breaking news
YS Jagan Mohan Reddy
-
సెప్టెంబర్లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం
-
ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్ జగన్ (ఫొటోలు)
-
2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం
-
YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్
-
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.బుధవారం పర్చూర్ నియోజకవర్గ కేడర్తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్లో లేదంటే అక్టోబర్లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో ఏపీలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్కు పాదయాత్రలు కొత్త కాదు. 2017లో ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైఎస్సార్సీపీ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి యాత్రను ప్రారంభించారు. సుమారు 341 రోజులపాటు సాగిన ఆ యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. ఆనాడు మొత్తం 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా..పాదయాత్రలో భాగంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సామాజిక వర్గాలతో జగన్ నేరుగా మమేకమయ్యారు. టీడీపీ ప్రభుత్వ పాలనలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూనే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. యాత్ర ముగిసే సమయానికి దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో మమేకమైనట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. 2019లో అధికారంలోకి..ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన కొద్ది నెలలకే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆయన రాజకీయ జీవితంలోనే కీలక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పాదయాత్ర ప్రకటన చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. -
మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా? -
పర్చూరుపై జగన్ ఫోకస్.. నేతలతో కీలక భేటీ
-
కాకినాడ నిరుద్యోగులపై కేసులు.. వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
నేడు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారితో అక్కడ పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. -
‘బాబూ.. జాబులేవి?’ అని అడగడమే నేరమా?
సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఆయన ట్వీట్లో ఇంకా ఏమన్నారంటే... నిరుద్యోగ యువతపై కేసులా? మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్యామ్, టి.రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేష్తో పాటు 20 మంది పోలీసు నిరుద్యోగులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆంధ్రప్రదేశ్లో నేరంగా మారిందా?. అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చంద్రబాబూ?ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేశ్ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేరస్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?. యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ చంద్రబాబు గౌరవించలేదు వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పిం చాలన్న చిత్తశుద్ధి ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. -
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
తాడేపల్లి : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ’ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు వైఎస్ జగన్. ‘కాకినాడలో మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై కక్షపూరితంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. శ్యామ్, టి.రాజా, ఎం.గంగా సూరిబాబు, రాజేష్తో పాటు 20 మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేయడం దారుణం. ‘‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడం, ఉద్యోగాల భర్తీ కోరడమే వారు చేసిన నేరమా?, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా నేరంగా మారిందా?, అధికారంలోకి రావడానికి యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు. . మూడేళ్లకు రూ.21,600 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా..యువతను మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోంది. మెగా డీఎస్సీ స్కాంలో రోజుకో కొత్త ఆధారం బయటపడుతున్నా..సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ అణచివేత, సెన్సార్షిప్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ ఇస్తూ నిజమైన నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ అడిగితే మాత్రం కేసులా?, ఇది కూటమి ప్రభుత్వ యువత వ్యతిరేక, ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరికి నిదర్శనం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రిక్రూట్మెంట్ స్కాంలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల్లో అక్రమాలు పరిపాటిగా మారుతున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలను గౌరవించడం టీడీపీకి ఎప్పుడూ చేతకాలేదు. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించడం కంటే.. అవినీతి, రాజకీయ మాయాజాలానికే ప్రాధాన్యం ఇస్తోంది.నిరుద్యోగ యువతపై నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.Cases were…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 8, 2026 డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
రేపు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (09.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. -
ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ‘డైవర్షన్’ రాజకీయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా సెంటిమెంట్ రాజకీయాలను పండించడానికి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల కార్యక్రమాలను అమలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తొలుత వెలుగొండ ప్రాజెక్టు నుంచి , ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాని ఆ సందర్భంగా ఆయన అనుసరించిన పద్దతులు, చేసిన ప్రసంగాలు చూస్తే , డైవర్షన్ రాజకీయాలలో భాగమేనా అన్న సందేహం కలుగుతుంది. స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో ఉండవచ్చు. కాగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ ఎలా చేశారో అంకెలతో సహా జగన్ వివరించారు. ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వకు గ్రావిటీ ద్వారా కాకుండా, అప్పటికే అమలులో ఉన్న పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని తోడి ఈ కాల్వలో పోసి అదేదో ప్రాజెక్టు పూర్తి అయినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారని జగన్ విమర్శించారు. దీనిని గమనిస్తే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి తంటాలు పడుతున్నట్లు అవుతుంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చి ,సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దానిని ప్రజలు విశ్వసించడం లేదు. అంతా ఆశ్చర్యంగా ఇదేమిటి ఇలా చెబుతున్నారేమిటా అని చర్చించుకుంటున్నారు. మరో వైపు రెడ్ బుక్ పేరుతో పోలీసుల ద్వారా అరాచకాలు సాగుతున్న వైనం ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తోంది. ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసిందన్న ఆగ్రహంతో ఉన్నారు.విశాఖలో డేటా సెంటర్ల పేరుతో జరిగే కాలుష్య విధ్వంసంపై మేదావులు గళమెత్తుతున్నారు. అమరావతిలో మాత్రం వేల కోట్ల అప్పులు తెచ్చి అదిక అంచనాలతో నిర్మాణాలు జరుగుతున్న తీరుపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. జగన్ మావిగన్ (విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం) కారిడార్ అభివృద్దిని ప్రతిపాదించడంతో ఇరుకున పడ్డ చంద్రబాబు దానిని ఆవిగన్గా (అమరావతి, విజయవాడ, గుంటూరు) మార్చుకున్నారు. అయినా ఖర్చు మాత్రం కేవలం 29 గ్రామాల పరిదిలోనే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. డిఎస్సి అక్రమాలతో సహా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు చికాకుగా మారాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతోందన్న భావన ఏర్పడింది. ఈ నేపధ్యంలో వాటిని కొంతమేర పక్కదారి పట్టించి ప్రజలలో ప్రాజెక్టులకు సంబందించి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల కార్యక్రమాలు పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. లేకుంటే వెలిగొండలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం చేయకుండా, హడావుడిగా నీటిని విడుదల చేశారు. ఆ ప్రాజెక్టు మొత్తం తన ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. దానిపై జగన్ వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు.ఇక ఆ వెంటనే పోలవరం ఎడమ కాల్వకు నీరు అంటూ మరో ప్రోగ్రాం నిర్వహించారు. నిజంగానే పోలవరం ప్రాజెక్టు అందరూ ఆశించినట్లు పూర్తి చేసి,నీటి విడుదల జరిగి ఉంటే అంతా సంతోషిస్తారు. కాని గతంలో చంద్రబాబు హయాంలో పెట్టిన పుష్కర స్కీమ్ మోటార్లను వాడి కాల్వలో నీటిని పారించారట. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుకార్చినట్లు అవుతుందన్న భయం ప్రజలలో ఏర్పడుతోంది. మార్కాపురం వద్దకాని, అనకాపల్లి జిల్లా పాయకరావు పేట వద్ద కాని, ఆయన పంచెకట్టుతో రావడం, సాశ్టాంగ నమస్కారం చేయడం, సభికులతో గోదావరి నీళ్లు వచ్చాయి అంటూ గట్టిగా చెప్పించడం, రకరకాల సెంటిమెంట్లను చొప్పించడం వంటివి చేశారు. నిజంగా ఎడమ కాల్వను ఆయనే నిర్మాణం చేపట్టి ఉంటే చెప్పుకోవచ్చు. కాని ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్వలు తవ్వించడంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక దశకు చేరిందన్నది వాస్తవం. కాకపోతే చంద్రబాబుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తడం ఇష్టం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఎడమ కాల్వకు మోటార్ల ద్వారా నీరుఎత్తిపోయవలసిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వస్తుంది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అంటే అంతగా ఆసక్తి లేని చంద్రబాబు, గత టరమ్ లో పట్టిసీమ లిఫ్ట్ ను పెట్టి హడావుడి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కుడి కాల్వ ద్వారా నీటిని విజయవాడ వద్ద కృష్ణానదికి తీసుకువెళ్లారు. అప్పట్లోనే పట్టిసీమ కాకుండా పోలవరానికి ఆ డబ్బు ఖర్చు చేసి సత్వరమే ప్రాజెక్టును సిద్దం చేయాలని అనేక మంది సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదు.ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల ద్వారానే నీటిని తరలిస్తున్నానని చెప్పుకోవచ్చేమో కాని, దానివల్ల జరిగే నష్టం గురించి తెలుసుకోవాలి. ఈ సీజన్ లో పట్టిసీమ ద్వారా నీటిని తరలించి కృష్ణా డెల్టాకు సాగుకు అందిస్తున్నామని గొప్పగా ప్రకటించారు. పూజలు కూడా చేశారు.కాని ఆ తర్వాత గోదావరిలో నీరు తగ్గడంతో పట్టిసీమ నుంచి నీరు రావడం తగ్గిపోయింది. దాంతో కృష్ణా డెల్టాలో సైతం పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రస్తుతం పుష్కర మోటార్లను వాడి నీటిని విడుదల చేశారు. కాని ఈ నీరు పూర్తిగా రైతులకు అందడానికి ఇంకా సమయం పడుతుంది. మోటార్లపైనే ఎప్పటికీ ఆధారపడడం అంత మంచిది కాదని అనుభవం చెబుతోంది. అలాగే ఉత్తరాంద్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. కాకపోతే జనాన్ని ప్రస్తుతానికి మభ్య పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ పోలవరంపై డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. పురుషోత్తపట్నం పంపులతో నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టు నుంచి ఇచ్చినట్లు ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ పంపులు కొత్తవి కావని, ఇప్పటికే ఉన్నవే కదా అని అంటూ, అయినా ఈ డ్రామా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు పురుషోత్తమపట్నానివి అయితే, కాల్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చేసిందేమిటని అన్నారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లా? లేక 41.15 మీటర్లకే పరిమితమా? అని జగన్ సూఠిగా అడిగారు.ఈ అంశంపై చంద్రబాబు స్పందించగలిగితే బాగుంటుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పై ప్రేమ అంతా ప్రసంగాలకే పరిమితమా అని జగన్ ఎద్దేవ చేశారు. ఒక వేళ 41.15 మీటర్ల వద్దే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతే ఈ కాల్వల ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.మరో వైపు పోలవరం నిర్వాసితుల కాలనీలలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎడమ కాల్వ నీటి విడుదలపై కామెంట్ చేస్తూ 26 నెలల్లో ఎడమ కాల్వ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన ఉంటే ఇలా వ్యాఖ్యానిస్తారా అని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో టైమ్ లో భూ సేకరణ, ఆ తర్వాత కాల్వ తవ్వకం, తదితర నిర్మాణాలు సాద్యమవుతాయా అని వారు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమరావతి వ్యయం జనానికి కన్పించకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేయడం లేదని ప్రచారం చేసుకోవడానికి ఈ నీటి విడుదల కార్యక్రమాలు నిర్వహించారా అన్నది చర్చగా ఉంది. అదే లక్ష్యం అయితే ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అవుతుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా? -
ఉమ్మడి జిల్లాకు పనిచేయడం అదృష్టం
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్ పర్సన్గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు. జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్ అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: మీరు నిజమైన రైతులేనా! -
చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు
-
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్రెడ్డి
వైఎస్సార్ జిల్లా: డీఎస్సీని సక్రమంగా నిర్వహిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగం రావడం ఏమిటని ప్రశ్నించారు. సాఫ్ట్ బాల్ సంఘం వ్యక్తి భార్యకు ఉద్యోగం రావడం ఏమిటి? అని అన్నారు.‘‘నిజాలు బయటకు వస్తే మీరు దోషులుగా నిలబతారనే భయం మీకు ఉంది. అసమర్థ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి. ఏదో ఒక రోజు మీరంతా చట్టం ముందు నిలబడాల్సిందే. చర్చకు రమ్మని మాపై సవాలు విసరడం కాదు. ఫిర్యాదు చేసిన 30,000 మందితో చర్చ పెట్టు. నీకు నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే వాటికి సమాధానం చెప్పు. వాస్తవాలు చెప్తూ తప్పుని ఎత్తిచూపితే సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్లు చెప్పుకునే గొప్పలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లాలని ఈ కుట్ర. వాళ్ల తప్పులు బయటకు రాకూడదని మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు టీడీపీటీడీపీ నాయకులు పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. విచ్చలవిడిగా సంపాదించిన డబ్బు వారి వద్ద ఉందని తెలిపారు. మేము వైఎస్సార్సీపీ, వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలు చూపి ముందుకు వెళ్తున్నాం. కార్యకర్తలంతా సమష్టిగా ఎన్నికలలో పనిచేయాలి. ప్రభుత్వం అన్ని రకాలా విఫలమైంది. సాగు, తాగు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పతి చేస్తుంటే మన ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుంది.రాయలసీమలో ఒక్క రిజర్వాయర్కూ నీళ్లు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వేధించిన అందరం సమష్టిగా ఎదుర్కొందాం. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాం’’ అని తెలిపారు. -
సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు
చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ నెగ్గిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ రెడ్డి-చిరాగ్ శెట్టికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. "చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్స్గా నిలిచినందుకు మీకు అభినందనలు. మీ కమ్బ్యాక్ నిజంగా ఒక అద్భుతం. మీ పట్టుదల, దృడ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణం. రాబోయే సంవత్సరాల్లోనూ మీ జోడీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on becoming the first Indians to win the China Masters Super 750 title with a spectacular comeback. Your grit, resilience, and fighting spirit have made the entire nation proud. Wishing you both many more… pic.twitter.com/Rm9Ia0Vzew— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2026ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్కు చేరింది.Read: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు.. లోకేష్ బండారం బట్టబయలు
-
DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?
-
వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!
-
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
-
బాబూ.. దేనికి భయం?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారానికి సంబంధించి రోజురోజుకూ మరిన్ని ఆధారాలు బయట పడుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. వాటన్నింటిపై వెల్లువలా తలెత్తే అన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. అంతా పారదర్శకంగా జరిగిందన్నప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీ కెందుకింక భయం? అని ప్రశ్నించారు. డీఎస్సీ స్కామ్పై ప్రతిపక్షంతో పాటు గళం విప్పిన కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను మెటా ద్వారా ఎందుకు బ్లాక్ చేయిస్తున్నారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయితీగా, పారదర్శకంగా జరిగాయని అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..వెలుగులోకి కొత్త ఆధారాలు, వాస్తవాలు ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయట పెడుతూ, సీఎం చంద్రబాబు వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరో వైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియో బ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్స్టాగ్రామ్లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్తో పాటు డీఎస్సీ స్కామ్పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్! వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.ప్రజలకు సమాధానం చెప్పండిచంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచి వేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.ఉత్తీర్ణులు కాకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలా?డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీవోలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీవోలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీవోల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా? అందుకే నియంతృత్వ సెన్సార్షిప్లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్యమ ఖాతాను, పోస్టును, కంటెంట్ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండిచంద్రబాబుకు.. ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నా. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయట పడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలి. అంతే కాకుండా వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి. వాటి సెన్సార్షిప్ను ఆపండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ విచారణకు ఆదేశించండి. అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింకా భయం?’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్
-
బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హలో ఇండియా.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. డీఎస్సీ కుంభకోణం, కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాలను కనపడకుండా చేయడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. డీఎస్సీ 2025 నియామక కుంభకోణంలోని అంశాలు రోజురోజుకూ బయటపడున్నాయని చెప్పారు.‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తూ తీవ్రమైన అక్రమాలను బయటపెడుతున్నాయి. దీనిపై నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు నిజానిజాలు వెలుగులోకి రావడానికి సీబీఐ విచారణకు అంగీకరించాల్సింది పోయి, టీడీపీ కూటమి ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తును నిరాకరిస్తోంది. ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.మెటా సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో డీఎస్సీ నియామక కుంభకోణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష పార్టీలు, మీడియా వేదికలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల పోస్టులు, ఖాతాలను పరిమితం చేయడం, తొలగించడం లేదా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లో కనిపించకుండా చేయడం జరుగుతోంది. ఇందుకు మెటా “చట్టపరమైన అవసరాలు” కారణంగా పేర్కొంటోంది’’ అని వైఎస్ జగన్ తెలిపారు.‘సోషల్’ ఖాతాలపై ఆంక్షలు ఈ ఆంక్షలకు గురైన ఖాతాల పేజీల్లో ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్స్టాగ్రామ్లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగన్అన్న కనెక్ట్స్తో పాటు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇతర వ్యక్తిగత ఖాతాలు కూడా ఉన్నాయని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘ఇది కేవలం డీఎస్సీ కుంభకోణంతో ఆగిపోవడం లేదు. అవినీతి, వైఫల్యాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలులో వైఫల్యం, అధికార దుర్వినియోగం లేదా అధికార అహంకారంపై టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్ర శ్ని స్తోందిప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు ప్రశ్నలు అడిగేవారి గొంతును అణచివేస్తున్నారు. ఇది పాలన కాదు. ఇది సెన్సార్షిప్. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నాయి. రాజకీయంగా అసౌకర్యంగా ఉన్న ప్రశ్నలు అడుగుతున్నారనే కారణంతో ప్రతిపక్షాన్ని, మీడియాను, కార్యకర్తలను లేదా పౌరులను నోరు మూయించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు’’ అని వైఎస్ జగన్ తెలిపారు.దేనికి భయపడుతున్నారు?చంద్రబాబు నాయుడు దేనికి భయపడుతున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నలకా? సమాధానాలకా? అని అన్నారు. ‘‘డీఎస్సీ నియామకంలో ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్న ఆధారాలు తప్పు అని మీరు చెబుతున్నట్లయితే, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. సీబీఐ విచారణను ఎందుకు నిరాకరిస్తున్నారు? ఈ ఆరోపణలను బయటపెడుతున్న వారి గొంతులను ఎందుకు అణచివేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు పరిమితం చేస్తున్నారు?ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలను తొలగించలేరు. ఒక ఖాతాను నిరోధించినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి, రాజ్యాంగబద్ధంగా పాలించండి. డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?’’ అని నిలదీశారు.అవినీతి వాసనను వెదజల్లుతున్నాయి క్రీడా కోటాకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, నియామకాల తర్వాత ఆ క్రీడా కోటా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ‘‘అయినా ఆ ఉత్తర్వుల కింద నియమితులైన అభ్యర్థులు ఇప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగడం, నియామకాలకు ముందు మార్గాలను తెరిచి, నియామకాల తర్వాత మార్గాలను మూసివేయడం. ఇవన్నీ అవినీతి వాసనను వెదజల్లుతున్నాయి.ఈ సెన్సార్షిప్ చర్యల్లో పరిమితం చేసిన ప్రతి ఖాతా, పోస్టు, కంటెంట్ను వెంటనే పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నాను. డీఎస్సీ 2025 నియామకాలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరిగాయని మీరు చెబుతున్నట్లయితే, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని చంద్రబాబు నాయుడిని, ఆయన ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నాను.స్వతంత్ర దర్యాప్తు నిజానిజాలను తేల్చనివ్వండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఆరోపిత అక్రమాలకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. ఖాతాలను పునరుద్ధరించండి. సెన్సార్షిప్ను ఆపండి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి. దాచాల్సిందేమీ లేకపోతే, దేనికి భయపడుతున్నారు?’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Hello India!The DSC 2025 recruitment scam is unravelling day by day, with fresh evidence and facts surfacing from different parts of the state, exposing serious irregularities and raising questions that the @ncbn -led TDP coalition government must answer. Instead of answering… pic.twitter.com/bVD6zHDFDC— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2026 -
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: టీచర్స్ డే సందర్భంగా గురువులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన భవిష్యత్తుకు నిజమైన శిల్పులు ఉపాధ్యాయులే. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో కలలను రేకెత్తించి.. విలువలను పెంపొందిస్తూ మంచి భవిష్యత్తును నిర్మించుకునే.. ఆత్మవిశ్వాసాన్ని కల్పించేది గురువులే’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. చిన్నారులను జ్ఞానవంతులుగా, సాధికారులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ప్రతి గురువుకీ హృదయపూర్వక అభినందనలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.On the occasion of #TeachersDay, I extend my heartfelt greetings and gratitude to all our teachers.Teachers are the architects of our future. Beyond imparting knowledge, they inspire dreams, instil values and give our children the confidence to shape a better tomorrow.My…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2026 -
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
-
అక్షరాస్యతపైనా అబద్ధాలా?
సాక్షి, అమరావతి : అక్షరాస్యతపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘వాస్తవ పరిస్థితులను, గణాంకాలను వక్రీకరిస్తున్నారు. అధికారిక గణాంకాలు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా స్పష్టం చేస్తుంటే.. విద్యా శాఖ మంత్రి మాత్రం 82.1 శాతం అంటూ ప్రచారం చేయడం వెనుక ఉన్న లెక్కల మతలబు ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇంకా పూర్తికాని 2026 సంవత్సరానికి అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..2026 ఏడాది అక్షరాస్యత గణాంకాలు ఏ సంస్థా విడుదల చేయలేదు ‘సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పుడు సమాచారంతో ప్రచారం చేసుకుంటోందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. కానీ 2026 కేలండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటి వరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తి కాలేదు. మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ఆధారంగా పీఎల్ఎఫ్ఎస్ (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) 2023–24 వార్షిక నివేదికను రూపొందించారు. జూన్ 2023 నుంచి జూన్ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 72.6 శాతం. 2018–19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023 – 24 నాటికి 72.6 శాతానికి చేరింది. అలాగే, జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన పీఎల్ఎఫ్ఎస్ కేలండర్ ఇయర్ 2025 వార్షిక నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారు. ఈ అధికారిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమే.యూడైస్ గణాంకాల ప్రకారం వైఎస్ జగన్ హయాం(2023–24)లో, చంద్రబాబు హయాం (2025–26)లో రాష్ట్రంలో విద్యార్థుల వివరాలు టీడీపీ ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన యూడైస్ (యూడీఐఎస్ఈ) గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైంది. విద్యాశాఖ మంత్రి ‘రెడ్బుక్ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిది’ అని వైఎస్ జగన్ హితవు పలికారు. -
మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డీఎస్సీ–2025 కుంభకోణం తీగ లాగితే అక్రమాల డొంకలు కదులుతున్నాయని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో జరిగింది మెగా డీఎస్సీ కాదు, యువగళం డీఎస్సీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని.. చంద్రబాబు, లోకేశ్ల పాపాలు ఒక్కటొక్కటిగా బట్టబయలవుతున్నాయని చెప్పారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, అది నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ అని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అధికార బలం, అనుకూల మీడియా సాయంతో చేసిన పాపాలను ఎంతకాలం కప్పిపుచ్చగలరు? టెట్ పరీక్షలో పాస్ అవ్వని వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా లోకేశ్కే దక్కుతుంది. రాజకీయ పార్టీలు కాదు.. స్వయంగా ప్రజలే శోధించి డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. డీఎస్సీ అంటే తెలుగుదేశం అని ప్రగల్భాలు పలికిన వాళ్లకు ప్రజలు చెంపపెట్టు లాంటి నిజాలు చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మొదలైన డీఎస్సీ అక్రమాల డొంక చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకూ పాకింది’ అని నిప్పులు చెరిగారు. నారా లోకేశ్ తన ‘యువగళం’ కోటా కింద, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అర్హత లేని తమ వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ–2025లో ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్, కేటగిరీ, సబ్జెక్ట్ అర్హత, కేటాయించిన పోస్టును కంప్యూటర్ ఆధారంగా క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అని నాని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయుడులకు నిజాలు బయటపెట్టే దమ్ముందా? అని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో సమర్పించిన సర్టిఫికెట్లను, ముఖ్యంగా జరగని ఈవెంట్లకు సంబంధించినవిగా ఆరోపణలు వస్తున్న సర్టిఫికెట్లను పూర్తి స్థాయిలో వెరిఫై చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాని ఇంకా ఏమన్నారంటే..టెట్ పాస్ కానివాడికి టీచర్ ఉద్యోగమా?» కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. నిన్నటిదాకా అసలు తప్పే జరగలేదన్న ఈ పాలకులు, ఇవాళ 16 వేల మందిలో ఒక్క తప్పు జరిగిందని తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలే శోధించి ఆధారాలతో సహా లోకేశ్ బండారాన్ని బద్దలు కొడుతున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం టీచర్ ఉద్యోగం రావాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఏ కోటాలో వచ్చినా ఈ నిబంధన వర్తిస్తుంది. » బీసీలకు 75 మార్కులు రావాల్సి ఉండగా, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఒల్లూరు ప్రాథమిక పాఠశాలలో కేవలం 65 మార్కులు వచ్చిన ప్రభాకర్ అనే వ్యక్తికి ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారు? 150 మార్కులకు కనీస అర్హత సాధించని అభ్యర్థి ఆన్లైన్ దరఖాస్తును కంప్యూటర్ ఎలా స్వీకరించింది? డీఈవోలు, ఐఏఎస్ అధికారులు ఎదురెదురుగా కూర్చుని స్క్రూటినీ చేశామని చెప్పారు కదా.. మరి ఈ అనర్హుడిని ఎలా ఎంపిక చేశారు? పైనుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్లు కాక దీనికి కారణమేంటి?బోర్డర్ మండలాల్లో స్పోర్ట్స్ కోటా దందా » ఎవరూ రారు, చూడరు అనే ధీమాతో కర్ణాటక సరిహద్దున ఉన్న కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఏకంగా 24 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లను నియమించారు. ఒక్క ఒల్లూరు స్కూల్లోనే ఐదుగురు స్పోర్ట్స్ కోటా వాళ్లే పాఠాలు చెబుతున్నారు. 41 ఏళ్ల వయసులో 2009–10 నాటి జూడో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే, 42 ఏళ్లకు టీచర్ కొలువు ఇచ్చేశారు. జూడో ఆడేవాళ్లే లేని రాష్ట్రంలో 30–40 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు?» ఇంత జరుగుతుంటే ఎంఈవో, డీఈవో ఆఫీసుల్లో కాకుండా ‘గోతులదొడ్డి’ స్కూల్లో చీకట్లో రహస్య విచారణలు ఎందుకు జరుపుతున్నారు? ఇవాళ శాప్ ఒక దొంగల బండిలా మారింది. శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ బీఈడీ కళాశాల కేంద్రంగా ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దందా నడిచింది. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు రాత పరీక్ష నిబంధనను ఎత్తేస్తూ జీవో 4, జీవో 47 తెచ్చారు. మేము నిలదీశాక మళ్లీ జీవోలు మార్చారు. గుర్రపు స్వారీ (ఈక్వెస్ట్రియన్), ఫెన్సింగ్, రైఫిల్ షూటింగ్ వంటి సంపన్నుల ఆటలను ఏకేటగిరీలో పెట్టి.. సామాన్యులు ఆడే కబడ్డీ, బాడీబిల్డింగ్, చెస్, క్యారమ్స్లను బికేటగిరీకి నెట్టేశారు. అసలు జరగని టోర్నమెంట్లకు ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారు.సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి » సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? హోం మంత్రితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఈ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతోనూ అబద్ధాలు చెప్పించి.. వారిని అక్కడి నుంచి పంపించేసింది. ఒక్క తప్పిదం లేకుండా డీఎస్సీ పూర్తి చేశామన్న వారు ఇప్పుడేమంటారు? టెట్ పాస్ కాని అభ్యర్థి అప్లికేషన్ను ఎందుకు రిజెక్ట్ చేయలేదు?» ‘16 వేల మందిలో ఒక్క తప్పు మాత్రమే జరిగిందని చేతులు దులుపుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోం. జీవో–15 ప్రకారం టెట్ క్వాలిఫై కాకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వడం ఉల్లంఘనే. చిత్తూరు జిల్లాలో ఓసీ అభ్యర్థికి టెట్లో 90 మార్కులు రావాల్సి ఉండగా, 79 మార్కులొచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కట్టబెట్టారు. » తూర్పుగోదావరి జిల్లాలో తెలుగులో టెట్ రాస్తే, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్లు, కేటగిరీలను కంప్యూటర్ క్రాస్ వెరిఫికేషన్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? తక్షణమే ఈ ‘దగా డీఎస్సీ’పై సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి. నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. » శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఒక పెద్ద దొంగల బండి లా మారింది. అక్కడ ముద్ర పడితే చాలు అర్హత లేకున్నా కొలువులు ఇచ్చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ బీఈడీ కాలేజీ కేంద్రంగా సాగిన ఈ స్పోర్ట్స్ కోటా దందాను పూర్తిగా నిగ్గు తేల్చాల్సిందే.యువగళం కోటా వాళ్లకు రూల్స్ మినహాయింపుపాతికేళ్లు, ముప్పై ఏళ్లుగా నిబద్ధతతో పాఠాలు చెబుతూ సమాజానికి ఎంతో మంది ప్రయోజకులను అందించిన సీనియర్ టీచర్లనేమో టెట్ పాస్ కావాలని వేధిస్తారు. కానీ మీ యువగళం కోటాలో అర్హత లేకపోయినా, టెట్ తప్పినా అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెడతారా? లోకేశ్ రాజకీయాల్లో ఒక కామెడీ పీస్గా మారిపోతున్నారు. డబ్బులిచ్చి సర్వేలు రాయించుకుంటూ 82 శాతం అక్షరాస్యత వచ్చిందని పోస్టులు పెట్టుకోవడం హాస్యాస్పదం.రెండేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ అందక, చదువు భారమై సుమారు నాలుగైదు లక్షల మంది పేద విద్యార్థులు చదువులు మానేశారు. వీళ్లకు ఇవ్వడానికి నిధులు ఉండవు గానీ, యోగా మ్యాట్లకు, ప్రతినెలా సీఎం పెన్షన్ ఇచ్చేందుకు తిరిగే ఆర్భాటాలకి రూ.కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇస్తామని ఊదరగొట్టిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక స్పందించడమే లేదు. రూ.40 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారని ఉద్యోగులు అడుగుతుంటే ఉలకడం లేదు. ఒకపక్క ఉద్యోగుల జీతాల భారం అంటూనే, పాత డీఎస్సీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి రెండో డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి, ఉద్యోగుల బకాయిలు చెల్లించి, డీఎస్సీ అక్రమాలపై పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలి. -
అంతరిక్షంలో భారత్ ‘ఆకాశ నేత్రం’
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భూమిని చిత్రీకరించగల అధునాతన ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్–05 (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. 2,367 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ–17 రాకెట్ ద్వారా నిర్దేశిత సబ్–జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్డౌన్ అనంతరం ఈ ప్రయోగం చేపట్టారు. రాకెట్ నింగిలోకి ఎగిసిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. శుక్రవారం ప్రయోగంతో దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రోకు విజయం లభించింది. ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలతో ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ62 రాకెట్.. మూడో దశలో ఏర్పడిన సమస్య కారణంగా వాటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయింది. వ్యూహాత్మక సమాచారం మన సొంతం ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన దాదాపు రియల్టైమ్ చిత్రాలను పొందవచ్చు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా దేశ అవసరాలకు ఈ చిత్రాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా దేశానికి అవసరమైన ‘వ్యూహాత్మక సమాచారం’ అందించడంలో ఈఓఎస్–05 కీలకంగా వ్యవహరించనుంది. ఈ ఉపగ్రహాన్ని మిషన్లో భాగమైన ఓ సీనియర్ శాస్త్రవేత్త ‘ఆకాశ నేత్రం’గా అభివర్ణించారు. ప్రయోగ వివరాలు వెల్లడిస్తున్న మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్, ఇస్రో చైర్మన్ నారాయణన్ తదితరులు ఇప్పటివరకు అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు తక్కువ భూ కక్ష్య (ఎల్ఈఓ) నుంచి పనిచేస్తున్నాయి. అయితే ఈఓఎస్–05 సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్ కక్ష్యలో పనిచేయనుంది. ఈ ఎత్తులో ఉపగ్రహం భూమి భ్రమణ వేగంతో సమానమైన వేగంతో పరిభ్రమిస్తుంది. 2,367 కిలోల బరువున్న ఈఓఎస్–05 జీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లోనే అత్యంత బరువైనది. ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని, సౌర ఫలకాలు విజయవంతంగా తెరుచుకున్నాయని ఇస్రో తెలిపింది. చాలా సంతోషంగా ఉంది జీఎస్ఎల్వీ–ఎఫ్17 రాకెట్ అధునాతన ఈఓఎస్–05 జియో ఇమేజింగ్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా, కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది శ్రీహరికోట నుంచి చేపట్టిన 107వ ప్రయోగం. జీఎస్ఎల్వీకి ఇది 19వ మిషన్. జీఎస్ఎల్వీ తొలి ప్రయోగం (డీ1)లో 1,536 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. అప్పటి నుంచి నిర్మాణ బరువును తగ్గించడం, ప్రొపల్షన్ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా జీఎస్ఎల్వీ సామర్థ్యాన్ని ఇస్రో క్రమంగా పెంచింది. ఇప్పుడు 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియను చేపట్టి ఉపగ్రహాన్ని అవసరమైన ఎత్తుకు చేర్చి జియో ప్లాట్ఫామ్లో ప్రవేశపెడతాం. ఈ విజయం ఇస్రోతో పాటు ఇందులో భాగస్వాముల సమష్టి కృషి ఫలితం. ఈఓఎస్–05 జీవితకాలం తొమ్మిదేళ్లు. ఇది ‘గూఢచారి ఉపగ్రహం’ అంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. దేశ అవసరాల కోసం భూ పరిశీలన, ఇమేజింగ్ సేవలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. 2027 మార్చి నాటికి ప్రధాని మోదీ నిర్దేశాల మేరకు ఆరు ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం – ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ రియల్టైమ్లో చిత్రాలను అందిస్తుంది ప్రత్యేకంగా రూపొందించిన ఈఓఎస్–05 ఉపగ్రహం దాదాపు రియల్టైమ్లో చిత్రాలను అందించగలదు. జీఎస్ఎల్వీ ద్వారా జీటీఓ లేదా సబ్–జీటీఓ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇది అత్యంత బరువైనది. – మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ మోదీ అభినందనలు ఈఓఎస్–05 మిషన్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది దేశానికి గర్వకారణమైన సందర్భమని పేర్కొన్నారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే దేశ తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం భారత అంతరిక్ష రంగం సాధించిన అద్భుత విజయమని తెలిపారు. జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: జీఎస్ఎల్వీఎఫ్17 రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ట్వీట్ చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి, సాధిస్తున్న విజయాలు దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. 2021 ప్రయోగానికి ప్రత్యామ్నాయం! కాగా, జీఎస్ఎల్వీ–ఎఫ్17/ఈఓఎస్–05 మిషన్... 2021లో విఫలమైన జీఎస్ఎల్వీ–ఎఫ్10/ఈఓఎస్–03 మిషన్కు ప్రత్యామ్నాయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయోగంలో రాకెట్ ప్రయాణం ప్రారంభమైన 307 సెకన్ల వద్ద ఆన్బోర్డ్ కంప్యూటర్ ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం జరిపిన పరిశీలనలో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్లో ఏర్పడిన లోపం కారణంగానే ఆ మిషన్ విఫలమైనట్లు ఇస్రో గుర్తించింది. -
వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
దేవరపల్లి: మార్కెట్లో గత నెల రోజుల నుంచి క్రమేపీ పొగాకు ధరలు పెరగడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లో రూ.63 పెరిగి శుక్రవారం కిలోకు గరిష్ట ధర రూ.328 లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి కృతజ్ఞతగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల పరిధిలోని పలువురు రైతులు దేవరపల్లి వేలం కేంద్రం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ గత నెల ఐదో తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. జగన్ పర్యటనకు ముందు కిలో రూ.265గా ఉన్న ధర శుక్రవారం నాటికి రూ.328కు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు కష్టకాలంలో వైఎస్ జగన్ అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. జగన్ అడుగుపెడితే ధర పెరుగుతుందనే నమ్మకం నిజమైందన్నారు. ఈ కార్యక్రమంలో పొగాకు రైతు సంఘం ప్రతినిధులు సుంకవల్లి శ్రీనివాస్, నరహరిశెట్టి రాజేంద్రబాబు, రైతులు కూచిపూడి సతీష్, గన్నమని జనార్ధనరావు, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, కుసులూరి వెంకట సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్
-
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్లో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ వరుసగా ఎన్నో సాక్ష్యాలు బయటకు వస్తున్నా ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థి టెట్లో క్వాలిఫై కాకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?వన్ టు వన్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి..’ అని స్పష్టం చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే... ఇంకా దాక్కుంటారా..? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ.. మోసాల్లో మెగా, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట దగా అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేశ్తో రాజీనామా చేయించకుండా.. అధికార బలంతో అబద్ధాలు చెబుతూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కుమారుడిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ అదృశ్య శక్తి లోకేశ్ కాదంటారా? కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? వన్ టు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.చంద్రబాబూ..! ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం. ఈ దారుణమైన స్కామ్ను కప్పిపుచ్చలేరు ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే.. వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి మీకు డబ్బా కొట్టించుకోవడం ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బ తీసిన ఈ దారుణమైన స్కామ్ను కప్పిపుచ్చలేరు. పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మరోమారు భరోసా ఇస్తున్నాం. లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్ కోటా వరకు.. టెట్ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు.. మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నా.మీ అక్రమాలను ఏపీపీఎస్సీకి పాకించారు..మరో నిర్ఘాంతపరిచే విషయం ఏమిటంటే.. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్ 4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా? డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్మెంట్ను మధ్యలో ఆపేయడంతోపాటు ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపివేయడం వాస్తవం కాదంటారా? .@ncbn గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల… pic.twitter.com/8dkiPMnKjk— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
GSLV ప్రయోగం విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి,తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం వల్ల దేశంలో వాతావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వ్యవస్థలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. Congratulations to @isro on the successful #GSLVF17 launch carrying #EOS05 from Sriharikota. I commend the scientists and engineers whose dedication and precision made this achievement possible. The mission strengthens weather monitoring, disaster management and national… https://t.co/PODbu2k2HQ— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్
-
10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత
-
విజయసాయి మాట ఎందుకు మార్చారు?
మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ఏదో తెలియని ఆందోళనతో, ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమి చెప్పాలో అర్థంకాకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్సీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విజయసాయి సడన్గా ఎంపీ పదవి వదలుకోవడం, పార్టీని సైతం వీడడం సంచలనం అయింది. ఇందులో ఏమి మతలబు ఉందా అన్న చర్చ జరిగింది. కాని ఆయన మాత్రం తాను వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. చాలామంది ఆయన మాటకు కట్టుబడి ఉంటారేమోలే అని సరిపెట్టుకున్నారు.కాని కొంతకాలం గడిచే కొద్ది ఆయనలో మార్పు రావడం ఆరంభం అయింది. తొలుత అక్కడక్కడ కామెంట్లు చేయడం, తదుపరి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, ప్రత్యేకించి వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించడం అందరిని విస్మయపరిచింది. రాజకీయ పార్టీలలో నేతల మధ్య తెలియని స్పర్ధ ఉంటుంది. అయినా పార్టీలో ప్రధాన నాయకుడిని చూసి సర్దుకుపోతుంటారు. పైగా విజయసాయికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్ద లభించిన ప్రాధాన్యత చాలా ఎక్కువే. పార్టీలో పలువురికి దీనిపై కాస్త అసంతృప్తి ఉన్నా ఎవరూ పైకి మాట్లాడలేదు.ప్రత్యేకించి విశాఖపట్నం ఇన్చార్జీగా ఉన్న సమయంలో ఈయనపై ఎల్లోమీడియా విపరీతమైన వ్యతిరేక వార్తలు ఇచ్చేది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఈయన టార్గెట్గానే ఉండేవారు. ఈయన బందువులు విశాఖలో స్థలం కొనుగోలు చేసినా ఎల్లోమీడియాలో ఆరోపణలు వచ్చేవి. చివరికి ఆయనపై ఎంత నీచమైన అభియోగాలు మోపింది అందరికి తెలుసు. టీడీపీ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విజయసాయి మీడియా సమావేశాలు పెట్టేవారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా మొదటి పేజీతో పాటు, లోపలి పేజీలో పెద్ద ఎత్తున పరచిందంటే అందులో ఉన్న మతలబు అర్థం చేసుకోవచ్చు.ఆ రకంగా చూస్తే విజయసాయి తనకు ఇంత ప్రచారం ఆ మీడియాలో వస్తోందని సంతోషిస్తున్నారేమో తెలియదు కాని, అది పులిమీద స్వారీలాంటిదే అని తెలుసుకోగలగాలి. నిజంగానే ఆయన చెబుతున్నట్లు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కూడా తన విధానాలపై ప్రచారం చేసుకుంటే ఫర్వాలేదు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసన, బీజేపీ కూటమి విధానాలను వ్యతిరేకిస్తారో, మద్దతు ఇస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఆయన అసలు లక్షణం బయటపడుతుంది.ప్రభుత్వ విధానాలలోని మంచి, చెడులపై వ్యాఖ్యానిస్తే తప్పు కాదు. కూటమి ప్రభుత్వంపై కాకుండా వైఎస్సార్సీపీపైనే దృష్టి కేంద్రీకరిస్తే, టీడీపీకి పరోక్ష మద్దతు ఇవ్వడానికే ఈ రెండేళ్లుగా రాజకీయం నడిపారని జనం అనుకుంటారు. అంటే టీడీపీ ట్రాప్లో విజయసాయి పూర్తిగా చిక్కుకున్నట్లు అవుతుంది. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిపైన కాని, ఆయన సమీప బంధువులపై కాని కూటమి ప్రభుత్వం పలు కేసు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి యత్నించింది. దానికి తోడు విశాఖలో ఈయన అనుచరులు భూ దందాలకు పాల్పడ్డారని పదే, పదే ప్రచారం చేశారు. అప్పటికే మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో పలువురిని అరెస్టు చేశారు. విజయసాయి పేరు కూడా కేసులో చేర్చారు.ఈ కేసుల బెడద, ఎల్లోమీడియా దాడి భరించలేకే ఈయనలో బాగా మార్పు వచ్చిందా అన్నది కొందరి అనుమానం. ఆ కేసులో ఉన్న ఇతర నిందితులు కొందరితో ఆయన వివాదపడుతున్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. మొత్తం మీద ఏ రకంగా మేనేజ్ చేసుకున్నారో కాని చంద్రబాబు ప్రభుత్వం ఐదో నిందితుడుగా ఉన్న ఆయన జోలికి వెళ్లలేదు. ఆ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దానిని టీడీపీ చేజిక్కించుకోవడం వంటివి జరిగాయి.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?ఈ నేపథ్యంలో విజయసాయి తాజాగా చేసిన ప్రకటనలు సహజంగానే అందరికి సందేహాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారంటూ దారుణమైన ఆరోపణ చేయడం ఆయనకే చెల్లింది. అదే నిజమైతే ఈయననే మార్చి ఉండాలి కదా అన్న విమర్శకు బదులు లేదు. జగన్ అధికారంలో ఉండగా, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఈపాటికి కూటమి ప్రభుత్వం ఎంత యాగీ చేసేదో కదా! పైగా హిందూ ధర్మపరిరక్షణకు అవసరమైన అనేక చర్యలు జగన్ తీసుకున్నారు. విజయసాయి చేసిన ఈ విమర్శపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసారి బహరంగ లేఖ పేరుతో సజ్జలపై విరుచుకుపడే యత్నం చేశారు. ఆయన పార్టీలో నెంబర్ వన్గా ఉన్నారంటూ జగన్ను తగ్గించే యత్నం చేశారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందో లేదో ఆయనకు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు ఆ ఫీలింగ్ ఉంటే అప్పుడే బయటకు వచ్చి ఉండవచ్చు లేదా ఓపెన్ అయి ఉండవచ్చు. అలాకాకుండా ఎన్నికలలో ఓటమి ఎదురయ్యాక మాట్లాడడమే అభ్యంతరం అనిపిస్తుంది. సజ్జలపై కేసులు రాలేదని ఆయన చెబుతున్నారంటే దాని అర్థం టీడీపీతో కుమ్మక్కైనట్లు కాదు.నిజానికి సజ్జలపైన, ఆయన కుమారుడు భార్గవపైన పలు కేసులను ప్రభుత్వం పెట్టింది. వాటిలో పలు పిచ్చి కేసులు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసుల వరకు వెళ్లింది. అయితే వాటన్నిటిపైన న్యాయపోరాటం చేసి స్టేలు తెచ్చుకున్నారు. అంతే తప్ప విజయసాయి మాదిరి భయపడి పోలేదని అనుకోవాలి. ఒకప్పుడు విజయసాయికి ఉన్న ధైర్యం ప్రస్తుతం లేకుండా పోయిందని అనుకోవాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తల మాదిరి పోరాడే శక్తిని ఆయన కోల్పోయారని భావించాలి. సజ్జల వల్ల తాను పార్టీని వీడడం లేదని గతంలో చెప్పిన విజయసాయి మాట మార్చి, ఏకంగా తనపై భౌతిక దాడి జరిగిందని, 74 సార్లు అవమానాలు జరిగాయని ఆరోపించేవరకు వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది.అది నిజమే అయితే, ఆనాడే ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఉండాల్సింది కదా! అప్పుడే పదవులను వదలుకుని ఉండాలి కదా!అధికారం కోల్పోయాక చేసే ఆరోపణలకు విలువ ఏమి ఉంటుంది. ఆయన ప్రతిష్ట దెబ్బతినడం తప్ప. తనను ఎన్నో విధాలుగా వేధించిన ఎల్లో మీడియాకు అస్త్రంగా మిగలడం తప్ప. ఆయన వ్యాఖ్యలు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా కనిపిస్తున్నాయి.గతంలో చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయి కొన్ని అభ్యంతర పోస్టులు పెట్టడం ద్వారా పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా సీనియర్ నేత కనుక ఎవరూ మాట్లాడలేదు. తనతో పాటు విజయసాయిపై కూడా అక్రమ కేసులు పెట్టారన్న సానుభూతి ఉండబట్టే కదా జగన్ ఈయనను రెండుసార్లు ఎంపీని చేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిని చేశారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. కాని వివిధ పరిణామాల నేపథ్యంలో పార్టీలో మార్పులు జరుగుతుంటాయి. ఆ సంగతి ఆయనకు తెలియదా! అయితే ఇప్పటికీ జగన్కు నమ్మక ద్రోహం చేయనని అనడం మంచిమాటే. కాకపోతే టీడీపీ ట్రాప్లో పడి, వారు రాసిచ్చే స్క్రిప్టు చదివే దశకు విజయసాయి వెళితే అది మరింత బురద ఊబిలో కూరుకుపోతున్నట్లే అవుతుందేమో! ఆ సంగతి ఆయన గ్రహిస్తే మంచిదే!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను.. గణాంకాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజా అక్షరాస్యత రేటుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలే ఇంకా వెలువడలేదని, అలాంటప్పుడు పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక ప్రకారం.. ఏపీలో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉంది. 2018-19లో ఇది 69.1 శాతంగా ఉన్నట్లు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా వాస్తవాలను బయటపెట్టారు.2025లోనూ తగ్గిందే..2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పీఎల్ఎఫ్ఎస్ వార్షిక నివేదికలో ఏపీ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా నమోదైందని జగన్ వెల్లడించారు. ఈ నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారని తెలిపారు. దీంతో 2024లో 72.6 శాతం ఉన్న అక్షరాస్యత.. 2025లో 71.4 శాతానికి తగ్గిందని, మరి 2026లో 82.1 శాతానికి ఎలా చేరిందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁.The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to… pic.twitter.com/6yzdtMCVjV— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026‘ఇది తప్పుడు ప్రచారం’..2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఆ ఏడాది అక్షరాస్యత గణాంకాలను కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జగన్ ప్రశ్నించారు. స్పష్టమైన అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు..ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి మరో ఆందోళనకరమైన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ (UDISE) గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.‘విద్యాశాఖపై దృష్టి పెట్టండి’..విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకోవడంపై కాకుండా శాఖ పనితీరుపై శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. ‘రెడ్బుక్ పాలన’పై దృష్టి పెట్టడం కంటే విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడంపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొచ్చిన విధాన మార్పులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్షరాస్యతపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అసలు మోదీ, పవన్ ఎవరబ్బా? -
ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్
-
కర్నూలు జనసంద్రం
కర్నూలు (టౌన్): కర్నూలు నగరం గురువారం జనసంద్రంగా మారింది. ఎస్టీబీసీ కళాశాల మైదానం మొదలు వైఎస్సార్ సర్కిల్, నరసింగరావు పేట, చిరంజీవి పార్కు, ప్రకాష్ నగర్, నేతాజీ థియేటర్, సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కళాశాల వరకు ఇసుక వేస్తే రాలనంతగా జనసందోహం సందడి చేసింది. తమ అభిమాన నాయకుడైన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలుకు విచ్చేశారని తెలియడంతో అశేష ప్రజానీకం తరలి వచ్చి రోడ్డుకిరువైపులా బారులు తీరింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, ఎస్వీ విజయమనోహరి దంపతుల కుమారుడు జనక్దత్తా రెడ్డి, రాజమండ్రి రుడా మాజీ చైర్మన్ షర్మిల, మేడపాటి అనిల్ రెడ్డి దంపతుల కుమార్తె హంసినీ శ్రేయల వివాహ రిసెప్షన్కు గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు హెలికాఫ్టర్లో ఎస్టీబీసీ కళాశాల మైదానానికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సెయింట్ జోసఫ్ కళాశాల వరకు దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ప్రజలు, మహిళలు, అభిమానులు వేలాదిగా అడుగడుగునా వైఎస్ జగన్కు బ్రహ్మరథం పట్టారు. జగన్తో సెల్ఫీ దిగేందుకు యువత పోటీ పడ్డారు. నేతలను, అభిమానులను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరిస్తూ.. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్ జగన్ను కలిసిన న్యాయవాదులుఅధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీకర్నూలు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ పరంగా కర్నూలుకు తీరని నష్టం చేకూర్చిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కర్నూలుకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేసిందన్నారు. అయితే వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకు తరలించి రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కర్నూలులో న్యాయవాదుల సమాజానికి ఇప్పటి వరకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. వారి సమస్యలను ఓపికగా విన్న వైఎస్ జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు జి.స్వాములు, సువర్ణా రెడ్డి, హనుమంత రెడ్డి, నరేంద్రనాథ్ రెడ్డి, కోడుమూరు ప్రభాకర్, శివ, ఇతర న్యాయవాదులు ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ బాధితునికి వైఎస్ జగన్ పరామర్శకర్నూలు (టౌన్): చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతున్న విశ్వనాథ్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీరాభిమాని. వైఎస్ జగన్ను దగ్గరి నుంచి చూడాలని, ఫొటో దిగాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు నగరానికి వస్తున్న వైఎస్ జగన్ను ఎలాగైనా కలవాలని నడవలేని స్థితిలో వీల్చైర్లో ఎస్టీబీసీ కళాశాలకు చేరుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ వెంటనే వీల్ చైర్లో ఉన్న విశ్వనాథ్ దగ్గరకు వెళ్లారు. అతనితో కలిసి ఫొటో దిగారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో ఇన్నాళ్లకు తన కోరిక తీరిందని విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. -
విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్
-
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు సీఎం చంద్రబాబు దిగొచ్చారు. ఎట్టకేలకు కరువుపై కేబినెట్లో చర్చ జరిపారు. ఇటీవలే ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీసిన సంగతి తెలిసిందే. దీంతో కరువుపై కేంద్రానికి లేఖ రాస్తానంటూ చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు అంగీకరించారు.దేశమంతా 14 శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఏపీలో మాత్రం 52 శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు వెల్లడించారు. జలాశయాల్లో నీళ్లున్నా.. రైతులకు ప్రభుత్వం విడుదల చేయలేదు. నీళ్లివ్వలేమంటూ కేబినెట్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. విమర్శలు చేస్తున్నవారిపై ఎదురుదాడి చేయాలంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.ఏపీ కేబినెట్లో ప్రోటోకాల్పై హైడ్రామాఏపీ కేబినెట్లో ప్రోటోకాల్పై హైడ్రామాకు తెరతీశారు. అధికారులను సీఎం మందలించినట్టు లీకులు ఇచ్చారు. వెలిగొండ, పోలవరం ప్రకటనల్లో రామానాయుడు ఫొటో కానరాలేదు. రామానాయుడు ఫొటో తీసేసి నారా లోకేష్ ఫొటో ముద్రించారు. లోకేష్ని ప్రమోట్ చేయడానికి టీడీపీ ప్లాన్ చేసింది. విషయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు డ్రామా మొదలుపెట్టారు. తప్పంతా అధికారులపై నెట్టేసి తిట్టినట్టు లీకులు ఇచ్చారు. -
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళికి కర్తవ్య బోధ చేసిన భగవద్గీతను ప్రసాదించి, మంచి తరఫున నిలిచి చెడును ఓడించిన భగవానుడు శ్రీకృష్ణుడని వైఎస్ జగన్ అన్నారు. శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నాని పేర్కొన్నారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకోవాలని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలన్నారు.‘‘ధర్మాన్ని నిలబెట్టి, సత్యానిదే అంతిమ విజయమని.. జగతికి చాటిన శ్రీకృష్ణ భగవానుడి కృపాకటాక్షాలతో.. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.ధర్మాన్ని నిలబెట్టి, సత్యానిదే అంతిమ విజయమని జగతికి చాటిన శ్రీకృష్ణ భగవానుడి కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026ఇదీ చదవండి: జన్మాష్టమి రోజు ఈ పనులు చేయడం వెనుక ఇంత అర్థముందా? -
కర్నూలులో వైఎస్ జగన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్
-
కర్నూలులో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో ఉన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులు జనక్-శ్రియాలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు.ఇక, వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జగనన్నకు ఘన స్వాగతం పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ రాకతో సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్లో సందడి వాతావరణం నెలకొంది. ఇదీ చదవండి: బాబూ.. పోలవరంపై మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్ -
బాబు సాష్టాంగం నమస్కారం.. చెప్పని అసలు లెక్క ఇదే!
దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కొంత మేర అయినా సాకారం అవడం సంతోషమే. మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు నీరందించాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పరిస్థితి ఇంకా రావల్సి ఉంది. ప్రస్తుతానికి తామేదో చేసేశామని చెప్పుకోవడం కోసం కూటమి ప్రభుత్వం తంటాలు పడింది. దీనికి ఎల్లో మీడియా విపరీతమైన హైప్ ఇచ్చింది.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నీరు వదలే అవకాశం రావడం అదృష్టమే. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన పేరు గుర్తుంచుకునేలా చేసిన కార్యక్రమం పెద్దగా ఏదీ లేదని చాలామంది అంటారు. అయితే గత ప్రభుత్వాలు చేసిన వివిధ పనులను తనవిగా ప్రొజెక్టు చేసుకోవడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండకపోవచ్చు. దానిని క్రెడిట్ చోరీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పెట్టారు. ఉన్నవి, లేనివి ఏవేవో అంకెలు చెబుతూ చంద్రబాబు ఉపన్యాసాలు చేస్తుంటారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదే జరుగుతోంది.తానే శంకుస్థాపన చేశానని, తానే ప్రారంభిస్తున్నానని ఆయన చెబుతారు. అంతవరకు నిజమే. కాని అసలు పనిచేసింది ఎవరు అన్నది మాత్రం చెప్పరు. అందువల్లే కృష్ణా నది నుంచి నీటిని తరలించే బృహత్తర పథకంలో వెలిగొండ ప్రాజెక్టు వివిధ దశలకు సంబందించి తన పాత్రను వివరించలేకపోయారు. నిజానికి చంద్రబాబుకు వచ్చిన రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే ఉమ్మడి ఏపీలో ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి అయి ఉండేవి.1996 ఎన్నికలకు ముందు జనాన్ని మాయ చేయడం కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిలో అత్యధికం అంతకుముందు ఎన్టీఆర్ ప్రభుత్వంలో వచ్చిన ప్రతిపాదనలే. చంద్రబాబు శిలాఫలకాలైతే వేశారు కాని, వాటిని ముందుకు తీసుకువెళ్లలేదు. భారీ ప్రాజెక్టులపై ఆయనకు గతంలో పెద్దగా నమ్మకం లేకపోవడమే కారణం. అవి సకాలంలో పూర్తి కావని, రాజకీయంగా లబ్ది చేకూరదన్నది ఆయన ఉద్దేశం.చంద్రబాబు 1998 ప్రాంతంలో ఏపీ ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. వైఎస్ అప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనకు పలు ఆందోళనలు చేశారు. ఆ నేపథ్యంలో చంద్రబాబుకు ఒక హెచ్చరిక చేస్తూ, నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే చరిత్ర హీనుడవుతావు.. అని వ్యాఖ్యానించడం సంచలనం అయింది. అయినా చంద్రబాబు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ద్వారా 1999 ఎన్నికలలో గెలవలిగారు. వాజ్ పేయిపై జనంలో ఉన్న సానుభూతి కలిసి వచ్చింది.ఆ తర్వాత కూడా ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండేవి. దాంతో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి అప్పట్లో ఉమ్మడి ఏపీలో ప్రతి ప్రాజెక్టు స్థలాల వద్దకు వెళ్లి శంకుస్థాపన ఫలకం పక్కన మొక్కలు నాటి నిరసన తెలిపారు. వాటిలో వెలిగొండ కూడా ఒకటి. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్ లోనే నీటిపారుదల ప్రాజెక్టుల రిపోర్టును అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీవీఎస్ కె శర్మ ప్రవేశపెట్టారు. వాటి వివరాలు చూసిన ఆనాటి మంత్రి జేసీ దివాకరరెడ్డి ఇన్ని ప్రాజెక్టులకు అవకాశం ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. దానికి శర్మ సమాధానం ఇస్తూ, ఆయన ప్రాధాన్యతలు వేరు, ప్రాజెక్టులను మీరు చేస్తామంటున్నారు.. అందుకే నివేదిక సమర్పించాను అని బదులు ఇచ్చారట.తదుపరి వైఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం, పులిచింతలతో సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టి, పూర్తి చేస్తామని ప్రకటించారు. తదనుగుణంగానే ఆయన భారీ ఎత్తున ప్రారంభించారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టును ఓ రకంగా చంద్రబాబు వ్యతిరేకించారు. ఆ ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని అప్పట్లో ఒక టీవీ చానల్తో అన్న వీడియో ప్రస్తుతం సర్కులేషన్లోకి వచ్చింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదన్న అభిప్రాయంతో దానిని చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి విదేశాల నుంచి కొండలు తొలిచే యంత్రాలను తెప్పించి సొరంగాల నిర్మాణం ఆరంబించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. దీనిని చంద్రబాబు కాదనగలరా అన్నది ఒక ప్రశ్న. వైఎస్ మరణంతో ఈ ప్రాజెక్టులలో జాప్యం జరిగిన మాట వాస్తవం. తదుపరి రాష్ట్ర విభజన, ఏపీకి 2014లో చంద్రబాబు సీఎం కావడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా ఆయన వాడుకోలేకపోయారు. వెలిగొండపై పెట్టవలసినంత శ్రద్ద పెట్టలేకపోయారనిపిస్తుంది. కాకపోతే వ్యయ అంచనాలు పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారన్న విమర్శ వచ్చింది.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?వైఎస్ రాజశేఖర్రెడ్డి టైమ్లో సుమారు 20 కిలోమీటర్ల సొరంగం తీయడమే కాకుండా, రిజర్వాయిర్ను చాలావరకు ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు టైమ్లో కేవలం సుమారు ఆరు కిలోమీటర్లకే టన్నెల్ తవ్వారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ పది కిలోమీటర్ల టన్నెళ్లను పూర్తి చేసి, అవసరమైన ముఖ్యమైన కాల్వలను తవ్వించారు. తదుపరి వాటిని జాతికి అంకితం చేశారు. అయితే మానవత్వ కారణాలతో రిజర్వాయిర్ నిర్మాణం వల్ల నిర్వాసితులు అయ్యేవారికి పూర్తి స్థాయిలో పరిహారం, సహాయం అందించి వారు సెటిల్ అవడం కోసం నీళ్లను వదలే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జగన్ తిరిగి గెలిచి ఉంటే బహుశా 2024 జూన్, జూలైలలో ఆ పని కూడా అయిపోయేదేమో! కాని ఎన్నికలలో ఓటమి ఎదురవడంతో ఆగిపోయింది.కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లపాటు ముందుకు సాగలేదు. ఒక మిషన్ టన్నెల్లో విరిగిపోయిందని, ఆ కాంట్రాక్టర్ స్టే తెచ్చుకున్నారని చంద్రబాబు చెబుతున్నారు. కాని అది సాకేనేమో అనిపిస్తుంది. నిర్వాసితులకు 2024లోనే ఎందుకు పరిహారం ఇవ్వలేకపోయారు? గ్రామాలను ఖళీ చేయించలేదు? ఒక టన్నెల్ ద్వారా అయినా నీటిని ఇచ్చి ఉండవచ్చు కదా! అలా చేస్తే వైఎస్ రాజశేఖర్రెడ్డికు, జగన్కు జనం క్రెడిట్ ఇస్తారన్న ఉద్దేశంతోనే ఆ పని చేయలేదన్నది వైఎస్సార్సీపీ విమర్శ. ఇప్పటికీ నిర్వాసితులు సెటిల్ కాకముందే నీటిని వదలడంతో ఎన్ని వందల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నది తెలిసిన విషయమే.బాధితులు మంత్రిని, కలెక్టర్ తదితర అధికారులను నిలదీసిన, ఆగ్రహం వ్యక్తం చేసిన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ల కృషిని కూడా అభినందించి ఉంటే, చంద్రబాబుకు వయసుకు తగ్గట్లుగా హుందాగా ఉండేది. అలా చేయకపోగా వైఎస్సార్సీపీపైన ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం బాగోలేదు. 1996-2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసింది కేవలం పది లక్షలేనని, అది కూడా శంకుస్థాపన సభ ఏర్పాట్ల కోసమేనని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఒక్కదానికి చంద్రబాబు సమాధానం చెప్పగలిగితే, ఆయన ప్రభుత్వం ఏ మేరకు పనిచేసింది అర్థం అవుతుంది. శ్రీశైలంలో కనీస నీటి మట్టంగా 834 అడుగులుగా నిర్ణయిస్తూ చంద్రబాబు జీఓ ఇచ్చారు. ఇదే కొనసాగి ఉంటే అసలు వెలిగొండకు నీరు వచ్చే అవకాశమే ఉండదట. వైఎస్ ప్రభుత్వం దానిని 854 అడుగులకు పునరుద్దరించడంతో వెలిగొండతో పలు రాయలసీమ ప్రాజెక్ట్లకు నీరు అందించగలిగే పరిస్థితి వచ్చిందన్నది నిజమా? కాదా? టన్నెల్ తవ్వడానికి భారీ యంత్రాన్ని తెప్పించింది వైఎస్ రాజశేఖర్రెడ్డి కాదని అనగలరా!ఇప్పుడు చంద్రబాబు చేయవలసింది వెలిగొండ రెండో దశ కూడా పూర్తి చేసి నిర్దిష్ట లక్ష్యం ప్రకారం సమారు ఐదులక్షల ఎకరాలకు నీరవ్వడం. అది చేసి, ఆ క్రెడిట్ తనదేనని చెప్పుకుంటే అభ్యంతరం లేదు. ఇది ఎంతవరకు జరుగుతుందన్నది చెప్పలేం. వెలిగొండ సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకించి రప్పించి జగన్ను దూషింపచేయడం మరీ దారుణంగా ఉంది. ఇదే మాగుంట గతంలో జగన్ టన్నెళ్ల ప్రారంభోత్సవం చేసినప్పుడు ఎంపీగానే ఉన్న సంగతి మర్చిపోయారా! లేక చంద్రబాబు మెప్పుకోసం తన మాగుంట కుటుంబ పరువును రోడ్డున పడేశారా అని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.మరో అంకం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడం. వైఎస్ చేపట్టిన భారీ ప్రాజెక్టులను ఊహజనితం అని ఆ రోజుల్లో చంద్రబాబు విమర్శించేవారు. కాని సాష్టాంగ నమస్కారం చేయడం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు ఊహాజనితం కాదని, వాస్తవమని చంద్రబాబుకు అర్థం అయి ఉండాలి. చంద్రబాబు వెలిగొండ చరిత్రలో చివరిలో అయినా ఒక భాగం అయ్యారు. అంతవరకు ఓకే. కాని చరిత్రను సృష్టించింది మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్లే అన్నది పచ్చి నిజం. వెలిగొండ నీటిలో కనిపించేది వైఎస్ రాజశేఖరరెడ్డి నీడే అన్నది అర్థం అవుతూనే ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం
-
నేడు కర్నూలుకు వైఎస్ జగన్
కర్నూలు(టౌన్): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, విజయమనోహరి దంపతుల కుమారుడు జనక్దత్తారెడ్డి, శ్రీయల వివాహ రిసెప్షన్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి 11.40 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 12 గంటలకు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్కు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించి 20 నిమిషాలు అక్కడే ఉంటారు. అనంతరం 12.35 గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. రిసెప్షన్కు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరవుతున్నారు. -
పోలవరంపై మీ డ్రామాలు ఆపండి బాబూ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి.. ఇప్పటికే ఉన్న పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి, వైఎస్సార్ హయాంలో నిర్మించిన పోలవరం ఎడమ కాలువలోకి వదిలి, తామేదో ‘పోలవరం నీళ్లు ఉత్తరాంధ్రకు తెచ్చేశాం’ అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అవి పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు కావని అందరికీ తెలిసినా ప్రచారం మాత్రం వేరే లెవల్లో చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న క్రెడిట్ చోరీపై ఈ మేరకు వైఎస్ జగన్ తన ‘ఎక్స్’« ఖాతా ద్వారా ధ్వజమెత్తారు. ‘నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించింది.. మరి ఇందులో తాను చేసిందేమిటి? క్రెడిట్ కోసమే బాబు ఆరాటం..’ అని ట్వీట్లో దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...బాబు పబ్లిసిటీ ఈవెంట్లుసాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ.. ఇవాళ పోలవరం ఎడమ కాలువ.. ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలు పెట్టని, మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరే అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.అంతా నేనే చేశానని చెప్పుకోవడం మీకే చెల్లిందిపురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవి కాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు.. పూర్తయిన ఆ పనుల మీద నిలబడి ‘‘అంతా నేనే చేశా’’ అని చెప్పుకోవడం చంద్రబాబు గారూ మీకే చెల్లింది!మీ డ్రామాలు రాష్ట్రానికి శాపంపోలవరం విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ.. ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీ పాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్వే పనులు పూర్తి కాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్ డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రం వాల్ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా.. వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్వే ద్వారా డైవర్ట్ కాక, ఎగువన అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టం కూడా జరిగింది. వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్లాం. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు.ముందు పోలవరం ఎత్తు సంగతి తేల్చండిఅన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చండి చంద్రబాబు గారూ. పోలవరం ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబు గారూ?ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీమ్కు వైఎస్సార్ గారు 2009లోనే రూ.7,214.10 కోట్లతో పరిపాలనా అనుమతి ఇస్తే.. మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో మా ప్రభుత్వంలో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనా అనుమతి ఇచ్చాం. కీలకమైన ప్యాకేజ్–1, ప్యాకేజ్–2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా? పనులపై దృష్టి పెట్టండిచంద్రబాబు గారూ.. పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టి పెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తి చేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతో పాటు పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమ కాలువతోపాటు కుడి కాలువలకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇది చేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు? -
వైఎస్సార్కు ఘన నివాళి
సాక్షి, కడప: సంక్షేమ ప్రదాతగా, అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. తన మాతృమూర్తి, వైఎస్సార్ సతీమణి విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్కు చేరుకున్న వైఎస్ జగన్.. తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం, పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. కొద్దిసేపు మౌనంగా కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. ఘాట్ ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలువైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ సుధీకర్రెడ్డి, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, చిన్నమ్మ వైఎస్ ప్రమీలమ్మ, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డాక్టర్ మధుసూదన్, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, అత్తార్ చాంద్బాషా, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, సీఈసీ సభ్యుడు కె.సురేష్బాబు, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ రామగోవిందరెడ్డి, పులివెందుల పరిశీలకులు పూల శ్రీనివాసరెడ్డి, కమలాపురం, కదిరి ఇన్ఛార్జిలు నరేన్ రామాంజులరెడ్డి, మగ్బూల్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజోలి వీరారెడ్డి, నిత్యానందరెడ్డి, సొహైల్ అహ్మద్, గోసుల శివభరత్రెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎస్ఐ పాస్టర్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ డి.థామస్ బెన్హర్, పాస్టర్లు మత్యుంజయ, నరేష్బాబు తదితరుల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు.అభిమానులతో పోటెత్తిన వైఎస్సార్ ఘాట్ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన వైఎస్సార్ అభిమానులతో వైఎస్సార్ ఘాట్ పోటెత్తింది. పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ ఘాట్కు చేరుకుని పూలమాలలు, పుష్పగుచ్ఛాలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను చూడగానే అభిమానులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో ఘాట్ ప్రాంగణం మార్మోగింది. ప్రార్థనలకు వచ్చే సమయంలో, తిరిగి వెళ్లే సమయంలో వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ, కరచాలనం చేస్తూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. -
చంద్రబాబూ.. ఇలా డప్పు కొట్టుకోవడం ఏంటి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లంటూ ప్రచారం చేసుకోవటంపై మండిపడ్డారు. పోలవరానికి ఎవరి హయాంలో ఏం చేశారో లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ తన ట్వీట్లో.. చంద్రబాబూ..ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి పోలవరం ఎడమ కాలువలోకి వదిలారు. దాన్ని చూపిస్తూ ‘పోలవరం నీళ్లు తెచ్చేశాం’ అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి?’ పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావనీ మీకూ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రచారం మాత్రం వేరే లెవల్. నీళ్లు పురుషోత్తపట్నానివి… కాలువ వైయస్సార్ హయాంలో నిర్మించినది… క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్?‘చంద్రబాబూ.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ… ఇవాళ పోలవరం ఎడమ కాలువ… ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలుపెట్టని, మీరు పూర్తిచేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు, ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైఎస్సార్గారి హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి “అంతా నేనే చేశా” అని చెప్పుకోవడం చంద్రబాబు మీకే చెల్లింది!రాష్ట్రానికి శాపంలా మారాయి.. పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ… ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘‘మందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీపాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్వేకు పనులు పూర్తికాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రంవాల్ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా, వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్వే ద్వారా డైవర్ట్ కాక, ఎగున అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టంకూడా జరిగింది.వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లాం, ప్రణాళికా బద్ధంగా. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు పోలవరం ఎత్తు సంగతి తేల్చండి అన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చాలి.‘‘పోలవరం FRL 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబు?మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీంకు వైఎస్సార్ 2009లోనే రూ.7,214.10 కోట్ల పరిపాలనా అనుమతి ఇస్తే, మా ప్రభుత్వంలో మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చాం. కీలకమైన Package-1, Package-2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?చంద్రబాబు.. పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టిపెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తిచేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతోపాటు, పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమకాల్వతోపాటు, కుడికాల్వకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇది చేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు..@ncbn గారూ… ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి, ఆ ఇప్పటికే ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి, ఇప్పటికే ఉన్న పోలవరం ఎడమ కాలువలో వదిలి, దాన్ని చూపించి “పోలవరం నీళ్లు తెచ్చేశాం” అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి? పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావనీ మీకూ… pic.twitter.com/Wplm9CrzTh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2026 -
భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్
-
పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?
పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగానే సిద్దం అవుతోందా?వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటిస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కాని ఆ ప్రాజెక్టును తొలుత ప్రతిపాదించిన విధంగా కాకుండా నిర్ధిష్ట లక్ష్యంలో నాలుగో వంతుకే పరిమితం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటా అన్నది పెద్ద చర్చగా ఉంది. 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి గాను రూపొందించిన ఈ ప్రాజెక్టు తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రకారం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీరు అందించగలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దీనికి ఎవరు బాద్యత వహించాలి?. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తున నిర్మించాలని తొలుత భావించగా, ఇప్పుడు దానిని 41.15 మీటర్లకే పరిమితం చేయబోతున్నారన్నది వస్తున్న సమాచారం. దీనికి తొలిదశ అని పేరు పెట్టి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పార్లమెంటుకు ఇస్తున్న సమాచారం పరిశీలిస్తే,ఈ ఎత్తు వరకే కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్లో మీడియా మాత్రం దీనిని కవరప్ చేస్తూ ఇది తొలిదశ అయినా, తర్వాత కూడా పనులు సాగించుకోవచ్చని చెబుతోంది. కాని అందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలి? ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014-2019 టర్మ్లో తీసుకున్న ఒక నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు అందించాలి. కాని చంద్రబాబు అప్పట్లో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రమే నిర్మిస్తుందని చెప్పి కేంద్రాన్ని ఒప్పించారు.ప్రత్యేక హోదా డిమాండ్ను చంద్రబాబు వదలుకుని పోలవరం కాంట్రాక్టును తీసుకున్నట్లయిందని అప్పట్లో ప్రతిపక్షం విమర్శించేది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టైమ్లో ఈ ప్రాజెక్టుకు 45.72 మీటర్ల ఎత్తును కేంద్రంతో ఖరారు చేయించి, తదనుగుణంగా నిధులు మంజూరుకు ఒప్పించారని చెబుతారు. ఇందుకు తగినట్లుగా స్పిల్వేని ఆ స్థాయిలో నిర్మాణం చేయించారు. జగన్ ప్రభుత్వం రెండు దశలలో నిర్మాణం జరుగుతుందని చెబితే విపక్షంగా ఉన్న తెలుగుదేశం తీవ్ర విమర్శలు గుప్పించింది. రెండేళ్ల క్రితం కూటమి అదికారంలోకి వచ్చాక తొలిదశతోనే ప్రాజెక్టును ముగించే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగించే అంశమే. 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు పూర్తి అయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల స్థాయిలో అయితే 119 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతారు. ఇదే జరిగితే తొలుత అంచనా వేసినట్లు ఏడు లక్షల ఎకరాలకు పైగా నీటిని అందించడం సాధ్యం కాదు. అలాగే కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంద్ర సుజల స్రవంతి పూర్తి స్థాయిలో నీళ్లు అందించడం సాధ్యం కాకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. అలాగే విద్యుత్ ప్రాజెక్టును కూడా వరద వచ్చినప్పుడే నడపగలుగుతారు. ఒరిజినల్గా పోలవరం నిర్మాణానికి సుమారు 55 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. కాని ఇప్పుడు దానిని సుమారు 30వేల కోట్లకే పరిమితం చేస్తున్నారట. ఆ లెక్కన మరో 12 వేల కోట్లు ఇస్తే సరిపోతుందన్నది కేంద్రం అభిప్రాయంగా ఉంది. దీనివల్ల ఏపీకి బాగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తుది దశ నిర్మాణాన్ని రాష్ట్రం నిజంగా కొనసాగిస్తే అదనంగా అయ్యే వ్యయం సుమారు 25 వేల కోట్లు ఉంటుంది. కేంద్రం దీనిని ఇస్తామంటే మంచిదే. కాని రాష్ట్రమే భరించవలసిరావచ్చన్న సందేహాలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని నిర్వాసితుల కోసం ఖర్చు చేయవలసి ఉంది. రెండో దశలో మునిగిపోయే ప్రాంతాన్ని తగ్గించడంవల్ల ఈ వ్యయం తగ్గించుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది.అదే జరిగితే ప్రాజెక్టు పర్పస్ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన ఉంది. కేంద్రం రెండో దశకు కూడా నిధులు ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా అధికారికంగా చెబుతున్నట్లు కనిపించడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. దీనివల్ల తమ భూభాగం మునుగుతుందన్నది ఆ రాష్ట్ర వాదన. నిజానికి ప్రాజెక్టును వైఎస్సార్ ప్రతిపాదించి, వివిధ అనుమతులు సాదించినప్పుడే వాటన్నిటిని లెక్కించి చాలావరకు పరిహారం ఇప్పించారు. తదుపరి ఆయన అనూహ్య మరణంతో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. ఈ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందని తెలిపినా, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో కేంద్రం నుంచి తీసుకోవడం ఒక చారిత్రక తప్పిదంగా చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ విమర్శలు చేస్తూ పోలవరాన్ని చంద్రబాబు అవినీతి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. అంతేకాక కాఫర్ డామ్ పూర్తిగా నిర్మించకుండా రెండు గాఫ్ల్ పెట్టి డయాఫ్రం వాల్ నిర్మాణానికి పూనుకోవడం, భారీ వరదల కారణంగా ఆ వాల్ దెబ్బతినడం వంటి ఘటనలు జరిగాయి. చంద్రబాబు తాను చేసిన తప్పులను జగన్ ప్రభుత్వంపై నెట్టివేయడం చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాఫర్ డామ్ ఎడమవైపు పది అడుగుల వెడల్పు, ఏడు నుంచి ఎనిమిది అడుగుల లోతున జారిందని ఎల్లో మీడియానే రిపోర్టు చేసింది. దీనిని కొంత కవర్ అప్ చేసే యత్నం చేస్తూ కధనాన్ని ఇచ్చింది. అదే జగన్ టైమ్ లో ఇలాంటి ఘటన జరిగి ఉంటే, టీడీపీ, ఎల్లో మీడియా రచ్చ రచ్చగా ప్రచారం చేసేవి. కాగా డయాఫ్రం వాల్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని సెంటర్ ఫర్ లిబర్టి ప్రతినిధులు ఎబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలిదశ పూర్తి చేసి మమ అనిపించుకుంటారా? లేక పోలవరం ప్రాజెక్టు రెండో దశ కొనసాగించగలుగుతారా అన్న సందేహాన్ని నివృత్తి చేయవలసి ఉంది. చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై అంత నమ్మకం లేదు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెబుతుండేవారు. టీడీపీ నేతలుగా ఉన్న వడ్డి వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు ఈ ప్రాజెక్టు కోసం నిత్యం పోరాడేవారు. అయినా వారిని చంద్రబాబు పట్టించుకునేవారు కాదు. భారీ ప్రాజెక్టుల వల్ల రాజకీయ లబ్ది వెంటనే ఉండదన్నది ఆయన భావనగా ఉండేది. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం మాత్రమే కాకుండా సుమారు 48 ప్రాజెక్టులను ఆ రోజుల్లో జలయజ్ఞం పేరుతో సంకల్పించారు. దానిపై టీడీపీ విమర్శలు చేస్తుండేది. విభజన తర్వాత మాత్రం అప్పటికే నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు తన కల అని చంద్రబాబు చెప్పడం ఆరంభించారు.నిజంగా ఆయన కలే అయితే చిత్తశుద్దితో 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయగలగాలి. చంద్రబాబు ఆ పని చేసి చూపిస్తారా!. లేక దీనితోనే మాయ చేస్తారా? అన్నది చూడాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
LIVE: YSRకు జగన్ నివాళులు
-
లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం
-
Idupulapaya: YSR ఘాట్ వద్ద జగన్ నివాళులు
-
YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు
-
వైఎస్సార్ను తలచుకుంటూ వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, పలువురు నేతలు ఆయన్ని స్మరించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. “మిస్ యూ ఆల్వేస్, డాడ్! యూ విల్ ఫరెవర్ బీ మై ఇన్స్పిరేషన్” అంటూ తండ్రిని తలచుకున్నారు.వైఎస్సార్ తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని జగన్ పేర్కొన్నారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన జ్ఞాపకాలను స్మరించారు. అంతకు ముందు.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో, పార్టీ కేడర్తో కలిసి నివాళులర్పించిన విషయం తెలిసిందే.Miss you always, Dad! You’ll forever be my inspiration. pic.twitter.com/4e9pkYxlem— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2026ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన ఆయన.. ప్రజల మనసుల్లో ‘వైఎస్సార్’ను చిరస్థాయిగా నిలబెట్టింది. అయితే 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతికి నేటితో పదిహేడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ను స్మరించుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో నివాళులర్పిస్తున్నారు.ఇటు వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయన అడుగుజాడల్లోనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏపీకి ముఖ్యమంత్రిగా పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వివిధ వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.ఇదీ చదవండి: మరపురాని మహానేత -
నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు)
-
Kadapa : YSRకు వైఎస్ జగన్ ఘన నివాళి
-
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రార్థనలకు.. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వైఎస్సార్ వర్థంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆశయాలు సాధిస్తాం.. జోహార్ వైఎస్సార్ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదీ చదవండి: మరపురాని మహానేత.. జల ప్రదాత వైఎస్సార్ -
పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు)
-
స్థానిక సంస్థల ఎన్నికలను చాలెంజ్గా తీసుకోండి
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్సీపీ నేతలు చాలెంజ్గా తీసుకోవాలి. ప్రతి చోటా నాయకులు కేడర్కు అండగా నిలవాలి. అధికార బలం, పోలీసులను అడ్డుపెట్టుకొని ఏకగ్రీవాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలి’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వినతులు సమర్పించారు. వైఎస్ జగన్ వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారికి భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే సిద్ధం కావాలి అనంతరం పార్టీ నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకోవాలని వారికి చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని సూచించారు. ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీలో ఉండేలా ముందుగానే సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డులవారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు లొంగొద్దు అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రతి కుటుంబానికి కలిగిన మేలును ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించండి ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు భిన్నంగా కూటమి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజల మధ్యే ఉండాలని, వారి సమస్యలపై పోరాడాలని, వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తు చేయాలని చెప్పారు. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం అతి సునాయాసమని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని నిరంతరం కొనసాగించాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్ ఆగ్రహం వైఎస్ జగన్ భాకరాపురం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సమయానికి ఆయన్ని కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారెవ్వరూ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మెయిన్ గేట్లు మూయించి, అడ్డుకోవడంతో వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. గేట్లు తెరవాలంటూ వాహనంలో నుంచే ఆదేశించారు. పోలీసులు గేట్లు తెరవడంతో బయట గంటల తరబడి వేచి ఉన్నవారంతా కార్యాలయంలోకి వచ్చారు. పులివెందులలో ఘన స్వాగతం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంగళవారం పులివెందులలో ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 11.50 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్కు చేరకున్న ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి, చవ్వా దుష్యంత్రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.అనంతరం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పూల శ్రీనివాసులరెడ్డి, కల్లూరు నాగేంద్రరెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, రాజోలి వీరారెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అంబటి సురేష్ను పరామర్శిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబటి సురేష్ కుటుంబానికి అండగా ఉంటాంటీడీపీ నేతల దాడులకు భయపడాల్సిన అవసరం లేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం పట్టణంలో ఇటీవల టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసి, దాడి చేసిన వైఎస్సార్సీపీ కమలాపురం వాణిజ్య విభాగం అధ్యక్షుడు, ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన అంబటి సురేష్ , ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్రెడ్డి వారిని వైఎస్ జగన్కు పరిచయం చేశారు. సురేష్ , ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్ ఘటన వివరాలను తెలుసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి అనుచరులు ఆరోజు తనపై చేసిన దౌర్జన్యాన్ని వైఎస్ జగన్కు సురేష్ వివరించారు. కమలాపురంలో ఆర్వోబీ నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని గట్టిగా డిమాండ్ చేసినందుకే టీడీపీ ఎమ్మెల్యే పుత్తా అనుచరులు నడిరోడ్డుపైనే ఆటోలో కిడ్నాప్ చేసి, దాడి చేసి, ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్బంధించారని తెలిపారు. ఆటోలో తీసుకెళ్తూ తనపై దాడి చేశారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కమలాపురం ఇన్ఛార్జి నరేన్రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయానికి బయల్దేరడంతో తనను విడిచిపెట్టారని సురేష్ తెలిపారు. సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు, దాడులు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష కార్యకర్తలు, సామాన్య ప్రజలను బెదిరించే ప్రయత్నాలు జరిగితే పార్టీ వారికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. -
మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్
సాక్షి, అమరావతి: ‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి. కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైఎస్సార్. నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైఎస్సార్కు 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’అంటూ వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. మరపురాని మహానేత .. జలప్రదాత డాక్టర్ వైఎస్సార్ అంటూ ఫొటోను ట్యాగ్ చేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 2న ఉదయం పులివెందులలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం డాక్టర్ వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం(3వ తేదీ) కర్నూలులో పర్యటించనున్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరగనున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు కోసం రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. పైగా సాంకేతికంగా ఈ ప్రాజెక్టు ఏమాత్రం ఫీజుబులిటీ కాదని చంద్రబాబు పక్కన పెట్టేశారని గుర్తుచేశారు. కానీ నేడు ఈ ప్రాజెక్టు తన ఘనతే అంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. 1996లోనే కాదు ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపనల డ్రామా ఆడిన చంద్రబాబు ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదని చెప్పారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ తర్వాత రెండుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు దీన్ని ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.2004లో డాక్టర్ వైఎస్సార్ సీఎం అయిన తర్వాత చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నరసరావుపేటలో శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్తున్న సమయంలో స్థానిక కమ్యూనిస్టు నేతలు ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టాలని కోరారని తెలిపారు. పూల సుబ్బయ్య పేరు పెడితే ఏమైనా అభ్యంతరమా? అని వైఎస్సార్ పక్కనే ఉన్న తమను అడిగారని, తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో అక్కడికక్కడే పూల సుబ్బయ్య పేరు ఈ ప్రాజెక్టుకు పెడుతున్నట్టు ప్రకటించారని వివరించారు. ఆరోజు వైఎస్సార్ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టకపోతే ఈరోజు చంద్రబాబు ప్రారంభించే పరిస్థితి వచ్చేదే కాదన్నారు. వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం కింద 2004–09 మధ్య ఈ ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టించారని, మొత్తం 37.587 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించాల్సి ఉండగా దాదాపు 20.333 కిలోమీటర్ల మేర నిర్మించారని చెప్పారు. వైఎస్సార్ మరణం తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు కేవలం 6.686 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగాలు పూర్తిచేశారని చెప్పారు. అనంతరం సీఎం అయిన వైఎస్ జగన్ మిగిలిన 10.568 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు పూర్తిచేయడమే కాకుండా డ్యామ్ పనులు కూడా చేపట్టారని తెలిపారు. సొరంగాల పనులు పూర్తిచేసిన వైఎస్ జగన్ 2024 మార్చి 6న వాటిని జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరిగాయన్నారు. ఈ ప్రాజెక్టు పేరు చెబితే ఈ ప్రాంత ప్రజలు దివంగత వైఎస్సార్తో పాటు ఆయన తనయుడు జగన్ను గుర్తుచేసుకుంటారని చెప్పారు. మాగుంట ఇంత దిగజారతాడనుకోలేదు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచానికి దిగజారతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని రాజమోహన్రెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రారంబోత్సవ సభలో వైఎస్ జగన్ను ఉద్దేశించి మాగుంట మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మాగుంట కుటుంబానికి రాజకీయభిక్ష పెట్టింది దివంగత వైఎస్సార్ అని గుర్తుచేశారు. వైఎస్సార్తో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వల్ల రాజకీయంగా లబ్ధి పొందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు మాగుంట నోటి వెంట విన్నప్పుడు ఆయన రాజకీయంగా పతనమైపోయాడేమో అనిపించిందన్నారు. మాగుంట వ్యాఖ్యలను ప్రజలు ఏమాత్రం హర్షించరని చెప్పారు. రాజకీయంగా మాగుంటకు ఇది మాయనిమచ్చగా మిగిలిపోతుందని మేకపాటి పేర్కొన్నారు. -
గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా?
సాక్షి, అమరావతి: విశాఖపట్నం మారిక వలసలోని గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులను వారికి నచ్చిన చోట చదువుకోనివ్వాలని హితవు పలికారు. ఈ పాఠశాల తరలింపునకు నిరసనగా విద్యార్థులు, తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులపై దమనకాండకు పాల్పడడం సరికాదన్నారు. ‘తల్లిదండ్రుల పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు వస్తున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలంతో వారి గొంతు నొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారుతారా? ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నాయకులను గృహ నిర్బంధం చేస్తారా? వారు చేసిన తప్పేమిటి?’ అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ హయాంలోనే గురుకులాలు ఏర్పాటు‘విశాఖపట్నం మారిక వలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. మారిక వలస స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్సార్ హయాంలో ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సలహాలు, సూచనలతో దేశంలోనే ప్రతిష్టాత్మక ఎన్ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్ టీచర్స్ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆయా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు.మా హయాంలో ఎన్నో సౌకర్యాలు సమకూర్చాం మా ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా వీటిలో మరిన్ని సౌకర్యాలను సమకూర్చి, మరింత అభివృద్ధి చేయడమే కాకుండా ఆన్లైన్ కోచింగ్, ఇంటరాక్టివ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపర్చాం. మంచి ఫలితాలను కూడా సాధించాం. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40 వేలతో పాటు వారికి ల్యాప్ట్యాప్లు కూడా ఇచ్చాం. ఇప్పుడు వీటన్నింటినీ పట్టించుకోకుండా బాగా నడుస్తున్న పాఠశాలల్లో విద్యార్థులను బలవంతంగా తరలించి ఎందుకు వారిని కష్టపెడుతున్నారు? విశాఖ లాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందల మంది విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు.గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ, వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటారా? చంద్రబాబూ.. మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు. మీరు పెడతామంటున్న కొత్త వాటిలో ఇంటర్మీడియట్ నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్తో పెట్టిన స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లను నిర్వీర్యం చేయడం సరికాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చిన చోట చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకుల పట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
పులివెందుల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగావివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు మహిళలు, యువతులు వైఎస్ జగన్ను కలిసి రాఖీలు కట్టి తమ అభిమానం, ఆప్యాయతను చాటుకున్నారు. వారందరితో ఆత్మీయంగా మాట్లాడి వైఎస్ జగన్.. సోదరుడిలా ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రజాదర్బార్కు వచ్చిన మరికొంత మంది తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, వాటికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వైఎస్ జగన్ను కలిశారు. -
ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు: వైఎస్ జగన్ కీలక సూచనలు
పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు.స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ‘‘వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి. పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి.కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కష్టం కాదు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగించాలి. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసి, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
YS జగన్ కు ఘన స్వాగతం
-
కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...
-
నీటి విడుదల ప్రారంభమైందో లేదో.. వెలిగొండలో అపశ్రుతి..!
-
నేడు, రేపు పులివెందుల లో వైఎస్ జగన్ పర్యటన
-
వెలిగొండ సొరంగంలో దూరి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-
పులివెందులలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు. ఇవాళ, రేపు (సెప్టెంబర్ 1,2) పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు.భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
నేడు, రేపు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. 2న ఇడుపులపాయలో జరిగే దివంగత సీఎం వెఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. తొలుత.. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
పులివెందులకు YS జగన్..
-
వెలిగొండ లెక్కలు బయటపెట్టే దమ్ముందా.. శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలో జరిగే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు.01.09.2026 షెడ్యూల్ ఇలా.. వైఎస్ జగన్ సెప్టెంబర్ 1న(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు.02.09.2026 షెడ్యూల్..సెప్టెంబర్ 2న ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.చదవండి: తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్టు బాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్ చోరీ -
విజయసాయి వ్యాఖ్యలపై మల్లాది విష్ణు కౌంటర్..
-
జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా...? బొప్పరాజు రియాక్షన్
-
వెలిగొండకు జగన్ అప్పుడే.. క్రెడిట్ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!
-
బాబూ... చెత్త ఎవరిది? సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు భలే ప్రకటనలు చేస్తుంటారు. వాటిని ఎల్లో మీడియా పరమ పవిత్రం అన్నట్లుగా ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేస్తుంటుంది. చంద్రబాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే రాజకీయాలలో చెత్తను తొలగిద్దాం.. అని అన్నారు. మామూలుగా అయితే ఇది ఆహ్వానించదగిందే. కాని ఆయన లక్ష్యం వేరు. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన అనుకోవచ్చేమోకాని, వాటిని విన్నవెంటనే, పత్రికలలో చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది అధికార పార్టీలో ఉండేవారు చేసే అక్రమాల గురించే కదా! ఆ విషయాన్ని ఆయన పట్టించుకోకుండా స్పీచ్లు ఇస్తుండడం విశేషం.మనం రాజకీయాలలో ఉన్నవారిని అలాంటి పదాలతో సంభోధించడం సరైన పద్దతి కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అసలు రాజకీయాలలో చెత్త అంటే ఏమిటో ఆయన ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది కదా! ఎవరిపైన కేసులు ఉంటే వారు ఆ కోవలోకి వస్తారని అన్న భావనా? లేక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే దానిని ఆ విధంగా పరిగణించాలన్న అర్థమా? ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసేవారిపై వ్యాఖ్యలా?ఒక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జాతీయ స్థాయిలో ప్రజస్వామ్య సంస్కరణల వేదిక ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏమి ఉంది? ఏపీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయనే కదా! అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీదే కదా! నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబుది నాలుగో స్థానం అని అందులో ప్రకటించారు. ఈయనపై 19 క్రిమినల్ కేసులు ఉంటే, కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని రిపోర్టు చెబుతుంది. ఆయన శిష్యుడుగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయట. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.వీటిలో పెక్కు రాజకీయపరమైన కేసులు ఉండవచ్చని వీరు వాదించవచ్చు. కాని ఎదుటి పక్షాలపై అలాంటి కేసుల ఆధారంగానే చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారే! అక్కడే వచ్చింది సమస్య. తాను ఎవరిపైన ఆరోపణ చేస్తే అందులో నిజం ఉందని అనుకోవాలన్నది ఆయన భావన. అదే తనపై ఎవరైనా ఆరోపణ చేస్తే ఎవరూ నమ్మకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివారిపై బురద వేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆ బురద తమపై కూడా పడే అవకాశం ఉంటుందని వారు గుర్తించాలి కదా! తనకు మీడియా బలం ఉంది కనుక తను చెప్పిందే జనంలోకి వెళుతుందని చంద్రబాబు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకే నష్టం.ఇవి కూడా చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవ చేస్తూ అనేక విషయాలను ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్తో పోస్టులు వస్తున్నాయి. గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీని అంటూ తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పిలిపించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా అనుచితంగా ఉంటున్నాయి. చంద్రబాబు తన హోదాను, సీనియారిటీని కూడా మర్చిపోయి ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజలు నిజాయితీగా ఉంటే నాయకులు తప్పులు చేయరట. ఎన్నికలలో డబ్బు ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలదట. అది జరిగితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందట. అంటే ఇప్పట్లో రాష్ట్రం స్వర్ణాంధ్ర కాదని పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా? ఎంతసేపు ప్రజలను నిందిస్తున్నారే తప్ప, తాము డబ్బు పంచకుండా ఎన్నికలలో పోటీచేస్తామని మాటవరసకు చెప్పలేకపోతున్నారన్న విమర్శ వస్తోంది.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే నేరుగా రాజకీయాలలో డబ్బు ప్రభావం తెచ్చిందే చంద్రబాబు అని స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అధినేత పీఏ వందల కోట్లు సంపాదించారని ఆయన ఏ ఆధారంతో చెప్పారో తెలియదు. కాని చిత్రం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీటీడీనే రెండువేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. దాని గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా? స్కిల్ స్కామ్లో ఆయన పీఏ అరెస్టు కాకుండా అమెరికాకు పంపించిందెవ్వరో తెలియదా! స్కిల్ స్కామ్లో అప్పటి సీఐడీ చేసిన అభియోగాలపై ఎన్నడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాయింట్ వైజ్ వివరణ ఇచ్చి, తానేమి తప్పు చేయలేదని చెప్పి ఉండాలి కదా!ఈ స్కామ్లో ఏ అధికారులు అరెస్టు అయింది అందరికి తెలుసే. డీఎస్సీ, ఏపీపీఏస్సీ అంశాలను చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లు ప్రస్తావిస్తూ తమ వాదన సమర్థించుకునే యత్నం చేస్తున్నా, జగన్ విసిరిన సవాల్, అంటే సీబీఐ విచారణకు సిద్దపడకపోవడం వారి బలహీనతగా కనిపించదా! నకిలీ మద్యంతో గత ప్రభుత్వంలో 30వేల మంది చనిపోయారని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.విశేషం ఏమిటంటే కూటమి అధికారంలోకి వచ్చాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువు గ్రామం వద్ద టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్నే పెట్టిన విషయం బహిర్గతం అయింది. అలాంటివి ఏవైనా జగన్ టైమ్లో కనిపించాయా? అయినా ఈ ఆరోపణలు ఏమిటో! చంద్రబాబు స్పీచ్ ఇస్తున్న టైమ్లోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తీవ్ర ఆరోపణ చేశారే. ఈ రెండేళ్లలో 200 కోట్లు భూ దోపిడీ, ఇతరత్రా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరి వాటిపై విచారిస్తానని ఎందుకు చెప్పలేకపోయారు.అంతేకాదు. అదే ఎమ్మెల్యే తనకు ప్రతినెల మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయే!విజయవాడ టీడీపీ ఎంపీ వర్గంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల మాటేమిటి? గంజాయి, మట్టి, ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా అక్రమాలు చేస్తున్నదానిపై ఎన్ని ఆరోపణలు చేసింది ఆయనకు తెలియదా? వాటిపై చర్య తీసుకోకపోగా పార్టీ కమిటీ కొలికపూడిని పిలిచి మందలించిందని వార్తలు వచ్చాయే. ఇటీవలే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోలీస్ స్టేషన్ అడ్డగానే దందాలు చేస్తున్నట్లు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారే. వారిద్దరు బహిరంగంగా మాట్లాడవద్దని సలహా ఇస్తే సరిపోతుందా!ఇక మహిళలను వేదించిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను కనీసం పిలిచి కోప్పడ్డారా? ఒక మంత్రే తనను వేధించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు చేస్తే ఏమి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియచేసి ఉండాల్సింది కదా! ఇలా చెప్పుకుంటూ పోతే భారతం అంత అయ్యే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ అద్వాన్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.ఇక మంత్రి లోకేష్ డీఎస్సీపై ఐదో సారి చర్చకు రమ్మన్నా రావడం లేదని సభలలో ఉపన్యాసాలు ఇచ్చి, జనం వాటినే నమ్మాలని తండ్రి మాదిరే అనుకుంటే ఎలా? జగన్ విసిరిన సీబీఐ సవాల్ను దమ్ముగా ఎదుర్కుని స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరగలేదని రుజువు చేసుకోవచ్చు కదా! చంద్రబాబు, లోకేష్లు తమను తాము పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ఎదుటివారిపై నిందలు మోపే ముందు, అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు అవి తమకు కూడా తగులుతాయేమో చూసుకుని మాట్లాడితే వారికే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్
-
శిలాఫలకమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ది
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ చరిత్రను మార్చేలా కొన్నాళ్లుగా సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారం, ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి.. క్రెడిట్ చోరీ యత్నాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర చాలా స్పష్టం.. శిలాఫలకం మాత్రమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ గారిది.. కీలక జంట సొరంగాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది.. ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ’ అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు.. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి.. నల్లమలసాగర్ను నింపి.. రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించాలని హితవు పలికారు. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..నాన్న స్వప్నం సాకారం కావడం సంతోషంగా ఉంది..నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం.. మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం.. ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని. కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. చంద్రబాబు గారూ వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ గారిది.. కీలక జంట సొరంగాల పూర్తి ఘనత మా ప్రభుత్వానిది.. ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ.1996 నుంచి 2004 వరకూ ఖర్చు చేసింది కేవలం రూ.పది లక్షలే.. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే.. చంద్రబాబు గారూ మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావుడిగా, అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చు చేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది.జలయజ్ఞంలో వెలిగొండకు సమగ్రరూపం ఇచ్చిన వైఎస్సార్వైఎస్సార్ గారు ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు. వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైఎస్సార్ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికి కూడా బ్రేక్త్రూ సాధించలేకపోయారు. మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేం సిద్ధం చేశాం. మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు? ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?వెనుకబడిన ప్రాంతానికి తీవ్ర అన్యాయం..మరోవైపు మీరు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధం చేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు? నల్లమలసాగర్కు నీటిని ఎందుకు తరలించలేదు? రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు? మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా? చంద్రబాబు గారూ ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టండి. నల్లమలసాగర్ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి. -
‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి? చంద్రబాబు క్రెడిట్ చోరీకి వేరే ఇంకేం సాక్షాలు కావాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు! విశాఖలో డేటా సెంటర్.. భూముల సమగ్ర రీ సర్వే,.. గత ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకుంటున్న రీతిలోనే ఆయన దృష్టి తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. ఈ నెల 31న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాలు (ట్విన్ టన్నెల్స్) ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేస్తున్నానని.. మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్నానంటూ ‘ఎక్స్’ ద్వారా సీఎం చంద్రబాబు గొప్పగా అబద్ధాలు చెబుతుంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ హయాంలో రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండలో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు రూ.1,301.56 కోట్లతో పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. 96 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి 2024 జనవరి నాటికే పునరావాసం కల్పించింది. మిగతా 7,225 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వైఎస్ జగన్కు పేరొస్తుందనే నిర్వాసిత కుటుంబాలకు 26 నెలలుగా పునరావాసం కల్పించకుండా.. నల్లమలసాగర్కు కృష్ణా జలాల తరలింపుపై చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తూ వచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. నిర్వాసిత కుటుంబాలకు రూ.1,301.56 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.758 కోట్లను ఇటీవల బాబు సర్కార్ చెల్లించింది. బాబు సర్కారు జాప్యం వల్ల ప్రకాశం బ్యారేజీ మీదుగా 2024–25, 2025–26లో వరుసగా 848.96 టీఎంసీలు, 1,652.12 టీఎంసీల చొప్పున కృష్ణా వరద జలాలు సముద్రంలో కలిశాయని సాగునీటి రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హయాంలో నాసిరకంగా ఫీడర్ కెనాల్ పనులు..గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఖరీఫ్ సీజన్లోనే కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు విడుదల చేసే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన 5.2 కి.మీ.లలో గట్లు (ఎంబాక్మెంట్) పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2024లో కురిసిన వర్షాలకు టీడీపీ హయాంలో పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ చానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్వాల్, మిగతా చోట్ల కాంక్రీట్ లైనింగ్ పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. అస్మదీయ కాంట్రాక్టర్కు అధిక ధరలకు బాబు సర్కార్ కట్టబెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ముడుపులు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.‘కొండంత’ స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత వైఎస్సార్..⇒ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ. పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1991–93లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు. ⇒ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేల ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. ⇒ జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.ఇంజినీరింగ్ అద్భుతం.. నల్లమలసాగర్ వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్)ను కలుపుతూ మూడు డ్యామ్లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటి రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్సార్ పూర్తిచేశారు.హామీని నిలబెట్టుకున్న వైఎస్ జగన్..⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని తన పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వెలిగొండను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. ⇒ 2014–19 మధ్య టీడీపీ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది (2021) పూర్తి చేయించారు. ⇒ రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ⇒ రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. తద్వారా రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. ⇒ శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ⇒ 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. ⇒ 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. ⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. ⇒ వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ రూపొందించిన ప్రణాళికలో భాగంగా దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2.58 టీఎంసీలు, పామూరు నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుపాక్చరింగ్ జోన్)కు 1.27 టీఎంసీల సరఫరాకు లైన్ క్లియర్ చేశారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృది్ధకి ఊతం ఇవ్వడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.అప్పుడూ ఇప్పుడూ బాబు సర్కార్ దోపిడీ..2014–19 మధ్య జరిగిన అక్రమాలను కడిగేసిన కాగ్⇒ ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు.. అదే ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసమే వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు సర్కార్ దోపిడీకి నిదర్శనం. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66. 44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. ⇒ 2017.. 2018.. 2019.. ఇలా ఎప్పటికప్పుడు వెలిగొండ పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తూ వచ్చిన చంద్రబాబు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో ఈ దోపిడీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది. -
చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ చోరీపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తాను చేయని దానిని చేసినట్లు చెప్పుకోవడంపై వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. దీనిలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరి హయాంలో ఏం చేశారో లెక్కలతో సహా వివరించారు వైఎస్ జగన్. ఈ మేరకు ‘ ఎక్స్’లో పోస్ట్ చేశారాయన. చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ యత్నాలు‘నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని. కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. చంద్రబాబూ.. వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది… సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది. కీలక జంట సొరంగాల పూర్తి మా ప్రభుత్వానిది. మీరు ఖర్చు చేసింది కేవలం రూ. 10 లక్షలుఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ. చంద్రబాబూ… మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావిడిగా అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు. వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైఎస్సార్ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికీ కూడా బ్రేక్త్రూ సాధించలేకపోయారు. మొత్తం మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తిచేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేము సిద్ధం చేశాం. మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?, ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?, అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి మరోవైపున తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు?, వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు?చంద్రబాబూ.. ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండిప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?, వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?, జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధంచేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు?, నల్లమలసాగర్కు నీటిని ఎందుకు తరలించలేదు?, రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు?, మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా?, చంద్రబాబూ.. ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండి. నల్లమలసాగర్ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి.పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి’ అని డిమాండ్ చేశారు. నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక… pic.twitter.com/nDineOXzWb— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2026 ఇదీ చదవండి:బాబూ.. చిరిగిన బ్యాగూ! -
వెలిగొండ వెలుగులు జగన్ వే
-
అంబటి రాంబాబుకి జగన్ పరామర్శ
-
అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెకు డాక్టర్లు స్టంట్లు వేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అంబటి చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: బాబూ..! చిరిగిన బ్యాగూ! -
అవమానించిన ఒక్కొక్కరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి.. జగనన్న 2.0 మీ ఊహకే వదిలేస్తున్న
-
తెలుగు భాషా దినోత్సవం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో.. సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న… pic.twitter.com/tTKbMnguS0— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2026 -
వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న బాటింగ్ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న దిగులు ఎల్లో మీడియాకు బాగానే పట్టుకున్నట్లు ఉంది. అందుకే జగన్ మీడియా సమావేశంపై నేరుగా దాడి చేయడానికి ఈ తెలుగుదేశం మీడియా పడరాని అగచాట్లు పడుతోంది.జగన్ బుధవారం నాడు కరువు సమస్య, బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వ డ్రామా, గంజాయి ప్రదేశ్గా మారిన ఏపీ, వెలిగొండ క్రెడిట్ చోరీ మొదలైన అంశాలపై డిటైల్డ్గా తన మీడియా సమావేశంలో మాట్లాడారు. వీటన్నిటికి ఆయన ఆధారాలు, సాక్ష్యాలు చూపుతూ తన వాదన వినిపించారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వలేక, టీడీపీ నేతలు, మంత్రులు కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. కాని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి మాత్రం రాజును మించిన రాజభక్తితో, టీడీపీని కాపు కాసే బాధ్యత తమదే అన్నట్లుగా జగన్పై నేరుగా దాడి చేసింది. జగన్ చెప్పినవి అబద్దాలని రాసేసుకుంది. ఆ రకంగా జగన్పై బురద వేసి ఆ మీడియా సంతృప్తి చెందింది.జగన్ చెప్పిన విషయాలను పరిశీలిద్దాం.. ముందుగా కరువు ప్రస్తావనను జగన్ చేశారు. రాష్ట్రంలో కరువు ఉందన్నది వాస్తవమే కదా!స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆ విషయాన్ని చెబుతున్నారు కదా! అయినా పట్టిసీమ నుంచి నీరు వచ్చేసిందని చెప్పి ప్రకాశం బారేజీ వద్ద పూజలు చేసి నీళ్లు వదలి కృష్ణా డెల్టా కింద మంత్రులు నీరు ఇస్తున్నట్లు చెప్పింది అవాస్తవమా? ఆ సందర్భంలో వీరంతా ఏ రకంగా గప్పాలు పోయారో తెలియదా! ఆ విషయాలనే కదా జగన్ గుర్తు చేసింది.వాటికి ఆధారంగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను కూడా చూపించారు కదా! కాకపోతే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు కరువు అన్న పదాన్ని వాడకుండా ఎల్నినో అని చెప్పుకుని జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. మంత్రుల మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు నష్టపోతున్నారని జగన్ తెలిపారు. ఇందులో తప్పేముంది? అబద్దం ఏమి ఉంది. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ మొదలైన ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వార్తలు ఎల్లో మీడియాలో కూడా వచ్చాయి కదా!రైతులను, కరువు బారిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు కరువును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలేమిటి? ఇంకా ప్లానింగ్లోనే ఉన్నామని కదా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది. పలు చోట్ల ముఖ్యంగా రాయలసీమ నుంచి వలసలు ఎలా సాగుతున్నాయో పత్రికలలో వార్తలు వచ్చాయి కదా!ఆగస్టు 11నాటికి శైశైలంలో 879 అడుగుల నీటి మట్టం వచ్చినా పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎందుకు ఇవ్వలేదన్నది జగన్ ప్రశ్న. రైతులకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వంటి పాలకులు ఉంటారనే, తాము రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ను ఆరంభించామని జగన్ తెలిపారు. ఇది వాస్తవమే కదా! ఈ స్కీమ్ను జగన్ వేగంగా ముందుకు తీసుకువెళుతున్న సమయంలో ప్రభుత్వం మారడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారని చంద్రబాబు ఈ స్కీమ్ను నిలిపివేయడం కరెక్టే కదా! రేవంత్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినా చంద్రబాబు ఖండించలేకపోయారే. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు జగన్ చేసిన విమర్శలకు జవాబు ఇస్తూ ప్రతి విమర్శలు చేశారే కాని, ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నది వివరించినట్లు కనిపించలేదు.జగన్ టైమ్లో రైతులకు ఉచిత భీమా అమలు చేస్తే ఈ ప్రభుత్వం దానిని ఎందుకు కొనసాగించలేకపోయింది? రామానాయుడు మాత్రం కరువు నేపథ్యంలో తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ తర్వాత ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కరువు సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులు గడ్డుగా మారాయి. వాటిని ఎలా నివారిస్తారన్న జగన్ ప్రశ్నకు బదులు ఇచ్చినట్లు లేదు.జగన్ టైమ్లో వివిధ స్కీమ్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలవారికి ఆర్థిక సాయం అందించడంతో చేతిలో డబ్బులు ఆడాయి. వ్యాపారాలు కూడా సాగాయని ఆర్థిక నిపుణులు కూడా అంగీకరించారు. జగన్ టైమ్లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వస్తే ఈ ఎల్లో మీడియా ఎంత నీచమైన రాతలు రాసిందో మర్చిపోయి ఉండవచ్చు. ప్రపంచం అంతటా ఏర్పడినట్లే ఏపీలో కూడా అప్పట్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం సూచనల ప్రకారం రుణం తీసుకోవలసి వచ్చింది. మిగిలిన రాష్ట్రాలకన్నా మెరుగ్గా కరోనాను జగన్ ప్రభుత్వం ఎదుర్కుంది. అయినా జగన్ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసిందా? లేదా? ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయితే కోర్టులలో కేసులు వేయించి వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశాలు తెచ్చింది ఎవరో తెలియదా!తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అని చంద్రబాబు అంటే అదేమిటని ప్రశ్నించకపోగా, ఎల్లో మీడియా ఔను, ఔను అని భజంత్రి వాయించాయే. ఇప్పుడు కరువు సమస్య వల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంటే వారిని మభ్య పెట్టడానికి ఎల్లో మీడియా ఎల్నినో, యుద్దం అంటూ సాకులు ప్రచారం చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ గురించి కూడా ఎల్లో మీడియా తనదైన శైలిలో టీడీపీ ఖాతాలో వేయడానికి తహతహలాడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ లేకపోతే ఈనాటికి కూడా ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చేది కాదన్నది పచ్చి నిజం.చదవండి: బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?జగన్ రెండేళ్ల క్రితం సొరంగాలకు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ,నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయిర్లోకి నీరు తరలిస్తామని ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. రెండేళ్ల క్రితం ఈ పని పూర్తి చేయకుండా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం కాదా! వైఎస్సార్సీపీ, జగన్ కలిసి సుమారు 31 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్విస్తే, చంద్రబాబు హయాంలో 6.68 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారన్నది నిజమా? కాదా? ఈ క్రెడిట్లో ఎవరి వాటా ఎంతో చెబితే తప్పుకాదు. మొత్తం క్రెడిట్ను చోరీ చేయాలని చూస్తేనే ఇబ్బంది. ఇక ఏపీ గంజాయి ప్రదేశ్గా మారిందని జగన్ ఆరోపణ.ఈ మధ్యనే ఏకంగా పోలీసుల వాహనంలోనే గంజాయి తరలించిన వార్తను ఎల్లో మీడియా మర్చిపోయిందా? నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. వంద రోజుల్లో గంజాయి నిరోదించి చూపుతామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు చేసిన ప్రగల్బాలను జగన్ ప్రస్తావించారు. ఆ ప్రకారం వారు చేయలేకపోయిన విషయాన్ని జగన్ ఎండగట్టారు. ఇక బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఎల్లో మీడియా నిస్సిగ్గుగా భుజాన వేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: బాబూ.. డీస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?గతంలో జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జీఓ ఇస్తే తప్పుపట్టారా?లేదా?దానిపై టీడీపీ నేతే కోర్టుకు వెళ్లారా?లేదా?ఆ తర్వాత అది ఆగిపోతే జగన్ పార్టీపరంగా ఆయా పదవులను ఏభై శాతం పైగా బీసీలకు ఇచ్చారే! ఆ విషయాన్ని ఆయన లెక్కలతో సహా చూపించారు. మరి చంద్రబాబు మళ్లీ ఇప్పుడు జీఓ ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే దానికి కోర్టు ఆమోదం తెలుపుతుందా?పార్లమెంటులో సంబంధిత చట్ట సవరణ చేయిస్తామని ఎందుకు టీడీపీ ప్రకటించలేదు?ఇక వైఎస్సార్సీపీ బీసీ నేతలపై కేసులు అక్రమమా? కాదా? అన్నది అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలపై అప్పట్లో అవినీతి కేసులు వస్తే ఇదే ఎల్లో మీడియా గుండెలు బాదుకుని గోల, గోల చేసిందే. టీడీపీ ముఖ్యనేత పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలను కనుగొన్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం బహిరంగ రహస్యమే కదా! ఆ కేసు ఏమైందో చెప్పి, ఆ తర్వాత వైఎస్సార్సీపీపై ఎన్ని ఆరోపణలు చేసినా ఆలోచించవచ్చు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లు టీడీపీతో పాటు ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న విషయాన్ని జనం గమనించరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు
-
వైఎస్ జగన్ చొరవతోనే సురక్షితంగా వచ్చిన మత్స్యకారులు
తిరుపతి అర్బన్: సముద్రంలో వేటకు వెళ్లి 24 రోజుల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుమిట్టాడిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, కేంద్రంపై తీసుకొచి్చన ఒత్తిడే కారణమని వైఎస్సార్సీపీ నేత, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చెప్పారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 3న ఓడలరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తాము కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్కు లేఖలు రాసి పరిస్థితి తీవ్రతను వివరించినట్లు తెలిపారు.శ్రీలంక, బంగ్లాదేశ్, మయ న్మార్ ఎంబసీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసినట్లు చెప్పారు. పార్టీ నేత వాసుపల్లి జానకిరామ్ కోస్ట్గార్డ్ హెడ్ క్వార్టర్స్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేయించారని చెప్పారు. వైఎస్సార్సీపీ వినతికి స్పందించిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి, విదేశీ ఎంబసీలకు, కోస్ట్ గార్డ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో మత్స్యకారుల భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గురుమూర్తి మండిపడ్డారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళితే తిరిగి ప్రాణాలతో వస్తారో, రారో అన్న దుస్థితి నెలకొందని చెప్పారు.వైఎస్ జగన్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడంతో పాటు, వేట నిషేధ సమయంలో ‘మత్స్యకార భరోసా’ ఇచ్చి ఆదుకుందని తెలిపారు. వారికి డీప్ సీ ఫిషింగ్ బోట్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ ఫైళ్లన్నీ అటకెక్కించిందన్నారు. పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా ‘సేఫ్టీ ఆడిట్’ నిర్వహించలేదన్నారు. మహా రాష్ట్ర ప్రభుత్వం జాలర్లకు శాటిలైట్ ఫోన్లు ఇస్తుంటే, ఇక్కడ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.బోట్లలోని ట్రాన్స్పాండర్లు, నావిగేషన్ పరికరాలు పనిచేయకపోయినా పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రతి బోటుకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, శాటిలైట్ ఫోన్లు ఇవ్వాలని, ట్రాన్స్పాండర్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నావిగేషన్ పరికరాలు 24 గంటలూ పనిచేసేలా సోలార్ పవర్ బ్యాకప్ ఏర్పాటుచేసి, ప్రతి బోటుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు అందించాలని కోరారు. -
మహిళలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
తాడేపల్లి. రేపు(శుక్రవారం, ఆగస్టు 28వ తేదీ) రాఖీ పండుగను పురస్కరించుకుని ఏపీలోని మహిళలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేశారు.రక్షాబంధనం అన్నది ఆత్మీయతలూ అనురాగాల పండుగ అని గుర్తు చేసిన వైఎస్ జగన్.. అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
-
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-ఆటో ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని పేర్కొన్నారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా తెలిసిందని, ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమన్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని వైఎస్ జగన్ కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
34% రిజర్వేషన్లు.. మహా డ్రామా
వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ.. ఓన్లీ జగన్ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు మా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకున్నాం. 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు వైఎస్ జగన్ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చాడు. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు.. అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్లు పేరిట మరోసారి చంద్రబాబు మహా డ్రామాకు దిగాడని విమర్శించారు. మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడని.. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టి వేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనేనంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను ఆపేయడంతో పాటు సూపర్ సిక్స్, సూపర్సెవెన్ హామీలను చెత్త బుట్టలో వేసి బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయంగా బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక, వారి మీద అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది మేమే ‘2019లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 176 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలకు సిద్ధం అయ్యాం. కానీ చంద్రబాబు తన పార్టీ నాయకుడు, తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నందుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే. అప్పుడు బీసీలకు పథకాలే పథకాలు.. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ.. ఓన్లీ జగన్ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి చెబుతుంటే రోమాలు నిక్క»ొడుస్తున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాడు. ఈ పథకాలన్నింటినీ ధ్వంసం చేశాడు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అంటూ ఇచ్చిన బాండ్లను చెత్తబుట్టలో పారేశారు. చంద్రబాబుదంతా మోసమే. నిజంగా బీసీలకు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో అందరూ ఆలోచించాలి. బీసీలు ఎదుగుతుంటే బాబు చూడలేరు రాజకీయంగా బీసీలు ఎవరైనా ఎదుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేక అక్రమ కేసులతో జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టాడు. ఒక మహిళా ఎస్సైని అడ్డుపెట్టుకుని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి.. తప్పుడు కేసులు పెట్టి, ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ను జైలుకు పంపారు. టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపివేయించి, అది చేసింది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని చెప్పి.. ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు సునీల్ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో జైలుకు పంపాడు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమవుంటే ఇవన్నీ చేస్తాడా? విశాఖలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళితే అందులో ఆరుగురు చనిపోతే, కనీసం వారిని చూడటానికి స్థానిక మంత్రి కూడా వెళ్లలేదు. ఈయన బీసీల గురించి మాట్లాడతాడు. విద్యా దీవెన, వసతి దీవెన లేక చదవులు మానేస్తున్న వారిలో అత్యధికులు బీసీలే ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. మరి చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో అందరూ ఆలోచించాలి.34% రిజర్వేషన్లకు మించి బీసీలకు పదవులు ఇచ్చాం⇒ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ ఐదేళ్లలో మేం తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.⇒ మా కేబినెట్లో 25 మంది ఉంటే, అందులో 11 మంది బీసీలే. అంటే దాదాపు 40 శాతం మంత్రి పదవులు బీసీలకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురు బీసీలను ఈ జగన్ రాజ్యసభకు పంపారు. అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం. ⇒ చంద్రబాబు 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేము 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే అంటే 44 శాతం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకే ఇచ్చాం. అంటే 48 శాతం వారికే. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో 6 అంటే 46 శాతం బీసీలకే. 13 మేయర్ పదవుల్లో 9 అంటే 69 శాతం బీసీలకే. 636 ఎంపీపీ స్థానాల్లో 239 అంటే 38 శాతం బీసీలకే. మున్సిపల్ ఛైర్మన్ పదవులు 84లో 44 అంటే శాతం బీసీలకే.⇒ 639 జెడ్పీటీసీల్లో 227 అంటే 36 శాతం బీసీలకే. 8,239 ఎంపీటీసీల్లో 3,361 అంటే 41 శాతం మంది బీసీలే. 10,536 సర్పంచుల్లో దాదాపు 4 వేల మంది బీసీలే. అంటే 38 శాతం వారికే. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39 శాతం బీసీలకే. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకు ఇచ్చాం. అంటే 37 శాతం ఇచ్చాం. ⇒ 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు కలలో కూడా ఆలోచన రాలేదు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ పనులు–కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చట్టం చేసి మరీ ఇచ్చాం. ఇందులో మహిళలకు కూడా 50 శాతం వాటా ఉండే విధానం మేం తీసుకు వచ్చాం. దేశంలోనే ఇది తొలిసారి. ⇒ బీసీలకు చట్ట సభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించాం. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. -
కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రే
జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి, విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. ఈ రోజు నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి పాలకులు ఉంటారనే... రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయలసీమ ప్రజల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత రైతులకు మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ2025లో అక్రమాలు, పేపర్ లీకేజీల మీద సాక్ష్యాలు, ఆధారాలతో గత వారం సమగ్రంగా మాట్లాడా. ఏపీపీఎస్సీ గ్రూప్ృ1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలపై సాక్ష్యాలతో వాస్తవాలను వివరించా. ఈ రెండింటిపై సీబీఐ విచారణకు మేం రెడీ.. మీరు రెడీనా? అని ఛాలెంజ్ కూడా చేశా. నేను ఛాలెంజ్ చేశాక ఇంత వరకూ ఆ అంశాలపై వాళ్లు మాట్లాడలేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలపై వక్రీకరణలు చేస్తున్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. జూన్లో సాధారణ వర్షపాతం కంటే 25 శాతం లోటు వర్షపాతం నమోదు అయిందని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా, సాగుకు నీళ్లు ఇస్తున్నామంటూ జూలై 8న వెన్నుపోటు పార్టీ మంత్రులు ఫొటోలకు ఫోజులు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీరి మాటలు నమ్మి సాగు ప్రారంభించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో తీవ్ర కరువు తాండవిస్తోందని గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయకట్టు చివర ఉండే ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించారంటూ చేసిన ప్రచారాలను నమ్మి ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీటిమట్టం ఉన్నప్పటికీ చంద్రబాబు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వకుండా సీమ ప్రాజెక్టులన్నీ ఒట్టిపోయేలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పులిచింతల నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ అక్రమంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడం.. రైతులకు అండగా నిలవడంలో చంద్రబాబు సర్కార్ ఘోర నిర్లక్ష్యం, దారుణ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. సీమలోనే కాదు.. కోస్తాలోనూ కరువు ఛాయలురాష్ట్రంలో కరువు ప్రమాద ఘంటికలు మోగుతున్నా చంద్రబాబులో కనీస స్పందన లేకుండా పోయింది. జూన్, జూలై, ఆగస్టు.. ఇప్పటి వరకూ 52 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 41.78 శాతం, రాయలసీమలో 52.36 శాతం.. ఇలా రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులున్నా కుంభకర్ణుడి తరహాలో చంద్రబాబు నిద్ర నటిస్తున్నారు. రైతులకు మంచి చేస్తూ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. జూన్ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకూ సాధారణ వర్షపాతం 388.54 మిల్లీవీుటర్లు (ఎంఎం) నమోదు అవ్వాల్సి ఉండగా 189.62 ఎంఎం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో 688కిగానూ 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. అంటే 91 శాతం రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. ఈ 625 మండలాల్లో 434 చోట్ల 19 శాతం కంటే అధికంగా లోటు వర్షపాతం ఉంది. మరో 191 మండలాల్లో 19 శాతం నుంచి 59 శాతం వరకూ తీవ్ర లోటు వర్షపాతం నెలకొంది. ఇక 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఏఎస్ఆర్, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షపాత లోటు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నిత్యం కరువు ఉండే రాయలసీమ జిల్లాలే కాకుండా కోస్తాంధ్ర జిల్లాల్లోనూ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతాంగం, ప్రజలు అల్లాడుతుంటే దీన్ని గుర్తించడానికి కూడా వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు ఇష్టపడటం లేదు. రైతులను ప్రజలను ఆదుకోవడానికి ఏ మాత్రం అడుగులు ముందుకు వేయడం లేదు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 63 లక్షలకు పైగా ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా కేవలం 50 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. అంటే దాదాపు 80 శాతానికే సాగు పరిమితం అయింది. సీమకు నీళ్లివ్వడానికి బాబుకు మనసు రాలేదురాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఈ ఆగస్టు 11వ తేదీనే 879.50 అడుగులకు చేరుకుంది. అవకాశం ఉన్నా కూడా, పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాలేదు. శ్రీశైలంలో 880 అడుగుల్లో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలవచ్చు. 880 అడుగుల నుంచి నీటిమట్టం తగ్గేకొద్దీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం తగ్గుతూ పోతుంది. 854 అడుగుల కంటే కిందకు నీటిమట్టం పడిపోతే... రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలనుకున్నా, ఇవ్వలేని దుస్థితి వస్తుంది. అలాంటిది ఈ రోజు పరిస్థితి గమనిస్తే శ్రీశైలం నుంచి ఎడాపెడా అటు తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేస్తుండగా, ఇటు చంద్రబాబు కూడా రైతుల గురించి ఆలోచించకుండా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. రోజుకు 48 వేల క్యూసెక్కులు నీటిని వాడుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో కేవలం 7 వేల క్యూసెక్కులు ఉంటే ఔట్ఫ్లో 48 క్యూసెక్కులు ఉంటోంది. నికరంగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల దిగువకు చేరుకుంటుంది. ఈ రోజు బహుశా 165 టీఎంసీల నీళ్లున్నాయి. రోజుకు 3.5 టీఎంసీల లెక్కన వాడుతూ పోతే మూడు వారాల్లో 75 టీఎంసీల మేర ఖర్చు అయిపోతాయి. 854 అడుగుల నీటి మట్టానికి వచ్చేస్తాం. దీని తర్వాత రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నా ఇవ్వలేం. ఇంతకంటే నీటిమట్టం పడిపోతే పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేం. మరోవైపు ఎల్నినో, కరువు కనిపిస్తోంది. జూన్, జూలై, ఆగస్టు కూడా అయిపోయింది. సెప్టెంబర్ 15 వరకే వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీశైలంలో ఎడాపెడా నీళ్లు తోడేస్తుంటే 854 అడుగుల కిందకు నిల్వలు పడిపోయాక రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా? మరి ఇప్పుడు మీరెందుకు నీరు ఇవ్వడం లేదు? అని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇలాంటి పాలకులు ఉంటారనే.. రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయల సీమ ప్రజల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.ఒక్క పైసా ఇవ్వని దుస్థితి2025 అక్టోబర్లో మోంథా తుపాను వచ్చి రైతులు నష్టపోతే ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా సాయం చేయలేదు. ఉచిత పంటల బీమాను నాశనం చేశారు. సీజన్ ముగిసేలోపే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశారు. ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు. అగ్రి ల్యాబ్్సను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తెచ్చింది. మా హయాంలో ‘సీఎం యాప్’ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలతో పోస్టర్లు ప్రదర్శించే వాళ్లం. ఆ ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసేవారు. తక్షణమే జాయింట్ కలెక్టర్/మార్క్ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రంగంలోకి దిగేవారు. పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో పోటీ సృష్టించేవారు. దీంతో రేట్లు పెరిగేవి. ఈ మాదిరిగా మా హయాంలో ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా నిలిచాం. గిట్టుబాటు ధరలు ఇప్పించాం. ఇప్పుడు ఆ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారు. చివరకు రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేసేశారు. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చిందేమో రూ.19 వేలు. ఏకంగా రూ.41 వేలు ఎగ్గొట్టాడు. ఆదుకునే ఆలోచన ఉందా బాబూ?ఇంత తీవ్రమైన కరువు పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీలు, ప్రజలను చంద్రబాబు ఆదుకున్నారా? అసలు ఆదుకునే ఆలోచన అయినా ఆయనకు ఉందా? ఎంతసేపూ మాపై తప్పుడు ప్రచారం చేయడం, అబద్ధాలు, టాపిక్ డైవర్షన్, రెడ్బుక్పైనే ధ్యాస పెడుతున్నారు. కరువు సమయంలో ప్రజలను ఆదుకోవాలనే ధ్యాస లేదు. జూన్, జూలై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే వర్షాలు పడతాయి. అప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. జూన్లో 25 శాతం, జూలైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. ఆ రెండు నెలల్లోనే సగటున 52 శాతం లోటు వర్షపాతం కనిపించింది. ఇంత లోటు వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్) ఏమైంది? ఆగస్టులోనే దాన్ని అమలు చేసి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇచ్చి ఉంటే ఆగస్టు, సెప్టెంబర్లో కొద్దో గొప్పో కురిసే వర్షాలతో పంటలు పండి రైతులు కొంతైనా బాగుపడేవారు. అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, జొన్నలు, పెసలు ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయ పంటలు. మరి ఎంత మందికి మీరు ప్రత్యామ్నాయంగా ఉచిత విత్తనాలు ఇచ్చారు? విత్తనాల పంపిణీ ఎందుకు జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకుని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేశారు? వర్షపాతం జూలై చివరి నాటికి 52 శాతం లోటు ఉన్న నేపథ్యంలో కరువు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎదుర్కొనే వ్యవస్థ (డ్రౌట్ మానిటరింగ్ సెంటర్లు) పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉండాలి. జిల్లా కంటింజెన్సీ ప్లాన్లు అమలై ఉండాలి. విపత్తు నిర్వహణ ప్రణాళిక (క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్) అమలులోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లాలో డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ఏర్పాటై ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌట్, రిసీలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్స్ పంపిణీ రైతులకు జరిగి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా? ఆగస్టు నెల ముగుస్తోంది. సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. మేత అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు? గుండెల మీద చేయి వేసుకుని తనను తాను చంద్రబాబు ప్రశ్నించుకోవాలని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. కనిష్ట స్థాయిలో సీమ డ్యామ్లలో నీటి నిల్వలురాయలసీమలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. తెలుగు గంగ కెనాల్పై ఆధారపడిన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలు అయితే ప్రస్తుతం కేవలం 55 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ 14 టీఎంసీలు తీసేస్తే అందుబాటులో ఉన్నది 41 టీఎంసీలే. అంటే కేవలం 23 శాతం నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), జీఎన్ఎస్ఎస్ (గాలేరు–నగరి) కింద ఉండే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 59 టీఎంసీలు. వీటిలో ఇప్పుడు కేవలం 31 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే 23 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంటే కేవలం 39 శాతం నీళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ–నీవా) కింద జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి నిల్వ సామర్థ్యం 8.31 టీఎంసీలు. ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 టీఎంసీలు పోనూ కేవలం 2.5 టీఎంసీల నీరే అందుబాటులో ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కరువు తీవ్రత మరింత దారుణంగా ఉంటుందని స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ నీళ్లు మళ్లిస్తుంటే బాబు మౌనంమరోవైపు నాగార్జున సాగర్ కుడి కాల్వ, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ప్రాంతానికి చంద్రబాబు చుక్క నీరు ఇవ్వడం లేదు. ఇంకా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే.. నాగార్జున సాగర్ కింద ఏపీకి సంబంధించిన పులిచింత ప్రాజెక్ట్ ఎగువన, దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా లిఫ్ట్లు కడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం చింతలపాలెం మండలం పాతవెల్లటూరు దగ్గర రూ.1,450 కోట్లతో మహాత్మాగాంధీ పంప్డ్ హౌజ్ నిర్మాణాన్ని వేగంగా చేపడుతోంది. దీని ద్వారా పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలింపు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం. అదే విధంగా తెలంగాణలోనే చింతలపాలెం మండలం బుగ్గమాదారం దగ్గర రూ.394 కోట్లతో రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా పులిచింతల దిగువన కృష్ణా నది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించాలని చూస్తున్నారు. పులిచింతల సామర్థ్యం దాదాపు 45 టీఎంసీలు అయితే ఏకంగా 10.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ల ద్వారా మళ్లించడానికి తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడితే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. కనీసం మాటలు లేవు. అడిగిన దాఖలాలూ లేవు. సాగునీటికి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితులను చంద్రబాబు కల్పించారు.పబ్లిసిటీ స్టంట్తో రైతులను ముంచారు..జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. సాగుకు వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఈరోజు ఆ నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.బాబు నిర్వాకంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టంకరువు వల్ల ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు ఆదుకుంటున్నారా? అంటే అదీ లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్సార్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని భరించి కట్టుకోవాల్సిన దుస్థితి తెచ్చారు. పంటల బీమా పథకం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం గమనిస్తే.. రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో 2022–23 ఖరీఫ్లో 1.18 కోట్ల దరఖాస్తులకు ఉచిత పంటల బీమా వర్తిస్తే.. 2026–27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందకు వచ్చాయి. ఇది స్వయంగా పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు. పీఎంఎఫ్బీవై కింద రాష్ట్రాలు, సంవత్సరాల వారీగా రైతులు, పంటల బీమాలో కవర్ అయిన భూ విస్తీర్ణం, ఇతర వివరాలను స్పష్టంగా కేంద్రం పార్లమెంట్కు ఇచ్చింది. మా హయాంలో నమోదైన 1.18 కోట్ల దరఖాస్తులు ఎక్కడ? బాబు పాలనలో రైతులే ప్రీమియం కట్టుకునే పరిస్థితుల్లో 40 లక్షల దరఖాస్తులు ఎక్కడ? ప్రస్తుతం 30–33 శాతం రైతులే బీమా పరిధిలోకి వచ్చారని తెలుస్తోంది. పైగా ఇంకా దారుణం ఏంటంటే 2023–24కు సంబంధించి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024 జూలైలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున ప్రీమియం కట్టాలి. రైతులు, రాష్ట్ర వాటాను రాష్ట్ర ప్రభుత్వం కడితే 1/3 వాటాను కేంద్రం ఇస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఏకంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది. రూ.1,100–1,800 కోట్లు కట్టి ఉంటే రైతులకు రూ.3 వేల కోట్లు వచ్చేవి. -
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడ, కోదాడ రూరల్/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్పై ఆగిపోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్డ్రైవర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 08యుఎల్ 5112) 42 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వద్ద ఆపి బస్సు చార్జింగ్ పెట్టుకున్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్ డ్యూటీ దిగి రెండో డ్రైవర్కు బస్సు అప్పగించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడవైపు ఐరన్ పిల్లర్లలోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కోదాడ శివారులో అదుపుతప్పి డివైడర్పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్ ట్రాలీ లారీని గమనించకుండా వెనుకవైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాలీ లారీలో ఉన్న ఐరన్ పిల్లర్లు బస్సులోకి చొచ్చుకురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ సీటు వెనుక సీట్లలో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా(24), చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్పై ఉన్నాయి. లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.ఆ బస్సు డ్రైవర్ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.మృతుల్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులే..మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.క్షతగాత్రుల వివరాలు» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్కు చెందిన రాథోడ్ విశాల్లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. » విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ, ఆకుల నవీన్కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్కుమార్ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్కు చెందిన జి.అవినాష్ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.తీవ్ర విషాదకరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు!
చంద్రబాబు పాలనలో ఈ రాష్టంలో ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. కానీ.. ఒక్క గంజాయికి మాత్రం గిట్టుబాటు ధర వస్తోంది. గంజాయి రవాణా స్థాయి నుంచి మాఫియా స్థాయికి చేరింది. పోలీసులనే వాటాదారులుగా చేసి చినబాబు, పెదబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు.నేరస్తులు, పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారు. రేంజ్లుగా విభజించి సిండికేట్గా ఫామ్ అయ్యి.. ఆర్గనైజ్్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు.నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడింది. విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సొహైల్ను విశాఖలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడన్నారు. అసలు అతను తప్పించుకున్నాడా? తప్పించబడ్డాడా? జూన్ 9న ఘటన జరిగితే ఇప్పటి వరకు సొహైల్ను పట్టుకోలేకపోయారు.పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్.. బాధ్యత గల డిపార్టుమెంట్.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలన సర్వం గంజాయి, డ్రగ్స్ మయం అని, మట్టి, ఇసుక, క్వార్ట్జ్, సిలికా, కల్తీ లిక్కర్ అన్నింటా మాఫియానేనని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒకవైపు రాజకీయ వేధింపులకు పాల్పడుతూ, తప్పుడు కేసులు పెడుతూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా పంచేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ దిగజార్చిన తీరును వీడియోలు ప్రదర్శించి చూపుతూ.. ఫోటోలు, సాక్ష్యాధారాలు చూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి వీధికీ బెల్ట్ షాపు..‘‘రాష్ట్రంలో ఒకవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియానే. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను వాళ్లకు నచ్చినవాళ్లకు, వాళ్ల మనుషులకు, బంధువులకు పప్పుబెల్లాలకు కట్టబెడుతున్నారు. రాజధాని పేరుతో అమరావతిలో బిల్డింగ్లు ఎస్ఎఫ్టీకి రూ.21 వేల నుంచి 22వేలు దాటింది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను శెనక్కాయలు, బఠాణీలకు అమ్మేస్తున్నారు. విలువైన భూమి ఎక్కడ కన్పించినా వదలడంలేదు. విశాఖపట్నంలో ఏ భూమినీ వదలడంలేదు. స్కాములు చేస్తున్నారు. ఇవన్నీ గాక డ్రగ్స్, గంజాయి.. బెల్ట్ షాపుల పేరిట కల్తీ లిక్కర్. ప్రతి ఊరుకు, ప్రతి వీధికి చంద్రబాబు తీసుకుపోయాడు. ఇదే రాష్ట్రంలో జరుగుతున్న పాలన. ఎస్సైలు జేమ్స్బాండ్లు అయితే.. చర్యలెందుకు?నిజంగానే ఎస్పీ చెబుతున్నట్టుగా సమాచారం మేరకు రెయిడ్ చేశారంటే.. డీఎస్పీ చెబుతున్నట్టు ఇద్దరు ఎస్సైలు వెళ్తుంటే.. రోడ్డు పక్కన ఒక వ్యక్తి అనుమాస్పదంగా కన్పిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలేసి పారిపోయి ఉంటే.. జేమ్స్బాండ్ 117 మాదిరిగా ఇద్దరు ఎస్సైలు ఛేజ్ చేసి ఉంటే.. వాళ్లకు నువ్వేం చేస్తావ్? శభాష్ అంటూ వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, సీఎం మెడల్, ఇంకో మెడల్ ఇచ్చేలా చేస్తావ్. కానీ అంతటి జేమ్స్బాండ్లకు వీఆర్ ఎందుకు ఇచ్చారయ్యా? నువ్వే ఒకవైపు వాళ్లు జేమ్స్బాండ్లు అంటున్నావ్.. నువ్వే మళ్లీ వాళ్లను వీఆర్ అంటున్నావ్.. చార్జీషీటు అంటున్నావ్.. యాక్షన్ అంటున్నావ్.. మళ్లీ ఇంకొక పక్కన డీఎస్పీ, ఎస్పీ అందరూ వారిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో గంజాయి వదిలి బైక్లో పారిపోయాడంటూ ఎవరిని ఇరికిస్తారో పాపం. ఇప్పటికే ఇరికించే కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా చేస్తున్నారు.పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో!నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది చెప్పడానికి మరో ఉదాహరణ.. మొన్న విజయవాడలో సీఐ వేధింపులు భరించలేక వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతికుమార్ కుటుంబం చేస్తున్న ఆరోపణ ఏంటి? నా కొడుకు చేత చేయకూడని పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇంకో పిల్లాడు సాయికృష్ణ పోలీస్ స్టేషన్లోనే హత్యకు గురై బూడిద కూడా దొరకని పరిస్థితి. ఆ వ్యవహారంలో కూడా ఇలాంటి చర్చే నడుస్తోంది. నిజంగా వ్యవస్థ అన్నది ఏ స్థాయికి దిగజారిపోతుందనేందుకు ఇవన్నీ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్. గ్రానైట్ మాఫియా నుంచి చినబాబు, పెదబాబుకు కలెక్షన్లుఅద్దంకి ఘటనలో వస్తున్న సమాచారం.. ఆ తర్వాత జరుగుతున్నవి చూస్తా ఉంటే.. గ్రానైట్ మాఫియా నుంచి పోలీసులే కలెక్షన్ చేసి ఎమ్మెల్యేకు ఇంత? చినబాబుకు ఇంత? పెదబాబుకు ఇంత? పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ మత్తులోకి వెళ్లిపోయారు. ఆ మత్తులోనే ఎస్సైలు కారులో వెళ్తూ దారిలో ఇదంతా జరిగింది. నిజంగా పోలీసుల సౌలభ్యం కోసం ఐజీలకు రాయలసీమ, కోస్తా అనే రేంజ్లు ఇస్తారు. ఫస్ట్టైమ్ ఏం చూస్తున్నామో తెలుసా? రేంజ్లుగా విభజించి సిండికేట్గా ఫామ్ అయ్యి.. కలెక్షన్ల వసూళ్లలో పాత్రధారులుగా పోలీసులే ఉండటం. ఎమ్మెల్యేల మద్దతుతో వసూళ్లు చేసి చినబాబుకు ఇంత, పెదబాబుకు ఇంత? అని ఆర్గనైజ్్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు. కుప్పంలోనూ విచ్చలవిడిగా గంజాయి..ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి, గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వాళ్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికారపార్టీకి చెందిన నేత అనుచరులు తమిళనాడులో 220 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఇవన్నీ నిజాలు. కుప్పం టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. చంద్రబాబు పాలనలో సర్వం గంజాయి మయం.. సర్వం దోపిడీ మయం.. సర్వం డ్రగ్స్ మయం.. సర్వం నకిలీ లిక్కర్ మయం..క్రమశిక్షణా చర్యలంటూ కప్పిపుచ్చడమెందుకు?» మరి ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని కవరప్ చేసేందుకు ఏంచేశారో గమనించాలి. (వీడియోలు ప్రదర్శించి వివరించారు.) డీఎస్పీ చెబుతున్న మాటలకు.. ఎస్పీ చెబుతున్న మాటలకు.. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిపోర్టుకు పొంతనలేదు. డీఎస్పీ, ఎస్పీ, ఎఫ్ఐఆర్లలో మూడు వేర్వేరు వెర్షన్లు చెప్పారు.» ఇద్దరు ఎస్సైలు కారులో వెళ్తుంటే.. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కన్పిస్తే.. ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా.. వీరిద్దరు కారులో ఛేజ్ చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ చెప్పాడు.» కాదు కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున.. ఆ సమాచారం మేరకు రెయిడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. » ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరు ఎస్సైల వాంగ్మూలం చూడండి. ఇద్దరు ఎస్సైల్లో ఒక ఎస్సై కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురవ ఎస్సై పిలిస్తే.. సంతమాగులూరు ఎస్సై వెళ్లాడంట. కాంట్రడిక్షన్ చూడండి. మూడు వెర్షన్స్ ప్లే చేస్తాను చూడండి. (డీఎస్పీ, ఎస్పీ వీడియోలు ప్లే చేసి చూపించారు). » గంజాయిని సీజ్ చేశారని, వేగంగా వెళ్లే క్రమంలో ఆటోను ఢీకొట్టారని, ప్రమాదం జరగడంతో 108కు ఎస్సై ఫోన్ చేశాడని, గాయపడిన వారిని ఎస్సై అంబులెన్స్లో ఎక్కించి పంపించాడని ఎస్పీ చెప్పాడు. కానీ 108 రికార్డులో సమాచారం ఇచ్చింది స్థానికుడు అని రిపోర్టు అయ్యి ఉంది. చంద్రబాబు వచ్చాక 108 కాంట్రాక్ట్ తమ వాళ్లకే కట్టబెట్టారు. ఆ నిర్వాహకులే.. స్థానికుడు సమాచారం ఇచ్చినట్టు 108 పేషెంట్ కేర్ రికార్డులో పేర్కొన్నారు. » ఎస్సైలు ఆ రోజు మత్తులో కారులో వెళ్తూ ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ఉన్న వారు గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. కారు నడుపుతున్న ఎస్సై, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్నారు. ఎస్సైలు ప్రయాణిస్తున్న ఆ కారులో గంజాయి ఉంది. లిక్కర్ బాటిల్ ఉంది. పోలీస్ యూనిఫాం ఉంది. » ఇన్ని కన్పిస్తుంటే.. వాళ్లను డీఎస్పీ రక్షించేందుకు ప్రయత్నం చేస్తాడు.. తప్పుడు వాగ్మూలం ఇస్తాడు. వీడియోలు తీసినప్పుడు సీఐ బెదిరిస్తాడు.. వీడియోలు తీయొద్దని. వీడియోలు, ఫొటోలు తీస్తే అరెస్టు చేస్తానని బెదిరిస్తాడు. ఐపీఎస్ చేసిన ఎస్పీ కూడా గంజాయి తరలిస్తున్న ఎస్సైలను ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తున్నాడు. » పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్.. బాధ్యత గల డిపార్టుమెంట్.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. కానీ చంద్రబాబూ నువ్వేం చేస్తున్నావ్ ఆ ఎస్సైలను కాపాడేందుకు తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు ఆధారాలు అన్నీ బిల్డ్ చేస్తా ఉన్నావ్. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రజలకు ఏమనిపిస్తుంది? అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు.. గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారు.. అని ప్రజలకు సంకేతాలు ఇవ్వడం కాదా? ఇలా జరుగుతోంది రాష్ట్రంలో పరిపాలన.పోలీసులే వాటాదారులుగా గంజాయి మాఫియా..!మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన నిజంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఓ ఊదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థతోనే.. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థతోనే.. దగ్గరుండి వారిని కూడా వాటాదారులుగా చేస్తూ.. డ్రగ్స్, గంజాయి మాఫియాను ఆ స్థాయికి తీసుకుపోతే ప్రజలు ఇక ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని నమ్మాలి? అద్దంకి ఘటనలో తాజా సమాచారం ప్రకారం మత్తులో ఉన్న ఒక ఎస్సై కారు నడిపితే మరో ఇద్దరు ఎస్సైలు మత్తులో వెనుక సీట్లో కూర్చున్నారు. ఆ కారుతో ఒక ఆటోని ఢీకొట్టడం.. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం.. అందులోనివారంతా మత్తులో ఉండడాన్ని ప్రజలు చూడటం.. వెనక సీటులో, డిక్కీలో గంజాయి, లిక్కర్, పోలీస్ యూనిఫామ్ దొరకడం.. ఇదంతా చూసి ప్రజలు షాక్కు గురయ్యారు. మనం నిజంగా ఏపీలో ఉన్నామా? లేక కొలంబియాలో ఉన్నామా? అని అన్పిస్తోంది. రాష్ట్రంలో ఈ పరిస్థితులు చూసి ప్రతీ ఒక్కరు కూడా ఆందోళన చెందారు. గ్రామస్తులు ఆ ఘటనను వీడియోలు తీస్తుంటే సీఐ వచ్చి బెదిరించాడు. వీడియో తీస్తే జైలులో పెడతా అన్నాడు. (ఈ ఘటనను వీడియో, ఫొటోలతో వైఎస్ జగన్ వివరించారు).మా హయాంలో.. ఉక్కుపాదం మోపాం..ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పెట్టి గంజాయి, డ్రగ్స్పై మా హయాంలో ఉక్కుపాదం మోపాం. 11,550 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం చేశాం. 4.50కోట్ల గంజాయి మొక్కలు తొలగించాం. 13,210 మందిని అరెస్టు చేశాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా రూట్లన్నీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి.. వారు చెప్పినట్టుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ట్రైబల్స్ను గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. రూ.144కోట్లు ఖర్చు చేసి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సహించాం. దాదాపు 3లక్షల ఎకరాలకుపైగా పోడు భూములు గిరిజనులకు పంచిపెట్టాం. ఈ రోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే గంజాయి వ్యాపారం చేయిస్తూ, వారిని భాగస్వాములను చేస్తూ టీడీపీ నాయకులు అందరూ కలిసి చేస్తున్న మాఫియా సామ్రాజ్యం. -
వెలిగొండలో చంద్రబాబు క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో ఏమీ చేయకపోయినా, ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. పనులు వేగంగా చేశారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు సొరంగాల పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిటనేది చంద్రబాబు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబుది క్రెడిట్ చోరీ.. ఏమీ చేయకున్నా ఘనత(క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్) తనదేనంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సూటిగా సమాధానాలు చెప్పారు. ‘స్థానిక ఎన్నికలను చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుపుతాడన్నది అనుమానమే. కానీ, ప్రజాస్వామ్యంలో పోరాడక తప్పదు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పోలీసులను ఉపయోగించి.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించి.. నోట్ల కట్టలను వెదజల్లారు.. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది.. 2019 ఎన్నికల్లో నంద్యాల శాసనసభ స్థానంలో 37 వేల ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలి.డీబీటీ ద్వారా ప్రజలకు మేం చేసిన మంచి చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్లాం.. అందుకే భారీ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు’ అని వైఎస్ జగన్ ఓ ప్రశ్నకు స్పష్టంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వెఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని తేలిందని సర్వే సంస్థలు వెల్లడించడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘చంద్రబాబు పాలన ఈ విధంగా ఉంటే వెన్నుపోటు పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారు?’ అని అన్నారు. -
రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)
-
వైఎస్ జగన్ కు రాఖీ కట్టిన మహిళలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు రాఖీలు కట్టిన మహిళలు ఆయనకు స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా వైఎస్ జగన్ను కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్ -
కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా స్పందించని బాబు..
-
వాళ్ళో పెద్ద జేమ్స్ బాండ్స్.. పోలీసుల మాట్లాడిన వీడియోలు లైవ్ ప్రూఫ్
-
సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్, YS జగన్ దిగ్భ్రాంతి
-
పోరాటం చేయాల్సిందే.. వెళ్తూ వెళ్తూ వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ అదుర్స్
-
వెంట్రుకలు నిక్క పొడిచే వాస్తవాలు.. BC సోదరులు తెలుసుకోవాలి..
-
దొంగ ఓట్లపై కూటమి కన్ను..! స్థానిక ఎన్నికలపై జగన్ సంచలనం
-
గంజాయితో అడ్డంగా దొరికిన పోలీసులు... లైవ్లో ఆధారాలతో బయటపెట్టిన జగన్
-
పోలీస్ కారులో గంజాయి, మద్యం.. YS జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
డేంజర్ బెల్స్ మోగుతున్నా చలనం ఉండదా చంద్రబాబు..
-
కారుమూరి అరెస్ట్ పై YS జగన్ రియాక్షన్
-
పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో ఓ వైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే.. మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు.రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు అందునా కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతీ చోటా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో వాటాదారులుగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో.. మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయి. డ్రైవర్తో సహా మరో ఇద్దరూ పోలీసులు మత్తులోనే ఉన్నారు. సీఐ వచ్చి వీడియోలు తీసే జనాల్ని తీయొద్దని బెదిరించారు. అలాంటప్పుడు ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ప్రజలు ఎవరిని నమ్మాలి? అని వైఎస్ జగన్ నిలదీశారు.పైగా అద్దంకి ఘటనను కవర్అప్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటనలు చేశారు. వాళ్ల మాటలకు ఎఫ్ఐఆర్కు పొంతనే లేదు(ఈ సందర్భంగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధనరాజుల వేర్వేరు స్టేట్మెంట్ల వీడియోలను ప్రదర్శించారు). ఇలాంటి పోలీసులను జైలుకు పంపకుండా.. తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారు. కూటమి పాలనలో అద్దంకి ఘటనే కాదు.. కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని కట్టడి చేశాం. గంజాయి కేసుల్లో 13,210 మంది అరెస్ట్ చేశాం. 11 వేల ఎకరాల్లో గంజాయి పంటల్ని ధ్వంసం చేశాం.ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకి దూరం చేశాం. ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశాం అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీ మయం.. గంజాయి మయం. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు.. పెదబాబుకి ఇంత అని వాటేలేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది.. అది గంజాయే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే! -
ఫోటోలకు భలే ఫోజులు ఇస్తాడయ్యా.. నిమ్మలపై జగన్ సెటైర్లు
-
కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది వైఎస్సార్సీపీనే. మా కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని వైఎస్ జగన్ వెల్లడించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మేం ఎన్నికలకు వెళ్లాం. సుప్రీంకోర్టు, హైకోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది మేమే. మా కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాం. 40 శాతం మంత్రి పదవులు బీసీలకే ఇచ్చాం. 11 రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలను పంపింది మేమే. రెండు డిప్యూటీ సీఎం పదవులు కూడా బీసీలకే ఇచ్చాం.అలాగే, 13 జెడ్పీ చైర్మన్ సీట్లలో ఆరు బీసీలకే ఇచ్చాం. 13 మేయర్ స్థానాల్లో బీసీలకే 9 ఇచ్చాం. 636 ఎంపీపీ స్థానల్లో బీసీలకే 239 ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకే ఇచ్చాం. 196 ఏఎంసీ చైర్మన్ స్థానాల్లో బీసీలకే 76 ఇచ్చాం. ఇవ్వన్నీ చట్టం చేసి మరీ ఇవ్వడం వైఎస్సార్సీపీకే సాధ్యపడింది. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం కేటాయించాలని పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టించాం. బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాం. వివిధ పథకాల ద్వారా డీబీటీ పద్దతిలో ఇచ్చాం. రూ.లక్షా 30వేల కోట్లు బీసీలకు అందజేశాం.బీసీల బతుకులను చంద్రబాబు బుగ్గిపాలు చేశాడు. మా హయాంలో అమలైన పథకాలను రద్దుచేశాడు. మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో వేశాడు. రాజకీయంగా ఎదిగే బీసీలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి సీదిరి అప్పలరాజును జైలులో పెట్టించారు. ఓ మహిళా ఎస్ఐను అడ్డుపెట్టుకుని చింతాడ రవిని అక్రమంగా జైలుకు పంపారు. కర్నూలులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తే విరూపాక్షిపై తప్పుడు కేసులు పెట్టారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
బాబు చాప్టర్ క్లోజ్... తేల్చేసిన సర్వేలు! టీడీపీ క్యాంపులో మొదలైన టెన్షన్..
-
నార్లు ఎండుతున్నా.. చంద్రబాబు ధ్యాసంతా వాటి మీదే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా దాన్ని గుర్తించేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదని అన్నారు. జూన్, జులైలోనే 52 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని వైఎస్ జగన్ వెల్లడించారు.బుధవారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేశారు. కూటమి పాలనతో ఇప్పటిదాకా రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. 2025 అక్టోబర్లో మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నా.. ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా కూడా అందలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచామని జగన్ గుర్తు చేశారు. అయితే బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారని, పంటలు దెబ్బతిన్న రైతులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం డైవర్షన్, రెడ్బుక్ రాజకీయాలపై దృష్టి సారిస్తోందని జగన్ విమర్శించారు. మంత్రులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంపైనే చంద్రబాబు దృష్టి ఉందని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా తాను ఏం చేస్తున్నానో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.ఇదీ చదవండి: చంద్రబాబు అలా చేస్తే మనదే విజయం: వైఎస్ జగన్ -
ఎదో రైతులను ఉద్ధరిస్తున్నట్టు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఫోజులు.. TDP మంత్రులను ఏకిపారేసిన జగన్..
-
కోడిగుడ్డు మీద ఈకలు పీకి.. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
తీవ్రకరువులో కుంభకర్ణుడి మాదిరిగా చంద్రబాబు తీరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ సవాల్ విసిరితే ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలోనూ తీవ్ర కరువు నెలకొంది. అంత తీవ్ర పరిస్థితులు ఉన్నా చంద్రబాబు స్పందించడం లేదు. పైగా కుంభకర్ణుడిలా నిద్ర నటిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటిదాకా 52 శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు....ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలుసు. జులైలోనూ అదే పరిస్థితి. అయినా పంటలకు నీళ్లు ఇస్తామని ఫోజులు ఇచ్చారు. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా.. ఎకరాకు 15 వేలు నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్న చంద్రబాబు కనీసం స్పందించడం లేదు అని వైఎస్ జగన్ అన్నారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు నీటిని విడుదల విషయంలో చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ, ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి మీద చంద్రబాబు దృష్టి సారించారని జగన్ ధ్వజమెత్తారు. అవకాశమున్నా పొత్తిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదీ చదవండి: అదే గనుక జరిగితే వైఎస్సార్సీపీదే విజయం -
Watch Live: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
మదర్ థెరీసాకు వైఎస్ జగన్ నివాళి
తాడేపల్లి : మహనీయురాలు మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆమెకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. మానవత్వానికి ప్రతిరూపం మదర్ థెరిసా అని, ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుందామని అన్నారు. ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో తన జీవితాన్ని పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు. ఎంత చిన్న పని అయినా మనిషి జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదని ఆమె జీవితం మనకు చాటి చెబుతుందన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే థెరిసాకు మనం అందించే నిజమైన నివాళి అని జగన్ పేర్కొన్నారు. మదర్ థెరిసా స్ఫూర్తితో ప్రేమ, దయ, సేవాభావాన్ని మన జీవితంలో భాగం చేసుకుందామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. On the birth anniversary of Mother Teresa, we remember her life of love, compassion, and selfless service. Her legacy reminds us that even the smallest act of kindness can make a lasting difference. Let us honour her memory by caring for those around us. pic.twitter.com/Qfqvt4fdBH— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2026 -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రైతులను పట్టించుకోకుండా చంద్రబాబు.. కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు.. కల్తీ లిక్కర్ ప్రతీ ఊరికీ వ్యాపించింది. ఇందుకు అద్దంకి ఘటనే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లింది చంద్రబాబు.. అడ్డుకుందీ చంద్రబాబే.. మళ్లీ దొంగ ఏడుపులు ఆయనవే అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరువు తీవ్రత, ప్రభుత్వ నిర్లక్ష్యం, బీసీ రిజర్వేషన్లు, గంజాయి సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..డీఎస్సీ అక్రమాలపై సవాల్ విసిరితే ఇప్పటి వరకు స్పందించలేదు.చంద్రబాబు సహా ఎవరూ స్పందించలేదు.రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది.ఏపీలో లోటు వర్షపాతం ఉంది.తీవ్ర కరువు పరిస్థితులు కనిపిస్తున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదు.జూన్ నుంచి ఇప్పటి వరకు 52 శాతం లోటు వర్షపాతం ఉంది. ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే ఉంది.చంద్రబాబు తీరు కుంభకర్ణుడి మాదిరిగా ఉంది.బాబు నిద్ర నటిస్తున్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమం చేపట్టలేదు.ఇప్పటి వరకు 189.62 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదు.688 మండలాలకు 625 మండలాల్లో లోటు వర్షం ఉంది.కోస్తాలోనూ కరువు ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 91 శాతం లోటు వర్షపాతం ఎదుర్కొంటోంది.28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది.ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న పంటలకు నీళ్లిస్తామని ఫొటోలకు ఫోజులిచ్చారు.రైతులంతా పెట్టుబడులు పెట్టి అష్టకష్టాలు పడుతున్నారు. మంత్రులు పబ్లిక్ స్టంట్లు వేస్తున్నారు. శ్రీశైలం ఖాళీ.. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు ముందుకెళ్లారు.ప్రతీ ఎకరాకు రైతుకు రూ.15వేల నష్టం.ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలిసినా ప్రభుత్వం మేల్కోలేదు.పత్రీ ఎకరాకు చివరి వరకు నీరిస్తామని గొప్పలు చెప్పారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వచ్చింది.మరోవైపు.. చంద్రబాబు మానవత్వం లేదకుండా వ్యవహరిస్తున్నారు.ఆగస్టు 11న శ్రీశైలం నీటిమట్టం 880 అడుగులు.అవకాశమున్నా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదు.854 అడుగులకు నీటి మట్టం తగ్గితే సీమకు నీరు రాదు.ప్రస్తుతం 7000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది.శ్రీశైలం నుంచి ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.సెప్టెంబర్ 15వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇదే పరిస్థితి కొనసాగితే నీటి మట్టం 854 అడుగులకు చేరుతుంది.ఆ తర్వాత రాయలసీమకు నీరిచ్చే అవకాశం ఎలా ఉంటుంది??సీమ ప్రాజెక్ట్ల కెపాసిటీ 180 టీఎంసీలు.. ప్రస్తుతం 55.56 టీఎంసీలు.సీమ ప్రజలకు 23 శాతమే నీరు అందుబాటులో ఉంది.నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి చుక్కనీరు ఇవ్వడం లేదు.నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్ట్ ఉంది.పులిచింతల దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు.తెలంగాణలో మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతోంది.రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేంగా జరుగుతున్నాయి.అయినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు ఆదుకున్నాడా?కరువు ఉన్నా ప్రజలు, రైతులను చంద్రబాబు ఆదుకున్నాడా?.వైఎస్సార్సీపీ ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా రద్దు చేశారు.2023లో 1.18 కోట్ల ఉచిత పంటల బీమా దరఖాస్తులు వస్తే2026-27లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.స్వయంగా ఈ గణాంకాలను కేంద్రమే వెల్లడించింది.అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం బీమా కట్టలేదు.రైతులకు రూ.3000 కోట్ల నష్టం జరిగింది.2025 అక్టోబర్లో మోంథా తుపాను వచ్చింది.రైతులకు ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదు.ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాశనం చేశారు చంద్రబాబు దగ్గర రైతులను ఆదుకునే ప్లాన్ ఏమైనా ఉందా?.డైవర్షన్, రెడ్బుక్పై ఉన్న ధ్యాస.. బాబుకు రైతులపై లేదు.రైతులకు ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేదు??రైతులకు ఉచిత విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారు. బీసీ రిజర్వేషన్లపై కామెంట్స్.. 2019లో మేం వచ్చిన తర్వాత జీవో నంబర్-176 ఇచ్చి బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలకు సిద్ధం అయ్యాం.కానీ, చంద్రబాబు, తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో, AP State Employment Guarantee Councilలో అప్పటి సభ్యుడు బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ కేసు వేయించాడు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నందుకు బీసీలకు 34శాతం కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది.హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా మరోసారి మహా డ్రామాకు చంద్రబాబు దిగాడు.మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపటనాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే.బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే.రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తలరాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ ఐదేళ్లలో మేం తీసుకు వచ్చాం.కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆమేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.మా కేబినెట్లో 25 మంది ఉంటే, అందులో 11 మంది బీసీలే. అంటే దాదాపు 40 శాతం మంత్రిపదవులు బీసీలకే.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం.మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురు బీసీలను ఈ జగన్ రాజ్యసభకు పంపారు.అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం. చంద్రబాబు 2014-19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే అంటే 44 శాతం బీసీలకే ఇచ్చాం.58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకే ఇచ్చాం. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదువులు ఉంటే, 6 అంటే 46శాతం బీసీలకే13 మేయర్ పదవుల్లో, 9 అంటే, 69శాతం బీసీలకే.636 ఎంపీపీ స్థానాల్లో, 239 అంటే 38 శాతం బీసీలకేమున్సిపల్ చైర్మన్ పదవులు 84లో, 44 అంటే ౫౩శాతం బీసీలకే639 జడ్పీటీసీల్లో, 227 అంటే, 36శాతం బీసీలకే8,239 ఎంపీటీసీల్లో, 3,361 అంటే, 41 శాతం మంది బీసీలే.10,536సర్పంచుల్లో దాదాపు ౪వేల మంది బీసీలే. అంటే 38శాతం వారికే.AMC చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39శాతం బీసీలకేప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో, 53 బీసీలకు ఇచ్చాం. అంటే 37% ఇచ్చాం.139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కలలో కూడా చంద్రబాబుకు ఆలోచన రాలేదు. చట్టం చేసి మరీ.నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ పనులు–కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం.ఇందులో మహిళలకు కూడా 50% వాటా ఉండే విధానం మేం తీసుకు వచ్చాం. దేశంలోనే ఇది తొలిసారి.అంతేకాదు బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించాం.కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం.అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం.వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30లక్షల కోట్లు పంపించాం.కాని ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాడు. మా పథకాలన్నింటినీ ధ్వంసం చేశాడు.పైగా రాజకీయంగా బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక వారిమీద అక్రమకేసులు పెట్టి, జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు.యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లోపెట్టాడు.ఒక మహిళా ఎస్సైను అడ్డుపెట్టుకుని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి, తప్పుడు కేసులు పెట్టి, ఆముదాలవలస నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త చింతాడ రవికుమార్ను జైలుకు పంపాడు.టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్తచేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపివేయించి, అదిచేసింది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని చెప్పి, ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షిపై కేసులు పెట్టి జైల్లోపెట్టారు.యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వర్రావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో జైలుకు పంపాడు.మరి చంద్రబాబుకు బీసీలమీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా?గంజాయిపై కామెంట్స్..రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది.మట్టి, శాండ్, లిక్కర్ మాఫియా నడుస్తోంది.విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు.కల్తీ లిక్కర్ ప్రతీ ఊరికీ వ్యాపించింది.అద్దంకి ఘటనే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తున్నారు.ప్రజలు ఎవరిని నమ్మాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలి?.మత్తులో కారు నడిపింది కూడా మరో ఎస్ఐ అని తెలుస్తోంది.డ్రైవర్తో సహా మరో ఇద్దరు పోలీసులు కూడా మత్తులో ఉన్నారు.వీడియో తీసిన గ్రామస్తులను సీఐ బెదిరించారు.రాష్ట్రంలో పరిస్థితులు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.డీఎస్పీ, ఎస్పీ మాటలు.. ఎఫ్ఐఆర్కు పొంతన లేదు.ఎవరో గంజాయి వదిలి పరారయ్యాడని డీఎస్పీ అన్నారు.సమాచారం మేరకే దాడులు చేశామని ఎస్పీ చెప్పుకొచ్చారు.ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం దీనికి భిన్నంగా ఉంది.పోలీసులే గంజాయితో దొరకడం క్షమించరాని నేరం.ఇలాంటి పోలీసులను జైలుకు పంపాలి.కానీ, తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూశారు.రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేస్తున్నారు.నిజంగా పోలీసులు ఛేజ్ చేసి దొంగలను పట్టుకుంటే వీఆర్కి పంపి ఎందుకు చర్యలు తీసుకున్నారు?. -
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు మిలాద్-ఉన్-నబీ. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘ప్రేమతో మనసులు గెలవాలనీ.. కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనీ.. క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలనీ.. మహ్మద్ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయం. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. ప్రేమతో మనసులు గెలవాలని.. కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని.. క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలని మహ్మద్ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయం. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2026 -
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
గుర్తుపెట్టుకోండి.. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. స్థానిక ఎన్నికల్లో YSRCP కొట్టే దెబ్బకు...
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. -
ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే.. 'మనదే విజయం'
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా జరిగితే వెన్నుపోటు పార్టీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ప్రత్యక్షంగా చూశాం. అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు వారు ఎన్నికల్లో మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మనకు మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. పార్టీ, ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది. ఇలా చేయగలిగితే మన గెలుపు ఖాయం.మీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగితే ఇక నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడి పోరాడాలి.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ ృ వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. దాదాపు 15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్లెట్ మెటేరియల్ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. తీరా ఏమీ చేయకుండానే అన్నీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. ఇందుకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని, వెన్నుపోటు పార్టీ కూటమి ఘోర పరాజయం పొందడం ఖాయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూశామన్నారు. కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏమేం చేశారో? ఎన్ని దౌర్జన్యాలు చేశారో? ప్రత్యక్షంగా చూశామంటూ ఎత్తిచూపారు. అందుకే రానున్న స్థానిక ఎన్నికల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. ‘కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి.. అధికార పక్షం వాళ్లు.. చంద్రబాబు ఎంత దౌర్జన్యం చేసినా, మాకు మా నాయకుడు ఉన్నాడు అనే భావన, నమ్మకం మీరు కార్యకర్తల్లో కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు’ అని తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి రెండేళ్ల పాలనపై ఇప్పటికే ప్రతి ఇంటా చర్చ మొదలైందని.. ప్రజలంతా ఈ పాలనను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను పోల్చి చూస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. స్థానిక ఎన్నికలు సందేహమే? అయినా సన్నద్ధం‘స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని మనం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగుతాయా.. లేదా.. అన్నది తెలియడం లేదు. ఒక వైపు 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ‘సర్’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. మరో వైపు ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. అంటే లేని ఓట్లు ఉన్నట్లుగా చూపుతున్నారు. అది చట్ట ప్రకారం నేరం. రెండో వైపు పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంశం. గతంలో మనం ఇవ్వాలనుకుంటే, కోర్టు కొట్టేసింది. పక్కన తెలంగాణలో కూడా కోర్టు దాన్ని కొట్టేసింది. అయినా దానిపై చంద్రబాబు కావాలని జీవో ఇచ్చి, ఎన్నికలకు వెళ్తున్నాడు. అంటే అక్కడ ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కావాలని జీవో ఇచ్చి డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు కొట్టేస్తుంది కాబట్టి. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు అసలు స్థానిక ఎన్నికలు జరుపుతాడా? అని అనుమానం వస్తోంది. అయినా, ఎన్నికలు జరుగుతాయన్న ఆలోచనతోనే మనం సిద్ధం కావాలి. ఆ దిశలో ముందుకు సాగాలి. గట్టిగా పోరాడాలి.ఇప్పుడు ప్రతి ఇంటా అదే చర్చ2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి మనం దాదాపు 30 నెలలుగా ప్రతిపక్షంగా ఉన్నా, గ్రామ స్థాయి వరకు పార్టీని బలంగా నిర్మించుకోగలిగాం. తొలిసారిగా గ్రామ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండున్నరేళ్లలో ఇలా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మించుకోగలిగాం. ఇది ఒక మంచి కార్యక్రమం. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన ఎలా ఉంది? అంతకు ముందు మన పరిపాలన ఎలా ఉంది? అన్న దానిపై ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పాలన లో వంచన, దగా..ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. మనం చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చాం. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాం. చంద్రబాబు ఏం చెప్పారంటే.. ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారుంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తామన్నాడు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, ఏటా రూ.36 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. అలా అన్నీ ఇస్తామని చెప్పి నమ్మించి, తర్వాత మోసం చేశారు. ప్రజలు దాన్ని గుర్తించారు. అందుకే ఈ రోజు ప్రతి ఇంట్లో వాటిపై చర్చ జరుగుతోంది. ఒకవైపు అన్నీ వైఫల్యాలు. మరో వైపు అరాచక పరిస్థితి. యథేచ్ఛగా రెడ్బుక్ అమలవుతోంది. స్కూళ్లు నాశనం అయ్యాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. విద్య, వైద్య రంగాలు మొత్తం నాశనం అయ్యాయి. మహిళలకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అరెస్టులు.. భయపెట్టి లొంగ దీసుకునే పరిస్థితి.సమావేశానికి హాజరైన పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కార్యకర్తల్లో నమ్మకం కలిగించాలి..ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని మీరు కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. అలా చేయగలిగితే, మనం ఎన్నికల్లో గట్టిగా నిలబడతాం. అంతే కాకుండా పార్టీ నుంచి ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది.ఈ విభాగాలు.. ఈ పనులు చాలా ముఖ్యంప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే/ఇన్చార్జ్ లీగల్ సెల్, మీడియా సెల్ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు దౌర్జన్యం చేస్తాడు. మన పార్టీ వారిని వేధిస్తాడు. కాబట్టి మన క్యాడర్ను, కార్యకర్తలను కాపాడుకోవాలి. అందు కోసం మీరు మంచి టీమ్తో లీగల్ సెల్ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా మీడియా సెల్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్స్ (మీడియా సమావేశాలు)లో తరచూ మాట్లాడాలి. మనం చేసిన మేలు, సంక్షేమం చెబుతూ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి. కాబట్టి తప్పనిసరిగా మీడియా సెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బాగా ఉపయోగించుకోవాలి. ఎలా ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి.. ఎలా యాక్టివేట్ చేయాలి.. ఎలా నడిపించాలనే దానిపై శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా దిగజారిపోయిన నెగటివ్ మీడియా ఈనాడు, ఏబీఎన్ తదితర వాటితో పోరాడుతున్నాం. మీకు మీరుగా బలంగా ఎదిగేందుకు, మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీ ఇంకా బలంగా మారడానికి మీరు తప్పనిసరిగా లీగల్ సెల్, మీడియా సెల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు నియోజకవర్గ స్థాయిలో పని చేస్తూ.. జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటి వరకు దీంట్లో యాక్టివ్గా లేని వారు వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండో అంశం.. ఇంటింటా ప్రచారం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లాలి. మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి మంచి చేశామనేది చెప్పాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన దగా, వంచన గురించి వివరించాలి. మరో వైపు బలమైన అభ్యర్థి నిలబడాలి. ఆ అభ్యర్థి అందరినీ కలుపుకుపోవాలి. ఎక్కడా ఇగోకు వెళ్లొద్దు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకం. కేవలం 9 ఓట్లతో ఓడిన వారు, గెల్చిన వారు కూడా ఉన్నారు. జో జీతా వహీ సికందర్ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. ఎందుకంటే.. జో జీతా వహీ సికందర్ (గెలిచిన వారే రాజు). కాబట్టి వచ్చే 60, 70 రోజులు మీరు మీ నియోజకవర్గాలు దాటి వెళ్లొద్దు. అందరినీ కలవండి. వ్యవస్థలు పక్కాగా ఏర్పాటు చేసుకొండి. అన్యాయం చేస్తే వదిలి పెట్టబోమని పోలీసులకు కూడా గట్టిగా చెప్పండి. చూస్తుండగానే మూడో ఏడాదిలోకి వచ్చాం. కాబట్టి వచ్చేది మన ప్రభుత్వమే. ఆ తర్వాత మీరు ఎక్కడున్నా, రిటైర్ అయినా వదిలిపెట్టబోమని చెప్పండి. వారిలో న్యూట్రాలిటీ (తటస్థ వైఖరి) తీసుకురావడానికి ప్రయత్నించండి. అప్పటికీ వారు మారకపోతే వారి వివరాలు డిజిటల్ డైరీలోకి ఎక్కించండి’ అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మీ పాత్ర చాలా కీలకంప్రతి చోటా అభ్యర్థుల ఎంపిక ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. పార్టీ కోసం గట్టిగా పని చేసే వారిని ఎంపిక చేయండి. రిజర్వేషన్ల ఖరారు తర్వాత, మారితే చూడొచ్చు. అంతేకానీ, అప్పుడు అభ్యర్థుల కోసం వెతికితే అంతగా ప్రయోజనం ఉండదు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మీరు స్వయంగా హాజరై గుర్తింపు కార్డులు, మెటీరియల్ పంపిణీ చేయాలి. వాటికి సంబ«ంధించి, తగిన విధంగా నిర్దేశం చేయాలి. ప్రతిచోటా మీ ప్రమేయం ఉండాలి. స్థానిక ఎన్నికల్లో పార్టీతో పాటు, అభ్యర్థి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వారిపై ప్రజలకు ఎక్కువ దృష్టి ఉంటుంది. అందుకే అందరికీ ఆమోద యోగ్యమైన వారిని ఎంపిక చేయాలి. వీలైనంత వరకు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం వచ్చేలా చొరవ చూపాలి.ప్రతి చోటా పోటీ చేయాలిఎక్కడా ఏకగ్రీవం ఉండకూడదుమీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. అలా మన పార్టీ అభ్యర్థి నిలబడకుండా, పోటీలో లేకుండా ఉంటే, అక్కడ ఏకగ్రీవ ఎన్నిక జరిగితే నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడాలి. పోరాడాలి. అప్పుడే వారు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మీకు తోడుగా ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. ఇవన్నీ మీ ద్వారానే పార్టీ కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇంకా గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. దాదాపు 15 లక్షల కార్డులు రెడీ అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఆ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్లెట్ మెటీరియల్ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.ఐదు అంశాలతో సంస్థాగత సమావేశాలు1. చంద్రబాబు పాలన వైఫల్యాలు2. మన ఐదేళ్ల పాలన, సంక్షేమం, సంస్కరణలు, ప్రజలకు చేసిన మేలు3. కేడర్ను మోటివేట్ చేసి, ఎన్నికలకు సిద్ధం చేయడం4. ఐడీ కార్డుల పంపిణీ5. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటా ప్రచారం సంస్థాగత సమావేశాల షెడ్యూల్⇒ సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ఇందులో పార్టీ జిల్లా స్థాయి నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్్జలు, జిల్లా స్థాయిలో అన్ని కమిటీల ఇన్ఛార్్జలు, పార్టీ సీనియర్ నాయకులు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు.⇒ సెప్టెంబరు 8, 9, 10, 11 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాల నిర్వహణ. వీటిలో నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.⇒ సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో గ్రామ, వార్డు స్థాయి నుంచి కూడా నాయకులు పాల్గొంటారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచారం. అంటే సెప్టెంబర్ 23 నుంచి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ బుక్లెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విలేజ్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అందరూ పాల్గొంటారు. మన పాలనలో విప్లవాత్మక మార్పులుమేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99 శాతం అమలు చేశాం. పూర్తి పారదర్శకతతో పాలించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి, ఇంటి గడప వద్దే ప్రభుత్వ సేవలు అందించాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాం. దేవుడి దయ వల్ల ఆ విధంగా ఒక గొప్ప పాలన ఇవ్వగలిగాం. ఎన్నికల్లో ఒక మాట చెబితే, ఒక విషయాన్ని మేనిఫెస్టోలో పెడితే, దాన్ని తూ.చ తప్పకుండా అమలు చేపి చూపాం. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే, ఒక షెడ్యూల్ ప్రకటించి పథకాలు అమలు చేశాం. ఇది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాం.⇒ సంస్కరణలు, మార్పులు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు ద్వారా పూర్తి మార్పులు చేశాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోర్డులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ. ఇంకా బైజూస్ కంటెంట్.⇒ గ్రామ స్థాయిలో చూస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గ్రామంలో విలేజ్ క్లినిక్స్. ఆరోగ్యశ్రీలో 3,300కు పైగా ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. నాడు దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60 శాతం స్పెషలిస్టుల కొరత ఉంటే, మన దగ్గర అది కేవలం 4 శాతం మాత్రమే. ఆ స్థాయిలో ఆస్పత్రుల్లో నియామకాలు జరిపాం. మన హయాంలో ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ.⇒ వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తెచ్చాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేశాం. ఉచిత పంటల బీమా అమలు చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి పంటకు కచ్చితమైన గిట్టుబాటు ధర కల్పించాం. సీఎం–యాప్ ద్వారా పంటల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, జేసీ స్థాయి అధికారితో మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. తద్వారా పంటల కొనుగోలులో పోటీ ఏర్పడి, రైతులకు మేలు జరిగింది. అలా ఐదేళ్లలో రూ.7,800 కోట్లతో పంటల కొనుగోలు చేశాం.⇒ సుపరిపాలన, మహిళా సాధికారత, విద్య, వైద్యంలో ఎప్పుడూ చూడని మార్పులు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు. కర్నూలు, విశాఖలో కొత్త ఎయిర్పోర్టులు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అత్యుత్తమ వైద్య సేవలందించాం. డయాలసిస్ సేవలు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఆస్పత్రి ఏర్పాటు చేశాం. రూ.600 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశాం. అలా ప్రతి సమస్యకు పరిష్కారంగా శాశ్వత చర్యలు చేపట్టాం. -
జూడాల స్టైపెండ్పైనా వెన్నుపోటు ముఠా పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: జూనియర్ వైద్యుల(జూడాల) స్టైపెండ్ పెంచకుండా తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వంపై బురద జల్లుతోంది. జూడాల స్టైపెండ్ తగ్గింపును గత ప్రభుత్వం సమర్థించిందని మంగళవారం ఓ మెమోను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేసి లబ్ధి పొందేందుకు కుటిలయత్నం చేసింది. అయితే, వాస్తవానికి జూనియర్ డాక్టర్ల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి స్టైపెండ్నూ పెంచి మేలు చేసింది. దీనికి బలమైన ఆధారాలు ఉండడంతో చంద్రబాబు సర్కారు దుష్ట కుయుక్తులు పారలేదు. జూనియర్ వైద్యులు గతంలో వైఎస్ జగన్ చేసిన మేలును గుర్తు చేసుకుని దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు. 2020లో జూడాల స్టైపెండ్ పెంచుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అసలేం జరిగిందంటే.. జూడాలకు స్టైపెండ్ చెల్లింపులకు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై వైద్య విభాగాధిపతుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2022లో నవంబర్ 28న వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి.. డీఎంఈకి ఓ మెమో జారీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్టైపెండ్ విధానాన్ని పరిశీలించాలని మాత్రమే ఆ మెమోలో సూచించారు. ఈ మెమోను గత వైఎస్ జగన్ సర్కారు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఇది జరిగిన కొద్దినెలలకే అంటే 2023లో బ్రాడ్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్తో సమానంగా తమ స్టైపెండ్స్ పెంచాలని సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొద్ది నెలల వ్యవధిలోనే స్టైపెండ్స్ పెంచుతూ 2023 అక్టోబర్ 10న వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 624 విడుదల చేసింది. దీంతో మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.70 వేలు, రెండో ఏడాదికి నెలకు రూ.72 వేలు, మూడో ఏడాదికి నెలకు రూ.74 వేల మేరకు అప్పట్లో స్టైపెండ్లు పెరిగాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ఆ మెమో.. వైద్య శాఖ అధికారుల మధ్య సమాచార మార్పిడికి జారీచేసింది మాత్రమేనని తేటతెల్లమైంది. దీనిని అప్పటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోకపోయినా చంద్రబాబు సర్కారు దానిపై దుష్ప్రచారం చేస్తోంది.కోవిడ్ విపత్తులోనూ స్టైపెండ్ పెంపు 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది తిరగకుండానే కోవిడ్ మొదలైంది. 2021, 2022లో వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఆ సంక్షోభ పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ సర్కార్ జూడాల స్టైపెండ్ కోతకు ఆలోచన కూడా చేయలేదు. వరుసగా 2020, 2022, 2023, 2024లలో జూడాల స్టైపెండ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచింది. ఆయుష్ వైద్య విద్యార్థులకూ అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైపెండ్ పెంపును వర్తింపజేసింది. 2009లో ఇచ్చిన 287 జీవో ప్రకారం 15 శాతానికంటే అధికంగా మొత్తంగా 42.4శాతం స్టైపెండ్ వైఎస్ జగన్ పెంచారు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు వర్తింపజేశారు. ఇలా వైఎస్ జగన్ చేసిన మేలు కళ్లెదుటే కనిపిస్తుంటే బాబు సర్కార్ దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)
-
రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమకాలీన రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. -
కూటమి దొంగ ఓట్లు వేసుకునే ప్రమాదం ఉంది
-
సమరానికి సిద్దం లోకల్ ఎన్నికలకు సై
-
ఏకగ్రీవం అనే మాట వినిపిచకుండా.. స్థానిక ఎన్నికలు జరగాలి
-
ఆషామాషీగా తీసుకోవద్దు స్థానిక ఎన్నికలపై జగన్ దిశానిర్దేశం
-
YS జగన్ కు రాఖీ కట్టిన మహిళలు
-
స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికలు–బలమైన అభ్యర్థులుస్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతోపాటు బలం లభిస్తుంది. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికీ వెనకాడవద్దు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలిఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయంఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కో-ఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటా. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారన్నదానిపైనా నివేదికలు తీసుకుంటా. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే, మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు.గ్రామస్థాయి ప్రచార కార్యక్రమం“వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన”పై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలి. ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామగ్రిని పార్టీ అందిస్తుంది. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం జరగాలి.14–15 లక్షల గుర్తింపు కార్డులుపార్టీ కేడర్ కోసం దాదాపు 14–15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయి. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తాం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలి. సమావేశాల్లో గుర్తింపు కార్డులతోపాటు ఇంటింటి ప్రచార సామగ్రినీ కేడర్కు పంపిణీ చేయాలి. గుర్తింపు కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది; కార్యకర్తలు తమ ఫోన్లలోనే సమాచారాన్ని పొందవచ్చు. సెప్టెంబరు 5,6,7 తేదీల్లో ఒకరోజు ఏదో ఒకరోజు జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. సెప్టెంబరు 8,9,10,11 తేదీల్లో ఏదో ఒకరోజు అసెంబ్లీ నియోజవకర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. ఇక మండల, వార్డు, డివిజన్ స్థాయిల్లో సెప్టెంబరు 12 నుంచి 22 వరకూ సమావేశాలు నిర్వహిద్దాం. లీగల్, మీడియా సెల్స్ యాక్టివ్గా ఉండాలిప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్లను వెంటనే బలోపేతం చేయాలి. పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కేడర్పై దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉంది; కార్యకర్తలను రక్షించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్ సెల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేయాలి. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలి. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్, మీడియా వ్యవస్థలన్నీ ఒకే యూనిట్గా పనిచేయాలి.సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యంప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి, మిగిలిన వారినీ యాక్టివేట్ చేయాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపైకి మొత్తం పార్టీ కేడర్ను తీసుకురావాలి. సోషల్ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలి. జగన్ 2.0 సూపర్ యాప్, వైయస్సార్సీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాలి. పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవాలి. పార్టీ కేడర్కు వాస్తవ సమాచారం, అవసరమైన న్యూస్ కంటెంట్ నిరంతరం అందాలి. నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వ్యక్తిగతంగా కలిసి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరాలి. ఎందుకంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రతికూల మీడియా వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం.నాయకులకు హెచ్చరికనియోజకవర్గాల్లో మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్స్పై యాక్టివ్గా లేని నాయకులు ఇప్పటికైనా గేర్ మార్చాలి. నాయకులు కార్యకలాపాలను తమ నియంత్రణలోకి తీసుకోకపోతే కార్యకర్తలు నష్టపోతారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైయస్సార్సీపీ–కూటమి పాలన మధ్య తేడాను వివరించాలి.ఈగోలకు తావులేదుస్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలి. తొమ్మిది ఓట్లతో గెలిచిన సందర్భాలు, తొమ్మిది ఓట్లతో ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటూ కీలకమే. “జో జీతా వహీ సికందర్”.. గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి. ప్రతి గ్రామంలో పార్టీని బలంగా కన్సాలిడేట్ చేసి, సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం సృష్టించాలి. రాబోయే 60–70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టిపెట్టాలి. సరైన శ్రద్ధ, పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటే స్థానిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాంవాళ్ల పేర్లు డిజిటల్ బుక్లోకి..పోలీసు అధికారులు పదవిని దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. కానీ అలా జరగడం లేదు. కార్యకర్తలను వేధించే, అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తప్పవు. ప్రతి పోలీసు అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థలో నిష్పాక్షికత తీసుకురావడానికి పార్టీ నాయకులు గట్టి ప్రయత్నం చేయాలి అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: ఆలయాల విధ్వంసం.. పవన్ కంటికి కనిపించడం లేదా? -
స్థానిక ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ
-
YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్
-
YSRCP ముఖ్య నేతలతో జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు.రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు


