breaking news
YS Jagan Mohan Reddy
-
ఏపీకి‘మోంథా’ముప్పు.. పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేసిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రానికి మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేశారు.మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 28న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన ర్యాలీలు వాయిదా వేశారు. నవంబర్ 4 న ర్యాలీలను నిర్వహించాలని పేర్కొన్నారు. -
Janatantram: క్రెడిట్ చోరీ.. డెబిట్ బదిలీ
-
జగన్ ప్రశ్నల వర్షం.. బాబు గజగజ
-
క్రెడిట్ చోరీ... డెబిట్ బదిలీ!
నిజాలపై నివురు కప్పడం, అసత్యాలకు అలంకారం చేయడం ఇప్పుడొక రాజకీయ క్రీడ. ఇందులో చంద్రబాబు, ఆయన బృందం ఆరితేరిన ఆటగాళ్లని ప్రశస్తి. ఈ ఖ్యాతిలో సింహభాగం యెల్లో మీడియాకు దక్కుతుంది. ఈ మీడియా గత మూడు దశాబ్దాలుగా ఊదరగొట్టిన ఫలితంగా, తెలుగునాట ప్రత్యామ్నాయ మీడియా నిలబడకుండా చేసిన కుట్రల కారణంగా నిజంగానే చంద్రబాబును ఒక ఐటీ నిపుణుడిగా, దూరదృష్టి గల విజనరీగా నమ్మేవారి సంఖ్య గణనీయంగానే ఉన్నది. సాంఘిక శాస్త్రాల అధ్యయనానికి దూరమై ప్రాపగాండా ప్రవాహంలో కొట్టుకుపోయే నవతరంలో కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి.ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటో తెలిసిన వారు లేకపోలేదు. అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. కానీ నిజం నిద్ర లేచే సరికే అబద్ధం ఊరేగివస్తుందంటారు కదా! అదే జరుగుతున్నది. చంద్రబాబుకు విజనరీ వేషం వేయడానికి యెల్లో మీడియా పౌండ్రక వాసుదేవ పాత్రను కాపీకొట్టినట్టుంది. వసుదేవుని కుమారుడు గనుక శ్రీకృష్ణ పరమాత్మను వాసుదేవుడంటారు. ఆ వసుదేవునికి ఇంకో కొడుకుండేవాడట! ఆయనకు కొందరు ‘వాలతుల్యుల’తో కూడిన ఒక కోటరీ ఉండే దట! అసలైన వాసుదేవుడివి నువ్వేనంటూ ఈ కోటరీ ఉబ్బేయ డంతో ఆయన కూడా నెమలి పింఛం ధరించడం, పిల్లనగ్రోవి పట్టుకోవడం సహా కృష్ణ వేషధారణ వేయడం మొదలు పెట్టాడట! అంతటితో ఆగలేదు – తన వేషాన్ని వేసుకోవద్దని శ్రీకృష్ణుడినే బెదిరించేదాకా వెళ్లాడు.ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొన్నటి మీడియా సమావేశంలో ఇటువంటి పౌండ్రక వాసు దేవ ఇమేజ్నే చీల్చి చెండాడారు. నేటి తరం రాజకీయ నేతల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయన ప్రెస్మీట్లను గానీ, ఇతర కార్యక్రమాలను గానీ ఒక్క ‘సాక్షి’ యూ–ట్యూబ్ ప్లాట్ఫామ్ వీడియోల్లోనే 50 లక్షల మందికి పైగా వీక్షిస్తారు. ‘సాక్షి’ టీవీ, దాని డిజిటల్ ప్లాట్ ఫామ్లతోపాటు ఇతర దృశ్య మాధ్యమాలతో కలిపితే ఈ సంఖ్య ఒక్కరోజులోనే కోట్లలో ఉంటున్నది. దీనికి పత్రికా పాఠకులు, డిజిటల్ ఎడిషన్లలో చదివే వారి సంఖ్య తోడవుతుంది. ఆయన మెసేజ్లు ఈ స్థాయి విస్తృతికి చేరడమే కాదు, వాటికి విశ్వస నీయత కూడా ఎక్కువ. జగన్మోహన్రెడ్డి ప్రసంగాల్లో ఊకదంపుడు తక్కువ. సూటిగా తాను చెప్పదల్చుకున్న పాయింట్ను ప్రస్తావించడం, అందుకు సాక్ష్యంగా సాధికారికమైన లెక్కల్ని ఉటంకించడం, డాక్యుమెంట్లను ప్రదర్శించడం ఆయన అనుస రించే పద్ధతి. ఈ వైఖరి కారణంగా కూటమి సర్కార్ బండారాన్ని ఏడాదికాలంలోనే బట్టబయలు చేయగలిగారు.గురువారం జరిగిన మీడియా సమావేశంలో నాలుగు అంశాలపై జగన్ మాట్లాడారు. ముఖ్యంగా సర్కార్ ఆడుతున్న కల్తీ లిక్కర్ నాటకంపైనా, డేటా సెంటర్కు సంబంధించి చేస్తున్న క్రెడిట్ చౌర్యంపైనా సుదీర్ఘంగా మాట్లాడారు. ‘క్రెడిట్ చోరీ’ అనే మాటను కాయిన్ చేస్తూ, సైబర్ టవర్స్, ఔటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్టు దాకా హైదరాబాద్ నిర్మాతగా బాబు తగిలించుకున్న నకిలీ మెడల్స్ను పీకిపారేశారు. ఆరెకరాల స్థలంలో లక్షా నలభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ‘సైబర్ టవర్స్’కు ‘హైటెక్ సిటీ’ అని నామకరణం చేసి ప్రచారం చేసుకున్న వైనాన్ని ఆయన ఎండగట్టారు. ఆ భవనానికి కూడా అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించి, భూసేకరణతోపాటు తొలి దశ నిర్మాణం కూడా పూర్తిచేసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు, ఆయన హయాంలోనే ప్రారంభమై పూర్తిచేసుకొని వినియోగంలోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 12 కిలోమీటర్ల ‘పీవీ ఎక్స్ ప్రెస్ వే’లు హైదరాబాద్ నగరాభివృద్ధికి వన్నెలద్దిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెదిగే నాటికి రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.5,660 కోట్లు మాత్రమే. దేశంలో నాలుగో స్థానం. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల లోనే రాష్ట్రం రెండో స్థానానికి ఎగబాకింది. ఎగుమతుల విలువ రూ.32,500 కోట్లకు చేరింది. కేసీఆర్ పదేళ్ళ పాలన తర్వాత ఆ ఎగుమతులు రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయి. తాను న్యూయార్క్లో ఉన్నానా, హైదరాబాద్లో ఉన్నానా అని హీరో రజనీకాంత్కు ఆశ్చర్యం కలిగించిన దృశ్యాలన్నీ కేసీఆర్ కాలంలోనే ఆవిష్కృతమయ్యాయి. ఇలాంటి వాస్తవాలతో పొంతన లేకుండా వందిమాగధ మీడియా బృందంచే బాబు వేయించు కున్న వీరతాళ్ల బాగోతాన్ని జగన్ విప్పిచెప్పారు. అన్నిటికంటే ముఖ్యం – తాజా డోల్బాజా విశాఖ డేటా సెంటర్.ఈ డేటా సెంటర్ మీద టీడీపీ యెల్లో మీడియా సృష్టించిన సంరంభాన్ని, జగన్ మీడియా సమావేశానికి ముందూ, వెనకగా విభజించాలి. గురువారానికి ముందు ఆ సందడే వేరు! సాక్షాత్తూ గూగుల్ సంస్థే ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ చంద్రబాబు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సిద్ధమైందని ప్రచారం చేశారు. జరిగిన నేపథ్యాన్ని, అంతకుముందే పడిన పునాదిని మరుగునపెట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే హోరు. చంద్రబాబంటే డేటా సెంటర్లు, అమరా వతి నిర్మాణాలు – జగనంటే మటన్ షాపులు, చికెన్ సెంటర్లని ప్రచారం చేశారు. జగనంటే పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, అందరికీ ఆరోగ్యశ్రీ, ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్, 30 లక్షలమంది ఇళ్లు – ఇళ్ల స్థలాలు, అధికార వికేంద్రీకరణ, రైతు భరోసా కేంద్రాలు అనే విషయాన్ని జనం మరిచిపోయి ఉంటారని వారి నమ్మకం కావచ్చు. గురువారం నాటి జగన్ సమావేశం తర్వాత టీడీపీ నేతలు, యెల్లో మీడియాల సందడి తేలు కుట్టిన దొంగల చందంగా మారింది.ప్రతిపక్ష నేత వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నవంబర్లోనే విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. డేటా సెంటర్కు డేటా తీసుకురావడానికి వీలుగా సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవునా సబ్సీ (సముద్ర మార్గం) కేబుల్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 9నే లేఖ రాసింది. ఈ లేఖ కాపీని కూడా ఆయన విడుదల చేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్తో అదానీ సంస్థకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో అప్పుడే ప్రచురితమైన వార్తా కథనం కటింగ్ను జగన్ విడుదల చేశారు. అంటే మూడేళ్ళుగా ఈ రంగంలో అదానీ గ్రూప్, గూగుల్ కలిసి పనిచేస్తున్నాయి. 2023 మే నెలలో విశాఖలో డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగింది. అంతకుముందటి రెండేళ్ళలో ఎక్కువకాలం కోవిడ్ పరిస్థితులు న్నాయని గమనంలో ఉంచుకోవాలి.ఇప్పుడు కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకున్న వెయ్యి మెగావాట్ల గూగుల్ సెంటర్, 2023లో జగన్ శంకు స్థాపన చేసిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే! ఈ డేటా సెంటర్కు అవసరమైన సబ్ సీ కేబుల్, డేటా ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన పూర్వరంగం జగన్ హయాంలోనే సిద్ధమైంది. కేవలం డేటా సెంటర్ మాత్రమే అయితే ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండదు కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, పాతిక వేలమందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కార్ షరతు పెట్టింది. ఇప్పుడు ముందుకొచ్చిన విస్తరణలో అటువంటిదేమీ కనిపించలేదు. కేవలం డేటా సెంటర్ మాత్రమే. దాని ఏర్పాటుకు దోహదం చేసిన పూర్వరంగంలోని అదానీ– గూగుల్ గ్రూప్తో పాటు అప్పటి జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం పాత్రధారులే! పాత్రధారులందరినీ మరుగునపెట్టి, కేవలం గూగుల్కూ, చంద్రబాబుకూ మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా వచ్చిన కొత్త ప్రాజెక్టుగా కూటమి సర్కార్ ప్రచారం చేసుకున్న తీరును జగన్ ప్రశ్నించారు.‘క్రెడిట్ చోరీ’ అనే పదబంధం కొత్తది కావచ్చు కానీ, ఇతరుల క్రెడిట్ను చంద్రబాబు కోసం యెల్లో మీడియా కొట్టేస్తుందనే విషయం చాలాకాలంగా తెలిసిందే. ఈ విధానా నికి ఇంకో పార్శ్వం కూడా ఉన్నది. అదే డెబిట్ బదిలీ. తాము తప్పు చేస్తూ, ఆ తప్పును ప్రత్యర్థుల ఖాతాలో వేయడం! మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన నకిలీ లిక్కర్ తయారీ అంశం ఈ కోవలోనిదే. రాష్ట్రవ్యాప్తంగా ఒక పరిశ్రమ మాదిరిగా విరాజిల్లుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాన్ని ఫోటోలతో సహా ఆయన మీడియా ముందు బహిరంగపరిచారు. ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం, పర వాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరుల గురించే ఆయన ప్రస్తావించినప్పటికీ ఇటువంటి కార్ఖానాలు ఇంకా డజన్లకొద్దీ ఉన్నట్టు సమాచారం.నకిలీ మద్యం తయారీ – అమ్మకాలపై కూటమి ప్రభుత్వం ప్రారంభం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపి స్తున్నది. ఈ రంగంలో అనుభవం ఉన్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి పోటీకి నిలిపారు. ఈ కార్యక్రమంలో మరో ‘నిపుణుడు’ జనార్దన్రావు కూడా పాల్గొన్నట్టు వార్తలు, ఫోటోలు బయటకు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం షాపుల వ్యవస్థ ఈ నకిలీ మద్యం ప్రవాహానికి అనుకూలించదు. అందువల్ల దాన్ని రద్దు చేయాలి. మద్యం అలవాటును నియంత్రించే ఉద్దేశంతో జగన్ ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థను తొలగించారు. బెల్ట్షాపులను, పర్మిట్ రూములను పూర్తిగా తొలగించారు. లైసెన్స్డ్ మద్యం షాపులను కూడా కుదించి, ప్రభుత్వ రంగంలోనే నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు సాగించారు.సామాజిక ప్రయోజనాల రీత్యా, ఆరోగ్యాల రీత్యా కూడా అది మంచి వ్యవస్థ. దాన్ని తొలగించి ప్రైవేట్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాలంటే ఉన్న వ్యవస్థ మంచిది కాదని ప్రచారం చేయాలి. కూటమి సర్కార్ అదే పని చేసింది. వ్యాపారాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించి అమ్మకాలను ప్రోత్సహించినట్లయితే, బెల్ట్ షాపులకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చినట్లయితే, మద్యం తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా అనుమతులిచ్చి నట్లయితే అందులో స్కామ్ ఉండేందుకు అవకాశం ఉంటుంద నేది కామన్సెన్స్. ఇవేమీ లేని వ్యవస్థలో స్కామ్ జరిగిందనేది ఏడాది కాలంగా సర్కార్ చేస్తున్న న్యూసెన్స్. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి డైలీ సీరియల్ మాదిరిగా ఈ కేసును నడుపుతున్నారు. జగన్ హయాంలో స్కామ్ జరిగిందని నమ్మించడానికి అనేకమంది ముఖ్యనాయకులను, ప్రముఖ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా సరే, ఒకరిద్దరిని బెదిరించి తీసుకున్న వాఙ్మూలాల ఆధారంగా ఈ కేసు నడుస్తున్నది. ఈ దర్యాప్తు నిర్వా కాన్ని చూసి పలుమార్లు న్యాయస్థానం కూడా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అయితే అసలు ఉద్దేశం వేరు. ఈ కేసు పేరుతో రచించే బేతాళ కథలతో మీడియాను ముంచెత్తుతూ, నిశ్శబ్దంగా నకిలీ మద్యం వ్యాపారం – తయారీ రాష్ట్రమంతటా విస్తరించింది. కేవలం మూడువేల పైచిలుకు మద్యంషాపులు, అవి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగే వ్యవస్థ పాతది. ఇప్పుడు ప్రతి షాపుకూ ఓ బార్ లాంటి భారీ పర్మిట్ రూమ్ నడుస్తూ, అరవైవేల పైచిలుకు బెల్టు షాపుల్లో తాగిస్తున్నప్పుడు గతంతో పోలిస్తే అమ్మకాలు ఎన్ని రెట్లు పెరగాలి? కానీ, ఎక్సైజ్ ఆదా యాన్ని చూస్తే ఏటికేడు సహజంగా పెరగాల్సినంత కూడా పెరగడం లేదు. మరి ఇన్ని పర్మిట్ రూమ్లూ, బెల్ట్ షాపుల ద్వారా వస్తున్న రెండు మూడు రెట్ల ఆదాయం ఎక్కడికి పోతు న్నట్టు? ... నకిలీ మద్యం పాలవుతున్నట్టు లెక్క.ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం కార్ఖానాలు బయట పడకముందే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఏపీ సరిహద్దున ఉన్న మేళ్ళచెరువులో ఇటువంటి కార్ఖానా బయట పడింది. దర్యాప్తులో ఈ కార్ఖానాకు జనార్దన్రావుకు సంబంధా లున్నాయని వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. దుకాణా న్నయితే మూసేశారు కానీ, తెలంగాణ ఎక్సైజ్ సిబ్బంది ఇంకా ముందుకెళ్లి దర్యాప్తు చేయలేదు. జనార్దన్రావు పేరు బయటకు రాకుండా తెలంగాణ అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న ఆంధ్ర నేతలెవరు?... కనిపెట్టడం ఓ బ్రహ్మవిద్యేం కాదు గదా! రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బంధువైన చంద్రశేఖరనాయుడు ఎక్సైజ్ శాఖలో మాజీ అధికారి. జాయింట్ కమిషనర్గా పనిచేసి ఐదేళ్ల కిందనే రిటైరయ్యారు. అధికారికంగా ఆయన్ను ఈ ఫిబ్రవరి నెల నుంచి ఎక్సైజ్ శాఖలో ఓఎస్డీగా నియమించారు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీ లన్నింటినీ ఆయన అజమాయిషీలోకి తెచ్చారని సమాచారం. అనధికారికంగా అంతకుముందు నుంచే ఆయన ఈ పనుల్ని చక్కబెడుతున్నారని ఆ శాఖలో ఉన్న టాక్. నకిలీ మద్యం తయారీదారులు మందుబాబుల్ని బురిడీ కొట్టించడం కోసం అసలు బ్రాండ్లకు సంబంధించిన ఫ్లేవర్ వచ్చేలా ఎసెన్స్ను కొంత కలుపుతున్నారని తెలుస్తున్నది. ఈ ఎస్సెన్స్ ఆ బ్రాండ్ కంపెనీల వద్ద గానీ, దాన్ని లీజుకు తీసుకున్న డిస్టలరీల వద్దగానీ ఉంటుంది. మరి నకిలీ కార్ఖానాలకు ఎలా చేరుతున్నాయనేది రాజకోట రహస్యమే! ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంలో కూడా వైసీపీ వాళ్లను ఇరికించడమెలా అనే అంశంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరనే నానుడి ఏమవుతుందో చూద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇదండి బాబు మార్కు మోసం!
రాజకీయ పార్టీలకు మాటకు కట్టుబడే లక్షణం.. నిబద్ధత, ఆయా అంశాలపై స్పష్టమైన వైఖరి చాలా ముఖ్యం. లేకపోతే అది అవకాశవాద రాజకీయం అవుతుంది. ప్రజల తిరస్కారానికి కారణమవుతుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరానికి తగ్గట్టు మాటలు మార్చడంలో సిద్ధహస్తుడన్న పేరు ఇప్పటికే సంపాదించి ఉండటం ఇందుకు కారణం.ఇప్పుడీ ప్రస్తావన మరోసారి ఎందుకొచ్చిందంటే.. టీడీపీతోపాటు జనసేన కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటన్న చర్చ వచ్చినందుకు! అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పీఆర్సీ వస్తామని మధ్యంతర భృతి ప్రకటిస్తామని, బకాయిలు చిటికెలో తీర్చేస్తామని ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గద్దెనెక్కిన 16 నెలల తరువాత ఇప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదని కథలు చెబుతున్నారు. ఉద్యోగుల బిల్లులు బకాయిలు సుమారు రూ.34వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని ముక్తాయించారు. సహజంగానే దీనిపై ఉద్యోగులు మండి పడుతున్నారు. ఉద్యోగ నేతలు కొందరితో అనుకూల ప్రకటనలు చేయించుకున్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పు మాదిరిగానే ఉంది.2019లో జగన్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను, ప్రజల ఇళ్ల వద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నెరవేర్చారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ ఇవి వృథా అని ఎన్నడూ చెప్పలేదు. తొలగిస్తామని కూడా అనలేదు. పైగా వలంటీర్లకు జగన్ ఇస్తున్న రూ.5వేలు సరిపోదని, తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు ఇస్తామని ఉగాది నాడు పూజ చేసి మరీ ప్రకటించారు. కానీ ఇప్పుడేమో దానిని ఎత్తివేశారు. అదేమంటే వేస్ట్ అని చెబుతున్నారు. ఇది పక్కా మోసమే కదా?.వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకం కింద కుటుంబంలో ఒకరికి రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తే, చంద్రబాబు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ప్రతి విద్యార్ధికి డబ్బు ఇస్తామని ఎందుకు ప్రకటించారు? దాని వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నాశనం అవడం లేదా? చంద్రబాబు 2014 టర్మ్లో రూ.లక్ష కోట్ల మేర రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెబితే ఆయనకు విజన్ ఉన్నట్లు! అది సాధ్యం కాదని చెబితే జగన్ చేతకాని వాడన్నట్లు చెప్పేవారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేశారు?. రైతులకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులెత్తేశారే. ఇప్పుడు ఎవరికి విజన్ ఉన్నట్లు? జగన్ నిజాయితీగా చెప్పినట్లు అంగీకరించాలి కదా!. జగన్ రైతులకు రూ.13,500 చొప్పున రైతు భరోసాగా ఇస్తామని తెలిపి దానిని అమలు చేశారు. అది తప్పైతే చంద్రబాబు ఎందుకు ఏకంగా రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు?. జగన్ కేంద్రం ఇచ్చిన మొత్తంతో కలిపి ఇస్తే ఆక్షేపించిన చంద్రబాబు దానితో నిమిత్తం లేకుండా ఇస్తానని ప్రకటించి అసలుకే మోసం చేశారే. ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది కేవలం రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చారు కదా!.2014 టర్మ్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఇంటెరిమ్ రిలీఫ్ ఇచ్చి తానేదో గొప్ప పని చేశానని చెప్పుకోవడానికి యత్నించారు. అప్పుడేమో ఆర్థిక వ్యవస్థపై భారం పడినట్లు కాదు. జగన్ టైమ్ లో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 27 శాతం ఐఆర్ ఇచ్చి, తదుపరి 23 శాతం పీఆర్సీ ఇస్తే రివర్స్ పీఆర్సీ ఇస్తారా అని తప్పుడు ప్రచారం చేశారే! చంద్రబాబు చెబుతున్నట్లు ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం తగ్గించడానికి జగన్ యత్నిస్తే అది తప్పు చేసినట్లు అవుతుందా?. తాను ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం పెంచితేనేమో ఉద్యోగుల కోసమా? ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే ఎన్నికలలో చెప్పిన విధంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి కదా!. డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి కదా! నాలుగు డీఏ బకాయిలకు ఒకటే ఎందుకు ఇచ్చారు?.పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే, ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే విజయవాడకు వెళ్లిన మాట నిజం కాదా? ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులను అదనపు రాయితీలు ఇచ్చి మరీ అక్కడకు తరలించారే. వారానికి ఐదు రోజుల పని చేయండని చెప్పారే. హైదరాబాద్లో భవనాలు వదులుకుని వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దె భవనాలను విజయవాడ, గుంటూరులలో తీసుకున్నారే. ఇదేమి ప్రభుత్వంపై భారం పడలేదా? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తామన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ గుర్తుకు రాలేదా!. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఆశ పెట్టినప్పుడు రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని అనుకున్నారా? లేక ఎలాగూ జనాన్ని మాయ చేయడమే కదా అని అనుకున్నారా?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం గొప్ప విషయంగా ప్రచారం చేస్తుంటారు. దానివల్ల స్త్రీలకు చాలా ఆదా అయిందని ఊదరగొడుతుంటారే! అది మంచి హామీనా?. ఆర్టీసీని ముంచే హామీనా?. చంద్రబాబు ఏమి చేసినా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఏం కాదా?. అదే జగన్ చేస్తే నాశనం అయినట్లా? ఇదేం అన్యాయం.ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎలా వ్యవహరించినా చెల్లిపోతుందన్నది కూటమి పెద్దల విశ్వాసం కావచ్చు. గూగుల్ పేరుతో వస్తున్న అదానీ, రైడెన్ డేటా సెంటర్ ఇచ్చేది కేవలం 200 ఉద్యోగాలే అయినా ఏకంగా రూ.22వేల కోట్ల ప్రజా ధనాన్ని తేలికగా ఇచ్చేస్తున్నారే. దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన విమర్శకు మీరెచ్చే జవాబు ఏమిటి?. వేల కోట్ల లాభాలలో ఉన్న టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలకు రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టడం, ఉర్సా, లూలూ వంటి కంపెనీలకు ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు కేటాయించడం ప్రజలకు సంపద సృష్టించినట్లు అవుతుందా?. గూగుల్ తదితర కార్పొరేట్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక ఆ కంపెనీలలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందా అన్న సందేహాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తే పరిస్థితి తెచ్చారే!.జగన్ టైమ్లో అప్పులు తేవడాన్ని ఆక్షేపించిన చంద్రబాబు తాను 16 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమి చేశారో ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? డీబీటీ విధానం అంటే నేరుగా ప్రజల ఖాతాలలోకి డబ్బులు వేయడం తప్పని చెబుతున్న చంద్రబాబు తాను అదే పని ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వెల్లడించాలి కదా!. అసలు ఎన్నికల సమయంలో డీబీటీ విధానం విదేశాలలో ఉందని, తన కుమారుడు లోకేష్ దీనిపై సలహా ఇచ్చారని, అది గొప్ప సంగతి అని, తాను రూ.రెండు వేల చొప్పున ఇస్తానని ప్రకటించారే. జగన్ ఎక్కడా అవినీతి లేకుండా డీబీటీ అమలు చేస్తే అది తప్పని చెబుతున్నారు.పోనీ ఆ సంక్షేమ స్కీములు అమలు చేయడం సరికాదని చెబుతారా అంటే అలా చేయరు. పైగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు పెడతారు. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను మార్చేయాలన్న భావనతో చంద్రబాబు సర్కార్ ఉందా? ఎన్నికల ప్రణాళికలో సీపీఎస్, అవుట్ సోర్స్, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడానికి కొత్త గాత్రం అందుకున్నారా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీలో పలు విభాగాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్కు ఒక ప్రెసిడెంట్ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు. జోన్ –4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు.జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్ప్రసాద్ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) మరణంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.వైఎస్ జగన్ తన ట్వీట్లో..‘ దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి. అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు’అని పేర్కొన్నారు. కాగా, ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగానికి నాలుగు దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందించిన ఈ సృజనాత్మక మేధావి, భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. Deeply saddened by the loss of Padma Shri Piyush Pandey Ji, an advertising legend who connected India with his creative storytelling. My sincere condolences to his family and friends. The work he has done for the launch of Sakshi and Bharathi Cements are well cherished. pic.twitter.com/BPf5KZmbeS— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025 -
అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు
-
విశాఖ అభివృద్ధి గురించి ఆలోచించింది జగనే..
-
Ambati: ప్రజా ఉద్యమంతో చంద్రబాబుకు బుద్ధి చెప్తాం
-
కర్నూలు బస్సు ప్రమాద ఘటన.. YS జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
Big Question: సబ్జెక్ట్ తో కొట్టిన జగన్.. బాబుకు బాదుడే బాదుడు
-
ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా... లిక్కర్ దుకాణాలు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు నడిపేది చంద్రబాబు మనుషులే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (YS Jagan On Kurnool Bus Accident). ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ‘‘కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని ట్వీట్ చేశారు. The news of the tragic bus fire accident near Chinna Tekur village in Kurnool district is deeply distressing. I extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025మరోవైపు.. ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విచారం వ్యక్తం చేశారని సమాచారం(CM Chandrababu On Kurnool Accident). ఆ వెంటనే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025ఇటు.. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుములు రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (CM Revanth Reddy On Kurnool Bus Accident). మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్స్ లిస్ట్లో అత్యధికం హైదరాబాద్కు చెందిన వారే ఉండడం గమనార్హం.కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.…— Telangana CMO (@TelanganaCMO) October 24, 2025కేటీఆర్ దిగ్భ్రాంతి.. కర్నూలు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వo బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను అని అన్నారు. మంత్రి నారా లోకేష్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన ఎంతో బాధించిందని.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. The news of the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones. Wishing speedy recovery to those injured.— Lokesh Nara (@naralokesh) October 24, 2025ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్..కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల పరిస్థితిని కర్నూలు జీజీహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. దీంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు సూచించారు. ‘‘బస్సులోనే ఇంకా భౌతిక కాయాలున్నాయి. పరిస్థితులకనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన పై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది.మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్న.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం.. కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం పట్ల ఆయన ఆందోన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.ఇదీ చదవండి: బైక్ను ఢీ కొట్టడం వల్లే బస్సు కాలిపోయిందా? -
వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా
రాష్ట్రంలో రోజూ లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం మార్కెట్లోకి చేరుతోంది. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ మద్యం ఉంది. లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ల బెల్ట్ దుకాణాల్లో, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో నకిలీ మద్యాన్ని అమ్మేస్తున్నారు. ఇంత వ్యవస్థీకృత పద్ధతిలో తయారు చేయడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ అంతా వాళ్ల ఆధీనంలోనే నడుస్తోంది. ఇంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సొంతం. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నకిలీ మద్యం తయారు చేస్తూనే ఉన్నారు. డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయట పడడంతో ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ చూస్తే.. చేసేది ఆయనే, నెపాన్ని వేరేవాళ్ల మీదకు నెట్టేదీ ఆయనే.. దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియా.. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా.. ఇదే మోడస్ ఆపరెండా వీళ్లది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ.. మీ జేబులు నింపుకోవడానికి దిగజారిపోయారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా చిన్నపాటి నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు కన్పిస్తున్నాయని ఎత్తి చూపారు. నకిలీ మద్యం తయారు చేసేది, సరఫరా చేసేది.. షాపులు, అక్రమ (ఇల్లీగల్) పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపుల్లో విక్రయించేది చంద్రబాబు మనుషులేనని.. ఇలాంటి మాఫియాను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరన్నారు. వాటాల పంపిణీలో తేడా రావడంతోనే నకిలీ మద్యం ఉదంతం బయటకొచ్చిందన్నారు. ఈ తరహా వ్యవస్థీకృత నేరం చేయడం చంద్రబాబుకే సాధ్యమని.. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఏమాత్రం తక్కువ కాదంటూ దెప్పి పొడిచారు. నేరం చేసిన చంద్రబాబు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నింద మరొకరిపై వేస్తున్నారంటూ మండిపడ్డారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయిస్తే తమ మూలాలన్నీ బయట పడతాయనే భయంతోనే.. తన మాఫియాలో భాగస్వామి అయిన విజయవాడ సీపీ రాజశేఖర్ నేతృత్వంలోని సిట్ విచారణకు ఆదేశించారంటూ తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాధారాలను చూపుతూ నకిలీ మద్యం మాఫియా అరాచకాలను ఏకిపారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలే » రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ (ఇల్లిసిట్, స్పూరియస్) మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇలాంటి మాఫియాను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. ఎక్కడ చూసినా చిన్నపాటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారు చేసి.. వాళ్ల మాఫియా లిక్కర్ షాపుల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. » ఈ ప్రభుత్వంలో మద్యం దుకాణాలు నడుపుతున్న వారందరూ టీడీపీ వాళ్లే. ఈ ప్రైవేటు మాఫియా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది. వాళ్ల షాపుల ద్వారానే అమ్మకాలు సాగిస్తుంది. గ్రామాల్లో ఏకంగా వేలం వేసి బెల్ట్ షాపులు పెట్టి, వాటికి పోలీస్ రక్షణ ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు ఈ మాఫియా శ్రీకారం చుట్టింది. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా అనధికారిక పర్మిట్ రూమ్ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. » ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది ప్రభుత్వం. అధికార పార్టీ నాయకులు సొంత జేబులు నింపుకునేందుకు దిగజారిపోయారు. డబ్బుల కోసం నకిలీ మద్యం తయారు చేసి, విచ్చలవిడిగా విక్రయాలు చేస్తూ దొరికిపోయారు. నిత్యం మార్కెట్లోకి లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం » వాటాల్లో తేడా రావడంతో నకిలీ మద్యం ఉదంతం బయటకొచ్చింది. ఒక్క ములకలచెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. 30 క్యాన్లలో సిద్ధం చేసిన 1,050 లీటర్ల స్పిరిట్ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ల నకిలీ మద్యం మార్కెట్లోకి వచ్చేది. » అంతేకాదు.. ఏ పోలీస్ కమిషనర్ అయితే చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడో, ఏ పోలీస్ కమిషనర్ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వారిని వేధిస్తున్నాడో.. అదే విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయట పడింది. ఇబ్రహీంపట్నంలో దాదాపు 27,224 బాటిళ్లు దొరికాయి. » అనకాపల్లి జిల్లా పరవాడలో, అమలాపురంలో, పాలకొల్లులో, ఏలూరులో, రేపల్లెలో, నెల్లూరులో ఇదే మాదిరిగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేసి, వాళ్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ప్రైవేట్ మాఫియా మద్యం షాపుల్లోకి, బెల్ట్ షాపులకు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. సిట్ పేరుతో తప్పుడు విచారణ చంద్రబాబే నేరాలు చేస్తారు. అది బయట పడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధం అవుతుంది. అంతా ఆర్కె్రస్టెటెడ్ (తానా తందానా)గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడం కోసం.. అబద్ధాన్ని వందసార్లు చెబుతారు. టాపిక్ డైవర్షన్లో భాగంగా ఎదుటి వారిపై బురదజల్లుతారు. వాళ్లే కొత్త కొత్త ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలను నిజం చేయాలనే తాపత్రయంతో ఒక సిట్ కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కూడా ముద్ర వేసేస్తారు. తప్పుడు ప్రచారం చేస్తూ వారిని కూడా జైళ్లకు పంపిస్తారు. మాఫియాలోని వారంతా చంద్రబాబు మనుషులే » నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్, టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. చంద్రబాబు ఆయనకు బీ ఫామ్ ఇస్తున్న ఫొటోలో పక్కనే ఉన్న మరో వ్యక్తి జనార్దనరావు. లోకేశ్, చంద్రబాబుతో ఉన్న మరో వ్యక్తి సురేంద్రనాయుడు (ఫొటోలు చూపారు). ఇదంతా ఒక మాఫియా. » ఇదే జనార్దన్రావు విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ వీళ్లే సుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులిచ్చారు. వాళ్లదంతా హాట్ లైన్ కదా! అంటే, ముందుగానే జనార్దన్రావుతో వీళ్లు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్రావు రెండున్నర సంవత్సరాల కిందట నుంచే ఈ వ్యవహారం జరుగుతోందని చెప్పడం పూర్తిగా ఒక స్కెచ్. » తంబళ్లపల్లెలో టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి మీద ఒక బ్రాండింగ్. ఆయన పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడట! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారట! ఈ బ్రాండింగ్కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తానా తందానా అంటాయి. దీనిపై టీడీపీ నుంచి ట్వీట్ వస్తుంది. ఆ తర్వాత ఈ వ్యవహారానికి ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ బిల్డప్ ఇస్తారు. » అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరితెగించి, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారు. ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకుని తన మాఫియాలోని వ్యక్తి జనార్దన్రావు ద్వారా వీడియో చేయించి, ఆ వీడియోలో జోగి రమేష్ పేరు చెప్పించి.. ఆ వాయిస్కు మరికొన్ని వక్రీకరణలు జోడించి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఏకంగా జనార్దన్రావు ఫోన్లో చాట్స్ పేరుతో జోగి రమేష్ ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. నకిలీ మద్యం తయారు చేసి, సరఫరా చేస్తూ.. అమ్మకాలు సాగిస్తున్న వీళ్లే ఎదుటి వారిపై బురదజల్లుతూ కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్ చేస్తున్నారు. ఇవిగో ఆధారాలు.. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు » అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు ఫ్యాక్టరీలో లభ్యమైన నకిలీ మద్యం బాటిళ్లు (చూపారు) ఇవి. ఇక్కడ ఫ్యాక్టరీలో మెషీన్లకు పూజ చేసి మరీ నకిలీ మద్యం పకడ్బందీగా తయారు చేస్తున్నారు. బాటిళ్లు, స్టాంప్స్, లేబుళ్లు, ప్యాకింగ్, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం మెటీరియల్ ఇది (చూపారు). » కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ, ఇంకో బాటిల్కు లేబుల్ అంటించలేదు. ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్.. ఇది వాళ్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్. షాపులకు ఒకరు నాగేశ్వరరావు పేరు, ఇంకొకరు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటారు. » అనకాపల్లి జిల్లా పరవాడలో చిన్న సైజ్ నకిలీ మద్యం ఫ్యాక్టరీ. అవే స్టిక్కర్లు, లేబుళ్లు, బాటిళ్లతో తయారు చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము నకిలీ మద్యంలో కీలక సూత్రధారి. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు ఇలా అన్ని చోట్ల ఒకే రకమైన సీన్ కనిపిస్తోంది. ప్రతి చోటా నకిలీ మద్యం బాటిళ్లు, మెషీన్లు, కార్టన్లు, లేబుళ్లతో సహా దొరికాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాలుగైదు మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీ. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు బాబూ..» నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు. ఏయే షాపుల్లో గుర్తించారు? ఒక్కదానిలో కూడా తనఖీలు లేవు. ఎందుకంటే అన్నీ వాళ్ల షాపులే. పట్టుకుంటే అన్ని చోట్ల నకిలీ మద్యం దొరుకుతుందనే తనిఖీలు ఉండవు. » జనార్దన్రావు విదేశాల నుంచి దర్జాగా వచ్చాడు. అసలు జనార్దన్రావు అనే మనిషి వీడియోలో ఎలా మాట్లాడాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగారు? తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్రావు ఇవన్నీ ఎలా చేశాడు? ఆ ఫోన్ నుంచి తప్పుడు, ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం ఎలా సాధ్యం? అవన్నీ ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, టీడీపీ సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం? » నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయట పడితే ఇవాల్టికి 20 రోజులైంది. ఇప్పటి వరకు మీ పార్టీ బీఫామ్పై పోటీ చేసిన జయచంద్రారెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? అతని పాస్పోర్టు ఎందుకు సీజ్ చేయలేదు? అతను పెద్దిరెడ్డికి సన్నిహితుడు అయితే మీరు ఎందుకు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డిపై పోటీ పెట్టారు? జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్లో రాశాడు. ఆ రోజు చంద్రబాబుకు ఆఫ్రికా మూలాలు కనిపించ లేదా? టిష్యూ పేపర్కు తక్కువ.. బాత్రూమ్ పేపర్కు ఎక్కువైన ఈనాడుకు కనిపించలేదా? » పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్లకేం ఆఫ్రికా లింకులు లేవు కదా? పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? అనకాపల్లి పరవాడలో నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ రుత్తల రాము స్పీకర్కు సన్నిహితుడు. రాముకు ఆఫ్రికాతో సంబంధాలున్నాయా? అక్కడి నుంచి స్పిరిట్ వస్తోందా? వీళ్లు కొంటున్నారా? » ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. అతను మహిళలని కూడా చూడకుండా అధికారుల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని కూడా పోతాడు. అంత గొప్ప నాయకుడు దగ్గరుండి లిక్కర్ మాఫియా నడుపుతున్నాడు. మరో పేకాట కింగ్ రేపల్లె నుంచి డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటుంటాడు. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది మీ (చంద్రబాబు) మనుషులు కాదా? వాటిని షాపులకు సరఫరా చేసి విక్రయాలు చేస్తోందీ మీ వాళ్లు కాదా? ఇది దొంగ చేతికి తాళం ఇవ్వడం కాదా? మద్యం విక్రయాల సమయంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నవన్నీ టీడీపీ నాయకులవే కదా.. పర్మిట్ రూమ్లలో లూజ్ లిక్కర్ విక్రయించేది వాళ్లే. నకిలీ లిక్కర్ దందా మొత్తం వాళ్ల కార్యకర్తలదే. ఇదంతా సిండికేట్ మాఫియా కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే బాధ్యతలు వాళ్లకే ఇస్తున్నాడు. అంటే దొంగ చేతికే తాళాలు ఇవ్వడం అన్నమాట. పభ్రుత్వం అమ్మే మద్యంలో 40 శాతం బెల్ట్ షాపుల ద్వారా, మరో 40 శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెట్టి గ్లాసుల్లో పోసి తాగిస్తున్నారు. ఎమ్మార్పీ రేటు గాలికెగిరిపోయింది. ఏం పోస్తున్నారో, ఏం తాగుతున్నారో అర్థం కాదు. మూడో రౌండ్ నాలుగో రౌండ్ కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో తెలియదు. ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని నకిలీ లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలోనేక్యూ ఆర్ కోడ్ వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి. లాభాపేక్ష అప్పటి మా ప్రభుత్వానికి లేదు. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. మద్యం షాపుల సంఖ్య తగ్గించాం. మద్యం షాపుల వేళలు కూడా కుదించాం. పర్మిట్ రూమ్లు ఎత్తేశాం. పారదర్శక వ్యవస్థ కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకొచ్చాం. ప్రతి బాటిల్ను స్కాన్ చేసి అమ్మేవాళ్లం. ఎంప్యానల్డ్ డిస్టిలరీల నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది. ఆ ఎంప్యానెల్డ్ డిస్టిలరీలు కూడా గతంలో చంద్రబాబు అనుమతులిచ్చినవే. రూ.వందల కోట్లు ఖర్చు చేసి డిస్టిలరీలు పెడితే వాటిలో నాణ్యమైన మద్యం తయారు చేస్తారు. ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి ప్రభుత్వ షాపుల్లో ప్రభుత్వమే అమ్మితే, మద్యం ప్రియుల ఆరోగ్యానికి కొద్దొగొప్పో గ్యారెంటీ ఉండేది. కానీ ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ విచ్చలవిడిగా నకిలీ మద్యం అమ్మేస్తున్నారు. ఒకవైపున ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువగా బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్మడం కళ్లముందే కనిపిస్తోంది. మరోవైపు నకిలీ, కల్తీ మద్యాన్ని తాగిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన వాటికి మాత్రమే గవర్నమెంట్కి డబ్బులు కట్టి సప్లై చేస్తున్నారు. జోగి రమేష్ ను ఇరికించే కుట్ర నకిలీ మద్యం కుంభకోణం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు మా నాయకుడు జోగి రమేష్పై ఆరోపణలు చేశారు. పన్నెండేళ్ల కిందట ఎప్పుడో దిగిన ఫొటోను చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు జనార్దన్రావుతో సత్సంబంధాలు లేవని, తన ఫోన్ చెక్ చేసుకోమని జోగి రమేష్ చాలెంజ్ చేస్తున్నాడు. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేసినట్టుగా.. ఫోన్ పోయిందని చెబుతున్న జనార్దన్రావు ఫోన్ నుంచి చాటింగ్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చాట్స్ను కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. జోగి రమేష్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే జనార్దన్రావు ఫోన్ పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. ఫోన్ లేదు కదా అని చెబుతున్నారు. కానీ ఈ లోపల డైవర్షన్ పాలిటిక్స్లో డ్యామేజ్ చేసేది చేస్తున్నారు కదా. ఇది వ్యక్తిత్వ హననం కాదా? నువ్వు చేసింది ఒక వెధవ పని. ఆ వెధవ పనిలో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇంకో మనిషి మీద అభాండాలు వేయడం, లేని ఆధారాలు పుట్టించడం అన్యాయం కాదా? మొన్న అక్రమ లిక్కర్ కేసులో ఒకర్ని ఇరికించేందుకు వీళ్ల డబ్బులు రూ.11 కోట్లు తీసుకునిపోయి అక్కడ పెట్టి స్కాం జరిగిందని ప్రచారం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ నోట్ల మీద ఉన్న నెంబర్ల ఆధారంగా ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఎప్పుడు డ్రా చేశారు అనేది తెప్పించమని కోర్టులో కేసు ఫైల్ చేసి, ఆర్బీఐకి లేఖ రాశారు. ఆ తర్వాత ఇక మాటల్లేవ్. ఎక్కడైనా రూ.11 కోట్ల డబ్బులు దొరికితే పక్కన పెడతారు. వీళ్లు మిగతా డబ్బుతో కలిపేశామని చెప్పారు. అలా ఎలా కలిపేస్తారు? అంటే, వీరే డబ్బులు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కాలేజీ డొనేషన్ల డబ్బు అని బయట పడుతుందనే భయంతోనే దాన్ని కలిపేశారు. చంద్రబాబుకి సిగ్గూలజ్జా లేదు. సిగ్గన్నా ఉంటే కొంచెం సిగ్గుపడతాడని అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం అషేమ్డ్గా ఫీలవుతాడనుకో వచ్చు. కానీ అషేమ్డ్గా ఫీలయ్యేది లేదు. సిగ్గు అంతకన్నా లేదు. -
ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెట్టి వికృతానందం
ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగులంతా రోడ్డెక్కిన తర్వాత చంద్రబాబు అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు.. ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకు డీఏ ఇచ్చింది లేదు. ఫస్ట్ దసరా అన్నాడు.. తరువాత నవంబర్ అన్నాడు.. తరువాత దీపావళి అన్నాడు.. దానికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. వాళ్లకు రావాల్సింది నాలుగు డీఏలు ఉంటే ఒక్క డీఏకి ఉద్యోగులంతా సంబరాలు అంటూ ప్రచారం నడిపారు. జిమ్మిక్కులు చేశారు. చివరకు ఇచ్చిన ఒక్క డీఏ అరియర్స్ను ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇస్తామని జీవోలో చెప్పారు. 3.5 లక్షల మంది పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ రెండేళ్ల తర్వాత ఇస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఉద్యోగులు కళ్లెర్ర చేస్తే ఆ జీవోలను సవరించారు. ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు ఠంఛన్గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎన్నికల తర్వాత అలా ఒక్క నెల మాత్రమే ఇచ్చాడు. ఇవాళ ఏ తేదీల్లో జీతాలు వేస్తారో తెలియడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ పరిస్థితులు ఉన్నా.. ఏ రోజూ కూడా ఉద్యోగుల జీతాల విషయంలో ఇబ్బందులు పడే పరిస్థితి తేలేదు. మా పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఉంటే.. రాష్ట్రం కోవిడ్తో అతలాకుతలం అయిపోయింది.. మీరు రెండు నెలలు జీతాలు వదిలేసుకోండి.. రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండ(విరాళంగా ఇవ్వండి)ని పిలుపునిచ్చేవాడు కచ్చితంగా. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాం. ఉద్యోగుల జీతాలు పెంచాం. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేస్తే.. జూన్ 8న 27 శాతం ఐఆర్ ఇచ్చాం. జూలై 1 నుంచి అమలుచేశాం. అది ఉద్యోగస్తులపట్ల మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వ హయాంలో 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. కాంట్రాక్టు ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయడం మొదలు పెట్టాం. 10,117 మందిని గుర్తించాం. వీళ్లలో 3,400 మందిని రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన వారిని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయాం. వాళ్లను ఇప్పుడు చంద్రబాబు రెగ్యులరైజ్ చేయడంలేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాదు.. వారికి ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చేలా మేము సర్క్యులర్ జారీ చేశాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి, దళారీ వ్యవస్థను తీసేసి వాళ్ల బతుకులు మార్చాలనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్)ను ఏర్పాటుచేసి లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు వచ్చేటట్టుగా మేలు చేశాం. ఈ రోజు ఆప్కాస్ను చంద్రబాబు నీరుగారుస్తున్నారు. చివరికి ఆలయాల్లో శానిటేషన్ కాంట్రాక్టు పనులను చంద్రబాబు బంధువు భాస్కరనాయుడుకు అప్పగించారు. మా హయాంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాం. మేము రాక ముందు ఏడాదికి వారి వేతనాలు రూ.1,100 కోట్లు ఉండగా.. మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.3,300 కోట్లు చెల్లించాం. ఇప్పుడు చంద్రబాబు సచివాలయాల ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని కొత్త కొత్త స్టోరీలు చెబుతున్నారు. అంటే 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, లక్షా 35 వేల మంది సచివాలయ ఉద్యోగులపై ఆయన కన్ను పడింది. వీళ్లను క్లీన్ చేస్తే మిగిలిన వారిని కూడా నెమ్మదిగా తప్పించేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచన. సాక్షి, అమరావతి : ఎన్నికల్లో తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసి నడిరోడ్డున నిలబెట్టి వికృతానందం పొందుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు, సమస్యల పరిష్కారంలో కుప్పిగంతులు, పిల్లి మొగ్గలు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రచారంలో పీక్.. వాస్తవాలు చాలా వీక్’ అనడానికి ఉద్యోగులకు ఇచ్చిన డీఏనే ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోందని.. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, జూన్ 2025.. ఇలా నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారని గుర్తుచేశారు. ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రోడ్డెక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు తప్ప.. ఇంత వరకూ ఇచ్చింది లేదన్నారు. ఉద్యోగులను చంద్రబాబు తరహాలో మోసం చేసిన సీఎం చరిత్రలో ఎవరూ లేరంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగి పారేశారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చి.. జూలై, 2019 నుంచి పెంచిన వేతనాలు ఇవ్వడం ద్వారా వారి పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ ఆప్కాస్ను తెచ్చామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వారి వేతనాలను పెంచామని.. దీనివల్ల వారి వేతనాలు ఏడాదికి రూ.1100 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా లంచాలకు తావు లేకుండా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించి చూపించామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తారా? మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి కష్టకాలంలో ఉన్నా కూడా ఉద్యోగుల విషయంలో వెనకడుగు వేయలేదు. మామూలుగా ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాలి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 11 డీఏలు ఇచ్చాం. చంద్రబాబు అంతకు ముందు 2014–19 మధ్య కేవలం 8 డీఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నాలుగు పెండింగ్ ఉంటే ఒకటి ఇస్తానన్నాడు.. ఆ ఒకటి కూడా డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక అన్నాడు. పెన్షనర్లకు డీఆర్ రెండేళ్ల తరువాత 2027–28లో ఇస్తానని ప్రకటించాడు. చంద్రబాబు ఇచ్చిన జీవోపై ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలు పెట్టడంతో ఆ జీవో సవరించారేగానీ ఇంతవరకు పైసా ఇచ్చింది లేదు. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 4 పెండింగ్లో పెట్టారు. ఒక్కో సరెండర్ లీవ్కు రూ.210 కోట్లు అవుతుందనుకుంటే.. అందులో రూ.100 కోట్లు ఇప్పుడిస్తాడట (అదీ ఇవ్వలేదు).. మిగిలిన రూ.100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. ఇస్తానన్న దాంట్లో రూపాయి ఇవ్వలేదు.. మరి దీన్ని చూసి ఉద్యోగులంతా పండగ చేసుకోవాలంట. ఎలా సంబరాలు చేసుకోవాలి? టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ట చేస్తానని హామీ ఇచ్చాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చ బిళ్లలు వేసుకొని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్లి.. టీడీపీ వాళ్లు ఉద్యోగులపై దాడులు చేస్తున్నారు. ఏమైనా అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. కుట్రపూరితంగానే పీఆర్సీ వేయడం లేదుఇవాళ ఉద్యోగులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు.. త్రిశంకుస్వర్గంలో ఉన్నారు. మరో వైపు మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర్నుంచి అనేక రాష్ట్రాలు దాన్ని స్వీకరించి, అమలు చేస్తూ ముందుకుపోతున్నాయి. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు. ఎన్నికలు అయిపోయాయి.. ఐఆర్ మాట దేవుడెరుగు.. పీఆర్సీ మరీ దారుణం. మేము నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్ను బలవంతంగా వెళ్లగొట్టాడు. కొత్త పీఆర్సీ చైర్మన్ను నియమించలేదు. కొత్త పీఆర్సీ వేస్తే ఎక్కడ ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందో అన్నది చంద్రబాబు దుగ్ధ. ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే.. న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు జీతాలు పెరగకుండా అడ్డుకోవడం అన్నింటికంటే దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్లు, ఏపీ జీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ అన్ని కలిపి దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిల గురించి చంద్రబాబు మాట్లాడడు. ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు ఠంఛన్గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎన్నికలైన తర్వాత ఒక నెల మాత్రమే అలా ఇచ్చాడు. మరో వైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. మా పథకాలన్నీ రద్దయిపోయాయి. ఇచ్చే పథకాలే అరకొర. వాటిలో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఇచ్చేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు. అధికారంలోకి రాగానే వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేలు కాదు..రూ.10 వేలకు పెంచేస్తామన్నాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు. ఎన్నో కుట్రలు చేశాడు. ఎన్నికల తర్వాత ఏకంగా ఆ ఉద్యోగాలన్నీ పీకేసి, 2.66 లక్షల మందిని రోడ్డున పడేశాడు.మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ » చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా హయాంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. వాటిలో ఏడు పూర్తి చేశాం. మిగిలిన 10 కళాశాలలు పూర్తి చేయాల్సి ఉంది. వీటి కోసం కేటాయించిన రూ.8 వేల కోట్లకు గాను రూ.3వేల కోట్లు ఖర్చు చేశాం. ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కళాశాలలన్నీ పూర్తయ్యేవి. కానీ వాటిని పూర్తి చేయడం ఇష్టం లేక.. సగంలో కట్టిన ఈ కళాశాలలను స్కామ్లు చేస్తూ అమ్మడానికి సిద్ధమయ్యారు. » మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నవంబర్ 22వ తేదీ వరకు కొనసాగుతోంది. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అక్టోబర్ 28వ తేదీన ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఈ కోటి సంతకాలను నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబర్ 24న జిల్లాల నుంచి విజయవాడకు పంపిస్తారు. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా రిఫరెండం ఇచ్చారో కోటి సంతకాల ద్వారా తెలియజేస్తాం.విద్య, వైద్యం, గవర్నెన్స్.. అన్నీ తిరోగమనమే » ఉద్యోగులకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కనీసం ప్రజలకైనా ఏమైనా చేస్తున్నాడా అంటే అదీ లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం అన్నీ తిరోగమనమే. స్కూల్స్లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద నాణ్యత పోయింది. 3వ తరగతి నుంచి చెప్పే టోఫెల్ క్లాసులు ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం చదువులు గాలికెగిరిపోయాయి. 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లు ఆగిపోయాయి. అమ్మఒడి అరకొరగా మిగిలిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన ఆగిపోయింది. ఏడు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్. ఒక్కొక్క క్వార్టర్కు రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు చొప్పున రూ.4,500 కోట్లు నుంచి రూ.4,900 కోట్లు విడుదల చేయాలి. కానీ ఈయన ఇచ్చింది రూ.700 కోట్లే. వసతి దీవెన రూ.2,200 కోట్లు ఇవ్వాలి. రూపాయి కూడా ఇచ్చింది లేదు. » వైద్య రంగంలో చూస్తే రూ.25 లక్షల వరకు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ వారికి ఆరోగ్య భద్రత కలి్పంచే ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. ఈ పథకానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 17 నెలలకు దాదాపు రూ.5,100 కోట్లు ఇవ్వాలి. కానీ రూ.వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టారు. దీంతో వైద్యం అందించలేక నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేసాయి. ఈ రోజు వాళ్లు విజయవాడలో ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. పేద వాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ ఆస్పత్రులు..పేదవాడిని వదిలేసి చంద్రబాబు పుణ్యమా అని ఆందోళనకు దిగాయి. » ఆరోగ్య ఆసరా గాలికెగిరిపోయింది. 104, 108.. కుయ్..కుయ్..కుయ్ అంటూ రావాల్సిన ఈ అంబులెన్స్ల నిర్వహణను రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని చంద్రబాబు మనిషికి ఇచ్చారు. ఇలా అయితే 104, 108 సర్వీసులు ఇంకేమి నడుస్తాయి? విలేజ్ క్లినిక్లు, పీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రులు గాలికెగిరిపోయాయి. జీరో వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ అటకెక్కింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్వోజీఎంపీ ప్రమాణాల మేరకు మందులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆ మందులు దేవుడెరుగు కనీసం దూదికి కూడా దిక్కు లేదు. -
రైతులను నిలువునా ముంచేస్తారా?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంత దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత రబీ సీజన్లో రాయలసీమ ప్రాంతంలో వేరు శనగ (బుడ్డ శనగ) విత్తనం వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే, గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేసిందే తప్ప ఇంతవరకు కార్యాచరణే ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు దయనీయ, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. ‘ఉల్లి రైతును గాలికొదిలేశారు. గడిచిన 60రోజుల నుంచి కిలో రూ.3 కన్నా దాటడం లేదు. ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 ఇస్తామని చెప్పింది. ఎవరికిస్తున్నారో ఎవరికీ తెలియదు.’ ఎవరికీ ఇచ్చిందీ లేదు.ప్రభుత్వంపై రైతులు నిరసన తెలిపేసరికి హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటివరకు విధివిధానాలే రూపొందించలేదు. ధాన్యానికి గతేడాది గిట్టుబాటు ధర లేక బస్తా రూ.1,100 నుంచి రూ.1,200కు తెగనమ్ముకునే పరిస్థితి. ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా పత్తి గతంలో రూ.12 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కు మించి పలకడం లేదు. అరటి పంట గతంలో టన్ను గరిష్టంగా రూ.28 వేలు పలికితే ఇప్పుడు రూ.3,500కు మించి పలకడం లేదు. కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ, పంట నష్టపరిహారం కానీ ఇవ్వడంలేదు. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే ఏ అధికారి కూడా వెళ్లి ఎన్యుమరేషన్ చేయలేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కు అవసరమైన హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదని.. హైదరాబాద్లో హైటెక్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏకంగా రూ.87 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను నెలకొల్పుతున్న అదానీ పేరును గూగుల్తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు కనీసం ప్రస్తావించకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ దుయ్యబట్టారు. డేటా సెంటర్ను అదానీ సంస్థే నిర్మిస్తుందని.. ఆ సంస్థకు మూడు చోట్ల భూమిని అప్పగించాలంటూ ఈనెల 4న గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు రాసిన లేఖే నిదర్శనమంటూ.. వైఎస్ జగన్ ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్లో తమ ప్రభుత్వ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. డేటా సెంటర్కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని.. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ సైతం రాశామని పేర్కొంటూ ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. నోయిడాలో అదానీ ఎంటర్ప్రైజెస్లో డేటా సెంటర్ ఏర్పాటుకు 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందంటూ 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించిందని ఆ క్లిప్పింగ్ను చూపారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లకు సంబంధించి గూగుల్తో వ్యాపార అనుబంధం ఉన్న అదానీ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశామని.. అందుకోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించామని గుర్తు చేశారు. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ను విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో క్రెడిట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, సింగపూర్, కేంద్ర ప్రభుత్వానికి, అదానీకి దక్కుతుందని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన యాడ్ ఏజెన్సీ తరహాలో నడుస్తోందని తూర్పారబట్టారు. సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. అదానీ ప్రాజెక్టుకు గూగుల్ విస్తరణ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి.. వీరందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోజు వేసిన విత్తనమే ఈ రోజు డేటా సెంటర్ కొనసాగింపు! గూగుల్ నెలకొల్పే 1,000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. గూగుల్, అదానీ ఎంటర్ప్రైజెస్ మధ్య డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార సంబంధాలపై 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా (క్లిప్ ప్రదర్శించారు) కథనం కూడా ప్రచురించింది. నోయిడాలోని అదానీ డేటా సెంటర్లో 4.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గూగుల్ లీజుకు తీసుకుందన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఇక్కడ (విశాఖలో) 2023 మే 3న అదానీ డేటా సెంటర్కు పునాది వేశాం. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే.. అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జీవో ఇచ్చాం. ఆ వెంటనే 2021 మార్చి 9న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలో మీటర్ల మేర సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో కోరాం. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. డేటా సెంటర్ నిర్మించేది అదానీ సంస్థే.. విశాఖలో కూడా అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఈ మేరకు గూగుల్కు చెందిన అలెగ్జాండర్ స్మిత్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు అండ్ కో ఇటీవల ఢిల్లీ వెళ్లి హడావుడి చేయకముందే.. సంతకాలు చేయకముందే.. 2025 అక్టోబర్ 4న అదానీ ఇన్ఫ్రాకు చెందిన మూడు కంపెనీలకు భూమి కేటాయింపులు చేయాలని గూగుల్ సంస్థ ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ను లేఖలో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కు అవసరమైన హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? ఎందుకు భయపడుతున్నారు? ఆ పేర్లు చెప్పడం మొదలు పెడితే.. బ్యాక్గ్రౌండ్లో వైఎస్సార్సీపీ వస్తుంది కాబట్టి. వైఎస్సార్సీపీ హయాంలో 300 మెగావాట్ల డేటా సెంటర్కు బీజం పడినప్పుడే.. గూగుల్, అదానీకి డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి వ్యాపార సంబంధం ఉంది. కేంద్రం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ తెచ్చే కార్యక్రమానికి బీజం పడిందని చెప్పటానికి చంద్రబాబు సంశయించారు. క్రెడిట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. బాబు ముఖారవిందాన్ని చూసి వచ్చేసినట్లు బిల్డప్.. డేటా సెంటర్లో అతి ముఖ్యమైన విషయం.. సింగపూర్, విశాఖ మధ్య సబ్ సీ కేబుల్ (సముద్ర గర్భంలో కేబుల్ వ్యవస్థ) 3,900 కిలోమీటర్ల మేర నిర్మాణం. అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ వ్యవస్థను తీసుకుని రావాలని అప్పట్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కేంద్రం, సింగపూర్ ప్రభుత్వం సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి తన సుందర ముఖారవిందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మిగిలిన వాళ్లందరి కృషిని సైడ్ లైన్ చేసేశారు. రూ.87 వేల కోట్లు పెడుతున్న అదానీ.. గూగుల్– రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో కనీసం కనిపించలేదు. 190 ఎకరాలు కేటాయింపు.. వైఎస్సార్సీపీ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 190 ఎకరాలు విశాఖలో కేటాయించాం. మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో 60 ఎకరాలు ఇచ్చాం. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నానికి తీసుకురావడానికి అంకురార్పణ చేశాం. ఇవాళ కొత్తగా వస్తున్న 1,000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు.. నాడు 300 మెగావాట్ల ప్రాజెక్టు ఇవ్వడమే కీలకంగా మారింది. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని డామినేట్ చేసే టెక్నాలజీ. ఏఐ అయినా, క్వాంటం కంప్యూటింగ్ అయినా.. భవిష్యత్తులో గొప్ప మార్పులకు డేటా సెంటర్ నోడల్ పాయింట్గా ఉంటుంది. డేటా సెంటర్తో ఉద్యోగాలు తక్కువే అయినా.. ఎకో సిస్టమ్ తయారవుతుంది. తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయి. కాబట్టి వీటికి మా ప్రభుత్వంలోనే నాంది పలికాం. కేవలం 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి అంతటితో మేం ఆగలేదు. ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో 25 వేల ఉద్యోగాలు కల్పించాలని కోరాం. ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు తీసుకొచ్చేలా ఒప్పందంలో పెట్టాం. క్రెడిట్ చోరీల్లో బాబు పీక్..! చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్తకాదు. హైదరాబాద్ విషయంలోనూ చంద్రబాబుది సేమ్ స్టోరీ. మాదాపూర్లో సైబర్ టవర్స్.. ఆరు ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు. దానిపేరు హైటెక్ సిటీ. నిజానికి అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్.జనార్థన్రెడ్డి పునాది వేశారు. చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని చేపట్టేందుకు నాడు జనార్దన్రెడ్డి శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు. దాంతో హైదరాబాద్ మొత్తం నేనే కట్టానని బిల్డప్ ఇస్తున్నారు. ⇒ 2004లో చంద్రబాబు ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆయన చేతుల్లో లేదు. 2004, 2009లో వైఎస్సార్ గెలిచారు. తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గెలిచారు. ఏకంగా 20 ఏళ్లపాటు చంద్రబాబుకి, హైదరాబాద్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తనదే అంటారు. ఇదీ చంద్రబాబు బిల్డప్. ⇒ అయ్యా చంద్రబాబూ.. ఆరు ఎకరాల్లో 1.40 లక్షల చదరపు అడుగుల్లో చిన్న బిల్డింగ్ కడితే.. హైటెక్ సిటీ అని పేరు పెడితే.. దానితోనే అభివృద్ధి చెందింది అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్లిపోయావు. 2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్–1ను 126 కి.మీ. ప్రాజెక్టును 2006లో ప్రారంభించి 2012లో పూర్తిచేశారు. అది హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేసింది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే 11.6 కి.మీ. ఫ్లైఓవర్.. దేశంలోనే అతి పొడవైనది. దీనిని అక్టోబర్ 2005లో ప్రారంభించి 2009 అక్టోబర్ 19న పూర్తి చేశారు. ⇒ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మార్చి 2005లో ప్రారంభిస్తే 23 మార్చి 2008లో పూర్తి చేశారు. ఇవన్నీ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించి పూర్తి చేసినవే. ⇒ చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, అనుబంధ ఎక్స్పోర్ట్స్ రూ.5,660 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీఎం అయ్యాక 2004–09లో ఐటీ, అనుబంధ రంగాల ఎగుమతులు రూ.32,509 కోట్లకు చేరాయి. ఆయన అవన్నీ పూర్తి చేసి హైదరాబాద్ను అభివృద్ధి చేయడంతోనే ఇదంతా జరిగింది. ⇒ వైఎస్సార్ రెండో సారి గెలిచి సీఎం అయిన కొద్ది నెలలకే చనిపోయినా.. ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం కొనసాగింపులో భాగంగా 2013–14లో ఐటీ ఎక్స్పోర్టులు రూ.57 వేల కోట్లకు చేరాయి. కానీ, చంద్రబాబు హైదరాబాద్ను నేనే కట్టేశా... ఐటీ అంటే నేనే అని చెప్పుకుంటున్న పరిస్థితి..! ఈ వ్యత్యాసం చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నాన్న తర్వాత కేసీఆర్ రెండు టెర్మ్లు పాలించారు. ఆయన కూడా గొప్పగా వైఎస్సార్ ఆపిన దగ్గర నుంచి ప్రారంభించి గొప్పగా పాలించారు. తద్వారా హైదరాబాద్ ఐటీలో టాప్లోకి వెళ్లింది. ⇒ చంద్రబాబు హయాంలో రూ.5,660 కోట్లు దగ్గర నుంచి.. ఈరోజు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లకు చేరాయి. 20 ఏళ్లలో ఇంత జరిగితే.. మొత్తం హైదరాబాద్ నేనే కట్టా అంటే ఎలా? చంద్రబాబుకు ఇది కొత్తకాదు. పబ్లిసిటీ స్టంట్స్ చేస్తారు. వేరేవాళ్లకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్లకు ఇవ్వకపోవడం చంద్రబాబుకు ఉన్న దుర్మార్గపు నైజం.అభివృద్ధికి విజన్ ఉండాలి.. మా హయాంలో అదానీ డేటా సెంటర్ తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, రిషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్.. ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు. విశాఖపట్నం నుంచి ఎయిర్ పోర్టుతో పాటు మూలపేట పోర్టుకు అనుసంధానిస్తూ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఈ కారిడార్ ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి మరీ స్టేట్మెంట్ ఇప్పించాం. అదీ విజన్ అంటే. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది. నంబర్స్ కనిపిస్తాయి. మా హయాంలో దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో రెండేళ్లు కోవిడ్ ఉన్నా గొప్పగా అభివృద్ధి, సేవలందించాం. గొప్ప సంస్కరణలకు శ్రీకారం.. మా హయాంలో నాడు–నేడు ద్వారా స్కూళ్లు మార్చాం. డిజిటల్ క్లాస్ రూమ్స్, టోఫెల్ క్లాస్లు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, సీబీఎస్ఈ కాదు ఐబీ సిలబస్ తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తెచ్చాం. గ్రామాల్లో పౌర సేవలను గడప వద్దకు తీసుకువచ్చాం. గవర్నమెంట్ సేవల్లో పారదర్శకత ఉండదనే భావన లేకుండా చేశాం. ప్రభుత్వ సేవలు లంచాలు లేకుండా పొందగలమనే అభిప్రాయం ప్రజల్లో స్వచ్ఛందంగా నిరూపించగలిగాం. గొప్ప సంస్కరణలు తీసుకువచ్చాం. అందుకే సంతోషంగా, గర్వంగా ఉన్నాం. మూడేళ్లలో ఎవరూ చేయలేని గొప్ప కార్యక్రమాలు చేయగలిగాం. అందుకే ఇప్పటికీ చిరునవ్వుతో మా పార్టీ క్యాడర్ ఏ గడప వద్దకు అయినా వెళ్లగలుగుతున్నారు. మహిళా సాధికారత, సంస్కరణలు మాకు శ్రీరామ రక్ష. అందుకే ప్రజలను మమ్మల్ని ఇప్పటికీ ఆత్మీయంగా ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖను నిలబెట్టాలని..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ కీలక కేంద్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నే రీతిలో ఏపీ ఉండాలంటే విశాఖను అభివృద్ధి చేయాలని తలపెట్టాం. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం. అందులో భాగంగా 2,700 ఎకరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశాం. భూ సేకరణకు, ఆర్అండ్ఆర్కు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. గతంలో చంద్రబాబు ఈ ఎయిర్పోర్టుకు కేవలం 377 ఎకరాలు మాత్రమే భూమిని సేకరించారు. వైఎస్సార్ సీపీ హయాంలో వేగంగా చర్యలు చేపట్టి 30 శాతం పనులు పూర్తి చేశాం. మరో ఏడాదికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అంతే కాదు.. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చే ప్రయత్నం చేశాం. భూ సేకరణతో పాటు అన్ని అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించి 30 శాతం పనులు పూర్తి చేశాం. విజయనగరంలో మెడికల్ కాలేజీ కడితే 3 బ్యాచ్లు క్లాసులు, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్కు రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.600 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ రోగులకు శాశ్వత పరిష్కారం చూపించాం. ⇒ సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు దాదాపు పూర్తి చేశాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. నక్కపల్లిలో ఇండ్రస్టియల్ హబ్, అన్నవరంలో ఒబెరాయ్ హోటల్ రిసార్ట్ తీసుకొచ్చాం. డెస్టినేషన్గా విశాఖపట్నం ఉండాలంటే 5 స్టార్ హోటళ్లు కాదు.. ఏకంగా ఫైవ్ స్టార్ రిసార్టులు ఉండాలని సంకల్పించాం. ⇒ రుషికొండ హై ఎండ్ టూరిజం రిసార్ట్ నిర్మించాం. అదొక మాన్యుమెంట్ బిల్డింగ్. అమరావతిలో చదరపు అడుగకు రూ.10 వేలు పెట్టి.. కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు కడతారో అర్థం కాదు. అదే సెక్రటేరియట్ రెండుసార్లు కడతారు.. అదే అసెంబ్లీ రెండు సార్లు కడతారు. డబ్బులు వృథా చేస్తుంటే ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే.. ఎల్లో మీడియా మొత్తం వాళ్లే. అంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం! బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో సైతం ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.4500 దాటదు. కానీ అమరావతిలో రూ.10 వేలు పెట్టి కడుతున్నారు. ఎవడూ స్కామ్ అనడు. ఎందుకంటే స్కాములో వీళ్లంతా భాగస్వాములే.అదానీ డేటా సెంటర్కు కొనసాగింపే గూగుల్‘‘డేటా సెంటర్ను మేం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మద్దతు ఇస్తున్నాం. మేం విత్తనం వేశాం కాబట్టే డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. అదానీ డేటా సెంటర్కు కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్. ప్రస్తుతం మనం ఏఐ యుగం, క్వాంటం కంప్యూటింగ్ యుగాల్లోకి పోతున్నాం. వీటన్నింటికీ హబ్ అనేది డేటా సెంటర్. డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. పవర్ రిక్వైర్మెంట్, వాటర్ గజిలింగ్ (ఎక్కువ విద్యుత్, ఎక్కువ నీటి వినియోగం) లాంటి కొన్ని సమస్యలు వచ్చినా సర్టైన్ కెపాసిటీ బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటి దాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. డేటా సెంటర్తోపాటు ఐటీ స్పేస్ కూడా కట్టాలి.. తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని మేం ఒప్పందంలో పెట్టగలిగాం. నిర్దేశించిన సమయంలోగా ఇవన్నీ కట్టాలి, రావాలి అని ఒప్పందంలో పొందుపరిచాం. ఇది వీళ్లు చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఎకో సిస్టమ్ అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది’ అని వైఎస్ జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. -
క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
-
నాన్స్టాప్ ఉతుకుడు.. సరిపోయిందా బాబూ?
సాక్షి,తాడేపల్లి: ఎఫీషియన్సీ వీక్..క్రెడిట్ చోరీలో పీక్ అంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దుమ్మెత్తిపోశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. గూగుల్ డాటర్ సెంటర్కు బీజం వేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డాటా సెంటర్ ఇది. వేరే వాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు..అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డాటా సెంటర్పై వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి. మద్యం ఇకపై అమ్మేటప్పుడు బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అసలు ఆ షాప్లు ఎవరి చేతుల్లో ఉన్నాయి. అవి చంద్రబాబు చేతుల్లోనే కదా? అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు కాదా?. మరి అలాంటప్పుడు ఎవరు స్కాన్ చేసేది?.అంటూ మద్యం అమ్మకాలు,కల్తీ మద్యంపై వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన,వైఎస్సార్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలను మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ వైఎస్ జగన్ను స్పందన కోరారు. అందుకు వైఎస్ జగన్ ఏమన్నారంటే? ఈ లింక్ క్లిక్ చేయండిఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసి చంద్రబాబు వికృత ఆనందం పొందుతున్నాంటూ దుయ్యబట్టారు. ఇలా ఉద్యోగుల్నే కాదు రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు చేస్తున్న మోసాల్ని వైఎస్ జగన్ కళ్లకు కట్టినట్లు చూపించారు. చంద్రబాబు మోసాలేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండిహైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదు. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బిల్డప్ ఇస్తారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారింది. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం. ‘ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ అంటూ హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు ఇస్తున్న బిల్డప్ను బయటపెడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో సంవత్సరాలతో సహా వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి తీరుతెన్నులపై వైఎస్ జగన్ ఏమన్నారో ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. -
చంద్రబాబు దిగిపోయాకే పెరిగిన ఐటీ ఎగుమతులు
-
గూగుల్ డేటా సెంటర్.. చంద్రబాబు రోల్ నిల్..
-
అదానీ పేరెందుకు ప్రస్తావించడం లేదు?
-
చంద్రబాబు ఎఫీషియన్సీ వీక్..క్రెడిట్ చోరీలో పీక్: వైఎస్ జగన్ (ఫోటోలు)
-
తుని ఘటనపై రిపోర్టర్ ప్రశ్నకు జగన్ అదిరిపోయే ఆన్సర్
-
ఉద్యోగులను రోడ్డు మీద నిలబెట్టి డె చంద్రబాబు వికృతానందం
-
2004లో నువ్వు ఓడిపోయినా తర్వాత.. హైటెక్ సిటీపై జగన్ షాకింగ్ నిజాలు
-
బుద్ధిలేదా ..? తాగి అసెంబ్లీకొచ్చి
-
చిరు-బాలయ్య ఎపిసోడ్పై స్పందించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్య చేశారు. ఇది అటు అభిమానుల మధ్యే కాదు.. ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే తాజాగా ఈ ఎపిసోడ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ఓ రిపోర్టర్ వైఎస్ జగన్ను స్పందన కోరారు. ‘‘అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి?. పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుతించారు?. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్కు బుద్ది లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి’’ అని జగన్ అన్నారు. ఇదిలా ఉంటే..శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఆనాడే ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని, ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
మీకే తెలియాలయ్యా! నాకు తెలీదు.. నేను తాగను..! మీడియాతో జగన్ సెటైర్లు
-
ఉద్యోగులపై బాబు డ్రామా.. టీడీపీ వికృత ఆనందం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులనూ మోసం చేసిందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. డైవర్ట్ చేస్తూ దీపావళి సంబురాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ప్రభుత్వంలో నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారు. ఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారు. అది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్లో ఇస్తామని అంటున్నారు). డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారు. దీనికే దీపావళి సంబురాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. కోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదు. ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం. ఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు. ఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు.ఇది కూడా చదవండి: గూగుల్ డేటా సెంటర్పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. అరచేతిలో వైకుంఠం..ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారు. టీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారు. ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. మొత్తం రూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు. ఒక్క నెల ఇచ్చారంతే. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారు. ఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదు. అప్పుడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో. ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. అంతా తిరోగమనే కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్ జగన్సంక్షేమం నిల్.. స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయి. కనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారు. మా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. -
హైదరాబాద్ అభివృద్ధిలో బాబుకు సంబంధమే లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయిందని తెలిపారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్త తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారు. దాని పేరే హైటెక్ సిటీ. ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్. కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరు. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారు. 2004, 2009లో వైఎస్సార్ విజయం సాధించారు. 20 ఏళ్ల పాటు బాబుకు, హైదరాబాద్కు సంబంధమే లేదు. కానీ, ఈ మధ్య జరిగిన అభివృద్ధి అంతా నాదే అని చంద్రబాబు అంటారు.2004లో వైఎస్సార్ ఓఆర్ఆర్ ఫేజ్-1 ప్రారంభించారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయింది. ఆ తర్వాత ఆ అభివృద్ధి అలా కొనసాగింది. పీవీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించింది వైఎస్సారే. మహానేత వైఎస్సార్ హయాంలోనే జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం. బాబు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ 5650 కోట్లు. అదే వైఎస్సార్ వచ్చాక 2008-09 ఐటీ ఎగుమతులు 32509 కోట్లకు చేరింది. 2013-14లో ఐటీ ఎగుమతులు 57000 కోట్లుగా ఉంది. కేసీఆర్ కూడా గొప్ప పరిపాలన అందించారు. కేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగింది. కానీ, ఈ క్రెడిట్ అంతా నాదేనని బాబు చెప్పుకుంటారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం’ అని విమర్శలు చేశారు. -
TDP లిక్కర్ క్యూఆర్ కోడ్ స్కాన్ పై జగన్ మాస్ ర్యాగింగ్
-
YS Jagan: టిష్యూ పేపర్ కి ఎక్కువ.. బాత్ పేపర్ కి తక్కువ..
-
YS Jagan: చంద్రబాబు నీకు దమ్ముంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు
-
Google Data Center: క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యాడ్ ఏజెన్సీలా నడిపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాం. రాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయింది. ఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్ర పరిస్థితి వీక్. వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు.ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది. వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు.అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్కి రాబోతోంది. వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు. చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. వైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు’ అని తెలిపారు. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. గూగుల్ డేటా సెంటర్ను నిర్మించేది అదానీనే. జగన్ సర్కార్ వల్లే డేటా సెంటర్ వచ్చిందని చెప్పలేకపోయారు.క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. బాబును చూసి గూగుల్ వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. డేటా సెంటర్తో ఉద్యోగాలు పెద్దగా రావు. కానీ, ఎకో సిస్టమ్ బిల్డు అవుతుంది. భవిష్యత్లో పెద్ద మార్పులకు డేటా సెంటర్ కీలకం. డేటా సెంటర్తో పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి.. ఐటీ పార్క్, రిక్రేయేషన్, స్కిల్ సెంటర్ పెట్టాలని ఆలోచన చేశాం. 25వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం కూడా చేశాం. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అని సెటైర్లు వేశారు. -
చాల స్మార్ట్ గా ఉన్నాడు.. అయ్యన్నపై జగన్ ఫన్నీ కామెంట్స్
-
చక్కగా ఆయుధ పూజ చేసి పెట్టరయ్య.. టీడీపీ నకిలీ మద్యంపై జగన్ సెటైర్లు
-
ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వ్యవస్థీకృత పద్దతిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోందన్నారు. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని తెలిపారు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోంది. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. ఆక్షన్లు వేసి మరీ బెల్లు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇది బయటకు వచ్చింది. ములకలచెరువులోనే 20208 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయి. 1050 లీటర్ల స్పిరిట్ అక్కడ దొరికింది. వీటితో వేల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేయవచ్చు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారు.ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అనకాపల్లి జిల్లా పరవాడలోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీకి బయటకు వచ్చింది. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లే, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రైవేటు మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు బెల్టుషాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లకు సరఫరా చేస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!. కల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లే.. చేసింది.. చేయిస్తోంది చంద్రబాబే. టాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారు. ఎల్లో మీడియా బిల్డప్పులు..ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?. నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేష్లకు అలవాటే. ఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులు. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారు. ఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్లంటూ హడావిడి చేశారు. చేసేది వీళ్లే.. కథా స్క్రీన్ప్లే అంతా వాళ్లదే. ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. ఎన్టీఆర్కు వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు అన్నీ మోసాలే. తప్పులు చేయడం.. వేరే వారిపై నెపం నెట్టేయడం బాబుకే సాధ్యం. బాబు నేరాలను కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. టాపిక్ డైవర్షన్లో భాగంగా ఎదుటివారిపై బురద చల్లుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తారు. నకిలీ మద్యం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి నిందితుడు. విదేశాల్లో ఉన్న జనార్థన్ రావు రెండు రోజుల్లో లొంగిపోతాడంటూ ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తారు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం..అసలు జనార్దన్రావు ఎవరు?. జనార్దన్తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారు. తన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారు. తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఈలోపే డైవర్షన్ పాలిటిక్స్తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించింది. లాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. షాపుల సంఖ్య తగ్గించాం. టైమింగ్ పెట్టి నడిపించాం. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు లేవు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లు. కాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారురేపల్లే పేకాట కింగ్..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు. ఇదసలు హైలైట్ కావాల్సిన అంశం. లిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల దాకా అంతా చంద్రబాబు మనుషులే. దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?. ఎవరి క్యూఆర్కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?. మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?. క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది. ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోంది. రేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే తమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే. బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే. సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయి. అందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు. లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణం. లిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగింది. ఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్’ అని విమర్శించారు. -
కూటమి అరాచకాలపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తోందని, చేసిన తప్పును అవతలి వాళ్ల మీదకు నెట్టేయడం చంద్రబాబుకి, ఆయన తనయుడు నారా లోకేష్ అలవాటైన పనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్పై కూటమి ప్రభుత్వం.. దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేస్తోంది తెలియజేస్తూనే కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.జగన్ ప్రెస్మీట్ హైలైట్స్గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారుగ్రామ సచివాలయం, వలంటీర్లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారుపొలిటికల్ గవర్నరెన్స్ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతోంది ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితిబీమా సంగతి పట్టించుకోవడం లేదువర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం రైతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేయలేదుసబ్సిడీ విత్తనాలు ల్లేవ్ఉల్లి రైతులను గాలికి వదిలేశారుఅరటి, టమాట, పత్తికి డిమాండ్ లేదుక్వింటాల్ పత్తికి ఒకప్పుడు రూ.12 వేలు ఉండేది.. ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదుటమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారుపరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారురాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయిస్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయిందివిద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదువైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయిప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కలేదుకనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారుమా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందిదానిని గవర్నర్కు సమర్పించి.. రాష్ట్ర ప్రజల రెఫరండంను తెలియజేస్తాంఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారుజీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదుఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదుఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదుఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారుఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారుటీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారుఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారుమొత్తంరూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారుప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు.. ఒక్క నెల ఇచ్చారంతేకనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదుకాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారుపోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ పెండింగ్లో పెట్టారుఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదుఅధికారంలోకి వచ్చిన వారంలోనే ఐఆర్ ఇచ్చాంకోవిడ్ సమయంలోనూ వాళ్ల సంక్షేమం గురించే ఆలోచించాంమేం తెచ్చిన జీపీఎస్ను కేంద్రం, రాష్ట్రాలు ప్రశంసించాయిఆనాడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో ఉద్యోగులనూ చంద్రబాబు మోసం చేశారునాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారుఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదుఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారుఅది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్లో ఇస్తామని అంటున్నారు)డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారుదీనికే దీపావళి సంబురాలు అంంటూ ప్రకటనలు చేస్తున్నారుకోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదుఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం తనను చూసే గూగుల్ వైజాగ్కి వచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారుహైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారుదాని పేరే హైటెక్ సిటీహైటెక్ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరుఅసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్తో సంబంధమే లేదుఅయినా అభివృద్ధి తనదేనంటూ బిల్డప్ ఇస్తుంటారువాస్తవం ఏంటంటే.. 2003-04 వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచే హైదరాబాద్లో నిజమైన అభివృద్ధి మొదలైందిఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయిఆ తర్వాత వైఎస్సార్ లేకపోయినా.. ఆ అభివృద్ధి అలా కొనసాగిందికేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగిందిక్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబుకి ఉన్న దుర్మార్గపు నైజంహైదరాబాద్ అభివృద్ధికి అసలు చంద్రబాబుకే సంబంధం లేదు డాటా సెంటర్ వల్ల ఉద్యోగవకాశాలు తక్కువే, కానీ, భవిష్యత్తులో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందిభవిష్యత్తులో పెద్ద మార్పులకు డాటా సెంటర్ కీలకందీనికి వైఎస్సార్సీపీ హయాంలోనూ నాంది అప్పుడే పడిందిఅందుకే తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో ఒప్పందం చేసుకున్నాంఅదే సమయంలో.. ఐటీ పార్క్ రీక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టి 25 వేల ఉద్యోగాలు కావాలని కోరాం ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్కి రాబోతోందిముమ్మాటికీ వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇదివేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారుఅదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారువైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయిఅదానీ కట్టాక గూగుల్ దీనిని వాడుకుంటుందిఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారుచంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదుజగన్ సర్కార్కు ఆ క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదువైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు 2020లో.. కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం2021 మార్చిలో సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాశాం2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు వైజాగ్లో శంకుస్థాపన కూడా చేశాంఆనాడే.. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే అంకురార్పణ జరిగిందిదీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చిందివైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇదివైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే వైజాగ్ గూగుట్ డాటా సెంటర్ గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం..వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాంరాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయిందిఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందిక్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్రపరిస్థితి వీక్వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణంలిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగిందిఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేశారుకోర్టుకు వెళ్లడంతో సైలెంట్ అయిపోయారుచంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్ అసలు జనార్దన్రావు ఎవరు?జనార్దన్తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారుఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారుతన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారుతప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారుఈలోపే డైవర్షన్ పాలిటిక్స్తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించిందిలాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాంషాపుల సంఖ్య తగ్గించాంటైమింగ్ పెట్టి నడిపించాంఇల్లీగల్ పర్మిట్ రూమ్లు లేవుక్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లుకాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాంఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు ఇదసలు హైలైట్ కావాల్సిన అంశంలిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల దాకా అంతా చంద్రబాబు మనుషులే దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?ఎవరి క్యూఆర్కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోందిరేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారునకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులేతమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులేబెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులేసీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయిఅందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు జనార్దన్రావు వీడియోలో ఎలా మాట్లాడారు?.. ఫోన్ పోయిందని జనార్దనే చెప్పాడు. మరి ఫోన్ పోతే చాటింగ్ ఎలా బయటకు వచ్చింది?. అసలు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?ఈ 20 రోజుల్లో జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?.. పాస్పోర్టును ఎందుకు సీజ్ చేయలేదు?.. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు.. పెద్దిరెడ్డి సోదరుడిపై జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎందుకు పోటీకి నిలబెట్టారు? టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు?తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని అఫిడవిట్లోనే జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.. మరి అప్పుడు ఆఫ్రికా లింకులు చంద్రబాబుకి, ఆయన టిష్యూ పేపర్లకు కనిపించలేదా?పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది?నకిలీ మద్యం బయటపడ్డాక ఎన్ని తనిఖీలు నిర్వహించారు? ఎన్ని బాటిళ్లను పట్టుకున్నారు?అన్ని చోట్ల దొరుకుతుందనే తనిఖీలు చేయలేదా?చంద్రబాబుకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారుఆర్గనైజ్డ్గా క్రైమ్చేయడం చంద్రబాబు, లోకేష్లకు అలవాటేఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులుమాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారుఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్లంటూ హడావిడి చేశారుచేసేది వీళ్లే.. కథా స్క్రీన్ప్లే అంతా వాళ్లదే ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!ఒక మొలకల చెరువులోనే 20 వేల లీటర్ల నకిలీ మద్యం బయటపడిందికల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లేచేసింది.. చేయిస్తోంది చంద్రబాబేటాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారుప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది విజయవాడ సీపీ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారుఅక్రమ మద్యం కేసులో మా పార్టీ వాళ్లను అనవసరంగా వేధిస్తున్నారుఅన్నమయ్య జిల్లా తంబళపళ్లె, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా పరవాడ, పాలకొల్లు, నెల్లూరులోనూ నకిలీ మద్యం బయటపడిందిపట్టుబడకుంటే వేల లీటర్ల మద్యం తయారయ్యేదే రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయిప్రైవేట్ మద్యం మాఫియా నడుస్తోందిపోలీసుల భద్రత నడుమ గ్రామాల్లో అమ్మకాలుఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారుబెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్రూమ్లు నిర్వహిస్తున్నారుడబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారుప్రభుత్వ ఖజానాకు వేల కోట్లకు గండి కొడుతున్నారువాటాల్లో తేడాలు రావడంతోనే ఇదంతా బయటపడింది ఏపీలో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైందిఇలాంటి మాఫియా ప్రపంచంలో ఎక్కడా చూడలేదునకిలీ మద్యం కోసం చిన్నపాటి పరిశ్రమల్నే ఏర్పాటు చేశారునకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది వాళ్లే.. బెల్ట్షాపులు పెట్టి నడిపిస్తోంది వాళ్లే ఇవాళ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాంనకిలీ మద్యం కేసులో నాణేనికి రెండో వైపు గురించి.. విశాఖలో డేటా సెంటర్ గురించి చంద్రబాబు చేస్తున్న గిమ్మికులు, డ్రామాల గురించి, అసలు వాస్తవాలేంటివి అనేది..ఉద్యోగులకు ఏరకంగా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు?.. ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నారనేదానిని మీడియా మీద ప్రజల దృష్టికి తీసకెళ్తా.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఈ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా.. -
బాబు అరాచక పాలనపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సర్కారు మెడలు వంచుతాం
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తమతో కలసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలసి ఉద్యమిస్తామని తెలిపారు. ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్ను బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శైలజానాథ్, చెల్లుబోయిన వేణు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణతోపాటు ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు సజ్జల చెప్పారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తి చేసి వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలసి గవర్నర్కి అందజేస్తారని చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో భావి తరాలు ఎంత నష్టపోతాయో ప్రజలకు వివరిస్తున్నాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం. ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ అక్టోబర్ 23న అన్ని జిల్లా కేంద్రాల్లో, 24న నియోజకవర్గ కేంద్రాల్లో, 25న మండల కేంద్రాల్లో జరుగుతుంది. కోటి సంతకాల ప్రతులు నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్ర కార్యాలయాలకు, నవంబర్ 24న కేంద్ర కార్యాలయానికి చేరతాయి. వైఎస్సార్సీపీ హయాంలోనే 7 కాలేజీలు పూర్తి.. వైఎస్సార్సీపీ దిగిపోయే నాటికి 7 కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేశాం. మరో 3 కాలేజీలు ఆదోని, మదనపల్లె, మార్కాపురంలో 80 నుంచి 90 శాతం పనులు పూర్తి చేసుకుని అడ్వాన్స్ దశలో ఉండగా మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక్క రోజులో జరిగే పనికాదు. కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రి పూర్తి కావడానికి 9 ఏళ్లు పట్టిందనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోతే ఎలా? ఒకపక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి కట్టబెడుతూ, తాను ఉచితంగా వైద్యం అందిస్తానంటే వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థలు లాభాపేక్ష లేకుండా మెడికల్ కాలేజీలు ఎలా నడుపుతాయి? చంద్రబాబు చెబుతున్న పీపీపీ మోడల్ వల్ల భూమి, భవనాలు వినియోగించుకుని ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపుకొంటే పేదలు వైద్యం కోసం మరింత నిరుపేదలుగా మారిపోతారు. అలాంటప్పుడు పీపీపీతో నష్టం లేదని ఎలా చెబుతారు? -
రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం (అక్టోబర్ 23) ఉదయం 11గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ రాష్ట్రంలో నకిలీ మద్యం, మహిళలు, చిన్నారులపై వరుస అఘాయిత్యాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. -
అమిత్షాకు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో..‘గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. Warmest birthday greetings to the Honorable Union Home Minister, Shri Amit Shah Ji. I wish him good health and a fulfilling long life.@AmitShah— YS Jagan Mohan Reddy (@ysjagan) October 22, 2025 -
చంద్రబాబు అంటేనే కాపీ కొట్టడం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్ చేసిన పనులను చూసి కాపీ కొట్టడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. అలాగే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవీనగర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశాడు . వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి గ్రీన్ చానల్ అని పెట్టి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించారు. ఆరోగ్య శ్రీ ఉద్యోగులు రోడ్డుపై నిరసనలకు దిగుతున్నారుప్రతి సందర్భంలో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూటమి నేతలు విర్రవీగుతున్నారు. వైఎస్ జగన్ దీపావళి పండగ చేస్తే.. దానిపై బురద జల్లుతున్నారు. వైఎస్ జగన్ చేసిన పనులన్నీ చంద్రబాబు కాపీ కొట్టడమే పని. వైఎస్ జగన్ దీపావళి చేస్తే.. చంద్రబాబు విజయవాడలో దీపావళి చేస్తాడు. వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తే.. చంద్రబాబు విజయవాడలో వినాయక చవితి వేడుకలు ఏర్పాటు చేశాడు. వైఎస్ జగన్ చేసే ప్రతీ పనిని చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. ప్రజల విషయంలో అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపడుతుంది. 28వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపడతాం’ అని చెప్పుకొచ్చారు. -
త్వరలో రాజయ్యపేటకు వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది. బుధవారం వైఎస్సార్సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్కు వివరించారు. ఆయన ఆదేశాలతోనే మేం ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్క్తో క్యాన్సర్, పిల్లలకు వైకల్యం వస్తుందని మంత్రి అనిత చెప్పారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. అనితకు ఇది న్యాయమా?. చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి.... పరిశ్రమలకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ప్రజలే అంటున్నారు. అలాంటప్పుడు స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలా ఏర్పాటు చేస్తారు?. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. అప్పుడు.. ఇప్పుడు.. మేం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాం. బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు కానియ్యం’’ అని అన్నారు. త్వరలో జగన్ రాక.. ‘‘మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ను కట్టనివ్వం’’ అంటూ పలువురు బొత్స వద్ద వాపోయారు.ఈ సందర్భంగా మత్స్యకారులున ఉద్దేశిస్తూ బొత్స మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు. ఈ పోరాటంలో కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను.. జగన్ అధికారంలోకి వచ్చాక తొలగిస్తారు. మీతో పాటు మేము పోరాటం చేస్తాం. మీకు అండగా మేముంటాం. తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు. మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి వెళ్తాం. త్వరలో రాజయ్యపేటకు జగన్ వస్తారు’’ అని బొత్స తెలిపారు. పోలీసుల ఓవరాక్షన్పై..రాజయ్యపేట దీక్షాశిబిరానికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలను విధించారు. అయితే వాటిని దాటుకుని నేతలు అక్కడికి చేరుకున్నారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ‘‘రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు. కనీస మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది. గ్రామస్తులను ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. ఏమైనా సంఘ విద్రోహశక్తులా?’’ అని బొత్స నిలదీశారు. -
ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘మీరూ.. మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఒక్కటైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా..? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులని చంద్రబాబును దుయ్యబడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ఇవన్నీ వెలగని దీపాలే కదా... 1. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3 వేల చొప్పున భృతి.. 2. ప్రతి అక్కచెల్లెమ్మకూ నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18,000.. 3. 50 ఏళ్లకే పెన్షన్.. నెల నెలా రూ.4 వేలు... 4. పీఎం కిసాన్ కాకుండా, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000 ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట.. 5. ఎంతమంది పిల్లలున్నా, ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000 6. ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు 7. అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం..ం 8. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు.. ⇒ ఇవన్నీ.. వెలగని దీపాలో ంలేక చేశామంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా.. లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా? ⇒ వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత.. ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా! ⇒ మా పాలనలో 2019–24 మధ్యం ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు! -
జగన్ హయాం స్వర్ణ యుగమే.. చంద్రబాబుది శ్రమ దోపి‘డీయే’!
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ టక్కుటమార విద్యను ఈ సారీ ఆయన వదులుకోలేదు. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు ఇప్పుడు వారిని దీపావళి సాక్షిగా నిలువునా మోసగించారు. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారంలోకి రాగానే డీఏలతోపాటు ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లిస్తానని చంద్రబాబు పదే పదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన 16 నెలలు తరువాత ఒక్క డీఏ మాత్రమే మంజూరు చేశారు. మూడు డీఏలను తొక్కిపెట్టారు. మంజూరు చేసిన డీఏనూ ఉద్యోగ విరమణ తర్వాత ఇస్తామంటూ ఎన్నడూ లేని వింత విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పీఆర్సీ, ఐఆర్ ఊసే లేదు ఎన్నికల ముందు మెరుగైన పీఆర్సీ, ఐఆర్ అంటూ కల్లబోల్లి మాటలు చెప్పిన చంద్రబాబు 16 నెలలైనా పీఆర్సీ అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్తో రాజీనామా చేయించారు. ఇప్పటి వరకు పీఆర్సీ కమిషనర్ను నియమించలేదు. రూ.34వేల కోట్ల పెండింగ్ బకాయిలు అతీగతీ లేవు. ఆరు నెలల్లోనే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను గాడిలో పెడతానని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ ఇస్తామని, పోలీసులకు శని, ఆదివారాల్లో సెలవులు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. పైగా ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగ విరమణ చేశాక ఇస్తానంటూ తాజాగా జీవో జారీ చేశారు. జగన్ హయాంలో 27 శాతం ఐఆర్వైఎస్ జగన్ తన హయాంలో ఉద్యోగులకు అడుగడుగునా అండగా నిలిచారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఏకంగా 11 డీఏలను మంజూరు చేశారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ మంజూరు చేశారు. ఆ తరువాత పీఆర్సీ సిఫార్సులను అమలు చేశారు. రెండేళ్లపాటు కరోనా వెంటాడినా సరే ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. -
పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా సేవలను గుర్తు చేసుకున్న వైఎస్ జగన్
-
పోలీసు అమరవీరులకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: పోలీసు అమరవీరులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్న వైఎస్ జగన్.. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం అంటూ ఎక్స్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.On this Police Commemoration Day, we solemnly remember and pay heartfelt tributes to the brave police warriors who made the ultimate sacrifice in service to the nation. Let us salute their dedication and courage.#PoliceCommemorationDay— YS Jagan Mohan Reddy (@ysjagan) October 21, 2025 -
కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న వైఎస్ జగన్
-
దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు (ఫొటోలు)
-
వైఎస్ జగన్ నివాసంలో దీపావళి వేడుకలు
బెంగళూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్ ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
చంద్రం పాలనలో వెలుగులు లేని దీపావళి
-
చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై సోమవారం (అక్టోబర్ 20) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. చంద్రబాబు మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4వేలు.4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,0006.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలుఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా.మా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు’ అంటూ ధ్వజమెత్తారు. .@ncbn గారూ… మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? 1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్,…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అహ్మద్ మృతిపై వైఎస్జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎమ్మెల్సీ మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షబ్బీర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. షబ్బీర్ అహ్మద్ నిస్వార్థమైన నాయకుడు. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. షబ్బీర్ సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి.ఇక, మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్.. జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ఆయన సుప్రసిద్ధ ఆలిమ్-ఎ-దీన్ (మత గురువు), నిస్వార్థమైన నాయకుడు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా మిల్లీ (జాతి), విద్యారంగం, సామాజిక సేవలకు అంకితం చేశారు. ముఖ్యంగా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో కౌమ్ (జాతి), మిల్లత్ (సమాజం) శ్రేయస్సు కోసం, అలాగే మతపరమైన, జాతీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన కృషి చేశారు. -
ఉద్దానానికి ఊపిరి ఊదిన జగన్
-
తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి’.వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగ, ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలి. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నా. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.#Deepavali— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
ఫలించిన YS జగన్ కృషి.. రాష్ట్రానికి మెడికల్ సీట్లు
-
ఫలించిన వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగంలో వైద్య విద్య వ్యవస్థ బలోపేతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసిన అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల అందుబాటును పెంచడం కోసం వీలైనంత ఎక్కువ మంది వైద్యులను తయారు చేయడానికి వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 750 ఎంబీబీఎస్ సీట్లతో 2023–24లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ కళాశాలల్లో మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఐదు కళాశాలల్లో మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్, అనస్థీషియా విభాగాల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. ప్రస్తుత 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఈ సీట్లలో అడ్మిషన్లు జరుగనున్నాయి. దీంతో పీజీ చదివే డాక్టర్ల ద్వారా ఆ ఆస్పత్రుల్లో రోగుల సంరక్షణ మరింత మెరుగు పడనుంది.వందకు పైగా సీట్లకు అవకాశం వైద్య కళాశాలల కోసం ఐదు చోట్ల జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా గత ప్రభుత్వంలో అభివృద్ధి చేశారు. ఈ ఆస్పత్రుల్లో పీజీ సీట్లు మంజూరుకు వీలుగా ఐపీ, ఓపీ, సర్జరీలు, ఇతర వనరులు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో వందకుపైగా సీట్లు ఐదు కళాశాలల్లో సమకూరాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేటుకు కట్టబెట్టడంపై పెట్టిన శ్రద్ధ.. వైద్య విద్య బలోపేతంపై పెట్టలేదు. కళాశాలల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ఫ్యాకల్టీ పోస్టులను సకాలంలో భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేని కారణంగానే ఎన్ఎంసీ 60 సీట్లే మంజూరు చేసినట్టు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే మరో 40కి పైగా సీట్లు సమకూరేవని డీఎంఈ వర్గాలు అంటున్నాయి.గత ప్రభుత్వ హయాంలో పీజీ సీట్ల పంట2019కి ముందు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కేవలం 970 పీజీ సీట్లు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు.. ఇలా అన్ని పోస్టులు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా చర్యలు తీసుకున్నారు. రోగుల తాకిడికి అనుగుణంగా పలు కళాశాలల్లో కొత్తగా పోస్టులు సృష్టించారు. ఈ చర్యల ఫలితంగా కళాశాలలకు పెద్ద ఎత్తున పీజీ సీట్లను ఎన్ఎంసి మంజూరు చేసింది. ఈ క్రమంలో ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య రెట్టింపు అయింది. 800 మేర పీజీ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాయి. జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త వైద్య కళాశాలల ద్వారా ఇప్పుడు మరిన్ని పీజీ సీట్లు మన మెడికోలకు అందుబాటులోకి రావడం గమనార్హం.కొత్త వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లు» ఏలూరు కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4 » మచిలీపట్నం కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ పీడియాట్రిక్స్ 4» నంద్యాల కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎంఎస్ ఓబీజీ 4, ఎండీ అనస్థీషియా 4» రాజమండ్రి కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ పీడియాట్రిక్స్ 4, ఎంఎస్ ఓబీజీ 4» విజయనగరం కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ ఓబీజీ 4 -
వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్ల మంజూరు
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హయాంలో స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎంసీ(National Medical Commission). ఇందులో మచిలీపట్నం-12, నంద్యాల-16, విజయనగరం -12, రాజమండ్రి-16, ఏలూరు -4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేసింది. ఐదు మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ పీజీ సీట్లు మంజూరు చేయడంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది అబద్ధమేనని తేలిపోయింది. వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదంటూ మంత్రులు సైతం అబద్ధాలు చెప్పారు. వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలకు తాజాగా పీజీ సీట్లు మంజూరు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పేదంతా అసత్య ప్రచారమేనని నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే 5 కాలేజీల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా, తాజాగా 60 పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎమ్సీ.ఇదీ చదవండి: ‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’ -
ఏపీ సర్వేశాఖతో సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం
సాక్షి, అమరావతి: కార్స్ నెట్వర్క్ వినియోగంపై రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 70 కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీవోఆర్ఎస్–కార్స్) జాతీయ నెట్వర్క్తో అనుసంధానం కానున్నాయి. మంగళగిరిలోని సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేష్కుమార్ మఖవాన, ఏపీ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి, డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్వేయర్ జనరల్ మఖవాన మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా ఏపీ పూర్తిస్థాయి కార్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.4.8 కోట్ల వార్షిక లాభం వస్తుందని, జియోడేటా మౌలిక సదుపాయం కేంద్ర సహకారంతో బలపడనుందని చెప్పారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి సుమారు రూ.2.1 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు. ఐదేళ్లపాటు కార్స్ నెట్వర్క్ నిర్వహణ, అప్గ్రెడేషన్ బాధ్యతలను సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంటుందని చెప్పారు. సర్వే సెటిల్మెంట్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ ఈ ఒప్పందం రాష్ట్రాన్ని జియోస్పేషియల్ రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలబెడుతుందని పేర్కొన్నారు. ఈ ఘనత వైఎస్సార్సీపీదే వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో ప్రారంభమైన భూముల రీసర్వే ఎంత ప్రతిష్టాత్మకమో ఈ ఒప్పందం ద్వారా రుజువైంది. రీసర్వే కోసం జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి కార్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు ముందు రీసర్వేపై పచ్చి అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వమే కార్స్ నెట్వర్క్ను జాతీయ ప్లాట్ఫాంకి అనుసంధానం చేసింది.వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన భూముల రీసర్వే ఎంత ముందుచూపుతో చేసిందో ఇప్పుడు అర్థమవుతోంది. బ్రిటిష్ హయాం తర్వాత మళ్లీ రాష్ట్రంలో భూముల సర్వే జరక్కపోవడంతో అనేక భూ వివాదాలు పేరుకుపోయాయి. దీంతో రాష్ట్రంలోని భూములను రీసర్వే చేసి హద్దులు నిర్ణయించడతోపాటు డిజిటల్ రికార్డులు రూపొందించడం ద్వారా భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రూపొందించారు.వైఎస్ జగన్ హయాంలో 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు రీసర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇది నిరంతరం పనిచేసే శాశ్వత జీఎన్ఎస్ఎస్ రిసీవర్ల వ్యవస్థ. ఈ స్టేషన్లు నిరంతరం ఉపగ్రహ డేటాను సేకరించి సెంట్రల్ సర్వర్కి పంపుతాయి. దీనిద్వారా మనం ఉన్న స్థానాన్ని కచ్చితంగా చూసుకోవచ్చు. దీనివల్ల సర్వేయర్లు సొంత బేస్స్టేషన్లు ఏర్పాటు చేసుకోకుండానే సెంటీమీటర్ స్థాయి కచ్చితత్వంతో భూములను కొలిచే అవకాశం ఉంటుంది. వైఎస్ జగన్ హయాంలో 17 వేల గ్రామాల్లో వీటి ద్వారానే రీసర్వే విజయవంతంగా జరిగింది. హద్దులు నిర్ణయించి శాటిలైట్ వ్యవస్థ దాన్ని పర్యవేక్షిస్తుండడం వల్ల భూముల సరిహద్దులను ఎప్పటికీ మార్చడం సాధ్యం కాదు. అందుకే కేంద్రం రాష్ట్రంతో ఒప్పందం చేసుకుని మన టెక్నాలజీని వినియోగించుకోవాలని చూస్తోంది. ఇంతటి గొప్ప టెక్నాలజీతో భూముల రీసర్వే, దానికి అనుబంధంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేస్తే దాన్ని చంద్రబాబు రాజకీయాలకు ఉపయోగించుకుని ప్రజల మెదళ్లలో విషం నింపారు. తద్వారా ఎన్నికల్లో లబి్ధపొందినా రాష్ట్రానికి మాత్రం తీరని ద్రోహం చేశారు. -
పచ్చకామెర్ల బాధితులకు 5 లక్షలు అందించిన బొత్స
సాక్షి, కురుపాం: వైఎస్ జగన్ కేజీహెచ్కు వెళ్లడాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మంచి నీరు కలుషితం అయ్యాయి కాబట్టి పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.పచ్చకామెర్ల మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. పచ్చ కామెర్లతో మృతిచెందిన విద్యార్థులు కల్పన, అంజలి.. రెండు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందజేసింది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మానవత్వంతో పచ్చ కామెర్లతో మృతి చెందిన కల్పన, అంజలి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయం అందించారు. గిరిజన విద్యార్థులకు ధైర్యం చెప్పడానికే వైఎస్ జగన్ కేజీహెచ్కు వెళ్లారు. దాన్ని కూడా రాజకీయం చేస్తారా?. ఆసుపత్రిలో ఉండి కూడా చిన్నారులు చనిపోతున్నారు. విద్యార్థులకు అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యత కాదా?. ఇంత బలహీనమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. మంచి నీరు కలుషితం అయ్యాయి కాబట్టి పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పుకోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటు.జిల్లా మంత్రులు, అధికార్లు ఏం చేస్తున్నారు. మీ ఇంట్లో పిల్లలకు అనారోగ్యం వస్తే ఇలాగే వ్యవహరిస్తారా?. విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు. అందరు హాస్టల్ విద్యార్థులకు స్క్రీనింగ్ చేసి, వ్యాధి నిర్ధారణ చేయాలి. స్వతంత్రం వచ్చాక ఇంత బాధ్యతా రాహిత్యంగా ఏ ప్రభుత్వం లేదు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలి అనే వైఎస్ జగన్ ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దు’ అంటూ హితవు పలికారు. -
చంద్రబాబు హయాంలో చదువులు తిరోగమనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో పిల్లల చదువులు తిరోగమనం బాట పట్టాయి. వైఎస్ జగన్ పాలనా కాలంతో పోలిస్తే బాబు పాలనలోని 2024–25 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లలు సంఖ్య ఏకంగా 2,87,068 మంది తగ్గింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2024–25 విద్యా సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వైఎస్ జగన్ హయాంలో 2022–23 విద్యా సంవత్సరంతో పోలిస్తే.. 2023–24 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. అందుకు భిన్నంగా 2024–25 విద్యా సంవత్సరంలో చంద్రబాబు పాలనలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. సాధారణంగా ఏటా చదువుకునే పిల్లల సంఖ్య పెరగాలి. అందుకు విరుద్ధంగా 2024–25 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోయిందంటే పిల్లల చదువులను చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా నిరక్ష్యం చేస్తోందో స్పష్టమవుతోంది. తగ్గిన 2.87 లక్షల విద్యార్థులు2023–24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024–25 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుకునే విద్యార్థులు 2,87,068 మంది తగ్గారు. వీరిలో బాలుర సంఖ్య 1,84,096 కాగా.. బాలికల సంఖ్య 1,02,972గా ఉంది. మరోపక్క పిల్లల డ్రాప్ అవుట్స్ కూడా 2023–24తో పోల్చితే 2024–25లో పెరిగిపోయాయి. సాధారణంగా ఏటా డ్రాప్ అవుట్లు తగ్గాలి. అందుకు భిన్నంగా 2024–25 బాబు పాలనలో డ్రాప్ అవుట్లు పెరిగారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు 2023–24 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్స్ 10.1 శాతం ఉండగా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024–25 విద్యా సంవత్సరంలో 11.2 శాతానికి పెరిగింది. అలాగే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 2023–24 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 1.1 శాతం ఉండగా.. 2024–25 విద్యా సంవత్సరంలో 3.7 శాతానికి పెరిగింది. 2023–24 విద్యా సంవత్సరంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ 1.2 శాతం ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో 2.2 శాతానికి పెరిగింది. -
గాయని బాల సరస్వతీ దేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
-
గాయని బాల సరస్వతీ దేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: సినీ నేపథ్య గాయని బాల సరస్వతీ దేవి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతీ దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) ఇవాళ ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు. తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. pic.twitter.com/2y2lneAY7O— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025 -
నీ పతనం మొదలైంది బాబు!
-
నేడు అబ్దుల్ కలామ్ జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్(Abdul Kalam) జయంతి. ఈ సందర్భంగా అబ్ధుల్ కలామ్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) నివాళులు అర్పించారు. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్ అని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్. విద్యాశక్తిని నమ్మి, కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలంటూ కొన్ని తరాలకు స్ఫూర్తిని నింపిన వ్యక్తి అబ్దుల్ కలాం. మెరుగైన దేశాన్ని నిర్మించటానికి కృషి చేసిన మిస్సైల్ మ్యాన్కు నమస్కారిస్తున్నా అంటూ పోస్టు చేశారు. Remembering Dr. A.P.J. Abdul Kalam , who embodied leadership through knowledge, humility, and service. On his jayanti, I salute the Missile Man who believed in the power of education and inspired a generation to dream and build a better India.#APJAbdulKalam pic.twitter.com/Y8D4253RJi— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025 -
పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్
-
Dharmana: వైద్య రంగంలో వైఎస్ జగన్ చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే
-
నకిలీ మద్యం..‘కూటమి’ పతనం తథ్యం
సాక్షి, అమరావతి : నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొనడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణ చేపట్టిన పార్టీ శ్రేణులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు, ధర్నాలతో హోరెత్తించాయి. సర్కారు తీరును నిరసిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నిచోట్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నకిలీ మద్యం.. ప్రభుత్వ పతనం తథ్యం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నినదించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావును అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకునే యత్నం చేయగా, వారు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. నకిలీ మద్యం గుట్టు తేల్చేందుకు వెంటనే రాష్ట్రంలో వైన్షాప్లు, పర్మిట్రూమ్లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టి పెద్ద తలకాయలను అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐతో దర్యాప్తు జరపడంతోపాటు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పేర్కొంది. వైన్షాప్ల కేటాయింపులో అక్రమాలు గుర్తించి అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మద్యం విక్రయ వేళలు తగ్గించాలని.. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పిన వైన్షాప్లు, బార్ల లైసెన్సులు రద్దు చేసేలా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నేతలు నినదించారు. నారావారి ‘సారా పాలన’.. నశించాలి బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కుపై చేపట్టిన ఆందోళనలకు భారీ స్పందన లభించింది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని నకిలీ మద్యంపై అనంతపురంలో నిర్వహించిన రణభేరిలో వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుబట్టాయి. నకిలీ మద్యంపై కర్నూలులో పెద్ద ఎత్తున పోరుబాట నిర్వహించారు. జోరు వాన కురుస్తున్నా లెక్క చేయకుండా ఆందోళనలు కొనసాగించారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారావారి సారాపాలన.. నశించాలి, నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి సర్కారు, ఎన్ బ్రాండ్ నకిలీ మద్యంతో జనం బలి, నకిలీ మద్యం మరణాలు.. పవన్కు కనపడవా? బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు.. అంటూ ప్లకార్డులతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనల్లో పాల్గొని నినదించారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు పచ్చజెండా ఊపి నకిలీ మద్యంతో కూటమి సర్కారు ప్రాణాలు హరిస్తోందని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామంలో బెల్ట్షాపు రూ.9 లక్షలు పలికిందంటే కూటమి సర్కారు పాలనలో ఎలా ఏరులై పారుతోందో ఊహించవచ్చని ప్రజాసంఘాలు, మహిళలు మండిపడ్డాయి. -
నారావారి సారాపాలన.. రాష్ట్రవ్యాప్త నిరసనలు.. ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ( ఫొటోలు)
-
నకిలీ మద్యంపై ఏపీవ్యాప్తంగా YSRCP రణభేరి
నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా.. నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నాలు చేపడుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై పలువురు నేతలు ధ్వజమెత్తుతున్నారు. -
జగన్ పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి టీడీపీ వాళ్లకు చెమటలు పట్టాయ్
-
జగన్ దెబ్బకు టీడీపీ మైండ్ బ్లాక్
‘‘ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు..’’ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న కూటమి సర్కారు నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్య. ‘‘వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత ఉండవచ్చు.. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే ఆగిపోయాయి’’ - ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సహజంగానే హైకోర్టు వ్యాఖ్యలను పతాక శీర్షికలుగా చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడానికి వెళుతున్న రోజే ఎల్లో మీడియాలో ఈ కథనం వచ్చింది. జగన్ పర్యటనకు వచ్చిన స్పందన చూసిన తర్వాత జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. ఆంక్షలతో అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్ననా, జనం మాత్రం తరలి సంద్రంలా తరలి వచ్చారు. వర్షం జోరున కురుస్తున్నా ప్రజలు జగన్తో సమస్యలు విన్నవించడానికి తండోపతండాలుగా వచ్చారు. అరవై కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి ఆరు గంటలు పట్టిందంటేనే జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జనాన్ని చూసి కూటమి పార్టీల నేతలకు మతిపోయి ఉండాలి. ప్రజలు ప్రైవేటీకరణపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమై ఉండాలి. కొద్దిరోజుల క్రితం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఎక్కడ అని అడిగారు. తన ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి కూడా అయ్యన్న ఆ వ్యాఖ్య చేయడాన్ని వైసీపీ సవాల్ గా తీసుకుంది. జగన్ గతంలో చెప్పిన విధంగా తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల సందర్శనకు ఇది ఒక అవకాశంగా మారింది. తదుపరి ఆయన నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగానే జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు ఎలా తీసుకొచ్చింది వివరించారు. భవన నిర్మాణాలకు తీసుకున్న చర్యలతోపాటు జారీ చేసిన జీవోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను టీడీనే తెచ్చిందని అనంతపురంలో ప్రకటించి భంగపడితే జీవోలు ఎక్కడని అడిగి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభాసుపాలయ్యారని జనమిప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవ న్యాయస్థానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నడిపే ప్రతిపాదనపై అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. అయితే ఆ మీడియాలోనే ఆ రోజు వచ్చిన వార్తలే న్యాయమూర్తుల సందేహాన్ని తీర్చే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చాయి. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని రాజధాని అభివృద్ది సంస్థ (సీఆర్డీయే) సమావేశంలో నిర్ణయించారన్నది ఆ వార్త సారాంశం. మూడు నెలల్లో రాజధానికి ఒక రూపు తీసుకు రావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో చెప్పినట్లు కూడా రాశారు. అమరావతిలో రూ.104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం అన్నది ఎల్లో మీడియా ఇచ్చిన ఇంకో వార్త. ప్రధాన రోడ్లకు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేయడానికి ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది.గోదావరి- బనకచర్ల స్కీమును రూ.81 వేల కోట్లతో చేపట్టే విషయంలో ముందుకే వెళ్లాలని, డీపీఆర్లు సిద్దం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు మరో కథనం. ఇంతకన్నా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ప్రభుత్వం రూ.257 కోట్లు వ్యయం చేసి జీ+ 7 అంతస్తుల సీఆర్డీయే కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కూటమి సర్కార్ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయానికి వచ్చేసరికి డబ్బులు లేకుండా పోయాయా? అన్న సాధారణ పౌరుల ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గౌరవ న్యాయస్థానం కోర్టుల నిర్మాణం కూడా ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అంటే కోర్టుల కన్నా కూడా రాజధానిలో తాము అనుకున్న విలాసవంత భవనాలే ముఖ్యమని ప్రభుత్వ అధినేతలు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా! ఈ తరహా వ్యాఖ్య కోర్టు జగన్ ప్రభుత్వ టైమ్లో చేసి ఉంటే ప్రభుత్వం దివాళా తీసిందని, కోర్టుల భవనాలను కూడా నిర్మించ లేకపోతోందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. కాని ఇప్పుడు మాత్రం కోర్టు భవనాలకే డబ్బు లేనప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు జనాన్ని మభ్య పెట్టాలని యత్నిస్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్ల వనరులు లేకపోతే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అన్ని సీట్లు మెరిట్ బేసిస్ మీదే కేటాయించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఎన్నారైలకు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు, లోకేశ్లు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సీటును ఏకంగా రూ.57 లక్షలకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవచ్చా అన్న సంశయం కోర్టుకు ఉండవచ్చు. ఇది కేవలం విధానానికి సంబంధించిందే కాదు. వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను అప్పగించేస్తారు. ఎకరా వంద రూపాయల లీజుకే ఇచ్చేయబోతున్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే వైద్యశాలల్లో కూడా అన్ని సేవలు పేదలకు ఉచితంగా లభించే అవకాశం తక్కువే. ఒకవేళ ఇచ్చినా, వాటికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటి మీద కోర్టులో వాద, ప్రతివాదాలు జరుగుతాయో లేదో తెలియదు. కోర్టు వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా, రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈ టెండర్లు ఖరారు కాకుండా స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొనడం గమనించదగ్గ విశేషమే. మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించినా, తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ లోగా ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని వైసీపీ ఆరంభించింది. ఈ రకంగా ప్రజల మనోగతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలొ వైసీపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తగు పాత్ర పోషిస్తాయి. అందువల్ల కోర్టు ప్రభుత్వ చర్యలకు ఆమోదం తెలిపినా, తెలపకపోయినా, దానితో నిమిత్తం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తమ విధానం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. జగన్ వ్యాఖ్యానించినట్లు ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు . జగన్ టూర్ కు జనం రాకుండా చూడడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రులు సరిగా స్పందించ లేకపోతున్నారని.. చంద్రబాబు అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. దానిని బట్టే జగన్ టూర్ సక్సెస్ అయిందని చంద్రబాబుతో సహా కూటమి నేతలంతా పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే!. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాలేజీ ముందే జగన్ కౌంటర్.. నోరు మెదపని అయ్యన్న.. అనిత
-
Big Question: అవును.! జగన్ చరిత్ర సృష్టించాడు
-
Big Question: జగన్ పర్యటనలో జనం రెస్పాన్స్.. బాబు కళ్లు తెరుస్తారా?
-
జన జాతర
సాక్షి, అమరావతి : కర్ఫ్యూను తలపిస్తూ మోహరించిన పోలీసులు.. అడుగడుగునాఆంక్షలు.. బారికేడ్లు.. ఆటోవాలాలకు బెదిరింపులు.. పార్టీ నేతలకు వేధింపులు.. ఖాకీల దిగ్బంధంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ రోడ్డు..! ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జన సునామీ ఎదుట తల వంచక తప్పలేదు! జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని వైఎస్ జగన్ ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. వాహనాలను పోలీసులు అడ్డుకున్నా ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట తరలి వచ్చారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద రాజకీయ సభగా పరిశీలకులు దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అశేష ప్రజాదరణతో జనం గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచారని.. ఇంటికే పథకాలు, సేవలతో పేదల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొంటున్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తూ వైఎస్ జగన్ నర్సీపట్నం వైద్య కశాశాలను సందర్శించిన నేపథ్యంలో.. చంద్రబాబు సర్కారు దారుణ పాలన వైఫల్యాలు, సూపర్ సిక్స్ మోసాలు, రెడ్బుక్ కుట్రలు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయని విశ్లేషిస్తున్నారు. పేదల జీవితాల్లో మార్పు కోసం తాపత్రయపడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచి, తీసుకొచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంపద సృష్టిని గుర్తు చేసుకుంటున్నారు. సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకేలు లాంటి వినూత్న వ్యవస్థల ద్వారా ఊరు దాటాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే పథకాలు, పౌర సేవలు అందాయని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఎక్కడా ఆగకుండా డీబీటీ ద్వారా నేరుగా పథకాలు అందించటాన్ని ప్రస్తావిస్తున్నారు. గత 16 నెలల కూటమి పాలనలో ఎంతో నష్టపోయామని.. బాబు చేతిలో మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఐఆర్, నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారని, పీఆర్సీ ఊసే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. బాబు ష్యూరిటీ పోయి.. మోసం గ్యారెంటీగా మారిందని.. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని.. ఇసుక దోపిడీ.. విద్యుత్తు చార్జీల బాదుడు.. నకిలీ మద్యంతో అమాయకులు ప్రాణాలు పోతున్నాయని.. ఏడాది తిరగక ముందే కూటమి పాలనపై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఆరోగ్యానికి సంపూర్ణ భరోసా..వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేశారు. వందేళ్లుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కేవలం రెండే రెండు మెడికల్ కాలేజీలు ఉండగా... మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఏకంగా నాలుగు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. మాట ప్రకారం ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. ఉత్తరాంధ్రతో పాటు మైదాన ప్రాంత గిరిజనులకు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఐదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలల్లో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఆగిపోయింది. భావి తరాలకు విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడితే.. పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. చంద్రబాబు సర్కారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పెండింగ్ పెట్టడంతో రోగులకు వైద్యం నిలిచిపోయిన దుస్థితి.పిల్లలకు మోసం.. వైఎస్ జగన్ హయాంలో నాడు – నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, ట్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్్ట, అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఐబీ, టోఫెల్, ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది పిల్లల చదువులకు గట్టి భరోసా కల్పించారని చర్చించుకుంటున్నారు. అదే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏకంగా దాదాపు ఐదు లక్షల వరకు తగ్గిపోవడం ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితి, తల్లిదండ్రుల్లో సన్నగిల్లిన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు విద్యార్థనులు మృతి చెందారు. పిల్లలకు పచ్చకామెర్లు సోకితే కనీసం పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది.అన్నదాతకు మహిళలకు దగా..ఈ ప్రభుత్వం వ్యవసాయ సీజన్లో కనీసం ఎరువులు కూడా సమకూర్చలేకపోయిందని, యూరియా నల్ల బజారుకు తరలిపోగా.. ఏ పంటకూ మద్దతు ధరలు దక్కక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇంటికే సేవలందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. రైతులకి ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్పుట్ సబ్సిడీకి దిక్కే లేదు. ఈ క్రాప్ కనపడకుండా పోయింది. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యమయ్యాయి. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా తామే ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ లెక్కన రెండేళ్లకు కలిపి రూ.40 వేలకుగాను ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి గత ఏడాది చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో మహిళలందరికీ ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. అటు 20 లక్షల ఉద్యోగాలూ లేవు.. ఇటు నిరుద్యోగ భృతీ ఇవ్వట్లేదు! ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి పటిష్టంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మంచి చేసే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. 52 ఎకరాల్లో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి.. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, రూ.500 కోట్ల ఖర్చుతో 2022 డిసెంబర్ 30న కాలేజీకి శంకుస్థాపన చేశాం -నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ సందర్శనలో వైఎస్ జగన్ -
జగన్ ఎమ్మెల్యే కాకముందే.. విశాఖ CPకి గుడివాడ అమర్నాథ్ కౌంటర్
-
జెడ్ ప్లస్ సెక్యూరిటీ తెలియదా?.. సీపీ హుందాగా మాట్లాడాలి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సీపీ వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సీపీకి తెలియదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీలపై తమ విధానం ఏంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేది వైస్ జగన్ విధానం. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. ఉచితంగా ఇవాల్సిన మెడికల్ సీటును పీపీపీ పద్ధతిలో 66 లక్షలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యార్ధులకు ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమని జగన్ చెప్పారు.చిరు వ్యాపారులు తమ కష్టాన్ని జగగ్కు చెప్పుకున్నారు. గోవాడ రైతులు ఫ్యాక్టరీ దుస్థితిని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షుగర్ ఫ్యాక్టరీకి 89 కోట్లు సహాయం చేశారు. రైతులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు జగన్ను కలిసి తమ వేదన చెప్పుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన పర్యటనలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను పరామర్శించారు. చనిపోయిన వారికి ఐదు లక్షలు పరిహారం పార్టీ తరపున అందించారు అని తెలిపారు.అలాగే, వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. విశాఖ నగర కమిషనర్ చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి. సీపీ హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం జగన్ జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్నారనే సంగతి సీపీకి తెలియదా?. వైఎస్ జగన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే అంటూ సీపీ మాట్లాడడం సరికాదు. తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. ఎమ్మెల్యేకు అయితే ఎందుకు మూడువేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు?’ అని ప్రశ్నించారు. -
సొంతపార్టీ ఎమ్మెల్యేలపై బాబు ఒత్తిడి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మంత్రులది అంటున్నారు. ప్రజల అవసరాలు తీర్చడం కాకుండా.. తన వారి అవసరాలు తీర్చే పొలిటికల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండని కూడా ఆయన మంత్రులకు చెబుతున్నారు. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టం చేసినట్లు ఎల్లోమీడియా కథనం!.ఏడాదిన్నర కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కొందరు మంత్రులు సృష్టించిన అరాచకాలు, చేసిన అక్రమాలను కట్టడి చేయడం తనవల్ల కాదని చంద్రబాబు చేతులెత్తేశారా? పరిస్థితులను బట్టి ఇది కావాలని ఇచ్చిన లీకులాగే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను భయపెట్టడానికి తీసుకున్న చర్యలా అనిపిస్తుంది. కాకపోతే.. అసలు పొలిటికల్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో పనిచేయడమా? ప్రతిపక్షాలకు సంబంధించిన వారి పనులు చేయడానికి వీల్లేదని సీఎం స్థాయి వ్యక్తి అధికారులను ఆదేశించడమా? ఇలా చేస్తే ఆయన అందరి సీఎం ఎలా అవుతారు? ఇప్పుడేమో సొంత పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయమంటున్నారు. తప్పు కాకపోవచ్చు కానీ ఎన్ని అరాచకాలైనా చేసుకోండి కానీ బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలను ప్రస్తావించ వద్దని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.ఇంకోలా చెప్పాలంటే ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్.వరదరాజులు రెడ్డి రైతుల యూరియా కొరత అసెంబ్లీలో ప్రస్తావిస్తే చంద్రబాబుకు నచ్చలేదు. యూరియా కొరత లేదని తాము ఒకపక్క దబాయిస్తూంటే ఈయన వాస్తవాలు మాట్లాడతాడేంటి? అని అనుకున్నారేమో. జగన్ పాలనలో ఒడిశా సరిహద్దుల్లోని పలు గ్రామాల వారు తాము ఆంధ్రప్రదేశ్లో ఉంటామని చెప్పేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఒడిశాలోనే బాగుందని కొన్ని గ్రామాల వారు అంటున్నారని ఆ ప్రాంత ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం కూడా బాబు అండ్ కో నేతలకు మింగుడు పడలేదు. ఇంకో ఎమ్మెల్యే ఒకానొక సమస్యపై తాను అధికారులు, హోంమంత్రి అనిత, సర్వ శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న లోకేశ్.. ఏకంగా సీఎంకు కూడా వినతిపత్రం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పడం కూడా చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. ఒక పోలీసు అధికారికి సంబంధించిన అంశం కాబట్టి ఇందులో సదరు ఎమ్మెల్యే స్వప్రయోజనాలేమైనా ఉన్నాయా? అన్నది తెలియదు.రాష్ట్రంలో లంచాలు తీసుకోకుండా పని చేసే పరిస్థితి లేదని, ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం వల్ల లేఔట్ల ఆమోదం వంటి విషయాల్లో లంచాలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతికి పరాకాష్ట ఇది. జనసేన ఎమ్మెల్యే కావడంతో ఈయన అసెంబ్లీలో రోడ్ల దుస్థితిని ప్రస్తావించినా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయాలని పరోక్షంగా సూచించారని మనం బాబు గారి వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవాలి.విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరుపై విమర్శలు చేశారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని వ్యాఖ్యానించారు. ఇది కూడా పెద్ద సమస్యగానే చూసినట్లు ఉన్నారు. పవన్ షూటింగుల్లో బిజీగా ఉంటూ పెద్దగా అందుబాటులో ఉండడం లేదన్న విమర్శ ఉంది. అయినా చంద్రబాబు ఆయనను ప్రశ్నించే పరిస్థితి లేదు. కొందరు మంత్రులపై వచ్చిన ఆరోపణలపైనా కనీస వివరణ కూడా అడుగుతున్నట్లుగా కనిపించడం లేదు. ఒక మంత్రి హైదరాబాద్ హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని టీడీపీ మీడియానే రాసింది. మరో మంత్రి స్టార్ హోటళ్లలో రాచకార్యాలు వెలగబెడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధే వెల్లడించారు. వీటిపై మంత్రులను ఏమీ అన్నట్లు లేరు కానీ, ఆ అధికార ప్రతినిధిని పిలిచి మందలించారు. ఇవి కొన్ని ఉదాహరణలే.ఒకప్పుడు అసెంబ్లీలో జీరో అవర్ వచ్చిందంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించే వారు. మంత్రులు వాటిని నోట్ చేసుకుని ఆ తర్వాత సమాధానం పంపించే వారు. అసెంబ్లీలో తాము కూడా మాట్లాడామని చెప్పుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడేవి. తద్వారా ప్రజలను సంతృప్తిపరచేవారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు అలాంటి వారిని కూడా మందలిస్తున్నారు. పోనీ ఈ ఎమ్మెల్యేలు అవినీతి, దందాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడైనా చర్య తీసుకుంటున్నారా? ఊహూ అదీ లేదు. తన పార్టీ ఎమ్మెల్యే, నాయకులు ఎంత అక్రమంగా సంపాదించుకున్నా ఫర్వాలేదు కానీ అది ఎక్కడా బయటపడకూడదని బాబు భావిస్తారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. ఇంకో సంగతి చెప్పాలి.ముఖ్యమంత్రి, కీలక మంత్రితోపాటు ఆయా మంత్రుల స్థాయిలో జరిగే అక్రమాలు, అవినీతి విధానాల గురించి ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఉంటుంది. దానివల్లే పై స్థాయి వారే అలా చేస్తున్నప్పుడు తమది ఏముందిలే అని ఎమ్మెల్యేలు భావిస్తుంటారని చెబుతారు. పార్టీ ఎమ్మెల్యేలు కాని, ఇతర నేతలు కాని అంతా మంత్రి లోకేశ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అనుమతి లేకుండా ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదని చెబుతారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పే మాటలను ఎమ్మెల్యేలు అంత సీరియస్గా తీసుకోవడం లేదేమో. టీడీపీ ఎమ్మెల్యేల మద్యం, ఇసుక, భూముల కబ్జా దందాలతో ఎలా వసూల్ రాజాలుగా మారింది తెలుపుతూ ఈ మధ్యే ఎల్లోమీడియానే ఒక వార్త వచ్చింది. చంద్రబాబు దానిపై వెంటనే స్పందించారు. పార్టీ ఎమ్మెల్యేలలో కొందరి వివాదాస్పద ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అసహనం వ్యక్తం చేసినట్లు ఒక లీక్ ఇచ్చారు. అంతేకాదు. సుమారు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడానని ఆయన వెల్లడించినట్లు రాశారు. వీరిని ఆయన మందలించారో, లేదో తెలియదు. మిగిలిన వారిని ఎందుకు పిలవలేదో తెలియదు.మహిళలను వేధిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. తెలుగు మహిళ నాయకురాలే ఒకరు తిరుపతి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఏపీలో అయితే మాట్లాడనివ్వరని ఆమె హైదరాబాద్ వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేపై చంద్రబాబు చర్య తీసుకోలేదు కానీ మహిళతో రాజీ కుదర్చిరాని వార్తలు వచ్చాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే జనసేన మహిళా నేతపై నిఘా పెట్టారంటూ వచ్చిన ఆరోపణ అత్యంత సంచలనమైనదే. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యే ఒకరైతే, ఒక విద్యాలయం మహిళా ప్రిన్సిపాల్ను వేధించిన వారు ఇంకొకరు. ఇలా పలువురిపై ఆరోపణలు వచ్చినా చంద్రబాబు ఏదైనా చర్య తీసుకోగలిగారా? ఆయనే చేయలేకపోతే మంత్రులు ఎలా కంట్రోల్ చేస్తారో తెలియదు.ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ చేస్తుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు తోచిన విధంగా రాజకీయ ఆటలు ఆడకుండా ఉంటారా?. నాయకుడిపై గౌరవం పెరగాలంటే చెప్పిన మాట వినాలంటే, ఆయన విశ్వసనీయతపై అందరికీ నమ్మకం ఉండాలి. తమ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల సమయంలో ఆ నాయకుడిపై ఆధారపడుతుండవచ్చు. తదుపరి ఆయనకు ఉన్న అధికారాన్ని బట్టి పైకి ఏమీ మాట్లాడకపోవచ్చు. కానీ, వారికి జరుగుతున్న పరిణామాలు, అధినేతలు చెబుతున్న అబద్దాలు తెలియకుండా ఉండవు కదా!. అనంతపురం బహిరంగ సభలో వేలాది మంది సమక్షంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా వింటుండగానే చంద్రబాబు అబద్దాలు చెబితే ఆయనపై ఎవరికి గౌరవం ఉంటుంది?.వైఎస్ జగన్ తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలుగుదేశం తెచ్చినవిగా చెబుతుంటే వినే వారందరికీ ఎలా ఉంటుంది?. ప్రతీ చిన్న విషయానికి అబద్దాలు చెప్పడానికి అలవాటు పడిన నేతలు ఎంత పెద్దవారైనా, ఏ హోదాలో ఉన్నా సామాన్య ప్రజలే కాదు.. సొంత ఎమ్మెల్యేలు కూడా అంత విలువ ఇవ్వరన్న సంగతి అర్దం చేసుకోవాలి. తొలుత తమను తాము ఎలాంటి ఆరోపణలు రాకుండా కంట్రోల్ చేసుకుంటే, అసత్యాలు చెప్పకుండా కంట్రోల్ చేసుకుంటే, అప్పుడు ఎమ్మెల్యేలైనా, మరెవరైనా ఆటోమాటిక్గా కంట్రోల్ అవుతారు. నైతికంగా భయపడతారు. ఆ సంగతి గుర్తుంచుకోవడం మంచిది కదా!. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎర్రటి సూరీడు సైతం చల్లబడేలా జగన్ జన ప్రభంజనం..
-
బాబు పాలనపై నర్సీపట్నం పబ్లిక్ టాక్
-
మీ అభిమానం సల్లగుండా.. జగనన్న కోసం ఏం చేశారో చూడండి (చిత్రాలు)
-
జై జగన్ నినాదాలతో సాగర తీరంలో జన సునామీ
-
Big Question: నర్సీపట్నం టూర్ సక్సెస్.. 70-MMలో మెడికల్ కాలేజీ చూపించిన జగన్
-
నోటికొచ్చినట్లు మాట్లాడకు.. మంత్రి అనితకు వార్నింగ్
-
పిల్లల ప్రాణాలతో చెలగాటమా?
-
చిట్టితల్లులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
ఇదిగో జీవో.. ఇవిగో మెడికల్ కాలేజీలు.. అయ్యన్నపాత్రుడుకి జగన్ స్ట్రాంగ్ రిప్లై
-
అంతర్మధనంలో అధికార టీడీపీ
సాక్షి, విశాఖపట్నం: తమ కుట్రలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తే.. వైఎస్సార్సీపీ కేడర్ సైతం విస్తుపోయే రేంజ్లో సూపర్ సక్సెస్ కావడంతో అధికార టీడీపీ ఇప్పుడు అంతర్మధనంలో పడిపోయింది(YS Jagan Uttarandhra Tour Success).జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని ఆంక్షల పేరిట ఆటంకాలు సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఖాకీలను ప్రయోగించి జనాన్ని రాకుండా ప్రయత్నించింది. అయితే చెక్పోస్టులు, బారికేడ్లను జగన్ మీద ఉన్న అభిమానం బద్దలు కొట్టేసింది. జనాలు తండోపతండాలుగా తరలి రావడం చూసి పోలీసులే కంగుతిన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు.. దారి పొడవునా జగన్ ఆగిన చోటల్లా ఇసకేస్తే రాలని జనమే కనిపించారు. ఆంక్షల వలయాన్ని చేధించుకుని.. గుట్టలు, పొలాల గుండా కొందరు యువకులు బైకులపై తరలి రావడం గమనార్హం. తొలుత.. ఈ పర్యటన కోసం దళితులను వాడుకోవాలని అధికార టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. డాక్టర్ సుధాకర్ పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేయించడంతో పాటు ఫకార్డుల ప్రదర్శన చేయించాలని స్కెచ్ వేసింది. అయితే దళితులు ఆ కుట్రలకు లొంగలేదు. పైపెచ్చు జగన్ ర్యాలీకి భారీగా తరలి వచ్చారు. వివిధ వర్గాలు సైతం జగన్ను కలిసి తమ గోడును వెల్లదీసుకోవడం.. ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడని విషయం. ఇంకోవైపు..చివరకు ప్రకృతిపైనా పచ్చ బ్యాచ్ ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. కుండపోత వర్షంలోనూ రోడ్డు పొడవునా.. మహిళలు, వృద్ధులు, రైతులు బారులు తీయడం.. ఎల్లో మీడియాకు సైతం సహించనట్లుంది. అందుకే ట్రాఫిక్ జామ్, షరతుల ఉల్లంఘన పేరుతో విషం చిమ్ముతోంది. వెరసి..ఊహించని రీతిలో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సక్సెస్ కావడంతో కరకట్ట బంగ్లాకు ఏం సమాధానం చెప్పుకోవాలో అని ఉత్తరాంధ్ర తమ్ముళ్లు తెగ మదనపడిపోతున్నారు.క్లిక్ చేయండి: ఉత్తరాంధ్రలో జగన్ కోసం జన సునామీ.. చూశారా? -
ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు... ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
BIG Question: అసలైన UNSTOPPABLE! ఇది జగన్ దమ్ము
-
జడివానలో.. జన ఉప్పెన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, సాక్షి, అనకాపల్లి: సాగర తీరంలో జన ఉప్పెన ఎగసిపడింది. ఉత్తరాంధ్ర పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా, బెదిరింపులకు పాల్పడినా వెరవకుండా సంక్షేమ సారథికి తోడుగా జనవాహిని ఉప్పొంగింది. మండుటెండలో గంటల తరబడి నిరీక్షించి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. మధ్యాహ్నం తర్వాత జోరు వర్షంలోనూ అదే జోరు కొనసాగింది. పూల వర్షాలు, హారతులు, గజ మాలలతో బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనంవిశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదుగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు సాగింది. 63 కిలోమీటర్ల దూరానికి సాధారణంగా గంటన్నర పడుతుంది. కానీ జనహోరులో వైఎస్ జగన్ పర్యటనకు 6 గంటలకు పైగా పట్టింది. గోపాలపట్నం వద్ద ప్రారంభమైన జన యాత్ర మాకవరపాలెం మెడికల్ కళాశాలకు చేరేసరికి సాగరాన్ని తలపించింది. వేపగుంట వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జగన్ను చూసేందుకు పోటెత్తారు. సుజాతనగర్, చినముషిడివాడలో కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పెందుర్తి జంక్షన్ నుంచి పినగాడి జంక్షన్ వరకూ ఆత్మీయ నేతతో కరచాలనానికి పోటీ పడ్డారు. అక్కడి నుంచి జాతీయ రహదారిపై సబ్బవరం మీదుగా అనకాపల్లిలో కొత్తూరు జంక్షన్కు చేరుకున్నారు.జోరు వానలోనూ..అనకాపల్లి నుంచి జన ప్రవాహం జగన్ కాన్వాయ్ను ముందుకు కదలనీయకుండా చేసింది. ఆ సమయంలో భారీ వర్షం పడినా వెనక్కు తగ్గలేదు. కొత్తూరు జంక్షన్ నుంచి కశింకోట మీదుగా.. తాళ్లపాలెం వరుకూ జనాలతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు కుండపోతగా వర్షం పడుతున్నప్పటికీ.. తడుస్తూనే జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సీపట్నంలోకి ప్రవేశించాక జై జగన్ నినాదాలు మిన్నంటాయి. వై.భీమవరం, కన్నూరుపాలెం మీదుగా సాయంత్రానికి మాకవరపాలెం మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. రాత్రి నుంచి అక్కడే బస..వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంగణానికి గురువారం వేకువజామునే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. ముందురోజు సాయంత్రం నుంచి పోలీసులు బెదిరిస్తున్నా వెనుకంజ వేయలేదు. కొందరు ముందురోజు రాత్రే చేరుకుని అక్కడే నిద్రించారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు 12 గంటల పాటు ఎండ, వాన, తిండి పట్టించుకోకుండా వేచి చూశారు. వైఎస్ జగన్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్దకు రాగానే కేరింతలు కొట్టారు. ఆంక్షలు ఛేదించుకునిఒకవైపు పోలీసుల బారికేడ్లు.. ఆటోవాలాలకు బెదిరింపులు... అర్ధరాత్రి నుంచే పోలీస్ దిగ్భందంలో మెడికల్ కాలేజీ రోడ్డు..! ఇలా వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం హోరు ముందు తుస్సుమన్నాయి. జగన్ కాన్వాయ్ సాగిన ప్రతి జంక్షన్ జన హోరుతో దద్ధరిల్లిపోయింది. జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. ఉత్తరాంధ్రలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు సర్కారు మొదటి నుంచీ తీవ్రంగా యత్నించింది. అందులో భాగంగా మొదట రోడ్డు మార్గానికి అనుమతిచ్చేది లేదని అటు అనకాపలి ఎస్పీ, ఇటు విశాఖ పోలీసు కమిషనర్ల ద్వారా చెప్పించారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా వెళ్లాలంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుందని... రోడ్డు మార్గంలోనే వస్తారని పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం చివరకు రోడ్డు మార్గం రూట్ మార్చి పర్యటనకు అనుమతించింది. అయితే ఇందుకోసం ఏకంగా 18 షరతులను విధించింది. ఇక ఆటోవాలాలను పిలిపించి జగన్ పర్యటనకు జనాలను తరలిస్తే కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా బెదిరించింది. మరోవైపు ఎక్కడికక్కడ రాత్రికి రాత్రి బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాత్రి నుంచే కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని ఎక్కడికక్కడ అడ్డగించి ఆరా తీశారు. ఎక్కడకు వెళుతున్నారంటూ సవాలక్ష ప్రశ్నలు వేశారు. అయినప్పటికీ వైఎస్ జగన్ వచ్చే సమయానికి ఎక్కడికక్కడ జనంతో జంక్షన్లన్నీ నిండిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లో కొందరు... నడుచుకుంటూ మరికొందరు.... పోలీసుల కళ్లుగప్పి.... పొలాల్లో నడిచి, బైకులపై వచ్చి చివరకు తమ అభిమాన నేత వద్దకు చేరుకున్నారు. ఫలితంగా 65 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు ఏకంగా 6 గంటలకుపైగా సమయం తీసుకుందంటే జనవాహిని ఎలా ఉందో పరిస్థితిని ఊహించుకోవచ్చు. మొత్తంగా అటు పోలీసుల లెక్కలకు మించి ఇన్ని ఆంక్షల మధ్య కూడా ప్రభంజనంలా జనం తరలిరావడంతో చేసేదేమీ లేక చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. -
‘ఉక్కు’ సంకల్పంతో అండగా ఉంటాం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉక్కు సంకల్పంతో ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని కోరారు. కాకానినగర్ వద్ద వారంతా వైఎస్ జగన్ కోసం నిరీక్షించి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ, కార్మిక సంఘం నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్ తాజా పరిణామాల గురించి చర్చించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి మోసం చేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత వరకూ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో విభాగాన్ని ప్రైవేట్పరం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా గనులు కేటాయించడం.. సెయిల్లో విలీనం చేయడంతో పాటు సంస్థలో తొలగించిన ఉద్యోగులను తిరిగి వి«ధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో పోరాటం చేస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. సంఘటితంగా పోరాడదాం.. స్టీల్ ప్లాంట్ కార్మికుల విన్నపాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వారి ప్రతి డిమాండ్ని పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచుతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ తమ వైఖరి ఒక్కటేనని, స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైఎస్సార్సీపీ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని, ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆ దిశగా నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని డిమాండ్లపైనా కలసికట్టుగా పోరాటం చేద్దామని వారికి గట్టి భరోసా ఇచ్చారు. -
ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు: వైఎస్ జగన్
రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు రూ.8 వేల కోట్లు. ఇందులో రూ.3 వేల కోట్లను మా హయాంలోనే ఖర్చు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఏటా కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల లాంటి వైద్య కాలేజీల ద్వారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని చంద్రబాబుని అడుగుతున్నా రూ.2 లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధపడుతూ.. రూ.70 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. మరి కోట్ల మంది పేదలకు మేలు చేస్తూ.. ఉచితంగా వైద్యమందించే మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేమంటూ ప్రైవేటువారికి అమ్మేసే కార్యక్రమం చంద్రబాబు హయాంలో జరుగుతోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయనకు బుద్ధి రావాలని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అనకాపల్లిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఇదిగోనయ్యా..! 2022 ఆగస్టు 8న జారీ చేసిన జీవో నం.204. మెడికల్ కాలేజీ నిర్మాణానికి జీవో ఇవ్వలేదంటూ స్పీకర్ పదవిలో ఉంటూ అబద్ధాలు చెప్పినందుకు ఆ పదవికి నువ్వు అర్హుడివేనా? ఆలోచించుకో...! తప్పుడు మాటలు చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుతో చేతులు కలిపినందుకు తలదించుకోవాలి..’ – నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ వద్ద మీడియాతో వైఎస్ జగన్ నర్సీపట్నానికి సంబంధించిన సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉంటూ... చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతున్నారు. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులు తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. స్పీకర్కు చెబుతున్నా... అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయడం ఎంత వరకూ ధర్మమని అడుగుతున్నా. క్షమాపణ చెబుతావా? ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అంటారా.. ఇదిగోనయ్యా.. ఆగస్టు 8, 2022న జారీ చేసిన జీవో నం.204. చంద్రబాబు జూన్ 2024లో అధికారంలోకి రాగా సెపె్టంబర్ 3న ఒక మెమో జారీ చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపాలంటూ మెమో జారీ చేశారు. అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి వదిలేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజీలకు నిధులు లేవని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, స్పీకర్కు కూడా చెబుతున్నా. నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టై–అప్ చేశాం. నాబార్డ్ ఫండ్స్ మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కేటగిరీలో ఈ మెడికల్ కాలేజీల్ని చేర్చాం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను రచ్చబండ సాక్షిగా ప్రజలకు వివరిస్తాం. దీన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపడతాం. నవంబరు 24 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మేం శ్రీకారం చుట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో మా హయాంలోనే దాదాపుగా ఏడు కాలేజీలు పూర్తి కాగా ఐదు చోట్ల మా ప్రభుత్వంలోనే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తే, మాకు వద్దంటూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పేదలకు చేరువలో ఉచితంగా మెరుగైన వైద్యం కోసం ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డుతో పాటు కేంద్రం నుంచీ వడ్డీ లేని నిధులను మా ప్రభుత్వంలో టై–అప్ చేశాం. కేవలం ఏటా రూ.1,000 కోట్ల చొప్పున రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ఆ కాలేజీలు పూర్తవుతాయి. అది కూడా చేయలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం బాగుపడలేదు. విశాఖలో షాపులను తొలగించి 32 వేల మందిని రోడ్డున పడేశారు. గిరిజన విద్యార్థుల హాస్టళ్లలో మా ప్రభుత్వం ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ఈ సర్కారు కనీసం ఫిల్టర్లను కూడా మార్చడం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించడం లేదు. విశాఖ స్టీలు ప్లాంటులో 32 విభాగాలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే స్టీలు ప్లాంట్ కార్మీకులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు..’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంపాలెం మండలం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గత ప్రభుత్వం అసలు జీవో ఇవ్వలేదని... దమ్ము, ధైర్యం ఉంటే దాన్ని చూపించాలంటూ స్పీకర్ విసిరిన సవాల్పై ఘాటుగా ప్రతిస్పందించారు. స్థానికంగా ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత పదవిలో ఉంటూ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు కోట్లాది మంది పేదలకు మేలు.. చెంతనే సూపర్ స్పెషాల్టీ వైద్యం ఈ రోజు ఇక్కడ వెనుక కనిపిస్తున్నవి నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన మెడికల్ కాలేజీ నిర్మాణాలు. ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ.. అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు 52 ఎకరాల్లో కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 17 కొత్త మెడికల్ కాలేజీలకు మా హయాంలో శ్రీకారం చుట్టాం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు చేరువలో ఉచితంగా అందుతాయి. ఆ ఆధునిక దేవాలయాల వల్ల ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే ఆ ఏడెనిమిది నియోజకవర్గాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవీ పేదవాడిని దగా చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. పక్కనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఉచితంగా వైద్యం పేదవాడికి చేరువలో అందుబాటులోకి వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల దగాకు తెర పడుతుంది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాల్ని ఎందుకు మూసేస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం కోవిడ్ ఇబ్బందుల్లోనూ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ప్రణాళిక చేశాం.. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేసేస్తే ఇక వారే నడుపుతారు. అంతా ప్రైవేట్ వాళ్లే ఉంటే.. మరి పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? ఈరోజు ఇక్కడ 52 ఎకరాల్లో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. 2022 డిసెంబర్ 30న ఈ కాలేజీకి శంకుస్థాపన చేశాం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా, సంక్షోభంలో ఉన్నా ఈ కాలేజీకి రూ.500 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక చేశాంఈ కాలేజీ పూర్తయితే 600 బెడ్స్తో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ.. సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఇక్కడ అందుబాటులోకి వచ్చేవి. ఈ ప్రాంతమంతటికీ ఇక్కడి మెడికల్ కాలేజీ దిక్సూచీగా ఉండేది. పాయకరావుపేట, తూర్పు గోదావరి పరిధిలోని తుని నియోజకవర్గం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇదే మెడికల్ హబ్ అవుతుంది. ఈ రోజు ఏ ఇబ్బంది వచ్చినా.. విశాఖలోని కేజీహెచ్కు వెళ్లాల్సి వస్తోంది. వందల మంది రోగులకు అక్కడ సరిగా వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. మెడికల్ సీట్లను.. బాబు వద్దన్నారు 17 కొత్త మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలు మేం అధికారంలో ఉన్నప్పుడే దాదాపుగా పూర్తయ్యాయి. మేం అధికారంలో ఉండగానే 5 మెడికల్ కాలేజీలు పూర్తై తరగతులు కూడా ప్రారంభించాం. 2023–24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపు 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. 3 బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి పాడేరులో 50 సీట్లతో కాలేజీలో క్లాసులు కూడా మొదలైన పరిస్థితులు కనిపించాయి. పులివెందులలో కూడా 50 సీట్లుతో క్లాసులు ప్రారంభించాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇస్తే.. మాకు సీట్లు వద్దు, మెడికల్ కాలేజీ వద్దంటూ చంద్రబాబు వెనక్కి పంపించేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 2022 ఆగస్టు 8వ తేదీన జారీ చేసిన జీవో కాపీని చూపిస్తున్న జగన్ ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు రూ.8 వేల కోట్లు. ఇందులో రూ.3 వేల కోట్లను చంద్రబాబు అధికారంలోకి వచ్చే సరికే మా హయాంలోనే ఖర్చు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని చంద్రబాబుని అడుగుతున్నా. సంవత్సరానికి కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల లాంటి వైద్య కాలేజీల ద్వారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 2019 నాటికి ఉన్న మెడికల్ సీట్లు కేవలం 2,360 సీట్లు అయితే మరో 2,550 సీట్లు అదనంగా ఈ 17 కాలేజీల ద్వారా సమకూరుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4,910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. ఇటు మన విద్యార్థులకు మెడికల్ సీట్లు.. అటు కోట్లాది మంది పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్యాన్ని ఉచితంగా అందించే ఆధునిక దేవాలయాలివి. ఇవన్నీ చంద్రబాబు దగ్గరుండి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో 50 వేల ఎకరాలు కాదు.. మరో 50 వేల ఎకరాలు సేకరించి.. రూ.2 లక్షల కోట్లు కేవలం అక్కడ కరెంట్, రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తారు. గతంలో 50 వేల ఎకరాలకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ.లక్ష కోట్లు కావాలన్నారు. కానీ ఖర్చు చేసింది రూ.4,500 కోట్లు. మళ్లీ ఇవాళ 50 వేలు సరిపోవు.. మరో 50 వేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారు. అంటే ఆ 50 వేల ఎకరాలకు మౌలిక సదుపాయాల కోసం మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధ పడుతున్నారు. ఆర్వో ప్లాంట్ ఫిల్టర్లూ మార్చడం లేదు.. ఇవాళ చంద్రబాబు దారుణ పాలన చూస్తే.. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 170 మందికి హెపటైటిస్–ఏ వస్తే వారిని పట్టించుకున్న దిక్కులేదు. జాండిస్ సోకినట్లు సెపె్టంబరు 10న గుర్తించినా జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం స్క్రీనింగ్ చేపట్టాలన్న ఆలోచన కూడా చేయకపోవడం దారుణం. ఇద్దరు విద్యారి్థనులు చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ చేస్తే.. 170 మందికి పచ్చ కామెర్లున్నాయని తేలింది. నాడు–నేడు మనబడి కింద మన హయాంలో కురుపాం స్కూల్లో ఆర్వో ప్లాంట్ పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం దాని ఫిల్టర్స్ కూడా మార్చడం లేదు. దీంతో అవి నిరుపయోగమయ్యాయి. హాస్టల్ ఆర్వో ప్లాంట్ ఫిల్టర్లు కూడా మార్చలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పూర్తయితే ఎలా ఉంటుందనే నమూనా ఫొటోను చూపిస్తున్న వైఎస్ జగన్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు.. దారిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నన్ను కలిశారు. నాడు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కంపెనీని కాపాడతానని కూటమి నేతలు చెప్పారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 32 విభాగాలను ప్రైవేటుపరం చేశారు. వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు. ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. జీతాలు కూడా ఇవ్వడం లేదు. వీఆర్ఎస్ డబ్బులూ ఇవ్వడం లేదు. చెరకు రైతుల ఆవేదన పట్టదా? చెరకు కార్మీకులు కూడా నన్ను కలిశారు. 2014–19 మధ్య ప్రభుత్వం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేస్తే మేం అధికారంలో ఉన్నప్పుడు రూ.89 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. ఈరోజు ప్రభుత్వం మరో రూ.35 కోట్లు బకాయి పెట్టింది. రైతుల ఆవేదన చంద్రబాబుకి వినిపించడం లేదు. అందరినీ రోడ్డున పడేస్తున్నారు..! బల్క్ డ్రగ్స్ కంపెనీ కోసం పక్కనే నక్కపల్లిలో 4000 ఎకరాల భూమి ఉన్నా రాజయ్యపేటలో భూముల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. అయినా చంద్రబాబు ఆలకించడం లేదు. మరి వారికి ఎవరు ఊరటనిస్తారు? విశాఖలో చిరు వ్యాపారుల పొట్ట కొట్టారు. 4,500 చిన్న షాపులు తీసేశారు. 32 వేల మంది ఎలా బతుకుతారు? అందరినీ రోడ్డున పడేస్తున్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్...! ఈరోజు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. విద్యార్థులు, రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసాలు చేస్తున్నారు. అన్ని పథకాలు రద్దు చేసేశారు. దీంతో పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, విద్యార్థుల బతుకులు రోడ్డున పడ్డాయి. అయ్యా చంద్రబాబూ.. ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో. ప్రజలకు తోడుగా ఉండు. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. నేటి నుంచి రచ్చబండ.. కోటి సంతకాల సేకరణచంద్రబాబూ.. మీరు చేస్తున్న పనులకు నిరసనగా రేపటి నుంచి (అక్టోబర్ 10) నవంబరు 22 వరకు గ్రామ, వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు సూపర్సిక్స్, సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా రచ్చబండలో తెలియచేస్తాం. ప్రతి గ్రామం నుంచి 500 సంతకాలు, ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా సంతకాలు సేకరిస్తాం. రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరిస్తాం. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. ఆ తర్వాత నవంబరు 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఆ మర్నాడు నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ఆ సంతకాల పత్రాలు లారీల్లో వస్తాయి. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని వాటన్నింటినీ సమర్పిస్తాం. మాతో కలిసి వచ్చే వారందరినీ కూడగడతాం. చంద్రబాబు ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలి.వందేళ్లలో ఉత్తరాంధ్రలో వచ్చింది రెండు మెడికల్ కాలేజీలు...జగన్ హయాంలోనే ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు.. ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు... పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్న్మెంట్ మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. ఉత్తరాంధ్రని తీసుకుంటే 1923లో బ్రిటిష్ వాళ్లు కట్టిన కేజీహెచ్ ఏఎంసీ కాలేజీ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. నాన్న పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ల పుణ్యాన కట్టిన కేజీహెచ్ మాత్రమే ఉన్నాయి. అంటే వందేళ్లలో ఉత్తరాంధ్రలో వచ్చింది రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే. వైఎస్సార్సీపీ హయాంలో.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఏకంగా మరో 4 కొత్త మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాం. విజయనగరం, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాం. ఈ నాలుగింటిలో పాడేరు, విజయనగరం మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు మొదలయ్యాయి. విజయనగరం కాలేజీ 2023లోనే ప్రారంభమైంది. 2024 ఎన్నికల నాటికి సిద్ధమైన పాడేరు కాలేజీలో కూడా క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ రెండు కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కాగా మరో రెండు కొత్త కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ఫొటోలు, టీచింగ్ కాలేజీ ఫొటోలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా మన కళ్లకు కనిపిస్తోంది. మరోవైపు పలాసలో మనం నిర్మీంచిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా కళ్లెదుటే కనిపిస్తోంది. ఐదు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు తెచ్చాం. సీతంపేట, పార్వతీపురం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు జరుగుతుంటే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. -
తప్పు ఒప్పుకోండి.. అబద్ధాలు ఆపండి: వైఎస్ జగన్
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆస్పత్రిలో 64 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 200 కిలోమీటర్ల దూరం నుంచి కేజీహెచ్కు వచ్చారు. ఎంత సీరియస్గా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు? అయినా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గం. గిరిజన విద్యార్థులను పట్టించుకోకపోవడం దారుణం. మరోసారి ఈ తరహా దారుణాలు జరగకుండా సమస్య పరిష్కరించేలా చూడాల్సింది పోయి.. తప్పులు దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చేసిన తప్పులు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు, చికిత్స పొందుతున్న విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. లేదంటే బాధిత కుటుంబాల తరఫున న్యాయ పోరాటం చేస్తాం.కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చర్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో! ఒకే స్కూల్ నుంచి 170 మందికి ఒకేసారి వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం అలవాటైపోయింది. - వైఎస్ జగన్సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే తప్పులు దాచాలని చూడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో పచ్చకామెర్ల బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని గురువారం రాత్రి ఆయన విశాఖలోని కేజీహెచ్లో పరామర్శించారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన అనంతరం.. రాత్రి 8.15 గంటలకు కేజీహెచ్లోని పిల్లల వార్డుకు నేరుగా చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న 21 మంది విద్యార్థుల్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులు, వారి తల్లులతో మాట్లాడి.. వ్యాధుల బారిన పడటానికి గల కారణాలు, హాస్టల్ వద్ద పరిస్థితులు, చికిత్స అందుతున్న తీరు.. తదితర విషయాలపై ఆరా తీశారు. మొదలైన వివరాల్ని ఆరా తీశారు. అందరికీ భరోసా కల్పించి.. త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం కేజీహెచ్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..నీటి కాలుష్యమని వైద్యులు చెబుతున్నారు..కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో 5, 6, 7 తరగతుల పిల్లలు పచ్చ కామెర్లతో కేజీహెచ్లో చేరారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు నీళ్లు బాగోలేవనే చెప్పారు. వైద్యులు కూడా నీటి కాలుష్యం కారణంగానే వ్యాధులు ప్రబలాయని చెబుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తే వాటర్ కంటామినేషన్ ఎందుకు జరుగుతుంది? అది పని చేయడం లేదు. ఒకే హాస్టల్కు చెందిన దాదాపు 170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వస్తే.. ఇక్కడకు వచ్చిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు దానికి గల కారణాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అంతేతప్ప.. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి.. అక్కడ తలెత్తిన సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై ఆలోచించక పోవడం దారుణం.పరిహారం ఇవ్వకపోతే న్యాయపోరాటంఅభం శుభం తెలియని ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వారి కుటుంబాలకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చికిత్స పొందుతున్న పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుని 170 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలి. ఇది మెడికో లీగల్ కేసు. ఎస్టీ పిల్లలను పట్టించుకున్న పరిస్థితి లేని ప్రభుత్వం ఇది. ప్రభుత్వం వీరికి పరిహారం ఇవ్వకపోతే అవసరమైతే వైఎస్సార్సీపీ వీరి తరఫున కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి మరీ.. పరిహారం ఇప్పించే కార్యక్రమం చేస్తుంది.దేవుడు కూడా క్షమించడు..తక్షణమే హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయించండి. బాత్ రూమ్లు రిపేర్ చేయాలి. శానిటేషన్పై దృష్టి పెట్టాలి. వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకుని, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడు కొద్దో గొప్పొ క్షమిస్తాడేమో. లేకపోతే దేవుడు కూడా క్షమించే పరిస్థితి ఉండదని గుర్తు పెట్టుకోవాలి. దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చÆý‡్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో. 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? తప్పు ఒప్పుకోమని చెప్పండి. దానికి ప్రాయశ్చిత్తంగా ఏమేం చేయాలో చేయండి. చనిపోయిన ఇద్దరు పిల్లల తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. పరిహారం ఇవ్వండి. వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు బతికే పరిస్థితి.. చదివే పరిస్థితి ఉండేలా చర్యలు తీసుకోండి.గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడొద్దుఎవరైనా పట్టించుకున్నారా అని ఓ తల్లిని ప్రశ్నిస్తే.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదనతో చెబుతున్నారు. ఇదే పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా కట్టించి ఉంటే ఆ ఆస్పత్రి అందరినీ కాపాడేది. 200 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆస్పత్రికి రాకుండా అక్కడే మెడికల్ కాలేజీ ద్వారా అందరి ప్రాణాలు బాగుపడేవి. దాన్ని నాశనం చేస్తున్నారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైగా అబద్ధాలు. నీటి కాలుష్యం లేదంటూ అవే అబద్ధాలు చెప్పుకుంటూ మళ్లీ దాని గురించి దుష్ప్రచారాలు చేయడానికి సిగ్గుండాలి’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)కు వైఎస్ జగన్ ఈ బాధ్యత అప్పగించారు.ఆయన ప్రతిపక్ష నేత కాదు..పోలీస్ కమిషనర్ ఓవరాక్షన్విశాఖలో వైఎస్ జగన్ పర్యటనను ఆద్యంతం అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి కేజీహెచ్లో కురుపాం ప్రాంతానికి చెందిన పచ్చకామెర్ల బాధిత విద్యార్థుల్ని పరామర్శించేందుకు వచ్చినా.. అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. కేజీహెచ్కు ఎవ్వరూ రాకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వచ్చి.. కేజీహెచ్ని ఖాకీ వలయంలో బంధించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో వైఎస్ జగన్ మాట్లాడకూడదనే ఉద్దేశంతో.. పక్కనే ఉన్న సీఎస్సార్ బ్లాక్కు తరలించి.. అక్కడ నిర్బంధించారు.వైఎస్సార్సీపీ నేతలు ఒత్తిడి తేవడంతో ఒక విద్యార్థిని తల్లికి మాత్రమే అనుమతించారు. మీడియాపైనా సీపీ బాగ్చీ చిందులు తొక్కారు. కేజీహెచ్ నుంచి మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ప్రతిపక్షనేత వస్తే మీడియాతో మాట్లాడనివ్వరా.. అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సీపీ మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ఆయన ప్రతిపక్ష నేత కాదని, ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. అలాగైతే.. మీడియా ఆయనతో మాట్లాడకూడదా.. అని అడగ్గానే అక్కడి నుంచి విçసురుగా వెళ్లిపోయారు. కేజీహెచ్ సిబ్బంది, వై§ý ్యులు, రోగుల బంధువులు వైఎస్ జగన్ని చూసేందుకు పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున పిల్లల వార్డుకు చేరుకున్నారు. వందల మంది పోలీసులతో బందోబస్తు పెట్టినా అభిమానాన్ని ఆపలేక తుదకు చేతులెత్తేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయిందిమా పాప కల్పనకు సరైన ట్రీట్మెంట్ అందలేదు. ప్రభుత్వం తరఫున ఎవ్వరూ పట్టించుకోలేదు. మా పాపను ఇక్కడికి తీసుకు రావడానికి ఎంత కష్టపడ్డామో.. అయినా మంచి వైద్యం అందలేదు. ఎన్నో రోజుల నుంచి బాగోలేకపోయినా హాస్టల్ వాళ్లు చెప్పలేదు. కురుపాం, పార్వతీపురం, విజయనగరం, వైజాగ్.. ఇలా పలు చోట్ల ఆస్పత్రులకు తిప్పాను. ఎక్కడా సరైన ట్రీట్మెంట్ చేయలేదు. ఐసీయూలో పెట్టలేదు. మా పాపకు ఆక్సిజన్ కూడా పెట్టలేదు. ఎవ్వరూ బతికించలేకపోయారు. ఇంత కష్టం వచ్చినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లే మా పాప చనిపోయింది. – మృతి చెందిన కల్పన తల్లి తోయక జయమ్మ -
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: వైఎస్ జగన్
విశాఖ: నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారు(అక్టోబర్ 9వ తేదీ) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కేజీహెచ్లోని పచ్చకామెర్ల బాధిత విద్యార్థులను వైఎస్ పరామర్శించారు. పచ్చకామెర్ల బారిన పడ్డ బాధిత విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. మీడియాను కేజీహెచ్ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించడంతో బయట మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్. ‘170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వచ్చాయి. పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. స్కూళ్లు, హాస్టల్స్లో బాత్రూమ్లను శానిటేషన్ చేయాలి. ఒకే స్కూల్ నుంచి 65 మంది విద్యార్థులు కేజీహెచ్లో చేరారు. కురుపాం నుంచి 200 కి.మీ దూరంలో కేజీహెచ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలుషిత నీటి వల్లే పిల్లలకు ఈ పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 170 మంది పిల్లలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా వాటర్ ప్లాంట్ను రిపేర్ చేయించాలి. పిల్లల తరఫున మేం మెడికో లీగల్ కేసు వేస్తాం. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందజేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’ -
వైఎస్ జగన్ పర్యటన.. కేజిహెచ్ వద్ద విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఓవరాక్షన్
సాక్షి,విశాఖ: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనతో కేజీహెచ్ వద్ద పోలీస్ సీపీ శంఖ బ్రత బాగ్చి ఓవర్ యాక్షన్ చేశారు.కేజీహెచ్ వద్ద వైఎస్ జగన్ ప్రెస్మీట్కు అనుమతించలేదు. ఆస్పత్రి నుంచి మీడియాను బయటకు పంపించేశారు. వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించేందుకు వస్తున్న వైఎస్ జగన్ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వీలు లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. కేజీహెచ్ పీడియాట్రిక్ వార్డు నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆదేశించారు.మరోవైపు కేజీహెచ్కు చేరుకున్న వైఎస్ జగన్..కామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్..
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రభుత్వ పెద్దల కుట్రలు, పోలీసుల అడ్డంకులు అన్నీ దాటి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు జగన్ వెంట జనం నడిచారు.అనకాపల్లి నుంచి రాజుపాలెం వరకు కుండపోత వర్షం కురిసినా, ప్రజల ఉత్సాహం తగ్గలేదు. మహిళలు, వృద్ధులు వర్షంలో తడుస్తూనే జగన్ కోసం ఎదురు చూశారు. కొత్తూరు జంక్షన్ వద్ద టీడీఆర్ బాధితులు, వర్షంలో తడుస్తూనే జగన్ను కలిశారు. తాళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్లు చెరువులా మారినా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు మోకాళ్ల లోతు నీళ్లలో జగన్ కోసం వేచి చూశారు. రైతుల కష్టాన్ని చూసి చలించిన జగన్, వర్షంలో తడుస్తూనే బాధితులతో మాట్లాడారు.జగన్ పర్యటనను విఫలం చేసేందుకు అధికారిక యంత్రాంగం ప్రయత్నించినా, ప్రజల ఆదరణ ఆ ప్రయత్నాలను తుడిచిపెట్టేసింది. కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, జగన్ కాన్వాయ్లోని వాహనాలను నిలిపి వేసినా, క్యాడర్ పొలాల నుంచి బైకులపై వచ్చి, వర్షంలోనూ హారతులు పట్టారు. గుమ్మడి కాయలతో స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఉత్తరాంధ్ర మార్మోగింది. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు 63 కి.మీ. దూరాన్ని 6 గంటలకు పైగా ప్రయాణించి, ప్రజల ఆదరణతో జగన్ పర్యటన సూపర్ సక్సెస్గా నిలిచింది. ఈ పర్యటనతో వైఎస్సార్సీపీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
YS Jagan: ఇకనైనా మారు చంద్రబాబూ... చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్
-
జగన్ పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం
అనకాపల్లి జిల్లా : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మాకవరపాలెం మెడికల్ కాలేజీలో పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. ఏకంగా జగన్ కార్వాన్ మీదకు జనం ఎక్కినా పోలీసులు పట్టించుకోలేదు. జనం ఇలా కార్వాన్ మీదకు ఎక్కినా పోలీసులు మాత్రం చోద్యం చూశారు. ఈ పర్యటనలో మధ్మాహ్నం నుండి వర్షంలో తడుస్తూ వచ్చారు వైఎస్ జగన్. కార్వాన్ లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకునేందుకు కూడా వైఎస్ జగన్ అవకాశం లేకుండా పోయింది. జనాన్ని అదుపు చేయకుండా వదిలేశారు ఖాకీలు. ప్రెస్మీట్ సమయంలోనూ గ్యాలరీలోకి జనాన్ని పంపారు పోలీసులు. దాంతో జగన్ మాట్లాడే సమయలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసుల కారణంగా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కొందరు ఖాకీలు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. మరొకవైపు వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో పార్టీ కేడర్లో ఫుల్జోష్ నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం -
అయ్యా చంద్రబాబు గారూ ఇక కాస్కోండి! అక్కడే తేల్చుకుందాం..
-
YS Jagan: చంద్రబాబుకు సైన్స్ ఉంటే.. పిల్లలు చనిపోయేవాళ్లు కాదు
-
ఇదే నర్సీపట్నం మెడికల్ కాలేజీ అయ్యన్నను ఏకిపారేసిన YS జగన్
-
YS Jagan: చంద్రబాబు.. ఇదే నా వార్నింగ్
-
Medical College: అయ్యా చంద్రబాబు నీకే చెప్తున్నా.. రేపటినుండి మీకు చుక్కలే
-
అయ్యన్న ఇదిగో జీవో... వైఎస్ జగన్ దిమ్మతిరిగే కౌంటర్
-
కళ్ళు కనబడని వాళ్లకు చెబుతున్నా... ఇదిగో మెడికల్ కాలేజ్
-
Narsipatnam Tour: ఇది జగన్ మ్యాజిక్ జనంలో భారీ రెస్పాన్స్..
-
‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’
సాక్షి, నర్సీపట్నం: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్ జగన్.. చంద్రబాబు చేస్తున్న ప్రైవేటీకరణ కుట్రలను ఎండగట్టారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే.. ఈరోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గత మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాంప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీ చేస్తే.. తట్టుకోవడం పేదవాళ్లకు అసాధ్యంఅందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చిందిఅలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు.అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా? పేదవారు దగా పడకుండా ఎలా ఆపుతారుపేదవాళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చాంనర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాంకోవిడ్ సంక్షోభంలోనూ రూ.500కోట్లు ఖర్చు చేశాం ఈ మెడికల్ కాలేజీలో పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేదిఏడాదికి 150 మెడికల్ కాలేజీ సీట్లను అందుబాటులోకి తెచ్చాంఅలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుందిచంద్రబాబు పేదవాడికి అన్యాయం చేస్తున్నారువిజయనగరం,పాడేరు మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభమయ్యాయిచంద్రబాబును అడుగుతున్నాం.. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీల పరిస్థితుల ఇవిఈ నాలుగు మెడికల్ కాలేజీ కాకా.. ఐటీడీఏ పరిధిలోని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయిపలు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తయ్యియి17 మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి కనిపించింది.అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో 2023-24 క్లాసులు ప్రారంభమయ్యాయి. పేదవాళ్లు చదువుకునేందుకు, మెడిసిన్ చదివేందుకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయిఅలాంటి కోట్లాది మందికి వైద్యం,విద్య అందించే ఆధునిక దేవాలయాల్ని దగ్గరుండి చంద్రబాబు అమ్మేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారుమొత్తం మెడికల్ కాలేజీలకు ఐదేళ్లలో ఐదుకోట్లు.. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? చంద్రబాబుఅమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి.. అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి,కరెంట్,నీళ్లు ఇవ్వడానికి మొత్తం యాభైవేల ఎకరాలు.. ఎకరాకు రెండు కోట్లు చొప్పున మొత్తం లక్షకోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలకు రూ. రూ. 4,500 కోట్లు ఖర్చు చేయలేరా?ఇప్పుడు యాభైవేల ఎకరాలు సరిపోవు.. మరో యాభైవేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారుఇలా అమరావతి మొత్తంగా లక్ష ఎకరాలు.. రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూ.. 70వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం అని చెప్పుకుంటూ.. కోట్లాది మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు,ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు..ఏడాదికి వెయ్యికోట్లు ఐదేళ్లకు ఐదువేల కోట్లు ఖర్చు పెట్టలేక.. ప్రైవేట్ పరం చేస్తున్నారా? చంద్రబాబు.అయ్యన్నపాత్రుడుకి వైఎస్ జగన్ కౌంటర్!అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాంఇందులో భాగంగా నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నేత,ఎమ్మెల్యే,స్పీకర్ చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారుఅబద్ధాలు చెబుతూ.. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులే ఎక్కువే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. రుజువు చేసుకుంటున్నారుదీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు బుద్ధిరావాలి’ అని యాజిటేషన్ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే నర్సీపట్నం నేత,స్పీకర్కు చెబుతున్నాను.. అబద్ధాలు చెప్పడం,మోసం చేయడం,ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం.ఈమెడికల్ కాలేజీలకు జీవో ఎక్కడుందని అడుగుతారా?.. ఇదిగో జీవో నెంబర్ 204స్పీకర్ పదవిలో ఉండి జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి మీరు అర్హులేనా? అని ఆలోచన చేయండి. తప్పుడు మాటలు చెబుతూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుకు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తలదించుకోవాలిఇదే పెద్దమనిషి చంద్రబాబు 2024 జూన్లో అధికారంలోకి వస్తే..సెప్టెంబర్ 3న మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు ఆపమని ఓ మోమో డిక్లేర్ చేశారు.వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంమెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణు వైఎస్ జగన్ పిలుపుఅక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ,సంతకాల సేకరణఅక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలునవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలునవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలునవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపుగవర్నర్కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత -
ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న వైఎస్ జగన్
-
జగనన్న కోసం కదిలిన ఊరూ-వాడా (ఫొటోలు)
-
Narsipatnam Tour: వర్షం వచ్చినా డోంట్ కేర్ ప్రతి అడుగులో జగన్ వెంటే..
-
ఏం పిల్లడో వెళ్లాం వస్తావా జగనన్న న్యూ సాంగ్
-
Narsipatnam Tour: బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు అడ్డుకున్న పోలీసులు
-
ఈ వీడియో చూస్తే అనిత, అయ్యన్నకు నిద్రపట్టదు
-
Narsipatnam Tour: ప్రజల కష్టాలు విని షాకైన జగన్
-
‘టీడీపీ కండువాలు వేసుకో.. సీఐని సస్పెండ్ చేయాల్సిందే’
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని పోలీసు స్టేషన్ను టీడీపీ కార్యాలయంగా మార్చిన కూడేరు సీఐ రాజును సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ రాజు వేధింపులకు పాల్పడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ తొత్తుగా కూడేరు సీఐ రాజు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య. కూడేరు సీఐ రాజు ఖాకీ చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకుంటే మంచిది. మంత్రి పయ్యావుల కేశవ్ వర్గీయులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు.ఉరవకొండ నియోజకవర్గంలోని సీఐ, ఎస్ఐలకు ముడుపులు ఇస్తున్నారు. మంత్రి పయ్యావుల లంచాలకు అలవాటు పడ్డ సీఐ రాజు.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూడేరు సీఐ రాజుపై ఎస్పీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం. కూడేరు సీఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలి’ అంటూ విమర్శలు చేశారు. చదవండి: పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా.. -
స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ జగన్ భరోసా
-
జగన్ పర్యటనలపై కక్ష సాధింపు: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోంది. విశాఖ ఎయిర్పోర్టు మొదలుకుని ప్రతీ చోటా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాజీ సీఎం కాన్వాయ్ వెనుక పార్టీ నాయకుల వాహనాలను అనుమతించడం లేదు. ప్రతీ చోటా ఆంక్షలు, నియంత్రణలు పెడుతున్నారు. అనకాపల్లి నుంచి మాకవరపాలెం వరకూ ప్రజలెవ్వరినీ రానివ్వడం లేదు.ప్రజలను అడ్డుకునేందుకు దాదాపు మూడు వేల మంది పోలీసులను పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తితే సహించలేని పరిస్థితి కూటమి నేతలతో ఏర్పడింది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అని ఘాటు విమర్శలు స్తున్నారు. -
నర్సీపట్నం మెడికల్ కాలేజ్.. ఏంపిల్లడో చూద్దాం వస్తవా..
-
అయ్యన్న శుక్లాలు తీసి ఈ జన సంద్రాన్ని చూడు
-
YS జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు
-
జగనన్న స్టీల్ ప్లాంట్ కు రా ...!
-
జగన్ పై అంతులేని ప్రేమ.. నడి రోడ్డుపై దిష్టి తీసిన మహిళ
-
జగన్ రాకతో జనసంద్రమైన నర్సీపట్నం
-
విశాఖలో వైఎస్ జగన్.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్ జగన్ కాన్వాయ్లోని వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద కాన్వాయ్ వాహనాలను ఆపేసి.. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. నేతల కార్లు, బైకులను అడ్డుకుంటున్నారు. అభిమానంతో వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోనూ పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, వైఎస్ జగన్ అభిమానులను పోలీసులు అడ్డుకుంటున్నారు. సామాన్య ప్రజలను కూడా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకుంటున్నారు. అటు, స్థానికంగా ఉన్న షాపులను సైతం పోలీసులు మూయిస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో, పోలీసుల తీరును అభిమానులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి..వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అనకాపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ నేతలు పోలీసు తీరుపై ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై మండిపడుతున్నరు. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలేసి వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలనే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని అంటున్నారు.. -
వైఎస్ జగన్ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. తమ సమస్యలపై కార్మికులు.. వైఎస్ జగన్కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ వారితో మాట్లాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే స్టాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం. స్టీల్ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం, ప్రధానికి లేఖలు రాశాం. స్టీల్ప్లాంట్పై పార్లమెంట్లోనూ ప్రశ్నిస్తాం అని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్కు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్కు రావాలని వైఎస్ జగన్ను ఆహ్వానించాం. స్టీల్ ప్లాంట్కు వచ్చి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. మాకు మద్దతు ఇచ్చిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. మరోవైపు.. విశాఖలో వైఎస్ జగన్ను కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు విశాఖకు తరలి వచ్చారు. ఈ క్రమంలో జి.భీమవరం వద్ద పోలీసులు.. మత్స్యకారులను అడ్డుకున్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. దీంతో, ఎలాగైనా వైఎస్ జగన్ను కలిసి తీరుతామని మత్స్యకారులు తెలిపారు. అనంతరం, కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. -
KSR Live Show: వచ్చేది జగన్.. ఆపితే ఆగే సైన్యం కాదు
-
Watch Live: వైఎస్ జగన్ నర్సీపట్నం టూర్
-
బాబుకు బిగ్ షాక్.. జగన్ ను కలవనున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
నర్సీపట్నం బయలుదేరిన వైఎస్ జగన్
-
నర్సీపట్నంకు జగన్.. వణికిపోతోన్న బాబు అండ్ కో
-
వైజాగ్ అభివృద్ధికి జగన్ ఏం చేశారంటే..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు తన పాలనా కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాను ఆర్థిక శక్తిస్థావరంగా మలచడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించారు. విశాఖపట్నం దక్షిణాసియాలోని ముఖ్యమైన ఓడరేవు నగరంగా ఉండటం వల్ల దీన్ని ఐటీ, ఫార్మా, టూరిజం, ఇండస్ట్రీలకు హబ్గా మార్చడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగన్ నేడు విశాఖ పర్యటన సందర్భంగా తన పాలనా కాలంలో జిల్లాలో నిర్వహించిన కార్పొరేట్ కార్యక్రమాలను తెలుసుకుందాం. భవిష్యత్ వ్యాపార అభివృద్ధి కోసం సిద్ధం చేసిన ప్రణాళికలను చూద్దాం.కార్పొరేట్ కార్యక్రమాలుజగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019-2024 మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మార్చడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) వంటి పెద్ద ఈవెంట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఫార్మా, ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై దృష్టి సారించాయి. 2023 మార్చిలో విశాఖపట్నంలోనే నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) ఒక మైలురాయి. ఈ సమ్మిట్లో 352 ఒప్పందాలు జరిగాయి. దాంతో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల చేరాలనే లక్ష్యం నిర్ణయించుకున్నారు. వీటిలో సుమారు 39% ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. GIS వేదిక నుంచి జగన్ 14 పరిశ్రమలను భౌతికంగా ప్రారంభించారు. ఈ పరిశ్రమలకు మొత్తం రూ.3,841 కోట్ల పెట్టుబడితో 9,108 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.విశాఖపట్నం జిల్లాలో నేరుగా ప్రారంభించిన కార్పొరేట్ కార్యక్రమాలలో 2023 అక్టోబర్లో ఐదు కంపెనీల ప్రారంభం ముఖ్యమైనది. మొత్తం రూ.1,371 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీలు 2,950 ఉద్యోగాలు సృష్టించాయి. వీటిలో..ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్: రూ.500 కోట్ల పెట్టుబడితో 1,000 ఉద్యోగాలు. జావా, J2EE, SAP, డేటా సైన్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, రిటైల్ రంగాలకు సేవలు అందిస్తుంది.ఈజియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా సిటీలో): రూ.500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. సంవత్సరానికి 300 మిలియన్ ఇంజెక్టబుల్ యూనిట్లు ఉత్పత్తి.లారస్ ల్యాబ్స్ (అచ్చుతపురం సెజ్లో): రూ.440 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు.లారస్ సింథటిక్స్: రూ.191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు.మరో లారస్ ల్యాబ్స్ యూనిట్: రూ.240 కోట్ల పెట్టుబడి, 400 ఉద్యోగాలు (ఫౌండేషన్ స్టోన్).అనకాపల్లిలో ఫార్మా సిటీ అభివృద్ధి జగన్ పాలనలో వేగవంతమైంది. 2023 అక్టోబర్లో మూడు ఫార్మా కంపెనీలను ప్రారంభించి రెండు బల్క్ డ్రగ్ యూనిట్లకు శంకుస్థాపన వేశారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.1,611 కోట్ల పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2019 నుంచి 107 పెద్ద పరిశ్రమలు రూ.46,002 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1,06,249 ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో విశాఖపట్నం జిల్లా భాగస్వామం అధికంగానే ఉంది. అలాగే 88 ఒప్పందాలతో రూ.44,963 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. వీటిలో రూ.38,573 కోట్లు ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. ఈ కార్యక్రమాలు విశాఖపట్నంను ఫార్మా, ఐటీ హబ్గా మార్చాయి.భవిష్యత్ ప్రణాళికలుజగన్ పాలనలో విశాఖపట్నంను భవిష్యత్తులో గ్లోబల్ మెట్రోపాలిస్గా మార్చడానికి ‘విజన్ విశాఖ’ (Vision Visakha) ప్రణాళికను 2024 మార్చి 5న ప్రకటించారు. 10 సంవత్సరాల ప్లాన్కు మొత్తం రూ.1.05 లక్ష కోట్ల పెట్టుబడిని నిర్ణయించారు. ఈ పెట్టుబడులు ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉపయోగపడతాయి. 5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తాయి. విశాఖను హైదరాబాద్, చెన్నైలతో పోటీపడేలా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ల మధ్య సహకారం నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రణాళికలు ఇలా..ఇండస్ట్రియల్ డెవలప్మెంట్: 30 ప్రాజెక్టులకు రూ.33,080 కోట్లు (విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో). ఇందులో NTPC హైడ్రోజన్ పార్క్ (రూ.20,225 కోట్లు), TVS లాజిస్టిక్స్ పార్కులు (రూ.1,500 కోట్లు), JSW ఇండస్ట్రియల్ పార్క్ (రూ.532 కోట్లు), ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, ఇన్క్యుబేషన్ ఫెసిలిటీలు (APIS, STPI, NASSCOM, ఆంధ్ర యూనివర్సిటీ).ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్: భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ (రూ.4,727 కోట్లు), విశాఖ మెట్రో రైల్ (రూ.14,000-14,309 కోట్లు), హై-స్పీడ్ రైల్ కారిడార్లు (హైదరాబాద్-విశాఖ, విజయవాడ-బెంగళూరు). స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు రూ.1,906.15 కోట్లు. బీచ్ కారిడార్ (భోగాపురం నుంచి నగరం వరకు 6-లేన్ రోడ్)కు రూ.960 కోట్లు.ఎనర్జీ, గ్రీన్ టెక్: అదానీ డేటా సెంటర్ (రూ.27,000 కోట్లు), NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ (రూ.27,000 కోట్లు).ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
జగన్ ను కలిసి కన్నీరు పెట్టుకున్న డీఎస్సీ అభ్యర్థులు
-
జగన్ పర్యటనకు రావొద్దు..! ప్రజలకు, పార్టీ నేతలకు పోలీసుల బెదిరింపులు
-
ముదునూరి ప్రసాద రాజు కొడుకు వివాహానికి హాజరైన వైఎస్ జగన్
-
సవాల్ విసిరి రెచ్చగొట్టారు.. ఇప్పుడు భయపడుతున్నారు
-
జగన్ టూర్ పై కుట్ర.. అయినా తగ్గేదే లే..
-
నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను వైఎస్ జగన్ సందర్శన
-
మేం మంచి చేస్తే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. నేడు నర్సీపట్నంలో పర్యటనలో భాగంగా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాటు... -
YS జగన్ నర్సీపట్నం టూర్.. రూట్ మ్యాప్ ఇదే
-
ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల రక్షణకు పోరుబాట... నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
వైద్య కళాశాలల రక్షణకు 'వైఎస్ జగన్' పోరు బాట
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరుకు సిద్ధం అయ్యారు. గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన నర్సీపట్నం వైద్య కళాశాలను నేడు ఆయన స్వయంగా సందర్శించనున్నారు. తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థుల డాక్టర్ కలను సాకారం చేయడం కోసం గత ప్రభుత్వంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నిర్వహణ పేరిట ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను పచ్చ కార్పొరేట్ గద్దలకు 66 ఏళ్ల పాటు లీజు పేరుతో కారు చౌకగా, అప్పనంగా బాబు ప్రభుత్వం కట్టబెడుతోంది. రెండు దశల్లో 10 వైద్య కళాశాలలను ప్రైవేట్కు ధారాదత్తం చేసేలా ప్రణాళికలు రచించి, ఇప్పటికే తొలి దశలో నాలుగు కళాశాలలకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఉన్నత ఆశయానికి తూట్లు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు జిల్లాల పునర్విభజన చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త కళాశాలల నిర్మాణం చేపట్టారు. కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను హబ్లుగా అభివృద్ధి చేసి, జిల్లా పరిధిలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను అనుసంధానించి.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా నాణ్యమైన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని సంకల్పించారు. వైఎస్ జగన్ విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనాస్పత్రి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆస్పత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల అజమాయిïÙ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు, అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు, రక్త పరీక్షలు, ఇతర డయగ్నోస్టిక్ సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. దీంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టి, ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్కు కట్టబెడుతున్న వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలే ఉండబోవని ప్రభుత్వం రూపొందించిన టెండర్ నిబంధనలే చెబుతున్నాయి. 620 పడకల సామర్థ్యంతో నడిచే బోధనాస్పత్రుల్లో ఒక్కటంటే ఒక్క పడక కూడా ఉచిత వైద్యానికి కేటాయించరు. ఈ కళాశాలల్లో వంద శాతం పడకలతో కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోనున్నాయి. ప్రైవేట్ తరహాలోనే ఫీజుల దోపిడీ ⇒ కొత్త వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు ఆరి్థక వనరులు సమకూర్చుకునే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే ఎంతో తక్కువగా ఫీజులు ఖరారు చేసింది. ⇒ మధ్య తరగతి కుటుంబాల వారు సైతం భరించగలిగేలా ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉండే 35 శాతం సీట్లకు రూ.12 లక్షలు, 15 శాతం ఎన్ఆర్ఐ సీట్లకు రూ.20 లక్షల చొప్పున ఫీజుల విధానం ప్రవేశపెట్టారు. ఈ నిధులను కేవలం ఆ వైద్య కళాశాలల అభివృద్ధి కోసమే వెచ్చించేలా ప్రణాళిక వేశారు. అంతకు మించి ప్రైవేట్ కళాశాలల్లో మాదిరిగా విద్యార్థులపై ఫీజుల దోపిడీ లేకుండా చేశారు. ఈ విధానంపై అప్పట్లో కూటమి పార్టీలు, ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో దు్రష్పచారం చేశాయి. ⇒ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ప్ ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక తమదైన శైలిలో విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తూ ఏకంగా కళాశాలలనే ప్రైవేట్కు కట్టబెట్టేస్తున్నారు. ⇒ బాబు ప్రవేశపెట్టిన పీపీపీ విధానంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజుల దోపిడీకి లైసెన్స్ ఇచ్చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరి సీటుకు ఏటా రూ.13.20 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.39.60 లక్షల ఫీజులు ప్రైవేట్లో వసూలు చేస్తున్నారు. ఇదే ఫీజుల స్వరూపాన్ని పీపీపీకి ప్రభుత్వం ప్రతిపాదించింది. ⇒ ఈ లెక్కన 5 ఏళ్లకు సెల్ఫ్ ఫైనాన్స్ సీటుపై రూ.6 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాలో రూ.98 లక్షల చొప్పున విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం నడిపే వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఏడాది పాటు హౌస్ సర్జన్గా సేవలు అందించే సమయంలో నెలకు రూ.26 వేల చొప్పున ఏడాదికి రూ.3.12 లక్షల స్టైఫండ్ ఇస్తారు. ఈ నేపథ్యంలో కొత్త వైద్య కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే స్టైఫండ్ సరిగా అందదు. దీనికి తోడు అదనపు ఫీజుల దోపిడీకి గురవుతారు. ⇒ భవిష్యత్లో అందుబాటులోకి వచ్చే పీజీ సీట్లకు సైతం బీ కేటగిరికి రూ.9.93 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.57.50 లక్షలు చొప్పున ఫీజులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైకి మాత్రం విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని ప్రచారం చేస్తుండటం గమనార్హం.కళ్లెదుటే సాక్ష్యం ⇒ ఏపీ విభజన చట్టంలో భాగంగా మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణం చేపట్టింది. 2016–17లో నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా ఏక కాలంలో నిర్మాణాలన్నీ చేపట్టాక ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభించలేదు. కేవలం 50 మంది విద్యార్థులతో తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభించింది. ⇒ రెండు బ్యాచ్లకు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలోనే తరగతులు నిర్వహించారు. మంగళగిరిలో విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా భవనాలు అందుబాటులోకి వచ్చాకే విద్యార్థులను అక్కడికి తరలించారు. 2016–17లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ నిర్మాణం గతేడాదిలో పూర్తి అయింది. అంటే దాదాపు తొమ్మిదేళ్లు ఎయిమ్స్ నిర్మాణం కొనసాగింది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన నిర్మాణాల విషయంలో మాత్రం ఒకేసారి నిర్మాణాలెందుకు పూర్తి చేయలేదన్నట్టుగా బాబు ప్రభుత్వం దాడి చేస్తూ అభాసుపాలవుతోంది. నేడు వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్ మీదుగా) వెళతారు. అక్కడ కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా నిర్మాణం నిలిపి వేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. విష జ్వరాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.15.. 23.. ఏళ్లు ఎందుకు పడుతుంది? ⇒ 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తేవడం కోసం కేంద్ర సాయం, స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం, నాబార్డు లోన్ల ద్వారా రూ.8,480 కోట్ల నిధులు గత ప్రభుత్వంలోనే సమకూర్చారు. ఈ క్రమంలో కళాశాలల నిర్మాణానికి నిధుల సమస్య లేదు. ⇒ గత ప్రభుత్వంలో 2023–24లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చారు. ⇒ 2024–25లో పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు మొదలయ్యే నాటికే పాడేరు, పులివెందుల వైద్య కళాశాలలను సిద్ధం చేశారు. మిగిలిన మూడు కళాశాలలు సైతం మొదటి ఏడాది తరగతులకు సంబంధించి చిన్న చిన్న వసతులు సమకూర్చాల్సి ఉండింది. ⇒ ఈ చర్యల ఫలితంగానే గతేడాది పాడేరు, పులివెందులకు 50 చొప్పున సీట్లతో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి మిగిలిన సౌకర్యాలు సమకూరుస్తామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే ఆదోని, మదనపల్లె, మార్కాపురం కళాశాలలు కూడా ప్రారంభం అయి ఉండేవి. ⇒ వైఎస్ జగన్ విధానంలో వెళితే కళాశాలలు పూర్తి చేయడానికి 15 ఏళ్లు.. 23 ఏళ్లు పడుతుందని ప్రభుత్వం దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. దేశంలో ఎక్కడైనా ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ రంగాల్లో వైద్య కళాశాలలను వంద శాతం నిర్మాణం పూర్తి చేశాకే ప్రారంభించరనే వాస్తవాన్ని మరుగున పరుస్తోంది. ⇒ రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన వైద్య కళాశాలల నిర్మాణానికి మాత్రం నిధులు లేమిని సాకుగా చూపుతుండటంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ⇒ అస్మదీయులకు మేలు చేయడం కోసం సీఎం చంద్రబాబు చేసిన కుట్రలతో రాష్ట్ర విద్యార్థులు రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు. -
ఆటోలు తిప్పొద్దు..ఫ్లెక్సీలు కట్టొద్దు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన, ప్రజా ఉద్యమం కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు కుటిల యత్నాలు పన్నుతోంది. గురువారం నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రజలను తరలించవద్దంటూ ఆటోవాలాలు, పార్టీ నేతలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు పోలీస్స్టేషన్ల నుంచి ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. అనకాపల్లి టౌన్, రూరల్, కశింకోట, యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, నర్సీపట్నం టౌన్, రూరల్, చోడవరం టౌన్ పోలీసుల నుంచి పార్టీ నేతలకు బెదిరింపు కాల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మండల, గ్రామ స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్లు చేసేందుకు పథకం వేసినట్లు తెలుస్తోంది. మాకవరపాలెం మండల కేంద్రం ఇప్పటికే వందల మంది పోలీసులతో నిండిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణించి నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. అనంతరం ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడనున్నట్లు పార్టీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వలేమని ఒకసారి.. హెలికాప్టర్లో వెళ్లాలంటూ మరోసారి.. ఫలానా మార్గంలోనే వెళ్లాలంటూ ఇంకోసారి.. ఇలా ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్కారు అడ్డంకులు సృష్టిస్తోంది. అయితే వైఎస్ జగన్ పర్యటన ముందుగా ప్రకటించిన ప్రకారం యథాతథంగా సాగుతుందని వైఎస్సార్సీపీ స్పష్టంగా ప్రకటించడంతో చివరకు పలు షరతులు,ఆంక్షలు విధిస్తూ అనుమతించారు. ఎన్ని షరతులు విధించినా జనం వెల్లువలా తరలివస్తారని గ్రహించడంతో ప్రజలను తరలించకుండా అడ్డుకునే యత్నాలకు దిగినట్లు తెలుస్తోంది. ఆటోవాలాలను పిలిపించి గురువారం జగన్ పర్యటనకు జనాలను తరలించవద్దంటూ పోలీసుల ద్వారా సర్కార్ హెచ్చరిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు ఫోన్ కాల్స్..ఒకవైపు పర్యటనకు అనుమతి లేదంటూ తొలుత బెదిరింపులకు దిగిన పోలీసులు తర్వాత కొత్త మార్గంలో వెళ్లాలంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రజలను తరలించకుండా ఇప్పటికే ఆటోవాలాలను బెదిరించిన పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్లు చేయడం గమనార్హం. మీరెక్కడ ఉన్నారు? సీఐ పిలుస్తున్నారు.. వచ్చి కలవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఎంత చేసినా జగన్ పర్యటనను, జన వాహినిని అడ్డుకోలేమని గ్రహించడంతో ఫ్లెక్సీల వ్యూహాన్ని ఆశ్రయించారు. జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకపోవడం గమనార్హం. కూటమి నేతల ఫ్లెక్సీలు రోజుల తరబడి అలానే దర్శనమిస్తుండగా.. వైఎస్సార్ సీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 500 మందికి మించి గుమికూడవద్దంటూ ఆంక్షలు విధించడంతోపాటు అసలు ఫ్లెక్సీలు కట్టవద్దంటూ షరతులు విధిస్తున్నారు. అభిమానాన్ని చాటుకునేందుకు కూడా ఆంక్షలేమిటంటూ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో షరతులు, బెదిరింపులు చూడలేదని పేర్కొంటున్నారు.కళ్ల ముందే కనిపిస్తున్నా...రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 5 నూతన వైద్య కళాశాలలు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో 50 మంది విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా బాబు సర్కారు కుట్రపూరితంగా అడ్డుకుని వద్దంటూ లేఖ రాసింది. ఇవి రెండూ గత ప్రభుత్వ హయాంలోనే అన్ని వసతులతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ హయాంలోనే చేపట్టగా ఇప్పటికే 60 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇదంతా కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం రాగానే పనులను పూర్తిగా నిలిపివేసింది. అసలు మెడికల్ కాలేజీలకు అనుమతులే లేవంటూ చంద్రబాబు మొదలు మంత్రుల వరకూ అంతా బుకాయించగా నేషనల్ మెడికల్ కమిషన్ ఈ దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. దీంతో ప్రభుత్వ పెద్దలు కొత్త రాగం అందుకున్నారు. పీపీపీ పాట పాడుతూ విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి సర్కారు ప్రైవేట్ చేతుల్లో పెట్టి వ్యాపారానికి సిద్ధం కావడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా...విమానాశ్రయం నుంచి గాజువాక, అనకాపల్లి మీదుగా వైఎస్ జగన్ పర్యటన సాగితే మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం గుండా వెళుతుంది. అక్కడ భారీ సంఖ్యలో స్టీల్ప్లాంట్ కార్మికులు తరలివచ్చి తమ ఆక్రోశం, ఆవేదనను నేరుగా వైఎస్ జగన్కు విన్నవించే అవకాశం ఉందని కూటమి సర్కారు ఆందోళన చెందుతోంది. దీంతో కుటిల బుద్ధితో రూటు మార్చేసింది. ప్రధాన రహదారి గుండా వెళ్లకుండా ఎన్ఏడీ, పెందుర్తి మీదుగా పర్యటనకు అనుమతిచ్చారు. చంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, గొంతు నొక్కడంపై స్టీల్ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ మండిపడుతున్నారు. స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలపై కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (ఈవోఐ) ఆహ్వానించడం గమనార్హం. ఇక స్టీల్ప్లాంట్ కార్మికులకు సుమారు 4 నెలల వేతనం పెండింగ్లో ఉంది.


