breaking news
YS Jagan Mohan Reddy
-
గిరిజన విద్యార్థినుల మరణాలపై మండిపడ్డ వైఎస్ జగన్
విశాఖపట్నం: కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో జాండిస్ తో ఇద్దరు బాలికలు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో జాండిస్ తో చికిత్స పొందుతున్న విద్యార్థినులు పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన విద్యార్ధుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత తాగునీరు లేకపోవడం వల్లే ఒకే స్కూళ్లో 170 మంది కలుషిత నీరు తాగడం వల్ల జాండిస్ బారిన పడితే అవగాహన లేని మంత్రులు వాటర్ కంటామినేషన్ కాదని అబద్దాలు చెప్పడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహాం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు వైయస్సార్సీపీ తరపున వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే...కేజీహెచ్ లో జాండిస్ తో 65 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. వీళ్లంతా కురుపాం లోని ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్ కు వచ్చారు. కురుపాం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో నుంచి విశాఖ కేజీహెచ్ కు వచ్చారంటే విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందరూ 5, 6 తరగతులు చదువుతున్న చిన్న పిల్లలు జాండిస్ తో బాధపడుతున్నారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు స్కూళ్లో తాగునీటి సమస్య ఉందని చెబుతున్నారు. వైద్యులు సైతం నీరు కలుషితం వల్లే జాండిస్ వచ్చిందని చెబుతున్నారు. స్కూళ్లో ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు కాబట్టే నీరు కలుషితం అయింది. అది కూడా మలమూత్రాలతో నీరు కలుషితం కావడం వల్లే.. పిల్లలకు కామెర్లు సోకాయి. మొత్తం 170 మందికి ఒకే స్కూల్ పిల్లలకు కామెర్లు వస్తే.. ప్రభుత్వం, మంత్రులు దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప... పరిష్కారం వెదకడం లేదు. ప్రభుత్వ వసతి గృహంలో కలుషిత నీటి వలన 170 మందికి కామెర్లు వస్తే.. వీరిలో 65 మంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు విద్యార్థినులు చనిపోయారు. కామెర్లతో చనిపోయిన ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలి. అంతే కాకుండా కామెర్లు సోకిన మిగిలిన పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుని ఒక్కోక్కరికి రూ.1లక్ష చొప్పున ఇవ్వాలి. అదే విధంగా స్కూళ్లో ఆర్వో ప్లాంటును తక్షణమే రిపేరు చేయించాలి. బాత్రూమ్ లు, శానిటేషన్ పనులు పూర్తి చేయాలి. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ తప్పిదమే. తక్షణమే ప్రభుత్వం కురుపాం స్కూళ్లో సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం తమ తప్పిదాలకు ప్రాయశ్చితం చేసుకోకపోతే దేవుడు కూడా వీళ్లని క్షమించడు. గిరిజన పిల్లల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. జాండిస్ బారిన పడిన పిల్లలకు కచ్చితంగా పరిహారం ఇప్పించే కార్యక్రమంలో భాగంగా అవసరమైతే వైయస్సార్సీపీ కోర్టును కూడా ఆశ్రయిస్తుంది.ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే...కేజీహెచ్ కు వచ్చిన హోమ్ మంత్రి నీరు కలుషితం కాలేదని మాట్లాడుతున్నారు అంటే.. అసలు జాండిస్ ఎలా వస్తుందన్న అవగాహన కూడా ఆమెకు లేదు. జాండీస్ వాటర్ కంటామినేషన్ వల్లే జాండీస్ వస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒకే స్కూల్ నుంచి 170 మంది వచ్చారు. 65 మంది ఇదే ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. మరి అది వాటర్ కంటామినేషన్ వల్ల కాకుండా ఎలా జరిగింది..? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం. తప్పు జరిగింది.. ఒప్పుకోమని చెప్పండి. ఒప్పుకొని దానికి ప్రాయశ్చితం ఏమేమి చేయాలని చేయమని చెప్పండి.ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. రూ.25 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమం చేయాలి. స్కూళ్లలో, హాస్టళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించండి. బాత్రూమ్లు రిపేరు చేయించాలి. శానిటేషన్ పనులన్నీ పూర్తి చేయాలి. వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు బతికే పరిస్థితి, చదివే పరిస్థితి కల్పించండి.పార్వతీపురంలో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం నిలిపివేయకుండా పూర్తి చేసి ఉంటే ఇవాళ వీరందరినీ ఆ ఆసుపత్రి కాపాడి ఉండేది. 200 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వం విద్యార్ధుల ప్రాణాలతో చెలగాట మాడుతూ.. నీళ్లు కంటామినేషన్ లేదని అబద్దాలు చెబుతూ దుష్ప్రచారం చేయడానికి కొద్దిగానైనా సిగ్గుండాలి. జాండిస్ తో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారుల కటుంబాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తలో రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన విద్యార్ధినులకు కూడా పార్టీ తరపున అండగా ఉంటాం. మరోవైపు న్యాయపరంగా కూడా వీరికి అండగా ఉండే కార్యక్రమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: వైఎస్ జగన్
విశాఖ: నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారు(అక్టోబర్ 9వ తేదీ) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కేజీహెచ్లోని పచ్చకామెర్ల బాధిత విద్యార్థులను వైఎస్ పరామర్శించారు. పచ్చకామెర్ల బారిన పడ్డ బాధిత విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. మీడియాను కేజీహెచ్ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించడంతో బయట మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్. ‘170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వచ్చాయి. పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. స్కూళ్లు, హాస్టల్స్లో బాత్రూమ్లను శానిటేషన్ చేయాలి. ఒకే స్కూల్ నుంచి 65 మంది విద్యార్థులు కేజీహెచ్లో చేరారు. కురుపాం నుంచి 200 కి.మీ దూరంలో కేజీహెచ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలుషిత నీటి వల్లే పిల్లలకు ఈ పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 170 మంది పిల్లలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా వాటర్ ప్లాంట్ను రిపేర్ చేయించాలి. పిల్లల తరఫున మేం మెడికో లీగల్ కేసు వేస్తాం. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందజేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’ -
వైఎస్ జగన్ పర్యటన.. కేజిహెచ్ వద్ద విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఓవరాక్షన్
సాక్షి,విశాఖ: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనతో కేజీహెచ్ వద్ద పోలీస్ సీపీ శంఖ బ్రత బాగ్చి ఓవర్ యాక్షన్ చేశారు.కేజీహెచ్ వద్ద వైఎస్ జగన్ ప్రెస్మీట్కు అనుమతించలేదు. ఆస్పత్రి నుంచి మీడియాను బయటకు పంపించేశారు. వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించేందుకు వస్తున్న వైఎస్ జగన్ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వీలు లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. కేజీహెచ్ పీడియాట్రిక్ వార్డు నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆదేశించారు.మరోవైపు కేజీహెచ్కు చేరుకున్న వైఎస్ జగన్..కామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్..
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రభుత్వ పెద్దల కుట్రలు, పోలీసుల అడ్డంకులు అన్నీ దాటి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు జగన్ వెంట జనం నడిచారు.అనకాపల్లి నుంచి రాజుపాలెం వరకు కుండపోత వర్షం కురిసినా, ప్రజల ఉత్సాహం తగ్గలేదు. మహిళలు, వృద్ధులు వర్షంలో తడుస్తూనే జగన్ కోసం ఎదురు చూశారు. కొత్తూరు జంక్షన్ వద్ద టీడీఆర్ బాధితులు, వర్షంలో తడుస్తూనే జగన్ను కలిశారు. తాళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్లు చెరువులా మారినా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు మోకాళ్ల లోతు నీళ్లలో జగన్ కోసం వేచి చూశారు. రైతుల కష్టాన్ని చూసి చలించిన జగన్, వర్షంలో తడుస్తూనే బాధితులతో మాట్లాడారు.జగన్ పర్యటనను విఫలం చేసేందుకు అధికారిక యంత్రాంగం ప్రయత్నించినా, ప్రజల ఆదరణ ఆ ప్రయత్నాలను తుడిచిపెట్టేసింది. కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, జగన్ కాన్వాయ్లోని వాహనాలను నిలిపి వేసినా, క్యాడర్ పొలాల నుంచి బైకులపై వచ్చి, వర్షంలోనూ హారతులు పట్టారు. గుమ్మడి కాయలతో స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఉత్తరాంధ్ర మార్మోగింది. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు 63 కి.మీ. దూరాన్ని 6 గంటలకు పైగా ప్రయాణించి, ప్రజల ఆదరణతో జగన్ పర్యటన సూపర్ సక్సెస్గా నిలిచింది. ఈ పర్యటనతో వైఎస్సార్సీపీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
YS Jagan: ఇకనైనా మారు చంద్రబాబూ... చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్
-
జగన్ పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం
అనకాపల్లి జిల్లా : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మాకవరపాలెం మెడికల్ కాలేజీలో పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. ఏకంగా జగన్ కార్వాన్ మీదకు జనం ఎక్కినా పోలీసులు పట్టించుకోలేదు. జనం ఇలా కార్వాన్ మీదకు ఎక్కినా పోలీసులు మాత్రం చోద్యం చూశారు. ఈ పర్యటనలో మధ్మాహ్నం నుండి వర్షంలో తడుస్తూ వచ్చారు వైఎస్ జగన్. కార్వాన్ లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకునేందుకు కూడా వైఎస్ జగన్ అవకాశం లేకుండా పోయింది. జనాన్ని అదుపు చేయకుండా వదిలేశారు ఖాకీలు. ప్రెస్మీట్ సమయంలోనూ గ్యాలరీలోకి జనాన్ని పంపారు పోలీసులు. దాంతో జగన్ మాట్లాడే సమయలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసుల కారణంగా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కొందరు ఖాకీలు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. మరొకవైపు వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో పార్టీ కేడర్లో ఫుల్జోష్ నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం -
అయ్యా చంద్రబాబు గారూ ఇక కాస్కోండి! అక్కడే తేల్చుకుందాం..
-
YS Jagan: చంద్రబాబుకు సైన్స్ ఉంటే.. పిల్లలు చనిపోయేవాళ్లు కాదు
-
ఇదే నర్సీపట్నం మెడికల్ కాలేజీ అయ్యన్నను ఏకిపారేసిన YS జగన్
-
YS Jagan: చంద్రబాబు.. ఇదే నా వార్నింగ్
-
Medical College: అయ్యా చంద్రబాబు నీకే చెప్తున్నా.. రేపటినుండి మీకు చుక్కలే
-
అయ్యన్న ఇదిగో జీవో... వైఎస్ జగన్ దిమ్మతిరిగే కౌంటర్
-
కళ్ళు కనబడని వాళ్లకు చెబుతున్నా... ఇదిగో మెడికల్ కాలేజ్
-
Narsipatnam Tour: ఇది జగన్ మ్యాజిక్ జనంలో భారీ రెస్పాన్స్..
-
‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’
సాక్షి, నర్సీపట్నం: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్ జగన్.. చంద్రబాబు చేస్తున్న ప్రైవేటీకరణ కుట్రలను ఎండగట్టారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే.. ఈరోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గత మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాంప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీ చేస్తే.. తట్టుకోవడం పేదవాళ్లకు అసాధ్యంఅందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చిందిఅలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు.అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా? పేదవారు దగా పడకుండా ఎలా ఆపుతారుపేదవాళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చాంనర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాంకోవిడ్ సంక్షోభంలోనూ రూ.500కోట్లు ఖర్చు చేశాం ఈ మెడికల్ కాలేజీలో పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేదిఏడాదికి 150 మెడికల్ కాలేజీ సీట్లను అందుబాటులోకి తెచ్చాంఅలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుందిచంద్రబాబు పేదవాడికి అన్యాయం చేస్తున్నారువిజయనగరం,పాడేరు మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభమయ్యాయిచంద్రబాబును అడుగుతున్నాం.. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీల పరిస్థితుల ఇవిఈ నాలుగు మెడికల్ కాలేజీ కాకా.. ఐటీడీఏ పరిధిలోని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయిపలు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తయ్యియి17 మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి కనిపించింది.అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో 2023-24 క్లాసులు ప్రారంభమయ్యాయి. పేదవాళ్లు చదువుకునేందుకు, మెడిసిన్ చదివేందుకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయిఅలాంటి కోట్లాది మందికి వైద్యం,విద్య అందించే ఆధునిక దేవాలయాల్ని దగ్గరుండి చంద్రబాబు అమ్మేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారుమొత్తం మెడికల్ కాలేజీలకు ఐదేళ్లలో ఐదుకోట్లు.. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? చంద్రబాబుఅమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి.. అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి,కరెంట్,నీళ్లు ఇవ్వడానికి మొత్తం యాభైవేల ఎకరాలు.. ఎకరాకు రెండు కోట్లు చొప్పున మొత్తం లక్షకోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలకు రూ. రూ. 4,500 కోట్లు ఖర్చు చేయలేరా?ఇప్పుడు యాభైవేల ఎకరాలు సరిపోవు.. మరో యాభైవేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారుఇలా అమరావతి మొత్తంగా లక్ష ఎకరాలు.. రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూ.. 70వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం అని చెప్పుకుంటూ.. కోట్లాది మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు,ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు..ఏడాదికి వెయ్యికోట్లు ఐదేళ్లకు ఐదువేల కోట్లు ఖర్చు పెట్టలేక.. ప్రైవేట్ పరం చేస్తున్నారా? చంద్రబాబు.అయ్యన్నపాత్రుడుకి వైఎస్ జగన్ కౌంటర్!అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాంఇందులో భాగంగా నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నేత,ఎమ్మెల్యే,స్పీకర్ చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారుఅబద్ధాలు చెబుతూ.. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులే ఎక్కువే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. రుజువు చేసుకుంటున్నారుదీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు బుద్ధిరావాలి’ అని యాజిటేషన్ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే నర్సీపట్నం నేత,స్పీకర్కు చెబుతున్నాను.. అబద్ధాలు చెప్పడం,మోసం చేయడం,ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం.ఈమెడికల్ కాలేజీలకు జీవో ఎక్కడుందని అడుగుతారా?.. ఇదిగో జీవో నెంబర్ 204స్పీకర్ పదవిలో ఉండి జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి మీరు అర్హులేనా? అని ఆలోచన చేయండి. తప్పుడు మాటలు చెబుతూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుకు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తలదించుకోవాలిఇదే పెద్దమనిషి చంద్రబాబు 2024 జూన్లో అధికారంలోకి వస్తే..సెప్టెంబర్ 3న మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు ఆపమని ఓ మోమో డిక్లేర్ చేశారు.వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంమెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణు వైఎస్ జగన్ పిలుపుఅక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ,సంతకాల సేకరణఅక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలునవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలునవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలునవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపుగవర్నర్కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత -
ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న వైఎస్ జగన్
-
జగనన్న కోసం కదిలిన ఊరూ-వాడా (ఫొటోలు)
-
Narsipatnam Tour: వర్షం వచ్చినా డోంట్ కేర్ ప్రతి అడుగులో జగన్ వెంటే..
-
ఏం పిల్లడో వెళ్లాం వస్తావా జగనన్న న్యూ సాంగ్
-
Narsipatnam Tour: బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు అడ్డుకున్న పోలీసులు
-
ఈ వీడియో చూస్తే అనిత, అయ్యన్నకు నిద్రపట్టదు
-
Narsipatnam Tour: ప్రజల కష్టాలు విని షాకైన జగన్
-
‘టీడీపీ కండువాలు వేసుకో.. సీఐని సస్పెండ్ చేయాల్సిందే’
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని పోలీసు స్టేషన్ను టీడీపీ కార్యాలయంగా మార్చిన కూడేరు సీఐ రాజును సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ రాజు వేధింపులకు పాల్పడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ తొత్తుగా కూడేరు సీఐ రాజు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య. కూడేరు సీఐ రాజు ఖాకీ చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకుంటే మంచిది. మంత్రి పయ్యావుల కేశవ్ వర్గీయులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు.ఉరవకొండ నియోజకవర్గంలోని సీఐ, ఎస్ఐలకు ముడుపులు ఇస్తున్నారు. మంత్రి పయ్యావుల లంచాలకు అలవాటు పడ్డ సీఐ రాజు.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూడేరు సీఐ రాజుపై ఎస్పీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం. కూడేరు సీఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలి’ అంటూ విమర్శలు చేశారు. చదవండి: పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా.. -
స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ జగన్ భరోసా
-
జగన్ పర్యటనలపై కక్ష సాధింపు: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోంది. విశాఖ ఎయిర్పోర్టు మొదలుకుని ప్రతీ చోటా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాజీ సీఎం కాన్వాయ్ వెనుక పార్టీ నాయకుల వాహనాలను అనుమతించడం లేదు. ప్రతీ చోటా ఆంక్షలు, నియంత్రణలు పెడుతున్నారు. అనకాపల్లి నుంచి మాకవరపాలెం వరకూ ప్రజలెవ్వరినీ రానివ్వడం లేదు.ప్రజలను అడ్డుకునేందుకు దాదాపు మూడు వేల మంది పోలీసులను పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తితే సహించలేని పరిస్థితి కూటమి నేతలతో ఏర్పడింది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అని ఘాటు విమర్శలు స్తున్నారు. -
నర్సీపట్నం మెడికల్ కాలేజ్.. ఏంపిల్లడో చూద్దాం వస్తవా..
-
అయ్యన్న శుక్లాలు తీసి ఈ జన సంద్రాన్ని చూడు
-
YS జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు
-
జగనన్న స్టీల్ ప్లాంట్ కు రా ...!
-
జగన్ పై అంతులేని ప్రేమ.. నడి రోడ్డుపై దిష్టి తీసిన మహిళ
-
జగన్ రాకతో జనసంద్రమైన నర్సీపట్నం
-
విశాఖలో వైఎస్ జగన్.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్ జగన్ కాన్వాయ్లోని వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద కాన్వాయ్ వాహనాలను ఆపేసి.. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. నేతల కార్లు, బైకులను అడ్డుకుంటున్నారు. అభిమానంతో వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోనూ పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, వైఎస్ జగన్ అభిమానులను పోలీసులు అడ్డుకుంటున్నారు. సామాన్య ప్రజలను కూడా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకుంటున్నారు. అటు, స్థానికంగా ఉన్న షాపులను సైతం పోలీసులు మూయిస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో, పోలీసుల తీరును అభిమానులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి..వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అనకాపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ నేతలు పోలీసు తీరుపై ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై మండిపడుతున్నరు. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలేసి వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలనే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని అంటున్నారు.. -
వైఎస్ జగన్ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. తమ సమస్యలపై కార్మికులు.. వైఎస్ జగన్కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ వారితో మాట్లాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే స్టాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం. స్టీల్ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం, ప్రధానికి లేఖలు రాశాం. స్టీల్ప్లాంట్పై పార్లమెంట్లోనూ ప్రశ్నిస్తాం అని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్కు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్కు రావాలని వైఎస్ జగన్ను ఆహ్వానించాం. స్టీల్ ప్లాంట్కు వచ్చి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. మాకు మద్దతు ఇచ్చిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. మరోవైపు.. విశాఖలో వైఎస్ జగన్ను కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు విశాఖకు తరలి వచ్చారు. ఈ క్రమంలో జి.భీమవరం వద్ద పోలీసులు.. మత్స్యకారులను అడ్డుకున్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. దీంతో, ఎలాగైనా వైఎస్ జగన్ను కలిసి తీరుతామని మత్స్యకారులు తెలిపారు. అనంతరం, కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. -
KSR Live Show: వచ్చేది జగన్.. ఆపితే ఆగే సైన్యం కాదు
-
Watch Live: వైఎస్ జగన్ నర్సీపట్నం టూర్
-
బాబుకు బిగ్ షాక్.. జగన్ ను కలవనున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
నర్సీపట్నం బయలుదేరిన వైఎస్ జగన్
-
నర్సీపట్నంకు జగన్.. వణికిపోతోన్న బాబు అండ్ కో
-
వైజాగ్ అభివృద్ధికి జగన్ ఏం చేశారంటే..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు తన పాలనా కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాను ఆర్థిక శక్తిస్థావరంగా మలచడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించారు. విశాఖపట్నం దక్షిణాసియాలోని ముఖ్యమైన ఓడరేవు నగరంగా ఉండటం వల్ల దీన్ని ఐటీ, ఫార్మా, టూరిజం, ఇండస్ట్రీలకు హబ్గా మార్చడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగన్ నేడు విశాఖ పర్యటన సందర్భంగా తన పాలనా కాలంలో జిల్లాలో నిర్వహించిన కార్పొరేట్ కార్యక్రమాలను తెలుసుకుందాం. భవిష్యత్ వ్యాపార అభివృద్ధి కోసం సిద్ధం చేసిన ప్రణాళికలను చూద్దాం.కార్పొరేట్ కార్యక్రమాలుజగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019-2024 మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మార్చడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) వంటి పెద్ద ఈవెంట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఫార్మా, ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై దృష్టి సారించాయి. 2023 మార్చిలో విశాఖపట్నంలోనే నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) ఒక మైలురాయి. ఈ సమ్మిట్లో 352 ఒప్పందాలు జరిగాయి. దాంతో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల చేరాలనే లక్ష్యం నిర్ణయించుకున్నారు. వీటిలో సుమారు 39% ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. GIS వేదిక నుంచి జగన్ 14 పరిశ్రమలను భౌతికంగా ప్రారంభించారు. ఈ పరిశ్రమలకు మొత్తం రూ.3,841 కోట్ల పెట్టుబడితో 9,108 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.విశాఖపట్నం జిల్లాలో నేరుగా ప్రారంభించిన కార్పొరేట్ కార్యక్రమాలలో 2023 అక్టోబర్లో ఐదు కంపెనీల ప్రారంభం ముఖ్యమైనది. మొత్తం రూ.1,371 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీలు 2,950 ఉద్యోగాలు సృష్టించాయి. వీటిలో..ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్: రూ.500 కోట్ల పెట్టుబడితో 1,000 ఉద్యోగాలు. జావా, J2EE, SAP, డేటా సైన్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, రిటైల్ రంగాలకు సేవలు అందిస్తుంది.ఈజియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా సిటీలో): రూ.500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. సంవత్సరానికి 300 మిలియన్ ఇంజెక్టబుల్ యూనిట్లు ఉత్పత్తి.లారస్ ల్యాబ్స్ (అచ్చుతపురం సెజ్లో): రూ.440 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు.లారస్ సింథటిక్స్: రూ.191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు.మరో లారస్ ల్యాబ్స్ యూనిట్: రూ.240 కోట్ల పెట్టుబడి, 400 ఉద్యోగాలు (ఫౌండేషన్ స్టోన్).అనకాపల్లిలో ఫార్మా సిటీ అభివృద్ధి జగన్ పాలనలో వేగవంతమైంది. 2023 అక్టోబర్లో మూడు ఫార్మా కంపెనీలను ప్రారంభించి రెండు బల్క్ డ్రగ్ యూనిట్లకు శంకుస్థాపన వేశారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.1,611 కోట్ల పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2019 నుంచి 107 పెద్ద పరిశ్రమలు రూ.46,002 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1,06,249 ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో విశాఖపట్నం జిల్లా భాగస్వామం అధికంగానే ఉంది. అలాగే 88 ఒప్పందాలతో రూ.44,963 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. వీటిలో రూ.38,573 కోట్లు ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. ఈ కార్యక్రమాలు విశాఖపట్నంను ఫార్మా, ఐటీ హబ్గా మార్చాయి.భవిష్యత్ ప్రణాళికలుజగన్ పాలనలో విశాఖపట్నంను భవిష్యత్తులో గ్లోబల్ మెట్రోపాలిస్గా మార్చడానికి ‘విజన్ విశాఖ’ (Vision Visakha) ప్రణాళికను 2024 మార్చి 5న ప్రకటించారు. 10 సంవత్సరాల ప్లాన్కు మొత్తం రూ.1.05 లక్ష కోట్ల పెట్టుబడిని నిర్ణయించారు. ఈ పెట్టుబడులు ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉపయోగపడతాయి. 5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తాయి. విశాఖను హైదరాబాద్, చెన్నైలతో పోటీపడేలా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ల మధ్య సహకారం నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రణాళికలు ఇలా..ఇండస్ట్రియల్ డెవలప్మెంట్: 30 ప్రాజెక్టులకు రూ.33,080 కోట్లు (విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో). ఇందులో NTPC హైడ్రోజన్ పార్క్ (రూ.20,225 కోట్లు), TVS లాజిస్టిక్స్ పార్కులు (రూ.1,500 కోట్లు), JSW ఇండస్ట్రియల్ పార్క్ (రూ.532 కోట్లు), ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, ఇన్క్యుబేషన్ ఫెసిలిటీలు (APIS, STPI, NASSCOM, ఆంధ్ర యూనివర్సిటీ).ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్: భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ (రూ.4,727 కోట్లు), విశాఖ మెట్రో రైల్ (రూ.14,000-14,309 కోట్లు), హై-స్పీడ్ రైల్ కారిడార్లు (హైదరాబాద్-విశాఖ, విజయవాడ-బెంగళూరు). స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు రూ.1,906.15 కోట్లు. బీచ్ కారిడార్ (భోగాపురం నుంచి నగరం వరకు 6-లేన్ రోడ్)కు రూ.960 కోట్లు.ఎనర్జీ, గ్రీన్ టెక్: అదానీ డేటా సెంటర్ (రూ.27,000 కోట్లు), NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ (రూ.27,000 కోట్లు).ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
జగన్ ను కలిసి కన్నీరు పెట్టుకున్న డీఎస్సీ అభ్యర్థులు
-
జగన్ పర్యటనకు రావొద్దు..! ప్రజలకు, పార్టీ నేతలకు పోలీసుల బెదిరింపులు
-
ముదునూరి ప్రసాద రాజు కొడుకు వివాహానికి హాజరైన వైఎస్ జగన్
-
సవాల్ విసిరి రెచ్చగొట్టారు.. ఇప్పుడు భయపడుతున్నారు
-
జగన్ టూర్ పై కుట్ర.. అయినా తగ్గేదే లే..
-
నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను వైఎస్ జగన్ సందర్శన
-
మేం మంచి చేస్తే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. నేడు నర్సీపట్నంలో పర్యటనలో భాగంగా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాటు... -
YS జగన్ నర్సీపట్నం టూర్.. రూట్ మ్యాప్ ఇదే
-
ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల రక్షణకు పోరుబాట... నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
వైద్య కళాశాలల రక్షణకు 'వైఎస్ జగన్' పోరు బాట
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరుకు సిద్ధం అయ్యారు. గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన నర్సీపట్నం వైద్య కళాశాలను నేడు ఆయన స్వయంగా సందర్శించనున్నారు. తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థుల డాక్టర్ కలను సాకారం చేయడం కోసం గత ప్రభుత్వంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నిర్వహణ పేరిట ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను పచ్చ కార్పొరేట్ గద్దలకు 66 ఏళ్ల పాటు లీజు పేరుతో కారు చౌకగా, అప్పనంగా బాబు ప్రభుత్వం కట్టబెడుతోంది. రెండు దశల్లో 10 వైద్య కళాశాలలను ప్రైవేట్కు ధారాదత్తం చేసేలా ప్రణాళికలు రచించి, ఇప్పటికే తొలి దశలో నాలుగు కళాశాలలకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఉన్నత ఆశయానికి తూట్లు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు జిల్లాల పునర్విభజన చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త కళాశాలల నిర్మాణం చేపట్టారు. కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను హబ్లుగా అభివృద్ధి చేసి, జిల్లా పరిధిలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను అనుసంధానించి.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా నాణ్యమైన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని సంకల్పించారు. వైఎస్ జగన్ విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనాస్పత్రి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆస్పత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల అజమాయిïÙ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు, అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు, రక్త పరీక్షలు, ఇతర డయగ్నోస్టిక్ సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. దీంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టి, ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్కు కట్టబెడుతున్న వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలే ఉండబోవని ప్రభుత్వం రూపొందించిన టెండర్ నిబంధనలే చెబుతున్నాయి. 620 పడకల సామర్థ్యంతో నడిచే బోధనాస్పత్రుల్లో ఒక్కటంటే ఒక్క పడక కూడా ఉచిత వైద్యానికి కేటాయించరు. ఈ కళాశాలల్లో వంద శాతం పడకలతో కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోనున్నాయి. ప్రైవేట్ తరహాలోనే ఫీజుల దోపిడీ ⇒ కొత్త వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు ఆరి్థక వనరులు సమకూర్చుకునే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే ఎంతో తక్కువగా ఫీజులు ఖరారు చేసింది. ⇒ మధ్య తరగతి కుటుంబాల వారు సైతం భరించగలిగేలా ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉండే 35 శాతం సీట్లకు రూ.12 లక్షలు, 15 శాతం ఎన్ఆర్ఐ సీట్లకు రూ.20 లక్షల చొప్పున ఫీజుల విధానం ప్రవేశపెట్టారు. ఈ నిధులను కేవలం ఆ వైద్య కళాశాలల అభివృద్ధి కోసమే వెచ్చించేలా ప్రణాళిక వేశారు. అంతకు మించి ప్రైవేట్ కళాశాలల్లో మాదిరిగా విద్యార్థులపై ఫీజుల దోపిడీ లేకుండా చేశారు. ఈ విధానంపై అప్పట్లో కూటమి పార్టీలు, ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో దు్రష్పచారం చేశాయి. ⇒ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ప్ ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక తమదైన శైలిలో విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తూ ఏకంగా కళాశాలలనే ప్రైవేట్కు కట్టబెట్టేస్తున్నారు. ⇒ బాబు ప్రవేశపెట్టిన పీపీపీ విధానంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజుల దోపిడీకి లైసెన్స్ ఇచ్చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరి సీటుకు ఏటా రూ.13.20 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.39.60 లక్షల ఫీజులు ప్రైవేట్లో వసూలు చేస్తున్నారు. ఇదే ఫీజుల స్వరూపాన్ని పీపీపీకి ప్రభుత్వం ప్రతిపాదించింది. ⇒ ఈ లెక్కన 5 ఏళ్లకు సెల్ఫ్ ఫైనాన్స్ సీటుపై రూ.6 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాలో రూ.98 లక్షల చొప్పున విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం నడిపే వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఏడాది పాటు హౌస్ సర్జన్గా సేవలు అందించే సమయంలో నెలకు రూ.26 వేల చొప్పున ఏడాదికి రూ.3.12 లక్షల స్టైఫండ్ ఇస్తారు. ఈ నేపథ్యంలో కొత్త వైద్య కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే స్టైఫండ్ సరిగా అందదు. దీనికి తోడు అదనపు ఫీజుల దోపిడీకి గురవుతారు. ⇒ భవిష్యత్లో అందుబాటులోకి వచ్చే పీజీ సీట్లకు సైతం బీ కేటగిరికి రూ.9.93 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.57.50 లక్షలు చొప్పున ఫీజులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైకి మాత్రం విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని ప్రచారం చేస్తుండటం గమనార్హం.కళ్లెదుటే సాక్ష్యం ⇒ ఏపీ విభజన చట్టంలో భాగంగా మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణం చేపట్టింది. 2016–17లో నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా ఏక కాలంలో నిర్మాణాలన్నీ చేపట్టాక ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభించలేదు. కేవలం 50 మంది విద్యార్థులతో తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభించింది. ⇒ రెండు బ్యాచ్లకు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలోనే తరగతులు నిర్వహించారు. మంగళగిరిలో విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా భవనాలు అందుబాటులోకి వచ్చాకే విద్యార్థులను అక్కడికి తరలించారు. 2016–17లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ నిర్మాణం గతేడాదిలో పూర్తి అయింది. అంటే దాదాపు తొమ్మిదేళ్లు ఎయిమ్స్ నిర్మాణం కొనసాగింది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన నిర్మాణాల విషయంలో మాత్రం ఒకేసారి నిర్మాణాలెందుకు పూర్తి చేయలేదన్నట్టుగా బాబు ప్రభుత్వం దాడి చేస్తూ అభాసుపాలవుతోంది. నేడు వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్ మీదుగా) వెళతారు. అక్కడ కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా నిర్మాణం నిలిపి వేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. విష జ్వరాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.15.. 23.. ఏళ్లు ఎందుకు పడుతుంది? ⇒ 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తేవడం కోసం కేంద్ర సాయం, స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం, నాబార్డు లోన్ల ద్వారా రూ.8,480 కోట్ల నిధులు గత ప్రభుత్వంలోనే సమకూర్చారు. ఈ క్రమంలో కళాశాలల నిర్మాణానికి నిధుల సమస్య లేదు. ⇒ గత ప్రభుత్వంలో 2023–24లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చారు. ⇒ 2024–25లో పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు మొదలయ్యే నాటికే పాడేరు, పులివెందుల వైద్య కళాశాలలను సిద్ధం చేశారు. మిగిలిన మూడు కళాశాలలు సైతం మొదటి ఏడాది తరగతులకు సంబంధించి చిన్న చిన్న వసతులు సమకూర్చాల్సి ఉండింది. ⇒ ఈ చర్యల ఫలితంగానే గతేడాది పాడేరు, పులివెందులకు 50 చొప్పున సీట్లతో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి మిగిలిన సౌకర్యాలు సమకూరుస్తామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే ఆదోని, మదనపల్లె, మార్కాపురం కళాశాలలు కూడా ప్రారంభం అయి ఉండేవి. ⇒ వైఎస్ జగన్ విధానంలో వెళితే కళాశాలలు పూర్తి చేయడానికి 15 ఏళ్లు.. 23 ఏళ్లు పడుతుందని ప్రభుత్వం దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. దేశంలో ఎక్కడైనా ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ రంగాల్లో వైద్య కళాశాలలను వంద శాతం నిర్మాణం పూర్తి చేశాకే ప్రారంభించరనే వాస్తవాన్ని మరుగున పరుస్తోంది. ⇒ రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన వైద్య కళాశాలల నిర్మాణానికి మాత్రం నిధులు లేమిని సాకుగా చూపుతుండటంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ⇒ అస్మదీయులకు మేలు చేయడం కోసం సీఎం చంద్రబాబు చేసిన కుట్రలతో రాష్ట్ర విద్యార్థులు రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు. -
ఆటోలు తిప్పొద్దు..ఫ్లెక్సీలు కట్టొద్దు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన, ప్రజా ఉద్యమం కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు కుటిల యత్నాలు పన్నుతోంది. గురువారం నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రజలను తరలించవద్దంటూ ఆటోవాలాలు, పార్టీ నేతలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు పోలీస్స్టేషన్ల నుంచి ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. అనకాపల్లి టౌన్, రూరల్, కశింకోట, యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, నర్సీపట్నం టౌన్, రూరల్, చోడవరం టౌన్ పోలీసుల నుంచి పార్టీ నేతలకు బెదిరింపు కాల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మండల, గ్రామ స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్లు చేసేందుకు పథకం వేసినట్లు తెలుస్తోంది. మాకవరపాలెం మండల కేంద్రం ఇప్పటికే వందల మంది పోలీసులతో నిండిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణించి నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. అనంతరం ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడనున్నట్లు పార్టీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వలేమని ఒకసారి.. హెలికాప్టర్లో వెళ్లాలంటూ మరోసారి.. ఫలానా మార్గంలోనే వెళ్లాలంటూ ఇంకోసారి.. ఇలా ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్కారు అడ్డంకులు సృష్టిస్తోంది. అయితే వైఎస్ జగన్ పర్యటన ముందుగా ప్రకటించిన ప్రకారం యథాతథంగా సాగుతుందని వైఎస్సార్సీపీ స్పష్టంగా ప్రకటించడంతో చివరకు పలు షరతులు,ఆంక్షలు విధిస్తూ అనుమతించారు. ఎన్ని షరతులు విధించినా జనం వెల్లువలా తరలివస్తారని గ్రహించడంతో ప్రజలను తరలించకుండా అడ్డుకునే యత్నాలకు దిగినట్లు తెలుస్తోంది. ఆటోవాలాలను పిలిపించి గురువారం జగన్ పర్యటనకు జనాలను తరలించవద్దంటూ పోలీసుల ద్వారా సర్కార్ హెచ్చరిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు ఫోన్ కాల్స్..ఒకవైపు పర్యటనకు అనుమతి లేదంటూ తొలుత బెదిరింపులకు దిగిన పోలీసులు తర్వాత కొత్త మార్గంలో వెళ్లాలంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రజలను తరలించకుండా ఇప్పటికే ఆటోవాలాలను బెదిరించిన పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్లు చేయడం గమనార్హం. మీరెక్కడ ఉన్నారు? సీఐ పిలుస్తున్నారు.. వచ్చి కలవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఎంత చేసినా జగన్ పర్యటనను, జన వాహినిని అడ్డుకోలేమని గ్రహించడంతో ఫ్లెక్సీల వ్యూహాన్ని ఆశ్రయించారు. జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకపోవడం గమనార్హం. కూటమి నేతల ఫ్లెక్సీలు రోజుల తరబడి అలానే దర్శనమిస్తుండగా.. వైఎస్సార్ సీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 500 మందికి మించి గుమికూడవద్దంటూ ఆంక్షలు విధించడంతోపాటు అసలు ఫ్లెక్సీలు కట్టవద్దంటూ షరతులు విధిస్తున్నారు. అభిమానాన్ని చాటుకునేందుకు కూడా ఆంక్షలేమిటంటూ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో షరతులు, బెదిరింపులు చూడలేదని పేర్కొంటున్నారు.కళ్ల ముందే కనిపిస్తున్నా...రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 5 నూతన వైద్య కళాశాలలు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో 50 మంది విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా బాబు సర్కారు కుట్రపూరితంగా అడ్డుకుని వద్దంటూ లేఖ రాసింది. ఇవి రెండూ గత ప్రభుత్వ హయాంలోనే అన్ని వసతులతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ హయాంలోనే చేపట్టగా ఇప్పటికే 60 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇదంతా కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం రాగానే పనులను పూర్తిగా నిలిపివేసింది. అసలు మెడికల్ కాలేజీలకు అనుమతులే లేవంటూ చంద్రబాబు మొదలు మంత్రుల వరకూ అంతా బుకాయించగా నేషనల్ మెడికల్ కమిషన్ ఈ దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. దీంతో ప్రభుత్వ పెద్దలు కొత్త రాగం అందుకున్నారు. పీపీపీ పాట పాడుతూ విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి సర్కారు ప్రైవేట్ చేతుల్లో పెట్టి వ్యాపారానికి సిద్ధం కావడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా...విమానాశ్రయం నుంచి గాజువాక, అనకాపల్లి మీదుగా వైఎస్ జగన్ పర్యటన సాగితే మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం గుండా వెళుతుంది. అక్కడ భారీ సంఖ్యలో స్టీల్ప్లాంట్ కార్మికులు తరలివచ్చి తమ ఆక్రోశం, ఆవేదనను నేరుగా వైఎస్ జగన్కు విన్నవించే అవకాశం ఉందని కూటమి సర్కారు ఆందోళన చెందుతోంది. దీంతో కుటిల బుద్ధితో రూటు మార్చేసింది. ప్రధాన రహదారి గుండా వెళ్లకుండా ఎన్ఏడీ, పెందుర్తి మీదుగా పర్యటనకు అనుమతిచ్చారు. చంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, గొంతు నొక్కడంపై స్టీల్ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ మండిపడుతున్నారు. స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలపై కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (ఈవోఐ) ఆహ్వానించడం గమనార్హం. ఇక స్టీల్ప్లాంట్ కార్మికులకు సుమారు 4 నెలల వేతనం పెండింగ్లో ఉంది. -
వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ జగన్ పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఆ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ జగన్ రేపు (09.10.2025) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా - తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. -
‘వైఎస్ జగన్ పర్యటన యథావిధిగా కొనసాగుతుంది’
విశాఖ. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటన రేపు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) యథావిధిగా కొనసాగుతుందని పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఎయిర్పోర్టుకు చేరుకుని, రోడ్డు మార్గాన మెడికల్ కాలేజ్కి వెళ్తారని తెలిపారు. స్టీల్ప్లాంట్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు రూట్ మార్చారన్నారు. ‘ వైఎస్ జగన్ తన తిరుగు ప్రయాణంలో కేజీహెచ్కు వెళ్తారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శిస్తారు. 70 మంది వివిధ హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు మరణించారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్ జగన్ బయటకు వస్తున్నారంటేనే చంద్రబాబుకు వణుకు పుడుతుంది.జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా భయపెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు కట్టే ఫ్లెక్సీలను అడ్డుకుంటున్నారు.అరిచేతను అడ్డంపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు. ఆంక్షలుతో వైఎస్ జగన్ను ఆపలేరు. మనుషులు ఉండే హాస్పటల్లో నిర్మించలేని చంద్రబాబు పశువులకు హాస్టల్స్ పెడతారట’ అని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘జగన్ పర్యటనపై పోలీసులు హైడ్రామా నడిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవడానికి వీల్లేదు అంటూ రూటు మార్చారు. మాకు ప్రజా సమస్యల ముఖ్యం. పోలీసుల రూట్ మార్చిన వైఎస్ జగన్ నర్సీపట్నం వెళుతున్నారు. వైఎస్ జగన్ కలవడానికి వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ పర్యటనకు లేనిపోని ఆంక్షలు పెట్టారు. 10 కార్లు మాత్రమే కాన్వాయ్ లో ఉండాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, రాచరిక పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది. జగన్ పర్యటనను ఎంత అణగదొక్కాలని చూస్తే అంత తిరుగుబాటు మొదలవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, చిరు వ్యాపారుల సమస్యలు ఉన్నాయి’ అని తెలిపారు. -
Tadepalli: జగన్ను కలిసి కన్నీరు పెట్టుకున్న డీఎస్సీ అభ్యర్థులు
-
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ-2025 ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
ప్రధాని నరేంద్ర మోదీకి YS జగన్ మోహన్ రెడ్డి అభినందనలు
-
కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు.రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. -
Gudivada: పది కార్లకే అనుమతి ఇస్తే... మిగతావారందరు వెనుక పరిగెత్తలా..?
-
KK Raju: వైఎస్ జగన్ ను కలవకూడదనే రూట్ మ్యాప్ మార్చుతున్నారు
-
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు(YS Jagan Congratulate PM Modi). పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు, దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది. ఈ సందర్భంగా.. ఆయనకు మరింత శక్తి కలగాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2025నరేంద్ర దామోదరదాస్ మోదీ.. 2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 2014 మే 22 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా.. మే 26వ తేదీన తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అలా.. 11 ఏళ్లకు పైబడి మూడు పర్యాయాలు వరుసగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ మైలురాయి సందర్భంగా.. భారత ప్రజలకు కృతజ్ఞుడిని అంటూ మంగళవారం మోదీ(Modi On 25 Years Governance) ఓ ప్రకటన విడుదల చేశారు.ఇదీ చదవండి: ఇందిరా గాంధీ రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ -
జగన్ నర్సీపట్నం టూర్.. భయపడ్డ బాబు!
-
బాబు కొత్త డ్రామా.. విజయ్ తొక్కిసలాట ఘటన చూపి జగన్ కు కండీషన్స్!
-
జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటీ? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా ఖాకీలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు. విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతుంది’’ అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాము. జగన్కు భద్రత కల్పించమని అడిగాము. విశాఖ ఎయిర్ పోర్టు మీదగా గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి మీదగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాము. రూట్ మార్చి పోలీసుకు రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కవలకూడదు అని రూట్ మార్చారు.ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఎంతోమంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైఎస్ జగన్ వెళ్తారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు. వైఎస్ జగన్ పర్యటనకు 18 నిబంధనలతో ఆంక్షలు పెట్టారు. ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరు.చంద్రబాబు పర్యటనలో పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ప్రజలు చనిపోయారు. వాటిని పోలీసులు ఎందుకు పోలీసుల లేఖలో ప్రస్తావించలేదు. కరూర్ అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు. చంద్రబాబు ఆదేశాలు మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారు. పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదు. వాటిపై పునరాలోచన చేయాలి’’ అని అమర్నాథ్ కోరారు.‘‘ఏ రోజు మేము జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదు. పోలీసులు 65,000 మంది ప్రజలు వస్తారని చెప్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు. పల్లా మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజలు నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసం వైఎస్ జగన్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారు...నిన్నటి వరకు జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. ఈ రోజు రూటు మార్చి పర్యటన చేపట్టాలని పోలీసులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో నెలకు 1000 కోట్లు కూటమి నేతలు సంపాదించారు. 15 నెలల్లో 15 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ మైనింగ్లో కూటమి నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్కే రంగులు, ఎస్సెన్స్లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగన్ యాక్షన్ ప్లాన్.. ఇక కూటమికి చుక్కలే
-
మీరేంటి మాకు చెప్పేది.. జగన్ ని ఎలా అడ్డుకుంటారో చూస్తాం
-
జగన్ పర్యటనను ఆపే దమ్ముందా?
-
జగన్ టూర్ పై ఇంటెలిజెన్స్ సంచలన రిపోర్ట్.. చేతులెత్తేసిన పోలీసులు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నెల 9న తాను సందర్శిస్తానని.. అదే రోజు నుంచే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో మొదలయ్యే రచ్చబండ కార్యక్రమం నవంబరు 22 వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేకరించే కోటి సంతకాల పత్రాలను నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తామన్నారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తామన్నారు. సేకరించిన కోటి సంతకాల పత్రాలు గవర్నర్కు అందజేస్తామన్నారు.మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం విక్రయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆదేశించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ప్రభుత్వమే ఎందుకు నిర్వహించాలంటే..? మనం మన హయాంలో శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పేదలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తెచ్చాం. దీనిపై అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నా. మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని మాట్లాడమని కోరుతున్నా.అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్లను నడుపుతుంది? ఎందుకు ఆస్పత్రులను నడుపుతుంది? ఎందుకు ఆర్టీసీ బస్సులను నడుపుతుంది? వాటిని ప్రభుత్వాలే ఎందుకు నడుపుతున్నాయి? ఎందుకంటే.. ప్రభుత్వాలు అవి చేయకపోతే ప్రైవేటు ఎక్స్ప్లాయిటేషన్ (దోపిడీ) జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఆస్పత్రులను నడపకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీతో ఏ పేదవాడికీ వైద్యం అందని దుస్థితి తలెత్తుతుంది. ప్రభుత్వం కనుక స్కూళ్లను నడపకపోతే.. నారాయణ, చైతన్య యాజమాన్యానికి ఫీజులు కట్టలేక పేదలు తమ పిల్లలను చదివించలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులను నడపకపోతే.. ప్రైవేటు ఆపరేటర్ల దెబ్బకు ఎవరూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకే గవర్నమెంట్ వీటన్నింటిలో ఎంటరవుతుంది. అందుకనే ప్రభుత్వం స్కూళ్లను, బస్సులను, హాస్పటళ్లను నిర్వహించాలి. లేదంటే ప్రైవేటు దోపిడీకి అడ్డూ అదుపూ ఉండదు. జిల్లా మొత్తానికి హబ్గా.. మన హయాంలో ప్రతి జిల్లాలో ఒక టీచింగ్ హాస్పటల్ను తెచ్చే ప్రయత్నం చేశాం. ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. ఒక మెడికల్ కాలేజీ రాకతో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రైవేటు దోపిడీ ఆగిపోతుంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ స్టూడెంట్లు, నర్సింగ్ స్టూడెంట్లు టీచింగ్ హాస్పటల్లో పని చేస్తారు. రకరకాల విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడ అందుబాటులోకి వస్తాయి. తద్వారా పేద, మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా జిల్లా మొత్తానికి టీచింగ్ హాస్పటల్ ఒక హబ్గా పని చేస్తుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే ప్రివెంటివ్ కేర్ మన పాలనలో సువర్ణాధ్యాయంగా నిలిచింది. మెడికల్ సీట్లు పెరిగేవి.. నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు 2,360 మాత్రమే. మనం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చేవి. మొత్తంగా 4,900 మందికిపైగా డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటికి వచ్చేవారు. అంతమంది డాక్టర్లు మన రాష్ట్రంలో అందుబాటులో ఉండే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. అది కూడా మెడికల్ సీట్లలో 50 శాతం కోటా ఉచితం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాబట్టి మిగిలిన 50 శాతం సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే తక్కువ ఫీజుకే విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటీకరణ ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఉచిత వైద్యం పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఏడు కాలేజీలు పూర్తి చేశాం.. మన హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదింటిని పూర్తి చేశాం. వాటితోపాటు పాడేరు మెడికల్ కాలేజీని కూడా కలిపితే 800 ఎంబీబీఎస్ సీట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల.. ఇలా ఐదు మెడికల్ కాలేజీలు మనం అధికారంలో ఉండగానే 2023–24లోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు.. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించేందుకు చంద్రబాబు రాకముందే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 మెడికల్ సీట్లు శాంక్షన్ అయితే.. మాకొద్దంటూ చంద్రబాబు అడ్డుకుని ఎన్ఎంసీకి లేఖ రాయించారు. 9 నుంచి కార్యాచరణకూటమి సర్కారు ప్రజా కంటక పాలనను నిలదీస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 9న నేను స్వయంగా సందర్శిస్తా. ఆ రోజుతో ఈ కార్యాచరణ ప్రారంభమవుతుంది. మర్నాడు 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ కార్యక్రమం మొదలై నవంబరు 22 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లోనూ, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలిస్తారు. అనంతరం గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదించి కోటి సంతకాల పత్రాలు అందజేస్తాం. ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా? మనం దాదాపు రూ.3 వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేశాం. ఇక మిగిలింది రూ.5 వేల కోట్లు. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి ఖర్చు పెట్టలేరా? వాటిని పూర్తి చేయడానికి మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకువచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫాస్ట్రక్చర్ అనే పథకంలో మెడికల్ కాలేజీలను కూడా పెట్టించాం. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇస్తారు. నేను చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇవ్వలేరా? సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇవ్వలేరా? అమరావతిలో రూ.70 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. ఇప్పుడున్న 50 వేల ఎకరాలు సరిపోవు. ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడుగుతున్నారు. మొదట 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి చంద్రబాబు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కావాల్సింది రూ.లక్ష కోట్లు. కానీ ఇంతకు ముందు ఆయన ఖర్చు చేసింది చూస్తే రూ.4500 కోట్లు. అది అలా ఉండగానే మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు.అంటే అక్కడ మరో రూ.లక్ష కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యారు. అంటే మొత్తం రూ.రెండు లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాంటిది రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి కొత్త మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయి. అవి చిరస్థాయిగా నిలి్చపోయే విలువైన సంపద. ప్రైవేటు వారు పేదలను దోచుకోకుండా శ్రీరామరక్ష లాంటిది. అలాంటి వాటికి ఐదేళ్లలో కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? ఆశ్చర్యంగా ఉంది. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల జరిగే నష్టాన్ని, సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరిస్తాం. అదే సమయంలో ఆ గ్రామంలో పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలి. మెడికల్ కాలేజీలకు సంబంధించి క్యూఆర్ కోడ్తో ముద్రించిన పాంప్లెట్లు, కోటి సంతకాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్తో రూపొందించిన లెటర్ కాపీలను గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందచేయాలి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 100 పంచాయతీలు ఉంటాయనుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనీసం 500 మందితో సంతకాలు సేకరిస్తాం.ఆ బాధ్యతను కొత్తగా నియమించే గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలకు అప్పగిస్తాం. ఈనెల 10 నుంచి నవంబరు 22 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతి నియోజకవర్గం ఇన్చార్జీ రోజూ రెండు గ్రామాలను సందర్శించి సంతకాల సేకరణను పర్యవేక్షించి అక్కడే మీడియాతో మాట్లాడతారు. అక్టోబర్ 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి, నియోజకవర్గ స్థాయి అధికారికి డిమాండ్ పత్రాన్ని అందచేస్తాం. అప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో నేను స్వయంగా ర్యాలీలో పాల్గొంటా.నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడ తరలిస్తారు. తదుపరి గవర్నర్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తాం. కోటి సంతకాల పత్రాలూ ఆయనకు అందజేస్తాం. -
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు
8 ఏప్రిల్ 2025న సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లెలో టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. జనాభిమానాన్ని పోలీసులు నిలువరించలేకపోయారు. 18 జూన్ 2025న పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోయిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు పల్నాడు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా కేవలం 100 మంది మాత్రమే రావాలంటూ అర్థంపర్థం లేని నిబంధనలను పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడ్డారు. ఆంక్షలు పెట్టారు. అయినా ప్రజలు పొలాల మధ్యలోనుంచి గట్ల వెంబడి పరుగులు తీసుకుంటూ తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు. 31 జూలై 2025న అక్రమ కేసులతో జైలుకు వెళ్లి తిరిగివచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. పోలీసులు జగన్ పర్యటనను విఫలం చేయాలని శాయశక్తులా యత్నించారు. ఎవ్వరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ఏకంగా రోడ్లపైన అప్పటికప్పుడు తవ్వేశారు. అయినా ప్రజాభిమానాన్ని ఆపలేకపోయారు. ఈ ఘటనలను సాకుగా చూపి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరోక్షంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నట్టుగా ఉంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు 66వేల మంది వస్తారని, వారిని నిలువరించలేమని పోలీసులే పేర్కొనడం, జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలన్న సర్కారు కుట్రలో వారు పావులుగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. కొత్త ఎత్తులు వేస్తోంది. వైఎస్ జగన్ వెళ్లిన ఎక్కడికి వెళ్లినా జనాదరణ వెల్లువెత్తుతుండడంతో సర్కారులో వణుకుపుడుతోంది. ప్రజావ్యతిరేకత పెరిగిపోవడంతో జంకుతోంది. ఫలితంగా ఎలాగైనా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని ఆంక్షలు విధిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు ఏకంగా 65 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మెడికల్ కాలేజీ నిర్మాణమవుతున్న మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం వరకు రోడ్డు మార్గాన వెళితే భద్రత కల్పించలేమంటూ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చితో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ అప్పటికప్పుడు ప్రకటించడం గమనార్హం. 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో అవసరమైన పోలీసు బలగాలను ఇప్పటికిప్పుడు కేటాయించలేమంటూ సెలవివ్వడం చర్చనీయాంశమైంది. విశాఖలో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటూ సాకుగా చూపడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతిమంగా ఈ పర్యటన జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు స్వయంగా పోలీసులే... 65 వేల మంది తరలివచ్చేందుకు అవకాశం ఉందని, అంత మందికి అక్కడి ప్రాంతం సరిపోదంటూ మాజీ మంత్రి అమర్నాథ్కు పంపిన సమాధానంలో పేర్కొనడం ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా అంగీకరించినట్టు స్పష్టమవుతోంది. సవాల్ విసిరి.... చల్లారిపోయి....! వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఉమ్మడి విశాఖలోని పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిచేసి ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు 50 సీట్లు కేటాయించారు. మరో ఐదు కళాశాలలను అంతకుముందే ప్రారంభించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ. 500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. ఇప్పటికే 60 శాతం మేర నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పనులను పూర్తిగా నిలిపివేసింది. పైగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో ప్రైవేటు పరంచేసేందుకు సర్కారు కుట్రపన్నింది. దీనిపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కాలేజీకి అనుమతులు లేవంటూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కొత్తరాగం అందుకున్నారు. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతి లేదని, జీఓ ఉందా? దమ్ముంటే రమ్మనండి.. ఎవరినైనా రమ్మను అంటూ బీరాలు పోయారు. అర్థంపర్థం లేని సవాల్ విసిరారు. అయితే, స్పీకర్ మాటలు అబద్ధాలేనని భీమబోయినపాలెంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలే సమాధానమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న రానున్నారు. ఇప్పటివరకు దమ్ముంటే రమ్మనండి అంటూ సవాళ్లు విసిరిన కూటమి నేతలు ఇప్పుడు వైఎస్ జగన్ వస్తుంటే నిజాలన్నీ బయటకు వస్తాయని వణికిపోతున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.హెలికాప్టర్పై అయితే అనుమతిస్తారట..! వాస్తవానికి వివిధ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యత్నించిన ప్రతీసారి ఏదో ఒక రూపంలో అడ్డంకులు కల్పించడం పోలీసులకు పరిపాటిగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్బంగా జరిగిన ఘటనను పేర్కొంటూ హెలికాప్టర్ ల్యాండింగ్కు పలు సందర్భాల్లో అనుమతి నిరాకరించిన పోలీసులు... ఇప్పుడు అందుకు విరుద్ధంగా హెలికాప్టర్లో వస్తే అనుమతిస్తామంటూ కొత్త పల్లవి అందుకోవడం గమనార్హం. అయితే, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్లో ప్రయాణం సాధ్యం కాదని తెలిసినా.. అందుకు అంగీకరిస్తామని చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా జగన్ను అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ పల్లవి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఎట్టకేలకు ఆంక్షలతో అనుమతివిశాఖ సిటీ: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ అటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో నాటకీయ పరిణామాల మధ్య పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని మంగళవారం అర్ధరాత్రి విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. పర్యటన ఇలా సాగాలి » విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి.» అక్కడి నుంచి సుజాతనగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలి. » ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు, పొడిగింపు లేదా అనుమతి లేని హాల్ట్ చేయకూడదు. » ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు. గుమిగూడటానికి కూడా అనుమతి లేదు. » మార్గంమధ్యలో సమావేశాలు, రిసెప్షన్లు, ప్రజల్ని సమీకరించడం చేయకూడదు. » ఊరేగింపులు, రోడ్ మార్చ్లపై నిషేధం ఉంటుంది. -
నేడు భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన భీమవరం చేరుకుంటారు, అక్కడినుంచి పెదఅవిురం చేరుకుని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం విజయనగరంలో నిర్వహించే సిరిమానోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రారి్థస్తున్నానని ‘ఎక్స్’లో మంగళవారం పోస్ట్ చేశారు.ఆదర్శనీయుడు వాల్మీకి మాజీ సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి సాక్షి,అమరావతి: ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు ష్యూరిటీ పోయింది.. మోసం గ్యారెంటీగా మారింది
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు, కళ్లార్పకుండా ఆడుతున్న అబద్ధాలు, ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా పొడుస్తున్న వెన్నుపోట్లు చూసి ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు?ఈ రోజు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేస్తోందని ఒకసారి సామాన్యుడిగా ఆలోచిస్తే.. అసలు పాలన మీద ధ్యాస లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారు? ఈ రోజు ఎంత ఆదాయం వచ్చింది? రేపటికి ఇంకా ఎంత పెంచుకోవాలి? సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి? అన్న వాటిపైనే వారికి ధ్యాస. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, అరాచకమే. రాష్ట్ర ఆదాయాలు తగ్గుతున్నాయి. అది పక్కదారి పట్టి.. చంద్రబాబు, ఆయన కుమారుడు, బినామీలు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోంది. దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏది చూసినా దోపిడీయే. ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కానీ రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడం లేదు. మట్టి, క్వార్ట్జ్, సిలికా, లేటరైట్.. ఏదైనా అంతే. మద్యం అన్నది ఏ స్థాయిలోకి వెళ్లిపోయిందో మనం చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. తమకు సంబంధించిన వారికి పావలా, అర్ధ రూపాయి, రూపాయికి భూములు పంచి పెడుతున్నారు. మన హయాంలో.. ప్రజలకు, రైతులకు మంచి జరగాలి.. మరో 30 ఏళ్లు ప్రభుత్వంపై భారం పడకూడదని యూనిట్ని రూ.2.49 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే నానా యాగీ చేసిన వారు ఈరోజు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకుంటున్నారు. డబ్బుల కోసం వీళ్లు ఏ స్థాయికి దిగజారారనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోసాలుగా మారిన హామీలు..మరోవైపు చూస్తే చంద్రబాబు ష్యూరిటీ పోయి మోసం గ్యారెంటీ అయ్యింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ల పేరుతో ఎన్నికలకు ముందు ఈనాడులో ఆయనిచ్చిన యాడ్స్ ఇప్పటికే చాలాసార్లు చూపించా. మొన్న అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించి అన్నీ చేసేశామని చెబుతూ ఇచ్చిన యాడ్స్ కూడా చూపించా. ఆ హామీలు ఎలా మోసాలుగా మారిపోయాయో వివరించా. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామన్నారు. విజయోత్సవ సభ అడ్వర్టైజ్మెంట్లో నిరుద్యోగ భృతి హామీ తీసేశారు. ఎన్నికలకు ముందు కనిపించిన 50 ఏళ్లకే పింఛన్ – ఏడాదికి రూ.48 వేలు హామీ ప్రకటన విజయోత్సవ సభకు వచ్చేసరికి మాయమైంది. ఆ పార్ట్ అంతా కటింగే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పోయి.. బాబు ష్యూరిటీ అనేది మోసం గ్యారెంటీగా మిగిలిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ నిర్వీర్యం.. పేదింటి చదువులపై కుట్రలురాష్ట్రంలో విద్యారంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో చూస్తుంటే బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ అనే వ్యక్తి ఇంకో ఐదేళ్లు పరిపాలన చేసుంటే.. ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు, ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు మన హయాంలో చదివిన వారు ఇంగ్లిష్ మీడియం, ఐబీ సర్టిఫికెట్తో పాసయ్యేవారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు అటెండ్ అవుతూ పదో తరగతి పూర్తయ్యే నాటికి వెస్ట్రన్ యాక్సెంట్ (అమెరికన్ యాక్సెంట్)తో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడేవాడని నేను కచ్చితంగా చెప్పగలను. ఇక ఎనిమిదో తరగతి పిల్లాడు మనమిచ్చే ట్యాబ్లతో ఐబీ చదువులు, టోఫెల్లో ఉత్తీర్ణత సాధించేవాడు. ట్యాబ్లతో ఇంటర్నెట్తో అనుసంధానమై సాఫ్ట్వేర్పై అవగాహన వచ్చేది. మనం సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఇవన్నీ కలిసి ఆ పిల్లాడు ఏ స్టేజ్కి వచ్చే వాడంటే.. ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా నిలిచేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ను రాష్ట్రంలో ప్రతి పేద, మధ్యతరగతి పిల్లలకు మనం అందుబాటులోకి తెచ్చాం. చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి ఎండీ మనవళ్లు ఈ ఐబీ చదువులు చదివారు. వాళ్లలో ఎవరూ తెలుగు మీడియం చదవడం లేదు. మన దగ్గరకి వచ్చేసరికి వీళ్లంతా కుట్ర పన్ని పేదవాడి మీద, మిడిల్ క్లాస్ వారి మీద రాక్షసుల మాదిరిగా యుద్ధం చేసి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంగ్లిష్ మీడియంలో ఐబీ నుంచి సీబీఎస్ఈ వరకు పేద పిల్లల ప్రయాణాన్ని అడ్డుకున్నారు. టోఫెల్ క్లాసులు పూర్తిగా రద్దయి పోయిన పరిస్థితి. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వకపోగా ఆ పేరెత్తే ధైర్యం కూడా వీరికి లేదు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు ఊసే లేదు. దారుణంగా గవర్నమెంట్ స్కూళ్లు.. 5 లక్షల మంది విద్యార్థుల తగ్గుదలప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. చివరకు నిర్వహణ కూడా చేయలేని అధ్వాన్న స్థితిలోకి విద్యా వ్యవస్థను నెట్టేశారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామెర్లు సోకాయి. 30 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. నెలరోజుల క్రితం జాండిస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. మన మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వెళితే గానీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. రోజుకొక మెనూతో గొప్పగా అందించిన గోరుముద్ద కనుమరుగైంది. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం ఏకంగా ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్స్ కోసం వచ్చిన పరిస్థితులు చూశాం. అదే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో 5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అమ్మ ఒడి పేరుతో మనం తీసుకొచ్చిన పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశారు. రూ.15 వేలు కాస్తా రూ.13 వేలు చేశారు. అది కూడా ఇవ్వకుండా కొందరికి రూ.9 వేలు, కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు.. ఆగుతున్న పిల్లల చదువులు..ఫీజురీయింబర్స్మెంట్కు సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇస్తుంటాం. కానీ 2024 మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇవ్వలేకపోయాం. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పుడు 2025 సెప్టెంబర్ నాటికి 7 త్రైమాసికాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు రూ.4,500 కోట్లకుగానూ ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. మిగతాదంతా గాలికొదిలేశారు. వసతి దీవెన కింద మన హయాంలో ఏటా ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. 2024లో ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లు ఇవ్వాల్సినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా నిలిపేశారు. దీంతో పిల్లలు చదువులు మానుకుంటున్న దుస్థితి. వ్యవసాయం.. నిస్సహాయ పరిస్థితుల్లోపంటల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. రైతులకి మనమిచ్చిన ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. మన హయాంలో సీఎం–యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ధరలను పర్యవేక్షించాం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా వెంటనే ఆర్బీకేలో అలెర్ట్ వచ్చేది. ఇప్పుడు అన్నీ పోయాయి. రైతు భరోసాగా మనం పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చి రైతుకు అండగా నిలిస్తే కళ్లబొల్లి మాటలతో భ్రమలు కల్పించారు. పేరు మార్చి అన్నదాతా సుఖీభవ అన్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు కాకుండా తామే సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపితే ఒక్కో రైతుకు రూ.40 వేలకుగాను విదిల్చింది కేవలం రూ.5 వేలు. ఇవాళ ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనుగోలు దగ్గర్నుంచి మొదలుపెడితే మిర్చి, పొగాకు, అరటి, మామిడి, టమాటా, సజ్జలు, పెసలు, మినుములు, చీని, ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులే. ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయాల్సింది పోయి ప్రైవేటుకి ఎక్కువగా కేటాయించి దళారీలతో డీల్ కుదుర్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏ రోజైనా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కడం చూశామా?ప్రజారోగ్యం నేడు గాలికి..వైద్య రంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన హయాంలో గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేవారు. 105 రకాల మందులు అందుబాటులో ఉండేవి. అక్కడే ఏఎన్ఎంలు రిపోర్టింగ్ చేసేవారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉండేవారు. తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు సేవలందించేవారు. అన్ని ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ అమలు చేసి నియామకాలు చేపట్టాం. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే.. మన హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 4% మాత్రమే. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచాం. 1,000 ప్రొసీజర్లను 3,300 వరకు తీసుకెళ్లాం. ఆరోగ్య ఆసరా తెచ్చి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ తెరమరుగైపోయాయి. ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.300 కోట్లు కావాలి. ఈ 16 నెలలకు గాను రూ.4,800 కోట్లు అవసరం. కానీ ఈ పెద్ద మనిషి రూ.1,000 కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.3,800 కోట్లు పెండింగ్ పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేశాయి. 108, 104 సర్వీసుల నిర్వహణ స్కాములమయం. కనీసం రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని, టీడీపీ ఆఫీస్ బేరర్గా ఉన్నవారికి 108, 104 సర్వీసుల నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగించారు. ఇక అది కుయ్.. కుయ్ అని ఏమంటుంది? బుయ్.. బుయ్ అంటుంది.ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్ఐఆర్, పీఆర్సీ, నాలుగు డీఏలు పెండింగ్ తదితర సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. నాడు మనం సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకువచ్చి ఉద్యోగులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తే వారు దానిపై దుష్ప్రచారం చేశారు. ఓపీఎస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వీటన్నింటిపైనా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉద్యోగులకు మనం తోడుగా ఉన్నామన్న భరోసాను కల్పించడంతో పాటు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలి. -
మద్యం ఆదాయం బాబు మాఫియాకే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఊరూరా 70 వేలకుపైగా బెల్టు షాపులను నెలకొల్పి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మరీ మద్యం దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారని దుయ్యబట్టారు. వేలం పాటలు పాడి డబ్బులు వసూలు చేసి.. మంత్రులకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత.. అంటూ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వారి నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రాణాలను హరిస్తున్నారన్నారు. కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీతో ఒకవైపు భారీగా దోపిడీ చేస్తూ మరోవైపు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్గా జరిపిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ డంపులు భారీగా బహిర్గతమయ్యాయన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి సర్కారు ప్రజా కంటక పాలనపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ నిర్దేశించారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. సమావేశంలో జగన్ ఏమన్నారంటే.మద్యం మాఫియా నెట్వర్క్ఇవాళ మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. మొత్తం వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్న తరువాత ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు. వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పెగ్గుల రూపంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. వేలంపాటలో గ్రామాల్లో బెల్ట్ షాపులు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో అక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమీషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు.నకిలీ లిక్కర్ తయారీదారులు, విక్రేతలు అందరూ టీడీపీ వాళ్లేనని వివరిస్తూ నిందితుడు కట్టా సురేంద్రనాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్తో ఉన్న ఫొటోలను చూపిస్తున్న వైఎస్ జగన్ నకిలీ మద్యంతో బరి తెగింపు.. బాబు పరిపాలనలో రాక్షసయుగంబాధ కలిగించే విషయం ఏమిటంటే.. వీళ్ల డబ్బు ఆశ ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. ప్రజలు ఏం తాగినా పర్వాలేదు... చనిపోయినా పర్వాలేదు.. తమ జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం నడుస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఆ మాఫియాను కంట్రోల్ చేసే కొందరు కేబినెట్ మంత్రులు, ప్రముఖ రాజకీయ పదవుల్లో ఉన్నవారు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు నెలకొల్పి క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి వారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ.. పరిశ్రమను స్థాపించి యంత్ర పూజ...మరో విషయం ఏమిటంటే.. ఇవాళ ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్రావు, సురేంద్రనాయుడు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్రెడ్డికి అప్పగించారు. ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను స్థాపించి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, మద్యం బాటిళ్ల ఫొటోలు చూపిస్తున్న వైఎస్ జగన్ ఒక్కో ఏరియా పంచుకున్నారు.. ఇబ్రహీంపట్నంలో రెండు భారీ డంప్లుఅధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు నెలకొల్పి ఒక్కొక్కరు ఒక్కో ఏరియా పంచుకున్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్దన్రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేశ్, చంద్రబాబుతో కలసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ సరుకు రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్షాపులకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్రెడ్డి సూçపర్వైజ్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటూ బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కార్టన్ బాక్సుల్లో స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిళ్లను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారట. నర్సీపట్నంకు చెందిన నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ.. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ అమర్చుకున్నారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అనకాపల్లి జిల్లా పరవాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యానికి అమాయకులు బలి..ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ మరణించాడు. జూపూడి వైన్ షాప్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వైన్ షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నకిలీ మద్యానికి అమాయకులు బలి అవుతున్నారు (ఆ ఫొటోలను పీపీటీలో చూపారు).అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం తయారీ నిందితుడు రుత్తల రాము శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని తెలిపే ఫొటో చూపిస్తున్న వైఎస్ జగన్ దాడుల్లో వేలాదిగా నకిలీ బాటిళ్లు స్వాధీనం..రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే.. సొంత ఆదాయాలు పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా అమాయకుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్ను సీజ్ చేశారు. అందులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్ బ్లూ 44 బాటిల్స్, కేరళ మాల్ట్ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్.. ఇలా మొత్తం 1,300 బాటిళ్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని 136 కేసులు, 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్ 6,500, ఖాళీ బాటిల్స్ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.నకిలీ మద్యంపై ఆందోళన ఇలా..ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డులతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిగా చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి.నాడు.. పరిమిత వేళల్లో క్వాలిటీతో విక్రయాలు..మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్ ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్ జరిగేది. అది కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్ తర్వాత, దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కాబట్టి ఇష్టారీతిన కాకుండా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పరిమితంగా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. మద్యం షాపులను 2,934కి తగ్గించాం. అక్రమ పర్మిట్ రూములతోపాటు 43 వేల బెల్టుషాప్లను పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. నాడు సరఫరా చేసిన లిక్కర్ బాటిళ్ల మీద క్యూఆర్ కోడ్ ఉండేది. వాటిని స్కాన్ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ నూటికి నూరు శాతం ఉండేది. -
‘వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనలో ఎలాంటి మార్పులేదు’
తాడేపల్లి : ఈనెల 9వ తేదీన నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. జగన్ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కురసాల కన్నబాబు.. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిన క్రమంలో కన్నబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.‘జగన్ పర్యటనలో ఎలాంటి మార్పు లేదు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గాన వెళ్తారు. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినా ఆగేదే లేదు. వాతావరణం బాగ లేకపోయినా హెలికాప్టర్లో వెళ్లమనడం ఏంటి?ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి ప్రభుత్వానికి తెలీదా?, విధ్వంసకర పాలన ఏపీలో జరుగుతోంది. జగన్ తెచ్చిన పథకాలను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తెచ్చారు. చంద్రబాబు వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. తరతరాల వారికి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారు. 9న నర్సీపట్నం పర్యటనకు జగన్ వెళ్లబోతున్నారు. జగన్ను చూసి ప్రభుత్వం వణికిపోతోంది. అందుకే రకరకాలుగా ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్ పర్యటనను అడ్డుకోవడం అంటే పోలీసుల చేతగాని తనమే. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించలేరా?, భద్రత కల్పించలేనప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రభుత్వం అంగీకరించినట్టే. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ పర్యటన కొనసాగుతుంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాంటప్పుడు హెలికాప్టర్ లో ప్రయాణం ఎలా సాధ్యం అవుతుంది?, జనం వస్తే రోప్ పార్టీలను పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా పర్యటనలు చేశారు. కందుకూరు, గుంటూరు, పీలేరులో తొక్కిసలాట జరిగినా ప్రభుత్వం ఆయన పర్యటనలను అడ్డుకోలేదు. జగన్ ఎక్కడా మైకులు పెట్టి మాట్లాడే పోగ్రామ్లు లేవు. మెడికల్ కాలేజ్ను చూసి మీడియాతో మాట్లాడుతారు. మధ్యలో ఎవరైనా జనం ఫిర్యాదులు ఇస్తే తీసుకుంటారు. జగన్ పర్యటనకు వెళ్లొద్దని నాయకులకు నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటి బెదిరింపులతో మమ్మల్ని అణచివేయలేరు. జగన్ ఎప్పుడు బయటకు వస్తున్నా ప్రభుత్వం ఆంక్షలతో చెలరేగిపోతోంది. అయినాసరే జగన్ పర్యటనను ఆపగలిగారా?, నర్సీపట్నం పర్యటన కూడా అలాగే కొనసాగి తీరుతుంది. పోలీసు అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి.జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డుమార్గాన వెళ్తారు’ అని మరోసారి స్పష్టం చేశారు కన్నబాబు. ఇదీ చదవండి:చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్ జగన్ -
చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు: వైఎస్ జగన్
-
ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటనపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మళ్లీ తమ కుట్రలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. ఎల్లుండి( గురువారం,అక్టోబర్ 9) నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అనకాపల్లి ఎస్పీ తువీన్ సిన్హాతో చంద్రబాబు సర్కార్ ప్రకటన చేయించారు. గతంలోనూ జగన్ పర్యటనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లినా ఏదో సాకు చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి రైతుల సమస్యలపై పోరాడినా ఆంక్షలే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా అడ్డంకులే పెడుతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పర్యటన ఆగేది లేదని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేసింది.ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లనున్న వైఎస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ను కలవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు సిద్ధమయ్యారు. బాధితులను వైఎస్ జగన్ను కలవనీయకుండా ప్రభుత్వం చేస్తోంది. పోలీస్ ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
Ys Jagan: జిల్లా కేంద్రాల్లో నవంబర్ S 12న ధర్నాలు
-
చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ(మంగళవారం, అక్టోబర్ 7) తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోందని.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు.‘‘ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు. పూర్తిగా పాలన గాడితప్పింది. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ల ధ్యాస. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు.. వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. దోచుకో.. పంచుకో.. తినుకో.. కనిపిస్తోంది’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘అక్రమాలకు అవకాశం లేకుండా మన హయాంలో లిక్కర్ పాలసీ ఉండేది. క్వాలిటీ విషయంలో ఏరోజు కూడా రాజీ పడలేదు. లిక్కర్ కొనుగోలు ఎంపానెల్ డిస్టలరీస్ నుంచే కొనుగోలు. ప్రతికోటా క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్ చేసేవాళ్లు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి లిక్కర్. నిర్దిష్టమైన సమయాల్లోనే మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్లం. షాపులు తగ్గించి, బెల్టుషాపులు ఎత్తివేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించింది. ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ రద్దు చేశాం. మూడింట ఒక వంతు షాపులు తగ్గించాం. మన హయాంలో ప్రతి బాటిల్పైన క్యూ ఆర్కోడ్ ఉండేది. ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూ ఆర్కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్లు. నూటికి నూరుశాతం క్వాలిటీతోనే మద్యం అమ్ముడుపోయేది...కాని, రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోంది. దీనికోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు.. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేటు దుకాణాలు అప్పగించారు. వేలం పాట నిర్వహించి.. బెల్టుషాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్. ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైనున్న పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని పంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారు. వీరికి సంబంధించిన షాపుల నుంచి తమకు కావాల్సిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు, ఇదోరకం మాఫియా...ఇదికాక మరో రకం మాఫియా నడుపుతున్నారు. ప్రజలు చనిపోయినా పర్వాలేదు, తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షస పరిపాలన నడుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారు. క్వాలిటీ లేని లిక్కర్ను తయారుచేసి, తన ప్రైవేటు మాఫియా నెట్వర్క్ద్వారా నేరుగా పంపిస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్న పరిస్థితి. ప్రాంతాల వారీగా కల్తీ దందా నడుపుతున్నారు. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్రహీపట్నంలో భారీగా దొరికిన మద్యం, దాని తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ లూటీ చేస్తున్నారు..ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తున్నాం. మన హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. మనం కొత్తగా పెట్టిన కాలేజీలను ఇప్పుడు తన బినామీలకు, తన మనుషులకు తెగనమ్ముతున్నాడు...మనం వచ్చేంతవరకూ రాష్ట్రంలో ఉన్నవి 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. మనం ఒక విజన్ను ఆవిష్కరించాం. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది?. అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఉన్నప్పుడే 2023-24లోనే కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు క్లాసులకు అందుబాటులోకి తెచ్చాం. తద్వారా 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందులోల 50 సీట్లు NMC ఇస్తే.. వద్దని చంద్రబాబు లెటర్ రాశాడు. మన హయాంలోనే అవసరమైన నిధులకు ఫైనాన్సియల్ టై అప్ చేశాం. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సేకరిస్తున్నాడు...మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాలకోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షలమందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా?. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది...అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం. మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరణ చేస్తాం. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాల సందర్శన. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాల సమర్పణ. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు. ఒక జిల్లాలో నేనుకూడా పాల్గొంటాను. నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్కు అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది’ అని వైఎస్ జగన్ వివరించారు. -
కూటమి ఉలిక్కిపడేలా.. YSRCP నేతలకు జగన్ కీలక ఆదేశాలు
-
పైడితల్లి సిరిమానోత్సవం.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, గుంటూరు: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభ వేళ.. భక్తులను ఉద్దేశిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. నేడు విజయనగరంలో నిర్వహించే సిరుల తల్లి సిరిమానోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అని అన్నారాయన. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. నేడు విజయనగరంలో నిర్వహించే సిరుల తల్లి సిరిమానోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. pic.twitter.com/tEKuDLMhMm— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2025 సిరిమానోత్సవం సందర్భంగా.. అమ్మవారు సిరిమాను అనే చెట్టు కొమ్మపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది. మహారాజ కోట నుంచి ప్రారంభమై, ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలతో ఊరేగింపు ఉంటుంది. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. -
ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(Medical Colleges Privatization) ఆందోళనలకు వైఎస్సార్సీపీ(YSRCP) సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలను ప్లాన్ చేసింది.ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుకు వైఎస్సార్సీపీ ముందు సాగనుంది. రచ్చబండ(Rachabanda), కోటి సంతకాల సేకరణ, గవర్నర్ని కలవటం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ పదో తేదీ నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రతీ నియోజకవర్గం నుండి 50వేల సంతకాలు సేకరణ చేయనున్నారు. చివరగా నవంబర్ 26న పార్టీ నేతలు గవర్నర్ని కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. -
YSRCP కార్యాలయంలో వాల్మీకి జయంతి కార్యక్రమం
-
ఈసారి జగన్ ప్రభుత్వం నడిచేది... పోతిన మహేష్ గూస్ బంప్స్ స్పీచ్
-
నేడు వాల్మీకి జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు వాల్మీకి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వాల్మీకికి నివాళి అర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని ప్రశసించారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్..‘ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు పెట్టారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. pic.twitter.com/vOuTOBRGod— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2025ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బి.వై.రామయ్య తదితరులు పాల్గొన్నారు. 07.10.2025తాడేపల్లిమహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్,… pic.twitter.com/GcSwK3UqYN— YSR Congress Party (@YSRCParty) October 7, 2025 -
ఇవాళ YSRCP ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
YS Jagan: అరచేతిలో వైకుంఠం చూపి ఇప్పుడు వారిని మోసం చేస్తారా?
-
వైఎస్సార్సీపీ నేతలతో ముగిసిన వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కీలక భేటీ ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు రాష్ట్రంలో యదేచ్ఛగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యవహారంపై వైఎస్ జగన్ ప్రముఖంగా ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రజా పోరాటం చేయాలని కేడర్కు ఆయన పిలుపు ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్దన్ రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో మొదలైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన.. మాకవరం మెడికల్ కాలేజీని సందర్శించనున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాబు చీటర్.. లోకేష్ లూటర్! -
ఉద్యోగులకు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి..? చేస్తున్నది ఏమిటి..?
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి... తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? రోడ్డు మీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీఆర్సీ, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్మెంట్ లీవ్ల కింద ఉద్యోగులకు దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు పెట్టారని ఎత్తిచూపారు. తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మీరు పెట్టే బాధలు భరించలేకే ఇప్పుడు ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తున్నాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మేళ్లను.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను జత చేస్తూ, చంద్రబాబు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.అందులో ఆయన ఏమన్నారంటే...‘‘చంద్రబాబు గారూ... మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వారు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజలు, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలు, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవడం మీకు అలవాటే.మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డు మీదకు వస్తున్నారు. చంద్రబాబు గారూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి దాని సంగతి ఏమైంది? మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే పీఆర్సీ వేసి, దానికి చైర్మన్ను కూడా నియమించాం.మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు.ఇచ్చే ఆలోచన మీకు లేదనిపిస్తోంది..ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడమే లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగులంతా ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కానీ, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు.⇒ సీపీఎస్/జీపీఎస్లను పునఃసమీక్షించి ఆమోదయోగ్య పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కానీ, మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దీనిమీద రివ్యూ చేశారా? మా ప్రభుత్వ పాలనలో సీపీఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జీపీఎస్ తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విధానంలో వెళ్తున్నాయి. మీరు... ఓపీఎస్ను తీసుకొస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కానీ, ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు.ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితిప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి... ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియని పరిస్థితి తెచ్చారు. ప్రతి నెల ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. కానీ, ఆ రోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ కరోనా లాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయడం లేదు.వాలంటీర్లకు ఎగ్గొట్టారు.. వైద్యాన్ని రోడ్డున పడేశారుమీరు అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, కుట్ర పన్ని వారి పొట్టకొట్టి ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తామని చెప్పి వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్లు, పీహెచ్సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు.⇒ మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చాం. మిగిలినవారికి అన్ని ప్రక్రియలు ముగిసినా ఇప్పటివరకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మళ్లీ దళారీ వ్యవస్థ... ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్ను తీసుకొచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్షమందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా జీతాలను క్రమంతప్పకుండా ప్రతి నెల 1వ తారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తెస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకు వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చాక రూ.3 వేల కోట్లకు పెంచాం. పేరుకే హెల్త్ కార్డులు... వాటితో ప్రయోజనం లేదుఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదల చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు గారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికి ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’. -
సీజేఐ గవాయ్పై దాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. సీజేఐ గవాయ్పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి కలవరపరచే విషయం అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు,. దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ గౌరవానికే ఇది అవమానకరమైనది. మనం అందరం కలిసి రాజ్యాంగ బద్ద సంస్థల సమగ్రతను కాపాడుదాం’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.The disgraceful attack on Hon’ble Chief Justice of India, Shri B.R. Gavai Ji, in the Supreme Court is deeply disturbing and must be unequivocally condemned. This is not only an assault on an individual but an affront to the dignity of our highest judicial institution. We must…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025 -
చంద్రబాబు మోసాలపై వైఎస్ జగన్ ఫైర్
-
ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపి తీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా?. నడిరోడ్డుమీద నిలబెడతారా?.. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలమీద, ఉద్యోగస్తుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. మీరుపెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డుమీదకు వస్తున్నారు. చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు...అధికారంలోకి వచ్చిన వెంటనే IR అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతి ఏమైంది?. మేం అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ఉద్యోగులకు IR ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేం PRC వేసి, దానికి ఛైర్మన్నుకూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, IR ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా PRC ఛైర్మన్ని వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు...న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడంలేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కాని, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు. CPS/GPSలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కాని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీనిమీద రివ్యూచేశారా?..మా ప్రభుత్వ హయాంలో CPSకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకోసం GPS తీసుకు వచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు.. OPSను తీసుకువస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కాని ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు...ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్క్యాష్ మెంట్ లీవులు… వీటి కింద దాదాపు రూ.31వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సినవాటికోసం ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నా ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో, వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు...ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతినెలా జీతాలకోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆరోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీదాన్ని అమలు చేయడంలేదు...మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, కుట్రపన్ని, వారి పొట్టకొట్టి, ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకూ మేలు చేస్తాం అని, వారినీ ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్కులూ, పీహెచ్సీలు మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. జీరో వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డున పడేశారు...మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు..@ncbn గారూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి,… pic.twitter.com/CFIDuN9w7W— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025..అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తిపలుకుతూ, వారికోసం ఆప్కాస్ను తీసుకు వచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్ష మందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా వారి జీతాలను, క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటోతారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకువస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకూ, వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చిన తర్వాత దాన్ని రూ.3వేల కోట్లకు పెంచాం. ..ఉద్యోగులకు EHS కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?. చంద్రబాబుగారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. -
Dharmana: మీ గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను గుర్తించండి.. అప్పుడే మీరు రాజకీయంగా ఎదుగుతారు
-
‘బాబు చీటర్, లోకేష్ లూటర్ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు’
సాక్షి, విశాఖ: చంద్రబాబు(Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) మండిపడ్డారు. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట మాట్లాడుతారని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.ఈనెల తొమ్మిదిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనపై నేడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఏడు నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ రోడ్ షోగా వెళ్ళే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వైఎస్ జగన్ కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి.చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్లో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోయాయి. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు చీటర్, లోకేష్(Nara Lokesh) లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికి లాభం? -
Gudivada: జగన్ అనకాపల్లి పర్యటన రూట్ మ్యాప్ ఇదే..
-
విద్యార్థులు చనిపోతుంటే.. సీఎం, మంత్రులు గాడిదలు కాస్తున్నారా..?
-
వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ఆంధ్రప్రదేశ్లో రాత్రికి రాత్రే కల్తీ మద్యం సూత్రధారులను మార్చేశారు... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
మీ పరిపాలన సిగ్గుచేటు
సాక్షి, అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవ్వడంతో కలుషిత నీరు తాగి పచ్చ కామెర్లు సోకి నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలవ్వడం తనను కలచి వేస్తోందన్నారు.611 మంది చదువుతున్న పాఠశాలలో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా.. మీరు, ఇంత మంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా? అంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పిల్లల ఆరోగ్యం పట్ల, బడుల్లో వసతుల పట్ల శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవ్వడంతో కలుషిత నీరు తాగడం మూలాన, పచ్చ కామెర్లు సోకి నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు.మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా? 611 మంది చదువుతున్న స్కూల్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా? ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? ముఖ్యమంత్రిగా మీరు, ఇంత మంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా? గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా? ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లు మూసుకున్న మాట వాస్తవం కాదా? ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబు గారూ.⇒ పేదల తల రాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు–నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫరి్నచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగు నీరు, మరుగు దొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం. పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగు నీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం.మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యా శాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం వారితో చేతులు కలిపి.. క్రమంగా ప్రభుత్వ విద్యా సంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచి్చన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బ తీశారు. ఇంగ్లిష్ మీడియంను, సీబీఎస్ఈ నుంచి ఐబీదాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, స్కూలు పిల్లలకు ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం గోరుముద్ద.. వీటన్నింటినీ నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. ⇒ ఆర్వో ప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవ్వడమో పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం గురుకుల పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, బడుల్లో వసతుల పట్ల శ్రద్ధ పెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి. -
ఏం స్కెచ్ వేశావ్ చంద్రబాబూ?: వైఎస్ జగన్
2024–25 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లు. ప్రైవేట్ మద్యం షాపులు, ఊరూరా బెల్ట్ షాపులు, ఇతరత్రా విచ్చలవిడి అమ్మకాల నేపథ్యంలో 2025–26 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం వృద్ధి మాత్రమే. ఏటా సహజంగా వచ్చే 10 శాతం పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా చంద్రబాబూ? –మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం మాఫియా వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. నకిలీ మద్యం తయారీ కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి, రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకానీ, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.⇒ మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామ స్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, నకిలీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారు చేస్తారు.. ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.⇒ లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి, విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్లు పెట్టారు. తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచి ప్రతి వీధిలోనూ పెట్టారు.రాత్రి పగలు అనే తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, కాగ్ నివేదికల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లు కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం?⇒ నకిలీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. కారణం.. ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీ వాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టుషాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, నకిలీ బాటిళ్లను పట్టుకునే వారు. కానీ అలా జరగలేదు.⇒ పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత, టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్ఛార్జి అనుచరుడి మద్యం దుకాణం వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి పైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? -
ఇదేం తీరు.. గాడిదలు కాస్తున్నారా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థినుల మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరు తాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా?. 611 మంది చదువుతున్న స్కూల్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా?. ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా?’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు...ముఖ్యమంత్రిగా మీరు, ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా?. గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా?. ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లుమూసుకున్నమాట వాస్తవం కాదా?. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబూ. పేదల తలరాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు-నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం...పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యాశాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాలకోసం వారితో చేతులు కలిపి, క్రమంగా ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బతీశారు...ఇంగ్లిషు మీడియంను, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, 8వ తరగతి వారికి ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద వీటన్నింటినీ నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. ఆర్వో ప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవడమో పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది...దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి, వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, వారి బడుల్లో వసతులపట్ల శ్రద్ధపెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు..@ncbn గారూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరుతాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4రోజుల వ్యవధిలోనే… pic.twitter.com/Dq0pocjxe6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2025 -
టీడీపీ కల్తీ మద్యం మాఫియాపై YS జగన్ ఆగ్రహం
-
చంద్రబాబు స్కెచ్.. రాత్రికి రాత్రే కల్తీ మద్యం సూత్రధారుల మార్పు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం సిండికేట్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కల్తీ మద్యం కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి.. ఆయన ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా?’ అని ప్రశ్నించారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టున్నారు అంటూ విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టు షాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారుచేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపులద్వారా, మీ బెల్టు షాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు, రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్ అమ్మడం మొదలుపెట్టారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు తెరిచారు..@ncbnగారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన… pic.twitter.com/t329MJtbLe— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2025ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, CAG నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదునెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ₹6,782.21 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం ₹6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతిఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని, సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం.కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కాని విచారణ, దర్యాప్తు తూతూమంత్రంగానే సాగుతున్నాయి. కారణం, ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీవాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టు షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, కల్తీ బాటిళ్లను పట్టుకునేవారు. కాని అలా జరగలేదు.పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్యనేత, టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్ఛార్జి అనుచరుడు మద్యం దుకాణంవైపు అధికారులెవ్వరూ కన్నెత్తిచూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు, మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం, ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా?’ అని ప్రశ్నించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రంగంలోకి YS జగన్
-
9న వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.8వ తేదీన భీమవరం(పెద అమిరం)లో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవడంలో భాగంగా భీమబోయినపాలెంలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ సీఎం వైఎస్ జగన్ సందర్శిస్తారు. -
7న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 7వ తేదీన ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక భేటీలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ నెల 8, 9 వ తేదీల్లో వైఎస్ జగన్ పర్యటనలకు సంబంధించిన అప్డేట్స్ను అందించాయి. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు(YS Jagan Bhimavaram Tour). మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించనున్నారు. అలాగే.. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ అనకాపల్లిలో పర్యటించనున్నారు(jagan Anakapalle Tour). నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో ఇటు వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. -
KSR Live Show: YS జగన్ చరిత్ర సృష్టించిన రోజు.. బాబు వల్ల కూడా కాలేదు
-
రణ రంగంలోకి YS జగన్
-
ఉక్కిరిబిక్కిరి...సచివాలయాలకు ఊపిరందేనా!
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా పౌర సేవలు, సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేరవేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలను వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2019 అక్టోబరు 2కు ముందు రాష్టంలో 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం కార్యాలయ భవనాలు లేవు. పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ కార్యాలయాలు తప్ప మరో ప్రభుత్వ కార్యాలయం ఉండని పరిస్థితి. 4–5 పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి. కానీ, ఆ పంచాయతీ కార్యాలయాన్ని ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియదు. అలాంటి సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు తర్వాత ప్రతి గ్రామంలో 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి గ్రామంలో, ప్రత వార్డులో అందుబాటులోకి వచ్చారు. » ప్రజల గడప వద్దనే సేవలు అందించేందుకు ప్రతి 50 మందికి ఓ వలంటీరును వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రోజూ ఉదయం 10 గంటలకే వీరంతా ప్రభుత్వ సేవలకు ప్రజలకు సిద్ధంగా ఉండేవారు. సాయంత్రం 3–5 గంటల మధ్య సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా వినతుల స్వీకరణకే కేటాయించారు. కుగ్రామాల్లో ఉండే సచివాలయాల్లో 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్పోర్టు బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సర్వీసులనూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను నాడే ప్రవేశపెట్టారు. ప్రభుత్వం మారగానే కుదేలు 16 నెలల కిత్రం వచ్చిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీరు–సచివాలయ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు మొదలుపెట్టింది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో పనిచేసిన వలంటీర్ల వ్యవస్థను లేకుండా చేశారు. వలంటీర్లు చేసిన పనులకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాల్సిన ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తిఅయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఫోటోతో కూడిన స్టిక్కర్లను ఇళ్లకు అంటించే బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకే అప్పగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసే కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంచుతున్నారు అవినీతి, పైరవీ లేకుండా సేవలు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అంతకుముందు ఏ ప్రభుత్వ పథకం అమలు చేసినా ఊళ్లో ఏ ఐదు, పదిమందికో లబ్ధి దక్కేది. అది కూడా ఊళ్లో పెద్దలతో పైరవీలు చేసుకునేవారికో, లంచం ఇచ్చేవారికో అవకాశం ఉండేది. అయితే, వైఎస్ జగన్ పాలనలో సచివాలయాల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధానం ప్రవేశపెట్టారు. ఎలాంటి పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావివ్వలేదు. ఇరుకు భవనాల్లోని పంచాయతీ కార్యాలయాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మోక్షం కల్పించింది. సచివాలయాల సేవలను ప్రజలకు అందించేలా ప్రతి చోటా రూ.43.60 లక్షలు ఖర్చుపెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన రెండంతస్తుల గ్రామ సచివాలయం భవనాలను నిర్మించారు. రూ.4,750 కోట్ల ఖర్చుతో 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేయగా చాలాచోట నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటి పక్కనే రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది.వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు, భవనాల నిర్మాణానికి పరిమితం కాకుండా కార్యాలయాల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పించింది. 4 నెలలకే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఉమ్మడి ఏపీలో 40 ఏళ్ల కిందట మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ప్రత్యేక ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. దీంతో ప్రజలకు సమర్థంగా పథకాలు అందలేదు. సుస్థిర అభివృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాల సాధనలో ఉమ్మడి ఏపీ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే చాలా అంశాలలో వెనుకబడింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు సమర్థంగా సంక్షేమ కార్యక్రమాలు అందాలని భావించింది. దీనికోసం కొత్తగా ఏర్పాటు చేసిన 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త శ్వాశత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసింది. 4 నెలల్లోనే భర్తీ ప్రక్రియను ముగించింది. సచివాలయాలకు అనుబంధంగా పనిచేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వాలంటీర్లను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్ నిర్మాణం చేపట్టింది. యునిసెఫ్ సైతం భాగస్వామ్యం ఐక్యరాజ్యసమితి అనుబంధ యునిసెఫ్ కూడా ఏపీలో సుస్థిర అభివృద్ధి, లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. కోవిడ్ విపత్తు సమయంలో రాష్ట్రంలో ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండడానికి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఒక కారణం అని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. విపత్తు వేళ వాలంటీర్లు–సచివాలయాల సిబ్బంది మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రమంతా ఇంటింటి సర్వేలు దాదాపు 30 విడతల పాటు నిర్వహించడం గమనార్హం. యునిసెఫ్తో పాటు కేంద్రం ప్రశంసలతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామ, వార్డు సచివాలయాలను తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు ఏపీలో పరిశీలన చేశాయి.నాడు... ఆరేళ్ల క్రితం అక్టోబరు 2న దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక కార్యక్రమం. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో గాం«దీజీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అంకురార్పణ. ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలను ప్రజలకు గడప వద్దనే అందించడమే లక్ష్యంగా పనిచేశాయి...! కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూశాయి. అంకితభావంతో విధి నిర్వహణతో గాం«దీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యానికి నిలువుటద్దంలా నిలిచాయి.నేడు... గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజల సేవల కన్నా ప్రభుత్వ పెద్దలు చెప్పే ఇంటింటి సర్వేలకు పరిమితం అయ్యాయి. ఎన్నో ఆశలతో ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆత్మగౌరవం దక్కితే చాలని భావించే దుస్థితి. తమ డిమాండ్ల సాధనకు వారం, పది రోజులుగా నిరసనలు చేపడుతున్నా పట్టించుకునేవారు లేరు. రోడ్లపైకి వచ్చి, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్న వీరు... గురువారం దసరా పండుగ నాడు ‘మహాత్మా మా గోడు వినయ్యా’అంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టి ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.1.34 లక్షల ఉద్యోగాల భర్తీ దేశంలో ఇప్పటికీ రికార్డే 2019 జూలై–అక్టోబరు మధ్య 1.34 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. యువత కూడా అంత పెద్ద సంఖ్యలో ఒకేసారి పరీక్షలు రాయడం దేశ చరిత్రలోనే లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రేషనలైజేషన్ పేరిట ఉద్యోగుల కుదింపువైఎస్ జగన్ ప్రభుత్వంలో 10–11 మంది చొప్పున పనిచేసేలా సచివాలయాలు ఏర్పాటు కాగా, కూటమి ప్రభుత్వం... వాటి పరిధిలో నివాసం ఉండే జనాభా ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను 6–8కి మధ్యకు పరిమితం చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో నిత్యం ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలను అందించే వీఆర్వోలు, అగ్రికల్చర్, వెటర్నరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గతంలో ఒక్కో సచివాలయంలో ఒక్కొక్కరు చొప్పన పనిచేశారు. కానీ, ఆయా కేటగిరీ ఉద్యోగులను 2, 3 సచివాలయాలకు ఒకరు చొప్పున తగ్గించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియ తిరిగి చాలా గ్రామాల్లో కొన్ని రకాల ప్రభుత్వ సేవలకు విఘాతం కలిగిస్తుందన్న విమర్శలున్నాయి. దీనికితోడు ఆరేళ్ల క్రితం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సమయంలో సరఫరా చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదు. ప్రభుత్వం కొత్తవి సరఫరా చేయడం లేదని ఉద్యోగ సంఘాల పేర్కొంటున్నాయి. -
Andhra Pradesh: అదొక చరిత్ర
సాక్షి, అమరావతి : గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతటా రాష్ట్రం వైపు చూసిన పరిస్థితి.. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వపరిపాలనను సాకారం చేసిన రోజది. ప్రజలకు ఉన్న ఊళ్లోనే ప్రభుత్వ సేవలు అందించేలా చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా, కనీ వినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన రోజది. ఏకంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాటు చేశారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంత మంది ఉద్యోగులను నియమించడం దేశ చరత్రలోనే జరగలేదు. చిన్న ఆరోపణ కూడా లేకుండా, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక్కరి చొప్పున వలంటీర్లను నియమించారు. తద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజల ఇళ్ల ముంగిటకే తీసుకెళ్లారు. ఈ విధానం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్ర రూపు రేఖలు మార్చే పాలనతో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా వివిధ ప్రభుత్వ శాఖలలో ఏకంగా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడం మరో రికార్డు. కాగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కనీసం పదో తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేక పోయిందని, డీఎస్సీ అంతా అవకతవకలేనని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు. నేడు అంతా రివర్స్ » రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల వేళ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏ ఒక్కటీ ఇవ్వకపోగా.. గత ప్రభుత్వ కృషిని సైతం తన ఘనతగా చెప్పుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై గత 15 నెలలుగా ఊకదంపుడు ప్రసంగాలు, కాకి లెక్కలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా నిస్సిగ్గుగా అవే అబద్ధాలు వల్లె వేశారు. » తాను ఏకంగా 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్లు కళ్లార్పకుండా బడాయిలు చెప్పుకోవడంపై అందరూ విస్తుపోతున్నారు. ఇంతవరకూ కనీసం ఉత్పత్తి కూడా ప్రారంభించని కంపెనీల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో 3,48,891 ఉద్యోగాలు ఇచ్చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. » గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న విశాఖ ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీబీజీ ప్లాంట్లు, రెన్యూ, మిట్టల్, జేఎస్డబ్ల్యూస్టీల్, అదానీ, షిర్డీసాయి, గ్రీన్కో అమ్మోనియా తదితర ప్రాజెక్టులన్నీ తన ఖాతాలో వేసుకున్నారు. వాటిని రాష్ట్రానికి తామే తెచ్చినట్లుగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. » వైఎస్సార్సీపీ హయాంలో 2023లో విశాఖ కేంద్రంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ముఖేష్ అంబానీ, ఆదిత్య మిట్టల్ లాంటి పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఏపీలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే అవి ఇంకా ఉత్పత్తి ప్రారంభించక ముందే వాటి ద్వారా 3.48 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చంద్రబాబు సర్కారు చెప్పుకోవడంపై ప్రజలు, పారిర్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత ప్రభుత్వంలోనే.. » కూటమి సర్కారు వచ్చాక ఇంత వరకు ఏ ఒక్కరూ కొత్తగా అధికారికంగా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా విధుల్లో చేరకపోయినా 15 నెలల్లో 31,134 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. నిజానికి ఇందులో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్, ప్రిలిమనరీ, మెయిన్ ఎగ్జామ్స్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. దీనిపై కొంత మంది కోర్టుకు వెళ్లడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు కేసులు పరిష్కారం కావడంతో కూటమి ప్రభుత్వం కేవలం నియామక పత్రాలు మాత్రమే జారీ చేసింది. » గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలను సైతం చంద్రబాబు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇదే రీతిలో గత ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసిన కూటమి సర్కారు పరీక్షల నిర్వహణలో న్యాయ వివాదాలు రేకెత్తిస్తూ సుదీర్ఘ కాలయాపన చేసింది. ప్రస్తుతం ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఇక గత ప్రభుత్వం వివిధ విభాగాల్లో నియమించిన ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన చంద్రబాబు సర్కారు.. కొత్త వారిని నియమించుకుని వాటిని కొత్త ఉద్యోగాలుగా చిత్రీకరిస్తోంది. స్విగ్గీ, జొమాటో, డోర్ డెలివరీ జాబ్స్..» జాబ్మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకున్నారు. జాబ్మేళాల జాబితా పరిశీలిస్తే అత్యధికంగా బ్యాంకులు, రుణ రికవరీ ఏజెంట్లు, బీమా ఏజెంట్లు, జొమాటో, స్విగ్గీ, అమెజాన్, బ్లింకిట్ లాంటి డోర్ డెలివరీ జాబ్స్, ఫార్మసీ షాపుల్లో ఉద్యోగాలే అత్యధికంగా ఉన్నాయి. తాత్కాలికంగా ఉపాధి కల్పించే వాటిని కూడా ప్రభుత్వం తాము కొత్తగా ఉద్యోగాలు ఇచి్చనట్లు ప్రచారం చేసుకోవడం చూసి విస్తుపోతున్నారు.» చివరికి చంద్రబాబు సర్కారు ప్రచార పిచ్చి ఏ స్థాయిలో ఉందంటే.. ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులు కొందరు ఏపీ నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పని చేస్తుంటే వారిని కూడా తమ ఖాతాలో వేసుకుని 5,500 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉపాధి కల్పించినట్లు ఘనంగా చెప్పుకోవడం. -
రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి బాధాకరం
సాక్షి, అమరావతి:మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి పట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ‘మా కుటుంబానికి సన్నిహితులైన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మృతి బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు!
-
అనకాపల్లి వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ పై YSRCP నేతలు క్లారిటీ
-
9న అనకాపల్లికి వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ(Narsipatnam Medical College)ని సందర్శించి.. జరిగిన పనులను పరిశీలిస్తారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజిల నిర్మాణం ఒక చరిత్ర. కానీ, విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. తన అనునాయులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. తద్వారా జగన్కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి. ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు. అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవడం లేదు. కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అన్నారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీను వైఎస్ జగన్ సందర్శిస్తారు. .. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు. మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లును దూరం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే మెడికల్ కాలేజిల ఐదు వేల కోట్లు ఖర్చు మీద పెట్టలేరా. విద్యా వైద్యంతోపాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రవేటిపరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది’’ అని అమర్నాథ్ అన్నారు. -
ఉన్న పథకాలను తీసేసి వడ్డీ భారంతో రుణాలంటూ కొత్త పాట
-
మాజీ మంత్రి దామోదర్రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు.మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిగారి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/5fqvyDE7Oa— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో దామోదర్రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న, ఆయన సతీమణి ‘వరూధినీదేవిని వెంటబెట్టుకుని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో ’టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు. -
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
-
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. "స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.“స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీగారు. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు.#GandhiJayanti— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025లాల్ బహదూర్ శాస్త్రికి వైఎస్ జగన్ నివాళిమాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన `జై జవాన్..జై కిసాన్` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’’ అని ఎక్స్లో పేర్కొన్నారు.మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారు ఇచ్చిన ``జై జవాన్..జై కిసాన్`` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025 -
వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్గా మిథున్రెడ్డి పునర్నియామకం
సాక్షి, అమరావతి: ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్గా ఎంపీ పీవీ మిథున్రెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి నియమించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో మిథున్రెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన బాధ్యతలను సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకు అప్పగించారు. ఇప్పుడు మిథున్రెడ్డి బెయిల్పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీలో నియామకాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49 మంది సభ్యులతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ)ను, మరో 114 మంది సభ్యులతో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. -
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచకా అడుగులేస్తుంటే సీఎం చంద్రబాబుకు కనీసం చీమ కుట్టినట్టైనా లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎత్తు పెంచడం వల్ల ఆల్మట్టి సామర్థ్యం 129.72 నుంచి 279.82 టీఎంసీలకు పెరుగుతుందని.. దీనివల్ల రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? అంటూ చంద్రబాబును నిలదీశారు. ఇప్పటికైనా మేల్కొని ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, కేడబ్యూడీటీ–2 విచారణపై దృష్టి పెట్టి సమర్థంగా వాదనలు వినిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమని చంద్రబాబును హెచ్చరించారు. ఈమేరకు వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్ర హక్కులను కాపాడే ఉద్దేశం మీలో ఏ కోశానా కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి?» గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 నుంచి 524.256 మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే.. అప్పట్లోనూ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ ఎంపీల బలంమీదే నాటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995–2004 వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్లు మీకు మీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదన్నది నిజమే కదా? సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసిందనేది వాస్తవం కాదా? » గత రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బ తింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబూ? ఇప్పుడు మళ్లీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టిలో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు ఎత్తు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు.. దీనికోసం రానున్న మూడేళ్లలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడం లేదు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు, మీ ఎల్లోమీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారు.మీ ఎంపీల బలం మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాట కూడా వాస్తవమే. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఎత్తు పెంపును ఆమోదిస్తూ కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడం లేదు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా? » మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాద ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2 ) ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. కృష్ణా నదిలో బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ –1) 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) కేటాయించిన జలాలను కొనసాగిస్తూనే 65 శాతం లభ్యత ఆధారంగా (మిగులు జలాలను) పంపిణీ చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణనలోకి తీసుకున్న పరిస్థితుల్లో, దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది. కరువు వస్తే రాష్ట్రమే భరించాలి. ఎలాగూ దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చినా రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. దీన్ని గుర్తించి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరులోనే పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది. కానీ మీరు ఇప్పుడు సమర్థంగా వాదనలు వినిపించి రాష్ట్ర హక్కులను కాపాడటంలో చిత్తశుద్ధి చూపడం లేదు.» చంద్రబాబూ.. మీరు ఇప్పటికైనా మేలుకోండి. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు కేడబ్ల్యూడీటీ–2 విచారణపై దృష్టి పెట్టి సమర్థ వాదనలు వినిపించండి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. -
ఏపీని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రయోజనాల్ని గాలి కొదిలేశారంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదా అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. చంద్రబాబూ.. మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? .@ncbn గారూ… మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2025 గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ ఎంపీల బలంమీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995-2004వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకుమీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో, మీకున్న రాజకీయబలాన్ని రాష్ట్ర ప్రయోజనాలకోసం వాడలేదన్నది నిజమే కదా? సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తిచేసిందనేది వాస్తవం కాదా?గడచిన రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కృష్ణాజలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబుగారూ? ఇప్పుడు మళ్లీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టి లో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్ల కు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమయ్యింది. నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీనికోసం రానున్న 3 ఏళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడంలేదు చంద్రబాబుగారూ?..ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు, మీ ఎల్లోమీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారు. పైగా మీ ఎంపీల బలంమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాటకూడా వాస్తవమే. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడంలేదు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా? ..మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాద ట్రైబ్యునల్ (KWDT-2) ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. కృష్ణా నదిలో 75% నీటిలభ్యత ఆధారంగా చేసిన KWDT-2 తీర్పు అమల్లోకి వస్తే, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణలోకి తీసుకున్న పరిస్థితుల్లో, దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది. కరువు వస్తే రాష్ట్రమే భరించాలి, ఎలాగూ దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చినా రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. దీన్ని గుర్తించి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైయస్సార్సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరులోనే పిటిషన్ దాఖలు చేసి, న్యాయపోరాటాన్ని ప్రారంభించింది. కాని మీరు ఇప్పుడు సమర్థవంతంగా వాదనలు వినిపించి, రాష్ట్ర హక్కులను కాపాడ్డంలో చిత్తశుద్ధి చూపడంలేదు. ..చంద్రబాబు మీరు ఇప్పటికైనా మేలుకోండి. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, KWDT-2 విచారణపై దృష్టిపెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించండి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని వైఎస్ జగన్ అన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.‘‘చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు.#Dussehra— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025 -
KSR Comment: టీడీపీ ఆగడాలకు చెక్! YSRCP కార్యకర్తలకు అండగా రంగంలోకి జగన్..
-
జగనన్న నాకు అండగా ఉన్నారు.. మిథున్ రెడ్డి ఎమోషనల్
-
జగన్ పాలన సూపర్.. కేంద్ర హోంశాఖ నివేదికలో వెల్లడి
-
జగన్ హయాంలో.. శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: శాంతి భద్రతల పరిరక్షణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందన్న వాస్తవం మరోసారి నిగ్గు తేలింది. గత ప్రభుత్వంపై నాడు టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్రేనన్నది స్పష్టమైంది. 2023లో వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) 2023 నివేదికను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో వెల్లడించింది. 2022తో పోలుస్తూ 2023లో దేశంలో నేరాల తీరు ఎలా ఉందన్నది విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లు ఆ నివేదిక వెల్లడించడం విశేషం.దాడులు, హత్యలు, కిడ్నాప్లు, ఎస్సీ–ఎస్టీలపై నేరాలు, మహిళలు–బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు.. ఇలా అన్ని రకాల నేరాలు 2022తో పోలిస్తే 2023లో గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. ⇒ 2022లో ఏపీలో మొత్తంగా 1,95,284 కేసులు నమోదు కాగా.. 2023లో 1,84,293కు తగ్గింది. నేరపూరిత కేసులు నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు 2022లో 1,58,547 నమోదు కాగా 2023లో ఆ కేసుల సంఖ్య 1,53,867కు తగ్గాయి. స్థానికచట్టాల ఎస్ఎల్ఎల్ కేసులు 2022లో 36,737 నమోదు కాగా.. 2023లో ఆ కేసుల సంఖ్య 30,436కు పరిమితమయ్యాయి. ⇒ దేశంలో 2022లో మొత్తం 58,24,946 నేరాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు 35,61,379 ఉండగా ఎస్ఎల్ఎల్ నేరాలు 22,63,567 ఉన్నాయి. 2023లో దేశంలో మొత్తం నేరాలు 62,41,569కు పెరిగాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద నేరాలు 37,63,102 ఉండగా, ఎస్ఎల్ఎల్ నేరాలు 24,78,467 ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా నేరాలు పెరిగినా ఏపీæలో మాత్రం అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరాలను కట్టడి చేసిందని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. ⇒ 2024 ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ అసత్య ప్రచారమేని ఆ నివేదిక గణాంకాల సాక్షిగా వెల్లడైంది. ప్రధానంగా 34వేల మంది మహిళలు, బాలికలు కిడ్నాప్ అయ్యారని జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గతంలో చేసిన విమర్శలన్నీ పూర్తిగా అవాస్తవమేనని కేంద్ర హోంశాఖ నివేదిక విస్పష్టంగా ప్రకటించింది. నేరాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుని సత్వరం శిక్షలు పడేలా చేయడంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందని నివేదిక వెల్లడించింది. ఎన్సీఆర్బీ నివేదిక–2023లో ఏపీకి సంబంధించి కీలక అంశాలివీతగ్గిన నేరాలు–ఘోరాలు వైఎస్సార్సీపీ హయాంలో 2022లో కంటే 2023లో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు, ఘోరాలు గణనీయంగా తగ్గాయి. ఐపీసీ నేరాలు, నిబంధనలు అతిక్రమించే పౌరులపై స్థానిక చట్టాల కింద నమోదు చేసే (ఎస్ఎల్ఎల్) నేరాలు తగ్గాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాపులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టడి చేసింది. ఇక మహిళలు, బాలికలపై నేరాలు తగ్గేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించింది. ఎస్సీ, ఎస్టీల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది.. అందుకే ఆ వర్గాలపై నేరాలు తగ్గాయి. 2022లో దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు పెరిగినా ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన సమర్థ పనితీరుతో నేరాలను నియంత్రించడం గమనార్హం. దేశంలో 54 శాతం.. నాడు ఏపీలో 85.7 శాతం 2022లో రాష్ట్రంలో ఆచూకీ దొరకనివారు 621 మంది ఉన్నారు. వారిలో బాలురు 250 మంది కాగా బాలికలు 371 మంది ఉన్నారు. 2023లో మొత్తం 4,433 మంది కనిపించకుండా పోయారని / ఇంటినుంచి అలిగి వెళ్లిపోయారని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో బాలురు 1,196 మంది బాలురు కాగా 3,237మంది బాలికలు ఉన్నారు. మొత్తం మీద 1,446మంది బాలురు, 3,608మంది బాలికలు కనిపించకుండా / ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయినట్టు కేసులు నమోదయ్యాయి. కాగా వారిలో 4,331 మందిని పోలీసులు కనిపెట్టి సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.వారిలో బాలురు 1,141 మంది, బాలికలు 3,190 మంది ఉన్నారు. అంటే 85.7 శాతం మందిని 2023లోనే పోలీసులు సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. (మిగిలిన వారిని 2024లో పోలీసులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు). కనిపించకుండాపోయిన బాల, బాలికలను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది.అందుకే ఏకంగా 85.7 శాతం మందిని సురక్షితంగా వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చింది. దేశం మొత్తం మీద 54 శాతం మందినే సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏకంగా 85.7 శాతం మంది బాల, బాలికలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే పవన్కళ్యాణ్ 2024 ఎన్నికల ముందు అవాస్తవ ఆరోపణలు చేశారన్నది మరోసారి స్పష్టమైంది.నేర పరిశోధనలో భేష్ నేరాలను కట్టడి చేయడమే కాదు.. నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలోనూ మెరుగైన భూమిక పోషించింది. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే కేసు నమోదు చేసి నిర్ణిత కాలంలో చార్జ్షిట్ దాఖలు చేసేలా చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో ఏకంగా 91.6 శాతం కేసుల్లో చార్జ్షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్ణిత సమయంలోగా చార్జ్షిట్లు దాఖలు చేయడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది.పవన్ ఆరోపణలు పూర్తి అవాస్తవం.. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్లో 34వేల మందిమహిళలు, బాలికల అపహరణకు గురయ్యారని పవన్కళ్యాణ్ గతంలో చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమేని కేంద్ర హోంశాఖ నివేదిక స్పష్టం చేసింది. 2024 ఎన్నికల ముందు తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటూ పవన్కళ్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. కాగా ఆయన చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. -
డిజిటల్ బుక్ ముకుతాడు వేస్తుందా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. పార్టీ కార్యకర్తల రక్షణకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, వేధింపులు ఎదురైనా పార్టీ లీగల్ టీమ్ వెంటనే రంగంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక అవసరమైతే ఆయనే స్పందించి బాధితులతో మాట్లాడి ఓదార్చుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ప్రకటించిన విధంగా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టారు. దీని వల్ల కార్యకర్తలకు ఒక భరోసా వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.తమకు జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్లో ఎలా నమోదు చేయవచ్చో కూడా పార్టీ సమావేశంలో ఆయన వివరించారు. దాని ప్రకారం ఏ కార్యకర్త అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏ పోలీసు అధికారి నుంచి అయినా వేధింపులు ఎదురైనా, అక్రమ అరెస్టు జరుగుతున్నా, వెంటనే వాటిని చిత్రీకరించి డిజిటల్ బుక్లో నమోదు చేస్తే లీగల్ సెల్ తక్షణమే చొరవ తీసుకుని పని చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుక్లో తమ పేరు ఎంటర్ అవుతుందన్న భయంతోనైనా కొంతమంది పోలీసులు వైసీపీ, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టకుండా ఉండే చాన్స్ ఉంటుంది. అయినా కొంతమంది బరితెగించి వ్యవహరిస్తే పార్టీపరంగా గట్టిగా పోరాడవచ్చు. ఈ మధ్యకాలంలో వైసీపీ లీగల్ టీం బాగా యాక్టివ్ అయింది.పోలీసులు మఫ్టీలో వచ్చి సవీంద్రరెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టును అదుపులోకి తీసుకున్న వెంటనే లీగల్ టీమ్ అతని తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రక్షించారు. హైకోర్టు కూడా పౌర రక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పోలీసులు చెప్పినవి కట్టుకథలన్న సంగతిని అర్థం చేసుకున్న కోర్టు సవీంద్రరెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఒకరకంగా ఇదో రికార్డు. కేసును సీబీఐకి అప్పగించడం మరో విశేషం. ఏపీలో పోలీసులు కొన్నిసార్లు కిడ్నాపర్ల అవతారం ఎత్తుతున్నారని ఈ ఉదంతం తెలియచేస్తుంది.అంతేకాదు.. సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టడం ఇబ్బంది అవుతోంది కనుక వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్నారట. అంటే పోలీసు స్టేషన్లలోనే గంజాయిని అందుబాటులో ఉంచుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన కూడా కలుగుతుంది. అందుకే హైకోర్టు సవీంద్ర విడుదలకు ఆదేశాలు ఇచ్చారనుకోవాలి. ఇంత జరిగినా కొందరు పోలీసులు మరో ఇద్దరు సోషల్ యాక్టివిస్టులను అదే రోజు అక్రమంగా పట్టుకుపోయారని వార్తలు వచ్చాయి. ఇలాంటి చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పోలీసులు కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది.ఈ బుక్లో సాక్ష్యాధారాలు కూడా నమోదు అవుతాయి కనుక అవి ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. అదే టైమ్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అభ్యంతర పోస్టులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతుంది. అదే టీడీపీ వారు ఎంత అరాచకంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.పరకామణి వ్యవహారంలో జగన్పై నీచమైన ఆరోపణలు చేస్తూ టీడీసీ సోషల్ మీడియా ప్రచారం చేసిందట. అది తప్పా? కాదా? అన్నది పోలీసులు ఆలోచించుకోవాలి. అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదు. కాని టీడీపీ వారు ఏమీ చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా ధర్మబద్దంగా చర్య తీసుకోవల్సిన పోలీసులు పక్షపాతంగా ఉండకూడదు. అలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే డిజిటల్ బుక్ ద్వారా పార్టీకి తెలియచేయవచ్చు. బహుశా ఇది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందేమో తెలియదు. అప్పుడు వారు కూడా తమకు జరిగే అన్యాయాలపై ఫిర్యాదు చేయవచ్చు. కాని డిజిటల్ బుక్ పరిధి పెరుగుతుంది. ఎంతవరకూ ఆచరణ సాధ్యం అవుతుందో లేదో తెలియదు. అలాగే డిజిటల్ బుక్ జరగకుండా జాగ్రత్తపడాలి.అంతే కాకుండా కొంతమంది టీడీపీ వారు కూడా ఈ డిజిటల్ బుక్ లో ఎంటరై తప్పుడు ఆరోపణలు చేయకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి.డిజిటల్ బుక్తో పాటు నేతలు, కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం కూడా చేశారు. కమిటీల ఏర్పాటు మొదలు, కూటమి ప్రభుత్వం అక్రమాలు, హామీల ఉల్లంఘనపై ప్రజలను జాగృతం చేయవలసిన తీరుపై కూడా జగన్ వివరించారు. పార్టీ విస్తృత సమావేశంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్న తీరు, వారికి ధైర్యం ఇచ్చిన వైనం కచ్చితంగా పార్టీ కేడర్కు మంచి సంకేతమే అవుతుంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో కార్యకర్తలకు అంత ప్రాధాన్యత లభించలేదన్న భావన ఉంది.కార్యకర్తలు చాలామందికి పదవులు వచ్చినా వివిధ కారణాల వల్ల కేడర్లో అలాంటి అభిప్రాయం నెలకొంది.. అది వేరే విషయం. ఈ సమావేశంలోనే జగన్ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడానికి కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించి స్కూళ్లు, బస్సులు ఆస్పత్రులు వంటివాటిని ఎందుకు ప్రభుత్వాలు నడుపుతాయో తెలియదా అని ప్రశ్నించారు.అట్టర్ ఫ్లాఫ్ అయిన సూపర్ సిక్స్కు విజయోత్సవ సభ జరిపారని ఎద్దేవా చేశారు. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు ప్రభుత్వ ఫెయిల్యూర్ పై దాడి, మరో వైపు కార్యకర్తలలో స్పూర్తి నింపడానికి ఈ సమావేశంలో జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగానే డిజిటల్ బుక్ తెచ్చారు. దీని ప్రభావంతోనైనా ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టే విషయంలో కాస్త అయినా వెనక్కి తగ్గుతారా! ఏమో చెప్పలేం!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెలుగోడు ఎక్కడున్నా ఏలేస్తాడు..! తిలక్ వర్మకు వైఎస్ జగన్ అభినందనలు
-
డిజిటల్ బుక్ లాంచ్ చేసిన ఉషశ్రీ చరణ్..
-
నెల్లూరు టీడీపీ నేతలకు చెప్తున్నా.. ఆనం విజయకుమార్ రెడ్డి వార్నింగ్
-
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
-
తిలక్ ఆట అద్భుతం.. భారత్ విజయంపై వైఎస్ జగన్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఆసియా కప్ ఫైనల్ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై అద్వితీయ విజయం సాధించిన మన క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీ అసాధారణ నైపుణ్యం, అంకితభావం.. జట్టు కృషి మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశాయి. ఫైనల్లో కీలక ప్రదర్శన, సీరిస్లో అద్భుత ప్రతిభ కనబరించిన తెలుగు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు(Tilak Varma) ప్రత్యేక అభినందనలు. వర్మ ప్రదర్శన నిజంగా ప్రశంసనీయం’ అని కొనియాడారు. Hearty congratulations to our cricket team on their outstanding victory in the Asia Cup 2025 final against Pakistan! Your exceptional skill, dedication, and teamwork have made the entire nation proud.A special shoutout to our very own Telugu star, @TilakV9, for his crucial… pic.twitter.com/GWexoLzkSt— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2025 -
పచ్చ కుట్రలు పటాపంచలు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ దుష్ప్రచారం చేశారు. ఆ అబద్ధాలకు ఈనాడు సహా ఎల్లో మీడియా శక్తి వంచన లేకుండా ప్రచారం కల్పించి ప్రజలు నమ్మేలా వారికి బాకాలూదింది. ఈ దుష్టచతుష్టయ దుష్ప్రచారం ఎన్నికల ప్రచారం నాటికి తార స్థాయికి చేరింది. గోబెల్సే సిగ్గుతో తలదించుకునే రీతిలో నిత్యం తప్పుడు ప్రచారాలు, కథనాలతో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విషాన్ని నింపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది. మోసపు హామీలే పెట్టుబడిగా టీడీపీృజనసేన కూటమి ఎన్నికల్లో విజయం సాధించింది.సీన్ కట్ చేస్తే.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే.. 2019ృ24 మధ్య తాము చేసిందంతా దుష్ప్రచారమేనని తనకు తానుగానే చాటుకుంటోంది. దుష్టచతుష్టయం దుష్ప్రచారం బట్టబయలవుతుండటంతో ప్రజలు నిర్ఘాంతపోతున్నారు. అసలు నిజాలు తెలుసుకుని కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి వెళ్లిన తన అన్నను వైఎస్ జగన్ అవమానించారంటూ ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని గురువారం విడుదల చేసిన లేఖ ద్వారా మెగాస్టార్ చిరంజీవే స్వయంగా చాటి చెప్పారు. సాక్షి, అమరావతి: దుష్ప్రచారమే ఆయుధంగా.. మోసపు హామీలే పెట్టుబడిగా పెట్టి, అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కార్ 16 నెలలుగా ప్రజలను దగా చేస్తోంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ 143 హామీలను ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని బుట్టదాఖలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ నాదంటూ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు నమ్మబలికిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నాటి సీఎం వైఎస్ జగన్పై దుష్టచతుష్టయంలా తాము చేసిన దుష్ప్రచారం గుట్టంతా రట్టవుతుండటం, తమ బాగోతం బట్టబయలవుతుండటంతో.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించడంతోపాటు మరింత అధికంగా ప్రయోజనం చేకూర్చుతానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు పప్పులూ బెల్లాల్లా డబ్బులు పంచిపెడుతూ వైఎస్ జగన్ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ ఎన్నికలకు ముందు విషం కక్కిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 2.09 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు. అంత అప్పు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయక పోవడం గమనార్హం. వీటన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్తో డప్పు కొడుతున్న చంద్రబాబుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాళం వేస్తున్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ను రక్తి కట్టించేందుకు సనాతన ధర్మం అంటూ ఒకసారి.. సీజ్ ద షిప్ అంటూ మరోసారి.. ‘షో’ చేస్తూ డ్రామాలాడుతున్నారు. మరోవైపు ఇసుక నుంచి సిలికా వరకూ టీడీపీ–జనసేన మాఫియా సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతూ.. హామీల అమలు, పరిపాలన వైఫల్యాలపై ప్రశి్నంచే గొంతులను రెడ్ బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో వారి కుట్రల లోగుట్టు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్న తీరు ఇలా ఉంది.వైఎస్ జగన్ గౌరవించారు.. చిరంజీవి తాజా లేఖే నిదర్శనం దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. సినిమా పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు వెళ్లిన తన అన్న చిరంజీవిని సీఎం వైఎస్ జగన్ అవమానించారంటూ ఎన్నికలకు ముందు సభల్లో పవన్ కళ్యాణ్ ఊగిపోయారు. ఇదే అంశంపై చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా పవన్కు వంత పాడుతూ విష ప్రచారం చేశారు. బట్టబయలైన వాస్తవం: ఇదే అంశాన్ని గురువారం శాసనసభలో బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడారు. దీనిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ జోక్యం చేసుకుంటూ.. సినీ రంగంలో మెగాస్టార్గా వెలిగిపోతున్న చిరంజీవిని ఉద్దేశించి ‘వాడెవడు’ అంటూ తూలనాడారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ గురువారం సాయంత్రం లేఖ విడుదల చేశారు. తాను ఇండియాలో లేను కాబట్టే ఆ ప్రకటనను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వానించినట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి సీఎం జగన్కు వివరించినట్టు స్పష్టం చేశారు. ‘ఆ తర్వాత సినీ ప్రముఖులతో కలిసి సమస్యలపై చర్చించడానికి వైఎస్ జగన్ వద్దకు వెళ్లాం. వైఎస్ జగన్ మమ్మల్ని సాదారంగా ఆహ్వానించారు.. గౌరవించారు. సినీ ప్రముఖుల అందరి సమక్షంలోనే నాటి సీఎం వైఎస్ జగన్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యం. నేను ఆ చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది’ అని ఆ లేఖలో స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇతరులతో కలిసి చేసిందంతా దుష్ప్రచారమేనని ఆ లేఖ ద్వారా అర్థమైంది. అప్పు రూ.14 లక్షల కోట్లు కాదు.. రూ.3.78 లక్షల కోట్లే దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థి క విధ్వంసం సృష్టించిందని.. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేసిందంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఇందుకు వంత పాడుతూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారంటూ తప్పుడు కథనాలను వండివార్చింది. బట్టబయలైన వాస్తవం: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని వెల్లడించారు. 2024–25 బడ్జెట్ ప్రవేశపెడితే.. రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే నెపంతో జాప్యం చేశారు. చివరకు గతేడాది నవంబర్ 11న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దు్రష్ఫచారం చేస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన మార్చి 28న రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అంటూ చంద్రబాబు బొంకారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పు మొత్తం కలిపి 2025 మార్చి నాటికి రూ.6,77,849.80 కోట్లేనని అసెంబ్లీలో ఈనెల 23న లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆర్థి క మంత్రి పయ్యావుల కేశవ్ అంగీకరించారు. ఇందులో 2014–19 మధ్య అంటే.. నాటి చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు రూ.3,06,952.26 కోట్లు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,78,897.54 కోట్లేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అందులో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.73 లక్షల కోట్లను నాటి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 16 నెలల్లో రూ.2,09,085 కోట్లు అప్పు చేసింది. చెప్పిన విధంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయలేదు.. అప్పుగా తెచ్చిన రూ.2,09,085 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో! అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 16 నెలల్లోనే కూటమి సర్కార్ 56 శాతం అప్పు చేయడం గమనార్హం. దీన్నిబట్టి అప్పుల సామ్రాట్ చంద్రబాబేనని స్పష్టంగా తెలుస్తోంది. ఆర్థిక మంత్రి.. అసెంబ్లీ సాక్షిగా.. అప్పులపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నిజాలను చెప్పాల్సి వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్తోపాటు గ్యారెంటీ కలిపి మొత్తం అప్పు రూ.3,06,952.26 కోట్లుగా ఉందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,70,897 కోట్లేనని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన ఆర్థి క మంత్రి పయ్యావుల కేశవ్.మహిళల అక్రమ రవాణా ఉత్తుత్తేదుష్టచతుష్టయం దుష్ప్రచారం.. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక రీతిలో ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మారు. 2.60 లక్షల మంది వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకు పింఛన్లు మొదలు అన్ని రకాల ప్రభుత్వ సేవలను ప్రభుత్వం అందించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో వలంటీర్ల ద్వారా 35 వేల మంది మహిళలను మాయం చేసి.. అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ ఎన్నికల ముంగిట పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు సైతం ఇదే రీతిలో వలంటీర్లపై విషం కక్కారు. బట్టబయలైన వాస్తవం: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 నమోదు అయ్యాయని.. 46 మంది బాధితులని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా కూటమి కుట్ర బట్టబయలైంది. నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమేనని కూటమి ప్రభుత్వమే కుండబద్ధలు కొట్టింది. నాడు ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై విషం.. ఇప్పుడు భూముల రీ సర్వేపై యూటర్న్ దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. గత 40 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తొలిసారిగా రాష్ట్రంలో తెస్తే చంద్రబాబు దానిపై రాజకీయ కుట్రతో దుష్ప్రచారం చేశారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని అబద్ధాలతో ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. బట్టబయలైన వాస్తవం: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ భూముల రీ సర్వే చేపట్టారు. 13 వేల గ్రామాలకుగానూ 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్ రికార్డులు అందబాటులోకి తెచ్చారు. ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వడంతోపాటు భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. రీ సర్వే చేసి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ఎవరూ ఆ భూమి తనదని కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉండదు. అయితే చంద్రబాబు ఎన్నికల్లో దాన్ని ఒక అస్త్రంగా వాడుకుని ఎడతెగని దుష్ప్రచారంతో లబ్ధి పొందారు. తాను చెప్పిన అబద్ధాలను నిజమని చెప్పుకునేందుకు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను కూడా రద్దు చేయాలని ప్రయతి్నంచారు. కానీ అది విజయవంతమవడం, కేంద్ర ప్రభుత్వం జగన్ హయాంలో చేపట్టిన సర్వేకు ఇప్పుడు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుని కొనసాగిస్తున్నారు.సంపద సృష్టి కాదు.. ఉన్నది ఆవిరి దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. వైఎస్ జగన్ భారీ ఎత్తున అప్పులు తెచ్చి.. పప్పులూ బెల్లాల్లా పేదలకు పంచిపెడుతున్నారని, సంపద సృష్టించకుండా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో విషప్రచారం చేసింది. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టించి.. పథకాలు అమలు చేస్తానంటూ నమ్మబలికారు. బట్టబయలైన వాస్తవం: నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. లోక్సభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో మరో ఐదు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేశారు. కానీ.. కూటమి సర్కార్ ఒక కాలేజీ మాత్రమే ప్రారంభించి.. 50 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా మెడికల్ కాలేజీల పనులను ఆపేసింది. ప్రైవేటుపరం ముసుగులో సన్నిహితులు, బినామీలకు వాటిని కట్టబెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జగన్ చేపట్టిన పోర్టులను సైతం ౖప్రైవేటుపరం చేస్తూ దోపిడీ చేస్తున్న చంద్రబాబు కూటమి సర్కారు తీరుతో ఉన్న సంపద ఆవిరవుతోంది. నాడు తప్పు పట్టారు.. నేడు పారదర్శకతకు పాతరేశారుదుష్టచతుష్టయం దుష్ప్రచారం.. ప్రజలకు సుపరిపాలన అందించడానికి 2014–19 మధ్య తాము తెచ్చిన సంస్కరణలను వైఎస్ జగన్ రద్దు చేశారంటూ 2019లో అధికారం నుంచి దిగిపోయినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం వరకూ చంద్రబాబు విషప్రచారం చేస్తూ వచ్చారు. బట్టబయలైన వాస్తవం: వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను రద్దు చేసింది. దాంతో 9,280 మంది ఎండీయూ ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు సహా అభివృద్ధి పనుల అంచనా వ్యయం, టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన జ్యుడిíÙయల్ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 2014–19 తరహాలోనే టెండర్ల వ్యవస్థను నీరుగార్చి సన్నిహితులు, బినామీలకు పనులు అప్పగిస్తోంది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సు ముట్టజెప్పే విధానాన్ని వైఎస్సార్సీపీ రద్దు చేస్తే, కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి మళ్లీ ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది. నీకింత నాకింత అంటూ కమీషన్లు దండుకుంటోంది. నాడు సర్కారుకు ఆదాయం.. నేడు కూటమి నేతలకు ఆదాయం దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. ఇసుక నుంచి మట్టి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తోందని విషం చిమ్మిన చంద్రబాబు, ఎల్లో మీడియా. బట్టబయలైన వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 అవసరాల కోసం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పెట్టింది. కూటమి నేతలు ఆ ఇసుక నిల్వలన్నింటినీ దోచేసి జేబులు నింపుకున్నారు. ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టి చట్టాలను ఉల్లంఘించారు. లిక్కర్ నుంచి సిలికా, క్వార్ట్జ్ వరకూ వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది. ఊరూ పేరూ లేని ఉర్సా అనే సంస్థకు రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. లులూ సంస్థకు మాల్ కట్టడానికి విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండటం భూ దోపిడీకి పరాకాష్ట.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నేడు పెగలని నోరుదుష్టచతుష్టయం దుష్ప్రచారం.. విశాఖ స్టీల్ పరిశ్రమను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుంటే సీఎం వైఎస్ జగన్ నోరు మెదపడం లేదంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్, లోకేశ్ దుష్ప్రచారం చేశారు.బట్టబయలైన వాస్తవం: 2025 జనవరి 17న కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని స్పష్టం చేశారు. నాటి సీఎం వైఎస్ జగన్ వ్యతిరేకించకపోతే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఎప్పుడో పూర్తయ్యేదని కుండబద్ధలు కొట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటుపరం చేస్తూ ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజ గని కేటాయించాలని కోరడానికి మనస్కరించని సీఎం చంద్రబాబు ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజ గని కేటాయింపునకు పాటుపడ్డారు.నాటి సర్కారు ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్న కూటమి దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. వైఎస్సార్సీపీ సర్కారు తీరు వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బట్టబయలైన వాస్తవం: నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూత పడుతున్నా కూటమి సర్కారు మొద్దు నిద్ర నటిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ పీఎస్యూ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ని్రష్కియాపరత్వంతో చాప చుట్టేసే పనిలో ఉంది. 2019–24 మధ్య రూ.3.02 లక్షల కోట్ల పెట్టుబడులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాస్తవ రూపంలోకి తెచ్చిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రూ.85,543 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 163 భారీ పరిశ్రమలు అప్పట్లోనే ఉత్పత్తి ప్రారంభించాయి. ఒప్పందం జరిగిన పెట్టుబడుల్లో అప్పటికే రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వురు దశల్లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి వాటిని తన ఘనతగా చెప్పుకుంటోంది. నాడు రూ.2.49 అధికం అన్నారు.. నేడు రూ.3.20తో కొంటున్నారు దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. సెకీతో విద్యుత్ను అత్యధిక ధరకు (యూనిట్ రూ.2.49) వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల భారం అదనంగా పడుతుందని ఎన్నికలకు ముందు చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం విష ప్రచారం చేసింది. బట్టబయలైన వాస్తవం: ఈ కుట్రలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అదే సౌర విద్యుత్ను యూనిట్కు రూ.3.20 చొప్పున చెల్లించి కొంటున్నారంటే దాని వెనుక ఎంతటి అవినీతి దాగుందో వేరేగా చెప్పనవసరం లేదు. పోలవరాన్ని బ్యారేజ్గా మార్చేశారు దుష్టచతుష్టయం దుష్ప్రచారం.. పోలవరం ప్రాజెక్టును వైఎస్ జగన్ బ్యారేజ్గా మార్చేశారంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు విష ప్రచారం చేశారు. బట్టబయలైన వాస్తవం: కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే కట్టాల్సిన పోలవరాన్ని 2016 సెపె్టంబర్ 8న 2013–14 ధరలతో 2010–11 నాటి పరిమాణాలతో పూర్తి చేస్తానని కేంద్రంతో నాటి సీఎం చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. దీని వల్ల పోలవరానికి రూ.20,398 కోట్లకు మించి పైసా కూడా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవానికి అప్పటికి పోలవరం అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి వాస్తవ పరిస్థితులను వివరించి.. తాజా ధరల మేరకు నిధులు ఇస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రాన్ని ఒప్పించారు. కానీ.. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. అయినా చంద్రబాబు ఈ అంశంపై నోరు మెదపలేదు. -
ఇది కదా వెలకట్టలేని అభిమానం అంటే..
-
Janatantram: అసెంబ్లీలో బాలకృష్ణ తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు
-
భగత్సింగ్ జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. భగత్సింగ్కు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసి.. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ యువతలో దేశభక్తి జ్వాలలు రగిలించిన వీరుడు భగత్ సింగ్. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అని పోస్టు చేశారు.దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసి, "ఇంక్విలాబ్ జిందాబాద్" అంటూ యువతలో దేశభక్తి జ్వాలలు రగిలించిన వీరుడు భగత్ సింగ్ గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/GfvCOMLhTv— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2025 -
జగన్ పై ఆరోపణలు.. చెక్ పెట్టిన చిరంజీవి, నారాయణ మూర్తి
-
మావెంటే నీ పాలన.. నీవంటే మాకు ఆదరం
విశాఖపట్నం జిల్లా ముఖ్యమంత్రిగా మనవడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలు ఆ అవ్వ మరచిపోలేదు. జగన్ ఫొటో చూడగానే.. గడప దాటకుండా ఇంటికే అందించిన పింఛన్లు, రేషన్ సరకులు, సంక్షేమ పథకాలు ఆమెకు గుర్తొకొచ్చాయి. గుండెల్లో ప్రేమ తన్నుకొచ్చింది. రెండు చేతులు జోడించి అభివాదం చేసింది.జగన్ చిత్ర పటానికి ముద్దులెట్టి మనసులోతుల్లోని అభిమానాన్ని చాటుకుంది.. అవ్వ తాంగుల బుడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో ఈ దృశ్యం చోటుచేసుకుంది. ‘మాకు అన్ని విధాలుగా మేలు చేశాడు.. నా మనవడు’ అంటూ ఆమె పలికిన మాటలు... పేద జనం గుండెల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన వేసిన ముద్రకు తార్కాణాలు. -
తమిళనాడు తొక్కిసలాట ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి
-
గుర్రం జాషువా జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు గుర్రం జాషువా జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. జాషువాకు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. కుల వివక్షత లేని సమాజం కోసం అణగారిన వర్గాల గళాన్ని కవిత్వంగా మలిచి తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా అని పోస్టు చేశారు.కుల వివక్షత లేని సమాజం కోసం అణగారిన వర్గాల గళాన్ని కవిత్వంగా మలిచి తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/3xkyzK4yGn— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2025 -
మౌనం వీడలేదు.. నోరు పెగల్లేదు సైలెన్స్.. గంభీరా!
సాక్షి, అమరావతి: చిరంజీవిని ‘ఎవడు’ అంటూ పూచికపుల్లలా తీసివేస్తూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అధికారంలో ఉండి కూడా డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించకపోవడంపై మెగాస్టార్ అభిమానులు, కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. ఓ వైపు బాలకృష్ణపై మండిపడుతూనే.. పవన్కళ్యాణ్ సైతం తన సొంత సోదరుడిని దారుణంగా అవమానించి 48 గంటలు గడిచిపోయినా నోరు విప్పకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవే స్వయంగా స్పందించి బాలయ్య వ్యాఖ్యలను ఖండించినా పవన్ మాత్రం కిమ్మనకపోవడం ఏమిటని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ జ్వరంతో బాధపడుతూ కూడా గురువారం నిర్వహించిన డీఎస్సీ సభకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ ప్రకటన జారీ చేసిన పవన్కళ్యాణ్... బాలయ్య వ్యాఖ్యలపై పూర్తి మౌనం పాటించడాన్ని తప్పుబడుతున్నాయి. ఆ విష ప్రచారాన్ని ఖండించిన ‘చిరు’.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు గత ప్రభుత్వ హయాంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలిసినప్పుడు సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తే.. ఎన్నికల ముందు కూటమి నేతలు పవన్తో జతకట్టి దు్రష్పచారం చేయటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని తాజాగా స్వయంగా చిరంజీవే ఖండించటాన్ని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి విదేశాల్లో ఉండి కూడా తీవ్రంగా తప్పుబడుతూ ప్రకటన చేశారని పేర్కొంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని, అనంతరం కొద్దిరోజులకు సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి తామంతా చర్చించామని చిరంజీవి అందులో స్పష్టం చేశారు. ఆ సమావేశం కారణంగానే నాడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టిక్కెట్ రేట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టారే స్వయంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ఎన్నికల ముందు పవన్కళ్యాణ్, చంద్రబాబు, టీడీపీ నేతలు వైస్ జగన్పై చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని తేటతెల్లమైందని చిరంజీవి అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాడు చంద్రబాబు అంత దు్రష్పచారం చేయగా.. ఇప్పుడు బాలకృష్ణ నేరుగానే చిరంజీవిని కించపరిచినా పవన్కళ్యాణ్ కనీసం ఖండించకపోవడాన్ని చిరంజీవి అభిమాన సంఘాలు, కాపు సామాజిక సంఘాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.రాజకీయాల కోసం కుటుంబ గౌరవం తాకట్టా?గతంలో తన తల్లిని అవమానించేలా నారా లోకేశ్ పోస్టులు పెట్టించారని స్వయంగా విమర్శలు చేసిన పవన్కళ్యాణ్.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ‘ఎవడు’ అంటూ తన సోదరుడు చిరంజీవిపై బాలకృష్ణ అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా స్పందించడం లేదంటే చంద్రబాబు అంటే భయమా లేక నెల నెలా అందే ప్యాకేజీయే కారణమా.. అని సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ బాబు కుటుంబానికి దాసోహమవడం కారణంగా మెగాస్టార్ కుటుంబం ఇలాంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చిరంజీవి అభిమానులు, కాపు సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. పవన్కళ్యాణ్ తీరు చూస్తుంటే కుటుంబం, జనసేన ప్రయోజనాల కన్నా చంద్రబాబు, లోకేశ్ రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో సభలో జనసేన ఎమ్మెల్యేలు ఉండి కూడా అభ్యంతరం చెప్పకపోవడాన్ని చిరంజీవి అభిమానులు, కాపు సంఘం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ ‘మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు’ అని వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన నాగబాబు.. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాక తాజాగా చిరంజీవినుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎమ్మెల్సీ పొందినంత మాత్రన ప్రస్తుతం నాగబాబు ఇంతలా దిగజారాలా అనే వ్యాఖ్యలు చిరంజీవి అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. చిరంజీవి ఏంది..? మా బ్లడ్ వేరు..! బాలకృష్ట గతంలోనూ పలు సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై పలు పోస్టులు పెడుతున్నారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడంపై బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘రాజకీయాల్లో విజయం సాధించడం ఒక్క రామారావు వల్లే అయింది. చిరంజీవి ఏంది...? మేం వేరు... మా బ్లడ్ వేరు... మా బ్రీడ్ వేరు... సస్టెయిన్బులిటీ ఉంది మాకు..!’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో సందర్భంలో ‘సంకరజాతి..’ ‘అలగా జనం..’ అంటూ బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతోంది. ఇవన్నీ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించినవేనని బాలకృష్ణపై మండిపడుతున్నారు. -
ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో...
మహాభారత కథలోని గాంధారీ సుతుల్లో ఒకడికి దుశ్శాసను డనే పేరు పెట్టారు వేదవ్యాస మహర్షి. శాసనాన్ని ఖాతరు చేయనివాడని దాని అర్థం. విడమర్చి చెప్పాలంటే సంఘం కట్టుబాట్లను లెక్క చేయనివాడు, పరిపాలనా నియమాలంటే పట్టింపులేనివాడు. ఒక్క మాటలో సంఘ విద్రోహి. నేటి ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుశ్శాసనుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ‘గజానికో గాంధారీసుతుడు... గాంధీ పుట్టిన దేశంలో’ అనే డైలాగ్ చాలా కాలం నుంచే తెలుగునాట బాగా పాపులరయింది. ఇప్పుడీ తొండ ముదిరి ఊసరవెల్లిగా మారింది. శాసనాలు చేయవలసిన వారు, పాలకులుగా ఎన్నికైనవారు కూడా దుశ్శాసనావతారాలు ఎత్తుతున్నారు. రాజ్యాంగ నియమాలకూ, చట్టాల సంరక్షణకూ కాపుకాయవలసిన కంచే చేను మేస్తున్నది. ఈ పరిణామానికి కలత చెందినవారు ‘మన స్వాతంత్య్రం మేడిపండు, మన ప్రజా స్వామ్యం రాచపుండై’ందని కన్నీరు పెడుతున్నారు.పౌరుల ప్రాథమిక హక్కులకు అండగా నిలబడవలసిన రక్షకభటులే, వాటి భక్షక భటులుగా మారడంపై ఏపీ హైకోర్టు నిన్న ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. సవీందర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టును మఫ్టీ పోలీసులు అరెస్ట్ చేసి, తాము అరెస్టు చేయలేదని సాక్షాత్తూ ఉన్నత న్యాయ స్థానాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆ విధంగా బుకాయించిన పోలీసులు అదే రోజు సాయంత్రం ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అది కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే విధంగానే! రిమాండ్ రిపోర్టులోనూ అతని అరెస్ట్ సమయాన్ని రకరకాలుగా నమోదు చేసి హైకోర్టుకు అడ్డంగా దొరికి పోయారు. గడచిన సంవత్సర కాలంగా పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులపై కనీసం డజను సార్లు హైకోర్టు హెచ్చరికలు చేసింది. అయినా తీరు మారని పోలీసుల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న న్యాయస్థానం సవీందర్ రెడ్డి సతీమణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై చేసిన విచారణలో కూడా వారి దొంగాట తేటతెల్లమవడంతో తీవ్రంగా స్పందించింది. ఈ అరెస్ట్ వ్యవ హారంపై సీబీఐ జాయింట్ డైరెక్టర్ విచారణ జరపాలని ఆదేశించింది. రాజ్యాంగం 226వ అధికరణం కింద సంక్రమించిన అధికారం మేరకు ఈ ఆదేశాన్నిస్తున్నామని న్యాయస్థానం స్పష్టం చేసింది.పౌరుల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం నుంచి గానీ, మరోవిధంగా గానీ ప్రమాదం వాటిల్లిందని హైకోర్టు భావించినప్పుడు జోక్యం చేసుకునే అధికారాన్ని అధికరణం 226 కల్పిస్తున్నది. దాన్ని ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు రక్షణ లేదనే అభిప్రాయం న్యాయ స్థానానికి కలిగిందని భావించవచ్చు. ఇటువంటి కేసులోనే గతంలో కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ రాజీనామా చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎమర్జెన్సీ సమయంలో కేరళ పోలీసులు రాజన్ అనే యువకుడిని నక్సలైట్ సంబంధాలు న్నాయనే అనుమానంతో మఫ్టీలో వెళ్లి అపహరించారు. అరెస్ట్ చూపలేదు. చిత్రహింసలు పెట్టి అతడిని చంపేశారు. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే రాజన్ తండ్రి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.హోంమంత్రి ఆదేశాలతోనే తన కుమారుణ్ణి పోలీసులు అపహరించారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో కరుణాకరన్ హోంమంత్రిగా ఉన్నారు. రాజన్ను తాము అపహరించలేదని కోర్టులో పోలీసులు తప్పుడు అఫిడవిట్ వేశారు. అప్పటికే రాజన్ను చంపేసిన ఆధారాలు జన సామాన్యంలో ప్రచారంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యమంత్రి పీఠమెక్కిన కరుణాకరన్ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్లైన్ విధించి ఫలానా రోజులోగా రాజన్ను హాజరు పరచాలని ఆదేశించింది. చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేక పోవడం, ప్రజాగ్రహం వెల్లువెత్తడం, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో గద్దెనెక్కి నెల తిరక్కుండానే కరుణాకరన్ రాజీనామా చేయవలసి వచ్చింది. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పోలీసు అధికారుల ప్రాసిక్యూషన్కు కూడా హైకోర్టు ఆదేశించింది. అదే తరహాలో ఇప్పుడు సవీందర్రెడ్డి కేసులో కూడా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం పోలీ సులు చేశారని స్పష్టమైంది.ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పుతున్నది ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్టులపైనే కాదు, రాజకీయ ప్రత్యర్థులపైన మాత్రమే కాదు – ‘సాక్షి’ వంటి మీడియా సంస్థపై కూడా! దేశంలో మిలియన్ కాపీల సర్క్యులేషన్ దాటిన అగ్రశ్రేణి దినపత్రికల సంఖ్య అన్ని భాషల్లో కలిపి డజన్కు మించి లేదు. వాటిలో ‘సాక్షి’ ఒకటి. ఈ లెక్క ‘సాక్షి’ చెప్పేది కాదు. దిన పత్రికల సర్క్యులేషన్ల లెక్కలు తీసే ‘ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్’ (ఏబీసీ) అనే ప్రామాణిక సంస్థ చెప్పే లెక్క. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థ కార్యాలయాల్లో అర్ధరాత్రి చొరబడి అల్లరి చేయడం, ఎడిటర్ ఇంట్లో దూరి సోదాలు చేయడం, ఎడిటర్తో సహా సీనియర్ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూడటాన్ని ఎలా అర్థం చేసు కోవాలి? ఈ వైఖరిని ఫాసిజమనాలా? నాజీయిజమనాలా? అధికారం తలకెక్కడమనుకోవాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు.ఇక పవిత్రంగా ఉండవలసిన శాసనసభల నిర్వహణ తీరు ఎంత శోభాయమానంగా ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. మార్గ దర్శకంగా ఉండవలసిన రూల్ బుక్ అమలులో ఉన్నదా అటక మీద ఉన్నదా అర్థం కాని పరిస్థితి. అన్ రూలీ కామెంట్స్ విశృంఖలతకు అడ్డు చెప్పే పరిస్థితే లేదు. గురువారం నాటి సభలో చంద్రబాబునాయుడు బావమరిదీ ప్లస్ వియ్యంకుడు, సినీ నటుడైన బాలకృష్ణ ఆంగిక వాచికాభినయాలు చూసిన వారికి దిగ్భ్రాంతి కలిగించాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైన జగన్ను ఉద్దేశించి తూలిన మాట కేవలం అన్ పార్లమెంటరీ మాత్రమే కాదు. పత్రికల్లో రాయడానికి కూడా అభ్యంతరకరమైనది. ఆయనట్లా య«థేచ్ఛగా మాట తూలుతుంటే పాలకపక్ష సభ్యులు హర్షధ్వానాలు చేయడం, నవ్వడం, ముఖ్యమంత్రితో సహా పెద్దలెవరూ వారించకపోవడం, సభా ధ్యక్ష స్థానంలో ఉన్నవారు కూడా మిన్నకుండటం చూసిన తర్వాత మెదళ్లను తొలిచే మొదటి ప్రశ్న: రూల్ బుక్ ఎక్కడ?సభలో లేని ప్రతిపక్ష నేతనుద్దేశించి అవమానకరమైన రీతిలో కామెంట్లు చేస్తూ, వాటికి హర్షామోదాలు వ్యక్తం చేస్తున్న కూటమి సభ్యులు మరోపక్క ప్రతిపక్ష నేత హోదా లేకుండానే జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న గూడుపుఠాణీ అర్థం కావడం లేదా? ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా రన్నింగ్ కామెంటరీతో అవమానించాలనే ఎత్తుగడ కాదా? లేకుంటే బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్ను రికార్డుల నుంచి తొలగించా లని సభ్యులెవరూ ఎందుకు కోరలేదు? స్వయంగా సభాధ్యక్షులే అప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేదు? అలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు గతంలో కోకొల్లలుగా లేవా?బాలకృష్ణ మాట్లాడటానికి ముందు బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసమే పనిచేసే నాయకులు కొందరున్నారని అందరికీ తెలిసిందే! వారిలో కామినేని శ్రీనివాస్ ముఖ్యులు. ‘సినిమా పరిశ్రమ నుంచి మాట్లాడటానికి వచ్చినవాళ్లను కలవకుండా జగన్ అవమానించారు, చిరంజీవి గట్టిగా అడగడంతో వచ్చి కలిశార’ని శ్రీనివాస్ ఆరోపించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ జగన్పై అభ్యంతరకర పదప్రయోగం చేశారు. పనిలో పనిగా చిరంజీవిపై తనకున్న వ్యతిరేకతను కూడా బయటపెట్టుకున్నారు. ‘ఎవడూ’ గట్టిగా నిలదీయలేదంటూ ఆయన్ను కూడా అవమానించే విధంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన చిరంజీవి... జగన్ తమను సాదరంగా ఆహ్వానించారనీ, ఆయనతో తాము జరిపిన చర్చల ఫలితంగానే అప్పట్లో తన సినిమా, బాలకృష్ణ సినిమాతోపాటు పరిశ్రమకు మేలు జరిగిందనీ ఒక లేఖ ద్వారా తెలియజెప్పారు. ఈ వివరణ తర్వాత విధిలేని పరిస్థితుల్లో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్య లను రికార్డుల నుంచి తొలగించాలని శనివారం నాడు కోరవలసి వచ్చింది. కానీ, జగన్ను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ అలా కోరలేదు. సభా నాయకుడు గానీ, సభాధ్యక్షులు గానీ అటువంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్ను అవమానించాలనే ఎత్తుగడతో పాలక కూటమి పని చేస్తున్నదనడానికి ఇవి నిదర్శనాలే కదా!ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే చిరంజీవిపైన బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను జనసేన నేతలు ఎవ్వరూ ఖండించకపోవడం! పవన్ కల్యాణ్ జ్వరంతో విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. మిగిలిన వారెందుకు మాట్లాడలేదని జనంలో చర్చ మొదలైంది. ఆ సమయంలో సభలో ఉన్న జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఏమీ స్పందించలేకపోయారు. పైగా ఎఫ్డీసీ ఆహ్వాన పత్రికలో తన పేరును తొమ్మిదో పేరుగా ‘ఎవడు’ వేశాడని దుర్గేశ్ పట్ల కూడా బాలకృష్ణ దురుసుగానే మాట్లాడారు. సినిమా రంగంలో స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి ప్రస్థానంపై తొలినుంచీ బాలకృష్ణకు ఎంతో కొంత అసహనం ఉన్నదనే విషయం దాచేస్తే దాగేది కాదు.మహానటుడిగా విశ్వవిఖ్యాతి గాంచిన తండ్రిగారు ముఖ్య మంత్రి అయిన తర్వాతనే సోలో హీరోగా బాలకృష్ణ సినిమా కెరీర్ ప్రారంభమైంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా అవి సోలో హీరో పాత్రలు కావు. దాదాపు బాలకృష్ణ నటజీవితంతో సమాంతరంగానే చిరంజీవి ప్రయాణం సాగింది. సినిమా పరిశ్రమలో ఎవరి అండాదండా లేకుండా, కేవలం స్వయం ప్రతిభతో దూసుకెళ్లి ఎనభయ్యో దశకం చివరి నాటికే అగ్రహీరోగా చిరంజీవి ఎదిగిపోయారు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో ప్రవేశించే వరకు దాదాపు పదిహేను పదహారేళ్ల పాటు చిరంజీవికి గట్టి పోటీగా బాలకృష్ణే కాదు, మరే హీరో కూడా నిలవలేకపోయారు. కారణం ఏదైనాగానీ, చిరంజీవి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లో వెటకారంగానో, అసహనంగానో, అతిశయంతోనో బాలకృష్ణ స్పందించడం జనం గమనించారు. ‘రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఏమయ్యాడు?’ ‘మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు’ అంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘లేపాక్షి ఉత్సవానికి చిరంజీవిని పిలుస్తున్నారా’ అని ఎవరో అడిగితే ‘ఎవర్నో తెచ్చి నెత్తిన పెట్టుకుంటామా?’ అని రుసరుస లాడారు. పవన్ కల్యాణ్ అభిమానుల్ని ‘అలగా జనం’గా సంబోధించడం కూడా వివాదాస్పదమైంది.అసెంబ్లీలో జగన్ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన అభ్యంతర కరమైన వ్యాఖ్యల తర్వాత బాలకృష్ణ ‘సైకో సర్టిఫికెట్’ ఉదంతం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ జరి పిన కాల్పుల్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఆస్థాన జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఆ కేసు సందర్భంగా తనకు మానసిక పరిస్థితి బాగాలేదనే ఒక ‘సైకియాట్రీ’ సర్టిఫికెట్ను కోర్టుకు సమర్పించారు. ఈ సర్టిఫికెట్ను ఏర్పాటు చేసిన డాక్టర్ కాకర్ల సుబ్బా రావును ఆ తర్వాత కాలంలో ఏబీఎన్ ఛానల్ అధిపతి రాధా కృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో బాలకృష్ణకు మీరు సాయం చేశారట గదా?’ అని రాధాకృష్ణ ప్రశ్నించారు. ‘అవును సాయం చేశాను. చాలా పెద్ద సాయం. అతడిని (బాలకృష్ణను) ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తే ‘సైకియాట్రీ’ ఆలోచన వచ్చింది. ఇద్దరు నిపుణులతో చర్చించి, ఆ సమయంలో అలా చేయకపోయి ఉంటే తనను తాను కాల్చుకునే పరిస్థితి ఉండేది అనే విధంగా సర్టిఫికెట్ ఇచ్చాం. లేకపోతే ఈ కేసులలో బయట పడేవాడు కాద’ని డాక్టర్ కాకర్ల స్పష్టం చేశారు.ఇప్పుడు ఇంకో సమస్య ముందుకు వస్తున్నది. బాలకృష్ణకు సైకో సర్టిఫికెట్ను వైద్యులు ఇచ్చిన మాట నిజం. దాన్ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పరిగణనలోకి తీసుకొని వెంటనే బెయిల్ మంజూరు చేసిన సంగతి నిజం. భారత రాజ్యాంగం 326వ అధికరణం ప్రకారం మతిస్థిమితం లేని వాళ్లకు ఓటు హక్కును నిరాకరించవచ్చు. ఓటు వేసే హక్కే లేనప్పుడు పోటీచేసే అవకాశం ఎలాగూ ఉండదు. ఆర్టికల్ 102 (1బి) ప్రకారం మతిస్థిమితం లేని ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించవచ్చు. అయితే ఇందుకు మెడికల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. ఆమేరకు న్యాయస్థానం నిర్ధారించాలి. బాలకృష్ణ కేసులో మెడికల్ సర్టిఫికెట్ ఉన్నది. దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఉదంతం కూడా ఉన్నది. ఆ తర్వాత కాలంలో చికిత్స అనంతరం ఆయన మానసిక స్థితి మెరుగైందని మళ్లీ ఓ మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారా? అది న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్లిందా అనే విషయాలపై సమాచారం లేదు. ఒకవేళ అటువంటిదేమీ జరక్కపోయుంటే ఎవరైనా పిటిషన్ వేస్తే బాలకృష్ణ శాసనసభ్యత్వం రద్దవుతుందా అనే విధంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఏదో అవసరార్థం సర్టిఫికెట్లు తప్ప బాలకృష్ణకు మతిస్థిమితం లేదని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే ఆ ప్రచారంలో ఆయనకూ, ఆయన పార్టీ అధినేతలకూ ఓ సౌలభ్యం ఉన్నది. ఆ ముసుగులో ఎవరినైనా ఏమైనా అనేయవచ్చు. అధినేతలు అనలేని మాటలు బాలయ్య నోట అనిపించవచ్చు. ఇప్పుడు జరిగింది కూడా అదే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు. -
జగన్, చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్ నారాయణ మూర్తి
-
సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి
రీసెంట్గా అసెంబ్లీ సాక్షిగా నటుడు బాలకృష్ణ.. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై వెంటనే చిరంజీవి కూడా ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిరంజీవి vs బాలకృష్ణ అన్నట్లు సాగుతోంది. ఇప్పుడు ఈ వివాదంపై ప్రముఖ నటుడు దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి స్పందించారు. గత ప్రభుత్వం.. సినిమా వాళ్లని అస్సలు అవమానించలేదని కుండబద్ధలు కొట్టారు.'ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్పై చిరంజీవి స్పందన 100 శాతం నిజం. జగన్ని కలిసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదు. చిరంజీవి ఆధ్వర్యంలో మేము జగన్మోహన్రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు. గత గవర్నమెంట్ చిరంజీవిగారిని అవమానించారనే ప్రచారం తప్పు. గత గవర్నమెంటు మా సినిమా వాళ్లని అవమానించలేదు. చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు అది ఆయన సంస్కారం. అందరూ చిరంజీవి నివాసంలో కలిశాం. అనంతరం పరిశ్రమ పెద్దగా చిరంజీవి.. జగన్తో మాట్లాడారు''చిరంజీవి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయింది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమే. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు. ఆ రోజు మమ్మల్ని జగన్ ఎంతో గౌరవించారు' అని ఆర్.నారాయణ మూర్తి క్లారిటీ ఇచ్చారు.‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’ -
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
-
జగన్ 18 లక్షల సైన్యం.. ఈసారి అధికారంలోకి YSRCP
-
తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరిన కామినేని
-
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: సవీంద్ర(Savindra) కేసును సీబీఐ(CBI)కి అప్పగించటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్తో ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనమన్న వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదన్నారు.‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2025ఇదీ చదవండి: చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! -
నేను చెప్పినవన్నీ అబద్ధాలే.. నిజం ఒప్పుకున్నా కామినేని


