇక్కడే చంద్రబాబు సర్కార్ దొరికిపోతోంది. వేల కోట్ల రూపాయల మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసును మాఫీ చేయించుకున్న ఈనాడు మీడియా పరకామణిలో డెబ్బేవేల రూపాయల చోరీ కేసు చాలా పెద్దదిగా భావిస్తున్నట్లుగా ఉంది. దీనిని జగన్ చిన్న కేసు అన్నారని రాయడం, పిమ్మట చంద్రబాబు మాట్లాడడం, సంబంధం లేని వివేకా హత్యకేసుకు ముడిపెట్టడం ఇదో వింతగా ఉంది.పరకామణి కేసు నిందితుడు తను చేసిన తప్పుకు పశ్చాతాపంగా తన ఆస్తులను రాసిస్తే, వందల కోట్ల స్కామ్ కేసులను ఎదుర్కుంటున్న చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా భయపడి ఆ కేసులను తానే ఎలా మాఫీ చేయించుకుంటున్నారు? ఎవరు ధర్మంగా ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు దొరుకుతుందా?. ఈ విషయాలతో పాటు ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలపై కూడా జగన్ గట్టిగా ప్రశ్నించి సిట్ల పేరుతో సాగుతున్న దర్యాప్తు తంతులను ఎండగట్టారు. ఈ విషయాలలో ఒక్కదానికి కూడా చంద్రబాబు లేదా ఇతర కూటమి నేతలు జవాబు ఇవ్వలేకపోయారు. అందుకే జగన్ వారిని రాజకీయంగా ర్యాగింగ్ చేశారని, రఫ్పాడించారని అనాల్సి వస్తోంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగనన్న పేరంటేనే ఝడుపా!
సామర్లకోట: ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీకి ఇంకా ఎన్నికల కోడ్ ముగిసినట్టు లేదు. కోడ్ నిబంధనల మేరకు వేసిన రంగులు నేటికీ తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాలనీ పేరును పునరుద్ధరించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం లే అవుట్లో సుమారు 50 ఎకరాల్లో అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన జగనన్న కాలనీ పేరిట అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2023 అక్టోబరు 12న ప్రారంభించారు. ప్రత్తిపాడు రహదారికి ఇరువైపులా ఉన్న ఈ కాలనీకి రెండు వైపులా రెండు ముఖద్వారాలు ఏర్పాటు చేసి కౌన్సిల్ తీర్మానంతో జగనన్న కాలనీగా పేరు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముఖద్వారాలపై ఉన్న జగనన్న పేరుపై నలుపు రంగు వేశారు. నాడు వేసిన రంగులు నేటికీ తొలగించపోవడం విమర్శలకు తావిస్తోంది. జగనన్న పేరు పునరుద్ధరణపై నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు మున్సిపల్ కమిషనర్కు వివరించినా ప్రయోజనం కనిపించలేదు. కాగా ఈ కాలనీకి టీడీపీ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి యతి్నస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉంది. పేదలకు ఎంతో విలువైన స్థలాలు ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం రహదారుల కూడలిలో రోడ్డు మార్జిన్లో ఈ కాలనీలో ఇప్పటికే అనేక మంది ఇళ్లు నిర్మించుకోవడమే కాకుండా పార్కులతో కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీకి ఆదరణ పెరుగుతుందనే కక్షతో ముఖద్వారాలపై పేర్లు రాయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడంతో ఆయన పేరు చరిత్రలో గుర్తుండిపోతుంది. అటువంటి ముఖ్యమంత్రి పేరును రాయించడానికి మున్సిపల్ అధికారులకు ఎందుకు చేతులు రావడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏపీ బీసీఎల్ వైపు ఉన్న కాలనీ ముఖద్వారంపై పేరు కనపడకుండా పూర్తిగా వేసిన రంగు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం ఈటీసీ లే అవుట్లోని వైఎస్సార్ జగనన్న కాలనీ ముఖద్వారంపై ఉన్న పేరుకు రంగులు తొలగించాల్సిన విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అనేక కౌన్సిల్ సమావేశాలలో అధికారులను ప్రశ్నించాం. గతంలో తాను పని చేసిన ప్రదేశాల్లోని భవనాలకు రంగులు వేయలేదని, కేవలం పేపర్లు అతికించామని కమిషనర్ చెప్పారు. గతంలో ఉండేలా పేర్లు రాయిస్తానని హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన స్వయంగా పరిశీలించి కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. – ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోటజగనన్న కాలనీపై కుట్ర జరుగుతోంది జగనన్న కాలనీపై ఏదో కుట్ర జరుగుతోంది. ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా చేయడం లేదు. ఎన్నికల కోడ్ సమయంలో జగనన్న కాలనీ ముఖద్వారానికి వేసిన రంగుల స్థానంలో పేర్లు రాయించాలని మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య దృష్టికి తీసుకు వెళ్లాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్ధం కాలేదు. మా నాయకుడు దొరబాబుతో చర్చించి ఏంచేయాలో ఆలోచిస్తాం. – ఉబా జాన్మోజెస్, మున్సిపల్ వైస్ చైర్మన్, సామర్లకోట -
జగనన్న మాటగా చెప్తున్నా.. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటా
-
నాడు కొలువుల జాతర.. నేడు నిలువునా కోత
చంద్రబాబు సర్కారు కొలువుదీరింది... కొలువులకు నిలువునా కోత పడింది. ‘ఉపాధి’ మాటే మరుగునపడింది.. పారిశ్రామికీకరణ పట్టాలు తప్పి... జిల్లా ప్రగతి దిశ మార్చుకుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగ విప్లవానికి శ్రీకారం చుట్టగా... చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లింది. ఉపాధి, ఉద్యోగాలు కరువై జిల్లా తిరోగమనంలో పయనిస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: కరువు సీమ కడప గడపలో విద్యార్థులు, నిరుద్యోగులు విద్య, ఉద్యోగాల కోసం వలసలు వెళ్లకూడదన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగ విప్లవానికి నాంది పలికింది. జిల్లాలో పరిశ్రమలతో పాటు.. ఉన్నత విద్యాసంస్థలు నిర్మించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో భారీపరిశ్రమలు కొలువుదీరాయి. ఇందులో ఒక్క డిక్సన్ కంపెనీలోనే దాదాపు 1300 మంది ఉద్యోగ అవకాశాలు దక్కించుకోగా, బద్వేలు సమీపంలో ఏర్పాటు చేసిన సెంచురీ ఫ్లైబోర్డ్స్సంస్థలో దాదాపు 2,078 మంది స్థానికులైన నిరుద్యోగులు అవకాశాన్ని దక్కించుకున్నారు. వీటితో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, యోగివేమన విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలతో పాటు, పులివెందుల మెడికల్ కళాశాల, రిమ్స్, మానసిక వైద్యశాల, క్యాన్సర్ హాస్పిటల్స్లో నియామకాల ప్రక్రియ చేపట్టింది. వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుతో వైద్యుల నియామకం, సహాయ సిబ్బంది ఏర్పాటుతో సేవలు దగ్గరయ్యా యి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తూ వచ్చిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఒకగూటి కిందికి తీసుకువచ్చి వారందరినీ ఆప్కాస్ కింద చేర్చి ఉద్యోగభద్రత కల్పించిన విషయం తెలిసిందే.గ్రామసచివాలయాల ఏర్పాటుతో ఉద్యోగ విప్లవం.. గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది. వీటి నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మందికి ఏకకాలంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒక చరిత్ర. ఇక జిల్లాలో 645 సచివాలయాల పరిధిలో 5,400 మంది సచివాలయ కార్యదర్శులుగా కొలువులు సాధించారు. వీటికి అనుబంధంగా సేవలందించేందుకు ప్రతి 50 ఇళ్లకు గ్రామవలంటీర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ సర్కార్లో తిరోగమనం...జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తే టీడీపీ సర్కార్ తిరోగమనంలో పడేసింది. పులివెందుల మెడికల్ కళాశాల అందుకు ప్రత్యక్ష నిదర్శనం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2024–25 విద్యాసంవత్సరానికే 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించింది. మంజూరైన ఎంబీబీఎస్ సీట్లను తిరస్కరించి, ఈ ప్రాంతంపై సీఎం చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేశారు. అప్పట్లో అంగీకరించింటే 2025–26 ఏడాదికి మరో 150 ఎంబీబీఎస్ సీట్లు లభించేవి. తద్వారా పేద ప్రజలు, పేద విద్యార్థుల భవిష్యత్ యోగ్యకరంగా ఉండేది. మెడికల్ కళాశాల అటుంచితే, అందులో ఉన్న ఆధునాతన పరికరాలు సైతం తరలించుకువెళ్లడం మరో విశేషం. కడప అంటే కడుపు మంట చంద్రబాబు సర్కార్కు ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి ఏడాదిన్నర్రగా శూన్యం. మరో వైపు డీఎస్సీ పేరుతో సరికొత్త ప్రచార ఆర్భాటానికి తెరలేపారు. డీఎస్సీ అభ్యర్థులందర్నీ విజయవాడకు పిలిపించి ‘షో’చేశారు. మెరిట్ ప్రాతిపదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్లో 1.25 లక్షల మందికి ఉద్యోగాలు ఏకకాలంలో లభించాయి. నియామకపత్రాలు అందుకొని ఎక్కడివారు అక్కడే బాధ్యతల్లో చేరిపోయారు. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి ఆచరణలో నిమగ్నం కాగా, నేడు చంద్రబాబు సర్కార్ ఫించన్లు పంపిణీ నుంచి ప్రచార యావే ధ్యేయంగా వ్యవహరిస్తోండడం గమనార్హం. నిరుద్యోగ యువతకు అండగా వైఎస్ జగన్ వైఎస్సార్ సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ యువతకు అండగా నిలబడ్డారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. జిల్లాలోని వైవీయూ, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అనేక పోస్టులను భర్తీ చేశారు. అంతేకాకుండా వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన వివిధ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారు. – నన్నయ్య,ప్రకాశ్నగర్, కడప నిరుద్యోగులను పట్టించుకోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని కూటమి సర్కార్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితోపాటు లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి మాటే లేకపోగా, అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకు వస్తున్నామని చెబుతున్నారేగానీ క్షేత్రస్థాయిలో అలాంటి చర్యలు కనుచూపు మేరలో కానరావడం లేదు. మొత్తం మీద చంద్రబాబు హయాంలో నిరుద్యోగ యువతకు ఇబ్బందులు తప్పేలా లేవు. – షేక్ మన్సూర్, లక్కిరెడ్డిపల్లె, సీకే దిన్నె మండలం -
'ఉపాధి'కి పని గండం
సాక్షి, అమరావతి: ఒకపక్క ఏడున్నర లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు.. మరోవైపు దాదాపు ఐదున్నర కోట్ల పనిదినాల కోతలు.. ఇంకోవైపు లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు నెలలకుపైగా ఉపాధి కూలీలకు వేతనాల బకాయిలు..! ఉపాధి పనులనే నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలను చంద్రబాబు సర్కారు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. పనిదినాల్లోనూ కోతలు విధిస్తూ, చేసిన పనులకు వేతనాలు చెల్లించకుండా అగచాట్లకు గురి చేస్తోంది. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు గత నాలుగున్నర నెలలుగా వేతనాలు (కూలి డబ్బులు) చెల్లించకపోవడంతో పేదలు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. స్వయంగా టీడీపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు రూ.381 కోట్ల మేర ఉపాధి హామీ కూలి డబ్బుల బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. ఈ ఏడాది జూలై 27వతేదీ తర్వాత రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలెవరికీ వేతనాలు అందలేదని సమాచారం.మూడో వంతు ఎస్సీ, ఎస్టీలే..చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఇటీవలే 18.63 లక్షల మంది జాబ్ కార్డు(7.48 లక్షల కుటుంబాలు)లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో లబ్ధి పొందుతున్న వారిలో మూడోవంతుకు పైగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే ఉన్నాయి. గతేడాది జూన్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు రూ.వందల కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోతున్నాయి. కూలి డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని వ్యవసాయ కారి్మక సంఘాలు వాపోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దీపావళి సమయంలో నిరుపేదలు తాము చేసిన కూలి పనుల డబ్బుల కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ, అవి చేతికి అందకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు.ఐదున్నర కోట్ల పని దినాలకు ఎసరు..!చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనుల కల్పన తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. వైఎస్ జగన్ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023–24లో రాష్ట్రంలో ఏప్రిల్ – నవంబరు మధ్య 21.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు 2025–26 ఏప్రిల్ – డిసెంబరు 7వతేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించింది. ఆర్నెలల్లో రూ.435.14 కోట్లు నష్టపోయిన పేదలు..రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్– సెపె్టంబరు మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన తగ్గించడం వల్ల అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఆర్నెలల్లో రూ.435.14 కోట్ల మేర నష్టపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్ధారించింది. 2023–24లో గత ప్రభుత్వంలో ఉపాధి కూలీలు రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందగా 2024–25 లో రూ.6,183 కోట్లు మేర మాత్రమే ప్రయోజనం పొందారు.జగన్ హయాంలో ఒక్క జిల్లాలోనే కూలీలకు రూ.2,700 కోట్లురాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం జిల్లాలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020–21లో ఉపాధి కూలీలకు వేతనాల రూపంలో రూ.731 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఈ ఒక్క జిల్లాలోనే గత ప్రభుత్వం లేబర్ కాంపొనెంట్ కింద ఐదేళ్లలో రూ.2,700 కోట్లకుపైగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించింది. అదే జిల్లాలో ఇప్పుడు సీఎం చంద్రబాబు సర్కారు 2024–25లో రూ.407 కోట్లు, ఈ ఆరి్థక ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు రూ.230 కోట్లు మాత్రమే కూలీలకు వేతనాలు చెల్లింపులు చేసింది. -
రాష్ట్రాలు దాటిన అభిమానం
-
బాబుకు బిగ్ షాక్.. గవర్నర్ తో YS జగన్ భేటీ
-
సర్వం భవ్యం.. అనామక సంస్థకు పెద్దపీట
సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన, అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న విఖ్యాత సంస్థలను కాదని అతి చిన్న, ఓ అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతుండటం నివ్వెర పరుస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన 108, 104ల నిర్వహణ కాంట్రాక్ట్ను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అంతటితో ఆగకుండా బరితెగించి ఇతరత్రా శాఖల్లో సైతం కాంట్రాక్టులు అప్పనంగా కట్టబెట్టి.. మీకింత–మాకింత అంటూ కమీషన్లు దండుకుంటున్నారని స్పష్టమవుతోంది. పశు సంవర్థక శాఖలో పశు సంచార వైద్య సేవలు, ఏపీ జెన్కో ఆస్పత్రుల నిర్వహణ, తదితర కాంట్రాక్టుల ద్వారా ఊరూ, పేరు లేని సంస్థకు ఏకంగా రూ.3,025 కోట్ల విలువై కాంట్రాక్టులు అప్పగించడం దుమారం రేపుతోంది. తద్వారా ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టులను ఓ సాధనంగా మలుచుకున్నారనడానికి ఈ వ్యవహారమే ఓ ఉదాహరణ. తస్మదీయ కాంట్రాక్టర్కు పొగబెట్టి.. గతేడాది చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తస్మదీయ కాంట్రాక్టర్లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్కు ఈ కాంట్రాక్ట్ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో నిబంధనలు మార్చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అత్యవసర వైద్య సేవల కల్పన కోసం టెండర్లు పిలిచినప్పుడు అంబులెన్స్లు /ఎంఎంయూ /తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్లు, ఇతర సంచార వైద్య సేవల్లో అనుభవం ఉన్న సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు ఉంటాయి.భవ్యకు మొబైల్ వెటర్నరీ అంబులెన్స్లు నిర్వహించిన అనుభవం ఉందనే కారణంతో ఈ నిబంధనను టెండర్ మార్గదర్శకాల్లో చేర్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టెండర్ నిబంధనలన్నింటినీ భవ్యకు అనుకూలంగా మార్చేశారు. దీంతో టెండర్లలో పాల్గొన్నా ఏదో ఒక సాకుతో బిడ్లను తిరస్కరిస్తారని గ్రహించడంతో దేశంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థలు కనీసం బిడ్లు కూడా వేయలేదు. దీంతో ప్రభుత్వ పెద్దలు విజయవంతంగా భవ్యకు కాంట్రాక్ట్ను కట్టబెట్టేశారు. ఐదేళ్ల కాల పరిమితితో 731 అంబులెన్స్ల నిర్వహణను రూ.1,100 కోట్లతో, 904 ఎంఎంయూలకు రూ.675 కోట్లు, ఎంఎంయూల్లో వైద్య పరీక్షలకు రూ.810 కోట్లు, కాల్ సెంటర్ నిర్వహణకు రూ.129 కోట్ల చొప్పున మొత్తం రూ.2,714 కోట్ల కాంట్రాక్ట్ను భవ్య కైవసం చేసుకుంది. ఎంఎంయూల్లో వైద్య పరీక్షల నిర్వహణకు వైద్య శాఖ పైలెట్ నిర్వహిస్తోంది. త్వరలో వైద్య పరీక్షలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ అట! అరంబిందోను వెళ్లగొట్టాక.. ఎన్నడూ లేనట్లుగా 108, 104తో పాటు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నిర్వహణకు ఒకే టెండర్ను పిలిచారు. అత్యవసర వైద్యసేవల్లో విశేష అనుభవం ఉన్న పెద్దపెద్ద సంస్థలు టెండర్లలో పాల్గొంటే భవ్య సంస్థకు కాంట్రాక్ట్ దక్కదనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఈ చర్యలతో పోటీ, పారదర్శకత లేకుండా పోయింది. తర్వాత 768 అంబులెన్స్లు, 904 మొబైల్ మెడికల్ యూనిట్లతో పాటు, వందకుపైగా సీట్లతో కాల్సెంటర్ నిర్వహించే అతిపెద్ద కాంట్రాక్ట్ను ఏ రాష్ట్రంలోనూ పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం లేని భవ్య హెల్త్ సర్వీసెస్కు అప్పగించారు.క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పేరుతో టెక్నికల్ ప్రజంటేషన్కు 80, ఫైనాన్షియల్ బిడ్కు 20 మార్కులు కేటాయించి భవ్యకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 340 సంచార పశు వైద్య, ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి కోసం 1962 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్ గడువు గతేడాదితో ముగిసింది. దీంతో రూ.200 కోట్లకు పైగా అంచనాలతో ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నూతన కాంట్రాక్టర్ను ఎంపిక చేయడానికి టెండర్లు పిలిచారు. భవ్యకే కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం టెండర్ నిబంధనలన్నింటినీ మార్చేశారు. ఎంత తేడా? ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి భవ్యకు ప్రతి నెలా రూ.1.03 కోట్లను ఏపీజెన్కో చెల్లించాలి. ఇతర సంస్థలు నెలకు రూ.67 లక్షలు మాత్రమే అడిగాయి. అంతేకాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల కోసం రూ.8 వేలు, సూపర్ స్పెషలిస్ట్ డాక్లర్లు వస్తే రూ.12 వేలు, ఉద్యోగుల ఆరోగ్య తనిఖీల కోసం ఒక్కొక్కరికీ రూ.3,800 చొప్పున అదనంగా ఇవ్వాలి. ఇతర సంస్థలు రూ.1,700 ఇస్తే చాలన్నాయి. కానీ తక్కువ నిధులు కోట్ చేసిన సంస్థలను కాదని భవ్యకు రూ.100 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టేయడం దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం మండలం మంగంపేటలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) హెల్త్ సెంటర్ కాంట్రాక్టును కూడా ఇదే భవ్యకే అప్పగించేశారు. తద్వారా ఐదేళ్లకు రూ.11.70 కోట్లు దండుకోనుంది. నిబంధనల ఉల్లంఘన ఇలా. ➤108, 104 నిర్వహణతో పాటు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ అంటూ లింక్ పెట్టి పెద్ద సంస్థలు పోటీకి రాకుండా చేశారు. ➤సంచార పశు వైద్య, ఆరోగ్య సేవా రథాలకు సంబంధించి గతంలో టెండర్లలో పాల్గొనే సంస్థల టర్నోవర్ 50 శాతం ఉండాలని నిబంధన ఉండేది. దీన్ని 17 శాతానికి తగ్గించేశారు. నెట్వర్త్ విలువ 35 శాతం నుంచి 11 శాతానికి కుదించారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎంఎస్ఎంఈలకు బిడ్ సెక్యురిటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ➤రాష్ట్రానికి చెందిన సంస్థలకు 5 మార్కులు, ఐదేళ్ల అనుభవం కలిగిన కంపెనీలకు మరో 5 మార్కులు, ప్రజంటేషన్కు 30 మార్కులు అంటూ భవ్యకు అనుకూలంగా నిబంధనలు మార్చేశారు.➤ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు వైద్య సేవలు అందించే ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి రూ.వంద కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జెన్కో టెండర్ పిలిచింది. ఒకే టెండర్లో హైడల్, థర్మల్కు వేర్వేరుగా బిడ్ దాఖలు చేయాలని పేర్కొంది. దీంతో పలు సంస్థలు టెండర్లు వేశాయి. కానీ ఆ టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేశారు. మార్చిలో మరోసారి టెండర్లు పిలిచి వాటిని కూడా రద్దు చేశారు. మూడోసారి టెండర్ పిలిచి జూలైలో ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి టీడీపీలోని డాక్టర్ పవన్కు చెందిన భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ను దక్కించుకునేలా నిబంధనలు మార్చేశారు.➤మొదట రెండు సార్లు టెండర్లు పిలిచినప్పుడు నిర్వహణ చేపట్టే సంస్థకు ఆసుపత్రి ఉండాలని, వైద్య రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. కానీ మూడోసారి అవేవీ లేవు. పైగా భవ్య కంటే తక్కువ ఖర్చుతో సేవలందిస్తామన్న యశోద హాస్పిటల్పై అనర్హత వేటు వేసి పక్కకు తప్పించారు. అందుకు విచిత్ర కారణం చెప్పారు. జెన్కో ఆసుపత్రుల నిర్వహణను చూసే సంస్థ ఏదైనా ఆసుపత్రితో ఒప్పందం చేసుకోవాలని నిబంధన పెట్టారు. సొంత సంపద వృద్ధి కోసం సంపద సృష్టిస్తాం.. పంచి పెడతాం.. అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు సొంత సంపద సృష్టి కోసం నిరంతరం తపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును.. 108, 104 కాంట్రాక్ట్లలో వీలైనంత దోపిడీ చేయడానికి పూనుకున్నారు. ధరల పెరుగుదలను సాకుగా చూపి సంస్థకు చెల్లించే నిధులను ఏటా 3 శాతం పెంచి ఖజానాకు గండి కొడుతున్నారు. ఇదంతా ఆయన సొంత సంపద వృద్ధి కోసమేనని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వమే 104, 108 వాహనాల్లో ఔషధాలు, పరికరాలు, ఇతర అవసరమైన వాటిని అందిస్తుంది. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ ఐటీ, ఇతర సదుపాయాల ఖర్చు తిరిగి చెల్లింపుతో పాటు సేవల్లో అలసత్వం చూపినా మూడు నెలల పాటు జరిమానాలు విధించకుండా ఉండేలా నిబంధనలు మార్చారు.మరోవైపు మొత్తం పెనాల్టి.. కేపిటల్ విలువ మీద 10 శాతానికి మించొద్దనే షరతు విధించారు. అత్యవసర సేవల్లో వేగం, పారదర్శకత, అలసత్వం కట్టడికి.. ప్రజలు, ప్రభుత్వానికి పకడ్బందీగా మేలు చేసేలా కాకుండా, కాంట్రాక్టర్కు లాభాలు వచి్చపడేలా ప్రభుత్వమే నిబంధనలు రూపొందించింది. తద్వారా మళ్లించిన నిధులన్నీ అస్మదీయ సంస్థ ద్వారా తమ చేతుల్లోకి వచ్చేలా ప్రభుత్వ పెద్దలు మార్గం ఏర్పాటు చేసుకున్నారని స్పష్టమవుతోంది. వైఎస్ జగన్ పాలనలో పారదర్శకత, పోటీనే ప్రామాణికం2019కి ముందు చంద్రబాబు ‘108’ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే వైఎస్ జగన్ మళ్లీ వాటిని బలోపేతం చేశారు. 2019 వరకు 336 వాహనాలతో అంబులెన్స్ సేవలు అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒకటి కూడా లేని దుస్థితి. వైఎస్ జగన్ సర్కారు ఏడాదిలోపే 412 అంబులెన్స్లు కొనుగోలు చేసింది. 2020 జూలై 1న వీటిని ప్రారంభించారు. 26 నవజాత శిశు (నియోనాటల్) అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు చేరింది. ఇందుకు మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్లో రూ.4.76 కోట్లతో 20 కొత్త 108లను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. అలా 108ల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కిలోమీటర్లు పైగా తిరిగిన పాత వాహనాల స్థానంలో 146 కొత్త అంబులెన్సులనూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అత్యవసర సేవల బలోపేతం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మందికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. నేరుగా ప్రభుత్వమే అత్యాధునిక వసతులతో కొత్త అంబులెన్స్లు, ఎంఎంయూలు కొనుగోలు చేశారు. తద్వారా ఏ రాష్ట్రంలోనూ లేని అతిపెద్ద అత్యవసర, సంచార వైద్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేశారు.దేశంలోనే దిగ్గజ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు పొందుపరిచి పోటీ పెంచారు. సేవల నిర్వహణకు పిలిచిన టెండర్లలోనూ అత్యంత పారదర్శక విధానాలు పాటించారు. అనేక వడపోతల అనంతరం చాలా తక్కువ ఫైనాన్షియల్ బిడ్ కోట్ చేసిన సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించారు. సేవల్లో అలసత్వం వహించిన సందర్భాల్లో భారీగా పెనాల్టీలు విధించేలా నిబంధనలు పెట్టి నిర్వహణ సంస్థలో జవాబుదారీతనం పెంచారు. -
ఈనెల 17న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్కు నివేదించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్.. గవర్నర్ను కలవనున్నారు.ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైఎస్సార్సీపీకి లేఖ అందింది. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్కు చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు. -
అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడు
-
యాదవులకు చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యాదవ భవనం కోసం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవుల విజ్ఞప్తి మేరకు ఎండాడ హైవే సమీపంలో 50 కోట్లు విలువైన 50 సెంట్ల భూమిని యాదవ భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో వారు భూమిపూజ కూడా నిర్వహించారు.అయితే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఆ కీలక ప్రాంతంలో ఉన్న భూకేటాయింపును రద్దు చేసి హైవేకు దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో తక్కువ రేటు పలికే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించడం యాదవ వర్గాల ఆవేదనకు కారణమైంది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ యాదవ సంఘాల నేతలు మండిపడుతున్నారు.వైఎస్ జగన్ హయాంలో యాదవులకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. విశాఖ నగరంలోని పలు కీలక పదవులు కూడా యాదవ సంఘాల నాయకులకు అప్పగించారని వారు గుర్తు చేశారు. యాదవుల కోసం జగన్ ఇచ్చిన విలువైన భూమిని రద్దు చేసి నగరానికి దూరంగా ఉన్న తక్కువ రేటు స్థలాన్ని కేటాయించడం అన్యాయం అని వారు విమర్శిస్తున్నారు.భవనం నిర్మాణం ఆలస్యానికి గురి కాకుండా పూర్వం కేటాయించిన విలువైన భూమినే తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేశారు. అందుకే మారుమూల ప్రాంతంలో యాదవ భవనంకు స్థలం కేటాయించారని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాజీ మేయర్ హరి వెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నేడు(డిసెంబర్ 6). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని.. వాటిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడాయన అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నివాళులర్పించారు. నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. ఆ స్ఫూర్తి తో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడు అయన. నేడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/DgzRgrdHnC— YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2025బీఆర్ అంబేద్కర్ను సమానత్వం, సాధికారత, సామాజిక న్యాయంకు ప్రతీకగా భావిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ గౌరవిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ స్ఫూర్తిని ప్రతిబింబించే విధానాలను ఏపీలో అమలు చేశారు. విజయవాడలో స్వరాజ్ మైదానంలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో ఏకంగా 206 అడుగుల ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కావడం గమనార్హం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ స్మృతి వనాన్ని నిర్లక్ష్యం చేస్తూ అంబేద్కర్ను అవమానిస్తోంది. నిర్వహణ భారం పేరిట ప్రైవేట్వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది. -
అది నా అకౌంట్ లోకే.. జగన్ క్రెడిట్.. పవన్ ఖాతాలోకి!
-
క్రెడిట్ చోరీ.. బాబు బాటలో పవన్
సాక్షి, అమరావతి: ఎగవేతలు... అడ్డగోలు కోతలు తప్ప ఏడాదిన్నర నుంచి చేసిన మంచి పని ఒక్కటీ లేదు..! చెప్పుకోవడానికి ఏమీ లేదు..! దీంతో చంద్రబాబు సర్కారు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది...! వైఎస్సార్సీపీ హయాంలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను యథేచ్ఛగా తన ఖాతాలో వేసుకుంటోంది..! వైఎస్ జగన్ వినూత్న ఆలోచనలను చంద్రబాబు ప్రభుత్వం అటుఇటు మార్చి తమ గొప్పలుగా చెప్పుకుంటోంది. వేగంగా జరుగుతున్న ఈ క్రెడిట్ చోరీలో సీఎం చంద్రబాబు దారిలోనే ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ గురువారం 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను (డీడీవో) ప్రారంభిస్తూ, అవి తన ఆలోచన నుంచి పుట్టాయంటూ ప్రకటించుకున్నారు. కానీ, వాస్తవం మాత్రం వేరు. మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మచిలీపట్నం డివిజనల్ డెవలప్మెంట్ ఆపీసు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గ్రామ సచివాలయ భవనంలో ప్రారంభించిన డీడీవో కార్యాలయం దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించిపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 1987లో మండల వ్యవస్థను తీసుకురాగా... కీలకమైన ఎంపీడీవోలకు 33 ఏళ్ల పాటు పదోన్నతులు లేవు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వ్యవస్థను తెచ్చారు. అప్పటివరకు ఎంపీడీవోలు వేర్వేరు సంఘాలుగా వేరుపడి సీనియారిటీ జాబితాపై వాళ్లలో వాళ్లే కోర్టుల్లో కేసులు వేసుకుంటూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ చూపి... గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకునేలా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించింది. అలా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లో ఐదేళ్ల కిత్రం 2020 సెప్టెంబరులో ‘డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల’ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ కార్యాలయాల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర సిబ్బందితో ఏడుగురు చొప్పున నియామకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబరు 30న జీవో నంబరు 674ను జారీ చేసింది. దీంతోపాటు కార్యాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నీచర్ కొనుగోలుతో పాటు అద్దెకు కారు వాడుకునేలా, ఇతర నిర్వహణ ఖర్చులకు సైతం నిధులు కేటాయించింది. తద్వారా పెద్దఎత్తున ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఊరూవాడా అందరికీ అందేలా కృషి చేసింది. సుదీర్ఘ కాలం ఎదురుచూపులకు తెరపడుతూ డీడీవోలుగా పదోన్నతి పొందిన ఉత్సాహంతో అధికారులు సైతం సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించారు.అక్షరం మార్చేసి అదే కొత్తగా ప్రచారంఉప ముఖ్యమంత్రి పవన్ సొంత ఆలోచనగా ప్రకటించుకున్న డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు (డీడీవో) ఐదేళ్లుగా రాష్ట్రమంతా పనిచేస్తూనే ఉన్నాయి. కానీ, కొత్తవి అన్నట్లుగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. డీడీవోలను వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షిప్తంగా డీఎల్డీవోలుగా పిలిచేవారు. ఎంపీడీవోల నుంచి పదోన్నతి పొందిన నేపథ్యంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి హోదాను డీఎల్డీవోగా కొనసాగించారు. కాగా, బాబు సర్కారు ప్రస్తుతం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి హోదాలో డివిజనల్ అన్న పదానికి సంక్షిప్తంగా ‘డీఎల్’కు బదులు కేవలం ‘డీ’ని మాత్రమే పేర్కొంటూ... డీఎల్డీవోను డీడీవోగా మార్చింది. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి (డీఎల్పీవో), డ్వామా (ఉపాధి హామీ పథకం) ఏపీడీ కార్యాలయం, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీఎల్డీవో) కార్యాలయాలు వేర్వేరుచోట్ల పనిచేశాయి. బాబు ప్రభుత్వం డీఎల్పీవోతో పాటు ఉపాధి హామీ ఏపీడీ కార్యాలయాలను కూడా డీడీవో కార్యాలయంలోనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఒకేచోట ఉన్నప్పటికీ, డీడీవో కార్యాలయాల్లో డీడీవో పర్యవేక్షణలో డీఎల్పీవోలు, ఉపాధి హామీ ఏపీడీలు వేర్వేరుగా పనిచేస్తారని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటున్నారు.గ్రామ సచివాలయాల్లోనేఈ కార్యాలయాలుడిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించిన డీడీవో కార్యాలయాలు కూడా కూటమి ప్రభుత్వం నిర్మించినవి కాకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి ఊరిలో రెండంతస్తులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను డీడీవో కార్యాలయాలకు వాడుకుంటున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల కింది అంతస్తులో గ్రామ సచివాలయం ఉండగా, పైఅంతస్తును డీడీవో కార్యాలయాలకు కేటాయించారు. -
మా గూడును కూల్చారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: ‘‘ఎన్నో ఏళ్లపాటు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న గూడును నేలమట్టం చేసి రోడ్డు పాల్జేశారు. బాబు సర్కారు వచ్చాక మాపై దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. ఇళ్లలోని సామగ్రి మొత్తం నష్టపోయి మూడు రోజులుగా భార్యాబిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నాం. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మాట సాయం చేసిన పాపాన పోలేదు. మాకు మీరే న్యాయం చేయాలి. మా జీవితాలను నిలబెట్టాలి’’ అని వైస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను విజయవాడ భవానీపురం జోజినగర్లో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు వేడుకున్నారు. శుక్రవారం ఉదయం 42 ప్లాట్ల యజమానులు ఆయనను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వం నుంచి తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ‘‘మేం 23 ఏళ్ల క్రితం భవానీపురం జోజినగర్ వద్ద అబ్దుల్ మజీద్ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నాం. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం. కానీ, మా స్థలాలు శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి చెందినవని, కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని, ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. మమ్మల్ని కిరాయి గూండాలతో వచ్చి అనేకసార్లు బెదిరించారు. పోలీసులను కలిశాం. చాలామంది నాయకులకు చెప్పినా న్యాయం జరగలేదు. కోర్టు ఉత్తర్వులున్నా వినలేదు... మా విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు ఉపక్రమించవద్దని గత నెల 3న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నెల 3వ తేదీన బుధవారం 300 మందిపైగా పోలీసులు, శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు ఆరు జేసీబీలతో వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తాయని, కాళ్లావేళ్ల్ల ప్రాథేయపడి నాలుగు గంటల సమయం కోరినా కనీసం మానవత్వం చూపలేదు. వందలాది పోలీసులతో వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇంట్లో సామాన్లను కూడా బయటికి తెచ్చుకోనివ్వలేదు.పిల్లలకు పాలు, మంచినీళ్లు అందించే అవకాశం ఇవ్వకుండా మా ఇళ్లను మా కళ్లముందే కూల్చివేశారు. చర్చిని అయినా కూల్చొద్దని ప్రాథేయపడ్డాం. కానీ, మాకెవరు అడ్డు వస్తారో చూస్తామంటూపడగొట్టారు. డిసెంబరు 31 వరకు 42 ప్లాట్లపై చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పూర్తి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపాక పోలీసులు వెళ్లిపోయారు. అప్పటికే అంతా అయిపోయింది’’ అని వాపోయారు. ప్లాట్ల యజమానులు వైఎస్ జగన్ను కలిసిన సమయంలో వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, వెలంపల్లి, భాగ్యలక్షి్మ, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. -
టీడీపీ అరాచక పాలనపై జగన్ ఒంటరి పోరాటం
-
పల్నాడు ఘోర ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
సాక్షి, తాడేపల్లి: పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థులు మరణించడం బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రహదారిపై గురువారం రాత్రి ఓ కారు కంటెయినర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అయ్యప్ప మాలధారణలో ఉన్న ఐదుగురు బీటెక్ విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
జగన్ ప్రశ్నలకు మంత్రులు సైలెంట్.. బిత్తరపోయిన చంద్రబాబు
-
భవానీపురం ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ను కలిసిన భవానీ పురం బాధితులు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను భవానీపురం బాధితులు కలుసుకున్నారు. భవానీ పురం 42 ఫ్లాట్స్ బాధితులు శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ను కలిసి తమ గోడును చెప్పుకుని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బాధితులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చర్యల కారణంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఏం జరిగిందంటే.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజినగర్లోని 42 ఇళ్లను బుధవారం నేలమట్టం చేసింది. రూపాయి రూపాయి కూడబెట్టుకొని, స్థలం కొని ఇళ్లు కట్టుకొన్న పేదల జీవితాలను రోడ్డు పాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున్న ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మెనేజ్ చేశారు. చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నేలమట్టం చేశారు. పేదలను నడిరోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు భాదితులు బహిరంగానే విమర్శిస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణం కోసమే! విజయవాడ నడిబొడ్డున జోజినగర్లో ఉన్న ఈ భూమి రూ.కోట్లు విలువ చేస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తొలుత ఒకరికి అగ్రిమెంటు చేశారు. వారు స్పందించక పోవడంతో 1980 ప్రాంతంలో స్థల యజమాని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణ కోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిలో చాలా ఇళ్లు ఇప్పటికే పలువురి చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే స్థలం తొలుత అగ్రిమెంటు చేసుకున్న వ్యక్తి నుంచి పొందిన కాగితాల సాయంతో పచ్చనేతలు దొడ్డిదారిన ఓ సొసైటీని ఏర్పాటు చేసి, వారికి అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుని చక్రం తిప్పారు. కోర్టు ద్వారా స్థలాన్ని కాజేయడానికి తీవ్ర యత్నం చేసి సఫలీకృతులయ్యారు.బహుళ అంతస్తుల నిర్మాణానికి బెంగళూరుకు చెందిన బడా వ్యక్తులు, చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో బుల్డోజర్లతో కూల్చివేతలకు ఒడిగట్టారు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఒకవేళ తమ రిజిస్ట్రేషన్లు అక్రమమైతే వాటిని చేసిన అధికారులపైనా, భవన నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలను వారు ఉద్ధృతం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు బాధితులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కూల్చివేతలపై స్టే ఉందని, తాము ఖాళీ చేసేందుకు ఈనెలాఖరు వరకు సమయం ఉందని చెప్పినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, శ్రీలక్ష్మి రామ కో–ఆపరేటివ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బాధితులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి «న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో తమ సమస్యను వివరిస్తే న్యాయం చేస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు మొదలైంది. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు నోరు తెరవకపోవడం గమనార్హం.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. కూటమి సర్కార్కు పలు ప్రశ్నలు సంధించారు. సూపర్ సిక్స్ అమలు చేశామంటున్న ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు చొప్పున ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ఇచ్చారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా? అని అడిగారు.అలాగే, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను సైతం వైఎస్ జగన్ ప్రశ్నించారు. 2024 జులైలో కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతి ఇచ్చారు?. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి ఉంటే మరి టీటీడీ ఛైర్మన్, ఈవోలపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అడిగారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అసలు నోరే తెరవలేక పోవడం గమనార్హం. -
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు?. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
కూటమికి YS జగన్ దబిడి దిబిడి
-
సందట్లో సడేమియా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తూ మరో వైపు తనపై అవినీతి కేసులను సందట్లో సడేమియా మాదిరిగా ఎత్తేసుకునే కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు ‘తానే దొంగ.. తానే పోలీస్.. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్..’ అన్నట్లు వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి.. తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా విత్ డ్రా చేసుకుంటూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు 2014–19 మధ్య ఆషామాషీ స్కాములు చేయలేదు. ఒక్క స్కిల్ స్కామ్లోనే వందల కోట్లు బొక్కేశారు. స్వయంగా ఆ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు రూ.370 కోట్లు దోచిపెట్టారు. అక్కడేమో సీమెన్స్ ఎండీ ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీయే కాదని స్టేట్మెంట్ ఇచ్చారు.డొల్ల కంపెనీలకు చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి రూ.370 కోట్లు ఇచ్చిన కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన ఈడీ.. డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను, డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్టు చేసింది. కానీ, డబ్బులు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు. డబ్బు మాత్రం పోయింది. డబ్బు ఇచ్చినోడిని అరెస్టు చేయకుండా ప్రొటెస్ట్ చేస్తుండటం ఏంటని ఏసీబీ కోర్టు ఆయన్ను జైలుకు పంపింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొనడం ఒక స్కాం అయితే.. ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కాం. అదే స్థాయిలో రింగు రోడ్డు అలైన్మెంట్ స్కాం చేశారు. కరెక్టుగా చంద్రబాబు హెరిటేజ్ భూముల దగ్గరకు వచ్చే సరికే రింగ్ రోడ్డు పక్కకు వెళ్లిపోతుంది. మరో వైపు ఉచితం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. బ్లాక్ లిస్టులోని కంపెనీకి కాంట్రాక్టులు!ఫైబర్ నెట్లో అర్హత లేని, బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి రూ.వందల కోట్లు అప్పనంగా మింగేశారు. లిక్కర్లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా దోచేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి, దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంకు తెర తీశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లిక్కర్ స్కామ్ చేస్తున్నారు. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చేది ప్రైవేట్ షాపులు. అలాంటి ప్రైవేట్ షాపులన్నీ చంద్రబాబు వ్యక్తులవి కాదా? ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్మేస్తున్నారు. చట్టం.. చంద్రబాబు చుట్టం!ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజదొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో కేసులు విత్డ్రా చేసుకునే కుట్రలకు తెగబడ్డారు. ఫిర్యాదుదారులైన అధికారుల్ని భయపెట్టి, బెదిరించి స్టేట్మెంట్లు విత్ డ్రా చేయించి, వాటిని కోర్టు ముందు పెట్టి, ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. రెఫర్ చార్జ్ షీట్ వేయించి మూసేయిస్తున్నారు.గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండీకి పాల్పడ్డారు. ఏలేరు స్కామ్ తీసుకున్నా అంతే. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసులో.. ఇవాళ్టి కేసు వరకు చట్టం ఒక వైపు, వ్యవస్థలు మరో వైపు.. చంద్రబాబుకు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలు ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్తాం. -
ఈ సర్కారుకు మాయరోగం!
‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీకి 18 నెలలకు రూ.5,400 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా..! ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందట. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! బొనాంజా కాదా ఇది?’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇచ్చారు? విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతల పరిరక్షణ, పారదర్శక పాలన.. ఇవి కదా చేయాల్సింది. కానీ అన్నీ తిరోగమనమే. అన్నీ స్కాములే. ఏవీ పట్టించుకునే పరిస్థితి లేదు. అన్నీ ప్రైవేటీకరణే.. బాధ్యత నుంచి తప్పించుకోవడం.. ఉన్నకాడికి స్కామ్లు చేయడమే..’’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. దారుణంగా ప్రజారోగ్య వ్యవస్థ ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ అమలుకు నెలకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 18 నెలలకు కలిపి రూ.5,400 కోట్లు ఇవ్వాలి. ఇటీవల నేను దీనిపై పలుదఫాలు మాట్లాడటం.. వాళ్లు కూడా (నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు) స్ట్రైక్లు చేయడంతో ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. అంటే ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. చివరికి మొన్న నెట్వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మెకు దిగాయి. సమ్మె విరమించేటప్పుడు ప్రభుత్వం వాళ్లకిచి్చన మాటకు ఇంతవరకు దిక్కులేదు. పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 సేవలను స్కాములుగా మార్చేశారు. రూ.5 కోట్లు టర్నోవర్ లేని వాటికి 104, 108 సరీ్వసుల నిర్వహణను అప్పగించేశారు. ఆ వ్యక్తి ఎవరంటే.. టీడీపీ ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడట..! ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే.. మరోవైపు సంజీవని అంటారు. అది ఇంకో డ్రామా. అన్నీ గవర్నమెంట్వే.. లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా.. ఓవైపున ఆరోగ్యశ్రీని ఖూనీ చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒక స్కాముగా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా కూడా ఇచ్చారు. అది ఇంకో పెద్ద స్కామ్. ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. (ప్రభుత్వం జారీ చేసిన జీవో 847ను ప్రదర్శించారు). ఒక్కో టీచింగ్ హాస్పిటల్ (550 పడకల ఆసుపత్రి)లో ఉద్యోగుల జీతాల కోసం నెలకు దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి రూ.60 నుంచి రూ.70 కోట్లు. రెండేళ్లకు రూ.120 నుంచి రూ.140 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది.ఆశ్చర్యమేమిటంటే.. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! ఆశ్చర్యంగా లేదా ఇది..? బొనాంజా కాదా ఇది? స్కాముల్లో అన్నిటికంటే పెద్ద స్కామ్ కాదా ఇది? ఓవైపు ప్రజా ఉద్యమం జరుగుతోంది. దానిని ఖాతరు చేయకుండా, సిగ్గు లేకుండా చంద్రబాబు స్కాములపర్వం ముందుకు పోతోంది. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు. మరో వైపున వాటిని ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న స్కామ్ల్లో ఒక అడుగు ముందుకేసి ఇంకో స్కామ్ చేస్తున్నాడు.16న గవర్నర్కు కోటి సంతకాల పత్రాలు అందచేస్తాంకొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో రోడ్లెక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మా పార్టీ భారీ ర్యాలీలు చేపట్టి ప్రజల గొంతుకను వినిపించింది. కోటిమందికి పైగా సంతకాలు చేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నెల 10వ తేదీన సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించి ప్రజలకు, మీడియాకు అందరికీ చూపించి జిల్లా కేంద్రాలకు పంపుతారు. ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేసి పార్టీ సెంట్రల్ ఆఫీసుకు చేరుస్తారు. ఆ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 16న గవర్నర్కు అందచేస్తాం. ఆ తరువాత ఈ పత్రాలతో హైకోర్టులో పిటిషన్ వేస్తాం. -
ఉద్యోగులను ముంచేశారు
‘‘ఉద్యోగుల సమస్యలు చూస్తే.. ఈ డిసెంబర్ పూర్తై జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. ఐఆర్ ఊసే లేదు’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు నిండా ముంచేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగిపారేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఐదింటికి ఒకే డీఏ.. ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే... ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ అరియర్స్ను రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండం... ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా! దానికి తగ్గట్టుగా జీవో 60 జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్బాగ్యమైన జీవోను తీసుకొని వచ్చి ఉండరు (జీవో నంబర్ 60ని ప్రదర్శించారు). దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని, వాయిదాల్లో ఇస్తామన్నారు. ఐఆర్ లేదు.. మెరుగైన పీఆర్సీ బూటకం మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఆ స్థానంలో ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. చైర్మన్ను నియమిస్తే పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి. రిపోర్టు వస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ను ఇప్పటివరకూ నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ.. ఇప్పటివరకు ఐఆర్ ఊసే లేదు. నాడు మేం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం.దాంతో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్(గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంకు స్వర్గంలోకి నెట్టాడు. మేం తెచ్చిన జీపీఎస్ను దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదైనా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు.ఆప్కాస్(ఏపీసీఓఎస్)లో ప్రతి నెలా 1వ తేదీనే జీతాలిచ్చేలా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్లు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి.. ఇప్పుడు ఒకటో తేదీన జీతం కథ దేవుడెరుగు.. రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్..! అని చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకైతే ఎనిమిది నెలలుగా జీతాలే లేవు. ఈ ప్రభుత్వంలోఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేస్తున్నారు. భాస్కరనాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గని అడగరు.. ప్రైవేటు ప్లాంట్కు అడుగుతారా?
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయొద్దు... పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. సినిమాల్లో విలన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి... చంద్రబాబు వ్యవహరిస్తున్న ఈ తీరే నిదర్శనం’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా కాపాడుకున్నామని, ప్రభుత్వ రంగంలోనే నడపాలని, సొంత గని (క్యాప్టివ్ మైన్) కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కార్మికులు కానే కాదని, సొంత గని లేకపోవడమేనని తేల్చి చెప్పారు. దీనికి ఆధారంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏఐఎల్) వార్షిక నివేదికలను చూపారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గని కేటాయించాలని అడగరు కాని.. మిట్టల్ సంస్థ పెట్టే ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప గని కేటాయించాలని టీడీపీ కూటమి ఎంపీలతో కేంద్రాన్ని అడిగిస్తారా?’’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ ఇంకా ఏమన్నారంటే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాటా? మా ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా అడ్డుకున్నాం. కానీ, ఎన్నికల ముందు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది చూడండి. (2021 ఫిబ్రవరి 16న చంద్రబాబు మాట్లాడిన మాటలు, 2025 నవంబర్ 15న మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్లను చూపించారు). ప్లాంట్ను కాపాడుకుంటాం. కలిసి పోరాడతాం అంటూ వీర డైలాగులు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? అంటున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయెద్దు పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నిజానికి నష్టాలకు ఉద్యోగులు కారణం కాదు. విశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే నష్టాలు. ఆర్ఐఎన్ఎల్, ఎస్ఏఐఎల్ 2023–24 వార్షిక నివేదిక ప్రకారం.. సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం చేసే వ్యయం 11.2 శాతం ఉంది. కానీ, సెయిల్కు ఐరన్ ఓర్ ఉంది. క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఉంది. దాన్నుంచి 34.34 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ తీసుకోవడమే కాకుండా, జార్ఖండ్ ప్రభుత్వం అనుమతితో 1.16 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ను మార్కెట్లో అమ్ముకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ లేవు. అందుకే ఐరన్ ఓర్ వ్యయం 18.6 శాతం అవుతుంటే సెయిల్లో ఇది 9.8 శాతమే. 10 శాతం తేడా ఉంది. -
లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలా?
తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటే. ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దుష్ప్రచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా?’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని అన్నావ్..! వాటికి ఆధారాలు దొరికాయా..?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వరస్వామి విశిష్టతను అభాసుపాలు చేస్తావా బాబూ? అంటూ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. బెయిల్పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్నారని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా బాబూ..? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా! టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వాటిని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? వీటికి ఆధారాలున్నాయా? టీటీడీలో ఒక బలమైన తనిఖీ వ్యవస్థ (రోబస్ట్ ప్రొసీజర్) ఉంది. టీటీడీకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లా»ొరేటరీస్) సర్టిఫికేషన్తోనే రావాలి. ఇది దశాబ్దాలుగా టీటీడీలో పాటిస్తున్న నిబంధన. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుమలలోకి ట్యాంకర్లు రావు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. టీటీడీకి ఒక సొంత ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్లో మళ్లీ టెస్టు పాస్ అయితేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి, వెనక్కి పంపిస్తారు. ఇలా గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపారు. టీటీడీలో బలమైన తనిఖీ వ్యవస్థ ఉందని, సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాంటప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడిది? కల్తీ నెయ్యి వాడితే నీ వైఫల్యం కాదా బాబూ? చంద్రబాబు హయాంలో, ఆయన నియమించిన టీటీడీ ఈవో టైమ్స్ నౌలో(ఈవో మాట్లాడిన వీడియో ప్రదర్శించారు) స్వయంగా ఆ ట్యాంకర్ల నెయ్యిని వినియోగించలేదని చెప్పారు. సెపె్టంబర్ 20, 2024న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ ఈవో.. నాలుగు నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాస్ కాకపోవడంతో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన హయాంలో జూలైలో∙4 ట్యాంకర్లు తిప్పి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయట! మరి అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు కాదా..? ప్రభుత్వాన్ని నడిపేది ఆయన కాదా..? గతంలో రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకులు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో రాసింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని లోపల వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకులు ఎలా తిరిగి వచ్చాయి? చంద్రబాబు చెప్పినట్టుగా ఆ నెయ్యిని వాడి ఉంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ ఈవో ఇద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా మాపై నిందలు వేస్తారా? చంద్రబాబు ముఠాకు దేవుడంటే భయం, భక్తీ లేదు. దుర్మార్గమైన అసత్యాలు ప్రచారం చేయడమే వీళ్ల పని. పైగా చంద్రబాబు వేసిన సిట్.. వ్యక్తులను ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులపై తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. 2014–19 మధ్య కిలో నెయ్యి రూ.276–రూ.314మరి అదంతా కల్తీ నెయ్యేనా బాబూ? స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో రూ.3 వేలు అవుతుందని ప్రకటించారు. చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు అయితే కనీసం రూ.1,000–రూ.1,600 అని రాసింది. మరి టీటీడీలో ఇప్పుడు నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇస్తున్నారా? రూ.1,600 లేక రూ.1,000 ఇచ్చి కొంటున్నారా? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276–314 మధ్య కొన్నాడు. ఇది రూ.320 కంటే తక్కువ కదా? కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పైగా భోలే బాబా డెయిరీ విషయంలో చేస్తున్న దు్రష్పచారం అంతా ఇంతా కాదు. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు మినిట్స్ చూస్తే భోలేబాబా ఎవరో తేలింది. హర్‡్ష ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్గా మారింది. ఈ సంస్థ టీటీడీకి పాలు సప్లై చేయడానికి డీమ్డ్ టు క్వాలిఫై అని సర్టిఫై చేసింది చంద్రబాబు హయాంలోనే. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. టెండర్లలో ఎల్–1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి వీళ్లు ప్రయతి్నస్తున్నారు. నెయ్యిని సప్లై చేసే ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఏన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకోవాలి, టీటీడీలో ఉన్న ల్యాబ్లో టెస్టులు పాసవ్వాలి. అప్పుడే ట్యాంకులు లోపలకు వెళ్తాయి. దుష్ప్రచారం ఆపాలని సుప్రీంకు వెళ్లింది మేం కాదా? టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం ఆపాలని, నిజాలు బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ వాళ్లు కాదు. అలాంటిది.. సుబ్బారెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా? హైదరాబాద్లో ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఆయన 1978 నుంచి 35–40 సార్లు అయ్యప్పమాల ధరించి కొండకు వెళ్లి ఉంటారు. అందులోనూ ఆయనది గురుస్వామి స్థానం. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియాలి. టీటీడీలో స్కాములన్నీ బాబువే! పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్మెంట్ కోసం అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేశారు. ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత తప్పుడు కథనాలు రాయించారు.మీ హయాంలో పట్టుకోలేదేం బాబూ? ఆ దొరికిన దొంగ... 30 ఏళ్ల నుంచి జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచి్చన వ్యక్తి కాదు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దొంగను మేం పట్టుకున్నాం. వాస్తవానికి మేం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో తిరుమల హుండీ డబ్బు లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేశాం. దేవుడి సొమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించా. 2023 ఫిబ్రవరి 5 నుంచి ఆ బిల్డింగ్లో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో అరకొరగా సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీల కవరేజ్తో 4కే హెచ్డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తెచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా..? ఆ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు. రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లు దొరికితే.. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని ఆ కుటుంబం దేవుడికి రాసిచ్చింది. న్యాయ వ్యవస్థపైనే దాడి..! చంద్రబాబు తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై సైతం దాడి చేయించడం పరిపాటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి వర్ల రామయ్యతో మాట్లాడిస్తున్న మాటలు న్యాయ వ్యవస్థపై దాడి చేయించినట్లే! (వర్ల వీడియోను ప్రదర్శించారు)! ‘‘23–9–2025: ప్రాపర్టీ ఓనర్ ఎవరు? కోర్టు కూడా తప్పు చేసిందా.. అనుమానం వస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరుతున్నా.. మీ తరఫున దర్యాప్తు చేయించాలి. ఈ కేసులు సీరియస్. ఎందుకు లోక్ అదాలత్తో దర్యాప్తు చేయిస్తారు? తిరుపతిలో రూమర్స్ వస్తున్నాయి. ఈ జడ్జిగారికి పైనుంచి ఎవరో మరో జడ్జి చెప్పారట. నేను జడ్జి ఎవరని అడగట్లేదు. అందరం మనుషులమే. ఈ జడ్జికి పైనుంచి ఎవరో జడ్జి చెప్పారట. ఏ జడ్జి చెప్పినా.. ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేసినా.. అన్యాయం జరిగింది మాత్రం స్వామి వారికే. 13–11–2025: తమిళనాడులో రిజిస్టర్ చేశారట ఆస్తులు. దీని వెనుక జడ్జి ఉన్నారని చెబుతున్నారు. రూ.50 లక్షల స్టాంపు డ్యూటీ కట్టారట. ఆ రూ.50 లక్షలు ఎవరు కట్టారు? జడ్జిలు, టీటీడీ అధికారులపై నిందలు సిగ్గుచేటు.. ఇలా ఏకంగా న్యాయవ్యవస్థపైనే చంద్రబాబు దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దు్రష్పచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పూ జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో..! దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? జడ్జిలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెపె్టంబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అత్యంత విశిష్టత కలిగిన సింహాచలంలో రూ.55 వేలు హుండీ డబ్బులు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను పోలీసులకు అప్పగించి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆ వ్యకిని ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు విచారణ చేయలే దు? మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వా«దీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం..! అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం..! మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా!!టీటీడీలో బాబు స్కాములు ఇవీ...!రాష్ట్రంలో దేవుడి సొమ్ముతో స్కామ్లు చేసింది చంద్రబాబే. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపాదన చేశారు. ఇందులో 67 శాతం ఖర్చు టీటీడీ, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించారు. అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను చంద్రబాబు పిలిపించుకుని రూ.684 కోట్లతో శ్రీనివాససేతు కట్టేయమని చెప్పారు. అయితే, ఆ మీటింగ్లో టీటీడీ ప్రతినిధులు లేకుండానే.. ఏకంగా 67 శాతం డబ్బులు టీటీడీ నుంచి తీసుకునేలా నిర్ణయం తీసేసుకున్నారు. అసలు బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇది కాదా స్కామ్? మన ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు రీ విజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించింది. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి? కమీషన్ల కోసం కక్కుర్తి! టీటీడీ డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లో పెట్టించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత బోర్డు ఆ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత మూడు నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది. ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్? మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని సమస్య పరిష్కరించి, సరిదిద్దాం. మన ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, రివర్స్ అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీ ఒక స్వతంత్ర వ్యవస్థ. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంటగలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ చంద్రబాబు అత్యంత హేయమైన రాజకీయాలు చేస్తున్నారు. అది చంద్రబాబు సొంత సిట్! లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వేసిన సిట్ చూస్తే వాళ్ల బాగోతం తెలిసిపోతుంది. సిట్లో ఉన్న గోపీనాథ్ జెట్టి.. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పని చేసిన కృష్ణయ్యకు అత్యంత సమీప బంధువు (ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో దిగిన ఫొటో ప్రదర్శించారు). కృష్ణయ్యపై చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్ను చేశారు. ఇలాంటి వ్యక్తి సమీప బంధువు సిట్ ఆఫీసర్లలో ఒకరు. మరో ఆఫీసర్ డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎలాంటి వాడో చెప్పాల్సిన పనిలేదు. పల్నాడు జిల్లాలో ఆయన సృష్టించిన అల్లకల్లోలం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం భుజాన వేసుకుని పాకులాడారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి.. ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ప్రముఖ ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలాంటోళ్లు అందరూ సిట్లో ఉన్నారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అతను వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఒక టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి ప్రతి నెలా అప్పన్న జీతం (చెక్కులు) తీసుకుంటున్నాడు. పైగా ఏపీ భవన్ ఉద్యోగి. వీపీఆర్ పీఏ, తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. మరి వైవీ సుబ్బారెడ్డి పిక్చర్లోకి ఎలా వచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు!. -
ఆ 53 వేల ఎకరాలకే దిక్కులేదు..
అధికారంలో ఉంటే చంద్రబాబుకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి? నేషనల్ హైవేలు కిలోమీటర్కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఇలా అన్నీ స్కాములు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి గతంలో తీసుకున్న 53 వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు రైతుల నుంచి ఇంకో 53 వేల ఎకరాలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు వెనుకాడటం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారు. రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అమరావతి గురించి మీరే చెప్పాలి. ఇంతకు ముందు అంతా చంద్రబాబు ఏమన్నాడు? 2014–19 మధ్య 53 వేల ఎకరాలు తీసుకుంటూ అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని.. సింగపూర్, గింగపూర్ ఎక్కడికి పోవాలో.. మన దగ్గర నుంచే ఏదైనా కానీ.. మన రాజధానిని చూసి వాళ్లు కాపీ కొట్టే పరిస్థితుల్లోకి దీన్ని బిల్డప్ చేస్తున్నానని మనకు బాహుబలి సెట్టింగ్స్ చూపించారు. ఆ 53 వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత? రాజధాని కట్టడం కథ దేవుడెరుగు.. ఆ 53 వేల ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి.. వీటికే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని తానే డీపీఆర్ ఇచ్చాడు. అంటే ఆ 53 వేల ఎకరాలకే లక్ష కోట్ల రూపాయలు కావాలని సినిమా చూపిస్తూ రూ.5 వేల కోట్లు పెట్టాడు. మళ్లీ ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆ 53 వేల ఎకరాలు సరిపోదు అంటున్నాడు.’ అని చెప్పారు.స్కాముల కోసమే అది చాలదంటున్నారు‘ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8 వేల ఎకరాలు మిగిలిందని, దాంతోనే రాజధాని అయిపోతుందని చెప్పాడు. మళ్లీ ఈ రోజు అది చాలదంటున్నాడు. అధికారంలో ఉంటే ఆయనకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. నేషనల్ హైవేలు కిలోమీటర్కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? ఇలా అన్నీ స్కాములే కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ జరిగేది ఒక్కటే... ఈయన, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు. కొన్న తర్వాత ఆ పక్కన భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటారు. ఆ తర్వాత తన బినామీలకు మాత్రం ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోట ఇచ్చుకుంటాడు. మిగిలిన వాళ్లకు ప్లాట్లు వేరే చోట ఇస్తాడు. అక్కడ ఎప్పటికీ అభివృద్ధి జరగదు. అంటే మిగతా వాళ్లు గాలికి పోతారు. వేసే రోడ్లు ఏవో వీళ్ల మనుషులకు ప్లాట్లు ఇచ్చిన చోట వేసుకుంటారు’ అని చెప్పారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనపై ఉన్న అవినీతి కేసులు తీసేయించుకుంటున్నారన్న ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే.. పై నుంచి దేవుడు చూస్తుంటాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుంటారు. దేవుడు, ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి’ జగన్ అన్నారు. -
వెర్రితలలు వేస్తోన్న రెడ్బుక్ రాజ్యాంగం
తనపై ఉన్న లిక్కర్ కేసును నీరుగార్చేందుకు, కొట్టేయించేందుకు... వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన మద్యం పాలసీని తప్పుగా చూపిస్తూ లేని లిక్కర్ స్కామ్ను చంద్రబాబు సృష్టించారు. ఇక రాష్ట్రంలో కుటీర పరిశ్రమల్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టింది టీడీపీ వాళ్లే. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా? మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ అసభ్య పదజాలంతో తనను లైంగికంగా వేధిస్తున్నాడని మండలాఫీసు అటెండర్ అయిన ఒంటరి మహిళ ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లినా, వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధ్యత గల ప్రభుత్వమైతే గలీజ్ మెసేజ్లు పెట్టిన పీఏను లోపలేయాలి. –వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ కేసులతో నిర్బంధిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... గత 19 నెలలుగా వీళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, ఆముదాలవలస, నెల్లూరు, పాలకొల్లు, రేపల్లె... ఇలా అన్నిచోట్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్లు పెట్టినవే. (రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులతో కల్తీ మద్యం ఫ్యాక్టరీల నిర్వాహకులు దిగిన ఫొటోలు, సీజ్ చేసిన కల్తీ లిక్కర్ బాటిళ్ల ఫొటోలను చూపించారు) కల్తీ మద్యం మీద నచ్చిన బ్రాండ్ పేరుతో లేబుళ్లు వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ చానల్ కూడా వాళ్లదే. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుంటూ ఫొటో దిగారు. ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ ఆయన పార్టనర్ జనార్దనరావు, సురేంద్రనాయుడులు చంద్రబాబు, లోకేశ్తో ఫొటోలు దిగారు. అనకాపల్లి జిల్లా పరవాడలో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో, మంత్రి లోకేశ్తో ఇలా పలుకుబడి కలిగిన టీడీపీ నేతలతో కల్తీ లిక్కర్ మాఫియా నడుపుతున్నవాళ్లు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా?. కానీ, ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను తీసుకుపోయారు. కల్తీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్లను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వీళ్ల ప్రభుత్వంలో అన్నీ వీళ్లే చేస్తూ, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో... జోగి రమేష్ కల్తీ చేయిస్తున్నారంటున్నారు. ఇదెక్కడి అన్యాయం. దొంగే దొంగ దొంగ అంటున్నాడు. ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? జోగి రమేష్, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేస్తే... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న రమేష్ కుమారుడిపై కేసులు పెడుతున్నారు.మిథున్ను ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ఆశ్చర్యపడే పరిస్థితిమద్యం అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డితోపాటు ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని జైలుకు పంపించారు. అసలు మిథున్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో? ఆయనకు ఏం సంబంధమో? అని జడ్జి కూడా ఆశ్చర్యపడి తీర్పు రాసే పరిస్థితి. కృష్ణమోహన్రెడ్డి, ధనంజయరెడ్డి, ఎంఎన్సీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డిలను నిర్బంధించారు. రూ.11 కోట్లు దొరికినట్లుగా చూపిస్తున్నారు. ఆ నోట్లపై ఉన్న నంబర్ల ద్వారా ఏ బ్యాంకులో డ్రా చేశారో? ఎప్పుడు డ్రా చేశారో? చెప్పాలని బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. రెడ్ హ్యాండెడ్గా డబ్బు దొరికితే పక్కనపెడతారు కదా? కానీ, వీళ్లు అన్నీ కలిపేశాం అంటున్నారు. ఆ డబ్బు బయటపడితే ఇంజనీరింగ్ కాలేజీవని తెలుస్తుందని, అది తెలియకుండా లిక్కర్ అని బ్యాండ్ వేసి రూ.11 కోట్లు వీళ్లే పెట్టి కేసులు బిల్డ్ చేస్తున్నారు. వీళ్లు ఏ స్థాయికి పోతున్నారంటే... భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, వల్లభనేని వంశీ, పినిపె శ్రీకాంత్పై తప్పుడు కేసులు పెట్టారు. సాక్ష్యాలు సృష్టించి, అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపైనా గంజాయి కేసులు పెడుతున్నారు. విశాఖలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడిపై గంజాయి కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లో రాశారు. కానీ, ఇంటి దగ్గర్లోని టిఫిన్ సెంటర్కు వెళ్తుండగా, మద్దిలపాలెం వద్ద పట్టుకున్నట్లు, స్టేషన్కు తరలిస్తున్నట్లు సీసీకెమెరాలో రికార్డైంది. అతడి బైక్ను 14 కి.మీ. దూరంలో ఉన్న రైల్వే న్యూకాలనీకి తీసుకెళ్లారు. ఆ బైక్కు ఉన్న జీపీఎస్ ద్వారా ఈ విషయం తెలిసింది. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి తీసుకువెళ్లి గంజాయి దొరికిందని చెప్పి కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక బాధ్యత గల ప్రభుత్వమైతే సాలూరులో ఒంటరి మహిళకు గలీజ్ మెసేజ్లు పెట్టిన మంత్రి పీఏను లోపలేయాలి. కానీ, కేసులు పెట్టకపోగా, బాధితురాలు దిక్కుతోచక జర్నలిస్టులకు చెబితే, ఆ వార్త రాసిన ‘సాక్షి’ విలేకరి మీద కేసులు పెట్టారు. ఇది రెడ్బుక్ పాలన వెర్రితలలు వేస్తోందనడానికి నిదర్శనం.పిన్నెల్లిపై 16 తప్పుడు కేసులుమా పార్టీ మాచర్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిని తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. టీడీపీకి చెందినవారి గ్రూపుల తగాదాలలో వాళ్లూవాళ్లూ చంపుకొంటే మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసులు పెట్టారు. ఆ ఘటనపై మీడియా సాక్షిగా టీడీపీ హయాంలో... పల్నాడు జిల్లా అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు ఏమన్నారో మీరే చూడండి. (ఎస్పీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించారు) ‘గుండ్లపాడు గ్రామానికి చెందిన జె.వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య, జె.కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోతో ఢీకొట్టి చంపారు. చనిపోయినవారికి తోట చంద్రయ్య కుటుంబంతో ఎలాంటి బంధుత్వం లేదు. ఇద్దరూ టీడీపీ వారే’ అని ఎస్పీ చెప్పారు. అంతేకాదు హతులు, హంతకులు టీడీపీవారేనని ఏకంగా ట్వీట్ చేశారు. ఈనాడులో కూడా అదే రాశారు. కానీ, ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడిని అరెస్టు చేశారు. ఎక్కడన్నా న్యాయం, ధర్మం ఉందా? ఇలాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. పిన్నెల్లిపై ఈ 19 నెలల్లో 16 తప్పుడు కేసుల పెట్టారు. ఆయన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో ఉంచారు. -
సూపర్ 6 పేరిట.. 'సూపర్' మోసం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధం ఆడేస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లకు సంబంధించిన పాంప్లెట్ పేపర్లు, ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో సూపర్ సిక్స్ విజయవంతం అంటూ ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారని.. చంద్రబాబు గోబెల్స్కు టీచర్, మెంటార్ లాంటి వాడని ఎద్దేవా చేశారు.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను మోసగిస్తూ 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. అసలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల కింద ఏం చేశారో చెప్పాలని, సక్రమంగా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్ హిట్టని ఎలా ప్రచారం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘రాష్ట్రంలో రైతులు పండించిన చీని, అరటి ఎగుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. 23 వేల టన్నులు ఉన్న అరటి ఎగుమతులను 2023–24 నాటికి 3 లక్షల టన్నులకు తీసుకెళ్లాం. దళారుల బెడద లేకుండా చేశాం. రవాణా ఖర్చులను 40 శాతం మేర తగ్గించాం. ఈ 19 నెలల పాలనలో రైతుల కోసం మీరేం చేశారు? రైతుల కష్టాలు పట్టవా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. రైతుల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే నిద్రపోతున్నారా.. అని ప్రశి్నంచారు. మిమ్మల్ని సీఎం చేసింది గాడిదలు కాయడానికి కాదు కదా.. అంటూ మండిపడ్డారు.వ్యవసాయంపై 62 శాతం మంది ఆధారపడిన పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా సాగును పండుగ చేసి.. రైతులను సంతోష పెడితేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్నారు. రైతు, రైతు కూలీ సంతోషంగా లేకుంటే రాష్ట్రం ఎదగదని, వెనకడుగు వేయాల్సి వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని చంద్రబాబు దండగలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడాలని.. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఉచిత పంటల బీమాకు మంగళంఇటీవల మోంథా తుపాను వచి్చన సమయంలో ఆరీ్టజీఎస్ నుంచి చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడూ కంప్యూటర్ల ముందు కూర్చొని పెద్ద బిల్డప్ ఇచ్చారు. వీళ్లకు తోడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఎలా బిల్డప్ ఇచ్చాయంటే.. వీరు తుపాను పీకపట్టి డైవర్ట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చాయి. వీళ్లు కాబట్టే తుపానును ఆపగలిగారన్నట్టుగా ఆకాశానికి ఎత్తారు. కానీ, వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. తుపాను కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతుకూ ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. తుపాను ప్రభావం వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లితే.. దాన్ని నాలుగైదు లక్షల ఎకరాలకు కుదించారు. వీరికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. బాబు 19 నెలల పాలనలో ఇప్పటి వరకు 17 ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఆ విపత్తుల కారణంగా రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రభుత్వం నుంచి 17 విపత్తులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రూ.1,100 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని ఇవ్వనేలేదు. దీనికి తోడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఉచిత పంటల బీమా కింద రైతు తరఫున కూడా ప్రభుత్వమే ప్రీమియం కట్టి.. పంట నష్టపోయిన రైతులకు రూ.7,400 కోట్ల నుంచి రూ.7,800 కోట్ల మేర బీమా పరిహారం అందించాం. మా ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు లేకుండా చేయడంతో బీమా పరిహారం రాకుండా పోయింది. రాష్ట్రంలో ఖరీఫ్ సమయంలో 84 లక్షల మంది రైతులు, కౌలు రైతులు పంటలు సాగు చేస్తే.. కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? రోజూ చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నష్టపోయిన రైతులకు ఆ నష్టాన్ని ఎలా పూడుస్తారో ఆ ఉపన్యాసాల్లో ఎక్కడా చెప్పరు. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేది కాకుండానే అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారు. ఒకవైపు పెట్టుబడి సాయం దక్కలేదు. మరోవైపు మా ప్రభుత్వంలో సీజన్ ముగిసే సమయానికి అందే ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కనిపించకుండా పోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము రాకుండా పోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదుఇన్ని కష్టాల మధ్య రైతు సాగు చేసిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని దుస్థితి చూస్తున్నాం. పోయిన ఏడాది ధాన్యం, పొగాకు, ఉల్లి, టమాట, మామిడి, సజ్జ, చీనీ, మిర్చి.. ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర దక్కలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మోంథా తుపానులో నష్టపోయిన రైతుల నుంచి ధాన్యం కొనేవారు లేరు. 75 కేజీల బస్తాకు ఎంఎస్పీ ప్రకారం రూ.1,776 రావాలి. అయితే రూ.1,200, రూ.1,300కు ఇస్తారా? అని దళారులు రైతులను అడుగుతున్నారు. ఇంకో పక్క దిత్వా తుపాను పంట కోతల(హార్వెస్టింగ్) సమయంలో వస్తుందని 10రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళ్లాల మీదే ఉందని తెలుసు. పంట కొనకుంటే ధాన్యం తడిచి పోతుందనీ తెలుసు. రైతులు ఇప్పటికే దెబ్బతిని ఉన్నారు. ధాన్యం కొనకపోతే మరింత నష్టాల్లో కూరుకుపోతారని తెలిసి కూడా చంద్రబాబు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మా హయాంలో ఇలాంటి పరిస్థితులు వచి్చనప్పుడు ఎలాంటి స్పందన ఉండేదో ప్రజలు ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగం మొత్తం పనిచేసేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, ధాన్యం సరఫరాకు లారీలు సమకూరేవి. ధాన్యం కొనుగోలుకు వెనువెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. ధాన్యం సేకరణ, తరలింపునకు మొత్తం యంత్రాంగం అప్రమత్తం అయ్యేది. వర్షానికన్నా ముందే పంట కొనుగోలు పూర్తి చేసేవాళ్లం. ఇవన్నీ గతంలో జరిగాయి. ఈ రోజున రైతులు ఏమైపోయినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కేజీ అరటి పండ్లు అర్ధ రూపాయికొబ్బరి, అరటి, వేరుశనగ పంటలదీ ఇదే పరిస్థితి. ఏ పంటకూ రేట్లు లేవు. కేజీ అరటి అర్ధ రూపాయి అంటున్నారు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? ఇంత ఘోరంగా పాలన సాగుతోంది. అదే మా ప్రభుత్వ హయాంలో అరటి, చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేకంగా రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల, కర్నూలు నుంచి ఘజియాబాద్, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచాయి. దీంతో రైతులకు దళారుల బెడదల తప్పింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఎగుమతులు పెరిగాయి. మా ప్రభుత్వం రాక మునుపు అరటి ఎగుమతి 23 వేల టన్నులు ఉంటే 2023–24లో 3 లక్షల టన్నులకు పెరిగింది. రైతులకు అదనంగా 20 నుంచి 40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం, చంద్రబాబు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? పులివెందులలో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభించాం. కరెంట్ బిల్లుల ఖర్చు వస్తుందని దానిని మనుగడలో లేకుండా చేయడం దుర్మార్గం.డైవర్ట్ చేయడం కోసమే ‘రైతన్నా.. మీ కోసం’ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మోసంగా మారిపోయింది. ఆర్బీకేలు, ఈ–క్రాప్ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. తూతూ మంత్రంగా ఈ–క్రాప్ చేస్తున్నారు. ఒక పొలంలో రైతును నిలబెట్టి, ఎన్ని ఎకరాల్లో, ఏ పంట సాగు చేశారో ఆర్బీకేకు అనుసంధానం చేసేదే ఈ–క్రాప్. ఆ రైతుకు భవిష్యత్లో గిట్టుబాటు ధర రాకపోయినా, పంట నష్టం వాటిల్లినా ఆదుకునే వ్యవస్థ ఆర్బీకే ద్వారా ఉండేది.ఆర్బీకేల్లో పంటల వారీగా గిట్టుబాటు ధరల పట్టికలు ప్రచురించే వాళ్లం. ఎక్కడైనా గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్(క్రియాశీలకం) అయ్యేది. జాయింట్ కలెక్టర్ దృష్టికి సమస్య వెళ్లేది. ఆయన మార్క్ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ను అప్రమత్తం చేసి పంట కొనుగోలు చేసేవారు. మార్కెట్లో పోటీ సృష్టించేవారు. ఈ క్రమంలో మేం మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం దాదాపు రూ.7,457 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ‘రైతన్నా.. మీ కోసం’ అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులందరికి ధన్యవాదాలు.. అంటూ ఈనాడులో యాడ్ కూడా వేసుకున్నారు. అసలు వీళ్లు రైతుల దగ్గరకు పోయే పరిస్థితే లేదు. పోతే రైతులు తిడతారు, కొడతారు కూడా.. రైతుల దగ్గరకు పోకుండానే కార్యక్రమం విజయవంతం అయినట్టు ఆశ్చర్యకరంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రంలో మీరు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలయ్యాయా? ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకు 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడ ఇచ్చారు? ఇలా ఎన్నెన్నో 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే. అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్ఫండ్, ఫైనాన్స్ స్కీమ్స్ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ–5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా.రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. ధాన్యం, ఉల్లి, టమాటా, అరటి.. ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పాలన ‘సేవ్ ఏపీ’ అన్న తరహాలో ఉంది. హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండని అందరూ అనాల్సిన దుస్థితి కొనసాగుతోంది. – వైఎస్ జగన్➤ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.72 వేలు భృతి ఇవ్వాలి. ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతిగా రూ.72 వేలు చెల్లించారా? ఇది మోసం కాదా? చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎన్నికలకు ముందు బాండ్లు కూడా ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇవ్వనేలేదు. మరి సూపర్ సిక్స్ ఎక్కడ అమలైంది?➤ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. సంవత్సరానికి రూ.18 వేలు.. రెండేళ్లకు ఒక్కరికైనా రూ.36 వేలు ఇచ్చారా? ఇది మోసం కాదా?➤బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు, రెండేళ్లకు రూ.96 వేలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది రూ.10 వేలే. ఇది మోసం కాదా?➤అమ్మ ఒడి పథకం పేరు మార్చారు. తల్లికి వందనం అన్నారు. ప్రతి పిల్లాడికి రూ.15 వేలు అన్నారు. తీరా చూస్తే తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదికి వచ్చే సరికి 20 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. రూ.15 వేలు కాకుండా రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు ఇచ్చారు. కొందరికి మాత్రమే రూ.13 వేలు ఇచ్చారు. రెండేళ్లకు ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. ఇలా ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడం మోసం కాదా?➤దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. రెండేళ్లకు ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది రెండే. అవీ అందరికి ఇవ్వలేదు. ఇది మోసం కాదా?➤ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్నారు. ఇది మోసం కాదా? ఇన్ని 420 చేష్టలు చేస్తున్న చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాల్సిందే కదా? అసలు వాళ్ల ముగ్గురినీ లోపల వేయాలి. ఇదే మోసం చిట్ఫండ్, ఫైనాన్స్ స్కీమ్స్ నడిపే వాళ్లు చేస్తే జైల్లో పెట్టేవారు. వీళ్లు కాబట్టి ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి చూపదు.. టీవీ5 పట్టించుకోదు.. అంతా గజ దొంగల ముఠా. -
టీటీడీ లడ్డు వ్యవహారం: శ్యామల రావు వ్యాఖ్యలపై వైఎస్ జగన్
-
YS Jagan: బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది
-
తానే దొంగ.. తానే పోలీస్.. జగన్ సెటైర్లు..
-
YS Jagan: పరకామణి కేసు... తిరుమల లో బాబు స్కామ్ లు
-
PRC.. DA లేదు ఉద్యోగుల జీతాలపై .. జగన్ సంచలన కామెంట్స్
-
వీర లెవల్లో డైలాగులు పీకాడు... బాబు బండారం బయటపెట్టిన జగన్
-
YS Jagan: వెర్రితలల.. రెడ్ బుక్ రాజ్యాంగం
-
YS Jagan: జోగిని లోపలేశారు.. జోగి కొడుకుని టార్గెట్ చేశారు
-
దొంగ, పోలీస్.. రెండూ చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘిస్తున్నారని.. ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు.. తానే దొంగ, తానే పోలీసు. తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారు. ఇది బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘించడం కదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘చంద్రబాబు ఇవాళ బెయిల్ మీద ఉన్నారు. అమరావతిలో బాబు, ఆయన బినామీలు అవినీతికి పాల్పడ్డారు. బ్లాక్లిస్ట్లో ఉన్న తన అనుచరుడికి ఫైబర్నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారు. రూ.వందల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు గత పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ బ్యాంకులో రూ.1300 కోట్లు డిపాజిట్ చేశారు. మేం వచ్చాక రూ. 1300 కోట్లను వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకున్న కొన్ని రోజులకే ఎస్ బ్యాంక్ దివాలా తీసింది. 1300 కోట్లు వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘స్కిల్ స్కామ్లో రూ.370 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారు. స్వయంగా బాబు సంతకాలు చేసిన పత్రాలు ఉన్నాయి. అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉంది. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తున్నారు. ఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి ఫైబర్ నెట్ కట్టాబెట్టారు. వందల కోట్లు దోచిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబు సంతకం చేశారు. బాబు అండ్కో గోబెల్స్ను మించిపోయారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
మంత్రి సంధ్య రాణి PA వేధింపులు.. వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
సింహాచలం చోరీ కేసు.. అశోక గజపతి మాటేంటి?
తాడేపల్లి, సాక్షి: దేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?. తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్తోనే రావాలి. సర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్ల్లోనూ పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారు..అలా మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం. పకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది..అలాంటప్పుడు టీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?. ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? మరి తక్కువ ధరకు కొన్నారు కాబట్టి కల్తీ నెయ్యే అనుకోవాలా?.లడ్డూ ప్రసాదంలో దుష్ప్రచారాలు ఆపాలని.. నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిందే వైవీ సుబ్బారెడ్డి. ఆయన అపర భక్తుడు. నిత్యం గోపూజలు చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసి గురుస్వామి అయ్యారు. అలాంటి వ్యక్తిని ఈ కేసుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పన్న సుబ్బారెడ్డి పీఏ అంటూ ప్రచారం చేశారు. ఆయన అప్పన్న అసలు ఎవరు?. ఏపీ భవన్ ఉద్యోగి. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పీఏ. అధికార పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఎల్లో మీడియా ఎందుకు వైవీ సుబ్బారెడ్డి పీఏగా బోగస్ ప్రచారం చేస్తున్నాయి?. చంద్రబాబు లడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో ఏర్పాటు చేసిన అధికారులంతా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే. టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా కీలకంగా ఉన్నవాళ్లే.పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. అంతా పద్దతి ప్రకారమే జరిగింది. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. దొంగను పట్టుకోవడం నేరమా?.. ఒక బీసీ పోలీస్ అధికారిని వెంటాడి.. వేధించి.. చనిపోయేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు.. అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన రమణ, సురేష్ అనే ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారు. వీళ్లిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. అలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు?. విచారణ జరిపి పరకామణి కేసులా ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి. మరి ఆయన్ని విచారించారా?. వైవీ సుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా?.. అని ప్రశ్నించారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని టీటీడీలో రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు. ఇది ధర్మమేనా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
రెడ్బుక్ వెర్రితలలు వేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు నుంచి బయటపడేందుకే లేని కుంభకోణం ఒకటి సృష్టించారని.. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపడ్డారు. రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందన్నారు. ‘‘కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీపీ వాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ దందా బయటపడింది. జయచంద్రారెడ్డికి బాబు స్వయంగా బీఫామ్ ఇచ్చారు. అనకాపల్లి, పరవాడలో కూడా కల్తీ మద్యం కేంద్రాలు నడిపారు. ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ కల్తీ మద్యం దందా చేస్తున్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం దందా నడుపుతున్నారు. లిక్కర్, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్లన్నీ టీడీపీ వారివే. మ్యానుఫాక్యరింగ్, డిస్ట్రిబ్యూషన్ అంతా టీడీపీ వాళ్లే. టీడీపీ నేతలకు పోలీసులు సహాయం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘జోగి రమేష్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు. పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లే హత్యలు చేసుకుంటే పిన్నెల్లిని ఇరికించారు. టీడీపీ గ్రూప్ తగాదాల వల్లే హత్యలని ఎస్పీ చెప్పారు. టీడీపీ గొడవల వల్లే హత్యలని ఎస్పీ ట్వీట్ చేశారు‘‘మా పార్టీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. కొండారెడ్డిపై గంజాయి అక్రమ కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో గంజాయి పట్టుకున్నామని ఎఫ్ఆర్ఐ రాశారు. నిజానికి కొండారెడ్డి టిఫిన్ చేస్తుండగా పట్టుకెళ్లారు. బైక్కు జీపీఎస్ ట్రాక్ ఉంది కాబట్టి.. పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు ఇలా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? రెడ్ బుక్ను పోలీసులు ఫాలో అయితే ఎలా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధించారు. మిథున్రెడ్డి బెయిల్ సమయంలో జడ్జి సైతం ఎందుకు అరెస్ట చేశారని ఆశ్చర్యపోయారు. మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారు. కాకాణి, వంశీ పోసాని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టులను.. చివరకు ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులనూ వేధించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్పై ఇప్పటివరకు కేసు లేదు. బాధిత మహిళ ఆధారాలు చూపించినా విచారణ లేదు. వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసుల్లో చలనం లేదు. వార్త రాసిన సాక్షి విలేకరిపై కేసు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. -
ఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం..
-
ఇంత మందిని బలి చేశావ్.. ఈ పాపం నీదే..
-
స్టీల్ప్లాంట్పై బాబు అప్పుడో మాట.. ఇప్పుడో మాట: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: స్టీల్ప్లాంట్పై చంద్రబాబు ఎన్నికల ముందు ఏమన్నారు?.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్ నిలదీశారు. విశాఖలో ఉక్కుకు గనులు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని.. మా హయాంలో స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేశాం’’ అని వైఎస్ జగన్ వివరించారు. ఉక్కు కార్మికులపై పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తాడట..!’’ అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘ఎస్ఏఐఎల్కు సొంత గనులున్నాయి. ఆర్ఐఎన్ఎల్కు సొంత గనులు లేవు. ఎస్ఏఐఎల్, ఆర్ఐఎన్ఎల్కు తేడా ఇదే. విశాఖ స్టీల్కు సొంత గనులు లేకే నష్టాలు. మిట్టల్కు సొంత గనులు ఇవ్వాలని బాబు అంటాడు. కానీ విశాఖ స్టీల్కు మాత్రం సొంత గనులు అడగరు. ప్రైవేట్కు గనులు అడుగుతారు కానీ.. ప్రభుత్వ ప్లాంట్ను పట్టించుకోరు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
YS Jagan: ఈ నెల 16వ తేదీన గవర్నర్ ను కలుస్తా.. చంద్రబాబు సంగతి తెలుస్తా..
-
చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రశ్నల వర్షంతో విరుచుకుపడ్డ జగన్
-
బాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీసీఎస్వోతో మేం ఒకటినే జీతాలు ఇచ్చేలా చేశామని.. చంద్రబాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఏపీసీవోఎస్లో రెండు, మూడు నెలలకు కూడా జీతాలు లేవు. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు. ఒక డీఏ కూడా వాయిదాల్లో ఇస్తారంట. రిటైర్డ్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వమే. ఎన్నికల్లో ఇచ్చిన పీఆర్సీ హామీ ఇప్పటికీ లేదు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘పీఆర్సీ ఛైర్మన్ కూడా లేడు. జీతాలు పెరగొద్దని పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.31 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
YS Jagan: గాడిదలు కాయడానికా నిన్ను సీఎంని చేసింది
-
కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారని ఆయన నిప్పులు చెరిగారు. వందలాది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని.. కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని వైఎస్ జగన్ దుయ్యబటారు.‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. నాడు-నేడును పూర్తిగా ఆపేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 7100 కోట్లు. నేటి తరం ఆస్తి చదువు. పిల్లలను చదివించడానికి బాబు ముందుకు రావడం లేదు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
గోబెల్స్కు గురువు మన చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ ఇచ్చేశామంటూ నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది గాడిదలను కాయడానికా? అంటూ మండిపడ్డారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతిమాట అబద్ధమన్న వైఎస్ జగన్.. ఉచిత బస్సు ప్రయాణం కొంతమందికే, కొన్ని బస్సులు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలి. గోబెల్స్కు చంద్రబాబే టీచర్’’ అంటూ వైఎస్ జగన్ చురకలు అంటించారు. ‘‘నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏమైంది?. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇవ్వాలి ఏమైంది?. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. చంద్రబాబు ఈ-క్రాప్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
సేవ్ ఆంధ్రా అన్నట్టు కూటమి పరిపాలన
-
సేవ్ ఆంధ్రా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు వాస్తవాలు తెలియాలని.. రైతులు పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి.. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు.‘‘పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారింది. మొంథా తుపాను ఇంకా కళ్లముందే కదలాడుతోంది. మొంథా తుపానుపై ఎంత బిల్డప్ ఇచ్చారో చూశాం. మొంథా తుపాన్ పీకను పట్టుకుని విసిరేసిట్లు బిల్డప్ఇచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. మా హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కుగా లభించింది. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇన్ఫుట్ సబ్సీడీల మాటే ఎత్తరు. ఈ 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘బాబు పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. రూ.1100 కోట్ల ఇన్ఫుట్ సబ్సీడీ బకాయిలు ఉన్నాయి. మా హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమా ఇచ్చాం. మా హయాంలో ఉచిత పంటల బీమా కింద రూ.7800 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమాకు బాబు ఉరేశారు. బాబు పాలనలో కౌలు ైతుల పరిస్థతి దయనీయంగా ఉంది. ..ఇన్ఫుట్ సబ్సీడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో బాబు చెప్పరు. ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పరు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాలి.. బాబు ఇచ్చింది 10 వేలే. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాబు పాలనలో రైతులను దళారులు దోచుకుంటున్నారు. అయినా చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నారు.’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
Watch Live: YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్ను అడ్డంగా దోచుకుంటున్నారని.. పైగా గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉందికానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తూనే ఉన్నారుప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఫైబర్ను కట్టుబెట్టి వందల కోట్లు దోచిపెట్టారుకేబినెట్ ఆమోదం లేకుండా ప్రివలేజ్ ఫీజులు రద్దు చేశారుప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబే సంతకం చేశారుచంద్రబాబుకు దేవుడు.. ప్రజలే బుద్ధి చెబుతారుచంద్రబాబు బరితెగింపు2014-19 మధ్య చంద్రబాబు స్కామ్లుఆషామాషీ స్కాములు కావవి!స్కిల్ స్కామ్ కేసును కేంద్రం కూడా గుర్తించిందిస్కిల్ స్కామ్లో 370 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారుచంద్రబాబు, బినామీలతో అమరావతి భూకుంభకోణంఇసుక స్కామ్తో వందల కోట్లు దోచిపెట్టారువివిధ కేసులలో బెయిల్ మీద ఉన్న చంద్రబాబుచంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారుల్ని బెదిరించారుఅబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారుబెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ బరితెగింపుబెదిరించి తనపై ఉన్న కేసుల్ని మూసేయించుకుంటున్నారుఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్లు చేస్తున్నారుబాబు అండ్కో గోబెల్స్ను మించి పోయారువీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఆగదు అశోక్ గజపతిని ఎందుకు విచారణ జరపలేదు?చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీసెప్టెంబర్ 1 ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారురమణ, సురేష్.. ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారుఅలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదువిచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎంఉదకు చసుకోలేదుసింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిఅశోక్ గజపతిని ఎందుకు విచారించలేదుసుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా? పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. టీటీడీలో పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు.పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు. ఇది ధర్మమేనా? వాళ్లంతా టీడీపీ మనుషులే.. లడ్డూ ప్రసాదంలో వాస్తవాల కోసం వైవీ సుబ్బారెడ్డి కేసు వేశారు నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పీఏ కాదుటీడీపీ ఎంపీ వేమారెడ్డి అనుచరుడు.. ఏపీ భవన్ ఉద్యోగిలడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో అంతా టీడీపీ వాళ్లే ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా భాగమే దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారుదేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారునెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారుఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్తోనే రావాలిసర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్ల్లోనూ పరీక్షలో నెగ్గాలి ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారుమా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాంపకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?బాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారుమళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొందిటీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? తారాస్థాయికి చంద్రబాబు కక్షా రాజకీయాలుఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. అరెస్టులుచెవిరెడ్డిని జైలుకు పంపారుమిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు మిథున్రెడ్డి బెయిల్ టైంలో ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ప్రశ్నించారుకాకాణి, శ్రీకాంత్, వంశీ.. వాళ్లను అరెస్ట్ చేశారుపోసాని లాంటి సామాన్యుడ్ని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టును, చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించారుమంత్రి సంద్యారాణి పీఏ వ్యవహారంలో ఆధారాలున్నా చర్యలు లేవువాట్సాప్ మెసేజ్లు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసుల్లో చలనం లేదుఆధారాలు చూపించినా ఇప్పటిదాకా కేసు పెట్టలేదుపైగా వార్త రాసిన సాక్షి, సాక్షి విలేఖరిపై కేసులు పెట్టి నోటీసులు పంపించారు పిన్నెల్లి సోదరులపై తప్పుడు కేసులు పెట్టారురిగ్గింగ్ అడ్డుకున్నందుకే పిన్నెల్లిని జైల్లో పెట్టారుటీడీపీ ఆధిపత్య పోరు ఘటనను.. రాజకీయ ప్రతీకారానికి వాడుకుంటున్నారుటీడీపీ వాళ్లు హత్య చేసుకుంటే.. పిన్నెల్లిని ఇరికించారుచంపింది.. చంపబడ్డవాళ్లు.. టీడీపీ వాళ్లేనని పోలీసులే స్వయంగా చెప్పారుటీడీపీ గొడవల వల్లేనని ఎస్పీ స్వయంగా ట్వీట్ చేశారు చంద్రబాబు పాలనలో పిన్నెల్లిపై పెట్టిన కేసులు 16విశాఖలో వైఎస్సార్సీపీ విద్యార్థి నాయకుడు కొండా రెడ్డిని దొంగ కేసులో అరెస్ట్ చేశారుకొండా రెడ్డిపై గంజాయి కేసు పెట్టారుఆశ్చర్యం ఏంటంటే.. అరెస్ట్ చేసింది ఓ చోట.. నేరం జరిగిందని చెప్పింది మరో చోటఇలాంటి రాజకీయాలతో వ్యవస్థలు బతుకుతాయా?అన్యాయంగా వైఎస్సార్సీపీ వాళ్లను జైలుకు పంపారులిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబుఅప్పుడు ఏదైతే స్కామ్ చేశారో.. ఇప్పుడు సీఎంగా అదే పని చేస్తున్నారుఅలాంటి వ్యక్తి తన కేసుల్ని నీరుగార్చేందుకు.. మధ్యలో ఉన్న మా ప్రభుత్వ పాలసీని తప్పుగా ప్రచారం చేస్తున్నారులేని కేసుతో .. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అరెస్టులు చేశారుమా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారుమిథున్రెడ్డి బెయిల్ సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు?అని జడ్జే ప్రశ్నించారు రెడ్బుక్ వెర్రితలలు వేస్తోందిరాష్ట్రమంతా కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీడీవాళ్లేమంత్రులు, ఎమ్మెల్యేల మనుషులతోనే ఆ దందా నడిచిందికుటీర పరిశ్రమ లాగా.. రాష్ట్రంలో ప్రతీ మూలా నడిపించారు మా పార్టీకి చెందిన జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారుజోగి రమేష్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుజోగి రమేష్ కొడుకును కూడా ఇబ్బంది పెడుతున్నారువాళ్ల పార్టీకి చెందిన నిందితులనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు వీళ్లదే ప్రభుత్వం.. వీళ్లదే స్కామ్కల్తీ మద్యం కేసుల్లో.. తయారు చేసింది, పంచింది.. దోచుకుంది.. అంతా వాళ్లేరెడ్బుక్ పాలనలో కల్తీ మద్యం తయారు చేసే దమ్ము వేరే పార్టీ వాళ్లకు ఉంటుందా? నమ్మేలా ఉందా ఇది?తప్పుడు ఆధారాలతో.. సాక్ష్యాలతో.. వైఎస్సార్సీపీ వాళ్లను జైల్లో పెడుతున్నారు ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారుపీఆర్సీ లేదు.. ఐఆర్ లేదుచంద్రబాబు రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు ఏపీసీవోఎస్తో వైఎస్సార్సీపీ హయాంలో ఒకటో తేదీనే జీతాలిచ్చాంబాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారురెండు , మూడు నెలలకు కూడా ఏవీసీవోఎస్లో జీతాల్లేవుఉద్యమాల్ని ఖాతరు చేయకుండా స్కామ్లు చేస్తున్నారుజీతాలు పెరగొద్దని పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించలేదుఐదు డీఎలు పెండింగ్లో ఉన్నాయి.. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు.. మిగతావి వాయిదాల్లో ఇస్తారట!రిటైర్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వం మాత్రమేవిశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే ఈ నష్టాలుమిట్టల్ అనే ప్రైవేట్ వ్యక్తి కోసం చంద్రబాబు సొంత గనులు ఇవ్వాలని అడుగుతారుకానీ, విశాఖ స్టీల్కు మాత్రం అడగరు.. ప్రభుత్వ ప్లాంట్ను పట్టించుకోరుఅందుకే గనులు ఇవ్వాలని మేం అసెంబ్లీలో తీర్మానం చేశాంప్రైవేటీకరణ కాకుండా ఆపేశాంస్టీల్ ప్లాంట్ విషయంలో మాములు దగా చేయలేదుఎన్నికల ముందు.. నాడు.. కాపాడుకుంటా.. కలిసి పోరాడతాం అని చెప్పారుఇప్పుడేమో.. ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా?.. తమాషాలొద్దంటూ సీరియస్పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉద్యోగులను లోపల వేస్తారట!దటీజ్ చంద్రబాబు ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో కోర్టుకెళ్తాంగవర్నర్ను కలుస్తాం.. కోర్టులో పిటిషన్ వేస్తాంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సూపర్ స్కామ్లాభం ప్రైవేట్వాళ్లకు.. భారం ప్రభుత్వం, ప్రజలకా?ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమంకోటి సంతకాలతో 16న గవర్నర్ను కలుస్తాం ఆ పత్రాలతోనే కోర్టులో పిటిషన్ సైతం వేస్తాం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి.. ఖూనీ చేశారు నెలకు రూ.300 కోట్లు అవుతుందిఅలా ఏడాదికి అయ్యే ఖర్చు రూ.3600 కోట్లుకానీ, ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు హతం చేస్తున్నారుబకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సర్వీసులను ఆపేశాయి104, 108లు స్కామ్గా మారిపోయాయిపేదలకు వైద్య సాయం అందేదెలా?సంజీవని పేరుతో డ్రామాకు తెర తీశారుఇంకోవైపు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్గా నడుస్తోందికొత్త కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఒక స్కామ్ అయితే.. ప్రైవేటీకరణ తర్వాత పని చేసే సిబ్బందికి ప్రభుత్వ జీతాలట!ఇది మరో పెద్ద స్కామ్.. బాబు ఇచ్చిన బొనాంజా భూమి, బిల్డింగ్, స్టాఫ్.. జీతాలు అన్నీ ప్రభుత్వానివే.. కానీ, ఓనర్లు ప్రైవేట్వాళ్లుభారం ప్రజలమీదకు.. లాభాలు ప్రైవేట్ వాళ్లకా?? నేటి తరం ఆస్తి చదువుపిల్లల్ని చదివించేందుకు చంద్రబాబు ముందుకు రావడం లేదుస్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయినాడు-నేడును పూర్తిగా ఆపేశారుఇంగ్లీష్ మీడియాన్ని ఆపేశారుఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు కోట్లలో పెరిగిపోయాయితల్లికి వందనం పేరిట మోసానికి పాల్పడ్డారువైఎస్సార్సీపీలో జరిగిన మంచిని చంద్రబాబు నిలిపివేశారుకలుషిత ఆహారం.. నీరు.. సరైన వసతులు లేక పిల్లల ప్రాణాలు పోతున్నాయిఅనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారువందలాది మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారుచిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారుచంద్రబాబు పాలనలో.. ఇది ఎవరూ జీర్ణించుకోలేని విషయాలు గోబెల్స్కే మెంటార్ మన చంద్రబాబుసూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అన్నీ మోసాలేపెన్షన్లు.. సిలిండర్లు.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదుఅయినా కూడా హామీలన్నీ నెరవేర్చామని ప్రచారంహిట్లర్ కాలంలోని జోసెఫ్ గోబెల్స్ ప్రపంచానికి తెలుసు అబద్ధపు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారం అంటుంటాంఅందుకే చంద్రబాబు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారాలు అని పేరుకానీ, ఆ గోబెల్సే చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవాలిఇలాంటివి చేస్తున్న చంద్రబాబు మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేయాలిగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఎలా ఉండేది?ఆర్బీకేలు అద్భుతంగా పని చేసేవిరైతులకు గిట్టుబాటు ధర కోసం ఆరాట పడ్డాంబాబు పాలనలో రైతులను దళారులను మోసం చేస్తున్నారుచంద్రబాబేమో చోద్యం చూస్తున్నారుఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం.. టాపిక్ డైవర్ట్ కోసం రైతన్నా మీ కోసం అంటూ డ్రామాలుజీవితంలో రైతుల కోసం ఏం చేయని చంద్రబాబు.. బోగస్ ప్రచారాలకు దిగారుఘోరాతి ఘోరంగా ఉంది చంద్రబాబు పాలనదిత్వా తుపాను గురించి ముందస్తు సమాచారం ఉందిపంట కోతలకు సిద్ధంగా ఉందనీ తెలుసుఅయినా చంద్రబాబు ప్రభుత్వం నష్టాన్ని నివారించలేకపోయిందిమా హయాంలో ఇలాంటి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉండేది?వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. తక్షణ చర్యల ఉండేవిరైతులు ఎలా పోయినా ఫర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారుకేజీ అరటికి రూ.50 పైసలా?వరి, కొబ్బరి, పత్తి.. ప్రతి పంట పరిస్థితి ఇదే..రైతులు ఎలా బతికేది?.. ఇంత ఘోరంగా పాలన సాగుతోందిచంద్రబాబు అనే వ్యక్తి అసలేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?.. సీఎంగా ఉండి ఎందుకు?.. రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మోసాలేరెండేళ్లలో రూ.40 వేల పంట సాయం ఇవ్వాలి.. కానీ, రూ.10 వేలే ఇచ్చారు 18 నెలల బాబు పాలనలో 17 ప్రకృతి విపత్తులుకూటమి పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నంరూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వైఎస్సార్సీపీ హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమావైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,000 కోట్ల ఉచిత పంటల బీమాచంద్రబాబు పాలనలో ఉచిత పంటల బీమా పేరిట మోసం84 లక్షల మంది రైతులు ఉంటే.. 19 లక్షల మందికే ఇన్సూరెన్స్ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదుఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడిస్తారో తెలియదుదయనీయంగా ఏపీ కౌలు రైతుల పరిస్థితిమరి గతంలో ఎలా ఉండేది?.. వైఎస్సార్సీపీ హయాంలో పండుగలా వ్యవసాయం62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారుచంద్రబాబు హయాంలో దండుగగా మారిన వ్యవసాయంమోంథా తుపానును పీకపట్టి చంద్రబాబు, లోకేష్, పవన్లే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారుతుపాను తర్వాత కూడా రైతులకు న్యాయం చేయలేదునష్టపోయిన రైతులకు పైసా సాయం అందించలేదుపైగా పంట నష్టాన్ని దారుణంగా తగ్గించారు సేవ్ ఆంధ్రప్రదేశ్లా.. పాలనరాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉందినాణేనికి రెండో వైపు ఎలా ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందిరాష్ట్రంలో సేవ్ ఆంధ్రా పాలన జరుగుతున్నదిరాష్ట్రం మొత్తం దేశం వైపు చూడాలిరైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందిరైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎదగదు -
YS Jagan: భారత నౌకాదళ సిబ్బందికి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఇండియన్ నేవీ డే సందర్భంగా.. దేశ నౌకాదళ సిబ్బందికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మన సముద్ర తీరాలను కాపాడటంలో నౌకాదళ సిబ్బంది పాత్ర అసమానమైనది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు.. సముద్రాలపై వారు చూపుతున్న ధైర్యం, దృఢ సంకల్పానికి అభినందనలు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి ప్రతీ ఏటా డిసెంబర్ 4వ తేదీని నేవీ డేగా జరుపుతారు. తీర ప్రాంతాల్లో నేవీ ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తారు.Warmest wishes to the Navy personnel on Indian Navy Day. Their role in protecting our shores is unparalleled. Hats off to our Navy personnel for their courage and determination on the high seas as they pursue the Nation’s interests.#IndianNavyDay— YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2025మరి ఈ తేదీనే ఎందుకంటే.. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో డిసెంబరు 4న భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసి మూడు ఓడలను ముంచేసింది. ఆపరేషన్ ట్రైడెంట్గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. అందుకే.. ఆ తేదీ జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నేవీ డే నిర్వహిస్తుంటారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.పార్టీ ప్రధాన కార్యదర్శిగా (ఎన్నారై ఎఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, జీసీసీ గల్ఫ్ కమిటీ కన్వీనర్ గా బద్వేల్ హజీ ఇలియాస్, కో- కన్వీనర్లుగా గోవిందు నాగరాజు (కువైట్), దొండపాటి శశి కిరణ్ (ఖతర్), మహమ్మద్ జిలాని భాష (దుబాయ్) నియమితులయ్యారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం, డిసెంబర్ 4వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. -
దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా YS జగన్ శుభాకాంక్షలు
-
ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదు. పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తూ.. ప్రతి రంగంలోనూ నూతన శిఖరాలను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదు. పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తూ, ప్రతి రంగంలోనూ నూతన శిఖరాలను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 3, 2025 -
విశాఖలో అదానీ డేటా సెంటర్ బాబుకి చెంప చెల్లుమనేలా జీవోతో క్లారిటీ
-
అవును.. అది అదానీ డేటా సెంటరే..!
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదు. హైదరాబాద్లో హైటెక్ సిటీతో మొదలు.. ప్రతీదాంట్లోనూ సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తుంటారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలోనూ అలాంటి పనే చేయబోయి.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు.విశాఖలో గూగుల్ నెలకొల్పబోయే డేటా సెంటర్.. ఆదానీ డేటా సెంటరే. గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందమే ఇది!. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు.. ఎట్టకేలకు ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకుంది. తాజాగా డాటా సెంటర్ కోసం భూకేటాయింపులు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అందులో.. అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్స్ ఇండియా, అదానీ పవర్లకు భూ కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించింది. అడవివరంలో 120 ఎకరాలు, తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లిలో 160 ఎకరాలు.. మొత్తం 480 ఎకరాలు ఆదానీ సంస్థలకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో మెన్షన్ చేసింది. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్టనర్లుగా అదానీ, భారతి ఎయిర్ ఎయిర్ టెల్ లకు భూ కేటాయింపు ఉత్తర్వులతో పాటు అన్ని రాయితీలు కల్పించాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జీవో కోసం 👉 ఇక్కడ క్లిక్ చేయండిదాదాపు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి ఉన్న డాటా సెంటర్ విషయంలో యాజమాన్యం పేరు ఉసెత్తకుండా ఇంతకాలం చంద్రబాబు, నారా లోకేష్ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకు కారణం.. ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు జీవోతో ఆ బండారం బయటపడింది. వైఎస్ జగన్ చెబుతోంది ఏంటంటే.. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ = అదానీ గ్రూప్ పెట్టుబడి + గూగుల్ క్లయింట్. అంటే ఈ డేటా సెంటర్లో గూగుల్ కేవలం క్లయింట్ మాత్రమే, కానీ అసలు నిర్మాణం, పెట్టుబడి అదానీ గ్రూప్దే. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనేది నిజానికి అదానీ గ్రూప్తో కలిసి వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలోనే కుదిరింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దానిని కొత్తగా తన ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్ట్లా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. -
నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది!
తిరుపతి రూరల్: ‘నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది మోహిత్.. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు ఎంతో కాలం నిలబడవు.. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొందాం.. మంచి రోజులు వస్తాయ్.. మీకు అండగా నేనున్నాను.. ఎవరు అధైర్యపడవద్దు..’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి తాడేపల్లిలో వైఎస్ జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ సీఎం జగన్ మోహిత్ను ఆప్యాయంగా పలుకరించి మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై జాగ్రత్తలు సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను కలవాలని మోహిత్కు ధైర్యం చెప్పారు. -
Farmers: ఇది చాలదా ఈ ప్రభుత్వం గురించి చెప్పడానికి
-
Gannavaram Airport: ఓ చిన్నారిపై అంతులేని ప్రేమ చూపించిన వైఎస్ జగన్
-
సంచలనం రేపుతోన్న వైఎస్ జగన్ ట్వీట్
-
చిట్టితల్లిపై వైఎస్ జగన్ ప్రేమ.. నెట్టింట వైరల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. తాజాగా గన్నవరం ఎయిర్పోర్టులో ఓ చిన్నారి పట్ల ఆయన చూపించిన ప్రేమ నెట్టింటకు చేరింది. గన్నవరం ఎయిర్పోర్టులో జగన్ను చూసేందకు ఓ వ్యక్తి తన కూతురితో కలిసి వచ్చారు. ఆ బాలిక చెప్పు కాలి నుంచి జారిపోయింది. అది గమనించిన వైఎస్ జగన్ ఆమె చెప్పును అందించి.. ఆ చిన్నారిని ఆప్యాయంగా స్పృశించారు. తద్వారా పిల్లల పట్ల తనకు ఉండే ఆప్యాయతను మరోసారి ప్రదర్శించారు. అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో ఆ క్షణాలను బంధించగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది. Man of Simplicity – YS Jagan ✨🙏💙 pic.twitter.com/KqxTnqpEvP— Johny Kaki (@johny_kaki) December 2, 2025 -
ఉన్నమాటతో ఉలికిపడుతున్న చంద్రబాబు!
సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఏపీలో రైతుల దుస్థితి తెలుపుతూనే.. సేవ్ ఏపీ ఫార్మర్స్ (#SaveAPFarmers) పేరుతో సదీర్ఘమైన పోస్ట్ ఒకటి ఉంచారాయన. ఈ ఉదయం మరోసారి ఆ ట్వీట్ సారాంశాన్ని తెలుగులో ప్రస్తావిస్తూ రీట్వీట్ చేశారు.కిలో అరటిపండ్లను రైతుల నుండి కొంటున్నది కేవలం 50 పైసలకే!. ఒక అగ్గిపెట్టె, ఒక బిస్కెట్ కంటే కూడా అరటిపండ్లు చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. నెలల తరబడి కష్టపడి వ్యవసాయం చేస్తే.. చివరికి రైతులకు దక్కే ప్రతిఫలం ఇదేనా? అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొంటూ ఏపీ అన్నదాతలు అవస్థలను దేశం దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి!ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే!అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు… https://t.co/6HVqS4Wk1N— YS Jagan Mohan Reddy (@ysjagan) December 2, 2025జగన్ ట్వీట్తో చంద్రబాబు ప్రభుత్వం భుజాలు తడుముకుంటోంది. సాధారణంగా జగన్ ప్రెస్మీట్ పెట్టినా.. ఏదైనా ట్వీట్ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అబద్ధపు ప్రకటనలు చేయడం టీడీపీ అండ్ కోకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు సరైనవి కావడం, పైగా కళ్ల ముందు ప్రత్యక్షంగా పరిస్థితులు కనిపిస్తుండడంతో ఖండించలేని స్థితిలో ఉండిపోయింది. మరోవైపు.. అవి వాస్తవాలు కావడంతో ఎలా కవరింగ్ చేసుకోవాలో అర్థంకాక ఇటు ఎల్లో మీడియా అవస్థలు పడుతోంది. 📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025 -
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
-
హామీలు ఎగ్గొట్టి.. పెన్షన్లు పోగొట్టి!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో ఎన్నికల నాటికి అత్యధికంగా ఇచ్చిన పింఛన్లు 66.34 లక్షలు..! చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 1వతేదీ రాత్రి సమయానికి పంపిణీ చేసిన పెన్షన్లు 59.11 లక్షలు! పోనీ గత నెలలో చూసినా.. నవంబర్ 1న బాబు సర్కారు పంచిన పెన్షన్లు 61.64 లక్షలే!! అంటే.. గత 18 నెలల వ్యవధిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల పింఛన్లు ఎగిరిపోయాయ్! రాష్ట్రంలో దాదాపుగా తొలిరోజే పింఛన్లు తీసుకునే లబ్ధిదారులే అత్యధికంగా ఉంటారు. దీన్నిబట్టి ఎలా చూసినా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే చంద్రబాబు సర్కారు వచ్చాక దాదాపు ఐదు లక్షల పింఛన్లు తగ్గినట్లు తెలిసిపోతోంది. మరి ఇది సుపరిపాలనా? ప్రజలకు మంచి చేసినట్లా? సూపర్ సిక్స్లు అమలు చేసినట్లా? కొత్త పెన్షన్లు ఇచ్చినట్లా? టీడీపీ కూటమి ప్రభుత్వం అవ్వాతాతలతోపాటు దివ్యాంగులనూ కనికరించడం లేదు. రీ వెరిఫికేషన్ పేరుతో నోటీసులిచ్చి దాదాపు లక్ష మంది దివ్యాంగులపై కత్తి వేలాడదీసింది! ఇలా ఒకవైపు పెన్షన్లు ఎగరగొడుతూ.. మరోవైపు ఈ నెలలో 8,190 మందికి కొత్త పింఛన్లు ఇచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక పింఛన్ల పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం స్వీయ ప్రచార వేదికగా, పార్టీ కార్యక్రమంలా మార్చేసింది. గత ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటివద్దే గుడ్మార్నింగ్ చెప్పి మరీ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఠంచన్గా పెన్షన్లు పంపిణీ సాగగా... ఇప్పుడు చంద్రబాబు సర్కారు అవ్వాతాతలను, దివ్యాంగులను, వితంతువులను రోడ్డుకీడ్చి పడిగాపులు కాసేలా చేసింది. ఉదయం పూట ఇవ్వాల్సిన పింఛన్లు కాస్తా సోమవారం తిరుపతిలోని జీవకోనలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో మధ్యాహ్నం 12:30 గంటలకు వానలో గుంపులుగా నిల్చోబెట్టి అరకొరగా అందజేశారు. దరఖాస్తులకే దిక్కులేదు.. పంపిణీ పేరుతో పబ్లిసిటీ!రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కొత్తగా 60 ఏళ్లు నిండినవారు, వితంతువులకు అర్హత ఉన్నా గత 18 నెలలుగా పింఛనుకు దరఖాస్తు కూడా చేసుకునే అవకాశం లేకుండా చేసింది. కనీసం ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తేలేదు. ఒకవైపు దరఖాస్తులను తొక్కిపెడుతూ మరోవైపు పంపిణీ పేరుతో పార్టీ ప్రచార కార్యక్రమాలను రక్తి కట్టిస్తోంది. గ్రామాల్లో టీడీపీ నేతలంతా సచివాలయాల ఉద్యోగులతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొని ఫోటోలు దిగి ప్రచారం చేయాలని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ కావడం గమనార్హం. దీనికి అనుగుణంగా టీడీపీ ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. పాత పింఛనుదారులకే ఇప్పుడే కొత్తగా ఇచ్చినట్లు ప్రచారం చేశారు. పెండింగ్లో 2.5 లక్షల దరఖాస్తులు.. దాదాపు రెండున్నర లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఏడాదిన్నరకుపైగా పెండింగ్లో పెట్టింది. మరోవైపు అర్హత ఉన్నప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేక పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు సుమారు మరో 3 లక్షలమందికిపైగా ఉంటారని అంచనా.50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.నాలుగు వేల చొప్పున పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఒకపక్క ఉన్న పింఛన్లనే ఎగరగొడుతూ.. దరఖాస్తులను తొక్కిపెడుతూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు 50 ఏళ్లకే పెన్షన్ హామీని గాలికి వదిలేసింది.ఐదేళ్లలో 29.51 లక్షల కొత్త పెన్షన్లువైఎస్సార్ సీపీ హయాంలో వృద్ధాప్య పింఛను అర్హత వయసును 60 ఏళ్లకు తగ్గించడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరింది. అర్హులు ఏడాదిలో ఏ రోజైనా సరే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. చివరిగా 2024లో జనవరి ఆరంభంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏకంగా 29.51 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) స్వయంగా ప్రకటించడం గమనార్హం.ఇంటి పన్ను చెల్లిస్తేనే పింఛన్ప్రత్తిపాడు రూరల్: ఇంటి పన్నుకు, పింఛన్లకు చంద్రబాబు సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో సోమవారం 11,463 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 10,500 మందికే పంపిణీ చేశారు. మండలంలోని పోతులూరులో పింఛన్ల పంపిణీలో ఇంటి పన్నులు వసూలు చేసినట్లు పలువురు లబ్ధిదారులు చెప్పారు. ఈ విషయాన్ని వారు స్థానిక వైఎస్సార్సీపీ నేత శెట్టి సత్తిబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సత్తిబాబు స్థానిక గ్రామ కార్యదర్శిని నిలదీశారు. అప్పటికే పింఛన్ల పంపిణీ ముగిసింది. సత్తిబాబు మాట్లాడుతూ..గ్రామంలో ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇచ్చారని చెప్పారు. ఇలా బలవంతంగా ఇంటి పన్నులు వసూలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని సత్తిబాబు అన్నారు. దీనిపై ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్బాబును వివరణ కోరగా, స్వచ్ఛందంగా ముందుకు వచి్చనవారి వద్ద మాత్రమే పన్ను వసూలు చేసి, రశీదులు ఇచ్చామని చెప్పారు. -
హలో ఇండియా.. ఓసారి ఏపీ వైపు చూడండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతుండడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం మొత్తానికి తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీఎత్తున ధర్నా చేస్తున్న ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘‘సేవ్ ఫార్మర్స్’’ హ్యాష్ట్యాగ్తో ‘‘హలో ఇండియా... ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే..‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! కిలో అరటిపండ్లు కేవలం రూ.0.50కి అమ్ముడవుతున్నాయి! ఔను, మీరు విన్నది నిజమే, యాభై పైసలే. ఇదీ ఏపీలో అరటి రైతుల దుస్థితి.అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, నెలల తరబడి కష్టపడి పనిచేసిన రైతులకు దక్కిన దారుణమైన ప్రతిఫలం ఇది. అరటిపండ్లు మాత్రమే కాదు, ఉల్లిపాయల నుంచి టమాట వరకు, ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా లేదా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మబలికి మోసం చేశారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసమేనని నిరూపితమైంది.📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరటి పండ్లను టన్నుకు సగటున రూ.25 వేల ధరకు రైతులు అమ్ముకున్నారు. రైతులు ఎప్పుడూ నష్టపోకుండా చూసుకోవడానికి రాష్ట్రం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు నిర్మించాం. నాటి మా నిబద్ధత వేలాది కుటుంబాలను కాపాడింది. గిట్టుబాటు ధరలకు పంటల ఉత్పత్తులను విక్రయించుకుని లబ్ధి పొందేలా రైతులకు తోడుగా నిలిచాం. కానీ నేడు చంద్రబాబు రైతులను వారి ఖర్మకు వదిలేశారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంటే మౌనరాగం ఆలపిస్తున్నారు. నేడు ఆహారం విలువ 50 పైసలైతే దానిని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత?’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
YS Jagan: హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండంటూ ట్వీట్
-
‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’
తాడేపల్లి: ‘రాష్ట్రంలోని రైతుల దుస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’అంటూ రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి గళమెత్తారు వైఎస్ జగన్. సేవ్ ఏపీ ఫార్మర్స్హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు.ఇదీ రైతుల దుస్థితి..కిలో అరటిపండ్లు రైతుల వద్ద నుంచి రూ. 50 పైసలకే అమ్ముడవుతున్నాయని రాష్ట్రంలోని రైతుల దుస్థితికి ఇదే నిదర్శనమన్నారు. అగ్గిపెట్ట, బిస్కెట్ కంటే కూడా అరటిపండు చౌకయ్యిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడి పెట్టి నెలల తరబడి శ్రమిస్తే చివరకు రైతులకు దక్కిన ప్రతిఫలం ఇది అని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అరటి పండ్లే కాదు ఉల్లినుంచి టమోట వరకూ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ అన్నారు. మార్కెట్ లో మాత్రం అరటిపండ్లు రూ. 60 నుంచి 70 వరకూ విక్రయిస్తున్నారని అన్నారు. ఈ డబ్బులంతా మధ్యలోని దళారుల జేబుల్లోకే వెళుతున్నాయని రైతులకు మాత్రం రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదన్నారు. దీంతో ఆవేదనతో రైతులు తమ పంటను రోడ్లపై పడివేస్తున్నారన్నారు.బొప్పాయి ధర కూడా మార్కెట్ను బట్టి మారిపోతుందని రైతులకు మాత్రం ఏమీ మిగలడం లేదన్నారు. ఉల్లి టమాట ధరలు కూడా మార్కెట్లో రూ1. నుంచి రూ.3 వరకూ పలుకుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతికేది ఎలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అంతే కాకుండా విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఉచిత పంట బీమా లేదు. కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అరటి పండ్ల ధర టన్ను రూ. 25 వేలు పలికేదాని అంతేకాకుండా రైతులకోసం ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లు నడిపామన్నారు. తమ ప్రభుత్వంలో కృతనిశ్చయంతో రైతులకు ఎంతో మేలు చేశామని, రైతుల ఉత్పత్తులను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు. కానీ నేడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్.📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025 -
పోర్టుల ద్వారా ఏపీలో జరిగిన అభివృద్ధిపై వైఎస్ జగన్ ట్వీట్
-
పోర్టుల ద్వారా అభివృద్ధిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పోర్టుల అభివృద్ధి విషయమై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి మన రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిదని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి, తద్వారా మన రాష్ట్రాన్ని మార్చే ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిది అని అన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ పోర్ట్స్ రెవల్యూషన్ హ్యాష్ ట్యాగ్ (#YSRCPPortsRevolution)ను పోస్టులో జత చేశారు. Our long coastline is not just a geographical boundary!It is an economic growth engine that will transform our State through Port-Led Development.#YSRCPPortsRevolution https://t.co/qu0mdXfSq1— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025 -
ఏపీ సమస్యలపై గళమెత్తండి.. ఎంపీలకు జగన్ కీలక ఆదేశాలు
-
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
-
రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి.. పార్లమెంట్లో ప్రజా గళం
సాక్షి, అమరావతి: అన్నదాతల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి.. ప్రజల గొంతుకను గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు తుపానుతో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కక కుదేలైన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. మోంథా తుపాను వల్ల తీర ప్రాంత జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లేకపోవడం వారిని మరింత కష్టాల పాల్జేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి పంటకూ కనీస మద్దతు ధర కచ్చితంగా దక్కేదని గుర్తుచేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికి మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో దళారులు, వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు.వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చితోపాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ లభించక రైతులు అల్లాడుతున్న దృష్ట్యా కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా ఎంపీలు ఒత్తిడి తేవాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని, ఈ–క్రాపింగ్ చేయకపోవడం వల్ల పంటల గణాంకాలు స్పష్టంగా తెలియక అర్హులైన రైతులకు కూడా పరిహారం అందని దుస్థితి నెలకొందన్నారు. మిర్చి రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోకుండా వారిని దగా చేసిందని, మామిడి కొనుగోళ్లలో కంపెనీలు తగిన ధర చెల్లించేలా చూడడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆ రైతులూ తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. గ్రామీణ నిరుపేదల ఉపాధిని దెబ్బతీశారు..మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సామూహికంగా 18.63 లక్షల జాబ్ కార్డులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడాన్ని ఎంపీల వద్ద వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఇది అత్యంత దారుణమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. అర్హత ఉన్న జాబ్ కార్డులన్నింటినీ పునరుద్ధరించడంతోపాటు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే ఆపేయాలి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను గట్టిగా వ్యతిరేకించాలని ఎంపీలను జగన్ ఆదేశించారు. సంస్థను ముక్కలుగా చేసి అమ్మేస్తున్నారని, ఇది సంస్థ పూర్తి ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న పని అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరితోపాటు ఆ సంస్థ కోసం భూములిచ్చిన రైతులను దగా చేయడం తగదన్నారు. సంస్థను ముక్కలు చేస్తూ ప్రైవేటీకరణ కోసం చేపట్టిన చర్యలన్నింటినీ వెంటనే ఉపసంహరించాలని, సంస్థను పునరుద్ధరించేలా వెంటనే సొంతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయించి వేలాది మంది కారి్మకులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడాలని కోరారు. శాంతి భద్రతలు దారుణం..రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ కక్షతో పోలీసు యంత్రాంగాన్ని దురి్వనియోగం చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రస్తావించారు. చాలా మంది నాయకులు, ప్రజా ప్రతినిధులకు సెక్యూరిటీ తగ్గించి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి తీసుకొచ్చారని ఆక్షేపించారు. మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లు, సంక్షేమ వసతిగృహాల్లో పరిస్థితి నానాటికీ దుర్భరంగా మారుతోందన్నారు.విద్యార్థులకు సరైన ఆహారం, తాగు నీరు అందడంలేదని, పరిశుభ్రత పూర్తిగా కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు. వీటన్నింటితోపాటు కేంద్రం నుంచి పెండింగ్ నిధులు రాబట్టడం, రాష్ట్రంలో ఉపాధి కల్పన, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ఎంపీలు చొరవ చూపాలని.. ప్రజాసమస్యలను గట్టిగా ప్రస్తావిస్తూ, వారి గొంతుకలను బలంగా వినిపించి, కేంద్రం వాటిపై దృష్టిసారించేలా కృషిచేయాలని వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. -
వైఎస్సార్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, తాడేపల్లి: పార్లమెంటు సమావేశాలు రేపటి(డిసెంబర్ 1, సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఎంపీలను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపానులతో రైతులు నష్టపోయిన తీరు. పంటలకు గిట్టుబాటు ధరల్లేని అంశాలపై గట్టిగా చర్చించాలన్నారు.‘‘రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై గట్టిగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి. దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్న వైనాన్ని సభలో చర్చించాలి. తమ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయటంపై మాట్లాడాలి. బీమా లేకపోవడంతో రైతులు నష్టపోవటం, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించని వైనాన్ని సభలో చర్చించాలి. ఈ-క్రాప్ విధానం అమలు చేయకపోవటాన్ని సభ దృష్టికి తీసుకు వెళ్లాలి. మామిడి రైతులకు ఇప్పటికీ ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించని వైనంపై మాట్లాడాలి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల తొలగింపును గట్టిగా ప్రశ్నించాలి..18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని పార్లమెంటులో నిలదీయాలి. అర్హులందరికీ తిరిగి కార్డులు ఇచ్చేలాగ ఒత్తిడి తేవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన త్యాగాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంపై చర్చించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవటం.. మౌలిక సదుపాయాలను కల్పించని వైనాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలపై చర్చించాలి. ఏపీ హక్కుల కోసం ఎంపీలు గట్టిగా గళమెత్తాలి’’ అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
జగన్ పాలనే బెటర్.. తేల్చి చెప్పిన కేంద్రం
-
ఆరోగ్యం అంధకారంలోకి.. చదువులు పాతాళంలోకి..
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతినెలా ప్రభుత్వాస్పత్రి, విలేజ్ క్లినిక్ల సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేవారు. రక్త పరీక్షలు చేసి విద్యార్థుల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గుర్తించి వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేసేవారు. రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు ఇచ్చి జాగ్రత్తలు సూచించేవారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. విద్యార్థులకు ఆరోగ్య కార్డులు ఇచ్చి ప్రతినెలా ఆరోగ్య పరీక్షల్లో వచ్చిన ఫలితాలను వాటిలో నమోదు చేసేవారు. ఫలితంగా పిల్లల ఆరోగ్యం మెరుగుపడేది. ఇలా ప్రతి నెలా దాదాపు 45 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పరిస్థితి తారుమారైంది. సాక్షి, అమరావతి: ‘ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం సర్కారీ విద్యను పూర్తిగా నీరుగార్చడంతోపాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. పాలకుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 45 లక్షల నుంచి 34 లక్షలకు తగ్గిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో విద్యార్థులకు ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు చేసి అందించిన ఆరోగ్య కార్డులు సైతం ఇప్పుడు కనిపించకుండా పోయాయి. గతేడాది మెగా పీటీఎం పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసిన సర్కారు ఒక్కరోజే వైద్య పరీక్షలు అంటూ హడావుడి చేసింది. ఆ తర్వాత ఆ ఆలోచనే చేయడం మానేసింది. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ సైతం తన బాధ్యత కాదని వదిలేసింది. 34 లక్షల మంది పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యంరాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నెలలో మెగా పేరెంట్–టీచర్స్ సమావేశం నిర్వహించింది. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించామంటోంది. 96 శాతం మంది పిల్లలకు పరీక్షలు చేయించినట్టు ప్రకటించి.. వివరాలను హోలిస్టిక్ మార్కుల లిస్టుకు అనుసంధానం చేసినట్టు చెబుతోంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 98 శాతం మందికి, ఎయిడెడ్ పాఠశాలల్లో 97.07 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 89 శాతం పూర్తిచేసినట్టు ప్రకటించింది. జూలై తర్వాత మళ్లీ పరిస్థితి ఏమిటనేది పట్టించుకున్న పాపానపోలేదు. గత ప్రభుత్వంలో ప్రతినెలా పరీక్షలు చేసి తల్లిదండ్రులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన రక్త పరీక్షలు చేసి రిపోర్టులు ఇచ్చేవారు. అలాగే కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా అందించారు. ప్రస్తుతం ఈ విధానం పూర్తిగా నీరుగారిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఇంటరీ్మడియట్ వరకు 34 లక్షల మంది విద్యార్థులున్నా వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థంగాని పరిస్థితి నెలకొంది. ఇక సంక్షేమ వసతి గృహాల్లో పిల్లల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అస్వస్థతలతో మరణాలుచంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనడానికి ఎన్నో ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలోని పాఠశాలలు, హాస్టళ్లలో అస్వస్థతకు గురైన విద్యార్థులు వందల్లో ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకరు, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏడుగురు మృతి చెందారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల సంఖ్య 22 మంది కంటే ఎక్కువేనని అంచనా. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 184 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారు.వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పరిధిలోని డుంబ్రిగూడ మండలం జామిగూడ గిరిజన బాలికల హాస్టల్లో కలుషిత ఆహారంతో 60 మంది ఆస్పత్రి పాలయ్యారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఒక ప్రైవేట్ ట్రస్ట్ హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు గిరిజన విద్యార్థులు మరణించారు. 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.అవాంఛనీయ ఘటనలెన్నో..కొన్ని పాఠశాలల్లో బాలికలకు పాఠశాలలు, హాస్టళ్లలోనే అబార్షన్లు అయిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. కొన్ని కాన్పులు సైతం జరిగాయి. కడప గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ స్థానిక కళాశాలలో ఒకేషనల్ చదవుతున్న 17 ఏళ్ల బాలిక 9 నెలల గర్భంతో ఉన్నా సిబ్బంది గుర్తించలేని పరిస్థితి. గతేడాది డిసెంబర్లో గుంటూరు సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉంటున్న ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డను హాస్టల్లోనే ప్రసవించింది. అప్పట్లో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. గతేడాది డిసెంబర్లోనే ఏలూరు జిల్లాలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక హాస్టల్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సిబ్బంది గమనించలేదు. ప్రతినెలా వైద్య పరీక్షలు చేసి ఉంటే ఇలాంటి ఘటనలను ముందుగానే గుర్తించే ఆస్కారం ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంతమంది పిల్లల తల్లిదండ్రులకు తీరని వేదనకు గురి చేస్తోంది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక బడా స్కాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో టీడీపీ నేతలకు కట్టబెట్టి వందల కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీ భూముల్ని కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారాయన. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక స్కాం ఉంది. టీడీపీ నేతలకు కాలేజీలను కట్టబెట్టి వందల కోట్లు దోచుకుంటున్నారు. మెడికల్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం అమ్ముకోవడానికి రెడీ అయ్యింది. మెడికల్ కాలేజీలను 66 సంవత్సరాలు లీజుకు ఇవ్వటానికి జీవోలు ఇచ్చారు..తరతరాలుగా తమ వారికి దోచిపెట్టే ప్లాన్ చేశారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీల భూములను కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారు. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయినా సరే జగన్ కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలాగా ఉన్నాయా?. అత్యద్భుతంగా జగన్ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే చంద్రబాబు వాటిని సింపుల్గా అమ్మేస్తారా?. దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయలేదు. కానీ చంద్రబాబే ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వారికి ఇచ్చాక కూడా స్టాఫ్కి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట.. ఏంటసలు?. ఒక పేదవాడు అత్యవసర వైద్యం కోసం వస్తే వైద్యం చేసే పరిస్థితి ఉంటుందా?. ఒకవేళ ఆస్పత్రి 70% ఫుల్ అయిందని చెప్పి వెనక్కు పంపితే ఆ పేదోడు బతికేదెలా?. వైద్య విద్య మీద ఈ ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదా?. ఇప్పటికే చంద్రబాబు వైఖరి వల్ల 2,750 మెడికల్ సీట్లు కోల్పోయాం. పాడేరు మెడికల్ కాలేజీ విషయంలో 50 సీట్లు కోల్పోయాం. ఇటీవల ఆ ప్రాంతంలో గర్భిణులు, హాస్టల్ విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడ్డారో కనపడలేదా?. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన వస్తోంది. మేం అధికారం చేపట్టాక ప్రైవేటీకరించిన మెడికల్ కాలేజీలను తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం అని అన్నారాయన. -
Kurnool Road Incident: వైయస్ జగన్ దిగ్భ్రాంతి
-
AP: PPP కి గత ప్రభుత్వం జీవోలే అమలు
-
ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఐదుగురు మృతిచెందడంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ఆ కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని, క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాని ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్.కాగా, కర్నూలు జిల్లాలో శనివారం(నవంబర్ 29) తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. జగన్ RBKలకు అంతర్జాతీయ గుర్తింపు
-
‘ఈనాడు’ బరితెగింపు.. అవే అబద్ధాలు.. అదే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: టీడీపీ భజంత్రీ పత్రిక, దుష్ప్రచార విష పుత్రిక ‘ఈనాడు’ మరోసారి తన మార్కు కుట్రకు బరితెగించింది! దశాబ్దాలుగా అవాస్తవాలు వండివార్చి నిత్యం ఉషోదయంతో ప్రజలను తప్పుదారి పట్టించే కుతంత్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో దారుణంగా విఫలమైన చంద్రబాబుకు రక్షా కవచంగా మరోసారి దుష్ప్రచారానికి దిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమాత్రం సంబంధంలేని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో ఆయనకు ముడిపెట్టేందుకు యత్నిస్తోంది. ఆ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్రెడ్డి ఆయనకు సన్నిహితుడు అంటూ నిస్సిగ్గుగా అవాస్తవ కథనాన్ని ప్రచురించి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది.సునీల్రెడ్డిని సిట్ విచారించిన సమాచారాన్ని వార్తా కథనంగా ప్రచురిస్తూ, అందులో ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు వివరాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారానికి తెగబడింది. కేవలం ముఖ పరిచయం ఉన్నవారిని బినావీులని చిత్రీకరిస్తోంది. మరి అదే సిద్ధాంతం ప్రకారం.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, గీతం మూర్తి ఆయనకు బినావీులనుకోవాలా? చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటున్న సునీల్రెడ్డి దుబాయ్లో పెట్టుబడులు పెట్టాడని, వైఎస్ జగన్కు సన్నిహితుడని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. లేని ఆస్తులను, లేని నగదును సునీల్వంటూ దుష్ప్రచారం చేస్తోంది.అసలు ఎమ్మార్ కేసుతో వైఎస్ జగన్కు ఏం సంబంధం? ఈ వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని సీఐడీ చార్జిషీట్లోనే పేర్కొంది. ఇంకా చెప్పాలంటే.. ఆ కంపెనీకి నాడు భూములిచ్చిందే చంద్రబాబు. దాని ప్రమోటర్ ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఇస్తేగిస్తే చంద్రబాబుకే ముడుపులివ్వాలి! వైఎస్ జగన్పై అక్రమ కేసుల నమోదు చంద్రబాబు, నాడు కాంగ్రెస్ కుట్రే! టీడీపీ నేతలతో కలసి కేసులు వేయించి నాడు కిరణ్కుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారును కాపాడింది చంద్రబాబే!‘ఈనాడు’ దుష్ప్రచార కుట్రతన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే చంద్రబాబు డైవర్షన్ కుట్రలో భాగంగానే ఈనాడు పత్రిక ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును వక్రీకరిస్తూ కథనాన్ని ప్రచురించింది. ఆ కేసులో ఏ–7గా ఉన్న హైదరాబాద్కు చెందిన న్యాయవాది, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడని చెప్పుకొచ్చింది. ఆయన చెప్పిన పనులను ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పని చేసే కుడిభుజం అంటూ పచ్చి అవాస్తవాలు ప్రచురించడం విస్మయపరుస్తోంది. ఈ పదేళ్లలో కలిసినట్లు ఒక్క ఫొటో చూపగలదా? చూపలేదు. ఎందుకంటే దశాబ్దంపైగా వైఎస్ జగన్ను సునీల్రెడ్డి ఏనాడూ వ్యక్తిగతంగా కలవనే లేదు. అయినప్పటికీ ఎల్లో మీడియా పాత ఫోటో ప్రచురించి విష ప్రచారానికి తెగబడింది. సునీల్రెడ్డి గత కొన్నేళ్లలో వైఎస్ జగన్ను ఎప్పుడైనా కలిసినట్లు ఈనాడు గానీ, చంద్రబాబు గానీ చూపించగలరా..?‘ఎమ్మార్ ప్రాపర్టీస్’కు భూములిచ్చింది బాబేఅసలు వాస్తవం ఏమిటంటే... ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రాజెక్టుకు 1999–2004 మధ్య టీడీపీ హయాంలో ఆమోదం తెలిపింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే. భూములు కేటాయించింది అప్పటి టీడీపీ ప్రభుత్వమే. ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రమోటర్లు, డైరెక్టర్లు చంద్రబాబుకే సన్నిహితులు. బాబు కుట్రతోనే వైఎస్ జగన్పై అక్రమ కేసులువైఎస్ జగన్పై అక్రమ కేసుల నమోదు చంద్రబాబు, అప్పటి కాంగ్రెస్ కుట్రేనన్నది బహిరంగ రహస్యం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానంతో జట్టు కట్టి చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. అప్పటి కాంగ్రెస్ మంత్రి శంకర్రావు, టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు కలిసే వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడమే అందుకు తార్కాణం. ఇక అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబే. ఆ విధంగా కాంగ్రెస్, టీడీపీ కలిసే వైఎస్ జగన్పై అక్రమ కేసులు నమోదు చేయించాయన్న వాస్తవం ప్రజలందరికీ తెలుసు. అదే కుట్రను కొనసాగిస్తూ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పేరిట వైఎస్ జగన్పై ఈనాడు పత్రిక విష ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆదేశాలతోనే అవాస్తవ కథనాలను ప్రచురిస్తోంది.ఆ కుటుంబాల ఆస్తులన్నీ బాబు బినావీుయేనా...!ఫొటోలు దిగితేనే సన్నిహితుడు, బినామీ అయితే... చంద్రబాబు, లోకేశ్ ఎందరెందరితోనో ఫొటోలు దిగుతూ ఉంటారు. వారంతా ఆ తండ్రీకుమారులకు బినావీులుగానే పరిగణించాలా మరి...! అసలు క్విడ్ప్రోకో, బినామీ అనే పదాలు చంద్రబాబుకే వర్తిస్తాయి. ‘ఈనాడు’ రామోజీరావు కుటుంబం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం, టీవీ 5 బీఆర్ నాయుడు కుటుంబం, విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఎం. భరత్ కుటుంబం... ఇలా ఈ జాబితాకు అంతే లేదు. వారందరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే కాదు... ఆయన రాజకీయ కుట్రలో భాగస్వాములు కూడా. 1995లో వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్తో ఎన్టీరామారావుకు వెన్నుపోటు కుట్రలో వారందరూ భాగస్వాములే కదా. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రామోజీ కుటుంబ అక్రమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు పూర్తిగా సహకరించారు.ఎన్టీ రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించారు. రామోజీ ఫిల్మ్ సిటీ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేశారు. టీడీపీ ప్రభుత్వ అండతోనే రామోజీ రావు కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను చెరబట్టి ఫిల్మ్ సిటీ నిర్మించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిటర్స్ రూ.వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. అదే రీతిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, విశాఖఫట్నంలో ‘గీతం’ ఎంవీవీఎస్ మూర్తి (ప్రస్తుత టీడీపీ ఎంపీ భరత్ తాత) కుటుంబాల ఆస్తులు అమాంతంగా పెరిగిన విషయం బహిరంగ రహస్యమే. అదంతా చంద్రబాబు క్విడ్ ప్రోకో కుట్రనే. అంటే రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, ‘గీతం’ ఎంవీవీఎస్ మూర్తి కుటుంబాల ఆస్తులన్నీ చంద్రబాబు బినామీ ఆస్తులేనన్నది స్పష్టమవుతోంది. -
వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విపణి వరకు ఐదేళ్ల పాటు రైతులను గ్రామస్థాయిలో చేయిపెట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) వ్యవస్థకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ అయిన ఇంగ్లాండ్లోని బర్మింగ్హాం విశ్వవిద్యాలయం ఆర్బీకేలను సువర్ణ యజ్ఞంగా గుర్తించింది. యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎంబీఏ) చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని నిరోషా ఆర్బీకేలపై ప్రదర్శించిన ప్రాజెక్టుకు గోల్డ్మెడల్ బహూకరించింది.వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన మహత్తర వ్యవస్థవైఎస్ జగన్ ప్రవేశపెట్టిన మహత్తర వ్యవస్థే ఆర్బీకేలు. పౌరసేవలను ప్రజల ముంగిట తీసుకెళ్లే లక్ష్యంతో రెండు వేల జనాభాకొక గ్రామసచివాలయాలను అందుబాటులోకి తీసుకొచి్చన వైఎస్ జగన్ వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో ఒకేసారి 10,77 8రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా ఫీడ్, పశువుల దాణా వంటి ఉత్పాదకాలతోపాటు రైతు సంక్షేమ ఫలాలను ఈ కేంద్రాల ద్వారానే కర్షకుల ముంగిటకే అందించారు. వ్యవసాయ అనుబంధ యూనివర్శిటీలకు ఆర్బీకేలు కేంద్రంగా చేసి ఇంటర్న్షిప్లనూ నిర్వహించారు. దేశానికే రోల్మోడల్గా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను గతంలోనే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలతోపాటు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి.ఆర్బీకేల స్పూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతోపాటు ఇథియోపియా వంటి దేశాలూ ఆర్బీకే వ్యవస్థపై అధ్యయనం చేసి వీటి స్ఫూర్తితో తమ ప్రాంతాల్లో గ్రామస్థాయిలో రైతులకు మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేశాయి. అంత గొప్ప కీర్తిగడించిన ఆర్బీకే వ్యవస్థను గడిచిన 18 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఇదిలా ఉంటే ఆర్బీకేలపై ప్రాజెక్టు ప్రెజెంట్ చేసిన నిరోషా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారానే బర్మింగ్ హాం వర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారు.చివరి ఏడాది సమర్పించే ప్రాజెక్టుగా ఆర్బీకేల అంశాన్ని ఆమె ఎంపిక చేసుకుంది. ఈ వ్యవస్థను అధ్యయనం చేసి ఆర్బీకేల ద్వారా రైతులకు అందిన సేవలపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సమర్పించింది. ఈ ప్రాజెక్టును బర్మింగ్ హాం యూనివర్సిటీ బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రేయాస్ ఫీల్డ్ అవార్డుతోపాటు గోల్డ్ మెడల్ బహూకరించింది. ఈ గోల్డ్మెడల్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే అంకితం ఇస్తున్నట్టు నిరోషా సగర్వంగా ప్రకటించడం గమనార్హం. -
పాలన అంటే ఇది అని నిరూపించింది రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్..
-
మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు
-
మహాత్మా జ్యోతిరావ్ పూలేకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావ్ పూలేకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మ… pic.twitter.com/eNgDWAJ2n8— YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2025తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ నేతలు హాజరయ్యారు. -
వైఎస్సార్ కడప జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
సాక్షి కడప: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన గురువారం ముగిసింది. పులివెందులలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం ఆయన బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలిరోజు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులతో మమేకమయ్యారు.రెండో రోజు పులివెందుల పరి«ధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలో అరటి తోటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పలువురు నేతలను పరామర్శించడంతోపాటు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మూడోరోజు కూడా ఇల్లు, కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలతో మమేకమయ్యారు. -
ధాన్యం.. దళారుల భోజ్యం!
ఈ చిత్రంలో కనిపిస్తున్న ధాన్యం ఆరబోసిన దృశ్యం చంద్రబాబు క్యాబినెట్లోని మంత్రి పార్థసారథిని అవాక్కయ్యేలా చేసింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంబాడు గ్రామం నుంచి పామర్రు సెంటరు–గుడివాడ వెళ్లే రహదారిలో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. వ్యవసాయ కుటుంబాలన్నీ రోడ్లపై ధాన్యాన్ని పోసి పగలంతా ఆరబెట్టుకోవడం.. రాత్రి అయితే అక్కడే చలిలో కాపలా ఉండటం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు 75 కిలోల బస్తాను రూ.వెయ్యికి కొనుగోలు చేస్తున్న దుస్థితి. బుధవారం ఈ రహదారిలో వెళ్తున్న మంత్రి పార్థసారథి రోడ్లపై ధాన్యాన్ని చూసి కారు దిగేసరికి.. అన్నదాతలు ఆయన్ను చుట్టుముట్టి నిలదీశారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలు చేయట్లేదని, రంగు మారిన ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని వాపోయారు. మంత్రి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మోంథా తుపానుతో అతలాకుతలమైన ధాన్యం రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం డబుల్ గేమ్ అడుతోంది.. ఓ వైపు నష్టపోయిన రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోగా, ఇప్పుడు అంతంత మాత్రంగా చేతికందిన పంటను కొనుగోలు చేయడంలో దళారులకు మేలు జరిగేలా అంతర్గతంగా సహకరిస్తోంది.. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి.. నిర్దయగా తిరస్కరిస్తోంది.. గోనె సంచులు లేవు.. టార్పాలిన్లు లేవు.. రవాణా వాహనాలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు.. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి రైతులు ధాన్యాన్ని అమ్ముకుందామంటే కనీస మద్దతు ధర కూడా లేదు.. ఈ దళారీ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తున్నది మరొకటని అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ధాన్యం సేకరణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసింది. రెండు మూడు గ్రామాలకు ఒక దళారి చొప్పున అప్పగించి, అందినకాడికి దోచుకోమని పచ్చ జెండా ఊపింది. సంచులు, లారీలు, ధర విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచి్చంది. మొత్తంగా ధాన్యం కొనుగోలు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న వారు అతి తక్కువ ధరకు అడుగుతుండటం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకు అమ్ముకోవడం తప్ప అన్నదాతలకు మరో మార్గం లేకుండా చేసింది. రైతు నేరుగా మిల్లులోకి ప్రవేశించే పరిస్థితి లేకుండా కుతంత్రం సాగిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ దశలోనూ ప్రభుత్వ పర్యవేక్షణ అన్నదే లేదు. ధాన్యం కొనాలనే చిత్తశుద్ధి అంతకంటే లేదు. రాష్ట్రంలో రైతులకు చంద్రబాబు సర్కార్ కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కలి్పంచకుండా నిలువునా దోపిడీ చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు దళారుల దందాకు వత్తాసు పలుకుతూ రైతులను నిలువునా ముంచేస్తోంది. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా, రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు ఖరీఫ్లో ధాన్యం కోతలు ఊపందుకున్నా, మరోవైపు కొనుగోళ్లు మాత్రం ముందుకు కదలట్లేదు. ఇటీవల వరుస వాయు గుండాలు, మోంథా తుపాన్ రైతులను తీవ్రంగా దెబ్బ తీశాయి. మిగిలిన అరకొర పంటలను చేజిక్కించుకున్నా, అమ్ముకునే పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలు ఉత్సవ కేంద్రాలుగా మారాయి. కనీసం పంట పట్టుబడికి గోనె సంచులూ సమకూర్చలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం మిన్నకుండిపోయింది. ఫలితంగా రోజుల తరబడి రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి ఎత్తుకోవడం.. లేదా దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడం తప్ప మరో దారి కనిపించట్లేదు. దళారుల దోపిడీ పర్వంచంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నడూ రైతులకు మద్దతు ధర అందించిన పాపాన పోలేదు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీ పర్వానికి తెరతీసి వేడుక చూస్తోంది. పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా, దళారుల అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా పంట పొలం నుంచి మిల్లులకు చేరే పరిస్థితి లేదు. పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా, నిరాశే ఎదురవుతోంది. రోజుల తరబడి షెడ్యూల్ ఇవ్వక పోవడం, గోనె సంచులు సమకూర్చక పోవడంతో కోసిన పంటను నిల్వ చేసుకునేందుకు అగచాట్లు పడాల్సి వస్తోంది. ఒకవేళ పట్టుబడి చేసినా రోజుల తరబడి లోడు మిల్లులకు చేరట్లేదు. అదే, దళారులు చెప్పిన రేటుకు ధాన్యాన్ని ఇస్తే మాత్రం క్షణాల్లో తరలించేస్తున్నారు. ఫలితంగా రైతులు 75 కిలోల బస్తాను రూ.400–500 తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే, సాధారణ రకానికి రూ.1,777, ఏ–గ్రేడ్కు రూ.1,792 మద్దతు ధర ఉంటే.. దళారులు ఇచ్చేది రూ.1,200–1,300 మాత్రమే. ఆరు కోట్ల గోనె సంచులు ఎక్కడ?ఖరీఫ్లో ధాన్యం సేకరణకు ఏకంగా 7,53,000 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, క్షేత్ర స్థాయిలో రైతులకు పంట పట్టుబడికి మాత్రం సంచులు దొరకట్లేదు. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోనె సంచుల కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మరో వైపు 30 వేలకు పైగా రవాణా వాహనాలు సిద్ధం చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా, లోడింగ్కు మాత్రం కనీసం ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఇదిలా ఉండగా, ఇటీవల పౌర సరఫరాల సంస్థ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ కాంట్రాక్టును, వాటి సాఫ్ట్వేర్ను ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సంస్థకు అప్పగించింది. ఇప్పుడు ఒకే సంస్థ పరిధిలో అన్ని రకాల జీపీఎస్ డివైజ్న్లను అనుసంధానం చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా చాలా చోట్ల జీపీఎస్లు పనిచేయక పోవడంతో లారీల్లో లోడింగ్కు ముందుకు రావట్లేదు. బ్యాంకు గ్యారంటీలు కట్టని మిల్లర్లు ప్రభుత్వం 3,013 రైతు భరోసా కేంద్రాలు, 2,061 పీపీసీ (పీఏసీఎస్)ల ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్టు చెబుతోంది. కానీ, చాలా చోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఇక్కడ అధికారులు, దళారులు కుమ్మక్కులో భాగంగా కొనుగోలు కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించేలా పరోక్షంగా కుట్ర చేస్తున్నారు. అంటే.. ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనకపోగా.. దళారులతో కలిసి రైతులను దోపిడీ చేస్తూ.. మళ్లీ అదే దళారీ, రైతు పేరుతోనే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకుని లాభపడేలా దోపిడీ వ్యవస్థను ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో మిల్లర్లు రూ.3 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 50 శాతం కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో మిల్లులకు ధాన్యాన్ని తరలించలేక అధికార యంత్రాంగం చేతులు ఎత్తేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం వాట్సాప్లో ‘హాయ్’ అని మెసేజ్ పెట్టగానే.. ధాన్యం కొంటామంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, రైతు నేరుగా కొనుగోలు కేంద్రానికి వెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు. తేమ.. తూకంలోనూ మోసం! మోంథా తుపాన్ దెబ్బతిన్న పంటను కోత కోయించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఎకరానికి రూ.4 వేలు పెట్టి మిషన్ల ద్వారా కోతలు కోయిస్తున్నారు. కోసిన పంటను కోసినట్టు అమ్ముకుందామంటే ప్రభుత్వం 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే నిరాకరిస్తోంది. ప్రభుత్వం రైతులకు పంట ఒబ్బిడికి టార్పాలిన్లు ఇవ్వకపోగా, తేమ శాతం పేరుతో కొనుగోలుకు నిరాకరిస్తోంది. రంగుమారిన ధాన్యాన్నీ కొనడం లేదు. దీనికి తోడు గోనె సంచికి రెండు కిలోల బరువు కట్టి, అంతే మొత్తాన్ని రైతుల ధాన్యంలో నుంచి లాగేస్తున్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్లో సుమారు 81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పింది. అయితే తుపాను, ఇతర కారణాల వల్ల అంత దిగుబడి రాలేదు. ఇప్పటిదాకా 7.19 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుపాను వస్తేనే పరదాలు ఇస్తారట! ఈ రైతు పేరు ఆరుమళ్ల రాజశేఖర్రెడ్డి. కృష్ణా జిల్లా పామర్రు గ్రామం. సొంత పొలం మూడెకరాలు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మొత్తం ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. ప్రస్తుతం మిషన్ సహాయంతో రెండు ఎకరాలు నూరి్పడి చేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు 25–27 బస్తాలే వస్తోంది. పంటను ఆరబెట్టుకునేందుకు పరదాలు (టార్పాలిన్లు) కావాలని ఆర్బీకేకు వెళ్లి అడిగాడు. ‘ప్రస్తుతం పరదాలు ఇచ్చేది లేదు.. తుపాను వస్తేనే ఇస్తాం’ అని చెప్పారని వాపోయాడు. గోనె సంచులైతే చిరిగిపోయినవి ఇస్తున్నారని, కష్టపడి పంటను ఆరబెట్టుకుంటే లోడింగ్కు లారీలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువకు రేటు కడదామని చూస్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన ఎస్ సత్యనారాయణ ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవల మోంథా తుపాను వల్ల పొలం నీట మునిగి పోవడంతో నష్టపోయాడు. ఒక్క రూపాయి పరిహారం రాలేదు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి మళ్లీ తుపాను హెచ్చరిక రావడంతో భయంతో కోతలు ప్రారంభించాడు. అధిక వ్యయంతో యంత్రాలతో కోతలు నిర్వహిస్తే ఎకరాకు 33 బస్తాల ధాన్యమే దిగుబడి వచి్చంది. మద్దతు ధర దక్కడం గగనంగా మారింది. పొలాల వద్దకు వచ్చే వ్యాపారులు 75 కిలోల బస్తా రూ.1,300కే అడుగుతున్నారు. విక్రయించేందుకు సిద్ధమైనా సిండికేట్గా ఏర్పడి కొనుగోలు చేయకుండా మరింత తక్కువ రేటు కడదామని చూస్తున్నారని వాపోయాడు. ధాన్యం ఎవరికి అమ్మాలి? గత నెలలో తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ధాన్యం బాగా దెబ్బతింది. తేమ అధికంగా వస్తోంది. రెండు రోజుల కిందట కోతలు మొదలు పెట్టాం. వాతావరణంలో మార్పులు రావడంతో హడావిడిగా ఒబ్బిడి చేస్తున్నాం. ధాన్యం కల్లాల్లోనే బరకాలతో కప్పి ఉంది. ఆర్బీకేలో సవాలక్ష నిబంధనలు పెట్టారు. వ్యాపారులు కూడా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ పరిస్థితిలో ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పెద్దిరెడ్డి సత్యనారాయణ, గాడిలంక, -ముమ్మిడివరం మండలం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రోజుకో రేటు నేను రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. కొనుగోలు కేంద్రంలో స్పందన లేకపోవడంతో ఏజెంట్లను అడిగితే రోజుకో రేటు చెబుతున్నారు. మూడు రోజుల కిందట రూ.1,400 ఉంటే, ఇప్పుడు అది రూ.1,330కి పడిపోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టారు. తేమ శాతం, పొట్టు, మట్టి గెడ్డలు, పూర్తిగా ఆరబెట్టినవి మాత్రమే కొనుగోలు చేస్తారట. ధాన్యం ఆరబెట్టడానికి జాగా లేని మేము ఏం చేయాలి? – కట్టేపోగు నాగులు, శృంగారపురం గ్రామం, దుగ్గిరాల, గుంటూరు జిల్లా గోనె సంచులు ఇవ్వట్లేదు నేను ఎకరానికి రూ.20 వేలు వంతున ఖర్చు చేసి 13 ఎకరాలలో వరి సాగు చేశా. నూరి్పడులు కూడా పూర్తయ్యాయి. వాతావరణ మార్పుల హెచ్చరికలతో గుండెల్లో గుబులు మొదలైంది. నాకు ఈ ధాన్యం పట్టడానికి 500 గోనె సంచులు అవసరం. కానీ, 200 మాత్రమే ఇచ్చారు. తుపాను ఆందోళనతో గోనెలు లేకపోతే పంట నష్టపోవడం కంటే దళారులకు అమ్ముకోవడం ఉత్తమం అనిపిస్తుంది. అయితే, క్వింటాకు రూ.400 నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం గోనె సంచులు ఇవాలి. – కనకల శ్రీనివాసరావు, బోని, ఆనందపురం మండలం, విశాఖపట్నం -
జగన్ కోసం బారులు తీరిన జనం
-
‘జగన్కు మంచి పేరు వస్తుందనే ఇలా చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ ఎంతో తపించి మెడికల్ కాలేజీల తీసుకొస్తే.. వాటిని చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైఎస్సార్సీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం తాడేపల్లి పార్టీ కేంద్రకార్యాలయంలో బొత్స ఈ అంశంపై మాట్లాడారు. కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదలకు మేలు జరగాలనే వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వైద్య రంగాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం వైద్య రంగానికి నిధులు కేటాయించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాలేజీలను పెట్టాలని చూస్తున్నారు. ఐదు కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయి. మిగతావి క్రమబద్దంగా పనులు జరుగుతున్నాయి. జగన్కు మంచి పేరు రాకూడదనే ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే జగన్ కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది.. ..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం. అన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ల చేతుల్లో ఉండకూడదు. అన్ని విషయాలు గవర్నర్కు వివరించాం. దీనిపై ఒక కమిటీని పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం. ప్రైవేట్ వాళ్లు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు?. లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి?. పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు?. పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు’’ అని బొత్స స్పష్టం చేశారు. ఇంకా బొత్స ఏమన్నారంటే.. 👉జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. చంద్రబాబుకు కోపం ఉంటే మాపై తీర్చుకోవాలి. అంతేగానీ పేదల మీద అంత కోపం ఎందుకు?. ఓటు వేసి గెలిపించిన పాపానికి అదే పేదల మీద కక్ష తీర్చుకోవటం న్యాయమేనా?. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. 👉జగన్ హయాంలో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. ట్యాబులు ఇస్తే విద్యార్థులు గేమ్ లు ఆడుకున్నారని మాక్ అసెంబ్లీలో చెప్పించారు. ఇలా పిల్లలతో చెప్పించటానికి కాస్తన్నా సిగ్గు ఉండాలి. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఇంగిత జ్ఞానం లేదు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవచ్చు. అంతేగానీ బాధ్యతలేని వ్యక్తి లాగా మాట్లాడటం సరికాదు👉రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఏ వ్యవస్థ మీదా పర్యవేక్షణ లేదు. ఎల్లోమీడియాలో ఆహాఓహో అనిపించుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతుంటే అసలే మాత్రం పట్టించుకోవటం లేదు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టటంలేదు. ఆస్పత్రులలో సరైన వైద్యం అందటం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా చంద్రబాబు పట్టించుకోవటం లేదు👉రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు?. రాజ్యాంగంలో ప్రతిపక్షాన్ని పిలవవద్దని ఉందా?. ప్రతిపక్షం గురించి పట్టించుకోని ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు👉పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా?. ఇంకొకరు మాట్లాడితే తప్పా?. పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు?. ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? అని బొత్స నిలదీశారు. -
ఎల్లో మీడియా ఏడుపు... జగన్కు దిష్టిచుక్క!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జనసందోహాన్ని చూసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ పార్టీల నాయకులు జగన్పై, ఆయన పర్యటనలపై విమర్శలు చేయడం సహజం. కానీ స్వతంత్ర మీడియా పేరు చెప్పుకునే ఎల్లోమీడియా కూడా గుక్కపెట్టి రోదిస్తున్న తీరు మాత్రం జనంలో నగుబాటుకు గురవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి సంస్థలు బరితెగించి చేస్తున్న చిల్లర విమర్శలు కాస్తా.. వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు అనంతపురం సమీపంలోని రాప్తాడుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఏభైవేల మందికి పైగా జనం ఆయనకు స్వాగతం చెప్పారు. ఆయన కాన్వాయి వెంట పరుగెడుతూ జయజయధ్వానాలు చేశారు. ఎన్నికలై ఏడాదిన్నర కాలం కాకముందే ప్రజలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టమైనట్లు ఈ జనసందోహం చెబుతోంది. అదే సమయంలో ఇంత ప్రజాభిమానం కలిగిన నేత ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల్లో నిజంగానే ఓడిందా అన్న సంశయం చాలామందికి కలిగింది. ఏదో మతలబు జరిగిందని ఈవీఎంల ప్రభావమో, పోలింగ్ సమయం తరువాత పోలైనట్టుగా చెబుతున్న సుమారు ఏభై లక్షల అదనపు ఓట్ల మహత్యమో కావచ్చు కానీ ప్రజలు మాత్రం అప్పుడు, ఇప్పుడు జగన్వైపే ఉన్నారన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఒక రాప్తాడు మాత్రమే కాదు.. తుపాను బాధితుల పరామార్శకు మచలీపట్నం వెళ్లినా అదే జన కెరటం. సత్తెనపల్లిలో ఒక పార్టీ నేత కుటుంబాన్ని పలకరించడానికి వెళ్లినా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కొన్ని నెలల క్రితం జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా నెల్లూరు నగరం అంతా కదిలివచ్చినంత జన తరంగం కనిపించింది. ఏపీలోనే కాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఏమాటకామాట. తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మాదిరి కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరో ఒకరు రఫ్పా,రప్ఫా అని సినిమా డైలాగును పోస్టరు రూపంలో ప్రదర్శించినా తప్పుడు కేసు పెట్టే ఆలోచన చేయలేదు. ఏపీలో అయితే జగన్ అభిమానులు కదిలితే కేసు. మాట్లాడితే కేసుగా ఉంది పరిస్థితి. జగన్ మచిలీపట్నం టూర్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై కేసులు పెట్టారు. నెల్లూరులో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు పెట్టారు. హైదరాబాద్లోనూ తరగని జగన్ అభిమానాన్ని చూసి తెలుగుదేశం పార్టీతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు జీర్ణించుకోలేకపోయాయి. అసహ్యం పుట్టించేలా పిచ్చి రాతలు రాశాయి. టీవీ చానళ్లలో పిచ్చి వాగుడు వాగారు. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే అర్జంట్గా జగన్పై కేసులను తేల్చేయాలట. వారు కోరుకున్న రీతిలో శిక్షించాలట. ఈ సందర్భంలో కొంతమంది టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు వెగటు పుట్టించాయి. వర్ల రామయ్య వంటివారు ఏకంగా న్యాయమూర్తులకే విజ్ఞప్తి చేసినట్లు మాట్లాడారు. మరో చోటా నేత జగన్ను ఎన్ కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం యాంకర్లుగా ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలు జగన్ కోసం ఆ రకంగా రావడం ఏమిటని ప్రశ్నించారు. చాలాచాల అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాన్ని ఏపీ నుంచి తరలించారని ఏడుపుగొట్టు కూతలు కూశారు. జగన్ కోర్టుకు వెళ్ళినప్పుడు లోపల సన్నివేశాలు వీడియో తీయరాదు.అయినా కొందరు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. జగన్ కోర్టు హాలులో నిలబడితే అదేదో తప్పు అన్నట్లుగా ప్రచారం చేశారు. కోర్టులో జగన్ సాక్ష్యుల స్థానాలలో కూర్చుని కనిపించారని మరొకరి ఆక్షేపణ. న్యాయమూర్తి రావడానికి ముందు ఎవరైనా కోర్టులో కూర్చోవచ్చు. దీనిపై వైసిపి నేత, మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. కోర్టులో వీడియోలు తీయడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయనను హెలికాఫ్టర్లో విజయవాడకు తీసుకు రావాలని పోలీసు అధికారులు భావించారు.కాని చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. బస్సులోనే ప్రయాణిస్తానని పట్టుబట్టారు. పోలీసులు ఒప్పుకుని నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. అది అప్పట్లో పోలీసులు వ్యవహరించిన పద్దతి. కాని ఇప్పుడేమో ఎలా ప్రవర్తిస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు. చిలకలూరిపేట మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బస్సు వద్ద హడావుడి చేశారు. నినాదాలు చేశారు. చంద్రబాబు విజయవాడ కోర్టుకు హాజరైనప్పుడు ఆయన కూడా తన లాయర్ పక్కన కూర్చున్న సంగతిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తదుపరి ఆయన కూడా లేచి నిలడ్డారు.ఆ సన్నివేశాలను ఎవరూ రికార్డు చేయలేదు. ఆరోగ్య సమస్యల పేరు చప్పి చంద్రబాబు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నప్పుడు కూడా వైసీపీ ఎక్కడా అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని, అది తమ సంస్కృతి అని పొన్నవోలు అన్నారు. కాని ప్రస్తుతం టీడీసీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక, ఆరోగ్య సమస్యలు ఏమయ్యాయో కాని రాత్రంతా గంటల తరబడి ర్యాలీ చేసి రాజమండ్రి నుంచి ఉండవల్లి కరకట్ట నివాసానికి చేరుకున్నారు. అప్పుడు ఈనాడు ‘‘జైలు నుంచి జనం గుండెల్లోకి’’ అని శీర్షిక పెట్టింది. దారి పొడవునా నీరా'జనాలు"అని రంకెలేసింది. చంద్రబాబుకు నిజంగా అన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే తెల్లవార్లూ ర్యాలీ చేయవచ్చా అని ప్రశ్నించలేదు. జగన్ హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రం ఇదే పత్రిక ‘‘జగన్ మార్కు బలప్రదర్శన’’ అని ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. ఆయన అనుచరులు హల్ చల్ చేశారట. అంతకు ముందు బందరు ప్రాంతానికి వెళ్లినప్పుడైతే ‘‘అడుగడుగునా అరాచకమే’’ అంటూ నీచమైన శీర్షిక పెట్టింది. హైవేపై గుమికూడదని పోలీసులు షరతు పెట్టడాన్ని కూడా సమర్థించి తన లేకి బుద్ది ప్రదర్శించుకుంది. చంద్రబాబు హైవేలపై ర్యాలీ తీసినప్పుడు, పుంగనూరు వంటి చోట్ల టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్ను దగ్ధం చేసినప్పుడు మాత్రం ఈ మీడియాకు ఎక్కడా తప్పు కనిపించలేదు. చంద్రబాబు కందుకూరులో రోడ్డు మధ్యలో మీటింగ్ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా అది పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేసింది. మరో పత్రిక ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ తన వికృతత్వాన్ని అంతా ప్రదర్శించి జగన్కు హైదరాబాద్లో ప్రజాస్పందనపై ఒక వ్యాసం రాసి అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబుపై అసలు కేసులే లేనట్లు, బెయిల్పై లేనట్లు ఆ విషయాలేవి ప్రస్తావించకుండా, జగన్ కేసులపైనే నీచాతినీచంగా రాసుకుని స్వామి భక్తి ప్రదర్శిస్తే, సోషల్ మీడియాలో పలువురు ఆయనను ఉతికి ఆరేశారు.అయినా వారేమి సిగ్గుపడే పరిస్థితి లేదనుకోండి. ఏది ఏమైనా టీడీపీ ఎంత ఘోరంగా మాట్లాడినా, వారికి బానిసత్వం చేసే ఎల్లో మీడియా ఎంతగా ఏడ్చి పెడబొబ్బలుపెట్టినా, జగన్కు దిష్టి తీసిన చందమేనని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
YS Jagan: పులివెందుల పర్యటన సూపర్ సక్సెస్
వైఎస్ జగన్ అంటే ఒక అభిమానం.. ఒక అనుబంధం.. ఒక బాధ్యత.. ఒక భరోసా. మొత్తంగా వెరిసి చూస్తే కష్టాల్లో ఉన్న ప్రతీ గుండెకి జగన్ ఒక నమ్మకం. జగన్పై ఉన్న ఆ నమ్మకమే ‘జన కెరటమై’ కేరింతలు కొడుతుంది. కష్టాల కన్నీటిలో ఉన్న ప్రజలకి జగన్ ఆప్యాయ పలకరింపు.. కొండంత ఆశగా మారుతంది.పులి వెందుల పర్యటన సూపర్ సక్సెస్జగన్ అంటే జన సునామీ. వైఎస్ జగన్ తలపెట్టిన పులివెందుల పర్యటన సూపర్ సక్సెస్తో ఈ విషయం మరోసారి రుజవైంది. వైఎస్ జగన్ మూడు రోజుల పులివెందుల పర్యటనలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల్ని కలుసుకున్నారు. దారి పొడవునా వైఎస్ జగన్కు అందిన ఫిర్యాదులతో పాటు మద్దతు ధర లేక అల్లాడిపోతున్న అరటి రైతుల్ని జగన్ పరామర్శించారు. వారి కష్టాలను ఫిర్యాదులను స్వీకరించారు. ఇక ప్రజాదర్బార్ పేరుతో కూడా పులివెందుల క్యాంప్ ఆఫీస్లో సమీక్షలు చేశారు. అయితే జగన్ ఎక్కడకి వెళ్లినా జనాభిమానం పోటెత్తుతంది. జై జగన్ నినాదాలతో హోరెత్తితుంది. ది. పులివెందుల పర్యటనతో జగన్ అనే నమ్మకం మాకు ఎప్పడూ అండగానే ఉంటుందనేది రుజువు అవుతూనే ఉంది కాబట్టే జై జగన్ నినాదంతో గ్రాండ్గా సంఘీభావం తెలిపారు అక్కడి ప్రజలు.దోపిడీనే నడుస్తుంది.. హామీల అమలు లేదుపులివెందుల అరటి రైతుల్ని పరామర్శించిన క్రమంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నాడు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.36 వేలు బాకీ. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నాడు. రూ.2 వేలు కట్ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, ఐదు లక్షలు కట్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈ రోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరనేందుకు ఈ లెక్కలే నిదర్శనం’ అని మండిపడ్డారు.ప్రజలతో కలిసి మరింతగా ఉద్యమిస్తాం చంద్రబాబూ ఇప్పటికైనా మారండి. ఇలాగే ఉంటూ రైతులను పట్టించుకోకపోతే.. విద్యార్థులు, ప్రజలను ఇలాగే కష్టాలపాలు చేస్తామంటే వారితో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో వీళ్లందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. చంద్రబాబును గద్దె దింపే కాలం త్వరలోనే వస్తుంది. దేవుడు కూడా మొట్టికాయలు వేస్తాడు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.కష్టమొచ్చిన ప్రతీ ఒక్కరి ధైర్యం జగన్..‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అనేది దివంగత ప్రియతమ నేత వైఎస్సార్ మాట. వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి కారణమైన చప్పుడే ‘ నేనున్నాను.. నేను విన్నాను’. మరి ‘ నేనున్నాను.. అండగా ఉంటాను.. అవసరమైతే అడ్డంగా నిలబడిపోతాను’ అనేది వైఎస్ జగన్ బాట. అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమాన్ని అందించి.. ప్రజల ఆలనా పాలనా చూసుకుని అండగా ఉన్నారు. ఇప్పుడు అదే ప్రజలకి కష్టమొచ్చింది అందుకే అవసరమైతే అడ్డంగా నిలబడిపోతాను అంటున్నారు వైఎస్ జగన్. మనకు ఏదైనా కష్టమొస్తే ఎవరైనా కనీసం మాట సాయం చేస్తే బాగుండు అనుకుంటాం. ఆ సమయంలో నేను ఉన్నాను.. అంతా నేను చూసుకుంటాను అనే ధైర్యం ఒకటి మన దగ్గరికొస్తే ఎలా ఉంటుఉంది. అది దేవుడు పంపించినట్లే అనుకుంటాం. ఇప్పుడు ఏపీ రాష్ట ప్రజలకు కష్టమొచ్చింది.. దాన్ని చూసుకోవడానికి జగన్ రూపంలో ఒక భరోసా లభించింది.జగన్ది ఒకటే మాట.. చెప్పానంటే చేస్తాను.. చేసేదే చెబుతాను అనేది ఆయన సూత్రం. మరి ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఏరుదాటాకా తెప్పతగలేసిన చందంగా మారిపోయింది. ఇప్పుడు జగన్ చేసేది పోరాటం.. అధికార పార్టీ కపట వైఖరిపై.అధికారంలో ఉన్నారు కాబట్టి.. కష్టాలు, నష్టాలు చవిచూస్తున్న ఏపీ ప్రజానీకాన్ని పట్టించుకోమనే వైఎస్ జగన్ పోరాడుతున్నారు. ప్రకృతి విపత్తలు వస్తే ప్రజల్ని పట్టించుకోరు.. రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికేమైనా భరోసా కల్పిస్తున్నారంటే అదీ లేదు. ఇలా ప్రతీదాంట్లోనే ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరునే జగన్ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఆదుకోవాల్సింది ప్రభుత్వమేనని.. దాన్ని తప్పించుకుని తిరుగుతున్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. నికార్సైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్నారు.ఎక్కడకేగినా.. ఎందు అడుగిడినా..జగన్ పర్యటనలకు జన సునామీ అనేది కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ కాదు. అది అందరికీ అనుభవమే వైఎస్ జగన్ చేసిన ఓదార్పు యాత్ర వద్ద నుంచి మొదలుకొని చూస్తే నేటి వరకూ ఆ ఆదరణ ఎక్కడా తగ్గలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్క వచ్చిన సందర్భంలో వైఎస్ జగన్కు జనం పోటెత్తారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ లేదు. అయినా జగన్ హైదరాబాద్కు వచ్చిన క్రమంలో ‘ జై జగన్ నినాదం’ హోరెత్తిపోయింది. అది చూసిన కొంతమంది కూడా ఓర్వలేనితనాన్ని ప్రదర్శించారు. ఏదో బూటకపు మాటలు చెప్పే యత్నం చేశారు. వారికి తెలియదేమో.. అభిమానం ఉంటే అభిమాన నాయకుడ్ని చూడటానికి ఇక్కడ ప్రాంతాలతో సంబంధం ఉండదనే విషయం. జగన్ వెళుతున్న పర్యటనలకు జనాన్ని కట్టడి చేయాలంటే అది కుదిరే పనికాదు. అభిమానం నోటికి తాళం వేయాలంటే కూడా అంతకంటే కదరదు. దటీజ్ జగన్.ఇదీ చదవండి:కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ -
ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం, దళారులతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టికొడుతున్నారు... సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
చంద్రబాబు తీరుతోనే మెడికల్ సీటు కోల్పోయా
సాక్షి కడప: చంద్రబాబు తీరు వల్లే తాను మెడికల్ సీటు కోల్పోయానని విద్యార్థిని పూజిత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తెచ్చారు. బుధవారం పులివెందులకు చెందిన నాగసుందరరెడ్డి, ఆయన కుమార్తె పూజితలు వెలమవారిపల్లె క్రాస్ వద్ద వైఎస్ జగన్ను కలిశారు. నీట్లో తన కుమార్తెకు 467 మార్కులు వచ్చాయని, రెండు మూడు మార్కుల తేడాతో తన కుమార్తె మెడికల్ సీట్ కోల్పోయిందని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెలాగా అనేక మంది వైద్య విద్య కోసం కష్టపడి చదివినా, బాబు తీరు వల్ల ఫలితం పొందలేకపోయా రన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. ఈ రెండు మెడికల్ కాలేజీలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే పూజిత లాంటి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లయ్యేవారన్నారు. తమ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి వైద్య విద్యను అందించే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. -
Ys Jagan: వెల్లువెత్తిన జనాభిమానం
సాక్షి కడప: కనుచూపు మేర కటౌట్లు.. బాణా సంచా వెలుగు జిలుగులు.. అడుగడుగునా పూల వర్షం.. బైకులకు పార్టీ జెండాలు.. జై జగన్ నినాదాలు.. వెరసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి, కోలుకున్న వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి (రాము)ని పరామర్శించడానికి బుధవారం వైఎస్ జగన్ వేల్పుల వెళుతుండగా అభిమానులు, ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.కాన్వాయ్ వెంట భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ వాహనం పైనుంచి.. నలువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తుండగా, వేల్పులలో అభిమానులు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపించారు. రోడ్డంతా పూలు పరిచి స్వాగతం పలికారు. మహిళలు కరచాలనం చేస్తూ వైఎస్ జగన్ను ఆహ్వానించారు.వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసిన ఆనందంలో ... అనంతరం రామలింగారెడ్డి ఇంట్లోకి వెళ్లిన వైఎస్ జగన్.. ఆయనతో చర్చించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముందు జరిగిన గొడవ గురించి మాట్లాడారు. రామలింగారెడ్డి తల్లి పార్వతమ్మ.. ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లింగాల ఉషారాణిలతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత తిరిగి పులివెందులకు వచ్చే క్రమంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరుకుని అభివాదం చేశారు.విద్యార్థుల కోసం ఓ సెల్ఫీ పలు చోట్ల అభిమానుల తాకిడికి కాన్వాయ్ ఆపి.. వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో పది కిలోమీటర్ల దూరంలోని పులివెందులకు రావడానికి పది నిమిషాలకు బదులు ఒకటిన్నర గంటల సమయం పట్టింది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. సెల్ఫీలు దిగుతూ మమేకమయ్యారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్ జగన్ను కలిశారు. చిన్నారికి సెల్ఫీ- పులివెందుల క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలకు నమస్కరిస్తున్న వైఎస్ జగన్ వైఎస్ జగన్ను చూసి చిన్నారుల కేరింతలు వేల్పులలో భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ జగన్ను చూసిన ఆనందంలో విద్యార్థులు -
రైతుల పరిస్థితి అగమ్యగోచరం
ప్రజలకు, రైతులకు నష్టం జరుగుతోందంటే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే. వెంటనే ఏకంగా 10 వేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడానంటాడు. అన్నీ చేసేస్తాం అంటాడు. కానీ, ఏదీ చేయడు. క్వింటా ఉల్లి రూ.1,200కు కొంటామన్నారు. ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్కు రూ.50 వేలు ఇస్తా మన్నారు.అదీ లేదు. ఇదీ లేదు.. ఏదీ లేదు. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్షన్. ఏదో ఒక అంశం తెరపైకి తెస్తారు. దాన్ని ఎల్లో మీడియాలో ఊదరగొడతారు. అలా వాటి నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి రైతుల పరిస్థితి బస్టాండ్ అన్నట్లు తయారైంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి కడప: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, అరటి రైతుల పరిస్థితి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులన్నా, వ్యవసాయ రంగం అన్నా ప్రేమ లేదని.. ఈ 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినా కనీస సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు బుధవారం ఆయన పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. కిలో అరటికి చివరకు 50 పైసలు కూడా రాకపోవడంతో, తోటల్లో అలాగే వదిలేస్తున్నామని, పశువులకు వేస్తున్నామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని వాపోయారు. రైతుల బాధలు ఓపికగా విన్న వైఎస్ జగన్.. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇకనైనా సీఎం చంద్రబాబు మారకపోతే, రాబోయే రోజుల్లో అందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కరెంటు ఖర్చవుతుందని వినియోగంలోకి తీసుకు రారా? ⇒ఈ ప్రాంతంలో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ను 2024 మార్చిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాను. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలైంది. కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని స్టోరేజ్ను నడపడం లేదు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? చంద్రబాబు రైతులను ఏ విధంగా పట్టించుకుంటున్నాడో చెప్పేందుకు ఈ కోల్డ్ స్టోరేజీయే నిదర్శనం.వైఎస్సార్ కడప జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, వ్యవసాయ రంగం పరిస్థితి తిరోగమనమే. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో రైతులు చాలా నష్టపోయారు. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, వారికి చంద్రబాబు ఇచ్చింది గుండు సున్నా.⇒మొన్నటి మోంథా తుపాను నష్టాన్ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. దాదాపు రూ.1,100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతూ, రైతుల హక్కు అయిన, ఉచిత పంటల బీమా ఇవ్వకుండా, వారి హక్కులు కాలరాశారు. ఈ–క్రాప్ కూడా చేయడం లేదు.⇒రైతు ఏ పరిస్థితుల్లోనూ కష్టపడకూడదు.. వారికి అగచాట్లు రాకూడదని తపన పడిన ప్రభుత్వం మాది. మా ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ చేసి 84 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించాం. ఆ విధంగా దాదాపు రూ.7,400 కోట్లు అందించాం. ఈ రోజు రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే, కేవలం 18 లక్షల మంది రైతులకు పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాథుడే లేడు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. హక్కు అయిన ఉచిత పంటల బీమా లేదు. చంద్రబాబు వచ్చాక, ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఉంది. ⇒మరోవైపు పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. వారికి పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. నాడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా ఇచ్చాం. ఏ ఏడాది కూడా ఎగ్గొట్టలేదు. ఈ పెద్దమనిషి చంద్రబాబు రైతు భరోసా ఎగ్గొట్టి, అన్నదాతా సుఖీభవ అన్నాడు. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు ఇచ్చి, మిగిలింది ఎగ్గొట్టాడు.నాడు రూ.32 వేలు.. నేడు రూ.2 వేలుమా ప్రభుత్వ హయాంలో అరటి టన్ను సగటు ధర రూ.25 వేలు కాగా, గరిష్టంగా రూ.32 వేల వరకు పోయింది. అదే ఈ రోజు కనీసం రూ.2 వేలకు కూడా కొనడం లేదు. దీంతో పంట మొత్తం చెట్ల మీదే కుళ్లిపోతోంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతి కోసం అనంతపురం నుంచి ఢిల్లీకి రైళ్లు నడిపాం. అరటితో పాటు, ఉద్యాన పంటలు కూడా వాటిలో ఎగుమతి చేశాం. చివరకు బనగానపల్లి నుంచి గువాహటి వరకు రైళ్లు నడిచాయి.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ⇒దళారీలతో చంద్రబాబు కుమ్మక్కై, రైతుల బతుకులు అగమ్య గోచరంగా మార్చాడు. అందుకే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట తీసుకున్నా దేనికీ గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది కూడా ధాన్యంతో సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు.⇒గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసేవాళ్లం. ఆర్బీకేల్లో ఆ వివరాలు ప్రదర్శించే వాళ్లం. సీఎం–యాప్ ఉండేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, వెంటనే జేసీ అప్రమత్తమై, జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవారు. అలా రూ.7,746 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. అందుకే ఈ రోజు పరిస్థితిని గమనించమని కోరుతున్నాను. హామీలన్నీ గాలికి.. అంతటా దోపిడీ ⇒సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నాడు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.36 వేలు బాకీ. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నాడు. రూ.2 వేలు కట్ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, ఐదు లక్షలు కట్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈ రోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరనేందుకు ఈ లెక్కలే నిదర్శనం.⇒ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారు. కొత్త మెడికల్ కాలేజీలను శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తున్నారు. ఇసుక, సిలికా, క్వార్ట్జ్.. దేన్నీ వదలకుండా అన్ని వనరులు, గనులను దోచేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తూ అక్కడా యథేచ్ఛగా దోచుకుంటున్నారు.ప్రజలతో కలిసి మరింతగా ఉద్యమిస్తాం చంద్రబాబూ ఇప్పటికైనా మారండి. ఇలాగే ఉంటూ రైతులను పట్టించుకోకపోతే.. విద్యార్థులు, ప్రజలను ఇలాగే కష్టాలపాలు చేస్తామంటే వారితో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో వీళ్లందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. చంద్రబాబును గద్దె దింపే కాలం త్వరలోనే వస్తుంది. దేవుడు కూడా మొట్టికాయలు వేస్తాడు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.అనంతరం ఒక రైతు మాట్లాడుతూ ‘అయ్యా.. చంద్రబాబు గారూ.. మీరు వ్యవసాయం దండగ అంటున్నారు కదా.. మీరు ఏం తిని బతుకుతున్నారు? ఇనుప ముక్కలు తిని బతుకుతున్నారా? రైతులు ఒక్కసారి పంటలు వేయకపోతే.. ప్రజలు ఏం తింటారు? వారికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పిల్లలకూ తప్పని కష్టాలుఫీజు రీయింబర్స్మెంట్ కోసం పిల్లలతో కలిసి పోరాడుతున్నాం. డిసెంబర్ వస్తే 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటాయి. ఒక్కో క్వార్టర్కు దాదాపు రూ.700 కోట్లు. అంటే ఏకంగా రూ.5,600 కోట్లు బకాయిలు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయిలు. మరో రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ఏటా ఏప్రిల్లో రూ.1,100 కోట్ల చొప్పున ఇవ్వాలి. అదీ ఇవ్వడం లేదు. దీంతో రెండూ కలిపి రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కూడా రాలేదునాకున్న ఆరు ఎకరాల భూమిలో దాదాపు రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి అరటి పంటను సాగు చేశాను. ఎరువులు, మందులు వాడటంతో పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. కాయ కూడా నాణ్యంగా ఉంది. అయితే మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేయడం లేదు. దీంతో తోటలోనే పండ్లు మాగి కింద పడిపోతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాను. పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అరటి రైతులను ఆదుకోవాలి.– శ్రీనివాసరెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందులఅరటి పంటను అడిగే నాథుడే లేడు ఎంతో కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి అరటి పంట సాగు చేసి మంచి దిగుబడి వచ్చిందన్న సమయంలో కొనుగోలు చేసే నాథుడే లేడు. అరటి చెట్లకే పండ్లు మాగి కిందపడిపోతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి రూ.32 వేల వరకు టన్ను అరటి కాయల ధర పలికింది. ప్రస్తుతం టన్ను రూ.2 వేలకు అమ్ముదామన్నా కొనే వారు లేరు. ప్రభుత్వం రైతులను పట్టించుకొని అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే రైతుల వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం దారుణం.– రామతులశమ్మ, బ్రాహ్మణపల్లి, పులివెందులపంటను దున్నేయాల్సిన దుస్థితిచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో అరటి పంటకు మంచి ధరలు ఉన్నాయని ఆశించి ఈ ఏడాది భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేశాం. తీరా పంట దిగుబడి వచ్చి మార్కెట్లో అమ్ముదామనుకున్న సమయంలో వ్యాపారులు, ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు స్పందించడం లేదు. దీంతో అరటి కాయలు చెట్లకే మాగిపోతున్నాయి. అరటి పంటను ట్రాక్టర్లతో దున్నుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా అరటి రైతుల సమస్యలను గుర్తించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.– రామచంద్రారెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందులఏ పంటకూ గిట్టుబాటు ధర లేదుఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తే, తీరా పంట దిగుబడి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక తల్లిడిల్లిపోతున్నాం. నేను, నా స్నేహితుడు ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి, టమాట పంటలను సాగు చేశాం. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడులు పెట్టాం. కనీసం ఒక్కరూపాయి కూడా మాకు డబ్బు రాలేదు. టమాట పంటను అమ్మడానికి మార్కెట్కు పోతే కొనేనాథుడు లేక మార్కెట్ వద్ద పారబోశాను. ఆటో బాడుగ కూడా చేతి నుంచి పడింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.– బాబురెడ్డి, ఇనగలూరు, తొండూరు మండలం -
వైఎస్ జగన్ వద్ద వైద్య విద్యార్థిని ఆవేదన
పులివెందుల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా పలువురు కలిసి తమ సమస్యలు, కష్టాలు చెప్పుకున్నారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము ఎలా నష్టపోయామన్నది వైద్య విద్యార్థిని, ఘామె తండ్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.పులివెందులకు చెందిన నాగసుందర రెడ్డి తన కుమార్తె పూజితతో కలిసివచ్చి వెలమవారిపల్లె క్రాస్ వద్ద వైఎస్ జగన్ను కలిశారు. పూజితకు నీట్లో 467 మార్కులు వచ్చాయని, రెండు మూడు మార్కుల తేడాతో తన కుమార్తె మెడికల్ సీట్ కోల్పోయిందని పూజిత తండ్రి నాగసుందర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెలాగా అనేక మంది వైద్య విద్య కోసం కష్టపడి చదివినా మెడికల్ సీట్లు పొందలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైఎస్ జగన్ అన్నారు. ఈ రెండు మెడికల్ కాలేజీలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే పూజితా లాంటి విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లయ్యేవారన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేసి వైద్య విద్యను అందించే ప్రయత్నాన్ని కూటమి నాయకులు దూరం చేయడం దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వారికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: జగనన్న వస్తున్నాడంటే.. మీకు భయం! -
రామలింగారెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడిన వైఎస్.జగన్
-
చంద్రబాబు హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి చేరాయి: YS జగన్
-
YS Jagan: కరోనా సమయంలోనూ రైతులకు ఆదుకున్నాం..
-
వెళ్తూ వెళ్తూ బాబుపై జగన్ అదిరిపోయే లాస్ట్ పంచ్
-
Kadapa Tour: చంద్రబాబుపై జగన్ పంచులు..
-
YS Jagan: చంద్రబాబు ఉ కొట్టడం ABN, TV5 లు డప్పులు
-
అరటి రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
-
నువ్వసలు మనిషివేనా? రైతుల ఉసురు కొట్టుకొని పోతావ్!
-
అయ్యా చంద్రబాబూ.. ఇనుప ముక్కలు తిని బతుకుతున్నావా?
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నోరు తెరిస్తే వ్యవసాయం దండుగ అంటున్న సీఎం చంద్రబాబు నాయుడికి ఓ రైతు సూటి ప్రశ్నలతో చురకలు అంటించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి బ్రహ్మణపల్లి పర్యటనలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు ఉత్సాహం గమనించిన వైఎస్ జగన్ మీడియా ముందు మాట్లాడాలని కోరారు.‘‘అయ్యా చంద్రబాబూ.. మాట్లాడితే వ్యవసాయం దండగ, వ్యవసాయం దండగ అంటున్నావ్ కదా. నువ్వేమైనా ఇనుప ముక్కలు తిని బతుకుతున్నావా?. రైతులంతా కన్నెర్ర చేస్తే ఏం తిని బతుకుతావ్?. దేశానికి రక్షణ ఎంత అవసరమో.. రైతు కూడా అంతే ముఖ్యం. పసిపిల్ల పాల దగ్గరి నుంచి ప్రతీది రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అలాంటిది.. రైతును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావ్?’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బ్రాహ్మణపల్లి అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన (ఫొటోలు)
-
నెంబర్ 1గా ఉన్న ఏపీ ఈ పరిస్థితికి దిగజారింది: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని.. అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పులివెందుల బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించిన ఆయన.. రైతుల నుంచి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘‘మా హయాంలో అరటి పంట టన్ను రూ.30 వేలకు పలికింది. 3 లక్షల టన్నుల పంటను ఎక్స్పోర్ట్ చేశాం(కరోనా టైంలోనూ పంట ఉత్పత్తితో లాభాలతో మీసం మెలేశామని కొందరు రైతులు చెప్పడం గమనార్హం). అరటి ఎక్స్పోర్ట్ కోసం అనంతపురం-ఢిల్లీ, తాడిపత్రి-ముంబైకి రైళ్లు నడిపాం. కేంద్రం నుంచి అవార్డులు తీసుకున్నాం. కానీ, ఇప్పుడు ఆ ఊసే లేదు. టన్ను రూ.2 వేలకు కూడా కొనేవాడు లేడు. పంట చెట్టు మీదే మాగిపోతోంది. నెంబర్ వన్లో ఉన్న రాష్ట్రం ఈ పరిస్థితికి ఎందుకు దిగజారింది?.. కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. ఈ 17 నెలల కాలంలో 16 విపత్తులొచ్చాయి. కానీ, రైతులకు కనీస సాయం కూడా అందలేదు. గతంలో మా హయాంలో సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్లం. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటిదాకా ఇన్పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘‘వ్యవసాయమే దండగ అని చంద్రబాబు నమ్ముతున్నారు. అన్నదాత సుఖీభవ కింద రూ.40 వేలు ఇస్తామని.. రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదు. ఆఖరికి ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకుగానూ ఆయనకు తప్పకుండా రైతుల ఉసురు తలుగుతుందన్నారు. కూటమి సర్కార్ బంగాళాఖాతంలో కలిసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని జగన్ ధ్వజమెత్తారు. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ను విద్యుత్ ఆదా పేరిట మూసివేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కోల్డ్స్టోరేజ్లు కూడా వాడుకోవడం లేదని అన్నారు. వైస్సార్సీపీ హయాంలో వ్యవసాయం అనేది ఒక పండుగలా జరిగిందని.. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రంగం తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు. -
అంబేద్కర్ చిత్రపటానికి జగన్ నివాళులు
-
Watch Live: అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ
-
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
-
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. వధూవరులకు ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో దారి పొడవునా.. వివాహ వేదిక వద్ద ఆయన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆయన్ని ఫొటోలు తీసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. మున్సిపాలిటీ 23వ వార్డు ఇంఛార్జి, వైఎస్సార్సీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు సాయికిరణ్, వినీతలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారాయన. -
రాజ్యాంగ విలువలు కాపాడుకోవడమే అంబేద్కర్కు ఉత్తమ నివాళి
సాక్షి, తాడేపల్లి/వైఎస్సార్ జిల్లా: రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకుని రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం నివాళులర్పించారు. ‘‘76 ఏళ్ల క్రితం డాక్టర్ అంబేద్కర్ మనకు స్వేచ్ఛ, సమానతల కూడిన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రోజు ఆయనకు ఇవ్వగలిగే ఉత్తమ నివాళి ఆ విలువలను కాపాడుకోవడమే. మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. 76 years ago, Dr. Ambedkar gave us a Constitution rooted in Liberty and Equality. Today, the best tribute we can offer is to safeguard those values. Let us make sure that our democracy is fearless and transparent.#ConstitutionDay pic.twitter.com/Ny27Xgu0A7— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2025మరోవైపు.. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ప్రజాదర్బార్
వైఎస్సార్ కడపలో కొనసాగుతోన్న వైఎస్ జగన్ రెండోరోజు పర్యటనపర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో వివాహ కార్యక్రమానికి హాజరుఅనంతరం బ్రాహ్మణపల్లె అరటి తోటల పరిశీలన, రైతులతో మాట్లాడటంపులివెందులలో లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శవేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాస సందర్శనసాయంత్రం 7 గంటల వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్రాత్రి పులివెందులలోనే బసగురువారం ఉదయం 8 గంటలకు తిరుగు ప్రయాణం -
నేనున్నానని..!
సాక్షి కడప: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రధానంగా కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల వెతలు వింటూ నేనున్నానని.. మీకేం కాదని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ముందుకు పోవడమే ఆలస్యమని.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, మంచి కాలం ముందు ఉందంటూ వివరించారు. ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి బాధలు విన్న ఆయన అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. కొన్నింటికి సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో మాట్లాడుతూ మార్గం చూపారు. కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. తర్వాత కూడా ఇంటి వద్ద వేచి ఉన్న ముఖ్యమైన నాయకులతోనూ చర్చించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. తెలిసిన ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాకుండా కష్ట, సుఖాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నానని.. ఏదైనా సమస్యలున్నా పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కొంతమంది దివ్యాంగులు, యువత ఆయనను అభిమానంగా వచ్చి కలుసుకున్నారు. వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూనే మరోవైపు ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడుతూ వచ్చారు. దివ్యాంగురాలితో ఆప్యాయంగా వైఎస్ జగన్ గిట్టుబాటు లేదు.. ధర రాదు.. పులివెందుల నియోజకవర్గానికి చెందిన రైతు శంకర్తో పాటు మరికొంతమంది వివిధ పంటలు సాగు చేసిన రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ప్రస్తుతం అరటి పంటతోపాటు ఇతర అనేక రకాల పంటలకు గిట్టుబాటు ధర లేదు.. బయట మార్కెట్లో ధర రాదు.. పండించిన పంటను ఎలా అమ్ముకోవాలి, ప్రస్తుత చంద్రబాబు సర్కార్లో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని.. వారు వైఎస్ జగన్కు వివరించారు. అలాగే మీ ప్రభుత్వంలో రైతులు పండించే పంటలకు మంచి గిట్టుబాటు ధర ఉండేదని, సకాలంలో పెట్టుబడి సాయం, ఇన్సూరెన్స్, పరిహారాలు అందుతుండటంతో రైతులు సుభిక్షంగా ఉండేవారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులు కష్టాలు కడగండ్లతో కాలం వెల్లదీస్తున్నారని, ప్రభుత్వం మొద్దునిద్ర వీడేలా రైతుల తరపున అండగా ఉండాలని కోరారు. ప్రజల వినతులు పరిశీలిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పక్కన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కార్యాలయం వద్ద జనమే జనం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న జనాలు భారీగా తరలి వచ్చారు. పార్టీ అభిమానులు, క్యాడర్తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఒక దశలో పోలీసులకు కూడా అదుపు చేయడం కష్టంగా మారింది. కార్యాలయ ప్రాంగణమంతా జగన్ను చూసేందుకు వచ్చిన అభిమానులతో పోటెత్తింది. వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తింది. జగన్ను చూడగానే ఉప్పొంగిన అభిమానంతో జై జగన్ నినాదాలతోపాటు సీఎం, సీఎం అంటూ నినదించారు. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి చర్చించారు. ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాయచోటి, రైల్వేకోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సు«దీర్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, కదిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జి మగ్బూల్ బాషా, వైఎస్సార్సీపీ నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి చవ్వా దుష్యంత్రెడ్డిలతోపాటు వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. అలాగే విజయవాడ, నల్గొండ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నాయకులు కలిశారు. -
కేసులు పెట్టినా జగన్ వెంటే.. జనం రావడానికి కారణం అదే
-
వైఎస్ జగన్ ప్రజాదర్బార్
-
జగన్ పులివెందుల పర్యటన.. రెండో రోజు షెడ్యూల్
-
చంద్రన్న దిగిపోవాలి.. జగనన్న రావాలి
వ్యవసాయం వద్దంటారు.. సేద్యం ముద్దంటారు. యూరియా వేస్తె క్యాన్సర్.. వరి వేస్తె షుగర్. ఓటుకు ముందోమాట.. గెలిచాక ఇంకోమాట.. ప్రపంచంలో మొత్తం. ఊసరవెల్లులు ఎన్ని రంగులు మారుస్తాయో చెప్పలేం కానీ రాజకీయ ఊసరవెల్లి చంద్రబాబు మాత్రం పూటకోమాట మారుస్తారు. రైతులతో అవసరం ఉంటే ఒకమాట.. గెలిచేందుకు వారి సాయం కావాలంటే ఒకమాట.. గెలిచాక ఇంకో మాట.. సేద్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో ఇంకోమాట.. పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేనప్పుడు .. ప్రజలకు మొహం చూపలేని పరిస్థితుల్లో ఇంకోమాట.. రైతుల పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో వారికి సమాధానం ఇవ్వలేని తరుణంలో ఇంకోమాట.. ఇలా గంటగంటకూ మాటలు మారుస్తూ మాయలు చేసే చంద్రబాబు పాలనలో రైతులు నిలువునా మునిగిపోయారు. చేలకు పురుగుపడితే ఏదో మందు కొట్టి ఆపొచ్చు.. కానీ ప్రభుత్వమే పురుగులా మరి వ్యవసాయాన్ని తొలిచేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. .. కాపుగాయాల్సినవాళ్ళే కాల్చేస్తుంటే రైతు ఎవరికీ చెప్పుకుంటాడు.. యేమని చెప్పుకుంటాడు. వ్యవసాయం.. పంటలసాగుపై చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు..ప్రాజెక్టులు కడితే డబ్బులు దండగ.. ఐటీని ప్రమోట్ చేయాలి..వ్యవసాయం దండగ..వరి పండిచొద్దు.. బియ్యం తింటే డయాబెటిస్ వస్తుంది..ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి..యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది..ఎరువుల వినియోగం తగ్గించాలి.. దీని వల్ల భూసారం తగ్గుతోంది.. చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు, ఉండబోదు( మాట తడబాటు )..వ్యవసాయంలో ఉపాధి లేదు.. సేవా రంగమే భేష్వ్యవసాయం వల్ల ఆదాయం అంతంత మాత్రమే..1995-2004 (మొదటి ముఖ్యమంత్రి కాలం) వ్యవసాయం "భారం" (దండగ/శిక్ష) అని పేర్కొన్నారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. తన పాలనలో రైతులను ప్రాధాన్యత ఇవ్వలేదని తర్వాత (2012) అంగీకరించారు. రైతులకు 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లు కూడా చేయలేదు. 1999లో రైతుల ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వడం వల్ల మరిన్ని ఆత్మహత్యలు పెరుగుతాయని చంద్రబాబు కామెంట్ చేసారు. తన పుస్తకం మనసులో మాటలో (Manasulo Maata) ఈ వ్యాఖ్య ఉంది. 1995-2004 మధ్య 25,000 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలున్నాయి. 2012, జనవరి 21 నెల్లూరు, కందుకూరులో TDP సభలో మాట్లాడిన చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో రైతులను "విస్మరించాను, తప్పు చేశాను" అని క్షమాపణ చెప్పారు..తిరిగి.. 2014, డిసెంబర్ 24న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు కేవలం కరువు కారణంగా కాదు, "ప్రేమ విషాదం, రుణాలు, కుటుంబ సమస్యలు" కారణం అన్నారు.. ఇది తీవ్ర విమర్శలకు కారణమైంది. 2025, సెప్టెంబర్ 15-16 న కేబినెట్ సమావేశంలో యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమయంలో యూరియా లభించక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో తన చేతగాని తనాన్ని తప్పించుకోవడానికి ఇలా మాట్లాడారు. 2025, నవంబర్ 12-13న "నీళ్లు ఉన్నందుకే వరి పండిస్తే, ఎవరూ మీ వరిని తినరు" అని చంద్రబాబు చెప్పారు. వరి పంటలకు బదులు ఇతర పంటలు పండించాలని సూచించారు.పైవన్నీ చంద్రబాబు నోటినుంచి వెలువడిన ముత్యాల మాటాలు కొన్ని మచ్చుకు. ఇక ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గెలిచాక మొక్కజొన్న, మామిడి.. అరటి.. పొగాకు.. మిర్చి రైతులు నిట్టనిలువునా మునిగిపోయారు. పండిద్దాం అంటే ఎరువులు దొరకవు.. పంటలు పండించాక అమ్ముదాం అంటే ధర దక్కదు.. ఆనాడు మామిడి రైతులు కిలో ఐదారు రూపాయలకు సైతం అమ్ముకోలేక వీధుల్లో పళ్ళను పారబోశారు.. నేడు అరటి రైతులు గెలలను పశువులకు వేస్తున్నారు.. అవి కూడా సయించక తినకపోవడంతో కొందరు రైతులు ఏకంగా అరటి తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం సాగదు .. రైతు ఏడ్చిన రాష్టం ముందుకు నడవదు అనే సామెత ఏపీలో అక్షరాలా నిజమవుతోంది. నేడు కిలో అరటి కాయలు అర్ధరూపాయికి అమ్మాలంటే కన్నీళ్లొస్తున్నాయంటూ రైతులు పొలం గట్టున కూర్చుని ఏడుస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కూడా అకాల వర్షాలకు అరటి పంటను నష్టపోయిన దాదాపు 670 మంది రైతులకు వైయస్ జగన్ హెక్టారుకు రూ. 20 వేలు చొప్పున సొంత డబ్బులు అందించి వారిని నిలబెట్టారు.. నాయకుడికి నయవంచకుడికి ఉన్న తేడాను వైఎస్ జగన్ తన మంచి మనసుతో చాటుకున్నారు.. ప్రజలకు కష్టం వస్తే జగనన్న.. ఆపద వస్తే జగనన్న.. కన్నీరొస్తే తుడవడానికి జగనన్న ఉండాలి.. ఆయనే రావాలి.. అదీ ప్రజల ప్రస్తుత పరిస్థితి..:::సిమ్మాదిరప్పన్న -
పులివెందుల: అరటి రైతుల కష్టాలు విన్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో భాగంగా.. బ్రహ్మణపల్లి అరటి రైతులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కలిశారు. వైఎస్ జగన్కు రైతులు ఆకుపచ్చ కండువా కప్పి తోటల పరిశీలనకు ఆహ్వానించారు. సాగు నష్టాన్ని స్వయంగా వైఎస్ జగన్ పరిశీలిస్తూ.. వాళ్ల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.ఎకరానికి లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. రెట్టింపు నష్టాలు వాటిల్లుతున్నాయని పలువురు రైతులు ఆయన వద్ద వాపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ హయాంలో అరటి రైతుల కోసం రూ. 20.15 కోట్లతో ఈ భవనాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 32 టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేక టబ్లో అరటి కాయలను శుభ్రపరిచే యూనిట్తో పాటు 45 కిలోవాట్ల కూలింగ్ ఛాంబర్, 30.6 కిలోవాట్ల కోల్డ్ స్టోరేజ్, ఆరు కూలింగ్ సెల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్లలో తగిన ధర లభించే వరకు రైతులు అరటి, నారింజ పండ్లను 40 రోజుల పాటు నిల్వ చేసుకునే కెపాసిటితో నిర్మించారు. అలాగే.. ప్లాంట్ ఆవరణలో 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వే బ్రిడ్జ్ నిర్మించారు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుర్మార్గంగా దీనిని మూసేయించింది. ఇదీ చదవండి: బాబు పాలనలో గిల‘గెల’! -
వైఎస్సార్సీపీపై కక్ష సాధింపే టీడీపీ కూటమి టార్గెట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీపై కక్షసాధింపే టీడీపీ కూటమి సర్కారు టార్గెట్ అని, ఆ నినాదాన్ని భుజానికెత్తుకుని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆరి్డనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్మెంట్స్తో కాన్సిపిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. అందులో నుంచి వచ్చినవే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి , పరకామణి, లిక్కర్ వంటి కేసులు అని వెల్లడించారు. ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం.. ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం.. వాటి ఆధారంగా టార్గెట్ లిస్ట్లో ఉన్న వారిపై కేసులు పెడుతూ, వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని.. అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీ అని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. నెయ్యిపై ఏ ఆధారాలతో సిట్ విచారణ?..2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్ చేసే వాళ్లం. కానీ, ఏనాడూ మేము కక్షపూరితంగా వ్యవహరించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంటూ, ఏ ఆధారాలతో సిట్ ద్వారా విచారణ చేయిస్తుందో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేస్తున్న సిట్, 2014–19 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపైనా విచారణ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. 2019 –24 మధ్య కేజీ నెయ్యి రూ.320 చొప్పున సేకరిస్తేనే కల్తీ అన్న నాయకులు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.270కే సేకరించినప్పుడు కల్తీ జరిగినట్లు కాదా? ప్రభుత్వాలు మారినా టీటీడీలో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవస్థల ప్రకారమే టెండర్ల నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ జరుగుతుంది. పరకామణి చోరీ అంటూ కేసు పెట్టి, వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించే ఉద్దేశంతోనే విచారణ పేరుతో ఏవీఎస్వో సతీష్ కుమార్ను సిట్ వేధించింది. ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మేం మాట్లాడితే.. ఆధారాలు లేకుండానే హత్యగా ప్రచారం చేసిందే కాకుండా వైఎస్సార్సీపీ నాయకులే చంపించారని మాపై బురదజల్లారు.రిజెక్ట్ చేసిన నెయ్యిని ఎలా వాడారు?..‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలైలో క్వాలిటీ చెక్ తర్వాత నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి వెనక్కి పంపారని చెబుతున్నారు. వెనక్కి పంపిన నెయ్యిని తిరిగి తీసుకొస్తే వాడినట్టు సిట్ రిపోర్టులో ఉంది. అలాంటప్పుడు రిజెక్ట్ చేసిన నెయ్యినే కూటమి ప్రభుత్వంలో ఎలా వాడారు? టీడీపీ హయాంలో జరిగిన తప్పునకు చంద్రబాబు బాధ్యత తీసుకోరా? లిక్కర్ కేసులో ఇన్నాళ్లుగా విచారణ చేస్తున్న ప్రభుత్వం ఏం సాధించినట్టు? న్యాయస్థానాల దగ్గర విచారణ పేరుతో మా నాయకులను అదుపులోకి తీసుకుని నెలల తరబడి జైలుపాలు చేశారు.’’ అని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.ఎస్ బ్యాంకులో టీటీడీ నిధుల జమ నియమాలకు విరుద్ధం కాదా?‘‘ప్రైవేట్ బ్యాంకులో 10 శాతానికి మించి టీటీడీ నిధులు డిపాజిట్ చేయకూడదనే నిబంధన ఉంది. కానీ టీటీడీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో రూ.1300 కోట్లకు పైగా జమ చేశారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక దాన్ని జాతీయ బ్యాంకుల్లోకి మార్చారు. ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన దానికి చంద్రబాబే కారణమని మేం ఆరోపించామా? కుట్ర రాజకీయాలు చేశామా?’’ అని సజ్జల ప్రశ్నించారు. లాయర్కు రూ.8 కోట్ల ఫీజు!‘‘చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వాదించిన లాయర్ సిద్దార్థ లూథ్రాని తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మీద బనాయించిన అక్రమ కేసులన్నీ ఆయనకే అప్పజెప్పారు. ఈ కేసులకు ఆయనకు ఇప్పటి వరకు రూ.8 కోట్లకు పైగా జనం సొమ్మును ఫీజు కింద చెల్లించారు’’ అని సజ్జల విమర్శించారు. కేసుల క్లోజర్ కుట్ర!‘‘సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో కేసులు క్లోజ్ చేయించుకునే కుట్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతోపాటు, బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు కేసులను మాఫీ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బాబుపై ఉన్న అన్ని కేసులూ మళ్లీ బయటకు తీస్తాం.’’ అని రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.ఎందుకంత కడుపు మంట?‘‘తెలంగాణలో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి. వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. 2014 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్సార్సీపీకి 7శాతం ఓట్లు వచ్చాయి. అయినా తెలంగాణ రాజకీయాలు వద్దనుకుని వచ్చిన మాకు బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్కు జనాదరణ పెరుగుతుంటే టీడీపీ, ఎల్లోవీుడియాకు ఎందుకంత కడుపుమంట?’’ అని సజ్జల ప్రశ్నించారు.కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన‘‘వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచి్చన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భారీగా పాల్గొని సర్కారుపై గళమెత్తుతున్నారు. కోటి సంతకాల సేకరణ గొప్ప ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోతుంది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఒక్క ఇల్లు కట్టించకపోయినా క్రెడిట్ చోరీ..‘‘వైఎస్సార్సీపీ హయాంలో పూర్తి చేసిన 3 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వంలో ఇచ్చినట్టు చెప్పుకోవడం దారుణం. పేదల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే..‘‘చంద్రబాబు తల్లి అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే. లోకేశ్ పక్కనే ఉన్నారు కాబట్టి ఆ కథనే చాగంటి మరో రకంగా చెప్పారు. గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి అదానీ పేరెత్తితే వైఎస్ జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు కిక్కురుమనడం లేదు. విశాఖలో అనామక కంపెనీలకు బాబు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. అదే హెరిటేజ్ ఆస్తులైతే అంత తక్కువ ధరకు ఇస్తారా?’’ అని సజ్జల నిలదీశారు. -
బాబు పాలనలో దారుణంగా పతనమైన అరటి ధరలు
సాక్షి, అమరావతి: అరటి రైతు ఆక్రందన.. అరణ్యరోదనగా మారింది. ఓ పక్క చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పాతాళానికి దిగజారిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ముందెన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్న అరటి రైతును ఆదుకునేందుకు కనీస చర్యలూ తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇలాంటి విపత్తు వేళ నిజంగా రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి, మానవత్వం పాలకుల్లో ఉంటే యుద్ధ ప్రాతిపదికన స్వయంగా రంగంలోకి దిగాలి. అన్నదాతకు అండగా నిలవాలి. ఆపన్న హస్తం అందించాలి. తక్షణమే జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ఉన్న అరటిని కొనుగోలు చేసి ప్రభుత్వమే స్వయంగా మార్కెటింగ్ చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొక్కుబడి సమీక్షలు, కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది తప్ప రైతులను ఆదుకునే దిశగా ఒక్క అడుగూ ముందుకేసిన పాపాన పోలేదు. మిరప.. పొగాకు.. మామిడి.. ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతోనూ బాబు సర్కారు చెలగాటమాడుతోంది. టన్ను రూ.1,000కు దిగజారిన ధర..రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్సార్ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకుపైగా సాగవుతోంది. ఇక్కడ మాత్రమే సాగయ్యే జీ–9 వెరైటీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. ఇది పూర్తిగా ఎక్స్ పోర్ట్ క్వాలిటీ. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులవుతున్నాయి. దాదాపు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తున్నా యి. టిష్యూకల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు అనంతపురం, నంద్యాల జిల్లాలలో డిసెంబర్ నుంచి మార్చి వరకు, వైఎస్సార్ కడప నుంచి జనవరి నుంచి మే వరకు కొనసాగుతుంది. రెండో పంట పిలకల ద్వారా వచ్చే పంట (రెండో పంట) జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. 2023–24లో టన్ను రూ.30వేలకు పైగా పలికింది. అలాంటిది చంద్రబాబు సర్కారు అసమర్థ విధానాల వల్ల ప్రస్తుతం టన్ను రూ.1,000 పలకడం గగనమైపోయింది.సంక్షోభానికి కారణమిదే..ఈ ఏడాది మహారాష్ట్రలో ఉన్న సాగు విస్తీర్ణం 30నుంచి 40 శాతం పెరిగింది. మరొక వైపు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లో కొత్తగా అరటి సాగు మొదలైంది. సాధారణంగా మహారాష్ట్రలో ఏటా అక్టోబర్ కల్లా పంట కోతలు పూర్తయ్యేవి. దీంతో నవంబర్ నుంచి ఢిల్లీ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్కు వచ్చేవారు. ఈసారి మహారాష్ట్రలో ఏరియా పెరగడం వలన కోతలు కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి ఉత్తర భారతదేశానికి ఏపీతో పోలిస్తే రవాణా ఖర్చులు తక్కువ. ఉదాహరణకు ఒక లారీ ట్రాన్స్పోర్టు చేయాలంటే ఏపీ నుంచి ఢిల్లీకి రూ.60 వేల నుంచి రూ.70వేలు ఖర్చవుతుండగా, మహారాష్ట్ర నుంచి రూ.30 వేల నుంచి రూ.40వేలు ఖర్చవుతుంది. పంట ఉన్నంత కాలం అక్కడ నుంచే కొనుగోలు చేసేందుకు ఢిల్లీ వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పిలక ద్వారా వచ్చే రెండో పంట (రెటూన్ క్రాప్) కోతకొచ్చింది. ధరల పతనాన్ని ముందుగానే పసిగట్టిన అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా అక్టోబర్ రెండో వారం వరకు కిలో రూ.8 నుంచి రూ.10 వరకు పలికిన ధర కాస్తా ఆ తర్వాత క్రమేపి క్షీణించి రూపాయికి దిగజారింది.చంద్రబాబుకు నిజంగా మానవత్వం ఉండి ఉంటే..వైఎస్ జగన్ హయాంలో కరోనా విపత్తు వేళ కూడా ఇదే రీతిలో ధరలు పతనమవుతున్న సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని అరటి రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొని అండగా నిలిచింది. ఈ విధంగా దాదాపు 16వేల టన్నులకుపైగా అరటిని కొనుగోలు చేసి సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందజేసింది. ఒక్క అరటే కాదు.. ఆ తర్వాత బత్తాయికి ధర లేనప్పుడు కూడా ఇదే రీతిలో చొరవ తీసుకుని 4,109 టన్నుల బత్తాయిని రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించి డ్వాక్రా సంఘాల సభ్యులకు సబ్సిడీపై అందజేసింది. కిలో రూపాయికి కూడా కొనేవాడు లేకపోవడంతో రేయింబవళ్లు కంటికిరెప్పలా పెంచిన పచ్చని అరటి తోటలను తమ చేతులతోనే నేలకూల్చేస్తూ..పంటలను దున్నేస్తుంటే సీఎం చంద్రబాబు కనీసం మానవత్వం చూపడం లేదు. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈపాటికే చొరవ తీసుకుని రైతుల నుంచి కనీసం కిలో రూ.15 నుంచి రూ.20 మధ్య కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా వినియోగ దారులకు సబ్సిడీపై పంపిణీ చేయడం లేదా కనీసం మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందించే ఆలోచన చేసేవారు. కానీ అలా చేయలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేసినప్పుడు ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి.. ఢిల్లీ వ్యాపారులతో అనుసంధానం చేయండి అంటూ ఆదేశాలివ్వడం తప్ప రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి ప్రత్యక్ష చర్యలూ తీసుకున్న పాపాన పోవడం లేదు. ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఢిల్లీ వ్యాపారులతో ట్రేడర్స్ మీట్స్ అంటూ హంగామా చేస్తున్నారు.బహిరంగ మార్కెట్లో కిలో రూ.40–100రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని బహిరంగ మార్కెట్లో అరటి నాణ్యతను బట్టి కిలో రూ.40 నుంచి రూ.60 పలుకుతున్నాయి. కాస్త పెద్ద సైజు (ఎక్స్పోర్టు క్వాలిటీ) అయితే కిలో రూ.60 నుంచి రూ.80 కూడా పలుకుతున్నాయి. హైపర్ మార్కెట్లలో అయితే కిలో రూ.100 కూడా పలుకుతున్నాయి. చివరికి అరటి పంట ఎక్కువగా ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లోనూ కిలో రూ.40కు తక్కువ అమ్మడం లేదు. కానీ అరటి పండించే రైతుకు మాత్రం కిలో రూపాయికి మించి పలకడం లేదు. మధ్యలో ఈ సొమ్ములంతా దళారుల మాటున అధికార టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. కారణం ప్రధాన అరటి మార్కెట్లతోపాటు సీమలోని మార్కెట్ యార్డులన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేయాలంటే పచ్చ ముఠాలకు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. దీంతో ఇక్కడి టీడీపీ నేతలు వ్యాపారులతో కుమ్మక్కై.. రైతులకు ధర లేకుండా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. -
దయలేని ప్రభుత్వమిది
సాక్షి కడప: రాష్ట్రంలో పేద ప్రజలు, రైతులంటే దయలేని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వివిధ సమస్యలతో సతమతమవుతున్న వారికి మంగళవారం ఆయన ధైర్యం చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలకు పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. ఆయన్ను చూడగానే కార్యాలయ ఆవరణలోని అభిమానులు, ప్రజలు జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం అందరి బాధలు, కష్టాలు విన్నారు.పరిష్కార మార్గాలు సూచిస్తూ భరోసా కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు తెలుసుకున్నారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చేయాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు.అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. అందరి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తామంతా ధైర్యంగా బతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరటితోపాటు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని చెప్పారు. వీటిపై స్పందిస్తూ రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుఫున పోరాడతామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.బాబు సర్కార్ తీరుతో సీటు కోల్పోయాతమ సమస్యను వైఎస్ జగన్కు వివరిస్తున్న జయప్రకాశ్, చరణ్ సాయి నీట్ యూజీలో తనకు 470 మార్కులు వచ్చాయని, అయితే 471 మార్కులు కటాఫ్గా రావడంతో సీటు రాలేదని, అదే పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభమై ఉంటే తనకు తప్పకుండా సీటు వచ్చేదని పులివెందులకు చెందిన జయప్రకాశ్ కుమారుడు చరణ్ సాయి వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మీ హయాంలో మీరు 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో ఏడు కళాశాలలు ప్రారంభమవ్వగా, మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పులివెందుల కాలేజీకి అయితే గత ఏడాది సీట్లు కూడా కేటాయించారు.చంద్రబాబు ప్రభుత్వం ఆ సీట్లు రద్దు చేయాలంటూ ఎన్ఎంసీకి ఏకంగా లేఖ రాసింది. అలా చేయకుండా ఉండివుంటే ఈ ఏడాది నాకు తప్పకుండా ఎంబీబీఎస్ సీటు వచ్చేది’ అని వాపోయాడు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ వైద్య విద్యార్థులకు అన్యాయం చేస్తోందన్నారు. పీపీపీ విధానంతో పేదలకు వైద్యాన్ని అందకుండా చేస్తోందని మండిపడ్డారు. మహోన్నత ఆశయంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఉన్నత వైద్యంతోపాటు మెడికల్ విద్యను అందించాలన్న తమ లక్ష్యాన్ని నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.దివ్యాంగుడితో ఆప్యాయంగా వైఎస్ జగన్ ముస్లిం అక్కచెల్లెమ్మల సమస్యలను వింటున్న వైఎస్ జగన్ పులివెందుల క్యాంప్ కార్యాలయం వద్ద జగన్ను చూసేందుకు పరుగుపెడుతున్న ప్రజలు -
దటీజ్ వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పులివెందులలో జనసందోహం నడుమ వైఎస్ జగన్ (చిత్రాలు)
-
పులివెందుల చేరుకున్న జగన్
-
‘నేనున్నాను..’ పులివెందుల ప్రజాదర్బార్లో వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాకతో పులివెందుల జనసందోహంగా మారింది. భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను’ అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్.. వారి యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు. వారికి భరోసా కల్పించారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.గోడు వెల్లబోసుకున్న రైతులువరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడం లేదని ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తామంతా భరోసాగా బ్రతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్ధితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుపున పోరాడతామని.. వారికి అండగా ఉంటామని జగన్ భరోసానిచ్చారు.మేం సీట్లు కోల్పోయాం: వైద్య విద్యార్థులుచంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పలువురు వైద్యవిద్యార్థులు వైఎస్జగన్ను కలిసి వాపోయారు. పులివెందుల, పాడేరుతో మరో వంద సీట్లు వచ్చేవని.. అయితే కూటమి సర్కార్ నిర్ణయంతో సీట్లు కోల్పోయామని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఒక్క మార్కుతో సీటు కోల్పోయానని చరణ్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారు. ఆప్యాయ పలకరింపులు.. సెల్ఫీలువైఎస్ జగన్పై అభిమానంతో కొందరు భాకరాపురం క్యాంప్ కార్యాలయానికి తరలి వచ్చారు. దివ్యాంగులు, చిన్నారులు, అక్కచెల్లెమ్మలు, యువకులను ఆయన అప్యాయంగా పలకరించారు. తిరిగి వెళ్లే క్రమంలో.. అక్కడే ఉన్న కొందరి యువకుల ఫోన్లలో స్వయంగా సెల్ఫీలు తీశారు.


