నేడు వైఎస్‌ జగన్‌ భీమవరం పర్యటన | YS Jagan Bhimavaram Tour Updates | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్‌ భీమవరం పర్యటన

Feb 5 2026 8:53 AM | Updated on Feb 5 2026 10:15 AM

YS Jagan Bhimavaram Tour Updates

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అనంతరం పెదఅమిరం చేరుకుని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు.

రేపు జోగి రమేష్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ
టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్‌ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30కు తాడేపల్లి నివాసం నుంచి జగన్‌ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు. కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శి­స్తారు. వైఎస్‌ జగన్‌ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement