YS Jagan Mohan Reddy
-
మార్కాపురం బస్సు ప్రమాదం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
మార్కాపురం బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2026అంతకుముందు బస్సు ప్రమాదంపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలన్నారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని, ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వైఎస్ జగన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
Jagan 2.0 రంగం సిద్ధం.. ఆరా మస్తాన్ సంచలనం..
-
క్రెడిట్ చోరీ కాదు.. క్రెడిట్ దోపిడీ: వైఎస్ జగన్
నియోజకవర్గాల పెంపు గుడ్ న్యూస్. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుంది. ఉత్సాహం, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం ఇస్తాం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. వంట నూనె లీటరు రూ.40 పెరిగింది. పప్పులు కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఉచిత గ్యాస్కు దిక్కులేదు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్లో అమ్ముతున్నారు. సిలిండర్ రూ.2 వేలు, రూ.3 వేలకు అమ్ముతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ పెద్దమనిషి కిరోసిన్ ఇస్తానంటున్నాడు. లీటరు కిరోసిన్ ఇస్తాడంట. పండగ చేసుకోమంటున్నాడు. అసలు కిరోసిన్ స్టవ్లు ఎక్కడున్నాయి? చివరకు గుడ్ల ధర కూడా పడిపోయింది. మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.2,400 అయితే రూ.1,400కు కూడా అడిగే వాడు లేడు. కోకో, అరటి, శనగ, టమాటా.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరం. -వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: చంద్రబాబు క్రెడిట్ చోరీ కాకుండా, ఏకంగా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని.. ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ను కలిశానని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని చెప్పారు. తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతే కాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టులోనూ రూ.4,800 కోట్ల పెట్టుబడికి అవగాహన కుదుర్చుకుందని వెల్లడించారు. అలా తాము తెచ్చిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ అంతా తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎత్తి చూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్ధల పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మనం 151 సీట్లు గెల్చుకున్నా, అద్దంకిలో గెలవలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబుకన్నా ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఇప్పటి మంత్రిపై ఉందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో డాక్టర్ అశోక్కుమార్ను తీసుకొచ్చామని.. ఆయన మంచి డాక్టర్ అన్నారు. రాక్షస రాజ్యంలో ఉన్నాం కాబట్టి, చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని తెలిసినా, అశోక్ ముందుకొచ్చి, ఐదేళ్ల పోరాటానికి సిద్ధమయ్యారని.. కార్యకర్తలకు తోడుగా నిలబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. కోటలు దాటుతున్న బాబు మాటలు⇒ ‘చంద్రబాబు పాలనంతా వైఫల్యం. కానీ, మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలుండవు. ఆయన చేస్తున్న దాన్ని క్రెడిట్ చోరీ కాకుండా క్రెడిట్ దోపిడీ అనాలేమో. చంద్రబాబు ఇటీవలి క్రెడిట్ దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను తాను తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ.. ఆర్భాటంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు క్రెడిట్ దోపిడీకి కనీసం హద్దు ఉండాలి. ఆదిత్య మిట్టల్ను 2022లో నేను దావోస్లో కలిశాను. అప్పట్లోనే ఇక్కడి గ్రీన్కో ప్రాజెక్టులో పెట్టుబడికి కూడా రెడీ అయ్యారు. రూ.4,800 కోట్ల పెట్టుబడితో ఆ ప్రాజెక్టులో వారు భాగస్వాములయ్యారు. కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లో ఆ పెట్టుబడి పెట్టారు. ⇒ ఇంకా అప్పట్లోనే ఎస్సార్ స్టీల్ని వారు కొనుగోలు చేసి, రూ.1,000 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ అయ్యారు. ఆ మేరకు అగ్రిమెంట్లు కూడా జరిగాయి. అవే కాకుండా, ఇక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించి, వారికి తగిన భూములు చూపాలని అధికారులను ఆదేశించాను. దాంతో అధికారులు కాకినాడ సెజ్లో, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపితే, వారికి నక్కపల్లి నచ్చింది. అక్కడ మనకు ఏపీఐఐసీ భూములుంటే, వాటిలో 2,200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ.. ఒక జూమ్ కాల్తో మిట్టల్ కంపెనీ వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ⇒ అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. విశాఖలో అదానీ డేటా సెంటర్ కూడా అంతే. అది మన హయాంలోనే వచ్చింది. అది కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం. అదే నక్కపల్లిలో 2023లో బల్క్ డ్రగ్ పార్కును 13 రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చాం. కేంద్రం రూ.1,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ, చంద్రబాబు వచ్చాక, ఆ బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరగడం లేదు. అడుగులు ముందుకు పడడం లేదు. దాని వల్ల రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలూ వస్తాయి. అయినా భూముల పేరుతో వివాదాస్పదం చేశారు. దాంతో ఆ పనులు నిల్చిపోయాయి. అలా కొన్ని ప్రాజెక్టులు పని చేయడం లేదు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరైన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పోర్టుల్లో పనుల నిలిపివేత⇒ నాడు మన ప్రభుత్వంలో మూడు పోర్టుల పనులు వేగంగా చేశాం. నిధుల సమీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. రామాయపట్నం పోర్టు దాదాపు 80 శాతం పూర్తి చేశాం. మూలపేట పోర్టు పనులు 30 శాతం పూర్తి చేశాం. మచిలీపట్నం పోర్టు 30 శాతం మన హయాంలోనే పూర్తి చేశాం. కానీ, ఈ మూడింటి పనులు ఆగిపోయాయి. ఎందుకంటే, జగన్కు పేరు రాకూడదని పనులు ఆపారు. ⇒ ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములను చంద్రబాబు తన వారితో కొనిపిస్తున్నాడు. అప్పటి వరకు పోర్టుల పనులు ఆపేశారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, ఇంకా భూములు లేవని మచిలీపట్నం పోర్టు వద్ద అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా ప్రతి అడుగులోనూ నాకేమిటి అంటూ చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ దిశలోనే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి వాతావరణంలో రేపు 2029 ఎన్నికలు జరగబోతున్నాయి.అంతా దగా.. పచ్చి మోసం⇒ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు.. ఆ తర్వాత ఏం చేస్తున్నాడన్నది అందరికీ తెలుసు. జగన్ ఇస్తున్నవన్నీ అలాగే అమలు చేయడమే కాకుండా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా ఇస్తానన్నాడు. ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. ⇒ ఇప్పుడు మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇంకా మిగిలినవి కేవలం రెండు మాత్రమే. కానీ ఏ పథకం అమలు చేయడం లేదు. జగన్ ఇచ్చినవన్నీ పోయాయి. అన్నీ ఎగ్గొట్టాడు. చివరకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా మోసాలయ్యాయి. బిర్యానీ కథ దేవుడెరుగు.. ఉన్న పలావు పోయింది. దీని గురించి ప్రజలు ఇంటింటా చర్చించుకుంటున్నారు.జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం⇒ గుడ్న్యూస్ ఏమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు, పార్లమెంటు నియోజకవర్గాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. అలాగే వాటిలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33 శాతం చొప్పున అసెంబ్లీలో 88 సీట్లు, 13 ఎంపీ సీట్లు దక్కనున్నాయి. నాడు మన ప్రభుత్వ హయాంలో మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇచ్చాం. అందుకోసం చట్టం కూడా చేశాం. ఆ విధంగా మహిళలకు సాధికారత కల్పించాం.⇒ 2029లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు లీడర్లుగా ఎదుగుతారు. నాయకత్వ పటిమ చూపే వారందరికీ జగన్ న్యాయం చేస్తాడు. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. నాడు మన హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల కార్యకర్తలపై దృష్టి పెట్టలేకపోయాం. పాలన, బటన్ నొక్కడంపై ఎక్కువగా ధ్యాస పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ప్రజలకు ఇంకా మంచి చేయడమే కాకుండా, కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుంది.⇒ జగన్ 2.0లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి, రాబోయేవి చాలా మంచి రోజులు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. చంద్రబాబు చేసే రెడ్బుక్ పాలన, అన్యాయాలకు టైమ్ దగ్గరకొచ్చింది. ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.⇒ ఈ సమావేశంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, నియోజకవర్గంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.అంతా దోచుకో.. పంచుకో.. తినుకో..⇒ మన హయాంలో ఆ ఐదేళ్లలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలతో సహా ఎవరికి, ఎంతిచ్చామో చెప్పగలం. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయి. కానీ, జగన్ ఇచ్చిన పథకాలు లేవు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా లేవు. మరి నాడు జగన్ ఎలా చేశాడు.. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎందుకు చేయడం లేదు.. అన్నదానిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.⇒ చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదంటే.. ఇప్పుడంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా చంద్రబాబు, ఆయన బినావీులు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ప్రతి చోటా దోపిడీ. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. వేలం పాటలు నిర్వహించి, బెల్టు షాపులు నడుపుతున్నారు. మద్యం ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. అంతా మాఫియాకు చేరుతోంది.⇒ ఇసుక, మట్టి, ల్యాటరైట్.. దేన్నీ వదలడం లేదు. మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారు. మనం యూనిట్ విద్యుత్ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారు. మనం రైతులకు ఉచిత విద్యుత్ 25 ఏళ్లు ఇవ్వాలని సంకల్పించి, యూనిట్ విద్యుత్ను రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటే విమర్శించారు. కానీ వీరు ఏకంగా యూనిట్ విద్యుత్ను రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు.⇒ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనే చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్ స్టార్ లెవెల్లో కట్టొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. భూములనైతే శనక్కాయలు, బెల్లానికి ఇస్తున్నారు. చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడికి రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు.పరిపాలన లేదు.. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి⇒ చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యా దీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రుల పథకం కింద వైద్యం చేయడం లేదు.⇒ నాడు–నేడు మనబడి లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ లేదు. పిల్లలకు ట్యాబ్లు లేవు. గోరుముద్దలో క్వాలిటీ లేదు. చదువులు పూర్తిగా తిరోగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతున్నాయి. విద్య, వైద్యం పరిస్థితి ఇలా ఉంటే.. రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంత దారుణంగా వ్యవసాయం ఉంది. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. -
తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..
-
ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్
-
యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి
-
ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...
-
జగన్ గుడ్ న్యూస్.. 263 MLA సీట్లు .. 38 MP సీట్లు
-
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, తాడేపల్లి: మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. 2029 ఎన్నికల నుంచి ఈ చట్టాన్ని అమలు చేయటాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతించారు. మహిళా రిజర్వేషన్ అమలు మంచి నిర్ణయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. మహిళల సాధికారతకు మా పార్టీ ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం అవకాశం కల్పించాం. నామినేషన్ ద్వారా ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం. అసెంబ్లీ, లోక్సభలో 33% మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం చట్టం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతి స్థాయిలో మహిళలు నాయకులుగా ఎదగాలనేది మా పార్టీ ఆకాంక్ష’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.The YSR Congress Party wholeheartedly supports the proposed amendments to the Women's Reservation Act, 2023, enabling its implementation in 2029. Our party has always placed utmost emphasis on the empowerment of women. We have already led the way by implementing 50% reservation…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2026 -
YS Jagan: చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి... ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చినట్టు..
-
పులి నోట్లో తలకాయ నేను చెప్పిందే నిజమైంది... వాయించిన జగన్
-
ఇదేం బిల్డప్ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్ జగన్ (ఫోటోలు)
-
యుద్ధం పేరుతో బాబు మోసం జగన్ కీలక వ్యాఖ్యలు
-
మాకు ప్రతి YSRCP కార్యాలయం ఒక దేవాలయంతో సమానం
-
నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జి డా.అశోక్ కుమార్తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ‘యుద్ధం పేరు చెప్పి వంటనూనె ధరలు లీటర్కు రూ.4౦ వరకు పెంచేశారు. పప్పుల ధర కిలోకి రూ.15లకు పైగా పెంచేశారు. బ్లాక్లో సిలిండర్లను రూ.2 వేలకు, రూ.3వేలకు అమ్ముతున్నారు. ఇప్పుడు కిరోసిన్ ఇస్తామంటున్నాడు. ఇప్పుడు కొత్తగా కిరోసిన్ స్టౌవ్లు కొనుక్కోవాలా?. మొక్కజొన్న, కోకో, శెనగ, అరటి, టమోటా పంటలకు ధర లేదు.చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి. క్రెడిట్ దోపిడీ చేస్తున్నాడు.ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ చంద్రబాబుది క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు. 2022లో దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ నాతో సమావేశమయ్యారు. రూ.4,800 కోట్లు గ్రీన్కోలో పెట్టుబడులు పెట్టారు. ఎస్ఆర్ స్టీల్ను కొనుగోలు చేసి మన హయాంలో వేయికోట్లు పెట్టుబడులు మన హయాంలో పెట్టారు. కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామంటే మనమే ఆహ్వానించాం. మా హయాంలోనే కాకినాడ, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపించాం. ఎన్నికలకు ముందు వచ్చి నక్కపల్లిని ఎంపిక చేసుకున్నారు. తనని చూసి స్టీల్ప్లాంట్ వచ్చినట్లు బాబు బిల్డప్ ఇస్తున్నారు. గూగుల్ విషయంలోనూ ఇలాగే క్రెడిట్ దోపిడి చేస్తున్నారు.2023లో బల్క్ డ్రగ్ పార్క్ తీసుకు వచ్చాం. ఎక్కవ ల్యాండ్ కావాలని సంక్షోభం సృష్టించారు. దీనివల్ల బల్క్ డ్రగ్ పార్క్ తిరోగమనంలో ఉంది. మన హయాంలో 3 పోర్టులు ప్రభుత్వ రంగ పోర్టులు తీసుకు వచ్చాం. రెండేళ్లు గడిచినా పోర్టుల్లో పనులు ముందుకు సాగడం లేదు. పోర్టులకు చుట్టుపక్కల మళ్లీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.కష్టపడే కార్యకర్తలకు పెద్దపీటనియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త. మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. మన పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం. పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో మనం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చాం.ఇప్పుడు మహిళలకు చట్టసభల్లో మరిన్ని సీట్లు రాబోతున్నాయి. సీట్లు పెరగడం వల్ల మన కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారు. పార్టీలో పటిమ చూపించే వారికి, కష్టపడే వారికి పెద్దపీట వేస్తాం. జగన్ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట’ ఉంటుందని స్పష్టం చేశారు. -
భారతమ్మకు ఏం సంబంధం.. కళ్ళుపోతాయి అమ్మ షర్మిలమ్మ.. రాచమల్లు అదిరిపోయే కౌంటర్
-
నేడు అద్దంకి YSRCP నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
వైఎస్ జగన్ ను కలిసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
-
మాజీ సీఎం జగన్తో పిన్నెల్లి భేటీ
సాక్షి, అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంగళవారం భేటీ అయ్యారు. అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న ఆయన ఇటీవల బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. తనపైన, తన సోదరుడిపైన టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, మాచర్ల నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా జగన్కు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ అభయమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పిన్నెల్లి కుమారుడు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. -
ఫలించిన వైఎస్సార్సీపీ ప్రజా పోరాటం
సాక్షి, అనంతపురం/అమరావతి: వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం ఫలించింది. కరువు సీమకు కల్పతరువుగా మారిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) కింద అననుమతులను పునరుద్ధరించింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలోని మరిన్ని ప్రాంతాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి. 2031 వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల గొంతుకగా వైఎస్సార్సీపీ చేసిన పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిందని ప్రజలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. దీనిని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయతి్నస్తున్నారంటూ మండిపడుతున్నారు. 2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటినుంచి ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు వెచ్చిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. 2025 ఏప్రిల్ 21న కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించకపోవడంతో ఆర్డీటీ విదేశీ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. దీంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆ సంస్థ పథకాలు అందక వారంతా నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. పేదలు పడుతున్న కష్టాలను గుర్తించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా పోరాటాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ బాధ్యతలను మాజీ ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించగా.. ఆయన పార్టీ నేతలు, ప్రజలతో కలిసి ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానమంత్రికి విజ్ఞప్తులు పంపారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడంతోపాటు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై స్పందించిన కేంద్రం ఎట్టకేలకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించింది. ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన టీడీపీ నాయకులు ఒక్కరోజు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. వైఎస్ జగన్ అభినందనలు ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్చేసి అభినందించారు.వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతోనే విజయం 1969 నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ ఆర్డీటీ అని, అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపివేయడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోరాటం చేపట్టి విజయం సాధించామని మాజీ ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో వారు మాట్లాడుతూ.. ‘పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతో విజయం సాధించాం.10 నెలల నిరంతర పోరాట ఫలితంగా కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించడం శుభపరిణామం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. దీని ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించింది. ఉద్యమానికి అండగా నిలిచిన మాజీ సీఎం వైఎస్ జగన్కు, సహకరించిన ప్రజా సంఘాలకు, జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం దారుణం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం కూటమి నేతలు చేసిందేమీ లేదు’ అని స్పష్టం చేశారు. -
నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. -
ఉద్యోగుల పాలిట రు‘బాబు పాలన’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. ఛీత్కారాలు, వేధింపులు, పనిభారంతోపాటు దాడులు, దాష్టీకాలకు బలవుతున్నారు. తాజాగా తిరుపతిలో సచివాలయ ఉద్యోగిపై జరిగిన దాడే దీనికి నిదర్శనం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులను నియమించారు. వారిని ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వాములను చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించేలా రోజూ స్పందన కార్యక్రమం సచివాలయాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టారు. దీంతో సచివాలయ ఉద్యోగులకు సమాజంలో గౌరవప్రతిష్టలు పెరిగాయి. ఆ ఐదేళ్లు పైరవీలు, పక్షపాతం, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించడంతో ఉద్యోగులకు ప్రజల్లో మర్యాద పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక స్పందన రద్దుతోపాటు సర్కారు విధానాల వల్ల ప్రజల నుంచి సచివాలయ ఉద్యోగులు ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. అధికారపార్టీ నేతల వేధింపులకు బలవుతున్నారు. సర్వేలు, పన్ను టార్గెట్లతో ప్రజల్లో ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం తరచూ సర్వేల పేరుతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెంచింది. దీంతో ఇంటింటి సర్వేల కోసం సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లాల్సి వస్తోంది. అడిగిన సమాచారమే మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. దీంతో ప్రజల్లో ఉద్యోగులపై చులకన భావం పెరగడంతోపాటు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. తాజాగా పన్నుల వసూళ్లు టార్గెట్లు పెట్టి మరీ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచడంతోపాటు వసూళ్లు చేయకపోతే సంజాయిషీలు, చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. బలవంతపు వసూళ్లకు పురిగొల్పింంది. తమపై ఉన్న ఒత్తిడితో ఉద్యోగులు పదేపదే ఇంటింటికీ వెళ్లి పన్నులు అడుగుతుండడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. తిరుపతి నగరంలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడికి ఇదే కారణమని చెబుతున్నారు. సర్కారు విధానాల వల్ల ఉద్యోగులు వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంబద్ధ ప్రశ్నలతో చికాకు.. సర్వేల పేరుతో ప్రభుత్వం రూపొందించే అసంబద్ధ ప్రశ్నలు ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీనికితోడు ప్రతిసారీ ఓటీపీలు అడుగుతుండడంతో ఇళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహానికి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు బలవుతున్నారు.కుక్కల లెక్కలకూ వాళ్లే.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కుక్కల లెక్కలూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తోంది. మరుగుదొడ్ల వద్ద విధులూ కేటాయిస్తోంది. ఇప్పుడు పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి వంద శాతం వసూలు చేయాల్సిందేనని రుబాబు చేస్తోంది. దీంతో పని ఒత్తిడి ఎక్కువై ఉద్యోగులు మరణిస్తున్నారు. మరోవైపు ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో దాడులు, దాష్టీకాలకు గురవుతున్నారు. దీనికి సర్కారు విధానాలే కారణం. తిరుపతిలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. – కాకర్ల వెంకటరామిరెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఒత్తిడి, ప్రజల వ్యతిరేకతతో.. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత మధ్య సచివాలయ ఉద్యోగులు నలిగిపోతున్నారు. తిరుపతిలో విధి నిర్వహణలో ఉన్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నాగార్జునపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం శిక్షించాలి. – ఎం.డి.జానిపాషా, బి.అంకమ్మరావు, గ్రామ/వార్డు సచివాలయం ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ కృతజ్ఞతలు
తాడేపల్లి: రూరల్ డెవలప్ ట్రస్ట్(ఆర్డీటీ)కి ఎఫ్సీఆర్ఏ((ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్) పర్మిషన్లు రెన్యువల్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య ,వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. నిజంగా చంద్రబాబు కృషి ఉంటే పర్మిషన్ల రెన్యువల్కు ఏడాదికాలం ఎందుకు పట్టిందని వైఎస్ జగన్ ప్రశ్నించారు.చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు వైఎస్ జగన్. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కి FCRA పర్మిషన్లు రెన్యువల్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారికి, కేంద్ర హోంమంత్రి అమిత్షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల… pic.twitter.com/FFrb8rpPfO— YS Jagan Mohan Reddy (@ysjagan) March 24, 2026 ఇదీ చదవండి:ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం -
రేపు అద్దంకి నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రేపు(మార్చి 25, బుధవారం) అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. రేపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. -
సంస్కారవంతుడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు.. షర్మిలకు రాచమల్లు కౌంటర్
-
‘ఇనార్బిట్’ చుట్టూ ఇగో పాలిటిక్స్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కలి్పంచే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్ .. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. మాల్ను ప్రారంభించిన రహేజా గ్రూప్ ప్రతినిధులు, ఇనార్బిట్మాల్ సీఈవో రజనీష్ మహాజన్ , పోర్టు చైర్మన్ అంగముత్తు గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
జగన్ దమ్మూ.. ధైర్యం బాబుని అడుగు.. ఆస్తి కోసం ఇంత దిగజారుతావా!
-
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? చంద్రబాబుకు దస్తగిరికి సునీతకి ఒకడే లాయర్..
-
దొమ్మేటి వెంకటరెడ్డికి YS జగన్ నివాళి
-
‘వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి’
విశాఖపట్నం: తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయనపై షర్మిల, సునీతలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇదంతా మీరు చంద్రబాబు డైరక్షన్లోనే చేస్తున్నారని,. సొంత అన్నని దెబ్బ తీయడానికి ఎదుటి పార్టీతో చేతులు కలుపుతారా? అంటూ మండిపడ్డారు. ఈరోజు( సోమవారం, మార్చి 23వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. వైఎస్ జగన్ను కోట్లాది మంది ఆడబిడ్డలు అన్నగా భావిస్తారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారన్నారు. కానీ మీరు మాత్రం వైఎస్ జగన్పై అభాండాలు వేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత సహనంగా ఉన్నా అబాండాలు వేస్తూనే ఉన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు. ప్రెస్మీట్లు పెట్టి అసత్యాలు చెబుతున్నారు. సొంత అన్నను దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ చేతులు కలుపుతారా?,ఇంత ప్రేమగా చెల్లెళ్లను చూసుకొనే అన్న ఎవరైనా ఉన్నారా?, మీపై ప్రేమతో జగన్ రూ. 236 కోట్లు ఇచ్చింది నిజం కాదా? , బాబు సంపాదించిన ఆస్తులను తన అక్కా చెల్లెళ్లకు ఇచ్చారా? అని ప్రశ్నించారు.వైఎస్సార్ వీలునామా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ను ద్వేషించే చంద్రబాబుతో మీరు స్నేహం చేస్తున్నారు.చంద్రబాబు డైరక్షన్లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరు మీద నడుస్తున్న పార్టీ నేతలను పట్టుకుని కుక్కలని అంటారా?, మీకు విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయా?, తెలంగాణ పార్టీ పెట్టి కడదాకా అక్కడే ఉంటా అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణను విడిచిపెట్టేది లేదన్నారు. కానీ అక్కడ పార్టీ మూసేసి ఇక్కడకు వచ్చారు’ అని మండిపడ్డారు వరుదు కళ్యాణి.జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి.. వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడిగితే చెబుతారని వరుదు కళ్యాణి సవాల్ చేశారు. ‘ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. మీ తప్పుడు ఆరోపణలకు మేం సమాధానం చెబుతున్నాంఆయన సహనాన్ని మీరు బలహీనతగా తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. వైఎస్ జగన్ చెల్లెలు కదా అని సహనంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నాం. ఎవరి డైరక్షన్లో మీరు ఇలా దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబు డైరక్షన్లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. అవినాష్రెడ్డి, రాచమల్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలేవి?, వాటికి సమాధానాలు చెప్పే బాధ్యత మీకు లేదా?, వైఎస్ జగన్పై దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? నిలదీశారు. -
వైఎస్ జగన్ సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు : కొడాలి నాని
సాక్షి,కృష్ణా: 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. దొంగ వాగ్ధానాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జొన్నపాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో కొడాలి నాని వ్యాఖ్యానించారు‘వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పరని ప్రజలకి తెలుసు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. సూపర్-6 అంటూ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దొంగ వాగ్ధానాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేశారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని చెబుతారు. 2029లో వైఎస్ జగన్ను ప్రజలు గెలిపిస్తారు.ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ విలువ తెలిసింది. జగన్ను వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. జగన్ ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేదలు భావిస్తున్నారు. జగన్ను సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు. కావాలనే వైఎస్ జగన్పై నిందలు మోపుతున్నారు. తండ్రి చనిపోతే తండ్రి ఆస్తిలో వాటాలు ఇచ్చే వారిని చూశాం. తన సొంత ఆస్తిలో కూడా వాటాలు ఇచ్చిన వ్యక్తి జగన్. వైఎస్ జగన్పై దారుణంగా మాట్లాడుతున్నారు. జగన్ ఎప్పుడూ చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదు. లడ్డూ విషయంలో దేవుడు కూటమికి మొట్టికాయలు వేశాడు’అని వ్యాఖ్యానించారు. -
శభాష్ మోదీజీ.. YS జగన్ అభినందనలు
-
ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి : ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ప్రజా సేవలో అంకితభావంతో పని చేసి, ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నా’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. Heartfelt congratulations to Hon’ble PM Shri Narendra Modi ji on completing 8,931 days as Head of Government and setting a historic milestone in dedicated public service.This landmark is a testament to one’s grit and resolve.Wishing you strength and good health in the service…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 23, 2026ప్రధాని మోదీ సరికొత్త రికార్డులుప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆదివారం మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా రికార్డుకెక్కారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాటంకంగా 8,931 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ సీఎంగా 8,930 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. -
శబాష్ జగన్.. ఇది మీకే సాధ్యం.. వైఎస్ జగన్ పై కేంద్రం ప్రశంసలు
-
విశాఖకు వరంలా మారిన YS జగన్ విజన్
-
టీసీ రాజన్ నిజమైన గాంధేయవాది.. వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ గాంధేయవాది, మాజీ ఎమ్మెల్యే ఠానేదార్ చిన్న రాజన్ (టీసీ రాజన్) మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గం నుంచి 1967లో స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన టీసీ రాజన్ విలువలకు కట్టుబడి పని చేశారని కొనియాడారు.ఆచార్య ఎన్జీ రంగా అనుచరుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. జీవితాంతం నిజమైన గాంధేయవాదిగా నిలిచిన టీసీ రాజన్ నిస్వార్థ రాజకీయ నేతగా ప్రజాసేవకే అంకితం అయ్యారని గుర్తు చేశారు. నిండు నూరేళ్లకు పైగా జీవించిన టీసీ రాజన్ రాష్ట్ర రాజకీయాల్లో చిరస్మరణీయుడని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘అరటి’పై బాబు కోతలే!
‘అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రాయలసీమ అరటిని ముంబై, కోల్కత్తా లాంటి జాతీయ మార్కెట్లకు తరలించేందుకు లాజిస్టిక్స్ ప్లాన్ సమర్ధంగా అమలు చేశాం. రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయడంవల్ల రైతులకు గరిష్ట ధరలు లభిస్తున్నాయి. అన్నదాతకు గిట్టుబాటు ధర దక్కేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం..’ – సీఎం చంద్రబాబు‘హ్యాపీ ఫార్మర్ – హ్యాపీ ఏపీ..’ గత ప్రభుత్వ పాలనలో నష్టపోయిన అరటి రైతులకు మన కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు వచ్చాయి. మార్కెట్ పరిస్థితులను గాడిలో పెట్టడం వల్ల క్వింటాల్కు రికార్డు స్థాయిలో ధరలు లభిస్తున్నాయి. రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే మా ధ్యేయం. గతేడాది నష్టాల నుంచి అన్నదాతలను బయటపడేశాం..’ – మంత్రి నారా లోకేశ్సాక్షి, అమరావతి: ధరలు కొద్దిగా పెరిగితే చాలు.. ‘మా చొరవతోనే రైతుకు భారీ ధరలు‘ అంటూ ప్రకటనలతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం అరటి ధరలు మరోసారి పాతాళానికి దిగజారిపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు అంతా తమ గొప్పతనం అంటూ ఊదరగొడుతూ.. రేట్లు పతనమైతే ప్రకృతి వైపరీత్యం.. అంటూ వారిని గాలికొదిలేస్తుండడం గమనార్హం. కోతకొచ్చాక కొనేవారు లేక.. రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్సార్ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఇక్కడ జీ–9 వెరైటీ సాగవుతుంది. ఇదంతా పూర్తిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ. గతంలో ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు కాగా పెరిగిన ఎరువులు, పురుగు మందులు ధరలు, కూలీ, రవాణా ఖర్చులతో ప్రస్తుతం రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షలు వరకు వ్యయం అవుతోందని అరటి రైతులు చెబుతున్నారు. దాదాపు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తుండగా 53 శాతం రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. అనంతపురం, నంద్యాల జిల్లాలలో టిష్యూ కల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు డిసెంబర్ నుంచి మార్చి వరకు వస్తుండగా, వైఎస్సార్ కడపలో జనవరి నుంచి మే వరకు దిగుబడులు వస్తాయి. రెండో పంటగా పిలకల ద్వారా సాగైన అరటి జూలై నుంచి డిసెంబర్ వరకు వస్తుంది. 2023–24లో టన్ను రూ.30 వేలకు పైగా పలికిన అరటి గతేడాది రూ.వెయ్యికి దిగజారడంతో అరటి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం టన్ను నాలుగైదు వేలకు మించి పలకని దుస్థితి నెలకొంది. ధర లేక, కొనేవారు లేక పంటను కొంతమంది రైతులు మేకలు, పశువుల మేతకు వదిలేస్తుంటే.. మరికొందరు తోటల్లోనే వదిలేస్తున్నారు. ఇంకొందరైతే కూలీ ఖర్చులు కూడా దక్కడం లేదన్న ఆవేదనతో తోటలను దున్నేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదు.. అరటి ధర ఒకటి రెండు రూపాయలు పెరిగినప్పుడు.. విదేశాలకు పంపిస్తున్నాం.. రైతులను రాజులుగా చేస్తున్నాం.. అంటూ ట్వీట్లు వేసే ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ధరలు పతనమై రైతులు రోడ్డున పడితే ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి గాలికిఎగిరిపోయింది. అరటి సహా మొక్కజొన్న, జొన్న, సజ్జలు ధరలు పతనమైనా మార్కెట్లో జోక్యం చేసుకుని పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి వ్యాపారుల మధ్య పోటీ పెంచాలన్న ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేసి మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరాచేస్తే రైతులు కొంత మేర గట్టెక్కుతారనే స్పృహ లేకుండా పోయింది. ప్రభుత్వ పెద్దలు ట్వీట్లు, స్టేట్మెంట్లతో కాలక్షేపం చేయకుండా తక్షణమే మార్కెట్లో జోక్యం చేసుకొని టన్ను కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో అరటికి మహర్దశ వైఎస్ జగన్ హయాంలో దేశంలోఎక్కడా లేని విధంగా అరటికి ప్రత్యేకంగా మద్దతు ధర ప్రకటించడమే కాదు.. ఏటా పంట మార్కెట్కు వచ్చే ముందే ధరలను పర్యవేక్షిస్తూ ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలిచారు. ఇలా దాదాపు 12వేల టన్నులకు పైగా అరటిని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ముంబైకి ఏటా కిసాన్ రైళ్లు నడిపి ఎగుమతులను ప్రోత్సహించారు. 2014–19మధ్య చంద్రబాబు హయాంలో 23 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగితే.. వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య ఏకంగా 3 లక్షల టన్నులకు పైగా సౌదీ అరేబియా, కువైట్, కతార్, బహ్రెయిన్, యూఏఈ, యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాకు సైతం ఎగుమతి కావడం గమనార్హం. 2018–19లో టన్ను రూ.5 వేలకు మించని ధర 2023–24లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.32 వేలకు పైగా పలికింది. వైఎస్సార్ సీపీ హయాంలో అరటి సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ బనానా ఎక్స్పోర్టు ప్రమోషన్ అవార్డు–2020, ద బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డ్స్– 2022 లాంటి పలు పురస్కారాలు రాష్ట్రానికి లభించడం అరటి రైతుల పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.ప్రభుత్వం స్పందించడం లేదు.. ఐదెకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. గతేడాది వడగండ్ల వాన, ఈదురు గాలులతో పంట తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఏడాది పంట కోతకొచ్చినా కొనేవారు లేరు. స్థానిక మార్కెట్లో టన్ను రూ.5 వేలకు మించి పలకడం లేదు. అయినకాడికి తెగనమ్ముకుందామనుకున్నా కొనేవారు లేరు. ప్రభుత్వం స్పందించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బాబా హుస్సేన్, అరటి రైతు, మురారి చింతల, వైఎస్సార్ జిల్లాపతనమైనా పట్టించుకోరేమి? అరటి ధరలు పెరిగినప్పుడు మావల్లే అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ధరలు పతనమైతే కన్నెత్తి చూడడం లేదు. ధరలు పతనమైనా పట్టించుకోరేమి? 4 ఎకరాల్లో అరటి వేశా. ప్రస్తుతం పంట పక్వానికి వచ్చింది. వ్యాపారుల చుట్టూ రోజూ ప్రదక్షిణ చేస్తున్నా కొనే నాధుడు కరువయ్యాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే వరుసగా రెండో ఏడాది కూడా అరటి రైతులకు నష్టాలు తప్పవు. – భాస్కరరెడ్డి, అంకేవానిపల్లె, వైఎస్సార్ జిల్లాపైసా పరిహారం రాలేదు.. అరటి రైతులు రెండేళ్లుగా తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. గతేడాది గాలివాన, వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం రాలేదు. మరొక వైపు ధరలు పతనమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ఏడాది పంట కోత దశలో ఉన్నప్పుడు ధరలు దిగజారిపోయాయి . చిన్నపాటి గాలి వాన వస్తే పక్వానికి వచ్చిన పంట తుడిచిపెట్టుకుపోతుంది. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. –నాగార్జునరెడ్డి, లింగాల, వైఎస్సార్ జిల్లా -
అజేయం... ఆ వ్యక్తిత్వం!
సీనియర్ పాత్రికేయులు మోతడక సుధాకర్ శనివారం నాడు ఫోన్ చేసి ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అన్న మీద షర్మిల చెరిగిన అవాకులు, విజయమ్మ లేఖ నేపథ్యంలో ఆయనీ సంగతిని పంచుకున్నారు. ఆయన రెండు దశాబ్దాలకు పైగాకాంగ్రెస్ వ్యవహారాలు కవర్ చేసిన సీనియర్ రిపోర్టర్. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలవడానికి మరో సీనియర్ పాత్రికేయుడు, దివంగతులైన కృష్ణారావుతో కలిసి వెళ్లారట!మాటల సందర్భంలో జగన్ ప్రస్తావన వచ్చిందట! జగన్ చాలా చిన్న వయసులోనే విజయవంతమైన వ్యాపార వేత్తగా రాణిస్తున్నారనీ, తనకు అండగా నిలబడ్డారనీ వైఎస్సార్ చాలా గర్వంగా వారితో చెప్పారట! కొడుకు ప్రయోజకత్వంపట్ల ఆ తండ్రి కనబరిచిన పుత్రోత్సాహాన్ని తాము అప్పట్లోనే పలువురు మిత్రులతో పంచుకున్నామని సుధాకర్ చెప్పారు.వైఎస్సార్ 1999లో పీసీసీ అధ్యక్షునిగా ఉండి శాసనసభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటికి జగన్ వయసు 27 సంవత్సరాలు కూడా నిండలేదు. అంతకుముందు పదేళ్లపాటు వైఎస్సార్ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో తన సహచరుడు, మిత్రుడైన రాజంపేట ఎంపీ సాయిప్రతాప్తో మాట్లాడుతూ ‘నా కొడుకు వ్యాపార రంగంలో యోగ్యుడయ్యాడు, ఆర్థికంగా ఇబ్బందిపడే పరిస్థితి ఉండ’దని అన్నారట! ఈ సంగతిని స్వయంగా ఏబీఎన్ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిప్రతాప్ వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉన్నది. జగన్ మోహన్రెడ్డి చిన్న వయసులోనే సమర్థుడైన వ్యాపారవేత్తగాతన కాళ్లపై తాను నిలబడటమే కాకుండా తండ్రికి కూడాఅండగా నిలబడ్డాడనేందుకు ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.చంద్రబాబు చాలాకాలంగా నిర్వహిస్తున్న జగన్ వ్యక్తిత్వ హనన హవనంలో తాజాగా షర్మిల మరో సమిథను విసరడం, దరిమిలా విడుదలైన విజయమ్మ లేఖ, అది రాజేసిన ఆస్తుల రచ్చ నేపథ్యంలో ఈ పూర్వరంగాన్ని గమనంలో ఉంచుకుంటే మరింత స్పష్టత వస్తుంది. ఆస్తుల పంపకం పూర్తికాలేదంటూ విజయమ్మ లేఖలో పేర్కొనడంపై ఆ కుటుంబ వ్యవహారాలు తెలిసినవారు అవాక్కయ్యారు. శత్రువు చేతిలో పావులా మారి అన్న మీద షర్మిల విషం కక్కుతున్నదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. ‘అటువంటి పావుకోసం కన్న కొడుకు మీదే అభాండాలు వేస్తావా తల్లీ’ అని విజయమ్మను ఆయన ప్రశ్నించారు. 2009లో వైఎస్సార్ జీవించి ఉండగానే షర్మిలకు పంచి రిజిస్టర్ చేసిన ఆస్తుల చిట్టాను రాచమల్లు చదివి వినిపించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్2 లోని ఇల్లు, ఇడుపులపాయ ఎస్టేట్లో 51 ఎకరాలు సహా తొమ్మిది ఆస్తుల జాబితాను ఆయన చదివారు. షర్మిల పేరు మీద ఈ ఆస్తులన్నీ రిజిస్టర్ అయ్యాయన్న విషయాన్ని అంగీ కరిస్తూనే, పంపకాలు పూర్తికాలేదన్న విజయమ్మ లేఖలోని డొల్లతనాన్ని ఆయన ఎండగట్టారు.షర్మిలకు పంచినట్టే జగన్కు కూడా కొన్ని ఆస్తులను వైఎస్సార్ పంచి ఇచ్చారనీ, జగన్ సొంతగా సంపాదించుకున్న ఆస్తులను అవి జగన్ ఆస్తులుగానే వైఎస్ పరిగణించినందువల్లనే వాటిలో వాటాలను కూడా షర్మిలకు పెట్టలేదనీ రాచమల్లు వివరించారు. అయినా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లెలి మీద ప్రేమతో సొంత ఆస్తి సరస్వతీ పవర్లో తల్లి పేరుపై పెట్టుకున్న 51 శాతం షేర్లు భవిష్యత్తులో షర్మిలకు చెందేలా (ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కారణంగా) ఎమ్ఓయు రాసిచ్చారని గుర్తుచేశారు. జగన్ మీద కాంగ్రెస్ – టీడీపీలు జాయింటుగా బనాయించిన తప్పుడు కేసుల ఫలితంగా సరస్వతీ పవర్ సహా జగన్ ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్లాయి. ఈ ఆస్తులను అమ్మినా, షేర్లు బదలాయించినా జగన్ బెయిల్ రద్దవుతుంది. ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సంగతి తెలిసినా తల్లి పేరుతో ఉన్న షేర్లను బదలాయించేందుకు షర్మిల వెనుకాడలేదు. ఒరిజినల్ సర్టిఫి కెట్లు జగన్ వద్దనే ఉన్నా తప్పుడు అఫిడవిట్ సమర్పించి మరీ షేర్లను బదలాయించారంటే షర్మిల ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలుస్తున్నదని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.ఈ కుట్రపూరిత వ్యవహారం తెలిసిన వెంటనే అనివార్య పరిస్థితుల్లో జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించవలసి వచ్చింది. దీని మీద యెల్లో మీడియా, కూటమి పార్టీలు నానా రాద్ధాంతం చేశాయి. తల్లి మీద, చెల్లి మీద జగన్ కోర్టుకెక్కారని విషప్రచారం చేశాయి. జగన్ను మరోమారు జైలుకు పంపాలన్న కుట్ర విఫలమైనందుకు వారి ఏడుపును ఆర్థం చేసుకోవచ్చు. మరి చెల్లెలికేమైంది? తెలిసి తెలిసి ఈ కుట్రలో ఎందుకు భాగస్వా మయ్యారు? బాబాయి హత్యను కూడా అన్న మెడకు చుట్టాలని చూస్తున్న శత్రువు ప్రయత్నాలకు తందానా అనే చెల్లెళ్లు ఏం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదేమో!షర్మిలకు వివిధ సందర్భాల్లో జగన్ స్వార్జితంలోంచి 230 కోట్ల రూపాయలు ఇచ్చారని రాచమల్లు చెప్పారు. ఆమె ఎన్నికల అఫిడవిట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టున్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించారేమో తెలియదు కానీ, ఇప్పుడు ఒక అనుమానం బలంగా కలుగుతున్నది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలన్నది ఆమె స్వతంత్ర నిర్ణయం కాదేమో! అప్పటికే ఆమె చంద్రబాబు ప్రభావంలోకి వెళ్లి ఉండాలి. తెలంగాణలో కొంతకాలం ప్రాక్టీస్ చేయించి, తనకు గిట్టని కేసీఆర్నునానా తిట్లు తిట్టించి, ఆ తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఆంధ్ర కాంగ్రెస్ నాయత్వాన్ని చంద్రబాబు ఆమెకు కట్టబెట్టించిఉండవచ్చు. తెలంగాణ, ఆంధ్ర కాంగ్రెస్ ఫ్రాంచైజీలు చంద్ర బాబు చేతిలోనే ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం. ఆయన కనుసన్నల్లోనే ఈ రెండు రాష్ట్రాల పార్టీ యూనిట్లు పని చేస్తున్నా యని కొందరు కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు.జగన్ బలం ఆయన క్యారెక్టర్. ఆ బలాన్ని బలహీన పరచకుండా ఆయన్ని ఎదుర్కోవడం కష్టం. కుటుంబ విలువలను పాటించడంలో గానీ, ఆడిన మాటపై నిలబడటంలో గానీ, మానవీయ విలువల్లో గానీ, బడుగు జన పక్షపాతంలో గానీ, ఔదార్యంలో గానీ, దాతృత్వంలో గానీ, విలువలు – విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు నడపడంలో గానీ జగన్కు సాటిరాగల నాయకుడు సమకాలీన రాజకీయరంగంలో ఎవ్వరూ లేరు. జగన్ను సన్నిహితంగా చూసిన వాళ్లెవరైనా చెప్పే మాట ఇదే! ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ నెలలోనే పదిహేనేళ్లు నిండాయి. పార్టీ స్థాపించవలసి రావడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఆ ఘడియల్లో ఆవిష్కృతమైన సన్నివేశాలు ఎటువంటివి? ఎంత ఉద్వేగం... ఎంత ఉత్తేజం ఉరకలెత్తిందో! ఎన్ని లక్షల హృదయ స్పందనలు వినిపించాయో! ఎన్ని దోసిళ్ల కన్నీళ్లు ఆ క్షణాలను అభిషేకించాయో!ముప్ఫయ్యేడేళ్లు ఇంకా నిండని యువకుడు, మేరు నగధీరుడైన తండ్రి హఠాన్మరణంతో తల్లడిల్లిపోయాడు. ఈ మేరుపర్వతం ఇక లేదని తెలిసిన వందలాదిమంది గుండెపగిలి చనిపోయారు. ఈ పరిణామం జగన్ను మరింత శోకమూర్తిని చేసింది. అతని హృదయం ద్రవించింది. ఆ చనిపోయిన వాళ్లంతా తన ఆత్మబంధువులని ప్రకటించు కున్నాడు. వారి కుటుంబాల వద్దకు వెళ్లి వారి బాధను పంచుకుంటానని ప్రతిన బూనాడు. ఓదార్పు యాత్రను ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అడ్డుచెప్పింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశమివ్వాలని కుటుంబంతో సహా వెళ్లి అధినేత్రిని ఆ యువకుడు అభ్యర్థించాడు. ఆమె ససేమిరా అన్నది. అప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీకి ఆమె తిరుగులేని నాయకురాలు. ఆ సమయంలో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరైన అధినేత్రి ఆజ్ఞను ఆమె పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనాఉల్లంఘించగలడా? ఉల్లంఘించి నిలబడగలడా? ఒక్క జగన్ మోహన్రెడ్డి తప్ప!ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్రెడ్డికి ఈ బలం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న విశ్వసనీయతలోంచి! తమకోసం దుఃఖిస్తున్న బాధితుల కన్నీళ్లు స్వయంగా తుడవడం బాధ్యతని భావించే విలువల్లోంచి! విలువలు – విశ్వసనీయత పునాదిగా ఏర్పడిన ఆ సంకల్పం ఆ క్షణాల్లోనే వెయ్యేనుగుల బలాన్ని సంతరించుకున్నది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా నిలబడితే ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో రికార్డులు బద్దలు చేసిన ఆ శబ్దం దేశమంతటా ప్రతిధ్వనించింది. సొంత పార్టీ స్థాపిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడో ఇప్పుడో ముఖ్యమంత్రిని చేస్తామనే బుజ్జగింపులు వినిపించాయి. బెదిరింపులూ, బుజ్జగింపులూ ముఖ్యం కాదు. ఇచ్చిన మాటను నిల బెట్టుకోవడమే ముఖ్యమనే సంకల్పంతోముందడుగు వేశాడు. ఆ సంకల్పానికి ఉన్న బలం వల్ల కొన్ని వేల జతల కాళ్లు ఆయన్ను అనుసరించాయి. కొన్ని వేళ గళాలు ఆయన గొంతుకతో శ్రుతి కలిపాయి. ఈ పదిహేనేళ్ల ప్రస్థానం గురించి తెలిసిందే! మొదటి ఎన్నికల్లోనే ఒంటరిగా తలపడిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. తలపండిన చంద్రబాబు మోదీతో, పవన్ కల్యాణ్తో చేతులు కలిపి వచ్చినా ఎదిరించిన వ్యక్తి జగన్. చంద్రబాబు చేసిన అలవికాని హామీలకు పోటీగా నెరవేర్చలేని హామీలు ఇవ్వలేననీ, అంతకన్నా ఓడిపోవడానికైనా సిద్ధమేననీ ప్రకటించిన నాయకుడు సమకాలీన భారత రాజకీయ చరిత్రలో ఇంకెవరైనా ఉన్నారా? ఒక్క జగన్మోహన్రెడ్డి తప్ప? గద్దెనెక్కగానే ఎన్నికల హామీలను బుట్టదాఖలు చేసే రోజుల్లో మేనిఫెస్టోకు పట్టాభిషేకం చేసి, అనునిత్యం దానిలో ఎన్ని హామీలు అమలు చేశామో, ఎన్ని మిగిలి ఉన్నాయోనని లెక్కలు వేసుకున్న పాలకుడిని ఇంకెవరినైనా చూశామా? ఒక్క జగన్మోహన్రెడ్డిని తప్ప. మహిళల సాధికారతకోసం తపించి, ఎక్కడా లేని పథకాలు ప్రవేశపెట్టి, వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంలో జగన్ కంటే మిన్నగా నిలబడిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా? కష్టజీవుల బిడ్డలు కూడా కోటీశ్వరుల పిల్లలతో సమానమైన చదువులు చదవాలని తపించి సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ ఎడ్యుకేషన్, బడుల ఆధునీకరణ వంటి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాధినేతను ఇంకెవరినైనా చూశామా? ఒక్క జగన్మోహన్రెడ్డిని తప్ప! బీదా–బిక్కీ ఇళ్లకు కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉండాలని కలలుకని ప్రణాళికను రచించిన ముఖ్యమంత్రిని మరొకరెవరినైనా చూశామా, జగన్మోహన్రెడ్డిని తప్ప! ఇదీ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యక్తిత్వం ఒక శత్రు దుర్భేద్యమైన కవచం. ఆ కవచాన్ని ఛేదించడానికి పదిహేనేళ్లుగా టీడీపీ కూటమి కుట్రలు చేస్తూనే ఉన్నది. కష్టాల కొలిమిలో కాలమే సానబట్టిన ఖడ్గం జగన్. అధర్మ యుద్ధాలతో ఎల్లకాలం దాన్ని ఓడించలేరు. అగ్ని సరస్సున వికసించిన వజ్రపు కాంతిని పిడికిట్లో ఎంతోకాలం దాచి ఉంచలేరు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?
-
జగన్ ప్రభుత్వమే బాగుండేది కొంపముంచిన అకాల వర్షాలు కూటమిపై రైతుల ఆగ్రహం
-
జగన్ ఓర్పుగా ఉన్నాడని.. శత్రువులతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు
-
సినిమాలో చెప్పినట్లు. శత్రువు ఎక్కడో ఉండరు తల్లి, చెల్లి రూపంలో...
-
నా తల్లి కంటే ఎక్కువ.. నీకు దండం పెట్టి అడుగుతున్న
-
ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
-
అది నేనే.. ఇదీ నేనే..!
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. తిరుమలలో స్వామివారి ప్రసాదంలో వాడే ముడిపదార్థాలు, భక్తులకు పెట్టే అన్నప్రసాదాల్లో నాణ్యతను పెంపొందించేందుకు శనివారం ప్రారంభం కానున్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు తానే కారణమన్నట్లు ప్రచారం చేసుకుంటూ, స్వయంగా శ్రీవెంకటేశ్వరుని సాక్షిగా బాబు సర్కార్ తాజాగా క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. జగన్ ప్రభుత్వ చొరవతో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రత్యేకంగా తిరుమలకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేస్తే అది తన ఘనతగా చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. » 2023 ఆగస్టు 23, 24 తేదీల్లో 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తిరుపతిలో నిర్వహించింది. సమావేశానికి హాజరైన సీఈవో కమలవర్ధన్రావు ఈ సందర్భంగా తిరుమలలో పర్యటించారు. అన్నప్రసాద భవనాన్ని, శ్రీవారి లడ్డూ పోటును స్వయంగా సందర్శించారు. టీటీడీ అధికారులతో సైతం సమావేశం నిర్వహించారు.» అప్పటికే భక్తులకు ఇచ్చే ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం... తిరుమలకు ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేయాలని సీఈవోను కోరింది.» దీంతో భక్తులకు వడ్డించే ఆహారం, లడ్డూ తయారీలో వాడే నెయ్యి, పాలు, సుగంధ ద్రవ్యాల స్వచ్ఛతను పరీక్షించడానికి టీటీడీకి సొంతంగా అధునాతన ల్యాబ్ను ఎఫ్ఎస్ఎస్ఏఐ తరపున మంజూరు చేస్తున్నట్లు మీడియా సాక్షిగా కమలవర్ధన్రావు ప్రకటించారు.» వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ల్యాబ్ ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు రావడంతో, ల్యాబ్ ఏర్పాటు కోసం ఆనాటి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు. » ల్యాబ్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐకు ప్రతిపాదనలు కూడా పంపారు.» గత ప్రభుత్వంలో జరిగిన కృషి కారణంగా రూ.20 కోట్లతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ఏర్పాటయ్యింది. » అదంతా తన గొప్పేనంటూ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చేస్తున్న హడావుడి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. -
పండుగ వేళ.. తీరని విషాదం
భద్రాచలం అర్బన్/ఉయ్యూరు రూరల్/కుక్కునూరు/మంగళగిరి టౌన్/ఎటపాక: గోదావరి తీరం వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం దగ్గర గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ఏపీ వాసులు, ఇద్దరు భద్రాచలం వాసులుగా తేలింది. ముగ్గురి మృతదేహాలు లభించాయి. భద్రాచలం పట్టణానికి చెందిన చారిగుంట్ల శ్రీకర్గుప్తా(21) విజయవాడలోని అమరావతి ఎస్ఆర్ఎమ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం, పొడిచేటి అభిరామ్(21) భద్రాచలంలో వేద విద్య అభ్యసిస్తున్నారు. వీరు ఏపీ, తెలంగాణ సరిహద్దులోని గోదావరి నదిలో గతంలో దిగిన ఫొటోలను తమ స్నేహితులకు చూపించారు. దీంతో ఆ ప్రదేశం బాగుందని మిత్ర బృందం భావించింది. ఈక్రమంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నామని చెప్పి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కనుమూరు గ్రామానికి చెందిన దగ్గుబాటి నవదీప్(19), ఉయ్యూరుకు చెందిన గోక తేజజ్ఞసాయి(19), మదనపల్లెకు చెందిన సతీశ్(19)తో పాటు మరో ఇద్దరు స్నేహితులైన సీహెచ్.దీపక్, గడ్డం హర్షవర్ధన్ ఐదుగురు గురువారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. వీరందరూ విజయవాడ సమీపంలోని విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. స్థానికులైన శ్రీకర్, అభిరామ్తో కలిసి మధ్యాహ్నం భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం సరదాగా ఫొటోలు దిగేందుకు ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గోదావరి తీరానికి బయలుదేరారు. లోతు ఉన్న ప్రాంతం కావడంతో.. కొల్లుగూడెం దగ్గర గోదావరి నదిలో నీటి పాయ అవతలి ఒడ్డు(కుక్కునూరు) దిశగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక తిన్నెల్లో సుమారు రెండు కిలోమీటర్లు దూరం నడిచి, నీరు ఉన్న ప్రాంతానికి వారంతా చేరుకున్నారు. వీరు చేరుకున్న ప్రదేశానికి ఎగువన కిన్నెరసాని నది గోదావరిలో కలుస్తుండగా దిగువన కొంత దూరంలో పాములేరు వాగు కలుస్తుంది. దీంతో పెద్ద బండరాళ్లతో కూడిన ఆ ప్రదేశంలో నీరు ఎక్కువగా ఉంది. ఇక్కడ నీటి లోతు ఇరవై అడుగుల పైనే ఉంటుందని అంచనా. ఇది ప్రమాదకర ప్రదేశమని తెలియని విద్యార్థులంతా తమ ఫోన్లు ఒడ్డున ఉంచి నీళ్లలోకి దిగారు.సాయం అందలేదు వారిలో ముందుగా తేజజ్ఞ లోతును అంచనా వేయలేక మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరుగా శ్రీకర్గుప్తా, అభిరామ్, నవదీప్, సతీశ్ కూడా మునిగారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో నీళ్లలో ఉన్న దీపక్ బయటకు వచ్చాడు. నీళ్లలోకి వెళ్లి గల్లంతవుతున్న వారిని కాపాడేందుకు హర్షవర్ధన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాగే, భద్రాచలం వైపు ఒడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉండడం, కుక్కునూరు వైపు పూర్తిగా నీరు ఉండడంతో సమీపంలో సాయం చేసే వారెవరూ కనిపించలేదు. కనీసం చేపలు పట్టే వారు కూడా ఆ సమయంలో లేరు. ఉదయం 11గంటలకు గోదావరిలో నీటి పాయ దగ్గరకు చేరుకుంటే కాసేపటికే 11–15 గంటలకు ప్రమాదం జరిగింది. నీళ్లలో మునిగిన స్నేహితులు ఎంతకూ బయటకు రాకపోవడంతో తమ ఫోన్ల ద్వారా 11–30 గంటలకు బయటకు సమాచారం చేరవేశారు.గజ ఈతగాళ్లతో గాలింపుస్నేహితులు ఐదుగురు గల్లంతైన సమాచారాన్ని దీపక్, హర్ష కలిసి శ్రీకర్ గుప్తా తండ్రికి ఫోన్లో చెప్పారు. దీంతో ఆయన భద్రాచలం పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులతో పాటు ఎటపాక అధికారులకు కూడా ఫోన్ చేశారు. గజ ఈతగాళ్లతో అక్కడికి చేరుకున్న అధికారులు గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు శ్రీకర్, నవదీప్, అభిరామ్ మృతదేహాలు బయటపడగా.. సతీష్కుమార్, తేజజ్ఞ ఆచూకీ తెలియరాలేదు. ఉయ్యూరు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి విషాద చాయలు అలుముకున్నాయి.మృతులు, గల్లంతైన వారి వివరాలు 01) చారుగుళ్ల శ్రీకర్ గుప్తా(21), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: చారుగుళ్ల రామకృష్ణ, భద్రాచలం 02) దగ్గుబాటి నవదీప్(19), విజయవాడ కేఎల్యూలో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: ఫణీంద్రనాథ్, కనుమూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 03) పొడిచేటి అభిరామ్(19), వేదవిద్య తండ్రి: వంశీ, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ 04) పాశం సతీష్ కుమార్(19), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: పాశం నారాయణ, మదనపల్లె, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ 05) గోకా తేజజ్ఞ సాయి(19), అమరావతి ఎస్ఆర్ఎంలో బీటెక్ సెకండ్ ఇయర్ స్వస్థలం: ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్స్థానిక అధికారుల తీరుపై తీవ్ర విమర్శ యువకులు నదిలో గల్లంతైన ఘటనలో ఆంధ్ర అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ తరువాత ఘటనా స్థలానికి ఎటపాక, కుక్కునూరు మండల అధికారులు వచ్చారు. ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే.. తమ పరిధి కూడా కాదంటూ వాదించుకున్న తీరు స్థానికంగా వివాదాస్పదంగా మారింది. కనీసం మండల సరిహద్దులు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారా ? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకోవాల్సింది పోయి తమ ప్రాంతం కాదంటూ తప్పించుకునే వ్యవహార శైలి సరైనది కాదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ సరిహద్దులు తెలియకుండా పాలనా వ్యవస్థ ఎలా నడిపిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతై ముగ్గురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషాదకరమని, ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా మృతుల కుటుంబాలకు సానుభూతి సాక్షి, అమరావతి: ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
అల్లాహ్ దీవెనలతో మానవాళికి సకల శుభాలు కలగాలి
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తెలిపారు. ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ చేయడం వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ పర్వదినం ఒక ముగింపు వేడుక అని ఆయన గుర్తుచేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ తన సందేశంలో తెలిపారు.‘‘రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#EidMubarak— YS Jagan Mohan Reddy (@ysjagan) March 21, 2026 -
గుప్పిట్లో ‘ఫ్రీహోల్డ్’
సాక్షి, అమరావతి: పేద రైతులకు గత ప్రభుత్వంలో హక్కులు దక్కిన ఫ్రీహోల్డ్ భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసినా ఇప్పటివరకూ ఉత్తర్వులు వెలువడకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై ఏడాదిన్నర పాటు నాన్చి ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్రీహోల్డ్ అయిన (యాజమాన్య హక్కులు వచ్చిన) మొత్తం 13.59 లక్షల ఎకరాల భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే రెండు వారాలు దాటిపోయినా ఇంతవరకూ దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం. దీంతో దీని వెనుక ఏదో గూడుపుఠాణీ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు వెంటనే అమలు జరిగిపోతాయి. రాజధాని పనులు, ఇతర వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఉపసంఘాలు చేసిన సిఫారసులను ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి తెస్తూ జీవోలు ఇస్తోంది. కానీ పేద అసైన్డ్ రైతులకు సంబంధించిన భూములను రెండేళ్లు గాల్లో పెట్టి చివరికి వారి ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నా అమలుకు వెనుకాడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉప సంఘం సిఫారసులు అందిన తర్వాత 2, 3 రోజుల్లోనే అందుకు సంబంధించిన జీవోలు వెలువడాలి. రెవెన్యూ శాఖ మంత్రి అదే విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే జీవో వస్తుందని చెబుతున్నా ఇప్పటివరకూ రాకపోవడంపై అధికారవర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముసుగులో టీడీపీ నేతలు సర్దేస్తున్నారా..! ఎలాగూ సగం ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు కనుక సందట్లో సడేమియా మాదిరిగా అసైన్డ్ భూములను నొక్కేయడానికి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ అవకుండా మిగిలిపోయిన కొన్ని భూములను తాజాగా ఫ్రీహోల్డ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన అసైనీలు ఉంటే వారి ద్వారా.. లేదంటే ఆదీనంలో ఉన్న రైతులతో మాట్లాడి నయానో భయానో లొంగదీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తృణమో పణమో ముట్టజెప్పి వారి భూముల్ని స్వాదీనం చేసుకుంటున్నారని సమాచారం. గతంలోనే ఫ్రీహోల్డ్ అయిన భూములతో కలిపి వాటిని ఇప్పుడు ఫ్రీహోల్డ్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేస్తూ వెంటనే ఇవ్వాల్సిన జీవో ఇంతవరకూ వెలువడలేదని తెలుస్తోంది. టీడీపీ నేతలు అనుకున్న భూములన్నీ వారి చేతుల్లోకి వచ్చాక జీవో జారీ చేస్తారని చెబుతున్నారు. తద్వారా గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో కొన్నింటిని ఇప్పుడు 22ఏ జాబితా నుంచి తీసివేశామని పైకి చెప్పుకుంటూ తాజాగా వేలాది ఎకరాలను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ హక్కులిస్తే.. బాబు ఆంక్షలు పెట్టి వేధించారు అనేక దశాబ్దాలపాటు తమ భూములపై ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేద అసైన్డ్ రైతులకు ఊరటనిస్తూ వారి భూములపై వైఎస్ జగన్ హయాంలో హక్కులు కల్పించారు. ఇందుకోసం అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) ఇచ్చారు. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. 2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేయగా, దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది. అయితే వైఎస్ జగన్ హయాంలోనే హక్కులు రావడంతో.. ఆ భూములపై కత్తి కట్టిన చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే వాటిని 22 ఏ జాబితాలో పెట్టింది. రెండేళ్ల నుంచి ఆ భూములపై నిషేధాన్ని కొనసాగిస్తూ ఆ రైతులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. అసైన్డ్ రైతుల ఒత్తిడితో ఫ్రీహోల్డ్ అయిన భూముల్లో సగం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని రెండేళ్ల తర్వాత నిర్ణయించింది. అయినప్పటికీ దాన్ని అమలు చేయకుండా తెర వెనుక భూములు కొట్టేయడానికి సన్నాహాలు చేస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఇంత అన్యాయమా తల్లీ!
ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్యాయం చేయడానికే వారి తల్లి విజయమ్మ ప్రకటన విడుదల చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలు ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే... రక్తసంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనడం బాధాకరమని ఆయన అన్నారు. షర్మిల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందన్నారు. వైఎస్సార్ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. విజయమ్మ అనేక సందర్భాల్లో తాను షర్మిలవైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనకోడలికి అంటే షర్మిల కుమార్తెకు, కుమారుడుకి జగన్ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. నిజంగా ఈ మాట ఎవరైనా నమ్మితే.. మీ కుమారుడు జగన్ ఇంత అన్యాయస్తుడని భావించరా? మీ కుమార్తె షర్మిలను రక్షించే ప్రయత్నంలో కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కింద స్థాయికి తీసుకుని పోయే విధంగా మాట్లాడ్డం తగునా? అంటూ విజయమ్మను రాచమల్లు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యాయమన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, దానినుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయమ్మ ఒక తల్లిగా తన కుమారుడి కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్ని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు. తాము ఇంత ఇంత బాధ పడుతుంటే.. కుమారుడి ప్రతిష్టను కాపాడేందుకు ఆరాటపడకపోగా, షర్మిల కోసం జగన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. షర్మిల, జగన్ తమకు రెండు కళ్లతో సమానమని, ఏ కంటిని కూడా గాయపర్చే పని చేయబోమని, కానీ జగన్పై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తాము స్పందించాల్సి వస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...వారు చంద్రబాబు చేతిలో.. మీరు షర్మిల చేతిలో..చంద్రబాబు స్వార్థ రాజకీయాలకోసం, ఆయన చేతిలో షర్మిల, సునీత పావులుగా మారి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటంతో, మనసుకు బాధ కలిగి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కొన్నిరోజులుగా నేను మీడియా ముందుకు వస్తున్నా. రాజశేఖరరెడ్డిగారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించికాని, ఆ కుటుంబ వ్యవహారాల గురించి కానీ మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా మేం ఎన్నడూ అనుకోలేదు, ఊహించలేదు. కానీ మాట్లాడే ఆ పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరని విజయమ్మగారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారితే, షర్మిల పెట్టే ఒత్తిళ్లకు, ఆమె ప్రభావానికి లోనై.. షర్మిల చేతిలో విజయమ్మ పావులాగ మారారనేది స్పష్టం అవుతోంది. స్క్రిప్టు ఎక్కడ తయారవుతోందో ఎవరికి తెలియదు?చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆయనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, డైవర్షన్ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా, షర్మిల, సునీత ఇద్దరూ హద్దులు దాటి, చులకనగా మాట్లాడి, కోట్లమంది అభిమానుల మనసు గాయపరిచేలా, వ్యక్తిత్వ హననం చేస్తుంటే.., అబద్ధాలను, అసత్యాలను చెప్తుంటే.. మేం మాట్లాడమా తల్లీ. అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? మీరు మాట్లాడవద్దంటూ పరోక్షంగా మా పార్టీ నాయకులను ఉద్దేశించి చేతులు జోడిస్తున్నామంటూ బహిరంగ లేఖలో ప్రస్తావించడం మాకు ఆవేదన కలిగిస్తోంది. అసలు మాట్లాడే పరిస్థితి కల్పిస్తున్నది షర్మిల కాదా? సునీత ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. ఎవరికీ తెలియకుండా 19 సార్లు కలిశారు. ఇలా కలిసిన ప్రతిసారీ ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం చంద్రబాబుకు చెబుతున్నారు. షర్మిల ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించరు. జగన్ను మాత్రం టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు.అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న షర్మిలను కట్టడి చేయలేరా?మంగళవారం ఎన్సీఎల్టీలో కౌంటర్ దాఖలు చేయడం, ఆ మరుక్షణంలో చంద్రబాబు ఆఫీసుకు అది చేరడం, మరుసటిరోజు ఆ కౌంటర్లను అడ్డుపెట్టుకుని బుధవారం ఎల్లోవీుడియా ప్రధాన పత్రికలో అందులోని అంశాలు రావడంం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి వీటిని ఒక తల్లిగా మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్టులో సొంత అన్నను పట్టుకుని, కోట్లమంది అభిమానిస్తున్న నాయకుడ్ని పట్టుకుని.. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదని, పైగా అన్న అనే పదానికి కళంకం అంటూ షర్మిల మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాలాంటి వాళ్లు మాట్లాడకుండా.. ఎలా ఉంటారు? అసలు అలాంటి మాటలు అనకుండా, తప్పమ్మా .. అని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?జగన్ స్వార్జిత ఆస్తుల్లో షర్మిల వాటాలు కోరిన దగ్గరనుంచి.. ఈ వ్యవహారంలో జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా? రచ్చ చేయలేదు కదా? కించపరిచి మాట్లాడటమో, తక్కువచేసి మాట్లాడటమో, అలాంటి పనులు ఏనాడూ చేయలేదు కదా? కానీ షర్మిల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? రచ్చచేస్తున్నా, కుటుంబ పరువును దెబ్బతీసేలా వ్యవహరిçస్తున్నా ఎందుకు ఆమెను నియంత్రించలేకపోతున్నారు.ఎన్సీఎల్టీ తీర్పు అర్థమేమిటి?న్యాయాన్యాయాలు తేల్చమని జగన్ ఎన్సీఎల్టీ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని అర్థం ఏంటి? ఆయన పక్కన న్యాయం ఉన్నట్టే కదా? మళ్లీ దీన్ని సవాల్ చేస్తూ చెన్నై కోర్టుకు వెళ్లారు. వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ కేసు తేలేంతవరకూ ఎందుకు ఆగలేకపోతున్నారు? జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు కదా? కానీ షర్మిల కట్టుబడి లేరు కదా? తప్పు ఎవరిది? మీరు ఒక సైడ్ తీసుకోవడం న్యాయమా?చంద్రబాబు ఆదేశాల మేరకు షర్మిల అయినా, సునీత అయినా హద్దులు దాటి, పరుష పదాలతో మాట్లాడతారు. చంద్రబాబుకు అవసరమైనప్పుల్లా రంగంలోకి దిగి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అటాక్ చేసూ్తనే ఉన్నారు. మేం వాటికి స్పందిస్తే.. మాకు చేతులు జోడించి మాట్లాడొద్దని చెప్తున్నారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? సరస్వతీ పవర్, ఈడీ అటాచ్మెంట్లో ఉండగా, వాటికి సంబంధించిన ఒరిజనల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గరే ఉన్నా, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్లను బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉన్నా తప్పుడు అఫిడవిట్తో షేర్ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి మీరు షేర్లు బదిలీ చేశారంటే దీని అర్థం ఏంటి? షర్మిల ప్రభావం మీమీద ఎంత ఉందో తెలుస్తుంది. చట్ట విరుద్ధంగా చేసిన ఈపని వల్ల జగన్ బెయిల్ రద్దుకు దారితీస్తుందని తెలిసికూడా, మీ చేత సంతకాలు పెట్టించడం భావ్యమా తల్లీ? మీ కొడుకు అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసీ, మిమ్మల్ని నాశనం చేయాలని చంద్రబాబు లాంటి వ్యక్తులు కాసుకు కూర్చున్నాడని తెలిసి కూడా మీచేత సంతకాలు చేయించడం, మీరు సంతకాలు చేయడం దీని అర్థం మీరు వన్సైడ్ తీసుకున్నారనేగా తల్లీ. కుటుంబ విలువలు తెలుసా చంద్రబాబుకు?బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు? ఆస్తులు కాదు కదా ఏనాడైనా అక్కకు గానీ, చెల్లెకు గానీ ఏ చిన్న సాయమైనా చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకు? అసలు చంద్రబాబు సోదరీమణుల పేర్లయినా తెలుసా ఈ రాష్ట్రంలో ఎవరికైనా? సొంత తమ్ముడిని సైతం అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. చంద్రబాబు చేసిన ద్రోహాల గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారు. అలాంటి చంద్రబాబు పంచన చేరతారా షర్మిల, సునీత? అవాస్తవాలు ప్రచారం చేస్తుంటే భరించలేకపోతున్నాం..విజయమ్మ తల్లిగా, కుటుంబ పెద్దగా కొడుకు, కుమార్తెను కూర్చోబెట్టి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా అని షర్మిలకు చెప్పవచ్చు. నీకు ఫలానా ఆస్తి కావాలని అడిగితే అన్నగా నీకు ఇస్తాడని చెప్పవచ్చు. జగన్కు చెప్పి ఏదైనా కూతురుకు ఇప్పించాలి. ఇది చేయకుండా వైఎస్సార్ శత్రువు ఇంటికి వెళ్లి, ఇంటి వ్యవహారాలు చంద్రబాబుకు చెబితే ఏ అన్నకైనా ప్రేమ ఎలా ఉంటుంది? ప్రజలంతా ఆలోచించాలి.’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.ఇంతకన్నా అన్యాయం, దుర్మార్గం ఉంటుందా?షర్మిల వాదనను నిలబెట్టేందుకు కొడుకును పూర్తి అన్యాయస్తుడిగా చూపేందుకు ఇవాళ విజయమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. మేనల్లుడు, మేనకోడలుకు జగన్ అన్యాయం చేస్తున్నాడని విజయమ్మ ప్రకటన ఇచ్చారు. ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలకు మేలు చేసేందుకు జగన్ను దెబ్బతీయడం అన్యాయం కదా? అయినా కూడా ఒక్కరోజు కూడా జగన్ మాట్లాడలేదు. షర్మిలకు ఆపద కలిగిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి షర్మిల తరఫున సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి భార్యగా మీ సాక్ష్యాన్ని ప్రజలంతా నమ్ముతారు. మీరు చెబితే ప్రజలు నమ్ముతారని అప్పుడప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే సమయంలో మీరు ఆమెను నిరోధించాల్సిన అవసరం మీకు లేదా? వైఎస్సార్ చనిపోయిన సందర్భంలో గుండె ఆగిపోయిన ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ చెబితే అంగీకరించని సోనియా పార్టీలోకి మీ కూతురు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? కడపలో మీ కుమారుడు పోటీ చేస్తుంటే అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని ప్రకటన చేశారు. మీ బిడ్డను ఓడించమని చెబుతారా? ఎంతటి పక్షపాతం తల్లీ! కుమారుడి గౌరవాన్ని సర్వనాశనం చేస్తారా? అయినా జగన్ భరించారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లు బదలాయింపు చేస్తే కొడుకు జైలుకు వెళ్తాడని తెలిసి కూడా నా కూతురుకు ఆస్తి రావాలి, కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యమా తల్లీ? షర్మిలకు ఆస్తి రావాలి, జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?ఇవన్నీ పంచి ఇచ్చిన ఆస్తులు కావా?2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం జరిగిందని మేం చాలాసార్లు చెప్పాం. తాజా లేఖలో మీరు కూడా దాన్ని అంగీకరించారు. షర్మిల పేరు మీద రాజశేఖరరెడ్డి ఏ ఆస్తులైతే రిజిస్టర్ చేశారో అవి ఆమెకు ఇచ్చినట్లే అని మీరు అంగీకరించారు. కాకపోతే పంపకం కాదు అంటున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబరు–2లో ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, 22.5 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇచ్చారని ఈ లేఖలో మీరూ అంగీకరించారు. విజయవాడ యువరాజ్ సినిమా «థియేటర్ లో 35 శాతం, పులివెందులలో 7.60 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100 శాతం ఇచ్చారని అంగీకరించారు. కోడురులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరులో శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారంటే దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇవన్నీ పంపకం కాదని విజయమ్మ చెప్పడం ఎంతవరకు సబబు? ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్ కు ఒకటి చొప్పున తమాషాగా ఇచ్చిన ఆస్తులా అవి? మరోవైపు షర్మిలమ్మకు ఇచ్చినట్లే జగన్కు కూడా ఇచ్చారని చెప్పారు. మేం కూడా అదే మాట చెప్పాం. జగన్, షర్మిల ఎవరి ఆస్తులు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఆ తర్వాత ఎవరైనా పెరగొచ్చు, తరగొచ్చు. దేవుడి దయ లేకపోతే ఇద్దరివీ తరగొచ్చు. మంచి పిల్లలైతే పెరిగిన వారు తరిగిన వాటికి సహాయం చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఉత్తమ సంతానంలో భాగంగా జగన్ జన్మించారు కాబట్టి వంశానికి మంచి కీర్తి తెచ్చారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేశాడు. ఇంతమంది పేద ప్రజలకు వెలుగై ఉన్నాడు. అదే సందర్భంలో చెల్లెలు మీద ప్రేమతో ఇవ్వాల్సిన దానికన్నా అధికంగా డబ్బు, ఆస్తి కూడా ఇచ్చాడు. షర్మిల వివాహమయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత.. 2009 మొదలు... 2023 వరకు జగన్ తన సొంత వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న దానిలో నుంచి చెల్లెలన్న ప్రేమ అభిమానాలతో షర్మిలకు పలు దఫాలుగా అడిగినప్పుడల్లా రూ.230 కోట్లు వైట్ మనీ ఇచ్చారు. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ఎవరి ఆస్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి వ్యాపారాలు వారు నిర్వహించుకున్నారు. 2019 ఆగస్టులో జగన్ ఎన్నికల అనంతరం సీఎం అయిన తర్వాత తన చెల్లెలు మీద ప్రేమ, మమకారంతో తన ఆస్తుల్లో నుంచి ఎంఓయూ రాశారు. ఈడీ కేసులలో ఆయన ఆస్తులు అటాచ్ మెంట్ కారణంగా ఆస్తుల బదలాయింపునకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2023 నాటికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకోవడం, వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి రచ్చ చేయడం వంటి ఘటనలన్నీ జరిగాయి. అప్పుడు జగన్ తన పట్ల షర్మిల ప్రవర్తన సక్రమంగా లేనందున, తనతో విభేదిస్తున్నందున తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న వాటిని రద్దు చేసుకున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా విజయమ్మగారూ?వైఎస్సార్గారు బతికి ఉన్న నాటికే షర్మిల పెళ్లి అయి 15 సంవత్సరాలు అయ్యింది. జగన్కు పెళ్లి అయి దాదాపుగా 14 సంవత్సరాలు అయ్యింది. ఆ మధ్య కాలంలో ఎవరి వ్యాపారాలు వారివి.. ఎవరి కుటుంబాలు వారివి.. వైఎస్సార్ గారు సంపాదించిన ఆస్తులు ఆయన ఎవరికైనా ఇచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. కానీ ఆయనకు సంబంధంలేని.. ఆయన కొడుకు సంపాదన కానీ, లేకపోతే ఆయన కూతురు సంపాదన అయినా కానీ తను ఎవరికైనా ఎలా ఇవ్వగలుగుతారు?తాను బతికి ఉన్నంతకాలం ఉన్న ఏ ఆస్తి అయినా కూడా, అది ఎవరిదైనా కూడా మీ ప్రకారం ఇవ్వాలని అంటే.. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి ఉంది. ఇప్పటికీ చంద్రబాబు బతికే ఉన్నాడు. చంద్రబాబు పేరుమీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, చంద్రబాబు కొడుకు సంపాదించిన ఆస్తి, వారిపేరు మీద ఉన్న ఆస్తిలో చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి చంద్రబాబు ఆస్తిలో భాగం అడిగితే అది సబబే అవుతుందా? అంతెందుకు వైఎస్సార్గారి చెల్లెలు విమలమ్మగారు ఇంకా బతికే ఉన్నారు. ఆమె కూడా ఇదే మాదిరిగా వైఎస్సార్గారు బతికి ఉన్నంతవరకు సంపాదించిన ఆస్తి, ఎవరు సంపాదించినా.. అది ఎవరిపేరు మీద ఉన్నా దాంట్లో నాకూ భాగం ఉందని అంటే మీరు షర్మిల విషయంలో ఆలోచన చేసినట్లుగానే విమలమ్మగారి విషయంలోనూ ఆలోచన చేస్తారా?ఎవరైనా ఎవరి ఆస్తిలోనైనా లేదా ఎవరి వ్యాపారాలలోనైనా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు? జగన్ కంపెనీలలో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఆ కంపెనీలు చేసిన అప్పులకు పర్సనల్ గ్యారెంటీలు ఇచ్చారా? ఆ కంపెనీలు నష్టాలలో ఎపుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీల నష్టాలలోనూ, కోర్టు కేసులలోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎపుడైనా పట్టించుకున్నారా? మీ ఆస్తులను ఎపుడైనా సీబీఐ లేదా ఈడీ అటాచ్ చేసిందా.. ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టే.. అవి జగన్ ఆస్తులు కాబట్టే దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయి.. మరి ఇవేవీ లేకుండా వేరేవారి కంపెనీలలో మనం ఎలా వాటాలు ఆశించగలం?.. అలా ఎవరైనా ఆశించడం ధర్మమేనా?రాజశేఖరరెడ్డి గారు 2004 ఎలక్షన్ కమిషన్కు అప్లై చేసిన అఫిడవిట్, 2009 లో అప్లై చేసిన అఫిడవిట్ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయన ఆస్తులు, ఆయన సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆయన పంపకం చేయగలిగినారు. కానీ ఆయనకు సంబంధంలేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో లేక కూతురు ఆస్తులో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు చేయలేరు కదా?ఒక పిల్లాడు బాగున్నాడని, ఒకరు అంతగా బాగోలేరని, బాగున్న పిల్లాడి ఆస్తిని బాగోలేని పిల్లాడికి పంపకాలు చేయించాలని భావోద్వేగంతో ఏ తల్లి అయినా అనుకోవచ్చు కానీ అలా ఇవ్వాలి అంటే అటువైపున అభిమానంతో ప్రేమలు, ఆప్యాయతలు ఉంటే అంతో ఇంతో ఇస్తారేమో కానీ ఇలా హక్కుగా ఆశించడం తప్పు కాదా? ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్స్ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదముందని, సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్ ఇచ్చినప్పటికీ దానిని బేఖాతరు చేసి... జగన్ దగ్గరే ఉన్న షేర్స్ సర్టిఫికెట్స్ పోయినట్లుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరీ షేర్స్ బదలాయించారు. షర్మిల ఒత్తిడి ప్రభావం మీమీద ఎంత వరకు ఉందో దీనిని బట్టి తెలియడం లేదా?మీరు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో వాదనలు జరిగాయి. ఆ తరువాత జగన్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా మేలుకోకుండా రాజకీయంగా దుమారం రేపడం కోసం షర్మిల ఆధ్వర్యంలో మీరు మళ్లీ కోర్టును అప్రోచ్ అయ్యారు. ఇపుడు తెలిసిపోతుంది కదా? ఈలోగా మీరే దీనిని దుమారం చేస్తూ షర్మిల ప్రెస్మీట్లు పెడుతున్నారు. దానివీుద మేము సహజంగానే స్పందిస్తాం. మేం స్పందించకూడదా?అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు? షర్మిల కాదా? మరి ఆ లేఖను అడ్డుపెట్టుకుని, మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తుంటే.. వాస్తవాలను చెప్పడం తప్పవుతుందా తల్లీ?విజయమ్మగారు.. మీరు పెద్దవారు. మేం ఏమీ అనలేం. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు మొదటనుంచీ వన్సైడ్ తీసుకున్నారు. షర్మిల సైడ్ తీసుకున్నారు. షర్మిల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మీరు అమెరికా నుంచి వీడియో మెసేజ్ ద్వారా పిలుపునివ్వడం నిజం కాదా? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ను ఇబ్బంది పెట్టిందో, వైఎస్సార్గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందో అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వమని జగన్కు వ్యతిరేకంగా షర్మిల కోసం మీరు పిలుపు ఇచ్చారు.టీటీడీ కల్తీనెయ్యి, హెరిటేజ్ తప్పులు, బీఆర్ నాయుడు తప్పులు, పుట్టా మహేష్ డ్రగ్స్ విషయం నేపథ్యంలో టాపిక్ డైవర్ట్ చేయడానికి షర్మిలతో చంద్రబాబు ప్రెస్మీట్లు పెట్టిస్తారు. దానివీుద మేము రియాక్ట్ అయితే మీరు రంగంలోకి దిగుతారు. కోర్టులలో ఇప్పటికే సమర్పించిన తప్పుడు అఫిడవిట్లలో భాగంగా మరో తప్పుడు అఫిడవిట్ మీరు రిలీజ్ చేస్తారు. కానీ అది కోర్టుకు పోదు. కోర్టుకన్నా ముందు టీడీపీ ఆఫీస్లోని వెబ్సైట్లకు వెళుతుంది. అదే ఎల్లో మీడియాలో చూపిస్తారు. ఈ కుట్రలలో భాగంగా మీరు బురద వేస్తూ మమ్మల్ని రెస్పాండ్ కావద్దని మళ్లీ విన్నవిస్తారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? -
కూనవరం ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి
-
ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
తాడేపల్లి : రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా..అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ పండగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ తెలిపారు. -
కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరిలో పడి ఐదుగురు ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన విషాదకరమని.. ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుక్కునూరు మండలం వేలేరు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. గోక తేజ-ఉయ్యూరు (ఏపీ), నవదీప్-ఉయ్యూరు (ఏపీ), పాశం సతీష్ కుమార్, మదనపల్లి (ఏపీ), చారు గుండ్ల శ్రీకర్ భద్రాచలం (తెలంగాణ), పొడిచేటి అభిరామ్ భద్రాచలం (తెలంగాణ) గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
మా తమ్ముడు YSRCPనే.. మా నాన్నకు YSR అంటే పిచ్చి..
-
రాజకీయాల్లోకి VV వినాయక్! మా తమ్ముడు YSRCPనే..
-
భృతికి తూట్లు.. కన్సల్టెంట్లకు కోట్లు
సాక్షి, అమరావతి: ఒకపక్క ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతూ.. భృతి ఎగ్గొడుతూ.. నిరుద్యోగుల ఆశలను చంద్రబాబు సర్కారు చిదిమేస్తోంది. మరోవైపు ఆ మేరకు ఉద్యోగాలను తిరిగి భర్తీ చేయకుండా డ్రామాలాడుతోంది. రాష్ట్రంలో దాదాపు 1.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించేసి.. కేవలం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంటూ సరికొత్త నాటకానికి తెర తీయడంపై యువత మండిపడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3,000 చొప్పున భృతి చెల్లిస్తామని సూపర్ సిక్స్లో ప్రధానంగా హామీ ఇవ్వడంతోపాటు ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికీ బాండ్లు పంచారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా భృతి కోసం పైసా కూడా కేటాయించకుండా రూ.21,600 కోట్లు ఎగ్గొట్టి తాజాగా జాబ్ క్యాలెండర్, పోస్టుల భర్తీ అంటూ మభ్యపుచ్చే యత్నాలకు దిగారు. నిజానికి చంద్రబాబు సర్కారు నిరుద్యోగ యువతకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టింది. మరోవైపు కన్సల్టెంట్ల పేరుతో పలుకుబడి కలిగిన వారికి ప్రజాధనాన్ని పంచి పెడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల బడ్జెట్ సమావేశాల చివరి రోజు స్వయంగా ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఖాళీ పోస్టులు 1.72 లక్షలు.. ప్రతి ఆర్థిక ఏడాది బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను ద్రవ్య విధాన పత్రం ద్వారా వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2024 మార్చి నాటికి (వైఎస్ జగన్ హయాంలో) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నట్లు తాజా ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు. మరోవైపు 2025 డిసెంబర్ నాటికి (చంద్రబాబు ప్రభుత్వంలో) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలు మాత్రమేనని ద్రవ్య విధాన పత్రంలో తెలియచేయడం గమనార్హం. అంటే చంద్రబాబు పాలనలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 1.72 లక్షలు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు సర్కారు కళ్లుగప్పుతోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కన్సల్టెంట్లకు రూ.3,054.78 కోట్లు నిరుద్యోగ భృతిని సీఎం చంద్రబాబు ఒక భ్రాంతిగా మార్చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా లక్షలాది మంది వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించేసింది. వారి పొట్టగొట్టి ఏటా రూ.1,500 కోట్లను మిగుల్చుకుంది. ఒకపక్క నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా వృత్తిపరమైన సర్వీసుల పేరుతో పలుకుబడి కలిగిన వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లగా నియమించుకుంది. ఈ విషయం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలోనే స్పష్టమైంది. చంద్రబాబు సర్కారు వృత్తిపరమైన సర్వీసుల పేరుతో ఏకంగా 54,903 మందిని కన్సల్టెంట్లగా నియమించుకుంది. వారికి వేతనాల రూపంలో ఏడాదికి ఏకంగా రూ.3,054.78 కోట్లు చెల్లిస్తోంది. వలంటీర్లపై వేటు.. ఔట్ సోర్సింగ్ ఔట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా వారికి వేతనాల కింద ఏడాదికి రూ.1,500 కోట్లు చెల్లించినట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో చంద్రబాబు సర్కారు తెలిపింది. మరోపక్కతమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేసింది. గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉండగా చంద్రబాబు సర్కారు అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో వారి సంఖ్య గతేడాది డిసెంబర్ నాటికి 87,681కి తగ్గిపోయినట్లు తెలిపింది. అంటే చంద్రబాబు సర్కారులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 8,994 మంది తగ్గిపోయారు. చిరుద్యోగుల పొట్టగొట్టి పలుకుబడి గల పెద్ద వ్యక్తులను కన్సల్టెంట్లుగా నియమించుకోవడమే లక్ష్యంగా కూటమి సర్కారు పాలన సాగిస్తోంది. ఇక గతంతో పోలిస్తే జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు, ఔట్ సోర్సింగ్ వర్కర్లు కూడా గణనీయంగా తగ్గిపోయారు.ఇది పచ్చి మోసం లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలను తొలగించేసి, కేవలం 10 వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని చూపడం దుర్మార్గం. 6 లక్షలపైన గ్రూప్–2 అభ్యర్థులు ఏళ్ల తరబడి చదువుతుంటే 750 పోస్టులు ప్రకటించడం, 11 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని డీజీపీ ప్రకటించినా, 2,778 పోస్టులే ప్రకటించడం ఏమిటీ? గత ప్రభుత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 243 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులిచ్చినా, ఇప్పటిదాకా భర్తీకి చర్యలు చేపట్టలేదు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు అధికారంలోకి వచ్చిన ప్రతి సారీ పెంచుతూ యువతను తీవ్రంగా మోసం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేసిన మంత్రి లోకేశ్కు ఇప్పుడు ఆ ఖాళీలు కనిపించడం లేదా? నిరుద్యోగుల సత్తా చూపుతాం. – రామచంద్ర ఏంబేటి, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడువ్యాయామ విద్య పోస్టులు ఏమయ్యాయి? జాబ్ క్యాలెండర్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. పాఠశాల వ్యాయామ విద్య విభాగంలో ఎలాంటి ఖాళీలు చూపకపోవడం శోచనీయం. అనేక సందర్భాలలో ప్రభుత్వ పెద్దలు ఎన్నో వేదికలపై క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడం తప్ప, ఆచరణలో మాత్రం అది కనిపించలేదు. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే పీఈటీ పోస్టులను, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలలకు పీడీ పోస్టులు కొత్త డీఎస్సీలో భర్తీ చేయాలి. దశాబ్ద కాలంగా భర్తీకి నోచుకోని పీడీ జూనియర్ లెక్చరర్, పీడీ డిగ్రీ లెక్చరర్ పోస్టులనూ మంజూరు చేయాలి. – కె.నరసింహారెడ్డి, ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడుఆ పోస్టులన్నీ ఇప్పుడేవీ? » ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, గత ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ప్రతిపక్షంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విమర్శించారు. గ్రూప్–1, 2 పోస్టులు 2 వేలు, ఇంజినీరింగ్ పోస్టులు 20 వేలు, టీచర్ పోస్టులు 25 వేల ఖాళీలు ఉన్నాయని ప్రచా రం చేశారు. కానీ ఇప్పుడు అతి స్వల్పంగానే పోస్టు లను ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. » గతేడాది ఆగస్టు 31 నాటికి హోం శాఖలో 11,639 పోస్టులు వివిధ కేడర్లో ఖాళీలు ఉన్నట్టు డీజీపీ కార్యాలయం హోం శాఖ ముఖ్య కార్యదర్శికి వివరాలు అందించింది. ఈ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. నిర్ణీత గడువులోగా పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆదేశించింది. » అయితే తాజా క్యాలెండర్లో హోంశాఖలో 2,778 పోస్టులను మాత్రమే చూపారు. మరి మిగిలిన 10 వేల పోస్టులు ఆరు నెలల కాలంలో ఎక్కడికిపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం 2024 జూన్ 12న డీఎస్సీపై తొలి సంతకం చేశారు. సగానికి సగం పోస్టులు దాచేసి ఏడాదిన్నర తర్వాత డీఎస్సీ నిర్వహించారు. » గతంలో పాఠశాల విద్యా శాఖలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రచారం చేసినవారు ప్రస్తుత క్యాలెండర్లో పాఠశాల విద్య, ఇంటర్ విద్యలో కేవలం 3,004 పోస్టులు ప్రకటించడం ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఈ–2009 చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో స్పెషల్ టీచర్ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు 2,500 స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని 2024లోనే ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం » గ్రామ, పట్టణ ప్రజలకు వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. నిర్వహణ కోసం 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను నాశనం చేయడం ప్రారంభించింది. » దాదాపు 30 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల్లో డెప్యుటేషన్పై తరలించారు. ఉద్యోగులను ఇష్టారాజ్యంగా వివిధ శాఖల్లో విలీనం చేస్తున్నారు. డిపార్ట్మెంట్లలో ఉద్యోగులకు అడహక్ పదోన్నతులు కల్పిస్తూ ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మోసమేనని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఒక్క డీఎస్సీ నిర్వహణనే ఏడాదిన్నర కాలం సాగదీసిన కూటమి ప్రభుత్వం ఈ పోస్టుల నోటిఫికేషన్లు ఇవ్వడం నుంచి పోస్టుల భర్తీ వరకు భంగపాటు తప్పదని చెబుతున్నారు. » గత ప్రభుత్వం ఉన్నత విద్యలో యూనివర్సిటీల్లో 3,220 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల నెపంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి, కేవలం 1,500 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం మోసమే. -
ఎంవీఎస్ నాగిరెడ్డి తల్లి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాతృమూర్తి మలిరెడ్డి నాగసుందర మణిమ్మ(89) మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మలిరెడ్డి నాగసుందర మణిమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో వారికి ధైర్యం, ఆత్మస్థైర్యం కలగాలని ఆకాంక్షించారు. -
జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
వైఎస్ జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్లు: కేంద్రం
ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగిందని లోక్సభలో కేంద్ర మంత్రి తోకన్ సాహు ప్రకటించారు. జగన్ హయాంలో ఐదేళ్లలో 6 లక్షల 85 వేల 864 ఇళ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. లోక్సభలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్లలో 6,85,864 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి అప్పటి జగన్ సర్కారు రూ.22,744 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. పీఎంఏవై పథకానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది గత వైఎస్ జగన్ ప్రభుత్వం. నీతి ఆయోగ్ సైతం కితాబు కాగా, ఇటీవలే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యంతో కొనసాగిందని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. ఏపీ వ్యయం నమూనా సంక్షేమ, మౌలిక సదుపాయాలపై ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచించిందని ఆ నివేదిక తెలిపింది. 2023-24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.రాష్ట్ర వ్యయం నమూనాను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని.. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేసిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాలు ఆరోగ్యకరమైన పెరుగుదలను సూచించాయని, జీఎస్టీతోపాటు వస్తువుల పన్నులు పెరిగాయని నివేదిక పేర్కొంది.గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్డీపీలో 4 నుంచి 9 శాతం పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 2023-24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4 శాతంతో అతి పెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6 శాతం వాటాను కలిగి ఉండగా ప్రధానంగా రవాణా, నీటి పారుదల, ఇంధన రంగాలు పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక పేర్కొంది. -
షర్మిల లాంటి పనికిమాలిన చెల్లెలు మాకొద్దని.... సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్
-
పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు (ఫొటోలు)
-
విజయవాడ ఇఫ్తార్ విందు ప్రత్యేక ప్రార్థనల్లో YS జగన్
-
Iftar Vindu 2026: ఇఫ్తార్ విందులో YS జగన్
-
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
జగన్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం
-
ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్
-
తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముగిశాయి. ఉగాది వేడుకల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాలో ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ హాజరయ్యారు.ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన వైఎస్ జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ దంపతులకు పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఆహ్వానం పలికారు. ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజ తర్వాత పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం అనంతరం వైఎస్ జగన్ దంపతులకు వేదపండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు అందించారు.పంచాంగ శ్రవణం అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్న అందరికీ వైఎస్ జగన్, హృదయపూర్వకంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం చేసిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు, వేద పండితులను సన్మానించారు.ఉగాది వేడుకలు ముగిసిన అనంతరం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.#Ugadi2026 pic.twitter.com/PKVxkh9Jxw— YS Jagan Mohan Reddy (@ysjagan) March 19, 2026 -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలి. విజయాలు సిద్ధించాలి. సమృద్ధిగా వానలు కురిసి.. పంటలు బాగా పండి.. రైతులకు మేలు కలగాలి. సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలి’ అని ఆయన ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ తన సందేశంలో అభిలషించారు. -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘సబ్కో అస్సలామ్ అలై కుమ్.. (అందరికీ అల్లా కృప ఉండాలి).. అడ్వాన్స్ ఈద్ ముబారక్ (ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు)..’’ అంటూ ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ జగన్కు ముస్లిం మతపెద్దలు, నేతలు చౌకత్తో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి వైఎస్ జగన్ ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షను విరమింపజేస్తూ వైఎస్ జగన్ వారికి ఖర్జూరం తినిపించారు. ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నేతలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ అందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయంగా ఖర్జూరం తినిపిస్తున్న ముస్లిం సోదరులు జగన్ సీఎం కావాలంటూ ‘దువా..’మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా, వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్బాషా, ఎంఎస్ మక్బూల్, పలు జమాత్ల పెద్దలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీలను ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వైఎస్ జగన్ చేయిపట్టుకుని ముందుకు నడిపించారన్నారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్కు అల్లా దయ, అందరి ప్రేమాభిమానాలు ఉంటాయన్నారు. కాబోయే సీఎం వైఎస్ జగన్ అంటూ దువా (ప్రార్థన) చేశారు.ఇఫ్తార్ ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు హోరెత్తిన అభిమానం..వైఎస్ జగన్ను చూసేందుకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వద్దకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇఫ్తార్ విందుకు అభిమాన జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్బాషా, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, ఇస్సాక్ బాషా, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, రమేష్యాదవ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, అత్తర్ చాంద్బాషా, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పి.గౌతంరెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, ముస్లిం నేతలు మక్బుల్, నదీమ్ అహ్మద్, అసిఫ్, అహ్మద్ అలీ, ఫారుఖీ, షేక్ మునీర్ అహ్మద్ తదితర జమాత్ల పెద్దలు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్
-
విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్
-
విజయవాడలో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
సాక్షి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించింది. వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.ముస్లిం సోదరులకు వైఎస్ జగన్.. ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షలు విరమింపచేశారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. -
Ugadi: తెలుగు ప్రజలకు జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి
-
చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: షర్మిలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అన్యాయం ఏంటి? అంటూ కొండా రాఘవరెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల కేవైసీ ఉందా?. వైఎస్సార్ ఉన్నప్పుడే ఆస్తుల పంపకం పూర్తి అయ్యింది. వైఎస్ జగన్ తన కుటుంబ ఆస్తుల నుంచి షర్మిలకు వాటా ఇచ్చారు. రూ.230 కోట్లు ఇచ్చిన అన్న జగన్పై షర్మిలకు కృతజ్ఞత లేదు. ఇప్పటికీ వైఎస్ జగన్పై కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు’’ అంటూ కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్కు, షర్మిలకు ఎవరి ఆస్తులు వారికే ఉన్నాయి. వైఎస్ జగన్ ఏనాడూ షర్మిల ఆస్తిలో వాటా అడగలేదు.. మరి షర్మిల ఎందుకు అడుగుతున్నారు?. శత్రువులు ఇంట్లోనే ఉంటారన్నట్టు షర్మిల, సునీత రూపంలో ఉన్నారు. వైఎస్ అవినాష్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారింది.’’ అని కొండా రాఘవరెడ్డి దుయ్యబట్టారు. -
జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్
-
రేపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
సాక్షి, తాడేపల్లి: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రేపు(మార్చి 19, గురువారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.ఉగాది సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలన్నారు.‘‘సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి’’ అని వైఎస్ జగన్ అభిలషించారు. -
జర్నలిస్టులకు అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ(బుధవారం, మార్చి18) హైదరాబాద్ జర్నలిస్ట్ కె.వెంకట్రామి రెడ్డి (కేవీఆర్) కలిశారు. తనను కర్నూలు పోలీసులు వేధించిన తీరును ఆయన వివరించారు. హైకోర్ట్లో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో విడుదల చేసినట్టు కేవీఆర్ తెలిపారు.తప్పుడు కేసులపై ఆందోళన చెందవద్దన్న వైఎస్ జగన్.. న్యాయపోరాటం చేద్దామనీ, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. -
జగన్కి ధన్యవాదాలు..రాజ్యసభలో MP పిల్లి సుభాష్ చంద్రబోస్ గూస్ బంప్స్ స్పీచ్
-
ఆ నాలుగేళ్లు విశాఖకు వైభవం
డాబాగార్డెన్స్: విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాలకవర్గం గడువు ముగియడంతో వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖ సాధించిన ప్రగతి మరోసారి తెరపైకి వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల పాటు మేయర్గా బాధ్యతలు నిర్వర్తించిన గొలగాని హరి వెంకటకుమారి హయాంలో నగరం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని విద్యావేత్త అయిన బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగర ప్రథమ పౌరురాలిగా ఎంపిక చేయడం విశాఖ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం, ప్రజలకు అండగా నిలుస్తూనే నగరాన్ని ప్రగతి పథంలో నడిపించింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పాతనగరం వాసులను వేధిస్తున్న ఇరుకు రోడ్ల కష్టాలకు చెక్ పెడుతూ, జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలు, వాటర్ ఫౌంటైన్లతో ఆకర్షణీయంగా మార్చారు. బీచ్లను సుందరంగా మార్చారు. రూ.2.3 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో జగదాంబ జంక్షన్లో 20 మీటర్ల క్లాక్ టవర్ను నిర్మించారు. పచ్చదనంతో నగరానికి కొత్త అందాలు అద్దారు. మూలకు చేరిన శివాజీ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియానికి రూ.16.90కోట్లతో నూతన హంగులు తీసుకురావడం పాలకవర్గ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. : కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో జీవీఎంసీ వైఎస్సార్ సీపీ పాలకవర్గం విశేష కృషి చేసింది. మధురవాడ జోన్–2 భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ఏకంగా రూ.553 కోట్లు, రోడ్ల నిర్వహణ, గుంతల పూడ్చివేతకు రూ.770 కోట్లు, సామాజిక భవనాల నిర్మాణం, నిర్వహణకు రూ.700 కోట్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.159 కోట్లు, 24 గంటల మంచినీటి పథకానికి రూ.140 కోట్లు కేటాయించి నగర మౌలిక రూపురేఖలను మార్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నాడు–నేడు ద్వారా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించి పేదలకు మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేశారు. సింహాచలం వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనతో పాటు అడవివరం రోడ్డును విస్తరించారు. ఈ మేరకు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు. పార్టీలకతీతంగా ప్రగతి పరుగులు కుల, మత, పారీ్టలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ.. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేయర్ స్వయంగా పర్యవేక్షించడం నగర స్వచ్ఛతకు ఎంతో దోహదపడింది. నగర ప్రథమ పౌరురాలిగా ఇద్దరు రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు, ముఖ్యమంత్రికి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఐదుగురు కమిషనర్లు, ఒక స్పెషలాఫీసర్తో సమన్వయం చేసుకుంటూ హుందాగా పరిపాలన సాగించారు. మొత్తంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంలో, మేయర్ హరి వెంకటకుమారి నేతృత్వంలో నగరం ఆ నాలుగేళ్లలో ప్రశాంతంగా.. అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
విజయవాడకు వైఎస్ జగన్.. ముస్లింలకు YSRCP ఇఫ్తార్ విందు
-
త్వరలో పాదయాత్ర క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
-
నేడు ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 6 గంటలకు హాజరవుతారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు. -
చంద్రబాబు హామీలన్నీ 'మోసాలుగా తేలాయ్': వైఎస్ జగన్
దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఖజానాకు రానివ్వకుండా.. మీ సొంత జేబులు నింపుకొంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? అందుకే మీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారింది. – బాబు పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు హామీలన్నీ మోసాలుగా తేలిపోయాయని.. ఒకవైపు జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేస్తూ, మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కోవిడ్ లాంటి పరిస్థితుల్లోనూ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలన్నీ అమలు చేసినప్పుడు.. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మొత్తం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. రూ.2.73 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా వేశామని గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్లు తిరగకుండానే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.30 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసినా పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలను ఇంటివద్దకే అందిస్తే.. ఇప్పుడు అంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. సాగుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డా.. చంద్రబాబు ‘నో యాక్షన్’..! మహిళలపై కూటమి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్, కూన రవికుమార్ అఘాయిత్యాలపైనా... బాబు ‘నో యాక్షనే..!’ అంటూ ధ్వజమెత్తారు. మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని.. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, పార్టీలో అందరినీ కూడగట్టి ముందుకు సాగుతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఏడాదిన్నరగా ఆయన అంకితభావంతో పని చేస్తున్నారని అభినందించారు. ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కూడా చాలా చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. దేవుడి దయ, అందరి ఆశీస్సులుంటే ఆయన ఇంకా ఎదుగుతారని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో పాటు పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో విశిష్టతను చాటాం... మన హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని మంచి చేశాం. మేనిఫెస్టో విశిష్టతను చాటి చెప్పాం. మేనిఫెస్టో అంటే ఏదో ప్రజలను నమ్మించడానికి కాదు. అదో చెత్త పేపర్ అన్న ముద్ర నుంచి దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించేలా పని చేశాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఏడాది కాలంలోనే 99 శాతం హామీలను అమలు చేసి ప్రజల్లో గుర్తుండిపోయేలా మంచి పరిపాలన చేశాం. అందుకే ఈరోజుకీ గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరగ్గలం. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు..రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన గురించి ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. మనది సుపరిపాలన అయితే.. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయం. ఎక్కడా దేన్నీ వదలడం లేదు. ప్రజలకు మేలు చేయడం లేదు. నాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీ (ఖజానా)లో రూ.100 కోట్లు కూడా లేవు. రెండేళ్లు కోవిడ్తో అంతా అతలాకుతలం. ఒకవైపు ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అలాంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య మన వైఎస్సార్సీపీ పాలన సాగింది. అయినా కూడా ఏనాడూ ఆ సాకు చూపలేదు. ముందుగానే క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాం. క్రమం తప్పకుండా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేశాం. హామీలన్నీ అమలు చేశాం.రెండేళ్లలోనే రూ.3.30 లక్షల కోట్ల అప్పులు..మన ఐదేళ్ల పాలనలో దాదాపు రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ఆ వివరాలన్నీ ఆధార్తో సహా చెప్పగలం. అదే ఈ రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటాయి. అయినా కూడా హామీల అమలు లేదు. మనం ఇచ్చిన పథకాలన్నీ రద్దయ్యాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు.. ప్రజలకు ఇచ్చిందీ లేదు..! మనం ఐదేళ్లలో చేసిన అప్పులు.. చంద్రబాబు రెండేళ్లలోనే దాటేశారు. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోంది? ప్రజలంతా దీన్నే చర్చించుకుంటున్నారు. అంతా జేబులు నింపుకొంటున్నారు..దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదీ జరగడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలూ రావడం లేదు. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మట్టి, మద్యం, సిలికా, క్వార్ట్జ్, ల్యాటరైట్, గ్రానైట్.. అన్ని వనరులూ దోచేస్తున్నారు. అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటున్నారు. అమరావతిలో చదరపు అడుగు రూ.10 – 12 వేల చొప్పున నిర్మాణం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు ఇచ్చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలురానివ్వకుండా, మీ సొంత జేబులు నింపుకుంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? ప్రభుత్వ మైండ్సెట్ సరిగా లేదు కాబట్టే..ఈ ప్రభుత్వ మైండ్సెట్ సరిగా లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే.. విద్యా రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసేశారు. పిల్లలకు ట్యాబ్లు లేవు. టోఫెల్ శిక్షణ లేదు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు లేరు. విద్యాదీవెన, వసతి దీవెన లేవు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. పేదలకు ఉచిత వైద్యం లేదు. ఆరోగ్యశ్రీ గాలికెగిరిపోయింది. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయడం లేదు. రూ.6 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. వీరి మైండ్సెట్.. పేదలు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలని కాదు. చివరకు మహిళలకు సున్నా వడ్డీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టాడు. మనం అమలు చేసిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు... ఇవాళ ఏదీ కనిపించడం లేదు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 20 లక్షల ఇళ్ల మంజూరు... 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం... ఇప్పుడు ఏవీ లేవు. పాలనపై ధ్యాస లేదు. అంతా దోచుకో.. పంచుకో...తినుకో.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ!హాజరైన ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలుజగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంఈ ప్రభుత్వంలో చూస్తుండగానే మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇక మిగిలింది రెండు బడ్జెట్లు మాత్రమే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. ఏడాదికి పైగా నేను ప్రజల్లో ఉంటా. మన కార్యకర్తలంతా ప్రజలకు తోడుగా నిలబడి వారి సమస్యలపై పోరాడాలి. లీగల్ సెల్ను పటిష్టం చేశాం. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. రాబోయేది మనందరి ప్రభుత్వం. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి ఒక్కటీ వారి ద్వారానే అమలు చేస్తాం.ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..?టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్... డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంటు చరిత్రలో గతంలో ఇలాంటివి ఎన్నడూ లేవు. ఇది చంద్రబాబు అనుసరించే వైఖరితో మొదలైంది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? ఏం చేశాడు? అని చూస్తే ఎక్కడా డ్రగ్స్ను నియంత్రించలేదు. ఒక పాలకుడు, నాయకుడికి ఉండాల్సిన గుణాలు చంద్రబాబులో ఎక్కడా కనిపించవు. అందుకే విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయి. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశాడని, ఆపై మోసం చేశాడని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ? అని అడుగుతున్నా... నో యాక్షన్...! కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..? నో యాక్షన్...! మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ మీద ఏం చర్యలు తీసుకున్నావు..? నో యాక్షన్...! టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? నో యాక్షన్! మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ! అక్కడా నో యాక్షన్! పైగా బాధితురాలి మీద తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టారు. ఎమ్మెల్యేలు, లీడర్ల కథ దేవుడెరుగు.. కనీసం పీఏల మీద కూడా చర్యలు తీసుకోలేకుండా ఉన్నాడు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ, ఫొటోలతోనూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు ఏం చేశాడు..? నో యాక్షన్...! బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్లో పట్టుబడితే నో యాక్షన్... చంద్రబాబు కుమారుడు స్విమ్మింగ్పూల్ వద్ద తాగుతూ, తూగుతూ అమ్మాయిలతో డ్యాన్స్.. నో యాక్షన్..! ఇంకా చంద్రబాబునాయుడు బావమరిది, బాలకృష్ణ ఏమన్నాడు...? అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి... లేదా ముద్దు అయినా పెట్టాలి...అని! ఆయన అంత దారుణంగా మాట్లాడితే, చెంప పగలగొట్టకుండా.. హాహా! అని నవ్వుతారు. వీటన్నింటి మీదా చర్యలు తీసుకోని చంద్రబాబు ఏమన్నారు? తాను అవన్నీ చిన్నప్పుడే అంతకంటే బాగా చేశానని చెప్పుకొచ్చారు!గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్విలువలు, విశ్వసనీయతే మన పార్టీ పునాదులు‘‘మనమంతా కలసికట్టుగా, ఒక్కటై ఈ పార్టీని నిర్మించుకున్నాం. ఈ పార్టీ జగన్ ఒక్కడిదే కాదు.. వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై, మనమంతా కలసి ఈ పార్టీని నిర్మించుకున్నాం. విలువలు, విశ్వసనీయత అన్న రెండు పదాల మీదే మన పార్టీ పుట్టింది, నడుస్తోంది. మన పార్టీ ఎప్పటికీ విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయతకు పెద్దపీట వేస్తుంది. పోరాటాలు మనకు కొత్త కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్. మన పార్టీ చరిత్ర, 15 ఏళ్ల ప్రయాణం చూస్తే.. కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నాం. విపక్షంగానే మొదలయ్యాం. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు మరింత తోడుగా, దగ్గరగా ఉండాలి...’’ -
రేపు విజయవాడకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో రేపు(మార్చి 18, బుధవారం) వైఎస్సార్సీపీ నిర్వహించే ఇఫ్తార్ విందు విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.రంజాన్ మాసం సోదరభావం, సామరస్యం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగే ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరుతారు. -
ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్ జగన్ (ఫోటోలు)
-
ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు
-
లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్
-
జగన్ 2.0 ట్రేడ్ మార్క్ మొదటి ప్రాధాన్యత వాళ్లకే
-
టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్ కేసుపై జగన్ రియాక్షన్
-
వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్తో మొదలై... పుట్టా మహేష్తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద నో యాక్షన్...మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీదా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్లు చూస్తే నో యాక్షన్. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
LIVE: నో యాక్షన్..? జగన్ సంచలన కామెంట్స్...
-
కూటమి నేతల నీచపు పనులపై YS జగన్ సంచలన రియాక్షన్
-
గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్ : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కేడర్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. వైఎస్ జగన్ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి, పార్లమెంటు ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జగన్ది మాత్రమే కాదు.. వైఎస్సార్సీపీ అంతా కలిసి కట్టుగా నిర్మించుకున్నాం. వైఎస్సార్సీపీ విలువలు,విశ్వసనీయత మీద పుట్టింది. అదే పునాదుల మీద కొనసాగుతోంది. గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్,మనం మంచి చేశాం. కాబట్టే ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నాం. మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడా ప్రజలు గుర్తించారు. ప్రతి ఇంట్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అవినీతి కోసం మాత్రమే వాళ్లు అధికారంలో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రాష్ట్రాన్ని ఇచ్చినట్లు బాబు బిల్డప్. వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసి అప్పగించారు. కేవలంలో ఖజానాలో రూ.100కోట్లు మాత్రమే ఉంచారు. తర్వాత కోవిడ్ లాంటి కష్టాలు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా ఒత్తిళ్ల మధ్య మన పరిపాలన సాగింది. ప్రజలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ వదిలి పెట్టలేదు. దేశ చరిత్రలో జరగని విధంగా హామీలు అమలు చేశాం. ముందుగానే క్యాలండర్ ఇచ్చి హామీలను అమలు చేశాం. బడ్జెట్లో క్యాలెండర్ పెట్టి పథకాలు అమలు చేశాం. పేదలను, మధ్యతరగతి ప్రజలను ఆదుకున్నాం. మన హయాంలో రూ.3.31లక్షల కోట్లు అప్పు చేస్తే రూ.2.7లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో వేశాం. రెండేళ్లకే చంద్రబాబు కమిటెడ్ అప్పులు.. గ్రాస్ అప్పులు రెండేళ్లకే రూ.3.30లక్షల కోట్లు దాటాయి. చంద్రబాబు హామీలు మోసాలుగా తేలిపాయాయి’అని వైఎస్ జగన్ అన్నారు. ’మన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్లిపోయాయి. జగన్ ఏం చేయగలిగాడు. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడని చర్చిస్తున్నారు. అవినీతికి తావు లేకుండా మనం పథకాలు అమలు చేశాం. ఇప్పుడు దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే కొనసాగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి. భూములను శెనక్కాయలకు, బెల్లానికి ఇచ్చేస్తున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డారు. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయనే. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణం. చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించడం లేదు. మోసం చేశారని బాధితురాలు సీఎంకు ఫిర్యాదు చేస్తే కమిటీలు వేస్తామంటున్నారు. ఆదిమూలం మహిళపై లైంగిక దాడి చేస్తే పంచాయతీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్పై వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై నో యాక్షన్. మహిళలకు అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీద కూడా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్తో పట్టుబడితే నో యాక్షన్. తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతు, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే నో యాక్షన్.తన బావమరిది మహిళలపై నీచంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని బాబు అన్నారు. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు. చంద్రబాబుకు ఇక మిగిలింది రెండేళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలున్నాయి. మధ్యలో నా పాదయాత్ర కూడా ఉంటుంది. జగన్ 220లో కార్యకర్తలకు పెద్దపీట. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి’ అని అన్నారు. -
జగన్ పాలనలో జోరు.. సంక్షేమం–అభివృద్ధి జోడు గుర్రాల దౌడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతతో కొనసాగిందని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. రాష్ట్ర వ్యయం నమూనా సంక్షేమ, మౌలిక సదుపాయాలపై బలమైన ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచించిందని నివేదిక తెలిపింది. 2023–24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర వ్యయం నమూనాను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని.. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేసిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాలు ఆరోగ్యకరమైన పెరుగుదలను సూచించాయని, జీఎస్టీతోపాటు వస్తువుల పన్నులు పెరిగాయని నివేదిక పేర్కొంది.» రెవెన్యూ, మూలధనం.. రెండూ కలిపి మొత్తం అభివృద్ధి వ్యయం వైఎస్ జగన్ పాలనలో గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2019ృ20లో మొత్తం అభివృద్ధి వ్యయం రూ.1.10 లక్షల కోట్లుగా ఉండగా 2023ృ24లో రూ.1.67 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగినట్లు నివేదిక ప్రస్తావించింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో మొత్తం దాదాపు 65 శాతం పెరుగుదల నమోదైందని నివేదిక స్పష్టం చేసింది. స్థిరమైన వృద్ధి ఆధారంగా సంక్షేమ రంగాలను బలోపేతం చేయడంపై గత ప్రభుత్వ ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని తెలిపింది.» గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్డీపీలో 4 నుంచి 9 శాతం పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 2023ృ24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4 శాతంతో అతి పెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6 శాతం వాటాను కలిగి ఉండగా ప్రధానంగా రవాణా, నీటి పారుదల, ఇంధన రంగాలు పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక పేర్కొంది. » 2023ృ24లో మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు 48.59 శాతం జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు లాంటి తప్పనిసరి ఖర్చులకు కేటాయించినట్లు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. » గత ప్రభుత్వంలో రాష్ట్ర సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల నమోదైంది. 2023ృ24లో మొత్తం ఆదాయ వసూళ్లలో దాదాపు 52 శాతం సొంత పన్నుల ద్వారానే సమకూరినట్లు వెల్లడించింది. ఇందులో వస్తు సేవల పన్నులు అత్యధికంగా 35.5 శాతం వాటా కలిగి ఉండగా తరువాత జీఎస్టీ 34.1 శాతం వాటాగా నమోదైంది. » రాష్ట్ర సొంత ఆదాయం వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు 48 శాతం వృద్ధిని నమోదు చేసిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. -
నేడు ఒంగోలు నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకు జరిగే ఈ భేటీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్ మాట్లాడతారు. -
ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి YS జగన్ అభినందలు
-
ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి : ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలియజేశారు వైఎస్ జగన్. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు వైఎస్ జగన్.‘సాహిత్య రంగంలో జాతీయ స్థాయి అత్యున్నతమైన పురస్కారం లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేశారు. తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు. నందిని సిధారెడ్డిగారికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం, వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవం’ అని ప్రశంసించారు. ఇదీ చదవండి:నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -
ప్రత్యేక రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళులు
-
10th విద్యార్థులకు.. జగన్ విషెస్
-
పదో తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. మీరే మన రాష్ట్ర భవిష్యత్తు. పరీక్షల మీద దృష్టి పెట్టండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని పోస్టు చేశారు. Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2026 -
పొట్టి శ్రీరాములు గారికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి,తాడేపల్లి: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి (మార్చి16) నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నివాళులర్పించారు.తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/KWE9EpRC9X— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2026 -
పెట్టుబడి సాయం ఆలోచన వైఎస్ జగన్దే
సాక్షి, అమరావతి: దేశంలో రైతుకు పెట్టుబడి సాయం అందిచాలనే ఆలోచన చేయడమే కాదు... అధికారంలోకి వచ్చీరాగానే అమలు చేసింది కూడా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుస కరువు, కాటకాలతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలవాలన్న ఆలోచనతో 2017లో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 2018 డిసెంబర్లో కేంద్రం పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేల ఆరి్థక సాయం ప్రకటించి, 2019 జనవరి నుంచి అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చంద్రబాబు‡ ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకు ఈ ఆలోచన రాలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్... అధికారంలోకి రాగానే రూ.12,500లను రూ.13,500కు పెంచి, ఐదేళ్లపాటు రూ.67,500 చొప్పున ఇచ్చారని వివరించారు. రైతులు, కౌలు రైతులతోపాటు దేవదాయ, అటవీ, ఇతర భూముల సాగుదారులు కలిపి 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల లబ్ధి చేకూర్చారని తెలిపారు. చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది 46.86 లక్షల మందికి అరకొరగా అన్నదాత సుఖీభవ కింద సాయం అందించారని పేర్కొన్నారు. లబ్ధిదారులను భారీగా తగ్గించడమే కాకుండా రెండేళ్లలో ఒక్కో రైతుకు దాదాపు రూ.30వేలు చొప్పున ఎగ్గొట్టారని విమర్శించారు. -
చిన్నారికి వైఎస్ జగన్ అండ
జగదాంబ (విశాఖ): నిరుపేద కుటుంబానికి చెందిన ఓ చిన్నారి చికిత్సకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి జోయా మహ్మద్ చికిత్స కోసం రూ.2 లక్షల చెక్కును పంపించి ఆ కుటుంబానికి ఆశాకిరణంగా నిలిచారు. విశాఖపట్నం 39వ వార్డుకు చెందిన మహమ్మద్ ఆసీఫ్–ఆíÙత దంపతుల కుమార్తె జోయా కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి వివాహ వేడుకకు వచి్చన సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సమస్యలను వివరించారు.వెంటనే స్పందించిన వైఎస్ జగన్ చిన్నారి చికిత్స కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్కు పంపించారు. శనివారం వారు ఆసీఫ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పార్టీ నాయకులు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలోనూ సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయం గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సుమారు రూ.18 లక్షలు మంజూరు చేశారు. మొదట రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించగా, మిగిలిన మొత్తం కూడా విడుదల చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికలు రావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించాల్సిన మిగిలిన సహాయం నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు అధికారులను సంప్రదించినా సహాయం అందలేదని చెప్పారు.అంతేకాక చిన్నారి తండ్రి చేస్తున్న ఎండీయూ (రేషన్ డిపో ఆపరేటర్) ఉద్యోగం, తల్లి చేస్తున్న వలంటీర్ ఉద్యోగం కూడా నిలిపివేయడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. దీంతో వైఎస్ జగన్ వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా కేకే రాజు, వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో విశాఖ పశి్చమ పరిశీలకుడు జహీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
వాలంటీర్ హబీబ్ కుమార్తెకు వైఎస్ జగన్ రూ.2 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, విశాఖ: వాలంటీర్ హబీబ్ కుమార్తెకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఆ చెక్కును హబీబ్ కుటుంబ సభ్యులకు వైసీపీ నేతలు కేకే రాజు, వాసుపల్లి గణేశ్ కుమార్ అందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో విశాఖకు వచ్చిన సందర్భంగా ఆయనను హబీబ్ కుటుంబ సభ్యులు కలిశారు.అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను ఆదుకోవాలని హబీబ్ విజ్ఞప్తి చేశారు. చిన్నారిని చూసి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన కుమార్తెకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సాయం అందించారని హబీబ్ గుర్తు చేసుకున్నారు. -
లోకేశ్.. చిల్లర రాజకీయాలు మానుకో!
తాడేపల్లి రూరల్: ‘మిస్టర్ లోకేశ్.. చిల్లర రాజకీయాలు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రతిపక్ష నేతలను కించపరిచేందుకు జీతాలు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ ఫిర్యాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంకిరెడ్డి నాగనారాయణమూర్తి అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి లోకేశ్ను హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ పేరుతో సీమరాజ, జెట్టి రేణుక, కిరాక్ ఆర్పీ, కిరణ్ లాంటి వారితో దు్రష్పచారం చేయించడంపై శుక్రవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారి వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేక అంజిరెడ్డి, అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. -
పలాసలో కిడ్నీ మార్పిడి విజయవంతం
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో తొలిసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శుక్రవారం సోంపేటకు చెందిన సీహెచ్ హేమశ్రీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆమె తండ్రి మోహనరావు కిడ్నీ దానం చేశారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసిన అనంతరం ఆస్పత్రి వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేజీహెచ్ నెఫ్రాలజిస్టు డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ పలాస వంటి మారుమూల చిన్నపట్టణంలో మెడికల్ కళాశాల లేనిచోట కిడ్నీ మార్పిడి చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు.ఉద్దానం ప్రాంతంలో చాలా ఏళ్ల నుంచి ఎక్కువగా కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పారు. కిడ్నీ మార్పిడిని 15 ఏళ్ల కిందట కేజీహెచ్లో తానే ప్రారంభించినట్లు తెలిపారు. కర్నూలు, గుంటూరు వంటి నగరాల్లోని ఆస్పత్రుల్లో ఈ సదుపాయాలున్నాయని చెప్పారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి, ఆస్పత్రి నిర్మించడంతో ఈ ప్రాంత ప్రజలకు ఈ సదుపాయాలు కలుగుతున్నాయన్నారు. రెండు కిడ్నీలు పాడైపోయిన హేమశ్రీకి ఆమె తండ్రి కిడ్నీ ఇచ్చారని చెప్పారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఆపరేషన్ మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయిందన్నారు.మార్పిడి తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ బాగానే ఉందని చెప్పారు. ఎనీ్టఆర్ వైద్యసేవ, ఆస్పత్రి నిధుల నుంచి ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. కిమ్స్, జెమ్స్ ఆస్పత్రుల నుంచి వచ్చిన డాక్టర్లు ఉమామహేశ్వరరావు, పూర్ణచంద్ర, వివేకానంద, అశోక్వర్ధన్, జోగినాయుడు, స్థానిక వైద్యులు రాకే‹Ù, జ్యోత్స్న, ఆస్పత్రి సూపరింటెండెంట్ జె.కిశోర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.ఆస్పత్రి కట్టించినవారికి అభినందనలు నెఫ్రాలజిస్టు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత చక్కటి ఆస్పత్రి నిర్మించిన వారిని, అన్ని సదుపాయాలు కల్పించినవారిని ముందుగా అభినందించాలన్నారు. ఇలాంటి మారుమూల ప్రాంతంలో అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారని చెప్పారు.వైఎస్ జగన్ హయాంలో ఆస్పత్రి నిర్మించి, ప్రారంభించారు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో ఈ ఆస్పత్రి నిర్మించి ప్రారంభించారని చెప్పారు. మరిన్ని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు ఈ ఆపరేషన్ పునాది అవుతుందని ఆమె పేర్కొన్నారు. – గౌతు శిరీష, టీడీపీ ఎమ్మెల్యే -
మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారిగా హెచ్జే దొర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు.పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. -
జగన్ విలువ ఇప్పుడు తెలుస్తుంది.. YSRCP పేరు వింటేనే బాబుకు గజ గజ
-
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
-
ఊరూ వాడా ఘనంగా 16 ఏళ్ల పండుగ
సాక్షి నెట్వర్క్: ఆవిర్భావం నుంచి ప్రతి అడుగులోనూ విలువలు, విశ్వసనీయతతో రాజకీయ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో గ్రామాల్లోనూ పండుగలా కార్యక్రమం కొనసాగింది. ప్రజా సంక్షేమం కోసం పురుడు పోసుకున్న పార్టీ జెండాను రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా పండుగ వాతావరణంలో కార్యకర్తలు, నేతలు, అభిమానుల కోలాహలం నడుమ ఎగురవేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా సందేశాన్ని చాటారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కేక్లు కట్ చేసి కోట్ల మంది సంబరాన్ని పంచుకున్నారు.వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఉరిమే ఉత్సాహంతో బైక్ ర్యాలీలు.. జై జగన్.. జై వైఎస్సార్సీపీ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జెండా రెపరెపల నడుమ తమ గుండె చప్పుడు వైఎస్సార్సీపీ అని చాటి చెప్పారు. పలుచోట్ల వైఎస్ జగన్ హయాంలో అమలైన నవరత్నాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలను ప్రదర్శించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతిని«ధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. నల్లకాలువలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట కోసం 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిందని గుర్తు చేసుకున్నారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. అబద్ధపు హామీలతో మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారును తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. పులివెందుల బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా, న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఢిల్లీలో వైఎస్సార్సీపీ సంబరాలుసాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలు ఢిల్లీలో గురువారం ఘనంగా జరిగాయి. పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం చెబుతూ వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని ఎంపీలు పేర్కొన్నారు.తెలంగాణలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలుకూకట్పల్లి/అల్వాల్/ఖమ్మం మయూరి సెంటర్: వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు గురువారం కేక్ కట్చేసి వేడుకలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని రమ్యా గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అరి్పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కూకట్పల్లి, నేరేడ్మెట్ ఆర్కేపురం, ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ.. 'కోట్లాది మంది అభిమానులది': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు.. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది.. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నా..’’ అని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలిరావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులనుద్దేశించి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నల్లకాలువలో ఇచ్చిన మాటతో..మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తయింది. 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితుల్ని మార్చింది. రాష్ట్రం దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుంది..ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు... కానీ జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, దేశంలోనూ అధికారంలో ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతా. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుందని మరొక్కసారి మీ అందరికీ వినమ్రంగా, వినయపూర్వకంగా చెబుతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. -
ఫిషింగ్ హార్బర్ పోయింది.. ‘జువ్వలదిన్నె’ ప్రైవేట్ పరం!
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల నుంచి ఒక్కో రంగాన్ని ప్రైవేట్పరం చేసి సంపద సృష్టించకపోగా ఆస్తులను తెగనమ్ముతూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు తాజాగా గత ప్రభుత్వ కృషితో సాకారమైన ఫిషింగ్ హార్బర్లపై కన్నేసింది. మన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు వేట కోసం వలస వెళ్లి అవస్థలు పడకూడదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్ను చంద్రబాబు సర్కారు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. 2024 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించిన నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూటమి సర్కారు ఇంతవరకూ అందుబాటులోకి తేకుండా మత్స్యకారుల ఆశలను నీరుగార్చింది. తాజాగా దీన్ని నౌకా నిర్మాణ కేంద్రంగా మారుస్తూ ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు 29.58 ఎకరాలు కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్ ల్యాండ్కు నిర్దేశించారు. మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా తన తనయుడు లోకేశ్తో శంకుస్థాపన చేయించడం గమనార్హం. ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ జువ్వలదిన్నెలో అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్ యూనిట్ సిస్టమ్స్ సెంటర్ను అభివృద్ధి చేయనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే మానవ రహిత ఉపరితల వాహనాలు, నీటి అడుగున తిరిగే వాహనాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం తొలి దశలో కేవలం రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొదట 29.58 ఎకరాలు కేటాయించగా మొత్తం 150 ఎకరాలు అప్పగించనున్నట్లు శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. అంటే రానున్న కాలంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మొత్తం సాగర్ డిఫెన్స్కు కేటాయించనున్నట్లు స్పష్టమవుతోంది. మత్స్యకారుల నోట్లో మట్టి.. రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్గా ప్రారంభించినా చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తేలేదు. రెండేళ్లలో ఏ ఒక్క ఫిషింగ్ హార్బర్నూ అందుబాటులోకి తేకపోగా గత ప్రభుత్వం చేపట్టిన వాటిని సైతం ప్రైవేట్పరం చేస్తోంది. జువ్వలదిన్నె హార్బర్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ప్రాంత మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో మన తీర ప్రాంతంలో వేటాడుతున్న విషయాన్ని కొద్ది రోజుల క్రితం నెల్లూరు కలెక్టర్ సీఎం చంద్రబాబు దృష్టికి తెచి్చనా తనకు పట్టనట్లే వ్యవహరించారు. ఇప్పుడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థానంలో షిప్యార్డ్కు శంకుస్థాపన ద్వారా మత్స్యకారుల ఆశలను శాశ్వతంగా నీరుగార్చారు. మత్స్యకారుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కేవలం చేపలు పట్టడానికి ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారంటూ నమ్మబలుకుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పెద్ద నౌకల తయారీతోపాటు సముద్ర జలాల్లో పరీక్షలు నిర్వహించడం స్థానిక మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బందరు ఫిషింగ్ హార్బరు వద్ద కూడా..ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా మన జలాల్లోనే చేపల వేట చేపట్టేలా మాజీ సీఎం వైఎస్ జగన్ జువ్వలదిన్నె హార్బర్కు శ్రీకారం చుడితే ఇప్పుడు షిప్యార్డ్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుగరాజపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్లో కాకుండా జువ్వలదిన్నె వద్ద షిప్ యార్డు నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే రీతిలో మచిలీపట్నం ఫిషింగ్ హార్బరు వద్ద కూడా మరో షిప్ యార్డు నిర్మాణం చేపట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటం మత్స్యకారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. -
18న వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు గురువారం ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏటా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనార్టీలకు అన్ని విధాలా అండగా నిలిచి మేలు చేశారని చెప్పారు. -
YS Jagan: మీరే నా ధైర్యం, బలం
-
ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. -
తాడేపల్లి : వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
నా ధైర్యం మీరే .. నా బలం మీరే : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మన పార్టీకి అసలైన బలం.. నా బలం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు. నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించినమన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం… pic.twitter.com/avdEzEGkjg— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2026గురువారం పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో పార్టీ కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన వైఎస్ జగన్, ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తి. 2011, మార్చి 12న పుట్టిన మన పార్టీ, ఈరోజుకి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు మార్చింది. రాష్ట్రంలో దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్ధం చెబుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నాను.ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ, దేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు. కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.ఈరోజు నేను చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి, మరొక్కసారి మీ అందరికి కూడా వినమ్రంగా, వినయపూర్వకంగా, మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.ఈరోజు మరొక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు. -
ఆరోజు జగన్ ఒక్కడే.. ఇప్పుడు కోట్ల మంది.. దేశ రాజకీయాలనే మార్చేసిన YSRCP
-
వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని’ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం (మార్చి 12) వైఎస్సార్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన వైఎస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించింది. నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చింది. వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది. మొదట్నుంచీ ప్రజలు,దేవుడినే నమ్ముకున్నా. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు’ తెలిపారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. -
Watch Live: వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు
-
పేదల గుండెచప్పుడు.. జగన్ నేతృత్వంలో పార్టీ ప్రయాణం
-
చంద్రబాబు మార్క్ మోసాలపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం
-
ఉరుసు ఉత్సవాలకు ఆహ్వానం
-
చంద్రబాబు ఉప ప్రధానా! రెండు గంటలు ఎడాపెడా వాయించిన జగన్
-
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
అప్పులు దాచి.. ఆదాయం దోపిడీ
రాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి, డీవోపీటీకి లేఖ రాస్తాం. కాగ్ నివేదికలో పేర్కొన్న అప్పులు.. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అప్పులను చూపించి.. చంద్రబాబు కోసం కిందామీదాపడి దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంలో పాలుపంచుకున్నందుకు ఆ అధికారులపై లేఖ రాస్తున్నాం.ప్రభుత్వ గ్యారంటీతో ఎన్నో అప్పులు తీసుకున్నారు. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. వీటిని బడ్జెటేతర అప్పులని కాకుండా ఏమంటారు? వీటిని మాత్రం చెప్పడం లేదు. అన్నీ దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు.. ఇవి మినహా ఏమైనా మంచి జరిగిందా అని చూస్తే ప్రజలకు ఒరిగింది సున్నా.చంద్రబాబు అధికారంలోకి వస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు (అప్పులు) ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అందరూ కలిసి జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో..! అంటూ దోచుకుంటున్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే. ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి? ఎంత అప్పులు తెచ్చినా ఎలా సరిపోతాయి? సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఆర్థిక విధ్వంసం సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అంతా కలిసి దోచుకుంటుండడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పడిపోతున్నాయని, మరోవైపు రాష్ట్ర అప్పులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులున్నప్పటికీ, ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి అదనంగా భారీ ఎత్తున ఖర్చు చేయాల్సివ చ్చినప్పటికీ.. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించామని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి విపత్కర పరిస్థితులేవీ లేనప్పటికీ.. కేంద్రం విధించిన పరిమితి (నెట్ బారోయింగ్ సీలింగ్)కి మించి ఎడాపెడా అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ తాను పరిపాలనా దక్షుడినంటూ చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులపై అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇ చ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శిపై చర్యలు కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)కి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కాగ్ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక.. బడ్జెట్ ప్రతులు.. అసెంబ్లీకి ప్రభుత్వం రాతపూర్వకంగా ఇ చ్చిన సమాచారం ప్రతులను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కార్ ఆర్థిక విధానాలను ఎండగట్టారు. 2026–27 బడ్జెట్లో లోపాలను ప్రస్తావిస్తూ.. మేనిఫెస్టోలో ఇ చ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ తాను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తండ్రీ, కుమారుడు పరస్పరం జాకీలు ఎత్తుకుంటే.. వారిద్దరి జాకీలను పవన్కళ్యాణ్ ఎత్తడమే సరిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. విధ్వంసానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు సర్కారుకు ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇక రెండు మాత్రమే ప్రవేశపెట్టే అవకాశముంది. గతనెల 19న జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని సవివరంగా చెప్పా. ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలను ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. మా ప్రభుత్వంలో చివరి ఆర్థిక ఏడాది (2023–24)ని.. కాగ్ ఆడిటింగ్ జరిగిన చంద్రబాబు నాయుడు తొలి ఏడాది (2024–25)తో పోలిస్తే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2023–24లో ప్రభుత్వ వ్యయం రూ.2,36,486 కోట్లు. ఇందులో రాష్ట్ర ఆదాయం (సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్–ఇన్–ఎయిడ్) రూ.1,73,767 కోట్లు. చంద్రబాబు సర్కార్ తొలి ఏడాది 2024–25లో ప్రభుత్వ వ్యయం రూ.2,49,096 కోట్లు. ఇందులో రాష్ట్ర ఆదాయం రూ.1,68,024 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 2024–25లో రూ.1,68,024 కోట్లకు పడిపోయింది. అంటే మా ప్రభుత్వం కంటే బాబు తొలి ఏడాదిలో రాబడులు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రెవెన్యూ లోటు ఏకంగా 56 శాతం పెరిగి రూ.38,682 కోట్ల నుంచి రూ.60,285 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు.. అంటే చేసిన అప్పులు 30 శాతం పెరిగి రూ.62,719 కోట్ల నుంచి రూ.81,071 కోట్లకు చేరింది. అయినా కూడా మొదటి ఏడాది సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకపోగా గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024–25 తర్వాత కూడా రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెంచుకుంటూనే పోతున్నారు. 2019–20లో మా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ఐదేళ్ల కాలంతో ఇప్పటి ప్రభుత్వంలో 2024–25, 2025–26లోని పది నెలలతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా అప్పులు ఏ విధంగా పెరిగాయో తెలుస్తుంది. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా, ప్రజలను కాపాడుకోవడానికి అదనంగా వ్యయం చేయాల్సి వ చ్చినా మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలను కూడా అమలు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాం. కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా, ఎలాంటి స్కీమ్లు అమలు చేయకున్నా అప్పులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2023–24లో రాష్ట్రం మొత్తం వ్యయంలో అప్పులు 26.52 శాతంగా ఉంటే అదే చంద్రబాబు తొలి ఏడాది 2024–25లో 32.55 శాతానికి, 2025–26లో మొదటి పదినెలల్లో 39.74 శాతానికి ఎగబాకాయి. అంతేకాకుండా మా ఐదేళ్ల పరిపాలనలో జీఎసీడీపీలో అప్పులు సగటున 4.11 శాతంగా ఉంటే 2024–25లో జీఎసీడీపీలో అప్పులు 5.08 శాతానికి చేరాయి. చంద్రబాబు ఆర్థిక విధ్వంసానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.. ఆధారాలు!! దోచుకో.. పంచుకో.. తినుకో.. చంద్రబాబు అధికారంలోకి వస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు (అప్పులు) ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అందరూ కలిసి జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో..! అంటూ దోచుకుంటున్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్ ్జ, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే. ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి? ఎంత అప్పులు తె చ్చినా ఎలా సరిపోతాయి? విశాఖలో అత్యంత విలువైన 54 ఎకరాలను, రూ.5,000 కోట్ల విలువైన భూమిని బాబు దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? రియల్ ఎస్టేట్ కంపెనీలకు శనక్కాయలు, బెల్లానికి భూములు ఇస్తున్నాడు. అంతేకాదు.. నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈయన ఎదురు ఇస్తున్నాడు. ఇలాంటి స్కామ్లు జరుగుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనడానికి ఇంకో ఉదాహరణ.. ట్రెజరీలో మినిమమ్ క్యాష్ బ్యాలెన్స్(కనీస నగదు నిల్వ) చూస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో కనీస నగదు లేకపోతే ముందుగా ఎస్డీఎఫ్ తీసుకుంటారు. ఇదికూడా దాటితే వేస్ అండ్ మీన్స్.. అది కూడా దాటితే ఓవర్ డ్రాఫ్ట్కు వెళుతుంది. ఇవన్నీ వడ్డీతో కూడినవి. కోవిడ్ లాంటి ఏ కష్టాలూ బాబు హయాంలో లేనప్పటికీ 2024–25లో కనీస నగదు నిల్వ ఉన్నవి కేవలం 8 రోజులు మాత్రమే. 365 రోజుల్లో 357 రోజులు కనీస నగదు నిల్వ కూడా ఉంచలేదు. చంద్రబాబు పరిపాలనకు, బిల్డప్కు తేడా స్పష్టంగా చూపించే మరో చిత్రపటం.. ట్రెజరీలోని ఈ కనీస నగదు నిల్వలు! ఒకవైపు మామీద తప్పుడు ప్రచారం చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ వాటిని బయటకు రానివ్వకుండా దాచేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024–25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు రూ.81,082 కోట్లు అని కాగ్ నివేదిక స్టేట్మెంట్ సిక్స్లో పేర్కొంది. కానీ అసెంబ్లీలో రూ.60,485 కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు సర్కార్ తప్పుడు లెక్కలతో కూడిన సమాచారం ఇ చ్చింది. అంటే రూ 20,000 కోట్ల అప్పులు దాచిపెట్టి చూపిస్తున్నారు. ఆత్మస్తుతి.. పరనిందేరాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇ చ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తాం.. డీవోపీటీకీ లేఖ రాస్తాం. కాగ్ నివేదికలో పేర్కొన్న అప్పులు.. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అప్పులను చూపించి.. చంద్రబాబు కోసం కిందామీదాపడి దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంలో పాలుపంచుకున్నందుకు ఆ అధికారులపై డీవోపీటీకి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరికీ, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాస్తున్నాం.ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు కాకుండా బడ్జెటేతర అప్పుల వివరాలు ఇవ్వాలని మండలిలో రాతపూర్వకంగా కోరితే ప్రభుత్వం దాటవేసే యత్నం చేస్తూ వివరాలు ఇవ్వలేదు. ప్రభుత్వ గ్యారంటీతో ఎన్నో అప్పులు తీసుకున్నారు. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. వీటిని బడ్జేటేతర అప్పులని కాకుండా ఏమంటారు? వీటిని మాత్రం చెప్పడం లేదు. అన్నీ దొంగచాటు వ్యవహారాలే. బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, దుష్ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు మినహా ఏమైనా మంచి జరిగిందా? అని చూస్తే ప్రజలకు ఒరిగింది సున్నా. చంద్రబాబు తన కొడుకును జాకీ పెట్టి ఎత్తుతాడు. బాబు కొడుకేమో ఆయన్ను జాకీపెట్టి ఎత్తుతాడు.. వీళ్లిద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీ ఎత్తుతాడు. పరనింద.. ఆత్మస్తుతి మినహా 16 రోజుల సభలో ఏం జరిగింది? విలేకరుల సమావేశం నిర్వహించి బడ్జెట్పై గతంలో మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలేమయ్యాయి? పరిమితికి మించి అప్పులు..ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ)కి లోబడి అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన ప్రతిసారీ ఓవైపు ఎన్బీసీని ఉల్లంఘిస్తూ మరోపక్క పరిపాలనా దక్షుడిగా బిల్డప్ ఇస్తారు. 2014–19లో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్బీసీ పరిమితి కంటే రూ.29,099 కోట్లు అధికంగా అప్పు చేశారు. అదే మా హయాంలో రెండేళ్ల పాటు కోవిడ్ ఉన్నా, ఆదాయాలు తగ్గినా, ప్రజలను కాపాడుకోవడం కోసం భారీగా ఖర్చు చేసినా, ఇ చ్చిన హామీలు అమలు చేసినా కూడా ఎన్బీసీ పరిమితి కంటే రూ. 12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. ఇది మా ఐదేళ్ల ట్రాక్ రికార్డు. బాబు అధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్. తొలి ఏడాది ఎన్బీసీ కంటే రూ.17,953 కోట్లు అప్పులు ఎక్కువగా తీసుకొచ్చారు. 2025–26లో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. రెండేళ్లలో తె చ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. మా ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.31 లక్షల కోట్లు అయితే అప్పుడే ఈ రెండేళ్లలోనే రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారన్నదానికి ఇదే నిదర్శనం. ఆర్థిక సంఘం ఆదేశాలూ లెక్కలేదు అయినా దుష్ప్రచారమే..! మహిళలను వేధించినా చర్యలు తీసుకోరా?చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మహిళల జోలికొస్తే ఆ రోజే ఆఖరు రోజంటూ బిల్డప్ ఇస్తారా? సామాన్య మహిళలు, ఉద్యోగులను వేధించిన టీడీపీ, జనసేన నాయకులపై చర్యలు ఏవి? బాధిత మహిళలు స్వయంగా మీకే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదేం? టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి మహిళను మోసం చేసి అడ్డంగా దొరికితే ఏం చేశావు?సాక్షి, అమరావతి: ‘మహిళల జోలికి వస్తే తాట తీస్తా... మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు అవుతుంది.. అని డైలాగులు వేసి వెళ్లిపోతున్నారు. స్వయంగా బాధిత మహిళలు మిమ్మల్ని కలిసి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి పార్టీ నేతల్లో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?’ అని సీఎం చంద్రబాబు వైఖరిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పారబట్టారు. చంద్రబాబు ఏలుబడిలో రక్షణ కోసం ప్రాధేయపడిన బాధిత మహిళలపైనే తిరిగి పోలీసు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతకు సంబంధించి సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీ ఎమ్మెల్యేలపై చర్యలెక్కడ బాబు?» రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేసి మోసం చేశారంటూ బాధిత మహిళ నేరుగా సీఎంకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? » కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్పై ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పడితే చర్యలు ఎక్కడున్నాయి? » మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసి, అసభ్యంగా ప్రవర్తించిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై చర్యలు ఎక్కడ? » టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఎక్కడున్నారు? » మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏను కూడా శిక్షించలేదు. ఇక్కడ ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు కనీసం రాజకీయ నాయకుల పీఏలపైనా చర్యలు తీసుకోవట్లేదు. తిరిగి బాధితురాలిపైనే కేసు పెట్టారు. బాబుకు భయం, భక్తి లేదు చంద్రబాబు పాలన అంటేనే.. మహిళలపై పాశవిక దాడులు, దారుణాలు, అఘాయిత్యాలకు కేరాఫ్గా మారిపోయింది. సాక్షాత్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో అడ్డంగా దొరికిపోతే చంద్రబాబు ఏం చేశారు? టీటీడీ చైర్మన్ను ఎందుకు వదిలేశారు? ఇక్కడ విచిత్రం ఏమంటే.. తనను మోసం చేసిన వ్యక్తికి పదవులు ఇవ్వొద్దని, విచారించి చర్యలు తీసుకోవాలని బాధితురాలు గతంలోనే బాబుకు లేఖ రాశారు. అదిప్పుడు అక్నాలెడ్జ్మెంట్తో పాటు బయటకు వ చ్చింది. అయినా చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. మహిళలను వంచించే వ్యక్తులకు దేవుడి పట్ల భయం, భక్తి ఉండదు.దేవాలయాల్లో భక్తుల మృత్యువాత!చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన తర్వాత ఆలయాల్లో భక్తులకు కనీస రక్షణ కల్పించట్లేదు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు, పలాసలో తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోగా.. మొన్న కదిరి రథోత్సవంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప నిజంగా వీళ్లకు శ్రద్ధ ఎక్కడ ఉంది? -
తప్పు తాను చేసి.. నిందలు , స్కామ్లు!
సాక్షి, అమరావతి: ‘ఒకవైపు చంద్రబాబే తప్పు చేసి.. వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండోవైపున ఆ దుమారంలోనే స్కామ్లు చేస్తారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను కిలోకి రూ.351 నుంచి రూ.716కు పెంచేసి.. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపుర్ డెయిరీ నుంచి సరఫరా చేశారు. రూ.200 కోట్ల స్కామ్కు పాల్పడ్డారు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇలాంటి వాళ్లను ఏమనాలి? రెండున్నర గంటల సినిమాలో విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే..!’ అంటూ చంద్రబాబును తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి వ్యవహారంలో మా పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం కూడా చెప్పలేదు. ఇందాపూర్ డెయిరీ, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్కు మధ్య బంధంపై నోరు ఎత్తలేదు. సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపరు. ఇక్కడ నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూనే మరోవైపు నెయ్యిలో స్కామ్లకు పాల్పడుతున్నారు. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. 2024 ఆగస్టులో కిలో నెయ్యి రూ.351కి టీటీడీకి సరఫరా జరిగితే అక్టోబర్ 2025 నాటికి.. కేవలం ఏడాదిలోనే రూ.716కు పెంచేశారు. ఏడాదిలో కేజీ నెయ్యి ధరను రూ.365 చొప్పున పెంచేసి దోపిడీకి పథకం వేశారు. నెయ్యి స్కామ్ కోసం చంద్రబాబు అండ్ కో దోపిడీ మందలా (కాటెల్) ఏర్పడి దేవుడి సొమ్మును కొల్లగొడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు రూ.351కే కిలో నెయ్యి టీటీడీకి సరఫరా అయితే.. ఆ తర్వాత 2025 జనవరి 31 నాటికి అమాంతం రూ.513కి ఎగబాకింది. 2025 అక్టోబర్ నాటికి రూ.599 దూసుకెళ్లి.. అదే నెలలో రూ.716కి చేరుకుంది. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదీ చంద్రబాబు కుట్ర..! తిరుమల హుండీలో డబ్బులు లెక్కించే పరకామణి నుంచి 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం దొంగతనంపై కేసు నమోదైంది. చంద్రబాబు హయాంలో ఇంతటి ఘోరమైన తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించారు. పైగా మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా హయాంలో రూ.75 వేల విలువైన డాలర్ నోట్లు దొంగతనం జరిగితే.. ఏకంగా రూ.15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ దేవాలయానికి రాయించారు. దేవుడి సొమ్ముతో ఎవరైనా చెలగాటం ఆడితే అది తప్పని, క్రమశిక్షణ ఉండాలంటూ అప్పటి టీటీడీ బోర్డు ఆ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీటీడీ పరకామణి లెక్కింపుల సమయంలో 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం చోరీ జరిగింది. ఈ ఘటనను బయటకు రానివ్వకుండా దాచిపెట్టారు. మరోవైపున 2025 సెపె్టంబర్లో చంద్రబాబు కుట్ర పూరితంగా.. ఎప్పుడో 2023లో పరకామణిలో రూ.75వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసి.. పశ్చాత్తాపంతో రూ.15 కోట్లు దేవుడికి రాసిచ్చిన ఘటనను తప్పుపడుతూ దు్రష్పచారం చేశారు. కానీ, చంద్రబాబు ఆరోపణ కంటే ముందు, ఆయన హయాంలో నమోదైన చోరీని మాత్రం కావాలనే బయటకు రాకుండా కప్పెట్టేశారు. నెయ్యి రేట్లు అమాంతం పెంచేసి.. చంద్రబాబు నెయ్యి వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా ఆరోపణలు చేశారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మే 15న నెయ్యి టెండర్లు ఖరారయ్యాయి. జూన్ 4న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. జూన్ 12న నెయ్యి సరఫరా ప్రారంభమైంది. వాటిల్లో జూన్–జూలైలో 4 నెయ్యి ట్యాంకులు టీటీడీ టెస్టులు పాసయ్యాయి. అదే జూలై 6, 8వ తేదీల్లో వ చ్చిన మరో 4 ట్యాంకుల టెస్టులు టీటీడీ ల్యాబ్లో నెగిటివ్ వ చ్చింది. మళ్లీ చంద్రబాబు హయాంలోనే ఆ నాలుగు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు ఆగస్టు, సెపె్టంబర్లో వేరే కంపెనీ పేరుతో మళ్లీ టీటీడీలోకి వచ్చాయి. వాటిని టీటీడీ అనుమతించింది. వాటిని లడ్డూల తయారీలో ఉపయోగించారు. ఇదంతా దాచిపెట్టిన చంద్రబాబు.. కుట్ర పూరితంగా సెపె్టంబర్ 18న తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఎదురు ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే మాపై నెట్టేశారు. అసలు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు వెనక్కి రాకూడదు. అలాంటి వాటిని వెనక్కి రప్పించి వినియోగించారు. ఇక్కడ వైష్ణవి డెయిరీ, సంగం డెయిరీ సంబంధాలు అందరికీ తెలుస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు తప్పు చేసి వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండో వైపున దుమారంలోనే స్కామ్లు చేస్తారు. హెరిటేజ్ వెబ్సైట్లో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని రాసుకున్నారు. అదే క్రమంలో హెరిటేజ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ను వాళ్లే ఫైర్ చేస్తారు. ఏడాదిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కి పెంచేసి స్కాములు చేసుకుంటారు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? సినిమాలో రెండున్నర గంటల విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే!శ్రీవారి సొమ్ము.. అయినవారికి దోచిపెట్టేందుకు..బాబును సీఎంగానే భరించలేకపోతున్నారుఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు?.. వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలుసాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియా ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు బుధవారం అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘చంద్రబాబును ముఖ్యమంత్రిగానే రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు..?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1,100 మందిలా మాట్లాడుతున్నారంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన మరో ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలు అంత నిబద్ధతతో ఉన్నారు. బలంగా పని చేస్తున్నారు. అది మంచి విషయమే’ అని పేర్కొన్నారు. -
నమ్మించి నిండా ముంచి.. దగా పాలన
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబు తన పాలనలో అన్ని వర్గాల వారిని నిండా ముంచారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులను సైతం తన అబద్ధాలతో వంచించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరును కడిగి పారేశారు. ‘పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏప్రిల్లో సున్నా వడ్డీ ఇచ్చేవాళ్లం. మేం ఐదేళ్లలో రూ.4,900 కోట్లు ఈ పథకానికి ఇచ్చాం. చంద్రబాబు మేనిఫెస్టోలో వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. పెంచడం కథ దేవుడెరుగు.. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేశారు. ఈయన మేనిఫెస్టోలో చెప్పిన రూ.10 లక్షల ప్రకారం చూస్తే ఈయన ఇవ్వాల్సింది ఏటా రూ.3,500 కోట్లు. ఈ మూడేళ్లలో కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇస్తారని అక్కచెల్లెమ్మలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పొదుపు సంఘాల పరిపతి తగ్గిపోయింది. ఏకంగా రూ.10 వేల కోట్ల రుణాలు తగ్గిపోయాయి. నాబార్డు డేటా ప్రకారం రూ.40 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు తగ్గిపోయాయి. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. వీళ్లు ఇస్తామన్నా సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎగ్గొట్టేశారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు» విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని సీఎం చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడిగాం. కానీ ఒక్క మాట లేదు. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫై చేసి ఇచ్చే వాళ్లం. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. అక్కడి నుంచి పిల్లల కష్టాలు మొదలయ్యాయి. » అసెంబ్లీ జరుగుతుండడంతో ఎక్కడ గొడవవుతుందో అని బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) రూ.1,200 కోట్లు ఇచ్చారు. బీఆర్వో ఇస్తే డబ్బులు ఇచ్చినట్టు కాదని ఆరోజే చెప్పాను. కానీ ఇచ్చింది రూ.300 కోట్లే అంటున్నారు. మొత్తంగా వీళ్లు ఇచ్చింది రూ.2,071 కోట్లు మాత్రమే. అంటే రూ.6,428 కోట్లు ఈ రెండేళ్లకే బాకీ పడ్డారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 4 క్వార్టర్స్కు రూ.700 కోట్ల చొప్పున రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఏప్రిల్ 2026లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి ఈ ఏడాది రూ.3,900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. తొలి రెండేళ్లూ బాకీపడ్డ రూ.6,428 కోట్లు కలిపితే మొత్తంగా రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది బడ్జెట్లో వీళ్లు జరిపిన కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. » ఒక్కో త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.700 కోట్లు ఖర్చవుతుంది. 9 క్వార్టర్స్కు రూ.6,300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతీ ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఎన్నికల కోడ్ రాకతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025.. అంటే రెండేళ్లలో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. ఈ రెండు కలిపితే విద్యా దీవెన కింద రూ.6,300 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు కలిపి మొత్తంగా రూ.8,500 కోట్లు ఇవ్వాలి. కానీ 2024–25 బడ్జెట్లో రూ.1,771 కోట్లు విడుదల చేసినట్టు చూపించారు. » ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? కళాశాల యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు కట్టించుకుంటున్నాయి. కట్టలేని పిల్లలు చదువులు మానేస్తున్నారు. తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. చదువులు మానేస్తున్న పరిస్థితి. అయినా సరే చంద్రబాబుకు మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలైన తర్వాత కూడా ఇవి ఎప్పుడు ఇస్తావని అడిగితే చంద్రబాబు నోటి నుంచి మాట రావడం లేదు. ఆరోగ్యశ్రీకి భారీ బకాయిలు» ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ఆగిపోయింది. 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో నిరసన తెలిపారు. ఆ ఆధునిక దేవాలయాలైన బోధనాస్పత్రులను పూర్తి చేయాలని కోరితే చంద్రబాబు దగ్గర నుంచి స్పందన లేదు. ఆరోగ్యశ్రీ కింద రూ.3,150 కోట్ల బకాయిలు పెట్టారు» 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే మరో రూ.4 వేల కోట్లు కావాలి. అంటే, బకాయిలతో కలిపి చూస్తే రూ.7,150 కోట్లు రాబోయే ఆర్థిక ఏడాదిలో ఖర్చు చేయాలి. చంద్రబాబు బడ్జెట్ కేటాయింపులు మాత్రం రూ.4 వేల కోట్లు చేశారు గానీ, అంతకు ముందు సంవత్సరాలు చూస్తే ఎప్పుడూ కూడా రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నెట్వర్క్ ఆస్పత్రులు ఒకవైపు బంద్ ప్రకటిస్తున్నాయి. తాము అగ్రిమెంట్లు చేసుకోమని నోటీసులు ఇస్తున్నాయి. దీనిపై చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా అనిపించట్లేదు.బాబు కేరాఫ్ క్రెడిట్ చోరీ!» చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రెండే పనులు చేస్తారు. ఒకటి పింఛన్ పంపిణీలో ప్రచారం చేసుకోవడం.. రెండు ఏదో గ్రామానికి వెళ్లిన చోట రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తానని బిల్డప్ ఇస్తారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, టెక్నాలజీ వినియోగం, క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు, భూములను జియో కో ఆర్డినేట్స్తో హద్దులు నిర్ణయిస్తున్నానంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవే.» జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకు థ్యాంక్స్ కూడా చెప్పరు. వాస్తవానికి సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జీయో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? ఇవన్నీ చంద్రబాబు చెప్పరు. » సచివాలయ వ్యవస్థలో 15 వేల మంది సర్వేయర్లు, వారితో పాటు రెవెన్యూ, డిజిటల్ అసిస్టెంట్లు లేకుండా ఈ పనులన్నీ అయిపోయాయా? అంత కష్టపడి పని చేసిన ఉద్యోగులకు కనీసం ప్రోత్సాహకం కల్పించకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏకంగా 50–60 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిపై కనీసం సానుభూతి ప్రదర్శించట్లేదు. సర్వేయర్లకు సస్పెన్షన్లు, వేధింపులు బహుమానంగా ఇస్తున్నారు. చిక్కటి చిరునవ్వులతో ప్రోత్సహించి పనులు చేయించుకోవాల్సిన చోట చావులకు పురిగొల్పుతున్నారు. ఇదీ చంద్రబాబు పాలన.సున్నా వడ్డీకిదిక్కు లేదు» ఒకవైపు సున్నా వడ్డీకి దిక్కు లేదు. మరొకవైపు ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. ఇంకోవైపు హామీలన్నీ మోసాలుగా తేలాయి. ఇవేమీ చేయకుండా మహిళా దినోత్సవం రోజున అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ చంద్రబాబు కోతలు కోస్తున్నారు. మహిళా సాధికారత కోసం మా హయాంలో అమూల్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్, ఐటీసీ, రిలయన్స్ వంటి బహుళ జాతి సంస్థలను తీసుకొచ్చాం.» బ్యాంక్ లింకేజ్తో టై అప్ చేసి ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారి చేయడం కోసం మా ప్రభుత్వ హయాంలో ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర, సున్నా వడ్డీ.. ఇలా అనేక పథకాలు అమలు చేసి అక్కచెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే.. చంద్రబాబు ఇవన్నీ రద్దు చేసి వాళ్లను మోసగించారు. » మా హయాంలో అక్కచెల్లెమ్మలకు రుణాలు ఏటా పెరిగాయి. 2020–21లో రూ.20,808కోట్లు, 2021–22లో రూ.33,568 కోట్లు, 2022–23లో రూ.38,014 కోట్లు, 2023–24లో రూ.49,626 కోట్లకు పెంచుకుంటూ పోతే.. చంద్రబాబు హయాంలో రూ.41,623 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది రూ.30,698 కోట్లకు దిగజారిపోయింది. మహిళా సాధికారత కాదు.. మహిళలను నాశనం చేస్తున్నారు.» త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. కనీసం మేము మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగితే మాట్లాడడు. కానీ, త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్క అక్కచెల్లెమ్మకు ఒక్క గజం స్థలం ఇచ్చాడా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని మంజూరు చేయలేదు. » మేము 31 లక్షల పట్టాలిచ్చి, 21 లక్షల ఇళ్లు మంజూరు చేసి, 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్లకు ఇవ్వకుండా ని«ధులు మళ్లించాడు. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. ఉన్న ఇళ్లను పూర్తి చేయమంటే.. త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటాడు. మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి ఆదివాసీలకు రూ.లక్ష, కొండ ప్రాంతంలో కాకుండా కిందనున్న ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలు, చేనేతలకు రూ.50 వేలు చొప్పున అదనంగా ఇస్తామన్నాడు. రెండేళ్లలో ఒక్కరికైనా ఒక్క పైసా అయినా ఇచ్చాడా? ఇవ్వలేదు. దీనిపై గట్టిగా అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఆయన నోట్లో నుంచి ఒక్క మాట రాలేదు.ఐఆర్ ఏదంటే ఉలకట్లేదు అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటికీ అతీగతీ లేదు. అసలు పీఆర్సీ ప్రస్తావన తేవట్లేదు. నాలుగు పెండింగ్ డీఏలు, డీఆర్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుచేయాలంటూ విజయవాడలో ధర్నా చేస్తుంటే.. అర్ధరాత్రి పూట పోలీసులతో దాడి చేయించి అక్కడి నుంచి ఎత్తించేశారు.పాలు, నీళ్లు తాగినా చావులే!» చంద్రబాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. స్కూళ్లు, హాస్టళ్లల్లో నాణ్యమైన భోజనం కూడా పెట్టట్లేదు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. నాడు–నేడు ఎత్తేయడంతో కలుషితమైన తాగు నీరు, ఆహారం తిని పిల్లలు చనిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థతి. జీరో వెకెన్సీ పాలసీ గాలికి వదిలేశారు. 17 కొత్త బోధనాస్పత్రులను స్కాముల కోసం పనులు నిలిపివేశారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆస్పత్రుల్లో జీఎంపీ మందుల మాట దేవుడెరుగు సాధారణ మందుబిళ్ల కూడా దొరకట్లేదు.కళ్లార్పకుండా అబద్ధాలు » ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేశారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఆపేశారు. గోరుముద్దకు అన్యాయం చేశారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే ప్రభుత్వ స్కూళ్లలో జీఈఆర్ శాతం తగ్గిపోయింది. 2023–24లో దాదాపు 43 లక్షల మంది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తే.. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏకంగా 33 లక్షలకు పడిపోయింది. అంటే 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు.» సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అమలు చేయరు. మా ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. » ఇంత విధ్వంసాన్ని సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ప్రతి జంట ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. చివరికి చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రతి జంటకు రూ.లక్ష ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తారట! చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు.కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేయడంలో చంద్రబాబుకు తగ్గ తనయుడు పుట్టాడు. -
హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్ జగన్
మహిళలకు మళ్లీ మోసం.. సూపర్ సిక్స్, సెవెన్ అని మోసం చేశావ్.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మళ్లను అన్ని విధాలా దగా చేశావ్.. మహిళలకు అందించిన పథకాలన్నీ రద్దు చేశావ్. ఆఖరికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచించావ్.. ఇప్పుడు మరోసారి మభ్యపెడుతున్నావ్.. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలుఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఐఆర్’ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. నాలుగు పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా పోలీసులతో దాడి చేయించారు.నెయ్యిపై దుమారం రేపి.. స్కామ్లుతిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదేనా తాట తీయడం? తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబూ! టీటీడీ చైర్మన్ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో దొరికిపోతే ఏం చేశావ్ బాబూ? కేజీబీవీ ప్రిన్సిపాల్పై టీడీపీ ఎమ్మెల్యే కూన వేధింపుల మీద చర్యలేవి? – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉద్యోగులకు మీరు బకాయి పడిన నిధులు ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదెందుకు?’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ అడుగుతున్నా.. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు. హామీల పేరిట బాకీ పడ్డ సొమ్ములు ఎప్పుడిస్తావు? అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు’ అంటూ నిలదీశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటలు.. పాటలు.. స్కిట్లతో కాలక్షేపం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శిస్తూ.. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. ఆ హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులను వివరిస్తూ.. ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా చూపుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అన్నదాత సుఖీభవ.. నిలుపునా మోసం⇒ పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేలు ఇస్తామన్నాడు (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రూ.6 వేలు కాకుండా ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ప్రదర్శించారు). తొలి ఏడాది ఎగ్గొట్టాడు. రెండో ఏడాది రూ.20 వేలకు గాను అప్పుడో రూ.ఐదు వేలు.. అప్పుడో రూ.ఐదు వేలు ఇచ్చాడు. అంటే రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. మా హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వారి సంఖ్యను 46.85 లక్షల మందికి కుదించేశారు. దాదాపు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఈ బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావు అని అడిగితే అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదు. ⇒ 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూ రెన్స్ ప్రీమియం కట్టి ఉంటే.. కేంద్రం ఇవ్వాల్సింది జత చేసేది. ఆ వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించేవి. ఈ పెద్దమనిషి 2024 జూన్లో ప్రీమియం డబ్బులు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్లు నష్టపోయారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 సీజన్లలో రూ.3,500 కోట్ల మేర బీమా పరిహారం నష్టపోయారు. ఇది ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ అక్టోబర్లో మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే వీళ్ల నోటి నుంచి ఒక్క మాట రాదు. ⇒ మా ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు పెట్టి.. రూ.7,500 కోట్లు వెచ్చించి అండగా నిలిచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. ఏ రైతుకు అయినా తాను వేసిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా పర్యవేక్షిస్తూ ధరలు పడిపోయినా ప్రతిసారీ ఆదుకున్నాం. పైగా ప్రతీ ఆర్బీకేలో ప్రతి పంటకు నిర్దేశించిన మద్దతు ధరలతో బోర్డులు పెట్టి దళారుల వెన్నులో వణుకు పుట్టించేవాళ్లం. అంతకంటే తక్కువ రేటుకు కొనేందుకు సాహసిస్తే.. వెంటనే స్పందించేవాళ్లం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమా.. రైతులంటే ఇంత చులకనేంటయ్యా.. అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు.ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు⇒ గతేడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, శనగలు, మిర్చి, టమాటా, చీనీ, పత్తి అన్ని పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్లీ మిర్చి, శనగ, అరటి, మొక్కజొన్న పంటలకు ధరలు పడిపోయాయి. నెల క్రితం క్వింటా రూ.26 వేలున్న మిర్చి.. ఈ రోజు రూ.18 వేలకు పడిపోయింది. శనగ కనీస మద్దతు ధర రూ.5,875.. రైతులకు రూ.5 వేలకు మించి రావడం లేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 అయితే, రైతులు కేవలం రూ.1400–1500కు అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క పంటపైనే రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు.⇒ అరటి ఈ ఏడాది కూడా టన్ను రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో టన్ను రూ.30 వేలు పలుకగా, ఈ రోజు రూ.5 వేలకు తెగనమ్ముకుంటున్నారు. టమాటా కిలో రూ.2కు అమ్ముకోవాల్సి వస్తోంది. బత్తాయి, పుచ్చకాయ, మస్క్మెలన్, సజ్జలు ఇలా అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి రైతులకు తోడుగా నిలవాల్సింది పోయి బడ్జెట్లో రూ.300 కోట్లు పెట్టారు. ఇంత తక్కువ ఎందుకు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు.⇒ రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. అసెంబ్లీలో వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉందంటే.. వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. వీరికి పరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగితే అసెంబ్లీలో ఒక్క మాట చెప్పలేదు. కనీసం వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించడం, వారికి భరోసా కల్పించడం మచ్చుకైనా చేయలేదు. మరో 7.46 లక్షల పింఛన్లు కోత వేయబోతున్నారు⇒ 2024 ఎన్నికల షెడ్యూల్ నాటికి మార్చిలో మేము ఇచ్చిన పింఛన్ల సంఖ్య 66,34,372. ఈ నెలలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య 60,69,664. అంటే ఇప్పటికే 5,64,708 పింఛన్లు కట్ చేశారు. 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి పింఛన్లు ఇస్తే.. మార్చిలో 60,69,664 మందికి ఇచ్చారు. అంటే ఈ ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ఇలా ప్రతీ నెలా పింఛన్లు కట్ చేసూ్తనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.⇒ కొత్త పింఛన్ల మంజూరు కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా హయాంలో ప్రతి ఆర్నెల్లకోసారి జూన్, డిసెంబర్లలో పింఛన్లు అప్డేట్ చేసే వాళ్లం. ఈరోజు ఆ పరిస్థితి కన్పించడం లేదు. కనీసం మార్చిలో ఇచ్చిన పింఛన్ల సంఖ్యను బట్టి చూసినా ఈ ఏడాది బడ్జెట్లో రూ.31,554 కోట్లు పెట్టాలి. కానీ బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.27,719 కోట్లు. అంటే మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బడ్జెట్లో ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో చెప్పాలని అడిగాం. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా లేదు.తల్లికి వందనం పేరిట దగా⇒ తల్లికి వందనం కింద చదువుకునే ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని కత్తిరించారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ–యూడైస్) ప్రకారం 2023–24లో బడికి వెళ్లే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. కానీ ఇచ్చింది 67 లక్షల మందికే.తల్లికీ వంచనే.. యూడైస్ ప్లస్ ప్రకారం 87,41,885 మంది పిల్లలకు తల్లికి వందనం కింద రూ.13,112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.8,456.48 కోట్లు మాత్రమే ⇒ పైగా ఏ ఒక్కరికి రూ.15 వేలు ఇవ్వలేదు. కొంత మందికి రూ.8 వేలు, మరికొంత మందికి రూ.9 వేలు, ఇంకొంత మందికి రూ.10 వేలు, అక్కడక్కడా అతి కొద్ది మందికి రూ.13 వేలు చొప్పున ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులతో పాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. తీరా ఇప్పుడు షరతులు పెట్టారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు. ⇒ దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్కే ఇచ్చి మిగిలిన రెండు సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టారు. గ్యాస్ కంపెనీల డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 59 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్కు రూ.855 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తొలి ఏడాది రూ.786 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్లో రూ.2,199 కోట్లుగా చూపించారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఈ బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. మరి రూ.12 వేల కోట్లకు గానూ ఇచ్చింది సగం కూడా లేదు. ఈ పథకం కింద మహిళలకు రూ.6,144 కోట్లు బాకీ పడ్డారు. ఈ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని అడిగితే నోరు మెదపడం లేదు.నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైంది?⇒ యువగళం పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా రూ.36 వేల చొప్పున మూడేళ్లకు ప్రతి నిరుద్యోగికి బాకీపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే నోరు మెదపడం లేదు. ఆడబిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు 1,78,99,440 మంది ఉండగా.. ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు ⇒ సూపర్ సిక్స్లో రెండో కీలకమైన హామీ..18 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1,78,99,440 మంది అర్హులు. వీరికి ప్రతి నెలా రూ.1,500.. ఏడాదికి రూ.18 వేలు చొప్పున మూడేళ్లకు బాకీ పడ్డ రూ.54 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ⇒ మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ పథకం. ఈ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు..ఇలా మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మాట్లాడటం లేదు.ప్రతినెలా 25 వేలకు పైగా పింఛన్ల కోత వైఎస్ జగన్ 2024 మార్చిలో 66,34,372 మందికి పింఛన్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పింఛన్లు ఇచ్చినది 60,69,664 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే బకాయిలతో కలిపి రూ.7,150 కోట్లు కావాలి. బడ్జెట్లో రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు గతంలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లైనా లేదు. పిల్లల చదువులెలా సాగుతాయి? ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద బకాయిలతో కలిపి మొత్తం రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. పెన్షన్లు కటింగ్...50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. మరోవైపు సామాజిక పెన్షన్లు ఇప్పటికే 5,64,708 కట్ చేశారు. ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ప్రతీ నెలా పింఛన్లు కట్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛనూ ఇవ్వలేదు. పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను బట్టి మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇంకెప్పుడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు పచ్చ పత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన అన్నదాతకు దగా...పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నాడు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి తూట్లు పొడిచారు. రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆటపాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఇళ్లపై దొంగ మాటలు..మేం 31 లక్షల పట్టాలిచ్చి 21 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. కనీసం మేం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్క అక్క చెల్లెమ్మకైనా గజం స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు.ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకూ థ్యాంక్స్ చెప్పరు. సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? -
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే మార్గాలను పార్టీ రంగుల తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్పీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా పార్టీ పతాకాలు ఎగుర వేయాలని కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో నేతలు, అభిమానులు, కార్యకర్తలు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. -
'ప్రజాహితమే' పరమావధి
ప్రజాహితమే పరమావధిగా, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్సీపీ. 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద ఒక్కడితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలు, నిరు ద్యోగ వర్గాల సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ వచ్చారు. మొగ్గలోనే తుంచేసేందుకు కుట్రలు నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది జగన్ సిద్ధాంతం. వైఎస్సార్సీపీలో ఎవరైనా చేరాలంటే... వారు ఉంటున్న పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్ర మించిన పదవులకు రాజీనామా చేసి... వైఎస్సార్సీపీలో చేరారు. ఖాళీ అయిన 19 శాసనసభ, నెల్లూరు లోక్సభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి 2012 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన కాంగ్రెస్, టీడీపీ అధిష్ఠానాలు కుమ్మక్కై కుట్రకు తెరతీశాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ను విచారణ పేరుతో పిలిపించిన సీబీఐ 2012 మే 27న అరెస్టు చేసింది. జగన్ ను అక్రమంగా నిర్బంధించడం ద్వారా ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించాలన్నది ఆ పార్టీల పన్నాగం. ఏ కేసులోనైనా అరెస్టయిన వారికి 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలన్నది నిబంధన. కానీ 16 నెలల పాటు జైలులో అక్రమ నిర్బం«ధం వల్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్సీపీని జగన్ బరిలోకి దించారు. 67 శాసనసభ స్థానాలు, ఏడు లోక్సభ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ బలమైన ప్రతి పక్షంగా అవతరించింది. టీడీపీ అరాచకాలను నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా ఇటు శాసనసభలో, అటు బయటా రాజీలేని పోరాటాలు చేశారు. వైఎస్సార్సీపీ బలీయమైన శక్తిగా మారుతుండటాన్ని చూసి ఓర్వలేని నాటి సీఎం చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా కుట్రలు చేశారు. ఫిరా యించిన ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువలకు సమాధి కట్టారు. దీన్ని నిరసిస్తూ... ప్రజల్లోనే తేల్చుకుంటానని ప్రకటిస్తూ 2017 అక్టోబర్ 26న శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో, మండుటెండలో, కుంభ వృష్టిలో 14 నెలలపాటు 3,648 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాలను ఒక పార్టీ దక్కించుకున్న దాఖలాలు ఇదివరకు లేవు. సువర్ణాక్షరాల సుపరిపాలనవైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించడంతో 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్న ఏకైక పార్టీగా వైఎస్సార్సీపీ నిలిచింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసు కొచ్చారు. వికేంద్రీకరణతో సుపరిపాలన అందించారు.తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి... 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరించారు. నామి నేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. దేశ చరిత్రలో సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చెప్పింది వైఎస్సార్సీపీ ఒక్కటేనని సామాజిక వేత్తలు ప్రశంసించారు.అనునిత్యం ప్రజల్లోనే...అయితే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కట్టడం... ‘సూపర్ సిక్స్’తో పాటు 143 హామీలు ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయింది. అయినా అనునిత్యం వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ తమ విధానం ప్రజాపక్షమని చాటి చెబుతున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే కక్ష సాధింపు చర్యలు, విధ్వంసం, హత్యాకాండకు దిగింది. ఈ అరాచక పాలనను దేశానికి చాటి చెప్పేందుకు 2024 జూలై 24న ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా నిర్వహించారు. గత 22 నెలలుగా రైతు సమస్యలు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున పోరాటాలు చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పాటుపడుతున్నారు.– సాక్షి, అమరావతి బ్యూరో -
భవానీపురం దర్గా ఉరుసు ఉత్సవాలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: విజయవాడ భవానీపురంలో దర్గా ఉరుసు ఉత్సవాలు రేపటి నుంచి (గురువారం) జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దర్గా ముజావర్ల కమిటీ ఆహ్వానించింది. సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్, చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ కూడా ఉన్నారు. -
కదిరి రథోత్సవం తొక్కిసలాటపై జగన్ రియాక్షన్
-
చంద్రబాబు ఉప ప్రధానా..! ఓ రేంజ్ లో ఇచ్చి పడేసిన జగన్
-
కావూరి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు.Deeply saddened by the passing of former Union Minister and senior leader Sri Kavuri Sambasiva Rao Garu. My heartfelt condolences to his family members. May his soul rest in peace. pic.twitter.com/uhnHH6ljNG— YS Jagan Mohan Reddy (@ysjagan) March 11, 2026 -
మా 11 మంది దమ్ము ఏంటో అర్థమైందా.. వెళ్తూ వెళ్తూ పవన్ కి ఇచ్చిపడేసిన జగన్
-
బాబును సీఎంగానే భరించకపోతున్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని అన్నారు.ఇక, అంతకుముందు.. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. వైఎస్ జగన్ స్పందిస్తూ.. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పుకొచ్చారు. -
BR నాయుడు రాసలీలలుపై వైఎస్ జగన్ రియాక్షన్
-
ఎదో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు.. ఆటలు, పాటలు, డాన్సులు.. రఘు రామ వేషాలు..
-
బీఆర్ నాయుడు, జనసేన శ్రీధర్పై చర్యలేవి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్యలేవి? అని నిలదీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.లిస్ట్ ఇదే.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్ఐ, పాస్బుక్ క్యూఆర్ కోడ్ భూమలు జియో ట్యాగింగ్ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
అన్నదాత సుఖీభవ 20 వేలు ఇస్తా.. లైవ్ లో చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వైఎస్ జగన్..
-
15 వేల మాట దేవుడెరుగు.. తల్లికి వందనం డబ్బులు ఎక్కడ అని అడిగితే..
-
చంద్రబాబు, పవన్ కలిసి లోకేష్ ను జాకీలు పెట్టి మరీ లేపుతారు.. కానీ ఏం లాభం..
-
YSRCP ఐదు ఏళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు 2 ఏళ్లలో చేసేసాడు
-
బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
టీడీపీ ఏడాదిలో చేసిన అప్పులు.. ఆధారాలతో బయట పెట్టిన వైఎస్ జగన్


